challenge
-
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు నాలుగు సవాళ్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఢిల్లీలోని షాలిమార్ బాగ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొనబోతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత కొత్త ముఖ్యమంత్రిపైనే ఉంటుంది. ప్రస్తుతం రేఖ గుప్తా ముందున్న నాలుగు పెద్ద సవాళ్లు ఇవే..1. మహిళల ఖాతాల్లోకి రూ. 2500 బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలలో భాగంగా మార్చి 8 నాటికి అర్హత కలిగిన మహిళా లబ్ధిదారుల ఖాతాలకు తమ ప్రభుత్వం రూ. 2,500 బదిలీ చేస్తుందని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన ఎన్నికల ప్రచార ప్రసంగాలలో ఈ హామీనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8న మహిళల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని పేర్కొన్నారు. రేఖ గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా నిలిచిందని నిపుణులు అంటున్నారు.2. యమునా నది శుద్ధిబీజేపీ గతంలో యమునా నదిని(Yamuna River) శుభ్రపరచడంపై హామీనిచ్చింది. యమునలో కాలుష్యం అధిక స్థాయిలో ఉండటం ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా నిలిచింది. యుమున పరిశుభత విషయంలో కాంగ్రెస్, ఆప్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది తాము చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. పలు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, అనధికార కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కారణంగా యమునా నదిలో కాలుష్యం పేరుకుపోతోంది. దీని పరిశుభ్రత కొత్త ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలిచింది.3. పథకాలకు నిధులుఆప్ ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఇతర సబ్సిడీలు కొనసాగుతాయని బీజేపీ గతంలో హామీనిచ్చింది. కొత్త ప్రభుత్వం రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టీఎస్), ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులను సమకూర్చడమనేది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి భారం కానున్నదనే వాదన వినిపిస్తోంది.4. రోడ్ల మరమ్మతు- చెత్త కుప్పల నుంచి విముక్తిగత ఆప్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం- లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగా నగరంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో రోడ్డు మరమ్మతుల నుండి చెత్త సేకరణ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సివుంటుంది. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టకముందే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి.ఇది కూడా చదవండి: Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి? -
తడి బట్టలతో గుడికి రా రేవంత్.. హరీష్ రావు సవాల్
సాక్షి, సిద్ధిపేట: మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్ అబద్దాలాడుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో మాట్లాడుతూ.. ‘‘దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రేవంత్ రావాలి.. తడి బట్టలతో నువ్వు, నేను గుడిలోకి వెళ్దాం’’ అంటూ హరీష్రావు సవాల్ విసిరారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కొడంగల్లో ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేయించారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయలేదా? అంటూ హరీష్రావు ప్రశ్నించారు.‘‘11 విడతల్లో రూ.73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 13 లక్షల మందికి లక్ష రూపాయల చొప్పున తిప్పలు పడకుండ కళ్యాణ లక్ష్మి ఇచ్చినం. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది...ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండు. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ను కూడా మోసం చేసిండు’’ అంటూ హరీష్రావు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్ -
ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ అడిగింది
-
వైజాగ్ -కాకినాడ ఛాలెంజ్ : 52 ఏళ్ల తెలుగు మహిళ సాహసం
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల అరుదైన ఘనతను సాధించారు. విశాఖపట్నం (వైజాగ్) నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది చరిత్రకెక్కారు. ఐదు రోజుల పాటు సాగిన శ్యామల సాహస యాత్ర సాగింది. డిసెంబర్ 28న ఆర్.కె. వైజాగ్లోని బీచ్ నుంచి మొదలై కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్లో జనవరి 1న ముగిసింది. ఇలాంటి విజయాలను అలవోకంగా అందుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు. వైజాగ్-కాకినాడ ఛాలెంజ్ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న శ్యామలకు సముద్రాలను ఈదడం హాబీ. తాజాగా బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈదారు. వారం రోజుల తరువాత సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్కు చేరుకోవడంతో ఆమె సాహస యాత్ర ముగిసింది. ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించేందుకు ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్లు, స్కూబా డైవర్లు , కయాకర్లతో సహా 12 మంది సభ్యుల, రెండు పెద్ద పడవలు ఒక చిన్న నౌక ఆమె వెంట సాగాయి.52-Year-Old woman Goli Shyamala Swims 150 km from #Visakhapatnam to #Kakinada, Inspiring GenerationsGoli #Shyamala, a 52-year-old #WomanSwimmer from Samalkot in Kakinada district, #AndhraPradesh successfully completed an adventurous swim of 150 kilometers in the sea from… pic.twitter.com/DenfvFaHgr— Surya Reddy (@jsuryareddy) January 4, 2025 అంతకుముందు- తమిళనాడు- శ్రీలంక నార్త్ ప్రావిన్స్ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించి ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా శ్యామలనిలిచారు. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఇలాంటి సాహసాన్ని పూర్తి చేశారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్లో 19 గంటల్లో అధిగమించారు. లక్షద్వీప్లో కీల్టన్ ఐలండ్- కడ్మట్ ఐలండ్, హుగ్లీ, గంగ, భాగీరథీ నదుల్లో రికార్డు సమయాల్లో ఈది రికార్డు సృష్టించిన చరిత్ర శ్యామలది. శ్యామల సృజనాత్మక దర్శకురాలు, రచయిత కూడా. అయితే తన యానిమేషన్ స్టూడియో సక్సెస్కాకపోవడంతో ఆమె స్విమ్మింగ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వేసవి ఈత శిబిరాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఆసక్తి పెరిగింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం, ప్రజలను ప్రోత్సహించడం ఆమె లక్ష్యంగా మారింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్లో విజయాలుపాక్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదుతూ, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచింది.కాటాలినా ఛానల్: కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు 19 గంటల్లో గడ్డకట్టే 12°C ఉష్ణోగ్రతల మద్య స్విమ్మింగ్ చేశారు.లక్షద్వీప్ : లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపానికి 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.ఆమె స్విమ్మింగ్ చేసిన నదులు•కృష్ణా నది: 1.5 కి.మీ•హూగ్లీ నది: 14 కిలోమీటర్లు•గంగా నది: 13 కి.మీ•భాగీరథి నది: 81 కి.మీ -
కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు
-
మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం
-
రాజమౌళికి ఛాలెంజ్ విసిరే సినిమాతో రాబోతున్న డైరెక్టర్ అట్లీ..
-
మోదీకిదే నా సవాల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత 75 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ, ఏ ప్రభుత్వం, ఏ సీఎం కూడా తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు ఇవ్వలేదని.. దీనిపై తాను సూటిగా ప్రధాని మోదీకే సవాల్ విసురుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపాలని... ఢిల్లీ నడిబజార్లో క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తానని సవాల్ చేశారు. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా, కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదని సీఎం ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ’’కేసీఆర్, బీఆర్ఎస్ వారు మాట్లాడిన ప్రెస్మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈటల రాజేందర్, కిషన్రెడ్డి అవే నకలు కొడుతున్నారు. కిషన్రెడ్డి, ఈటల మారాలి. ఆ దొంగల సోపతి పడితే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు. అటే పోతారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. అడ్డగోలుగా మాట్లాడవద్దు. ఏది పడితే, ఎలా పడితే అలా మాట్లాడితే చెల్లదు. మీరు కేసీఆర్లా తయారుకాకండి. మోదీ పాలనలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇస్తే లెక్క చూపండి. మోదీకి సవాల్ చేస్తున్నా.. ఢిల్లీ నడిబజార్లో మీకు క్షమాపణ చెప్పి తలవంచుకొని వస్తా. లేకపోతే నా లెక్క అప్పజెబుతా. మీ నాయకులు, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించండి. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. అంతేకాదు మేం తొలి ఏడాదే 25.50 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశాం. రూ.21 వేల కోట్లు వారి ఖాతాల్లో వేశాం. మోదీ, కేసీఆర్ మీరు ఎప్పుడైనా చేశారా? సవాల్ విసురుతున్నా. మోదీ అధికారంలో ఉన్నప్పుడైనా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా ఒక్క ఏడాదిలోనే ఇలా రుణమాఫీ చేస్తే.. నేను మా మంత్రులతో సహా వచ్చి క్షమాపణ చెబుతాం. కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోండి.. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం తెలంగాణ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదా? కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అధికారంలో ఉంటే చలాయిస్తాం, ఓడిపోతే ఫామ్హౌస్లో పడుకుంటామంటే ఎలా? దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? మేం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండలేదా? రెండుసార్లు మీరు గెలిచారు. మేం ఓడిపోయాం.. అయినా జానారెడ్డిలాంటి పెద్దలు ప్రజల్లో ఉండి, అసెంబ్లీలో పాలకపక్షానికి సూచనలు, సలహాలు ఇస్తూ, తప్పిదాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.మా ఎమ్మెల్యేలను గుంజుకున్నా, సీఎల్పీ హోదాను తొలగించినా మొక్కవోని ధైర్యంలో భట్టి విక్రమార్క కొట్లాడారు. ఇప్పుడు సంవత్సరం పూర్తయినా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర పోషించారా? అసెంబ్లీకి వచ్చారా? ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పదేళ్లు సీఎంగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్కరోజైనా వినియోగించారా? ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంచడం పట్ల తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? గాలి బ్యాచ్ని ఊరి మీదకు వదిలారు.. ప్రభుత్వ నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజలపక్షాన మాట్లాడాల్సింది పోయి ఒక గాలి బ్యాచ్ను తయారు చేసి ఊరి మీదికి వదిలారు. వారేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎప్పుడైనా విన్నారా? ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వొద్దన్నప్పుడు, గ్రూప్–4, గ్రూప్–1 పరీక్షలు పెట్టవద్దన్నప్పుడు, డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళుతుంది? కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉంటే.. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పుతో మాకు అప్పగించారు. అప్పులకు ప్రతి నెలా రూ.6,500 కోట్ల చొప్పున ఏడాదికి రూ.65 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోంది. నాడు ‘ఔటర్’ రోడ్డు.. ఇప్పుడు ‘రీజనల్’ రోడ్డు నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు వేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రీజనల్ రింగు రోడ్డు తీసుకువచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. 50వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా కొత్త నగరాన్ని నిర్మించుకుని, పెట్టుబడులు తెచ్చి.. నిరుద్యోగులకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మాదే. మూసీ కాలుష్యంతో మనుషులు జీవించలేని పరిస్థితి నల్లగొండ ప్రాంతానికి రాబోతోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. అందుకే మూసీలో గోదావరి జలాలను పారించేందుకు, పారిశ్రామిక కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రక్షాళన చేపట్టాం. అడ్డం వచ్చే వారి సంగతి ప్రజలే చూసుకోవాలి..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్సార్ కాదా? ‘‘వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ రాజశేఖర్రెడ్డి చెప్పినప్పుడు.. కొందరు కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్నారు.ఆ మాటలు తప్పు అని నిరూపించి రైతులకు ఉచిత కరెంటును ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ, వారి రూ.1,200 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేస్తూ, వేల మంది రైతులపై విద్యుత్ చౌర్యం కేసులను ఎత్తివేస్తూ.. ఒక్క సంతకంతో హామీలు అమలు చేశారు. మేం ఆయనను ఆదర్శంగా తీసుకుని వ్యవసాయానికి 24 గంటల ఇస్తున్నాం. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. వైఎస్సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీని అమల్లోకి తెస్తే... కేసీఆర్ వచ్చి నిరీ్వర్యం చేశారు. మేం వచ్చాక ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అన్నారు. మేం వరి సాగు చేయాలని చెప్పడమేకాదు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.’’ తెలంగాణను దేశానికే రోల్మోడల్గా చేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నల్లగొండ: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్గా నిలబెడతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో వారు మాట్లాడారు. తమ ప్రభుత్వం ఓవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తూనే, మరోవైపు అప్పులు తీర్చుకుంటూ ముందుకుసాగుతోందని భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను పెట్టిందే తప్ప నిర్వహణను పట్టించుకోలేదని.. తాము యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకులాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మిస్తున్నామని చెప్పారు. గత సర్కారు యాదాద్రి పవర్ ప్లాంట్ మొదలుపెట్టిందే తప్ప పర్యావరణ అనుమతులు తీసుకోలేకపోయిందని.. తాము అనుమతులు తెప్పించి, నిధులిచ్చి పనులు వేగవంతం చేశామని తెలిపారు. నల్లగొండ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం: ఉత్తమ్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తే బీఆర్ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. కార్యకర్తల కష్టం, త్యాగంతో తాము ఈ స్థాయిలో ఉన్నామని.. వారికి ఏ కష్టం వచి్చనా అండగా ఉంటామని చెప్పారు. ఎస్ఎల్బీసీ.. ఇక ఆర్ఆర్ ప్రాజెక్టు: కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఇక నుంచి ఆర్ఆర్ (రాజశేఖర్రెడ్డి, రేవంత్రెడ్డి) ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. నాడు వైఎస్సార్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్ ఆ ప్రాజెక్టు పూర్తికి నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేర కూలేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. నల్లగొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినందుకే జిల్లా ప్రజలు బీఆర్ఎస్ను పాతాళానికి తొక్కారని వ్యాఖ్యానించారు. -
కేసీఆర్, మోదీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్
-
కేటీఆర్ కు నీతి, నిజాయితీ ఉంటే చర్చకు రావాలి: మంత్రి సీతక్క
-
పీసీసీ చీఫ్ మహేష్గౌడ్కు ప్రశాంత్రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
సాక్షి,నిజామాబాద్జిల్లా:రేవంత్రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోసే పనిలో ఉన్నాడని మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం(నవంబర్19) నిజామాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘త్వరలో కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించటం ఖాయం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.రుణమాఫీ,రైతు బంధు,వడ్ల బోనస్ మీరు ఇచ్చారని ప్రజలు చెప్తే నేను రాజీనామా చేస్తాను. ఇవ్వలేదు అని ప్రజలు చెప్తే నువ్వు నీ పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? పీసీసీ పదవి రాగానే మహేష్గౌడ్ నిషాలో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని అవాకులు చవాకులు పేలుతున్నారు.11నెలల కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ సంగతి వదిలేసి మీ పార్టీ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలపై దృష్టి పెట్టండి.బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేతలు రిబ్బన్లు కట్ చేస్తున్నారు. ఏం ముఖం పెట్టుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తారు.సామాన్య ప్రజలతో తిట్లు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సైతం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.మహారాష్ట్రలో తెలంగాణ పరువు తీస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.ఇపుడు అదే వరంగల్ లో విజయోత్సవాలా’అని ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. -
హరీశ్రావు పక్కచూపులు చూస్తున్నారు: పీసీసీ చీఫ్ మహేష్గౌడ్
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ సవాల్ విసిరారు. గత పదేళ్లో ఎంత అభివృద్ధి చేశారో హరీశ్రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామన్నారు. ఈ మేరకు మహేష్గౌడ్ సోమవారం(నవంబర్ 18) సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్నారు. హరీశ్రావు వేరే దారి వెతుక్కుంటున్నారన్నారు. ఆయన ఇప్పటికే పక్క చూపులు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లో మిగిలేది కేసీఆర్,కేటీఆర్,కవితలేనని మహేష్గౌడ్ ఎద్దేవా చేశారు.మహేష్కుమార్గౌడ్ ఇంకా ఏమన్నారంటే...కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదుసీఎం రేవంత్ని వ్యతిరేకించినా అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదుకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు...ఆ విషయం తెలుసుమీకు ఆ హక్కుంది...మేము మీకు అండగా ఉంటాంజనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాంస్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలిఅధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయిబీజేపీ,బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయికార్యకర్త కూడా సీమని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందికార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందేమరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలికేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందిబంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందికాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయికాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదుహరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండిమేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాంవచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదుహరీశ్రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడుచివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరు -
క్విక్ కామర్స్తో రిటైలర్లకు సవాళ్లు
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ నమూనా స్థానిక రిటైలర్లకు సవాళ్లు విసురుతోందని, రాజకీయ అంశంగానూ మారొచ్చని వెటరన్ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. భారత్ను ప్రపంచంలోనే వినూత్నమైన దేశంగా పేర్కొంటూ.. మరెక్కడా క్విక్ కామర్స్ నమూనా అంత సత్ఫలితాలు సాధించలేదని, ఇక్కడ మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నట్టు చెప్పారు.‘‘ఇది సానుకూల సంకేతమే. క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలకు ఫలితాలు కనిపిస్తున్నాయి’’ అని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అదే సమయంలో యాపిల్, మెటా, యూనిలీవర్ వంటి బ్రాండ్లను భారత్ సృష్టించాల్సి ఉందన్నారు. అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా ఈ విధమైన ఆవిష్కరణల బలం కనిపిస్తుందంటూ.. భారత వ్యాపార సంస్థలు ఉత్పతాదకత, సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు. దేశీయ సంస్థలకు, దేశీయ మార్కెట్ నుంచే రక్షణ కల్పించడం అన్నది దీర్ఘకాల పోటీతత్వం కోణంలో ప్రమాదకరమన్నారు.దేశీయ వ్యాపారాలను కాపాడుకోవడం కంటే అవి స్వేచ్ఛగా పోటీపడేలా చూడాలన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత మార్కెట్లలో 900 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారని, ట్రంప్ పాలనలో వచ్చే మార్పులతో లేదా ఏదైనా అంతర్జాతీయ పరిణామంతో ఇందులో 5–10 శాతం మేర వెనక్కి మళ్లినా అందుకు సన్నద్ధమై ఉండాలని సూచించారు. -
నీ తోబుట్టువులకు పది పైసలు ఇచ్చావా బాబు.. నీకు దమ్ముంటే..
-
సీబీఐ విచారణ కోరే దమ్ముందా: కాకాణి సవాల్
సాక్షి,నెల్లూరు:సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్5) ఈ విషయమై కాకాణి మీడియాతో మాట్లాడారు.‘తాను చెప్పిన పనులు అధికారులు చెయ్యడం లేదనే ఫ్రస్టేషన్లో సోమిరెడ్డి ఉన్నారు.తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు.సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.కేసులు,అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచిన తర్వాత మంచంలో పడుకుని ఉన్నాలాక్కొస్తాం. నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలలో ఒక్క దానినైనా రుజువు చెయ్యగలవా?నీకు దమ్ము దైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్టు నిరూపించు. సూరాయి పాలేం ఇసుక రీచ్లో జరుగుతున్న తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తున్నాం. నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకి అదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గాను. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు వద్దకు సోమిరెడ్డి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.సోమిరెడ్డి అవినీతి మీద విచారణ వేయాలి.ఆయన చేసిన అవినీతి బయటడుతుంది’అని కాకాణి అన్నారు. ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ -
చంద్రబాబుకు సజ్జల ఛాలెంజ్
-
చంద్రబాబుకి కాటసాని సవాల్
-
విచారణకు మేము సిద్ధం.. నువ్వు సిద్ధమా?.. చంద్రబాబుకు విశ్వేశ్వర రెడ్డి సవాల్
-
కేటీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరారు.కేటీఆర్ చెప్పినట్లు అమృత్ స్కీమ్ కింద టెండర్లు అయినట్లు నిరూపిస్తే తాను మంత్రిగా రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఈ విషయమై శనివారం(సెప్టెంబర్21) పొంగులేటి మీడియాతో మాట్లాడారు.ఆరోపణలను నిరూపించకపోతే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు.రూ.3వేల6వందల కోట్లు కాస్తా రూ.8888 కోట్లు ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అమృత్ టెండర్లను గత ప్రభుత్వమే వాళ్లు దిగిపోయే సమయంలో 3 ప్యాకేజీల కింద ఇచ్చారని చెప్పారు.ఇదీ చదవండి.. సీఎం రేవంత్ ప్రమేయంతోనే అమృత్ టెండర్లలో అవినీతి: కేటీఆర్ -
కౌశిక్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన అరికెపూడి గాంధీ
-
కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
-
రుణమాఫీపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్కు హరీశ్రావు సవాల్
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణలో ఏ ఊరికైనా వెళ్లి రుణమాఫీ జరిగిందా లేదా అనే చర్చ పెడదాం. సంపూర్ణ రుణమాఫీ అయిందని తేలితే నేను దేనికైనా సిద్ధం. నా సవాల్కు సీఎం రేవంత్రెడ్డి సిద్ధమేనా’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు సవాల్ విసిరారు. తెలంగాణభవన్లో శనివారం(ఆగస్టు17) జరిగిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. ‘రూ.31 వేల కోట్లని చెప్పి రూ.17 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా ఎగనామం పెట్టారు. రూ.14 వేల కోట్లు కోత పెట్టారు. రైతులను నిట్టనిలువునా ముంచారు. పంచపాండవుల కథలా కాంగ్రెస్ రుణమాఫీ ఉంది’అని హరీశ్రావు ఫైర్ అయ్యారు. హరీశ్రావు ప్రెస్మీట్ ముఖ్యాంశాలు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం.. కుల్లం కుల్లా రైతులను అడుగుదాంసిద్దిపేట మండలం తడకపల్లిలో రుణమాఫీకి అర్హులు 720 మంది రైతులు కాగా.. రుణమాఫీ అయ్యిందికేవలం 350 మంది రైతులకేరుణమాఫీ పై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు లక్షా 16 వేల 460 మంది రైతులు ఫిర్యాదు చేశారుమాట తప్పింది రేవంత్రెడ్డినాడు కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారురేవంత్ నాడు మాట నిలబెట్టుకున్నారా ? రైతుల నెత్తిన టోపీ పెడుతున్నారు రేవంత్ రెడ్డిఅధికారం దక్కించుకోవడానికి మోసం.. వచ్చిన అధికారం కాపాడుకోవడానికి రేవంత్ మోసం చేస్తున్నారు ఆగష్టు 20వ తేది వచ్చింది ఇప్పటి వరకు రైతు భరోసా పై నిర్ణయం తీసుకోలేదు రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టి రుణ మాఫీ సగం చేశారు రుణ మాఫీ పై శ్వేత పత్రం విడుదల చేయాలినీటి పారుదల, అప్పుల మీద శ్వేత పత్రాలు పెట్టిన రేవంత్రెడ్డి.. రుణ మాఫీ పై ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయడం లేదుసాక్షి పత్రికలో వచ్చిన రుణం తీరలే అన్న వార్త కథనాన్ని చూపిన హరీష్ రావురేవంత్ రెడ్డి పరిపాలన లో ప్లాప్ తొండి చేయడంలో తోపుబూతులు తిట్టడంలో టాప్ రంకెలు వేస్తే అంకెలు మారిపోవు పాలకుడిగా రేవంత్ రెడ్డి పాపాలు మూట కట్టుకున్నారు దేవుళ్ళ మీద ఒట్ట్లు పెట్టారు.. తెలంగాణ ప్రజలకు శాపం కావొద్దని కోరుకుంటున్న అన్ని దేవాలయాల దగ్గరకు వెళ్ళి తెలంగాణ ప్రజలకు పాపం తగలవద్దని కోరుకుంటున్న దేవుళ్ళను పాపాల రేవంత్ రెడ్డిని క్షమించమని కోరుకుంటా ముఖ్యమంత్రి నన్ను తాటిచెట్టులా పెరిగావని నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు రుణ మాఫీ పై రేవంత్ ది ప్లాప్ షో భౌతిక దాడులకు పురి గొల్పుతున్నారు రేవంత్ గాడ్ ఫాదర్లకే భయపడలేదు చావాలని కోరుకుంటున్న వారు.. రేపు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తారేమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు రైతుల పక్షాన పోరాటం చేస్తాం రుణ మాఫీ పై బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం త్వరలో ప్రకటన చేస్తాం -
త్యాగానికి అర్థమే స్నేహం.. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్న దోస్తులు (ఫొటోలు)
-
ఈనాడులో నా పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే.. ఎంవీవీ సత్యనారాయణ సవాల్
-
‘దానం’ దమ్ముంటే రా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియాహాల్లో కౌశిక్రెడ్డి శనివారం(ఆగస్టు3) మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయన్నారు. సభలో రూల్స్కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడారన్నారు.‘దానం నాగేందర్ నేను హైదరాబాద్లోనే ఉన్నా. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడో స్పాట్ చెప్పు రావడానికి నేను రెడీ. దానం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు.గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరువకు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చింది. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్కు టీషర్ట్, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు’అని కౌశిక్రెడ్డి దానంపై విరుచుకుపడ్డారు. -
నేను చెప్పేటప్పుడు మధ్యలో రాకు
-
కంగనా ఎన్నిక చెల్లదంటూ పిటిషన్
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీంతో పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. మండి లోక్సభ స్థానం నుంచి ఆమె ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కంగనా ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను రద్దు చేయాల్సిందేనని కిన్నౌర్కు చెందిన లాయక్ రామ్ నేగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను(రామ్ నేగి) వేసిన నామినేషన్ పత్రాన్ని అసంబద్ధంగా తిరస్కరించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను స్వీకరించిన కోర్టు.. ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని కంగనా రనౌత్కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆదేశాలు జారీ చేశారు. మండీ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లాయక్ రామ్ నేగి తాను పోటీచేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ, తన నామినేషన్ తిరస్కరణకు గురయ్యిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మండి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలు చెల్లవని, అందుకే కంగనా రనౌత్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు.లాయక్ రామ్ నేగి అటవీ శాఖ మాజీ ఉద్యోగి. నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారికి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్ను కూడా సమర్పించారు. విద్యుత్, నీరు, టెలిఫోన్ తదితర శాఖల నుంచి ఎలాంటి బకాయిలు లేవని చూపేందుకు ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒకరోజు సమయం ఇచ్చారు. అయితే నేగి ఈ సర్టిఫికెట్లను గడువులోగా సమర్పించినప్పటికీ, రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించినట్లు నేగి ఆరోపిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 ప్రకారం.. నేగి దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా తిరస్కరించినట్లు రుజువైతే, మండీ లోక్సభ ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి. మండి లోక్సభ స్థానం నుంచి రనౌత్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
నిజమే..! తాను తొమ్మిదేళ్ల సూపర్ రేసర్!!
‘రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్’ ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ స్థాయి గోకార్ట్ రేసింగ్. 7 నుంచి 15 ఏళ్ల లోపు వయసు పిల్లలు అనేక దేశాల నుంచిపాల్గొంటారు. 9 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల ‘మైక్రో మ్యాక్స్’ రేస్లో ఈసారి విజేతగా నిలిచింది మన కశ్మీర్ చిన్నారి అతికా మీర్. దాదాపు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గోకార్ట్ నడుపుతూ డ్రైవింగ్ మెళకువలు ప్రదర్శిస్తూ ఈ విజయం సాధించింది. మోటర్స్పోర్ట్స్ చరిత్రలో గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రేస్ గెలిచిన ఫస్ట్–ఫిమేల్ రేసర్గా చరిత్ర సృష్టించింది అతికా మీర్..ప్రతిష్ఠాత్మకమైన రోటాక్స్ మాక్స్ ఛాలెంజ్(ఆర్ఎంసీ) ఇంటర్నేషనల్ ట్రోపీలో మైక్రో మాక్స్ కేటగిరీ రేస్ 2లో అతికా మీర్ విజయం సాధించింది. గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(ఫ్రాన్స్)లోపాల్గొనడం మీర్కు ఇదే తొలిసారి. ముందస్తు ప్రాక్టీస్ లేక΄ోయినప్పటికీ కొత్త బ్రాండ్ కార్ట్ను వేగంగా ఎడాప్ట్ చేసుకొని తన ప్రతిభ చాటుకుంది. రోటాక్స్ మాక్స్ చాలెంజ్ ప్రతిష్ఠాత్మకమైన రేస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన కార్ట్ డ్రైవర్స్కు వేదిక. రేస్ 2లో అతికా విజయాన్ని ‘స్పీడ్ అండ్ స్ట్రాటజీ’కి సంబంధించి మాస్టర్క్లాస్ అంటున్నారు విశ్లేషకులు.‘రేస్ విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. యూరప్లో ఇది నా తొలి విజయం. ఈ విజయం కోసం చాలా శ్రమ పడ్డాను. నా టీమ్ ఎంతో సహకారాన్ని అందించింది. నా తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం నాకెంతో బలం’ అంటుంది అతికా మీర్. దుబాయ్లోని మాల్స్లో మీర్ సరదాగా ఎలక్ట్రిక్ కార్లు నడిపేది. మీర్ డ్రైవింగ్ స్కిల్స్ను చూసి తండ్రితో సహా మాల్లో ఉన్న వాళ్లు ముక్కున వేలేసుకునేవారు. మీర్ తండ్రి ఆసిఫ్ నజీర్ మీర్ మన దేశ తొలి నేషనల్ కార్టింగ్ ఛాంపియన్. డ్రైవింగ్కు సంబంధించి తండ్రి ఇచ్చిన రకరకాల టైమ్ చాలెంజ్లను బీట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేది మీర్.‘ఇక టైమ్ వృథా చేయవద్దు. మీర్ను కార్టింగ్ ప్రపంచంలోకి తీసుకురా వాల్సిందే’ అనుకున్నాడు ఆసిఫ్ నజీర్. ఇక ఆరోజు నుంచి మీర్లో కార్టింగ్పై మొదలైన ఇష్టం అంతకంతకూ పెరుగుతూ ΄ోయింది. ఫిట్నెస్ స్కిల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫార్ములా వన్లో విజయకేతనం ఎగరేసి చరిత్ర సృష్టించాలని కల కనేలా చేసింది.ఆరు సంవత్సరాల వయసులో ఎఫ్ఐఏ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ అండ్ యంగెస్ట్ ఫిమేల్ డ్రైవర్గా రికార్డ్ సృష్టించింది. మీర్ తొలి ఫుల్ సీజన్ రేసింగ్ యూఏయిలో జరిగిన మినీ ఆర్ కేటగిరితో మొదలైంది. ఈ రేస్లో వైస్–చాంపియన్ టైటిల్ గెలుచుకుంది.వచ్చే ఆగస్ట్లో మీర్ యూకేలోని వరల్డ్–ఫేమస్ ‘కార్ట్మాస్టర్స్’లో డ్రైవింగ్ చేయనుంది. ఇటలీలోని ఐరన్ డేమ్స్ యంగ్ టాలెంట్ ఈవెంట్కు కూడా ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ΄ోటీకి ఎంపికైన 11 మంది బాలికలలో ఆసియా నుంచి ఎంపికైన ఏకైక బాలిక మీర్. ‘రేస్కు ముందు నెర్వస్గా ఉంటాను. కారులో కూర్చున్న తరువాత మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఎలాగైనా ఈ రేస్లో గెలవాల్సిందే అనే పట్టుదల పెరుగుతుంది. భయాలు కొట్టుకు΄ోతాయి’ అంటుంది మెరిసే కళ్లతో అతికా మీర్. ఈ చిన్నారి భవిష్యత్లో ఎన్నెన్ని మెరుపులు మెరిపించనుందో వేచిచూద్దాం! -
రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించే ప్రజాప్రతినిధులను అనర్హులను చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్’పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి ఫిరాయింపులపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి పెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చేత రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ చేశారు.పార్టీ ఫిరాయింపులు, అవినీతి, అక్రమాలు, హామీలు అమలు చేయకుండా మోసం చేసే విషయంలో కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు తేడా లేదని విమర్శించారు. బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మోదీ సర్కార్ వచ్చాక గోకుల్ చాట్ పేలుళ్లు లేవు. లుంబిని పార్కు బాంబు బ్లాస్ట్లు లేవు. ఉగ్రవాదుల ఊచకోతలు లేవు. నక్సలైట్ల అర్ధరాత్రి హత్యలు లేవు. దేశం ప్రశాంతంగా ఉంది. దేశ భద్రత మా ప్రథమ కర్తవ్యం. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏది? ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ వాళ్లకు మాత్రం ఉద్యోగాలు దొరికాయి. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వని కాంగ్రెస్ సర్కార్.. మిగతా 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తుందో చెప్పాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనందుకే లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని కాంగ్రెస్ అధిష్టానానికి డౌట్ వచ్చింది. అందుకే కురియన్ కమిటీ వచ్చి హమీల అమలుపై కసరత్తు చేస్తున్నట్టుంది. బీజేపీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లకు నిధులివ్వరా? రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదు. నిధుల పంపిణీ బాధ్యతను అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు అప్పగించడం దుర్మార్గం. ఇది ప్రజాతీర్పును, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాష్ట్రంలో కాంగ్రెస్ మాదిరిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. రాజకీయాలకు, పారీ్టలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమాన ప్రాధాన్యత, నిధుల కేటాయింపు జరపాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. అయితే చిత్తశుద్ధితో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఇక కొందరు గోతికాడ నక్కలా సీఎంల భేటీని అడ్డుపెట్టుకుని మళ్లీ సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వొద్దు. తెలంగాణ బిడ్డగా నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. కానీ భారత ప్రభుత్వ ప్రతినిధిగా నేను రెండు రాష్ట్రాలను సమంగా చూడాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారానికి బాధ్యతతో కృషి చేస్తా. రేవంత్, ఒవైసీ కుమ్మక్కయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచి్చనా బీజేపీ గెలుపు ఖాయం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజాసమస్యలను ప్రస్తావించిన బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం నేతల దాడి హేయమైన చర్య. సీఎం రేవంత్తో ఒవైసీ కుమ్కక్కై దాడులకు పాల్పడుతున్నారు. బీజేపీ తలచుకుంటే ఎంఐఎం నేతలు బయట తిరగలేరు..’’అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.కేకే ఒక్కడితోనే ఎలా రాజీనామా చేయిస్తారు?కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ రాజ్యసభ స భ్యుడు కె.కేశవరావు ఒక్కరితోనే ఎట్లా రాజీనామా చేయిస్తారు? నిజంగా కాంగ్రెస్ ప్రజా పాలన మీద అంత నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. కాంగ్రెస్లోకి 26 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వారందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళితే.. ఆ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. బీజేపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలెవరైనా రాజీనామా చేసి చేరాల్సిందే. గతంలో హుజూరాబాద్, మును గోడు ఎమ్మెల్యేలు రాజీనామా చేశాకే బీజేపీలో చేరారు. -
‘శిరోముండనం’ ప్రకటన వెనక్కి తీసుకున్న ఆప్ నేత
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎంపికైతే తాను శిరోముండనం చేయించుకుంటానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి ఇప్పుడు తన నిర్ణయంపై యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాదు దీనివెనుకగల కారణాన్ని కూడా వివరించారు.నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ఆప్ నేత సోమనాథ్ భారతి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన రోజున ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ మూడోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపధ్యంలో పలువురు సోమనాథ్ భారతిని శిరోముండనం ఎప్పుడు చేయించుకుంటారని అడుగుతున్నారు.ఈ నేపధ్యంలో సోమనాథ్ భారతి దీనికి సమాధానమిస్తూ, తాను శిరోముండనం చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ప్రధాని మోదీ తన సొంత సత్తాతో విజయం సాధించలేదని, ఇది ఎన్డీఏ మిత్రపక్షాల ఏకీకృత విజయమేనని అన్నారు. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సమయంలో ఢిల్లీ లోక్సభ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ప్రకటించారు.జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలిపోతుందని సోమనాథ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో భారత కూటమి విజయం సాధిస్తుందని కూడా సోమనాథ్ భారతి చెప్పారు. కాగా న్యూఢిల్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ చేతిలో సోమనాథ్ భారతి ఓటమి పాలయ్యారు. -
రేపు బీజేపీ ఆఫీసుకు వస్తా... కేజ్రీవాల్ ఓపెన్ ఛాలెంజ్
న్యూఢిల్లీ: ఎంపీ స్వాతిమలివాల్పై దాడి కేసులో తన సహాయకుడు బిభవ్కుమార్ అరెస్టయిన తర్వాత ఆమ్ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైరయ్యారు. బీజేపీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఆదివారం(మే19) తన పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని, ఎవరిని కావాలంటే వారిని అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేశారు.‘మోదీజీ మీరు జైల్ గేమ్ ఆడుతున్నారు. మనీష్ సిసోడియా, సంజయ్సింగ్, అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఒకరి తర్వాత ఇంకొకరిని జైలుకు పంపుతున్నారు. నా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వస్తా. ఎవరిని కావాలంటే వారిని జైల్లో పెట్టండి. మొత్తం అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి’అని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఆప్ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని, అయితే ఆప్ ప్రజల గుండెల్లో ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా, కేజ్రీవాల్ ఓపెన్ ఛాలెంజ్పై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ స్పందించారు. ఎంపీ స్వాతిమలివాల్పై మీ ఇంట్లోనే దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. -
నవీన్పట్నాయక్కు ప్రధాని మోదీ ఆసక్తికర సవాల్
భువనేశ్వర్: ఎవరో రాసిచ్చిన కాగితం సాయం లేకుండా ఒడిషాలో ఉన్న జిల్లాల పేర్లు వరుసగా చెప్పాలని సీఎం నవీన్పట్నాయక్కు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. ‘నవీన్బాబుకు నేనొక సవాల్ విసురుతున్నాను. ఆయన అన్నేళ్లు సీఎంగా పనిచేశారు కదా ఒడిషాలో జిల్లాల పేర్లు అడగండి. చూడకుండా చెప్తాడేమో తెలుస్తుంది. పేర్లు చెప్పలేని సీఎంకు మీ బాధ ఎలా తెలుస్తుంది. ఈసారి బీజేపీకి ఛాన్సివ్వండి. ఐదేళ్లలో ఒడిషాను నెంబర్వన్గా చేయకపోతే అవగండి’అని మోదీ అన్నారు. ఒడిషాలో ఉన్న 147 ఎమ్మెల్యే సీట్లకు 21 ఎంపీ సీట్లకు మే 13 నుంచి జూన్ 1 వరకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. -
లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
-
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు కేతిరెడ్డి సవాల్
సాక్షి, సత్యసాయి: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కేతిరెడ్డి మాట్లాడారు. సత్యకుమార్ ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే.. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేయించాలన్నారు. అలా చేస్తే.. తాను ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. అలాగే సత్యకుమార్ యాదవ కులస్తుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ, నిరూపించుకోవాలని కేతిరెడ్డి సవాల్ చేశారు. కేతిరెడ్డి సమక్షంలో పలువురు నేత వైఎస్సార్సీపీలో చేరారు. -
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
-
కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
-
చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్
-
పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్
-
సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై ఈడీ ప్రకటన చేసింది. సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేశామని, మనీలాండరింగ్ యాక్ట్ కింద కవితను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. కవితను అరెస్ట్ చేసినట్లు ఆమె భర్తకు సమాచారం ఇచ్చామని ఈడీ అధికారులు తెలిపారు. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ రోజు రాత్రంత ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. కాగా, తన అరెస్ట్ను సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. మరోవైపు, కవిత భర్త అనిల్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనని అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. -
నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చెయ్..
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి కేటీ ఆర్ రాజీనామా చేసి నల్లగొండ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ విసిరారు. తాను సైతం నల్ల గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. నల్లగొండలో కేటీఆర్ ఓటమి ఖాయమని, ఇక కారు షెడ్డు మూసుకోక తప్పదన్నారు. కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసివేస్తాం అని కేసీఆర్ ప్రకట న చేస్తారా? అని సవాల్ విసిరారు. తాను సిరిసి ల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాన ని స్పష్టం చేశారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి శుక్రవారం సచివాల యంలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లా డారు. కేటీఆర్కు క్యారెక్టర్ లేదని కానీ రూ. లక్షల కోట్లు ఉన్నాయని, తనకు క్యారెక్టర్ ఉందని కానీ డబ్బులు లేవన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో రూ.200 కోట్లు ఖర్చు చేసి 30 వేల ఓట్లతో గెలిచాడని, తానై తే అలా గెలిస్తే రాజీనామా చేసేవాడినన్నారు. మాకు ప్రత్యర్థి బీజేపీనే... లోక్సభ ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదని, బీజేపీనే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోటీలో లేదని, బీజేపీకి రెండు, మూడు సీట్లు వస్తాయో లేదో తెలియదన్నా రు. బీజేపీ ఎంపీ డి.అర్వింద్ను ప్రజలు ఎప్పు డో మరిచిపోయారని కోమటిరెడ్డి చెప్పారు. రాజకీ యాల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నామని, తనతో పాటు ఉత్తమ్ ఆస్తులు తగ్గాయన్నారు. తన పేరు మీద ఆస్తులుంటే అర్వింద్కు ఇచ్చేస్తానని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరిలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని రాహుల్ గాంధీకి ప్రతిపాదించామని తెలిపారు. -
TS: సీఎం రేవంత్కు కడియం సవాల్
సాక్షి,వరంగల్: సీఎం రేవంత్ రెడ్డి వేదిక ఏదైనా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఆయన భాష జుగుప్సాకరంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. బుధవారం వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం మాట్లాడుతున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నానమని, ఇది మంచి పద్దతి కాదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. ‘సీఎంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీ మేనిఫెస్టో.. మా మేనిఫెస్టోపైన మేం చర్చకు రెడీ. ప్రశ్నిస్తే మాపై మాటల దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో అర్దం కావడం లేదు. రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తోంది. మహిళా నాయకుల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడ్డం హాస్యాస్పదం. నువ్వు అంత మగాడివే అయితే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగ తనాన్ని నిరూపించుకో. సీఎంగారు మీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న అలోచన మాకు లేదు. మీ ఆంతట మీరు కూలిపోతే మాకు సంబంధం లేదు. మీ వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే అనుకుంటున్నాం. రాజీవ్ గాంధీ కుటుంబం ఇనామ్ కింద ఇచ్చిందే కదా నీ కుర్చీ. ఇందిరాగాంధీ నామజపంతో తుకుతున్న పార్టీ మీది. మీది జాతీయపార్టీ కాదు. ప్రాంతీయ పార్టీ మీది. ఆప్ కంటే అద్వాన్నంగా మారింది కాంగ్రెస్ పార్టీ. మార్చి1వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్నాం. త్వరలో కేసీఆర్ కూడా మేడిగడ్డ కు వస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే. కూలిపోయిన 3 పిల్లర్ల వద్ద రిపేర్ చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి. బ్యారేజ్ కొట్టుకుపోయేలా చేయాలనే దుర్మార్గపు అలోచన చేస్తున్నారు. ఇదీ చదవండి.. తెలంగాణకు మరోసారి మోదీ.. రెండు రోజులు ఇక్కడే -
మీ మేనిఫెస్టోలు, మా ఆరు గ్యారంటీలపై చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: 2014, 2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలు, 2014, 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దామని, బీఆర్ఎస్, బీజేపీ నేతలు సిద్ధమా? అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమ లు చేస్తున్నామని, గత పదేళ్లలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని చెప్పా రు. బీఆర్ఎస్, బీజేపీల భాష, భావం, ఆలోచనా విధానం ఒక్కటేనని, రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్పై అక్కసు వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. సోమవారం సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డ రోజున అప్పుల కింద ఏడాదికి రూ. 6 వేల కోట్లు కట్టేవారమని, ఇప్పుడు పదేళ్ల తర్వాత ఏడాదికి రూ.70 వేల కోట్లు అప్పుల కింద కట్టాల్సి వస్తోందని చెప్పారు. మిగులు బడ్జెట్ స్థితిలో రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే రాష్ట్రాన్ని దివాలా స్థితికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఇంత త్వరగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయగల శక్తి కేసీఆర్కు తప్ప ఎవరికైనా ఉందా అని ఎద్దేవా ఏశారు. మార్చి 31 కల్లా రైతుబంధు రైతుబంధును మార్చి 31 కల్లా రైతులకు ఇస్తామని అసెంబ్లీలోనే చెప్పానని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. రైతుబంధును 15 రోజుల్లోనే ఇవ్వొచ్చని, అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు నిధులివ్వలేమని వెల్లడించారు. ఉద్యోగాలను వారు వదిలేస్తే న్యాయ పరిష్కారం చూపెట్టి 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు తెడ్డు తిప్పుతున్నారని హరీశ్రావు అంటున్నారని, మరి తెడ్డు తిప్పలేని సన్నాసి మంత్రి ఎలా అయ్యా రని ఎద్దేవా చేశారు. మార్చి 2న మరో ఆరువేల ఉద్యోగాలిస్తామని, 70 రోజుల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. దూలం లెక్క పెరిగిన హరీశ్కు దూడకున్న బుద్ధి కూడా లేదని విమర్శించారు. రేవంత్ను సీఎంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లి ఉంటే కాంగ్రెస్కు 30 సీట్లు కూడా వచ్చేవి కాదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన్ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. గత ఎన్నికల్లో తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, కిషన్రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా తలపడ్డామని, తమ పార్టీ నేతలతో కలిసి 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలకు వెళ్లానని, పార్టీ అధ్యక్షుడంటే ఇంటి పెద్దే కదా అని అన్నారు. కిషన్రెడ్డి ఏనాడైనా కలిశారా? అధికారం చేపట్టిన తర్వాత రాజకీయాలకతీతంగా తాము నిధుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కేంద్రం వద్దకు వెళ్లామని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ఏ రోజైనా ప్రజా సమస్యల కోసం తనను కలిశారా అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలన్న ఆలోచన బీజేపీకి లేదని విమర్శించారు. మూడోసారి ప్రధానిగా మోదీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని, రైతులను కాల్చిచంపడానికా అని అన్నారు. నిరుద్యోగులకు ఆన్లైన్ క్లాసులు పేద, గ్రామీణ నిరుద్యోగుల కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ల పేరిట అత్యవసరంగా ఆడిటోరియాలు కట్టి, అక్కడ ఆన్లైన్ క్లాసులతో శిక్షణనిస్తామని రేవంత్ చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు తెల్ల రేషన్కార్డును కొలబద్దగా తీసుకున్నామని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా అనర్హులకు రూ.22వేల కోట్లు పంచిపెట్టారన్న అంచనా ఉందన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల కోసం ఆధార్కార్డు చూపిస్తే నమోదు చేసుకునేలా మండల కేంద్రాల్లో హెల్ప్ డెసు్కలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉజ్వల్ పథకం కింద కేంద్రం ఇస్తున్న మొత్తం పోను మిగిలింది సిలిండర్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. -
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది: వంశీచంద్ రెడ్డి
-
లోకేష్ కు పుష్ప శ్రీవాణి ఛాలెంజ్
-
నారా లోకేష్ కు మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్
-
నేను గుడివాడలో పోటీ చెయ్యను !..చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
-
లోకేష్ కు అమర్నాథ్ ఛాలెంజ్
-
సభలో తేల్చుకుందాం!
ఎంత సమయం కావాలన్నా ఇస్తాం.. కేసీఆర్ నల్లగొండకు వెళ్లేముందు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలి. ఆయనకు ఎంత సమయం కావాలంటే అంత కేటాయిస్తాం. ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చెయ్యం. ప్రతి అంశంపై చర్చించాలి. చెయ్యి నొప్పి, కాలు నొప్పి అని సాకులు చెప్పి సమావేశాలకు గైర్హాజరు కావొద్దు. ఎంతసేపైనా చర్చిద్దాం. కావాలంటే చద్దర్లు, దుప్పట్లు కూడా తెచ్చుకోండి. అవసరమైతే తలుపులేసి మాట్లాడుకుందాం. కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్రావు కూడా రావాలి. ఎమ్మెల్సీ కవిత కూడా హాజరుకావొచ్చు. అవసరమైతే ఉభయసభలను ఒకే సమయంలో సమావేశపరుస్తాం. సాక్షి, హైదరాబాద్: అరవై ఏళ్ల ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ధనదాహానికి తెలంగాణ బలైందని, రాష్ట్రంలో కృష్ణాబేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు ఎడారిగా మారాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వా న్ని బదనాం చేస్తున్నారన్నారు. త్వరలో జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులు, నిధుల వినియోగం, నీటి పారుదల అంశాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. దమ్ముంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు. ఆదివారం సచివాలయంలో మంత్రులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కొండా సురేఖలతో కలసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్, కవితారావు అంతా కలసి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అసలు తెలంగాణలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు పునాదిపడినది కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేలా బిల్లులో పొందుపర్చారు. తెలంగాణ ఏర్పాటు బిల్లులోని ప్రతి అక్షరాన్ని తన సమ్మతితోనే పెట్టారని చెప్పుకునే కేసీఆర్.. ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? స్వయంగా సంతకాలు చేసి కూడా.. తెలంగాణ, ఏపీ మధ్య 811 టీఎంసీల జలాలను పంచుకునేందుకు 2015 జూన్ 18, 19 తేదీల్లో కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అప్పటి సీఎం కేసీఆర్, నాటి ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్రావు, సాగునీటి నిపుణుడు విద్యాసాగర్రావు హాజరయ్యారు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల చొప్పున నీటిని పంచేందుకు ఒప్పుకొన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న తెలంగాణకు కేవలం 299 టీఎంసీలే నీరే తీసుకునేందుకు ఎలా ఒప్పుకొన్నారు? ఇదంతా ఆ సమావేశం మినిట్స్లో రికార్డు అయింది. రాష్ట్రానికి రావాల్సిన నీటిని ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. అంతేకాదు 2022 మే 27న జరిగిన సమావేశంలో 15 ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు అంగీకరించారు. గత ఏడాది మే 19న జరిగిన కృష్ణాబోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 2023–24 బడ్జెట్లో గోదావరి బోర్డు, కృష్ణా బోర్డులకు చెరో రూ.200 కోట్ల చొప్పున రూ.400 కోట్లు బడ్జెట్లో కేటాయించారు కూడా. ఇంత చేసిన కేసీఆర్.. ఇప్పుడు నల్లగొండలో నిరసన తెలుపుతాననడం సిగ్గుచేటు. కేసీఆర్ చేతగానితనం వల్లే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు భూభాగమంతా తెలంగాణలోనే ఉంటుంది. కానీ రెండు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం స్వా«దీనం చేసుకునే ప్రయత్నం చేసింది. ఏపీ పోలీసులు తుపాకులతో మోహరించారు. తెలంగాణ ప్రాజెక్టును స్వా«దీనం చేసుకునేందుకు ఏపీకి ఎంత దమ్ము ఉండాలి. కేసీఆర్ చేతగానితనం వల్లే అలా జరిగింది. అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చున్న కేసీఆర్ బయటికి వచ్చే పరిస్థితి లేక ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు. కేసీఆర్వన్నీ తుగ్లక్ నిర్ణయాలు: ఉత్తమ్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అన్నీ తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వాఖ్యానించారు. లక్షకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూన్నాళ్ల ముచ్చట అయ్యిందని, పలు ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని అన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసే ప్రాజెక్టులకు అంచనాలను రెట్టింపు చేసి నిధులన్నీ దుబారా చేశారన్నారు. రెండు టీఎంసీల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి, గ్రావిటీ ద్వారా వచ్చే 8 టీఎంసీలను తీసుకెళ్తుంటే చోద్యం చూశారు. నీటినిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రాజెక్టులు ఏడారిగా మారుతున్నాయని, రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టికొట్టిన పరిస్థితిని కేసీఆర్ సృష్టించారన్నారు. ఆయన కుట్రతోనే ప్రాజెక్టులకు బొక్కలు.. రాష్ట్ర ప్రయోజనాలు తీర్చాల్సిన జలాలను కేసీఆర్ కుట్రపూరితంగా ఆంధ్రకు కట్టబెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు మంత్రులుగా పనిచేశారు. కేంద్రంలో కేసీఆర్తోపాటు నరేంద్ర మంత్రులుగా కొనసాగారు. అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 44వేల క్యూసెక్కుల జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లే ప్రయత్నాలను టీఆర్ఎస్ మంత్రులు ఎందుకు అడ్డుకోలేదు? కేసీఆర్ లో పాయికారీ ఒప్పందాలతోనే తెలంగాణకు అన్యా యం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ము చ్చుమర్రికి నీటిని తరలించుకెళ్లేలా మరో టన్నెల్ ఏర్పాటు చేసుకునేందుకు కేసీఆర్ కారణమయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ప్రాజెక్టుతో రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకునేందుకు శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద బొక్కపెట్టారు. దానికి సంబంధించి 2020 మే 5న ఏపీ జీఓ 203ని కూడా తెచి్చంది. అప్పట్లో ప్రగతిభవన్కు వచి్చన ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ ఏకాంత చర్చల తర్వాతే ఆ జీఓ జారీ అయింది. ఆ ఏడాది ఆగస్టు 5న కృష్ణాబోర్డు సమావేశం ఉంటే కేసీఆర్ బిజీగా ఉన్నానంటూ వెళ్లలేదు. వెంటనే ఆ ప్రాజె క్టు టెండర్లు, కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత కమీషన్ల కోసం కుట్ర చేసిన వ్యక్తి కేసీఆర్. ఇలాంటి వ్యక్తి ప్రజా ఉద్యమాలు చేస్తానంటే ప్రజలే బుద్ధిచెప్తారు. తెలంగాణ వ చ్చాక కేసీఆర్ సీఎంగా, ఆయన అల్లుడు హరీశ్రా వు నీటిపారుదల, ఆర్థికశాఖల మంత్రిగా ఏమేం చేశారో అన్నింటినీ ప్రజల ముందు పెడతాం. వా రి ఘనకార్యాలన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. ప్రాజెక్టులను బోర్డుకు ఇచ్చే ప్రసక్తే లేదు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదు. కృష్ణా, గోదావరి నదులు పుట్టినచోటి నుంచి సముద్రంలో కలిసేవరకు ఉన్న ప్రాజెక్టులన్నింటిపై సమీక్షించి రాష్ట్రాల వారీగా నీటి వాటాలు తేల్చాలి. కేవలం ఏపీ, తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులతో ముడిపెట్టొద్దు. ఈ అంశంపై ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను కలసి వినతిపత్రాలు ఇచ్చాం. అది తేలేవరకు ప్రాజెక్టుల అప్పగింత మాటే ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి పనులు పూర్తిచేస్తాం..’’అని రేవంత్రెడ్డి వెల్లడించారు. -
చర్చ పెట్టు..సమాధానమిస్తాం
వనస్థలిపురం (హైదరాబాద్), సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సీఎం రేవంత్రెడ్డి దగ్గర విషయం లేదు గనకనే ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్పై, బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. ఈ అంశంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన సవాల్కు ప్రతిసవాల్ చేశారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చపెట్టాలని.. దిమ్మతిరిగే సమాధానం చెప్తామని పేర్కొన్నారు. గతంలో తాము అసెంబ్లీలో చర్చ పెడితే ప్రిపేర్ కాలేదంటూ కాంగ్రెస్ తప్పించుకుందని.. ఇప్పుడు తాము అలా చేయకుండా ధైర్యంగా చర్చకు వస్తామని చెప్పారు. గత పదేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా తాము రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని హస్తినాపురంలో, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాల్లో హరీశ్రావు మాట్లాడారు. సీఎం రేవంత్కు ఆలోచన లేక, అర్ధంకాక ఆగమాగమై మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి నీటి సమస్యను తీసుకువస్తున్నారని ఆరోపించారు. విభజన బిల్లులో పెట్టిందెవరు? ‘‘రాష్ట్ర విభజన సమయంలో.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని బిల్లు పెట్టి పాస్ చేసింది కాంగ్రెస్ కాదా? ఆ బిల్లును తయారుచేసింది మీ జైపాల్రెడ్డి, జైరాం రమేశ్ కాదా? అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే అర్హత రేవంత్కు లేదు. దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే. పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే అసెంబ్లీని 30 రోజులు స్తంభింపజేశాం. నాడు టీడీపీలో ఉన్న రేవంత్ పోతిరెడ్డిపాడుపై ఏమాత్రం స్పందించలేదు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని వెంకయ్యనాయుడు ఉదయమే రేవంత్కు చెప్పారు. కానీ మధ్యాహ్నమే రేవంత్ చిల్లర మాటలు మాట్లాడారు..’’అని హరీశ్రావు మండిపడ్డారు. తాము మేం కృష్ణా నీటిలో 50శాతం వాటా ఇవ్వాలని, శ్రీశైలాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే హైదరాబాద్కు మంచినీటి సమస్య వస్తుందని.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్లకు సాగునీరు, తాగునీటి సమస్య నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఆరోపణలా? కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని.. హామీలపై ప్రశ్నిస్తే పసలేని అంశాలతో ఎదురుదాడి చేస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. డిసెంబర్లోనే రూ.4వేలు పింఛన్ ఇస్తామని, ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని డేట్లు పెట్టి.. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి ముక్కలవుతోందని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని హరీశ్రావు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవనందున రాష్ట్రంలో హామీలను అమలు చేయడం కుదరడం లేదని సీఎం రేవంత్రెడ్డి సాకు చెప్పబోతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరగబోతోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
చంద్రబాబుకి మంత్రి కాకాని ఛాలెంజ్
-
దమ్ముంటే రా..చంద్రబాబుకు కేశినేని సవాల్
-
దమ్ముంటే నాపై పోటీ చెయ్ : కేశినేని నాని
గంపలగూడెం(తిరువూరు): చంద్రబాబునాయుడికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ ఎంపీ స్థానం నుంచి తనపై నిలబడి గెలవాలని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్టీమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల మ్యాంగో మార్కెట్లో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ మండల ఆత్మియ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చివరివని జోస్యం చెప్పారు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే, పేదలకు వ్యతిరేకంగా పాలన చేసిన ఘనుడు నారా చంద్రబాబునాయుడని అన్నారు. తన పుత్రరత్నం లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక అజెండాతో చంద్రబాబు ముందుకు పోతున్నారని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తినని చెప్పుకొనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇల్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. అమరావతి పేరిట ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు నష్టం తెచ్చారన్నారు. రూ.2.60 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసిన ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అభ్యర్థుల డబ్బు చూసి చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. మండలంలో ప్రధాన సమస్య అయిన కట్టెలేరు వంతెన నిర్మాణానికి వచ్చే నెల 3వ తేదీన శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. తిరువూరు నియోజకవర్గంలో 10వేల మెజారిటీతో పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఓటు అడిగేహక్కు వైఎస్సార్ సీపీకి మాత్రమే ఉంది రాష్ట్ర ప్రజలకు 57 నెలలుగా మెరుగైన పాలన అందించిన వైఎస్సార్ సీపీకి మాత్రమే రోబోయే సాధారణ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. పార్టీ మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేసిన మంచిని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. తిరువూరు అభ్యర్థి ఎంపిక కోసం తలపట్టుకొంటున్నారు తనను వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన తర్వాత తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి కోసం వెతుకులాట ప్రారంభించిందని స్వామిదాసు అన్నారు. తనపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని పనిచేస్తానని చెప్పారు. ముందుగా అయోధ్యరామిరెడ్డి, కేశినేని నాని, స్వామిదాసు తోటమూలలో అంబేడ్కర్, జగ్జీవన్రామ్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వినగడప పేరంటాళ్ళ గుట్ట వద్ద అచ్చం పేరంటాళ్ళకు పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎన్.సుధారాణి, ఎంపీపీ జి.శ్రీలక్ష్మీ, జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు దమ్ముందా ?..కేశినేని ఛాలెంజ్..
-
షర్మిలకు కాసు మహేష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
చంద్రబాబుకు అరకు టీడీపీ లీడర్ ఛాలెంజ్
-
యనమల బ్రదర్స్ కు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్
-
కమీషన్ తీసుకుంటే విచారణ చేయించండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్లో తాను కమీషన్ తీసుకున్నట్టు కొందరు ఆరోపిస్తున్నందున దానిపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్రెడ్డి ఆదాయం ఎంతో, తన ఆదాయం ఎంతో విచారణకు సిద్ధమని ప్రకటించారు. బీజేపీలో తన ›ప్రస్థానం ఎలా మొదలైందో, రేవంత్రెడ్డి రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందో ఎవరు ఏ రకంగా డబ్బు సంపాదించారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో మొత్తం తెలంగాణ సమాజం ఎదుటే ఉందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కుటుంబంతో వ్యాపార భాగస్వామ్యం ఉన్నది కూడా ఎవరికో అందరికీ తెలుసునన్నారు. ’తాను కేసీఆర్కు బినామీ కాదు..తనపై ఆరోపణలు చేస్తున్న వారే కేసీఆర్కు బినామీలు’ అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరర్థకంగా మారడంతో అందరూ బాధ పడుతున్నారని, దీనిపై న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ జరిపించాలని తాను కోరితే కాంగ్రెస్ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు విషయం పక్కన పెట్టి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కిషన్రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీఎం గతంలో ఎంపీగా కాళేశ్వరం అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సీబీఐకి లేఖ రాస్తున్నట్లు చెప్పారని కిషన్రెడ్డి గుర్తుచేశారు. రేవంత్రెడ్డి ఎంపీగా ఉన్నపుడు సీబీఐ విచారణకు లేని అభ్యంతరం సీఎం అయ్యాక ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరిట కాలయాపన చేసి కేసీఆర్ను కాపాడాలనుకుంటే తాను చేసేదేమీ లేదన్నారు. లంకె బిందెల కోసం వచ్చారా రేవంత్ లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని, ఆయన లంకె బిందెల కోసం వచ్చారా అని కిషన్రెడ్డి నిలదీశారు. ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డి మళ్ళీ ఫార్మా సిటీ ఉంటుందని చెప్పారని 15 రోజుల్లోనే ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకుందనీ, అందులో మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఫార్మా కంపెనీల లాబీయింగ్కు లొంగిపోయారా అని నిలదీశారు. మోదీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని.. మోదీ మెడిసిన్కు కాలం తీరిపోయిందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు... ఆయన ఎప్పుడు ఆ మందు వేసుకున్నార’ని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ‘మీ రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు ఆ మెడిసిన్ రిజెక్ట్ కాదు.. మోదీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని’’ అని వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ. ఆ పార్టీ అవసరం తెలంగాణకు లేదు, లోక్సభ ఎన్నికల్లో చిచాణా ఎత్తేయడం ఖాయం’’ అని అన్నారు. అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందరగోళం ‘అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఆ ఫారం నింపడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.. కాలయాపన కోసమే ఇదంతా. ఇందులో రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదు. ఫార్మ్స్ బ్లాక్లో కొనుక్కోవాల్సి వస్తుంది. దరఖాస్తు అవసరం లేకుండానే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఇవ్వలేదు... ఆ విషయం తెలిసి కూడా దరఖాస్తులకు రేషన్ కార్డ్ జత చేయమనడం ఎందుకు? లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు లబ్ధికోసమే ప్రజలను తమచుట్టూ తిప్పుకుని ఇబ్బందిపెడుతున్నారు’ అని కిషన్రెడ్డి విమర్శించారు. -
కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ సీఎం రేవంత్రెడ్డి లేఖ రా యాలని, 48 గంటల్లో తాను కేంద్రం నుంచి అను మతి తెస్తానని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధి చాటుకోవాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య దోస్తీ లేదని నిరూపించుకోవాలని అన్నారు. న్యాయ విచారణతో పాటు సీబీఐ దర్యాప్తుతో ఫలితాలు వేగంగా వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. విపక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్రెడ్డి, ఇప్పుడు కేవలం న్యాయవిచారణ జరిపిస్తామనడం అనేక అనుమానాలకు తావిస్తోందని మంగళవారం మీడి యాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు తాత్సారం? బీఆర్ఎస్ సర్కార్ అతిపెద్ద అవినీతి స్కాం కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని, ఎందుకు తాత్సారం చేస్తున్నారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం విషయంలో కేంద్రంతో పాటు ప్రధాని మోదీపై, తనపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచి్చనట్టుగా విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు జరిపి దోషులను శిక్షించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? లేదా? స్పష్టం చేయాలన్నారు. అవగాహన నేపథ్యంలో సానుభూతి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి బొటాబోటీ మెజారిటీతో తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఉండడంతో ప్రస్తుత సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ల మధ్య ఎంఐఎం మధ్యవర్తిత్వంతో అవగాహన ఏర్పడిందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్కు సాను భూతి ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. తామిద్దరం చే సేది దోపిడీయేనని, తమ డీఎన్ఏ ఒకటేననే అభి ప్రాయంతో కాంగ్రెస్ ఉందని వ్యాఖ్యానించారు. మే డిగడ్డ సందర్శన సందర్భంగా రాష్ట్ర మంత్రులు పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్లకే పరిమితమయ్యారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారని, దీని కోసం ఖర్చు చేసిన రూ.లక్ష కోట్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 17 ఎంపీ స్థానాలకు పోటీ ఫిబ్రవరి 28న లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయని కిషన్రెడ్డి చెప్పారు. తెలంగాణలోని 17 స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుందని, జనసేనతో పొత్తు ఉండకపోవచ్చునని అన్నా రు. జనసేన ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా ఉందని, ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు విషయమై చర్చ జరగలేదని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి కేంద్రం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ నెల 17న సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానుందని, ఆ లోగానే కేంద్రం అఫిడవిట్ను సమర్పిస్తుందని చెప్పారు. -
రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడైనా ఉందా ?
-
మీ ముగ్గురికీ శంకరగిరిమాన్యాలే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఓడిపోవడం ఖాయమని.. వారికి శంకరగిరిమాన్యాలు తప్పదని, పవన్కళ్యాణ్ది కూడా అదే పరిస్థితి అని మంత్రి అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ దెబ్బకు చంద్రగిరిలో చంద్రబాబు ఓడి కుప్పం పారిపోయాడని.. అలాగే, వైఎస్ జగన్ దెబ్బకు మంగళగిరిలో లోకేశ్, రెండుచోట్ల దత్తపుత్రుడు పవన్ చిత్తుచిత్తుగా ఓడిపోయి రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం అంత సీన్ ఉంటే 175 సీట్లలో సింగిల్గా పోటీచేయగలరా? అని సవాల్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. బాబు మతిస్థిమితం కోల్పోయారు.. జగన్ ఒక్కడిపై అందరూ ఎందుకు గుంపుగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు? జనసేనతో జతకట్టి చంద్రబాబు ఎందుకు ఎన్నికలకు వస్తున్నారు? రాజమండ్రి జైలుకు వెళ్లొచ్చాక చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారు. అందుకే వైఎస్సార్సీపీ అభ్యర్థుల మార్పుపై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్పైనా, ప్రభుత్వంపైనా పిచ్చి విమర్శలు ఎన్నిచేసినా చంద్రబాబుకు మళ్లీ ఓటమి ఖాయం. ఈసారి టీడీపీ, జనసేనల ఉనికి ఉండదు. ఆ దిశగానే మా పార్టీ వ్యూహరచన చేస్తోంది. వైఎస్ జగనే మళ్లీ సీఎం కావాలని 60 శాతానికి పైగా ప్రజలు కోరుకుంటున్నారు. వారే మా పార్టీకి బలం. 175 సీట్లు గెలవడమే మా టార్గెట్. పార్టీ గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్లు మార్పులు జరుగుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. నిజానికి.. చంద్రబాబు ఏనాడైనా ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకున్నారా? ఆయన కేవలం ప్రైవేట్ స్కూళ్లకు మాత్రమే రాచబాట వేశారు. అలాగే, ఒక్కసారైనా పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారా? కానీ, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు వైఎస్ జగన్. టీడీపీ దిగజారిపోయిన పార్టీ. ఎన్నికల తర్వాత ఆ పార్టీ భూస్థాపితమే. పవన్కు ఎన్ని సీట్లు ముష్టి వేస్తారు బాబు? పవన్కళ్యాణ్కు చంద్రబాబు అసలు ఎన్ని సీట్లు ముష్టి వేయాలనుకుంటున్నారు? అలాగే, పవన్ ఎన్ని సీట్లు తీసుకోవాలనుకుంటున్నారు? పవన్ ఏమైనా పదేళ్లకు కాంట్రాక్టు మాట్లాడుకున్నారా? గతంలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీచేసి అధికారంలోకి వచ్చినప్పుడు, కాపాడిన రాష్ట్ర భవిష్యత్తేంటో వాళ్లు చెప్పాలి. అధికారంలోకి రాగానే ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఇద్దరిదీ కలహాల కాపురం అని తేలిపోయింది. వాళ్లిద్దరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్లీ ఇప్పుడు కలుస్తామంటున్నారు. అలాగే, మోదీని విమర్శించిన చంద్రబాబు మళ్లీ బీజేపీతో కలుద్దామనుకుంటున్నారు. పోలవరాన్ని నాశనం చేసింది బాబే.. ఇక పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబే. దీనిపై ఆయనతో ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం. అంకెల గారడీతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రిటైర్మెంట్ ఖాయం. టీడీపీ, జనసేన రెండు పార్టీలను కాలగర్భంలో కలిపేస్తాం. -
మెజారిటీ రాదు.. ఒట్టు.. బీఆర్ఎస్ కౌన్సిలర్ చాలెంజ్
రామాయంపేట(మెదక్): ఎన్నికల నేపథ్యంలో రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని చాలెంజ్ చేసిన ఇదే పార్టీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు గుండు కొట్టించుకున్న ఉదంతమిది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పరిశీలకులు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి పార్టీ పరంగా సర్వేలో భాగంగా కౌన్సిలర్ల అభిప్రాయాలు సేకరించారు. ఈ మేరకు చైర్మన్ జితేందర్గౌడ్తోపాటు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ రాదని, కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ వస్తుందని, తాను స్వయంగా పట్టణంలో పర్యటించగా ఈ విషయం తెలిసిందని 8వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్ పరిశీలకుడితో వాగ్వాదం చేశారు. ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో మెజారిటీ వస్తే తాను గుండు కొట్టించుకొని గడ్డం, మీసాలు తీసి వేస్తానని చాలెంజ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందని తెలుసుకున్న సదరు కౌన్సిలర్ గంగాధర్ అన్న మాటను నిలబెట్టుకున్నారు. -
మంకీ డ్యాన్స్ చాలెంజ్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్లు వస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్నెట్కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్ డ్యాన్స్లను ఫాలో అవుతున్నారు. ‘గాంగ్నమ్’ డ్యాన్స్ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్ చాలెంజ్’ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమ సనా షేక్ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్ను స్వీకరించింది. పింక్ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘దిస్ ఈజ్ అమేజింగ్’లాంటి కామెంట్స్తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్ ఛాయిస్. -
తొలిసారి అలాంటి సీన్ చేశా!
‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. ∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ. పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను. -
నన్ను గెలిపించండి పనిచేయకపోతే ఈ చెప్పుతో కొట్టండి
-
ప్రమాణం చేద్దామా?.. దామచర్లకు బాలినేని సవాల్
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో జరిగే అన్ని మీటింగ్లకు నన్ను పిలిచారని, మీడియా వాళ్లు అనవసరంగా ప్రతీది రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్కి అబద్ధాలు మాట్లాడటం అలవాటు. కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు డబ్బులు తీసున్నారో ప్రమాణం చేద్దామా?. చీము, నెత్తురు, సిగ్గు ఉంటే నా ఛాలెంజ్కు స్పందించు’’ అంటూ సవాల్ విసిరారు. కొత్తపట్నం బ్రిడ్జి మెటీరియల్ కొనుగోలుకు నేను రూ.40 లక్షలు ఇచ్చా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే పద్దతిగా ఉండదు’’ అని బాలినేని హెచ్చరించారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? -
అయోధ్య భద్రత ఒక సవాలు: సీఆర్పీఎఫ్
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయంలో భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన మౌలిక సదుపాయాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 27 ఎకరాల్లో అభివృద్ధి చేసిన క్యాంప్ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ సత్యపాల్ రావత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలు తెలియజేశారు. రామ మందిర నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని, అది ఇక్కడ పనిచేసే భద్రతా బలగాలకు సవాల్గా మారుతుందని సత్యపాల్ తెలిపారు. అయోధ్యలో పలు భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయని, వీటిలోని సిబ్బంది మధ్య ఎంతో సమన్వయం ఉందన్నారు. భద్రతా పరంగా ఇక్కడ నూతన ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా భద్రతకు ఉపయుక్తమయ్యే ఆధునిక పరికరాలు కూడా తీసుకురానున్నామన్నారు. అయోధ్యలో భద్రత గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఆర్పీఎఫ్ అన్నివేళలా, అన్ని పరిస్థితుల్లో సన్నద్ధంగా ఉంటుందన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్లో మళ్లీ హింస: నలుగురి అపహరణ, కాల్పుల్లో ఏడుగురికి గాయాలు! -
తుమ్మలపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
-
‘కృత్రిమ మేథ’తో రసాయన దాడులు? ‘ఛాలెంజ్’ స్వీకరించిన ‘ఓపెన్ ఏఐ’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ముడిపడిన విస్తృత నష్టాలను అంచనా వేయడానికి, తగ్గించడానికి ఓపెన్ ఏఐ బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ బెదిరింపులు, వ్యక్తిగత ఒప్పందాలు, సైబర్ సెక్యూరిటీ, అటానమస్ రెప్లికేషన్తో సహా సంభావ్య ఏఐ బెదిరింపులపై ఈ బృందం దృష్టి సారించనుంది. అలెగ్జాండర్ మాడ్రీ నేతృత్వంలోని ఈ బృందం.. ఏఐని ఉపయోగించుకుని ఎవరైనా చేసే కుట్రపూరిత చర్యలకు అడ్డుకట్ట వేసే పనిని ప్రారంభించింది. అలాగే ఏఐ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే నష్టాలను పరిశోధిస్తుంది. ఇటువంటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఓపెన్ ఏఐ ఒక ఛాలెంజ్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో ఉత్తమంగా నిలిచిన వాటికి ఏపీఐ క్రెడిట్తో పాటు 25 వేల డాలర్లు(ఒక డాలర్ రూ.83.15) అందించనున్నట్లు ప్రకటించింది. చాట్ జీపీటీ తరహా సాంకేతికతను అభివృద్ధి చేసే ఓపెన్ ఏఐ ఇప్పుడు ఏఐతో ఏర్పడే ముప్పును అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ను ప్రారంభిస్తోంది. ఇటీవలే దీని గురించి వెల్లడించింది. దీని ప్రధాన లక్ష్యం ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే భారీ ముప్పులపై అధ్యయనం చేయడం, అంచనా వేయడం, తగ్గించడం. గత జూలైలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తలెత్తే ముప్పును అరికట్టేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ సూచించింది. కృత్రిమ మేధస్సుతో ముడిపడిన ఏఐ వ్యవస్థలు ఏదో ఒక రోజు మానవ మేధస్సును అధిగమించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే ఓపెన్ ఏఐ.. కృత్రిమ మేథలో తలెత్తే ముప్పును నివారించే దిశగా ముందడుగు వేస్తోంది. ఈ నేపధ్యంలో 2023 మే నెలలో ఈ సంస్థ.. ఏఐతో కలిగే ముప్పును ప్రస్తావిస్తూ, ఒక బహిరంగ లేఖను ప్రచురించింది. కృత్రిమ మేథస్సుతో కలిగే నష్టాలను ప్రపంచ స్థాయిలో తీవ్రంగా పరిగణించాలని ఆ లేఖలో ఓపెన్ ఏఐ కోరింది. ఇది కూడా చదవండి: ఖతార్లో అత్యాచారానికి ఏ శిక్ష విధిస్తారు? -
కేసీఆర్కు దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయాలి
కొడంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం ఆయన కొడంగల్కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి నివాసానికి వెళ్లి దేశ్ముఖ్ కుటుంబ సభ్యులకు జమ్మి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తన నివాసానికి చేరుకొని అభిమానులు, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన అన్ని ప్రభుత్వ భవనాలను తానే మంజూరు చేయించినట్లు చెప్పారు. 2018లో పోలీసులను అడ్డు పెట్టుకొని తనను ఓడించారని, ఇప్పుడు కూడా పోలీసుల సాయంతో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్కు కేసీఆర్ అన్యాయం అన్ని విషయాల్లోనూ సీఎం కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గానికి అన్యాయం చేశారని రేవంత్ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి సాగునీరు తెచ్చి రైతుల కాళ్లు కడుతానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ ఊసేలేదని మండిపడ్డారు. కొడంగల్ను కేసీఆర్ రెండు ముక్కలు చేసి పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. ఉద్యోగులంతా ఏకమై కేసీఆర్ను ఇంటికి పంపాలని రేవంత్ పిలుపునిచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు నెలకు రూ.4 వేలు ఇస్తామని, కేసీఆర్ చేసిన రుణమాఫీ బ్యాంకుల మిత్తీకి కూడా సరిపోలేదన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గంలోని 8 మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆర్థిక నేరగాళ్లను ప్రజలు సపోర్ట్ చేయరు..!
-
అక్కడికి రా.. ప్రమాణం చేద్దాం?.. సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ నిర్ణయాలు కాపీ కొట్టడంలో కేసీఆర్ బిజీబిజీ అయ్యారు.. మా అభ్యర్థులను ప్రకటించే దాకా కేసీఆర్ బీఫారం లు ఇవ్వలేదు’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మేం 55 మందిని ప్రకటిస్తే కేసీఆర్ 51 మందికే బీ ఫామ్లు ఇచ్చారు. కేసీఆర్ లాగా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. మేం ఇచ్చిన హామీలన్నీ ఆచరణకు సాధ్యమే’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సాధ్యమేనని కేసీఆర్ రాజముద్ర వేశారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్లకే కొంత డబ్బులు పెంచారు. మా గ్యారెంటీ స్కీమ్ చూసి కేసీఆర్ పెద్ద లోయలో పడిపోయారు. కేసీఆర్కి ఆలోచన చేసే శక్తి తగ్గిపోయింది. కేసీఆర్ ఇప్పుడు పరాన్నజీవి’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలను కేసీఆర్ తన మేనిఫెస్టోలో పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పైసా ఇవ్వకుండా, మందు పోయకుండా ప్రజల్లోకి వెళ్దామా?. 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నువ్వు, నేను ప్రమాణం చేద్దామా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు. ‘‘నవంబర్ నెల 1వ తేదీన పెన్షన్లు, జీతాలు వేస్తే కేసీఆర్ను ప్రజలు నమ్ముతారు. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో వేసినట్టు పాత అంశాలను మేనిఫెస్టోలో పెట్టారు. మేం పొగ పెడితే బొక్కలో ఉన్న ఎలుక బయటకి వచ్చింది. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్.. కేసీఆర్ ఎక్పైరీ డేట్ అయిపోయింది. కేసీఆర్ ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటే మంచిది’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే.. -
‘చమురు’ ధరలు ముంచేస్తాయి.. భారత్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: అధిక చమురు ధరలు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం చూపుతాయని భారత్ హెచ్చరించింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. భారత్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఆర్థిక సేవల సంస్థ– కేపీఎంజీ ఫ్లాగ్షిప్ ఇన్నోవేషన్ అండ్ ఎనర్జీ 14వ ఎడిషన్– ఎన్రిచ్ 2023 కార్యక్రమంలో చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ, ఇజ్రాయెల్–హమాస్ సైనిక సంఘర్షణను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ‘సప్లై చైన్’పై ఈ ‘ఘర్షణ’ ప్రభావం పడలేదని అన్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య సైనిక ఘర్షణల తరువాత చమురు ధరలు సోమవారం బ్యారెల్కు దాదాపు 3 డాలర్లు పెరిగాయి. అయితే సరఫరా అంతరాయాలపై ఆందోళనలు అక్కర్లేదన్న వార్తలతో కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు. ముడి చమురు ధరలు పెరిగితే అది ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్లోబల్ మార్కెట్లు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయని నేను భావిస్తున్నాను. సరఫరా మార్గాలకు అంతరాయం కలగకపోతే, భారత్ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తుందని భావిస్తున్నాను. పెరుగుతున్న జనాభా, క్షీణిస్తున్న వనరులు, పర్యావరణ క్షీణత, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరల వంటి అన్ని అంశాలు ప్రస్తుత ప్రపంచం ముందు సవాళ్లుగా ఉన్నాయి. భారత్ ఇంధన డిమాండ్ విపరీతంగా వృద్ధి చెందుతోంది. భవిష్యత్ ఆర్థిక వృద్ధిలో ఇంధనం కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే.. భారత్ చమురు వినియోగంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం. మూడవ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారు. నాల్గవ అతిపెద్ద ఎన్ఎన్జీ దిగుమతిదారు, నాల్గవ అతిపెద్ద రిఫైనర్. నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కలిగి ఉన్న దేశం. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధిలో భారత్ 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్! భారత్ 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతనూ చక్రవర్తి తెలిపారు. బలమైన వినియోగం, ఎగుమతులు ఇందుకు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి దాదాపు 6.3 శాతంగా, ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా చూస్తే, జీడీపీ వృద్ధి రేటు దాదాపు 12 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ తరహా వృద్ధి వేగం కొన్నాళ్లు కొనసాగితే, 2045–50 నాటికి 21,000 డాలర్ల తలసరి ఆదాయంతో భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని కేపీఎంజీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అన్నారు. -
ఓట్ల పండుగ.. రూ.కోట్లు పిండేద్దాం
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ గతేడాది నుంచి ప్రత్యేక సందర్భాల్లో ‘చాలెంజ్’పేరుతో సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. గత దసరా, దీపావళి సమయాల్లో ఫెస్టివల్ చాలెంజ్, ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు వంద రోజుల చాలెంజ్లను నిర్వహించింది. ఇప్పుడు దసరా, దీపావళి, కార్తీకమాసం, శబరిమలై అయ్యప్ప దర్శనం, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతిలను పురస్కరించుకుని అక్టోబరు 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 16వరకు ‘100 రోజుల చాలెంజ్’ను నిర్వహిస్తోంది. ఆయా సందర్భాల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించేలా చూడటంతోపాటు, వీలైనన్ని ఎక్కువ బస్సులను రోడ్కెక్కించటం, ఎక్కువ కిలోమీటర్లు తిప్పటం లక్ష్యం. ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భాల జాబితాలో ఎన్నికలు కూడా చేరాయి. ఈమేరకు అన్ని డిపోలకూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సమయంలోఏం చేస్తారంటే? ♦ ఎన్నికల సభలకు అద్దెకు బస్సులు: ప్రచారంలో రాజకీయ పార్టీలకు బహిరంగసభలు కీలకం. ఆ సభలకు జనాన్ని తరలించేందుకు వాహనాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ ఎక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయో ముందుగానే తెలుసుకుని ఆ సభలకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు బుక్ అయ్యేలా చూడాలి. ♦ నగరంలో ఏ ప్రాంత ప్రజలు ఎక్కడో గుర్తింపు: నగరంలో ఉండే ఓటర్లలో చాలామంది ఓటు హక్కు వేరే నియోజకవర్గాల్లో ఉంటుంది. పోలింగ్ రోజు వారు ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఏ నియోజకవర్గం ఓటర్లు నగరంలోని ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారో గుర్తించాలి. వారిని సొంత నియోజకవర్గాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకునేలా ఆయా నియోజకవర్గ నేతలతో మాట్లాడి ఒప్పించాలి. ♦ ప్రచార సామగ్రి కోసం బస్సులు: ప్రచారంలో కీలకమైన సామగ్రిని తరలించేందుకు నేతలు వాహనాలను బుక్ చేసుకుంటారు. ఆర్టీసీ బస్సులను అందుకు బుక్ చేసేలా వారితో మాట్లాడి ఒప్పించాలి. ♦ ఓటర్లూ బస్సులే ఎక్కాలి: వేరే ప్రాంతాల్లో ఉండే ఓటర్లు పోలింగ్ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ప్రాంతానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులనే ఎ క్కేలా చూడాలి. ఇందుకు ప్రచారం చేయటంతోపాటు, కీలక పాయింట్ల వద్ద స్టాఫ్ ఉండి దీనిని సుసాధ్యం చేయాలి. ♦ ఈవీఎంలు, సిబ్బంది తరలింపునకు బస్సులు: పోలింగ్ సిబ్బంది, ఈవీఎంల తరలింపునకు ఎన్నికల సంఘం వాహనాలను బుక్ చేసుకుంటుంది. అందుకు ఆర్టీసీ బస్సులే బుక్ అయ్యేలా చూడాలి. గతేడాది దసరా, దీపావళి సమయాల్లో ఆర్టీసీ రూ.1360.69 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎన్నికల నేపథ్యంలో ఈసారి గతేడాది కంటే కనీసం 10 శాతం ఆదాయం పెరగాలన్నది సంస్థ లక్ష్యం. -
పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
-
మెగా పొలిటికల్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ కు కైకలూరు ఎమ్మెల్యే ఛాలెంజ్
-
కేటీఆర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
-
పవన్, లోకేష్ కు అనిల్ కుమార్ ఛాలెంజ్..
-
24 గంటల కరెంటు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టాడని, ఆయన హామీ నమ్మి లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే ఎండిపోతున్నాయని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి 14 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదన్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు తాను సవాల్ విసురుతున్నానని, ఏ సబ్స్టేషన్ వద్దకు రమ్మంటారో చెపితే వస్తానని, అక్కడ 24 గంటలు కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉండే ఈ నెలరోజుల పాటైనా రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్ని స్కీములు పెట్టినా జనం నమ్మే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ కాంగ్రెస్ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూసేందుకు బీఆర్ఎస్ నేతలు వస్తానంటే ప్రత్యేక విమానం పెట్టి తీసుకెళ్తామని, మంత్రివర్గం వచి్చనా ఫర్వాలేదన్నారు. పథకాల అమలును వివరించేందుకు సీఎం కేసీఆర్ రావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహా్వ నించాలని కోరుతానని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ.60 కోట్లు దళిత బంధు పథకానికి సంబంధించిన ఒక్క తుంగతుర్తి ఎమ్మెల్యే అకౌంట్లోకే రూ. 60 కోట్లు వెళ్లాయని కోమటిరెడ్డి ఆరోపించారు. దళితబంధులో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ముతోనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయవచ్చని చెప్పారు. అధికారంలోకి వచి్చన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీ స్కీంలను అమలు చేస్తామనీ, అమలు చేయలేకపోతే దిగిపోతామన్నారు. బాబు అరెస్టు ఎపిసోడ్ ఫాలో కావడం లేదు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ను తాను ఫాలో కావడం లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యా నించారు. టీవీ చూస్తున్నప్పుడు ఆ వార్తలు వస్తు న్నా చానల్ మారుస్తున్నానని, తమ బాధలు తమకున్నాయని, తెలంగాణలో అధికారం దక్కించుకోవడమెలా అనే దానిపైనే దృష్టి పెట్టినట్లు చెప్పా రు. తాను 30 స్థానాల్లో గెలిపించడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు ఎలా తీసుకురావాలన్న దానిపైనే ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్లోకి చేరికలపై మాట్లాడుతూ పార్టీ అంతర్గత వ్యవహారాలను బయట మాట్లాడబోనని, వచ్చే నెల 1న ఢిల్లీలో జరిగే సమావేశంలోనే అన్ని విషయాలను మాట్లాడుతానని వెల్లడించారు. -
దమ్ముంటే హైదరాబాద్ లో పోటీ చేయండి..రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్
-
సుప్రీంకోర్టులో కృష్ణమోహన్రెడ్డికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: బండ్ల కృష్ణమోహన్రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కృష్ణమోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టులో ఎందుకు వాదనలు వినిపించలే దని ధర్మాసనం కృష్ణమోహన్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సుందరాన్ని ప్రశ్నించింది. పిటిషనర్ సంతకం ఫోర్జరీ చేసి నోటీసులు అందినట్లు హైకో ర్టును మభ్యపెట్టారని, తామెక్కడా వివరాలు దాచ లేదని సుందరం తెలిపారు. అఫిడవిట్లో ఫిక్స్డ్ డిపాజిట్లు అని మాత్రమే ఉందని, సేవింగ్స్ ఖాతా ల గురించి కాదన్నారు. అయితే, సేవింగ్స్ ఖాతాల గురించి వెల్లడించకపోవడం తప్పేనని తెలి పారు. మొత్తం ఆరు ఖాతాలకు సంబంధించి వివా దం చేశారని అందులో తొలి మూడు వివాదరహిత మని చెప్పారు. వివాదాస్పద రూ.1.80 కోట్లు వ్యవ సాయ భూమికి సంబంధించినవని, ఎన్నికలకు ముందుగానే ఆ భూమి అమ్మి వేసినట్లు వివరించారు. ఎన్నికల చట్టాలకు సంబంధించి అన్ని ఖాతాల వివ రాలు వెల్లడించాల్సిందేనని డీకే అరుణ తరఫు సీని యర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలిపారు. డీకే అరుణను ఎమ్మె ల్యేగా గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫి కేషన్ ఇచ్చినట్లు ధర్మాస నం దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఎన్నికల సంఘం, ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ తేదీ వీలైనంత త్వరగా ఇవ్వాలని రవిశంకర్ కోరగా విచారణ నాలుగు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. వెన్నుపోటు రాజకీయాలు: కృష్ణమోహన్రెడ్డి ప్రజా క్షేత్రంలో గెలవలేకనే ఫోర్జరీ సంతకాలతో వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యే కావాలని డీకే అరుణ చూస్తున్నారని బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కృష్ణమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు నోటీసులు అందలేని అందుకే హైకోర్టుకు వెళ్లలేదన్నారు. తన సంతకం ఫోర్జరీ చేశారని తెలిసి తమ వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థించినా వినలేదన్నారు. ఎన్నికలకు ముందుగానే కొన్ని భూములు విక్రయించానని, వివరాలు అఫిడవిట్లో చూపాల్సిన అవసరం లేదన్నారు.