CSK
-
సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై అద్భుత విజయం
-
పెళ్లి బంధంలో అడుగుపెట్టిన మహీశ్ తీక్షణ.. అమ్మాయి ఎవరంటే? (ఫొటోలు)
-
IPL 2025: ఆ యువ ఆటగాడి విషయంలో సీఎస్కే తప్పు చేసిందా..?
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే పేరు క్రికెట్ సర్కిల్స్లో బాగా నానింది. మాత్రే టాలెంట్కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ముగ్దుడయ్యాడని బాగా ప్రచారం జరిగింది. మెగా వేలానికి ముందు సీఎస్కే మాత్రేను ట్రయిల్స్కు కూడా పిలిచిందని సోషల్మీడియా కోడై కూసింది. అయితే చివరకు మాత్రేను మెగా వేలంలో సీఎస్కే కాని మరే ఇతర ఫ్రాంచైజీ కాని పట్టించుకోలేదు. ఈ 17 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ వేలంలో అన్ సోల్డ్గా మిగిలిపోయాడు.ఇదంతా సరే, ఇప్పుడు మాత్రే ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా..? సీఎస్కే ఆశ చూపించి పట్టించుకోకుండా వదిలిపెట్టిన మాత్రే, ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో మాత్రే ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసి 3 వికెట్లు తీశాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో మాత్రే ఆల్రౌండ్ ప్రదర్శనతో (67 నాటౌట్; 1/19) ఇరగదీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మాత్రే తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఇతన్ని ఎందుకు వదులుకున్నామా అని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుండవచ్చు. మాత్రే వద్ద బంతిని బలంగా బాదే సామర్థ్యం ఉండటంతో పాటు మాంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. ఇతను సీఎస్కేలో ఉంటే ఓపెనర్గా అద్భుతాలు చేసే ఆస్కారం ఉండేది. ఏది ఏమైనా సీఎస్కే మాత్రేను దక్కించుకోలేకపోవడం అన్ లక్కీనే అని చెప్పాలి. మరోవైపు మాత్రే సహచరుడు, ఓపెనింగ్ పార్ట్నర్ వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. సూర్యవంశీని ఆర్ఆర్ 1.1 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా (13) సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మాత్రేలానే సూర్యవంశీ కూడా మంచి హిట్టర్. ఇంకా చెప్పాలంటే మాత్రే కంటే బలమైన హిట్టర్. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ మాత్రేతో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో సూర్యవంశీ 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ వేస్తాడు. -
హ్యాట్రిక్ తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. డకౌటైన పాండ్యా బ్రదర్స్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. బరోడాతో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ గోపాల్ ఈ ఘనత సాధించాడు. గోపాల్ సాధించిన హ్యాట్రిక్లో టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వికెట్లు ఉన్నాయి. పాండ్యా సోదరులను గోపాల్ ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్కు పంపాడు. వరుస బంతుల్లో గోపాల్.. హార్దిక్, కృనాల్ వికెట్లతో పాటు శాశ్వత్ రావత్ వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్లో గోపాల్ మొత్తం నాలుగు వికెట్లు తీశాడు. గోపాల్ బంతితో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్లో కర్ణాటక ఓటమిపాలైంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అభినవ్ మనోహర్ (34 బంతుల్లో 56; 6 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించాడు. స్మరన్ రవిచంద్రన్ (38), కృష్ణణ్ శ్రీజిత్ (22), శ్రేయస్ గోపాల్ (18), మనీశ్ పాండే (10) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి విఫలమయ్యాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, అతీత్ సేథ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. లుక్మన్ మేరీవాలా, ఆకాశ్ మహారాజ్ సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా.. శ్రేయస్ గోపాల్ (4-0-19-4) దెబ్బకు మధ్యలో ఇబ్బంది పడింది. 15 పరుగుల వ్యవధిలో గోపాల్ నాలుగు కీలకమైన వికెట్లు తీశాడు. అయితే శివాలిక్ శర్మ (22), విష్ణు సోలంకి (28 నాటౌట్), అతీత్ సేథ్ (6 నాటౌట్) కలిసి బరోడాను విజయతీరాలకు చేర్చారు. మరో ఏడు బంతులు మిగిలుండగానే బరోడా లక్ష్యాన్ని చేరుకుంది (6 వికెట్లు కోల్పోయి). బరోడా ఇన్నింగ్స్లో శాశ్వత్ రావత్ (63), భాను పూనియా (42) రాణించారు.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్ గోపాల్ను చెన్నై సూపర్ కింగ్స్ 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గోపాల్ గతంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. గోపాల్కు ఐపీఎల్లోనూ హ్యాట్రిక్ తీసిన ఘనత ఉంది. -
CSK లెజెండ్ సురేష్ రైనా ఫ్యామిలీ ఫొటోస్..మీరు ఒక్క లుక్ వేయండి
-
నా భర్త ఎక్కుడున్నా!..నా హృదయం మాత్రం ఆ జట్టుతోనే: టీమిండియా స్టార్ భార్య(ఫొటోలు)
-
IPL 2025: సీఎస్కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ 17 ఏళ్ల ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రేపై కన్నేసినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. సీఎస్కే మేనేజ్మెంట్ అతి త్వరలోనే మాత్రేను సెలెక్షన్ ట్రయిల్ రమ్మని పిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే మాత్రే వచ్చే సీజన్లో సీఎస్కే తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మాత్రే బ్యాటింగ్ స్కిల్స్పై సీఎస్కే స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. సీఎస్కే మేనేజ్మెంట్ వేలంలో మాత్రేను సొంతం చేసుకుని రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఓపెనర్గా పంపాలని భావిస్తుందట.సీఎస్కే దృష్టిలో పడ్డ తర్వాత మాత్రే రంజీ ట్రోఫీలో ఓ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సర్వీసెస్తో జరుగుతున్న మ్యాచ్లో మాత్రే అద్భుతమై సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మాత్రే 127 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా బ్యాటర్లు అజింక్య రహానే (19), శ్రేయస్ అయ్యర్ (47) తక్కువ స్కోర్లకే ఔటైన వేళ మాత్రే మెరుపు సెంచరీతో అలరించాడు. రెండో రోజు టీ విరామం సమయానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మాత్రేతో పాటు ఆకాశ్ ఆనంద్ (1) క్రీజ్లో ఉన్నాడు. సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ముంబై ఇంకా 52 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 240 పరుగులకు ఆలౌటైంది. సర్వీసెస్ ఇన్నింగ్స్లో మోహిత్ అహ్లావత్ (76), రోహిల్లా (56) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో రెండు వికెట్లు, జునెద్ ఖాన్, హిమాన్షు సింగ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఇరానీ కప్తో అరంగేట్రం..17 ఏళ్ల మాత్రే ఈ ఏడాది అక్టోబర్లో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. మాత్రే ముంబై తరఫున ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్లు ఆడి రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 400 పైచిలుకు పరుగులు చేశాడు. -
CSK స్టార్స్ ఒలింపిక్స్లో ఈ ఈవెంట్లలో పోటీపడితే?.. (ఫొటోలు)
-
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కేదార్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని కొద్ది సేపటి కిందట ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కేదార్.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన కేదార్కు వైవిధ్యభరితమైన బౌలర్గా గుర్తింపు ఉంది. 39 ఏళ్ల కేదార్కు ఐపీఎల్లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. 2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ఐపీఎల్ కెరీర్లో 95 మ్యాచ్లు ఆడి 123.1 స్ట్రయిక్రేట్తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న కేదార్కు సీఎస్కే తరఫున ఆడినప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. ధోని నాయకత్వంలో కేదార్ పలు మ్యాచ్ల్లో సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. Thank you all For your love and support throughout my Career from 1500 hrs Consider me as retired from all forms of cricket— IamKedar (@JadhavKedar) June 3, 20242020 ఫిబ్రవరిలో (న్యూజిలాండ్ పర్యటనలో) జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడిన కేదార్ 2019 వన్డే ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కేదార్.. తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 1500 గంటల కెరీర్లో నాకు మద్దతు నిలిచి, నాపై ప్రేమ చూపిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్డ్గా పరిగణించండి అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. -
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
-
Play Offs లోకి ఆర్సిబీ
-
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
-
చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..
-
CSK vs RR: గెలిచేదెవరు?
-
సీఎస్కేకు షాకిచ్చిన గుజరాత్.. ఘన విజయం
-
పంజాబ్కు బ్రేకులు వేసిన సీఎస్కే
-
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
-
ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్.. రాత్రి మ్యాచ్లో లక్నో, కేకేఆర్ తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్కు ధర్మశాల మైదానం వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ లక్నో హోం గ్రౌండ్ అటల్ బిహారీ స్టేడియంలో జరుగనుంది.పంజాబ్, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే సీఎస్కే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్, 12న రాజస్థాన్ రాయల్స్, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్ ఈ మ్యాచ్తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. టెక్నికల్గా పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్ల్లో పంజాబ్.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్ రాయల్స్ (మే 15), సన్రైజర్స్ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్కే 15, పంజాబ్ 14 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్లో పంజాబ్ సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, రిలీ రోసోవ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్దీప్ సింగ్].సీఎస్కే: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్పాండే. [ఇంపాక్ట్ సబ్: మతీష పతిరణ]లక్నో-కేకేఆర్ మ్యాచ్ విషచయానికొస్తే.. ఇరు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఏడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. లక్నో 10లో 6 మ్యాచ్లు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ తదుపరి ఆడబోయే నాలుగు మ్యాచ్ల్లో మరో రెండు మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించనుండగా.. లక్నో నాలుగులో కనీసం మూడు మ్యాచ్లైనా గెలిస్తే ఫ్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. లక్నో నాలుగులో మూడింట గెలిస్తే ఇతర జట్ల జయాపజయాలతో పని లేకుండా సేఫ్గా ఫైనల్ ఫోర్కు చేరుకుంటుంది.కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ (మే 11), గుజరాత్ (మే 13), రాజస్థాన్ రాయల్స్తో (మే 19) తలపడాల్సి ఉండగా.. లక్నో సన్రైజర్స్ (మే 8), ఢిల్లీ (మే 14), ముంబై ఇండియన్స్ (మే 17) జట్లను ఢీకొట్టాల్సి ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. లక్నోపై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 3, లక్నో ఒక మ్యాచ్లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరసారిగా జరిగిన మ్యాచ్లో కూడా కేకేఆరే పైచేయి సాధించింది. ఏప్రిల్ 14న జరిగిన ఆ మ్యాచ్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది.తుది జట్లు (అంచనా)..లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్కేకేఆర్: ఫిలిప్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి -
చెన్నైని ఢీకొట్టనున్న పంజాబ్
-
సన్రైజర్స్ను చిత్తు చేసిన సీఎస్కే
-
ఐపీఎల్లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్లు.. రెండూ భారీ సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 28) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్లో గుజరాత్, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్రైజర్స్, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్ ఇవాళ రెండూ భారీ మ్యాచ్లనే షెడ్యూల్ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే..పేపర్పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్కీపర్), శుభ్మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్లో పటిష్టమైన సన్రైజర్స్ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లోనే ఇది బిగ్ ఫైట్గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ మూడో స్థానంలో.. సీఎస్కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే 14, సన్రైజర్స్ 6 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్]సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ సబ్: శార్దూల్ ఠాకూర్] -
LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్ను నిందిస్తారా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్కు పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవ్జ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. Ambati Rayudu - Poor field placements in deaths overs by Ruturaj. We clearly saw lack of experience as captainN. Sidhu - If you credit Dhoni for CSK wins then blame him for the losses too. Dhoni is still the main think tank#LSGvsCSK #CSKvLSG #CSKvsLSG pic.twitter.com/R4VnEwWUKY— Richard Kettleborough (@RichKettle07) April 24, 2024 తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్ విధ్వంసకర మూడ్లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ మెరుపులకు శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్కే భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్.. పూరన్, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్ బౌలింగ్లో ప్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
అదరగొట్టిన రాహుల్.. చెన్నైపై లక్నో పైచేయి
-
IPL 2024: ధోని బాగా ఆడాలి.. కానీ, మ్యాచ్ మాత్రం మేమే గెలవాలి..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రేపు (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే లక్నోకు చేరుకున్నాయి. ఇరు జట్లు ప్రాక్టీస్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో నిన్నటి నుంచే లక్నోకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. నగరంలో ఎక్కడ చూసినా మ్యాచ్కు సంబంధించిన హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఓ హోర్డింగ్పై రాసిన కంటెంట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ ఆ హోర్డింగ్పై ఏముందంటే.. ధోని బాగా ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ మ్యాచ్ మాత్రం ఎల్ఎస్జీనే గెలవాలని ఉంది. Lucknow welcomes MS Dhoni. - The Craze is unmatched 💥 pic.twitter.com/b7WUge2bQw — Johns. (@CricCrazyJohns) April 18, 2024 ఈ కంటెంట్ చూస్తే లక్నో అభిమానులకు సైతం ధోనిపై ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్దమవుతుంది. ఐపీఎల్ కోసం ధోని ఎక్కడికి వెళ్లినా ఇలాంటి క్రేజే కనిపిస్తుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి చాలా కాలమైనా అభిమానులు ఇంకా అతన్ని నామాన్నే జపిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇంచుమించు ఒకటే తరహా ప్రదర్శనలతో ముందుకు పోతున్నాయి. లక్నోతో పోలిస్తే సీఎస్కే ఓ అడుగు ముందుంది. సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించగా.. లక్నో ఆరింట మూడు మ్యాచ్ల్లో గెలుపొందింది. ప్రస్తుతం సీఎస్కే మూడు, లక్నో ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్, న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. గాయం కారణంగా సీజన్ తొలి ఆరు మ్యాచ్లకు దూరమైన కాన్వే.. ఇప్పుడు సీజన్ మొత్తానికే దూరం కావడం ఆ జట్టుపై పెను ప్రభావం పడనుంది. కాన్వే గత రెండు సీజన్లుగా సీఎస్కేలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. సీఎస్కే మరో టైటిల్ దిశగా అడుగులు వేసే క్రమంలో కాన్వే లాంటి ఆటగాడు అందుబాటు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలను బాగా దెబ్బతీస్తుంది. కాన్వే సీజన్ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్ 18) అధికారికంగా ప్రకటించింది. కాన్వేకు ప్రత్యామ్నాయంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. గ్లీసన్ను సీఎస్కే కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా, సీఎస్కే ప్రస్తుత సీజన్లో 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. కొత్త సారధి రుతురాజ్ సారధ్యంలో సీఎస్కే గత రెండు మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించింది. ఈ జట్టు రేపు (ఏప్రిల్ 19) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ సీజన్లో సీఎస్కే ఇంకా ఎనిమిది మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మరో నాలుగు మ్యాచ్లు గెలిస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. Richard Gleeson - The new Super King🦁pic.twitter.com/ZPvNldEqLw — CricTracker (@Cricketracker) April 18, 2024 Welcome To CSK, RICHARD GLEESON 🦁💛 Dismissed Rohit Sharma, Virat Kohli and Rishabh Pant within his first eight balls on debut. 🔥pic.twitter.com/rF7FAnSskk — 🜲 (@balltamperrer) April 18, 2024 -
IPL 2024: 150 కొట్టిన సీఎస్కే.. ఇంకో రెండేస్తే ప్రపంచ రికార్డు
పొట్టి క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘనత సాధించింది. ఈ ఫార్మాట్లో సీఎస్కే 150 విజయాల మైలురాయిని తాకింది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో 150 విజయాలను పూర్తి చేసుకుంది. పొట్టి క్రికెట్ చరిత్రలో సీఎస్కేకు ముందు సహచర ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే 150 విజయాల మైలురాయిని తాకింది. టీ20 ఫార్మాట్లో ముంబై ఇండియన్స్ 273 మ్యాచ్ల్లో 151 విజయాలు సాధించగా.. సీఎస్కే 255 మ్యాచ్ల్లో 150 విజయాలు నమోదు చేసింది. ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. ముంబై, సీఎస్కే జట్లు ఇప్పటివరకు చెరి ఐదేసి ఐపీఎల్ టైటిళ్లు సాధించాయి. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై, సీఎస్కే తర్వాత టీమిండియా ఉంది. ఈ ఫార్మాట్లో భారత క్రికెట్ జట్టు 219 మ్యాచ్ల్లో 140 విజయాలు సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ధోని సుడిగాలి ఇన్నింగ్స్తో శివాలెత్తిపోయాడు. ఇన్నింగ్స్లో చివరి నాలుగు బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో సీఎస్కే మొత్తంగా 26 పరుగులు రాబట్టింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ మెరుపు సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదం తొక్కినప్పటికీ లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. -
ముంబైకి చుక్కలు చూపించిన సీఎస్కే.. ఘన విజయం
-
IPL 2024 MI VS CSK: చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో బ్యాటింగ్కు దిగిన ధోని చివరి నాలుగు బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్య వేసిన ఈ ఓవర్లో శివాలెత్తిపోయిన ధోని.. హ్యాట్రిక్ సిక్సర్లు బాది జట్టు స్కోర్ను 200 పరుగులు దాటించాడు. DO NOT MISS MSD 🤝 Hat-trick of Sixes 🤝 Wankhede going berserk Sit back & enjoy the LEGEND spreading joy & beyond 💛 😍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/SuRErWrQTG — IndianPremierLeague (@IPL) April 14, 2024 అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టినప్పటికీ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని ఆఖరి ఓవర్లో చేసిన 20 పరుగులే ముంబై, సీఎస్కే స్కోర్లకు వ్యత్యాసం కావడం విశేషం. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. కాగా, ఈ మ్యాచ్లో తన బ్యాట్ నుంచి జాలువారిన సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా ధోని మరోసారి చరిత్రపుటల్లోకెక్కాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా సునీల్ నరైన్, నికోలస్ పూరన్ తర్వాత మూడో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్లో మరో నాలుగు బంతులు మిగిలుండగా బరిలోకి దిగిన ధోని 3, 4, 5 బంతులను సిక్సర్లుగా మలిచి, ఆఖరి బంతికి రెండు పరుగులు తీశాడు. హార్దిక్ వేసిన ఈ ఓవర్లో సీఎస్కే ఏకంగా 26 పరుగులు పిండుకుంది. ఈ ఓవరే ముంబై ఇండియన్స్ కొంప ముంచిందని అభిమానులు అనుకుంటున్నారు. ధోని సీఎస్కే తరఫున తన 250 మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. -
IPL 2024: చిరకాలం గుర్తుండిపోయే శతకం.. సంబురాలకు దూరంగా ఉన్న రోహిత్
ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న మూడో సెంచరీ నమోదైంది. ఈ ఎడిషన్లో విరాట్ కోహ్లి, జోస్ బట్లర్ ఇప్పటివరకు సెంచరీలు చేయగా.. తాజాగా రోహిత్ శర్మ వీరి సరసన చేరాడు. సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ మూడంకెల స్కోర్ను చేరుకున్నాడు. రోహిత్ బ్యాట్ నుంచి చాలాకాలం తర్వాత జాలువారిన శతకం ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ శర్మకు ఇది చాలా ప్రత్యేకం. అడపాదడపా ఫామ్.. వయసు మీద పడటం.. కెప్టెన్సీ పోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో హిట్మ్యాన్ తన సొంత మైదానంలో సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. రోహిత్ సెంచరీతో ముంబై అభిమానులు మురిసిపోయారు. ఈ సెంచరీ రోహిత్కు సైతం చిరకాలం గుర్తుండిపోతుంది. రోహిత్ బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే వాంఖడే స్టేడియంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. అభిమానుల కేరింతులు, చప్పట్ల ధ్వనులతో స్టేడియం మార్మోగిపోయింది. ప్రత్యర్ది డగౌట్ సహా స్టేడియం మొత్తం హిట్మ్యాన్కు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే హిట్మ్యాన్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సంబురాలకు దూరంగా ఉన్నాడు. యావత్ క్రికెట్ ప్రపంచం తన సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటుంటే హిట్మ్యాన్ మాత్రం తన సహజ శైలి భిన్నంగా సైలెంట్గా ఉన్నాడు. ROHIT SHARMA, A HUNDRED TO REMEMBER FOREVER. 🫡 What a fightback, Lone Warrior for MI. pic.twitter.com/neT5HwxiO7 — Johns. (@CricCrazyJohns) April 14, 2024 రోహిత్ ముఖంలో సాధించానన్న కసి కనిపించినప్పటికీ అది బయట పడకుండా చాలా ఉద్వేగంగా కనిపించాడు. సెంచరీ అనంతరం రోహిత్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న మొహమ్మద్ నబీతో కరచాలనం చేసి నామమాత్రంగా బ్యాట్ను పైకి లేపాడు. ఇంతకు మించి రోహిత్ ఏ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ముంబై ఓటమి అప్పటికే ఖరారు కావడంతో రోహిత్ మిన్నకుండిపోయాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. 🔥RO X RUTHLESS 🔥pic.twitter.com/jUpTjLPQXx — CricTracker (@Cricketracker) April 14, 2024 హిట్మ్యాన్ యాటిట్యూడ్ను అంతా ప్రశంశిస్తున్నారు. ఎంత సాధించినా ఒదిగి ఉండటం అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు రోహిత్ సెంచరీని తప్పుబడుతున్నారు. హిట్మ్యాన్ సెంచరీ కోసం చాలా స్వార్దంగా బ్యాటింగ్ చేశాడని అంటున్నారు. అందుకే ఈ మ్యాచ్లో ముంబై ఓడిందని అంటున్నారు. రోహిత్ సెంచరీ కోసం కాకుండా తన సహజ శైలిలో బ్యాటింగ్ చేసుంటే ముంబై గెలిచుండేదని చర్చించుకుంటున్నారు. భారీ లక్ష్య ఛేదనలో (207) ఇలాగేనా బ్యాటింగ్ చేసేదంటూ రోహిత్ వ్యతిరేకులు పేలిపోతున్నారు. ఈ మ్యాచ్లో తాము ఓడినా రోహిత్ శర్మ సెంచరీ తృప్తినిచ్చిందని ముంబై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్లో ముంబై సీఎస్కే చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ధోని (4 బంతుల్లో 20 నాటటౌ్; 3 సిక్సర్లు) హార్దిక్ పాండ్య బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్ల బాదడంతో సీఎస్కే 200 పరుగుల మార్కును దాటింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టినప్పటికీ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోని ఆఖరి ఓవర్లో చేసిన 20 పరుగులే ముంబై ఓటమికి కారణమయ్యాయని నెటిజన్లు అనుకుంటున్నారు. 4 వికెట్లు తీసిన పతిరణ ముంబై ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. -
ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ ప్రివ్యూ
-
ఐపీఎల్లో నేడు రెండు బిగ్ ఫైట్స్
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 14) రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో కేకేఆర్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్ ముంబైలోని వాంఖడేలో జరుగనుంది. మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే.. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో.. పటిష్టమైన కేకేఆర్ను వారి సొంత మైదానంలో ఢీకొట్టబోతుంది. ప్రస్తుతం లక్నో 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్ ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో సీఎస్కే చేతిలో పరాజయంపాలైంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. ముంబై, సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ను అభిమానులు క్రికెట్ ఎల్ క్లాసికోగా (సమవుజ్జీల సమరం) పిలుస్తారు. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ రెండు వరుస విజయాలతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ తమ జైత్రయాత్రను స్టార్ట్ చేసింది. 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్లు జరగగా ముంబై 20, సీఎస్కే 16 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. -
సొంతగడ్డపై చెలరేగిన సీఎస్కే.. కేకేఆర్ చిత్తు
-
IPL 2024 CSK VS KKR: ధోని రికార్డు సమం చేసిన జడేజా
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ (4-0-18-3) చేసి సీఎస్కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (67 నాటౌట్) ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. Ravindra Jadeja - The Game Changer of CSK with ball. 🔥pic.twitter.com/HsyMhbDsTJ — Johns. (@CricCrazyJohns) April 8, 2024 బంతితో అద్భుతమైన ప్రదర్శనకు గాను జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్లో ధోని సైతం సీఎస్కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ధోని, జడ్డూల తర్వాత సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), మైక్ హస్సీ (10) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ.. వైరల్ వీడియో
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎస్కే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సొంత అభిమానులనే ఆటపట్టించాడు. సీఎస్కే లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. జడ్డూ ధోని కంటే ముందే బ్యాటింగ్కు దిగుతున్నట్లు ప్రాంక్ చేసి ఫ్యాన్స్ను టీజ్ చేశాడు. సీఎస్కే గెలుపు ఖరారైన దశలో శివమ్ దూబే ఔట్ కాగా.. ఆ దశలో ధోని బ్యాటింగ్కు దిగాల్సి ఉంది. అయితే జడ్డూ ధోని కంటే ముందే బరిలోకి దిగుతున్నట్లు నటించి అభిమానులను టీజ్ చేశాడు. కొంత దూరం వెళ్లి అభిమానులు కేకలు పెట్టడంతో జడ్డూ తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. అనంతరం ధోని బరిలోకి దిగి జట్టును విజయతీరాలకు చేర్చడంలో భాగమయ్యాడు. జడ్డూ సరదాగా చేసిన ఈ పని నవ్వులు పూయించింది. స్టేడియంలో ఉన్నవారంతా కాసేపు తనివితీరా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. Ravindra Jadeja teased the Chepauk crowd by coming ahead of MS Dhoni then going back. 🤣 - This is amazing!! ❤️👌 pic.twitter.com/KPp4FewM17 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2024 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. We thought it was a Prank by Jadeja but it was a Prank from Thala to Fans. Look How all Teammates enjoying it 😂💛 pic.twitter.com/YrzQbP7WNV — 🎰 (@StanMSD) April 9, 2024 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
భారీ షాట్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో తొలి రెండు మ్యాచ్లలో గెలుపొందిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత రెండు మ్యాచ్లలో ఓటమిపాలైంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్లో సన్రైజర్స్ చేతిలో పరాజయాలు చవిచూసింది. ఫలితంగా నాలుగు పాయింట్ల వద్ద నిలిచిపోయి పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై గెలుపొంది తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం సీఎస్కే ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు కనువిందు చేసే ఓ వీడియోను షేర్ చేసింది చెన్నై ఫ్రాంఛైజీ. ఇందులో మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ల వర్షం కురిపించడం చూడవచ్చు. నెట్ ప్రాక్టీస్లో భాగంగా బ్యాటింగ్ చేసిన ధోని ఫుల్ జోష్లో కనిపించాడు. ఉత్సాహంగా బంతులు ఎదుర్కొంటూ భారీ షాట్లు బాదాడు. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో తలా కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోతున్నారు. కాగా చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే- కేకేఆర్ మధ్య రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు ఇరవై ఎనిమిదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. చెన్నై 18సార్లు గెలుపొందింది. చెపాక్లో పదిసార్లు ఎదురుపడగా ఏకంగా ఏడుసార్లు విజయం సాధించింది. ఓవరాల్గా కేకేఆర్పై చెన్నైదే పైచేయి! తుదిజట్ల అంచనా సీఎస్కే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్య రహానె, శివమ్ దూబే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ/ మిచెల్ శాంట్నర్, ఎంఎస్ ధోని, దీపక్ చహర్, తుషార్ దేశ్ పాండే, మహీష్ తీక్షణ [ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్: ముఖేష్ చౌదరి] కేకేఆర్ సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి [ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్: సుయాష్ శర్మ]. చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్ 📍Chennai Sound 🔛🎙️ 𝙅𝙪𝙨𝙩 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 𝙩𝙝𝙞𝙣𝙜𝙨 😎#TATAIPL | #CSKvKKR pic.twitter.com/7CPnrl9Ysa — IndianPremierLeague (@IPL) April 8, 2024 -
భారత కెప్టెన్గా అతడి స్థాయిని ఎవరూ అందుకోలేరు: గంభీర్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు కెప్టెన్గా ధోని సాధించిన ఘనతలను అందుకోవడం ఇక ముందు ఎవరికీ సాధ్యం కాదనడంలో సందేహం లేదన్నాడు. టీమిండియా కెప్టెన్గా ఎవరెన్ని విజయాలు సాధించినా ధోని మూడు ఐసీసీ ట్రోఫీల ముందు దిగదుడుపేనని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్)- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య సోమవారం మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కేతో పోరును తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. అప్పుడు కెప్టెన్గా.. ఇప్పుడు మెంటార్గా ఇందులో ఎటువంటి మార్పులేదన్నాడు. సీఎస్కేపై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక ధోని గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘నేను ఈ మ్యాచ్ గెలవాలనే కోరుకుంటున్నాను. నేనే కాదు.. నా స్థానంలో ధోని ఉన్నా తన జట్టే గెలవాలని కోరుకుంటాడు. స్నేహితులుగా ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంది. అంతమాత్రాన పోటీ పడటంలో ఎవరూ తగ్గరు కదా!.. ఏదేమైనా టీమిండియా కెప్టెన్గా ధోని మాదిరి మరెవరూ విజయవంతం కాలేదన్నది నిజం. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం మామూలు విషయం కాదు. కొంతమంది భారత కెప్టెన్లు విదేశాల్లో చారిత్రక విజయాలు సాధించవచ్చు.. మరికొందరు టెస్టు మ్యాచ్లలో గెలిపించవచ్చు. అయినా మూడు ఐసీసీ ట్రోఫీల కంటే అవేమీ పెద్దవి కావు’’ అని గంభీర్.. ధోని నాయకత్వ నైపుణ్యాలను కొనియాడాడు. కాగా ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్కప్-2007, వన్డే ప్రపంచకప్-2011 గెలిచిన భారత జట్టులో గంభీర్ సభ్యుడన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ ఫైనల్లో 75, వన్డే ఫార్మాట్ ఫైనల్లో 97 పరుగులు చేసి ఈ ట్రోఫీలు గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఎల్లప్పుడూ ధోనిని ఏదో రకంగా విమర్శించే ఈ కేకేఆర్ మెంటార్ ఈసారి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. కాగా కేకేఆర్ సారథిగా సీఎస్కేతో 11సార్లు పోటీపడ్డ గంభీర్ ఐదుసార్లు గెలిచాడు. 2012 ఫైనల్లో సీఎస్కేను ఓడించి టైటిల్ గెలిచాడు కూడా! View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
#Dhoni: కమిన్స్కు ‘షాకిచ్చిన’ ప్రేక్షకులు.. అట్లుంటది ధోనితోని!
IPL 2024- SRH vs CSK- Dhoni Entry Viral Video: మహేంద్ర సింగ్ ధోని.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు హైదరాబాద్ ప్రేక్షకులు. తలా మైదానంలో అడుగుపెట్టగానే ఆరెంజ్ ఆర్మీ సైతం ధోని నామస్మరణతో అభిమానం చాటుకుంది. ఇక సీఎస్కే ఫ్యాన్స్ తమ జెండాలు రెపరెపలాడిస్తూ ధోనికి ఘన స్వాగతం పలికారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ధోని ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్- సన్రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ అందమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. Overwhelming Yellove! Chaala Thanks, Hyderabad! 🥳💛#SRHvCSK #WhistlePodu 🦁💛 pic.twitter.com/nZIYuBrbdA — Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2024 ఇక ధోని క్రేజ్ను చూసి సన్రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఆశ్చర్యపోయాడు. తమ సొంతమైదానంలో సీఎస్కే స్టార్కు ప్రేక్షకులు స్వాగతం పలికిన తీరును తాను ముందెన్నడూ చూడలేదన్నాడు. ధోని బ్యాటింగ్కు రాగానే.. మైదానం దద్దరిల్లిపోయిందని.. ఇంత వరకూ తాను అంత శబ్దం ఎప్పుడూ వినలేదంటూ ధోని క్రేజ్కు ఫిదా అయ్యాడు. కాగా శుక్రవారం ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్.. సీఎస్కేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. స్లో వికెట్పై పరుగులు తీసేందుకు చెన్నై బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (12), రుతురాజ్ గైక్వాడ్(26) నిరాశపరచగా.. అజింక్య రహానే(35) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, శివం దూబే మాత్రం(24 బంతుల్లో 45) తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఐదో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా(23 బంతుల్లో 31) నాటౌట్గా నిలవగా.. ఏడో స్థానంలో డారిల్ మిచెల్(13) దిగడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, నటరాజన్ బౌలింగ్లో మిచెల్ అవుట్ కాగానే ధోని ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. From Orange 🧡, To Yellow 💛 For MS Dhoni 🫶🏻 ft. Hyderabad #TATAIPL | #SRHvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/iGYeoxxCvi — IndianPremierLeague (@IPL) April 6, 2024 తలా అలా గ్రౌండ్లో అడుగుపెట్టగానే కేరింతలతో ఉప్పల్ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ధోని ఒక్క పరుగు చేసి అజేయంగా నిలిచాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేయగా.. సన్రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఏదేమైనా ధోని ఎంట్రీ ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. వైజాగ్లో వింటేజ్ ధోని విధ్వంసం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్-2024లో ధోని తొలిసారి బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టాడు. There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO — JioCinema (@JioCinema) March 31, 2024 చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? 2024? 2005? 🤔#DCvCSK #WhistlePodu #Yellove🦁💛pic.twitter.com/T6tWdWO5lh — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సొంత మైదానంలో వరుసగా రెండో విజయం
-
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
సాక్షి,హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. టాటా ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి క్రికెట్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కావడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్న్యూస్ -
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
ఉప్పల్ దంగల్ : హైదరాబాద్ Vs చెన్నై మ్యాచ్కు సర్వం సిద్ధం (ఫొటోలు)
-
DC vs CSK: విశాఖలో ఉర్రూతలే!
విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విశాఖ నగరానికి మళ్లీ వచ్చేసింది. వైఎస్సార్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, చైన్నె సూపర్కింగ్స్ జట్లు తలపడనున్నాయి. విజయపరంపరను కొనసాగించేందుకు సీఎస్కే పట్టుదలగా ఉండగా హోమ్గ్రౌండ్లో విజయంతో శుభారంభం చేయడానికి డీసీ జట్టు ప్రణాళిక రచించింది. 2019 ఐపీఎల్ సీజన్ నాకవుట్లో క్వాలిఫైయిర్ మ్యాచ్ విశాఖ వేదికగా జరగ్గా ముఖాముఖీ పోరులో డీసీపై సీఎస్కే జట్టు విజయం సాధించిన విషయం విదితమే. మళ్లీ ఇప్పుడు మ్యాచ్ జరగనుండడంతో మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. శనివారం ఇరు జట్ల ప్లేయర్లు గ్రౌండ్లో సుదీర్ఘ సమయం సాధన చేశాయి. ఇక అభిమానులు అసలు పోరును ఆస్వాదించడమే తరువాయి. గంటలోనే మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోగా శనివారం సైతం ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్లను ఫిజికల్ టికెట్లగా స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా అభిమానులు రిడీమ్ చేసుకున్నారు. స్టేడియంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సీఎస్కే జట్టు ఫ్రాంచైజీ అధినేతతో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్రెడ్డి, నగర సీపీ రవిశంకర్ కాసేపు ముచ్చటించారు. మ్యాచ్ ఏర్పాట్లు, భద్రత చర్యల గురించి చర్చించారు. నేడు ట్రాఫిక్ మళ్లింపు విశాఖ సిటీ: ఐపీఎల్ మ్యాచ్కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం జరగనున్న మ్యాచ్కు 28 వేల మంది వీక్షకులు స్టేడియానికి వచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు తగ్గట్టుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు భద్రతా చర్యలతో పాటు మరోవైపు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వైపు ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. మ్యాచ్తో సంబంధం లేని వాహనదారులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు ప్రయాణించకుండా వేరే మార్గాలలో ప్రయాణించాలని సూచించారు. -
నువ్వా నేనా..కొత్త కెప్టెన్స్ పోరు..
-
కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ బ్రో.. ఇంత అందాన్ని మర్చిపోయారా?
కోలీవుడ్ భామ ఇటీవలే హనుమాన్ సినిమాతో అలరించారు. తేజ సజ్జాకు అక్కా పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. గతేడాది టాలీవుడ్లో వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. అయితే గతంలో చాలా ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి దాటవేస్తూ వచ్చిన బ్యూటీ.. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్కు షాకిచ్చింది. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ అనే వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెనే లేడీ విలన్గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ మ్యాచ్లో తళుక్కున మెరిసింది. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో వరలక్ష్మి సందడి చేసింది. చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్లో వరలక్ష్మి నిలబడి మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ మ్యాచ్లో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టారు.. ఈ అందాన్ని గుర్తించడం ఎలా మరిచిపోయారు? అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Cameraman ka focus Aaj kahan hai 🙄🤪Itna glamor nahi notice kiya ? pic.twitter.com/bJqvmluOo8 — aCute 📐 (@chaoticalm_090) March 26, 2024 -
IPL 2024: సీఎస్కే శుభారంభం చేసిందిలా!
-
IPL 2024: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ముందడుగు పడింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల కోసం సంకేత భాష మరియు వివరణాత్మక వ్యాఖ్యానాన్ని అందించనున్నారు. చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల సౌకర్యార్దం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఈ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఈ తరహా వ్యాఖ్యానం అమల్లోకి రానుంది. ఈ నూతన ఒరవడిని అమల్లో పెట్టేందుకు ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ఇండియా సైనింగ్ హ్యాండ్స్ (ISH) న్యూస్తో చేతులు కలిపింది. ఐఎస్హెడ్ నిపుణుల ఆధ్వర్యంలో ఫీడ్ను భారతీయ సంకేత భాషను ఉపయోగించి బాల్ టు బాల్ అప్డేట్స్ ఇస్తామని స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. సంకేత బాష ఫీడ్తో పాటు సాధారణ వెర్బల్ స్కోర్ అప్డేట్స్ కూడా ఉంటాయని పేర్కొంది. ఈ వెసులుబాటుతో చెవిటి, దృష్టి లోపం ఉన్న క్రికెట్ అభిమానులు గేమ్లోని ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
ఇంకో సూపర్ రికార్డుకు చేరువలో ధోని!
ఆర్సీబీతో మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనిను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో ధోని మరో 43 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. సీఎస్కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా చలామణి అవుతున్నాడు. రైనా సీఎస్కే తరఫున 5529 పరుగులు చేశాడు. రైనా తర్వాత ఈ మైలురాయిని అందుకునేందుకు ధోని రెడీగా ఉన్నాడు. ధోని సీఎస్కే తరఫున మొత్తం 4957 పరుగులు సాధించాడు. ఇందులో ఐపీఎల్లో చేసినవి 4508 పరుగులు కాగా.. ఛాంపియన్స్ లీగ్లో చేసినవి 449 పరుగులు. రైనా, ధోని తర్వాత సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నాడు. డుప్లెసిస్ సీఎస్కే తరఫున 2932 పరుగులు చేశాడు. ఇతని తర్వాత మైక్ హస్సీ (2213), మురళీ విజయ్ (2105) సీఎస్కే తరఫున 2000 పరుగుల మార్కును దాటిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ధోని తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. సీఎస్కే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్కు ధోనినే స్వయంగా కెప్టెన్గా ప్రమోట్ చేశాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయం ఆఖరి నిమిషం వరకు సీఎస్కే యాజమాన్యానికి కూడా తెలియకపోవడం కొసమెరుపు. -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
MS Dhoni: సరిరారు నీకెవ్వరూ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కెప్టెన్గా ధోని శకం నేటితో ముగిసింది. సీఎస్కే సారధ్య బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన ధోని.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ పేరును ప్రకటించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో రుతు సీఎస్కేను ముందుండి నడిపించనున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టుకు కెప్టెన్ హోదాలో ధోని ఐపీఎల్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. ఐపీఎల్ ఆల్టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న ధోని కెరీర్పై లుక్కేస్తే... 42 ఏళ్ల ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఐదు సార్లు ఛాంపియన్గా (2010, 2011, 2018, 2021, 2023) నిలబెట్టాడు. మరో ఐదుసార్లు రన్నరప్గా (2008, 2012, 2013, 2015, 2019) టైటిల్కు అడుగు దూరం వరకు తీసుకెళ్లాడు. 2016లో ధోని రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జట్టుకు కూడా కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్లో ధోని గణాంకాలు.. మ్యాచ్లు: 250 పరుగులు: 5082 అత్యధిక స్కోర్: 2019లో ఆర్సీబీపై 48 బంతుల్లో 84 నాటౌట్ శతకాలు: 0 అర్దశతకాలు: 22 సిక్సర్లు: 239 ఫోర్లు: 349 వికెట్కీపర్గా.. మ్యాచ్లు: 243 138 క్యాచ్లు 42 స్టంపింగ్లు ఐపీఎల్లో కెప్టెన్గా ధోని గణాంకాలు.. మ్యాచ్లు: 226 పరుగులు: 4660 అత్యధిక స్కోర్: 2019లో ఆర్సీబీపై 48 బంతుల్లో 84 నాటౌట్ శతకాలు: 0 అర్దశతకాలు: 22 సిక్సర్లు: 218 ఫోర్లు: 320 కెప్టెన్ హోదాలో వికెట్కీపర్గా.. మ్యాచ్లు: 226 128 క్యాచ్లు 39 స్టంపింగ్లు ఐపీఎల్లో కెప్టెన్గా ధోని రికార్డు.. మ్యాచ్లు: 226 విజయాలు: 133 పరాజయాలు: 91 టై అయినవి: 0 ఫలితం తేలనివి: 2 సీఎస్కే కెప్టెన్గా ధోని రికార్డు.. మ్యాచ్లు: 212 విజయాలు: 128 పరాజయాలు: 82 టై అయినవి: 0 ఫలితం తేలనివి: 2 -
కెప్టెన్ల విషయంలో ఐపీఎల్ 2024 చాలా ప్రత్యేకం.. మూడేళ్ల క్రితం..!
కెప్టెన్ల విషయంలో ఐపీఎల్ 2024కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సీజన్లో కెప్టెన్లుగా వ్యవహరించనున్న వారిలో ముగ్గురికి (గిల్, కమిన్స్, రుతురాజ్) ఇప్పటివరకు కెప్టెన్గా పని చేసిన అనుభవం లేదు. పది మంది కెప్టెన్లలో సగం మంది 30 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఈ సీజన్ అతి పెద్ద వయస్కుడైన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ) కాగా.. అతి చిన్న వయస్కుడిగా శుభ్మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) ఉన్నాడు. ప్రస్తుత కెప్టెన్లలో ఎవరూ కూడా మూడేళ్ల కిందట ఆయా జట్లకు కెప్టెన్లుగా లేకపోవడం అన్నింటికంటే ప్రత్యేకం. The captains photoshoot video. 📸🏆pic.twitter.com/jDPkEsod2O— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2024 ప్రస్తుత కెప్టెన్లలో శ్రేయస్ అయ్యర్ అందరి కంటే అనుభవజ్ఞుడు. అయ్యర్ కేకేఆర్ను 55 మ్యాచ్ల్లో ముందుండి నడిపించాడు. ఆతర్వాత కేఎల్ రాహుల్ (లక్నోను 51 మ్యాచ్ల్లో), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్ను 45 మ్యాచ్ల్లో), హార్దిక్ పాండ్యా (గుజరాత్ను 31 మ్యాచ్ల్లో), రిషబ్ పంత్ (ఢిల్లీని 30 మ్యాచ్ల్లో), డుప్లెసిస్ (ఆర్సీబీని 27 మ్యాచ్ల్లో), శిఖర్ ధవన్ (పంజాబ్ను 22 మ్యాచ్ల్లో) సీనియర్లుగా ఉన్నారు. కాగా, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ రేపటి నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. చదవండి: IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ధోని స్థానంలో కొత్త కెప్టెన్ -
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ధోని స్థానంలో కొత్త కెప్టెన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ ప్రారంభానికి ముందు రోజు ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసింది. ధోని ఇష్టపూర్వకంగానే కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. కాగా, కెప్టెన్సీ నుంచి తప్పుకునే విషయాన్ని ధోని కొద్ది రోజుల ముందే పరోక్షంగా వెల్లడించాడు. 2024 సీజన్లో తనను కొత్త పాత్రలో చూడబోతున్నారంటూ లీకులు ఇచ్చాడు. అంతిమంగా ధోని చెప్పిందే నిజమైంది. అతని స్థానంలో యువ నాయకుడు రుతురాజ్ సీఎస్కేను ముందుండి నడిపించనున్నాడు. ఇదిలా ఉంటే, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా..? కెప్టెన్సీని స్వచ్ఛందంగా రుతురాజ్కు బదిలీ చేసిన ధోని.. రేపటి నుంచి ప్రారంభంకాబోయే సీజన్లో సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే.. తమ సొంత మైదానమైన చెపాక్లో ఆర్సీబీతో తలపడనుంది. విశ్లేషకుల అభిప్రాయం మేరకు.. దిగ్గజ ధోని తన ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలికేందుకు ఇంతకంటే అనువైన సందర్భమేముంటుంది. సొంత మైదానం.. ఛాలెంజింగ్ ప్రత్యర్ధి.. రేపటి మ్యాచ్లో ధోని బరిలోకి దిగి తన క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పే అవకాశముంది. రిటైరయ్యాక ధోని సీఎస్కే మెంటార్గా కొనసాగవచ్చు. 2019 నుంచి సీఎస్కేతోనే.. సీఎస్కే నూతన కెప్టెన్ రుతురాజ్ 2019 నుంచి ఈ ఫ్రాంచైజీతోనే ఉన్నాడు. రుతు సీఎస్కే తరఫున 52 మ్యాచ్లు ఆడి 135.5 స్ట్రయిక్రేట్తో సెంచరీ, 14 హాఫ్ సెంచరీల సాయంతో 1797 పరుగులు చేశాడు. 2021లో రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. ఆ సీజన్లో సీఎస్కే నాలుగో సారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచింది. 27 ఏళ్ల రతురాజ్ టీమిండియా తరఫున 6 వన్డేలు, 19 టీ20లు ఆడి సెంచరీ, 4 హాఫ్ సెంచరీల సాయంతో 615 పరుగులు చేశాడు. రుతురాజ్ మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. -
IPL 2024: ఆర్సీబీతో మ్యాచ్కు ముందు సీఎస్కేకు భారీ షాక్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్, శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరణ లీగ్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సందర్భంగా పతిరణ గాయపడ్డాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో పతిరణకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇవ్వలేదు. పతిరణ త్వరలోనే గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తుంది. సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కేకు ఇది రెండో ఎదురుదెబ్బ. కొద్ది రోజుల ముందు ఈ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వే కూడా గాయం కారణంగా లీగ్కు (మే వరకు) దూరమయ్యాడు. సీఎస్కే యాజమాన్యానికి కాన్వే స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సమస్య కానప్పటికీ.. పతిరణ స్థానాన్ని భర్తీ చేయడమే పెద్ద తలనొప్పిగా మారింది. కాన్వే స్థానంలో అతని దేశానికే చెందిన రచిన్ రవీంద్ర ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారు కాగా.. పతిరణ స్థానం కోసం బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్, మొయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తున్నారు. ముస్తాఫిజుర్ కూడా డెత్ ఓవర్స్ స్పెషలిస్టే కావడంతో సీఎస్కే యాజమాన్యం ఇతని వైపే మొగ్గు చూపవచ్చు. సీఎస్కే తొలి మ్యాచ్కు వేదిక అయిన చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో మొయిన్ అలీ పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ధోని, బౌలింగ్ కోచ్ బ్రావో.. శార్దూల్ ఠాకూర్వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభ మ్యాచ్లో సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపు (మార్చి 22) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024: సూపర్ కింగ్స్తో బెంగళూరు తొలి పోరు.. బోణీ కొట్టేది ఎవరు?
క్రికెట్ అభిమానులు ఏంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 సమరానికి సమయం అసన్నమైంది. మరో 24 గంటల్లో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుది. తొలి మ్యాచే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందనించనుంది. మార్చి 22న చెపాక్ వేదికగా జరగనున్న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు ఊవ్విళ్లరూతున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దం చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్లో తిరిగులేని జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరోసారి తమ సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ ఏడాది సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనున్న సీఎస్కే.. ప్రత్యర్ధి జట్లను చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాగా సీఎస్కే ప్రధాన బలం ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని. ఎటువంటి క్లిష్ట పరిస్థితులోనైనా ప్రత్యర్ధి జట్టును తన వ్యూహాలతో చిత్తు చేయడం ధోని స్పెషల్. ఇప్పటికే రికార్డు స్ధాయిలో ఐదు సార్లు సీఎస్కేను విజేతగా నిలిపాడు. ఇప్పుడు ఆరోసారి తన జట్టుకు టైటిల్ను అందించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నాడు. ఇక సీఎస్కే బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే దూరం కావడం సీఎస్కేను కాస్త కలవరపెట్టే విషయం అనే చెప్పుకోవాలి. గతేడాది సీఎస్కే ఛాంపియన్స్గా నిలవడంలో కాన్వేది కీలక పాత్ర. కాగా కాన్వే స్ధానాన్ని మరో కివీ స్టార్ రచిన్ రవీంద్ర భర్తీ చేసే ఛాన్స్ ఉంది. వేలంలో రవీంద్రతో పాటు డార్లీ మిచెల్ను సీఎస్కే కొనుగోలు చేసింది. కాబట్టి కాన్వే లేని లోటు వీరిద్దరిలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశముంది. రవీంద్ర, రుత్రాజ్ గైక్వాడ్ కలిసి చెన్నై ఇన్నింగ్స్ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా మిడిలార్డర్లో రహానే, దుబే వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. గత సీజన్లో వీరిద్దరూ అద్బుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఆఖరిలో ధోని, జడేజా వంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. అంతేకాకుండా శార్ధూల్ ఠాకూర్ మళ్లీ సీఎస్కేలో రావడం ఆ జట్టుకు కలిసిచ్చే ఆంశం. శార్ధూల్కు బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. కాగా ఈ ఏడాది సీజన్లో బౌలింగ్ పరంగా సీఎస్కే కాస్త వీక్గా కన్పిస్తోంది. గతేడాది సీజన్లో అదరగొట్టిన యువ పేసర్ మతీషా పతిరాన గాయం కారణంగా ఐపీఎల్-2024కు దూరమయ్యాడు. అతడు దూరం కావడం సీఎస్కే నిజంగా గట్టి ఎదురుదెబ్బే. ప్రస్తుత సీఎస్కే జట్టులో పెద్దగా అనుభవమున్న బౌలర్ ఒక్కడు కూడా కన్పించడం లేదు. ముస్తిఫిజర్ రెహ్మన్, థీక్షణ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో వారి ప్రదర్శన అంతంతమాత్రమే. కాబట్టి మరోసారి భారత యువ బౌలర్లు ముఖేష్ చౌదరి, సిమ్రాజత్ సింగ్పై సీఎస్కే ఆధారపడే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ.. గత 16 ఏళ్ల టైటిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ప్రతీ సీజన్లోనూ జట్టు నిండా స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీని ఆర్సీబీ ముద్దాడలేకపోయింది. ఈ సారి ఎలాగైనా గెలిచి తమ 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ప్రతీసీజన్లానే ఈ సారి కూడా ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లతో కూడా కలకలడుతోంది. బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఫాప్ డుప్లెసిస్,విరాట్ కోహ్లి, మ్యాక్స్వెల్, గ్రీన్, విల్ జాక్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో సిరాజ్, టోప్లీ జోషఫ్, ఫెర్గూసన్, టామ్ కుర్రాన్ వంటి వరల్డ్క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే ఆర్సీబీలో మాత్రం చెప్పుకోదగ్గ స్పిన్నర్ మాత్రం లేడు. హెడ్ టూ హెడ్ రికార్డులు.. ఈ క్యాష్రిచ్ లీగ్లో ఆర్సీబీపై సీఎస్కే అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. కాగా మ్యాచ్ జరిగే చెపాక్లో మాత్రం ఆర్సీబీకి చెత్త రికార్డు ఉంది. చెపాక్ లో చెన్నై జట్టుపై ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలిచి.. 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. -
IPL 2024: సీఎస్కేతో మ్యాచ్.. భారీ రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లి
ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. ఈ బిగ్ ఫైట్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పలు భారీ రికార్డులపై కన్నేశాడు. అవేంటంటే.. సీఎస్కేతో మ్యాచ్లో విరాట్ మరో 6 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 11994 పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్ తర్వాత రోహిత్ శర్మ (11156), శిఖర్ ధవన్ (9645) ఉన్నారు. ఈ మ్యాచ్లో విరాట్ మరో క్యాచ్ పడితే టీ20ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్.. సురేశ్ రైనాతో కలిసి టాప్లో ఉన్నాడు. వీరిద్దరు టీ20ల్లో 172 క్యాచ్లు పట్టారు. ఈ మ్యాచ్లో విరాట్ మరో పరుగు చేస్తే సీఎస్కేపై 1000 పరుగుల మార్కును తాకుతాడు. ఈ మ్యాచ్లో విరాట్ మరో 4 క్యాచ్లు పడితే ఐపీఎల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 106 క్యాచ్లు ఉండగా.. రైనా 109 క్యాచ్లతో టాప్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్లో సీఎస్కేపై 10 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ మ్యాచ్లో విరాట్ మరో 124 పరుగులు చేస్తే టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ముష్ఫికర్ రహీం (ఢాకాలో 3239 పరుగులు) విరాట్ కోహ్లి (బెంగళూరులో 3116) అలెక్స్ హేల్స్ (నాటింగ్హమ్లో 3036) -
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. -
IPL 2024: ఆర్సీబీపై సీఎస్కేదే ఆధిపత్యం.. పదహారేళ్లలో..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. సీజన్ ఓపెనర్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. సొంత అడ్డా చెపాక్లో ఏ జట్టుపై అయినా పట్టపగ్గాల్లేని సీఎస్కే.. ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. చెపాక్ ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలిచింది లేదు. చెపాక్ పిచ్ విషయానికొస్తే.. ఈ మైదానం బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. ఇందుకు అక్కడి వాతావరణం కూడా ఓ కారణం. వేసవికాలం రాత్రి వేళల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇదే..!
ఎంఎస్ ధోని వికెట్కీపర్బ్యాటర్ 12 కోట్లు (కెప్టెన్) డెవాన్ కాన్వే బ్యాటర్ కోటి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్ 6 కోట్లు అజింక్య రహానే బ్యాటర్ 50 లక్షలు అజయ్ మండల్ ఆల్ రౌండర్ 20 లక్షలు నిశాంత్ సింధు ఆల్ రౌండర్ 60 లక్షలు మొయిన్ అలీ ఆల్ రౌండర్ 8 కోట్లు శివమ్ దూబే ఆల్ రౌండర్ 4 కోట్లు రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలర్ 1.5 కోట్లు షేక్ రషీద్ బ్యాటర్ 20 లక్షలు మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ 1.9 కోట్లు రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 16 కోట్లు తుషార్ దేశ్పాండే బౌలర్ 20 లక్షలు ముఖేష్ చౌదరి బౌలర్ 20 లక్షలు మతీషా పతిరణ బౌలర్ 20 లక్షలు సిమ్రన్జీత్ సింగ్ బౌలర్ 20 లక్షలు దీపక్ చాహర్ బౌలర్ 14 కోట్లు ప్రశాంత్ సోలంకి బౌలర్ 1.2 కోట్లు మహేశ్ తీక్షణ బౌలర్ 70 లక్షలు రచిన్ రవీంద్ర బ్యాటర్ 1.8 కోట్లు శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ 4 కోట్లు డారిల్ మిచెల్ ఆల్ రౌండర్ 14 కోట్లు సమీర్ రిజ్వీ బ్యాటర్ 8.4 కోట్లు ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలర్ 2 కోట్లు అవినాష్ రావు ఆరవెల్లి కొట్టు 20 లక్షలు స్క్వాడ్ బలం - 25 మిగిలిన పర్స్- కోటి -
Moeen Ali Unseen Photos: ట్రెండింగ్లో ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ (ఫోటోలు)
-
వైరల్గా మారిన అపాయింట్మెంట్ లెటర్.. ధోని నెలజీతం ఎంతంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని కొన్నేళ్ల పాటు క్రికెట్లో అత్యంత ధనవంతమైన(Richest Cricketer) ఆటగాడిగా కొనసాగాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికి ధోని వార్షిక ఆదాయం ప్రస్తుతం సంవత్సరానికి రూ. 1040 కోట్లు ఉండడం విశేషం. ధోని వార్షిక ఆదాయం.. కోహ్లి కంటే(రూ.1050 కోట్లు) కేవలం పది కోట్లు మాత్రమే తక్కువగా ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో బీసీసీఐ కాంట్రాక్ట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న క్రికెటర్గా ధోని రికార్డులకెక్కాడు. ఇక ఆటను మినహాయిస్తే అడ్వర్టైజ్మెంట్స్, ఎండార్స్మెంట్ల రూపంలో వద్దన్నా కోట్లు వచ్చి పడేవి. అలాంటి ధోని క్రికెట్లోకి రాకముందు రైల్వే శాఖలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా(TTE) విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధోని పేరిట 2012కు సంబంధించిన పాత అపాయింట్మెంట్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండియన్ సిమెంట్స్లో వైస్ ప్రెసిడెంట్(ఆఫీస్ కేడర్) పోస్టుకు ధోనిని ఎంపిక చేసినట్లుగా అపాయింట్మెంట్ లెటర్లో ఉంది. ఇక ఈ పోస్టు కింద ధోని నెల జీతం రూ. 43వేలు(రూ.12,650-47,650)గా ఉండడం ఆశ్చర్యపరిచింది. నెలజీతంతో పాటు అదనంగా స్పెషల్ పే కింద రూ 20వేలు, ఫిక్స్డ్ అలెవెన్స్ కింద మరో రూ. 21,970 ఉన్నాయి. ఇవీ గాక HRA(హౌస్ రెంటల్ అలెవెన్స్) కింద రూ.20,400.. స్పెషల్ హౌస్ రెంట్ అలెవెన్స్ కింద మరో రూ.8,400..(సబ్ ప్లాంట్స్లో పనిచేస్తే అదనంగా మరో రూ.8 వేలు).. ఏ బెనిఫిట్స్ లేని స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 60వేలు, న్యూస్పేపర్ ఖర్చుల కింద రూ.175 ఇవ్వనున్నట్లు లెటర్లో పేర్కొన్నారు. మొత్తంగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో ధోని సుమారు రూ. లక్షా 60వేలకు పైగా నెలజీతం రూపంలో అందుకున్నాడు. ఇక ఈ లెటర్ను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) కాగా అప్పటికే వేల కోట్లు సంపాదిస్తున్న ధోని ఈ జాబ్ చేశాడా లేదా అన్నది పక్కనబెడితే.. అప్పటికి టీమిండియా కెప్టెన్గా ఉన్న ధోని బ్రాండ్వాల్యూ ఎంతలా ఉందనేది ఈ లెటర్ చెప్పకనే చెప్పింది. ఇక ఇండియా సిమెంట్స్ ఎవరిదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నై సూపర్కింగ్స్కు ఇండియా సిమెంట్స్ అనుబంధ సంస్థ. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతోనే బంధం కొనసాగిస్తే వస్తోన్న ధోని విజయవంతమైన కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు సీఎస్కేకు ఐదు టైటిల్స్ అందించిన ధోని.. రోహిత్తో(ముంబై ఇండియన్స్)తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. 2010, 2011, 201, 2021లో సీఎస్కేను విజేతగా నిలిపిన ధోని తాజాగా 2023లో సీఎస్కేకు ఐదోసారి టైటిల్ అందించాడు. ఇక 2024 ఐపీఎల్లో ధోని ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. రానున్న తొమ్మిది నెలల్లో వచ్చే సీజన్ ఆడడంపై క్లారిటీ ఇస్తానని(అప్పటివరకు ఫిట్గా ఉంటే) ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని పేర్కొన్నాడు. చదవండి: Shaka Hislop Collapsed Video: లైవ్ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్ Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్ కెరీర్కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ -
ధోని తొలి సినిమా రెడీ! హీరోహీరోయిన్లు, కథ ఏంటంటే?
ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్ ధోని చైన్నెలో తన సతీమణి సాక్షి ధోనితో కలిసి సందడి చేశారు. ఈయన తాజాగా చిత్ర నిర్మాణం రంగంలోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ధోని ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సాక్షి ధోని నిర్మాతగా తొలి ప్రయత్నంగా తమిళంలో ఎల్జీఎం (లెట్స్ గెట్ మ్యారీ)అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ కల్యాణ్, నటి ఇవాన జంటగా నటించిన ఇందులో నదియా, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: నిహారికపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!) ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి సంగీతాన్ని అందిస్తూ, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధోని తమిళంలో చిత్రాన్ని నిర్మించడం గురించి మాట్లాడుతూ మీరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న ఇంట్లో బాస్ ఎవరన్నది అందరికీ తెలిసిందేనన్నారు. తన భార్య చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పారన్నారు. తాను క్రికెట్ క్రీడాకారుడిగా పరిచయం అయ్యింది చైన్నెలోనేననీ, అదేవిధంగా తాను టెస్ట్ హైహెస్ట్ స్కోర్ చేసింది కూడా చైన్నెలోనేని చెప్పారు. తాము నిర్మించిన తొలి చిత్రం కూడా తమిళంలోనే గాని కాబట్టి తనకు చైన్నె చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే తాను 2008లోనే ఐపీఎల్ క్రికెట్ ఆడినప్పుడే చైన్నెతో ఎడాప్ట్ అయినట్టు చెప్పారు. అలా తనకు చైన్నెకు పరస్పర ప్రేమ కారణంగానే తొలిచిత్రాన్ని తమిళంలో నిర్మించినట్లు వివరించారు. చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం ఎల్జీఎం అని చెప్పారు. చిత్ర షూటింగ్కు ముందు యూనిట్ సభ్యులందరూ హ్యాపీగా ఉండాలని భావించానన్నారు. (ఇదీ చదవండి: Bro Movie: ఏంటి ‘బ్రో’.. బేరం కుదర్లేదటగా!) అందుకే యూనిట్ సభ్యులకు రోజూ మంచి ఆహారం అందించాలని, అదేవిధంగా ఏ విషయంలోనైనా ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిపై పునరాలోచన ఉండరాదని నిర్వాహకులకు చెప్పానన్నారు. తల్లి, కాబోయే భార్య మధ్య ఓ యువకుడి ఎదుర్కొనే ఘటనల కథే ఈ చిత్రం అని ధోని చెప్పారు. చిత్రాన్ని నేను తన కూతురితో కలిసి చూసానని చాలా బాగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
MS Dhoni Rare Photos: మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
శతక్కొట్టిన సీఎస్కే మాజీ ప్లేయర్.. తుస్సుమన్న రింకూ సింగ్
దులీప్ ట్రోఫీ 2023లో ఐపీఎల్ ఆటగాళ్ల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓ మాజీ ఆటగాడు సెంచరీతో కదంతొక్కితే.. మరొకరు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. సీఎస్కే మాజీ ఆటగాడు, నార్త్ జోన్ ఓపెనర్ ధృవ్ షోరే సెంచరీతో కదంతొక్కగా.. 2023 సీజన్ కేకేఆర్ స్టార్, సెంట్రల్ జోన్ ఆటగాడు రింకూ సింగ్ (38) ఓ మోస్తరు స్కోర్కే పరిమితమయ్యాడు. బెంగళూరు: భారత క్రికెట్ దేశవాళీ సీజన్ 2023–2024 దులీప్ ట్రోఫీ మ్యాచ్లతో బుధవారం మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో నార్త్ ఈస్ట్ జోన్తో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. 90 ఓవర్లు ఆడిన నార్త్ జోన్ 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఓపెనర్ ధ్రువ్ షోరే (211 బంతుల్లో 136; 22 ఫోర్లు) సెంచరీ సాధించాడు. నిశాంత్ సింధు (113 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్లు), పుల్కిత్ నారంగ్ (23 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. సెంట్రల్ జోన్ 182 ఆలౌట్ ఆలూర్లో ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 71.4 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ (38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈస్ట్ జోన్ బౌలర్ మణిశంకర్ మురాసింగ్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు సాధించింది. -
ధోనిపై 'సిక్సర్ల' దూబే ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సలహాలు, సూచనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు యువ ఆల్రౌండర్ శివమ్ దూబే పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన 16వ సీజన్ ఐపీఎల్లో చెన్నై విజేతగా నిలువడంలో దూబే కీలకంగా వ్యవహరించాడు. భారీ సిక్సర్లకు పెట్టింది పేరైన శివమ్ దూబే ఈ సీజన్లో 16 మ్యాచ్లాడి 158.33 స్ట్రైక్రేట్తో 416 పరుగులు సాధించాడు. కీలకమైన మిడిలార్డర్లో భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విజయాలందించాడు. 'పరిమ్యాచ్ స్పోర్ట్స్'(Parimatch Sports)కు బ్రాండ్అంబాసిడర్గా ఎంపికైన దూబే గురువారం హైదరాబాద్కు విచ్చేశాడు. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ ''గత ఐపీఎల్ సీజన్ అద్భుతంగా సాగింది. చెన్నై జట్టుతో ఈ సీజన్ మరిచిపోని అనుభూతిని మిగిల్చింది. మేనేజ్మెంట్, సహాయక బృందం మద్దతుతో నేను ఈ స్థాయిలో రాణించగలిగాను. కెప్టెన్ ధోనీ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఒత్తిడికి లోనవ్వకుండా ఆటపైన ఎలా దృష్టి సారించాలనేది తెలుసుకున్నా. ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ధోనినే కారణం.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన టీం సభ్యుల గురించి దూబే మాట్లాడుతూ.. అంబటి రాయుడు అపుడప్పుడు మస్తీ చేసినప్పటికి చూడటానికి సీరియస్గా కనిపంచేవాడు.. దీపక్ చాహర్ ప్రాంక్ స్టార్గా అభివర్ణించారు. వ్యక్తిగత ఆట కన్నా బృందంగా రాణించడమే ముఖ్యంగా భావిస్తానని పేర్కొన్నాడు. ఇండియన్ టీంకు ఆడటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని..ఈ ఐపీఎల్ కూడా ఎన్నో మధురజ్ఞ్ఞాపకాలను అందించిందన్నాడు. చదవండి: బ్రెజిల్ ఫుట్బాల్ స్టార్ నేమార్కు ఊహించని షాక్! మిలియన్ డాలర్ ఫైన్ 'మిస్టర్ రజనీ ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావ్!' -
ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేట్ పాపం ఇప్పుడు మాత్రం బస్ కండక్టర్
-
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
ఐపీఎల్ బంధం ముగిసే.. మేజర్ లీగ్ క్రికెట్లో మొదలు
ఇటీవల ఐపీఎల్కు గుడ్బై చెప్పిన భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వచ్చే నెలలో అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్లో బరిలోకి దిగనున్నాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రాయుడు మేజర్ లీగ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఐపీఎల్లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యానిదే టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు. జూలై 13 నుంచి 30 వరకు జరిగే మేజర్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు, లాస్ ఏంజెలిస్ నైట్రైడర్స్, సియాటెల్ ఒర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్ జట్లు కూడా పోటీపడనున్నాయి. ఇక ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న అంబటి రాయుడు 204 మ్యాచ్ల్లో 4238 పరుగులు చేశాడు. చదవండి: వరల్డ్కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు -
'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం'
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది సీఎస్కే ఐదో ఐపీఎల్ టైటిల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే చాలా రోజులకు ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ''టైటిల్ గెలిచిన సంతోషంలో చాలా వైల్డ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలా సెలబ్రేషన్స్లో మునిగిపోయిన మాలో చాలా మంది ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం. మొయిన్ అలీ ఫ్యామిలీతో పాటు.. డ్వేన్ ప్రిటోరియస్ కూడా తర్వాతి రోజు వెళ్లారు. మా బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమోన్స్ కూడా ఫ్లైట్ను క్యాన్సిల్ చేసుకున్నాడు. మేమంతా ఒక రూమ్లో కూర్చొని సెలబ్రేట్ చేసుకోగా.. ధోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ధోనితో కలిసి గడిపిన సమయాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం.'' అంటూ తెలిపాడు. చదవండి: బ్రిజ్భూషణ్పై చార్జ్షీట్ దాఖలు 'నా సక్సెస్లో సగం క్రెడిట్ కేన్మామదే' -
స్కూల్ఫ్రెండ్ను పెళ్లాడనున్న సీఎస్కే స్టార్
సీఎస్కే స్టార్ పేసర్ తుషార్దేశ్ పాండే త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ ఫ్రెండ్ నభా గడ్డంవార్తో సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు పలువురు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు హాజరయ్యారు. తుషార్, నభా ఎంగేజ్మెంట్ ఫొటోను సీఎస్కే బ్యాట్స్మెన్ శివమ్ దూబే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్కూల్ డేస్ నుంచి తుషార్, నభాకు మధ్య పరిచయం ఉందట. నభాతో ఎంగేజ్మెంట్ గురించి తుషార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. స్కూల్ క్రష్ నుంచి తన భార్యగా నభా ప్రమోషన్ పొందనుందని పేర్కొన్నాడు. కొత్త జంటకు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్తో పాలు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను తుషార్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా రూ. 20 లక్షల బేస్ ధరకు తుషార్ దేశ్పాండే ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. తనకు ధరకు పదింతల న్యాయం చేశాడు తుషార్. అద్భుత బౌలింగ్తో అదరగొట్టిన తుషార్ ధోని నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. అద్భుత బౌలింగ్తో చెన్నై కప్ గెలవడంతో తుషార్ దేవ్పాండే తన వంతు పాత్రను పోషించాడు. గత సీజన్లో పెద్దగా అవకాశాలు రాకా బెంచ్కు పరిమితమైన తుషార్ ఈ సీజన్లో మాత్రం చెలరేగిపోయాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Tushar Deshpande (@tushardeshpande96) చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్కప్ కొట్టబోతున్నాం: రోహిత్ -
ధోని సర్జరీ, అసలు విషయం చెప్పిన CSK సీఈఓ..!
-
అదే జరిగితే CSK గెలిచేదే కాదు..!
-
శుభమన్ గిల్, రవీంద్ర జడేజా వద్దు ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
-
జడేజా ఐపీల్ ఫైనల్లో వాడిన బ్యాట్ ఎవరికీ ఇచ్చాడో తెలుసా..!
-
క్రికెటర్ ని పెళ్ళాడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
మోహిత్ కి పాండ్య పాఠాలు చెప్పడం ఏంటి ..!
-
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
ఐపీఎల్ దెబ్బకి లక్షన్నర మొక్కలు..!
-
IPL 2024కి రెడీ 41 ఏళ్ళ వయసు ఆయన తగ్గేదేలే ..!
-
ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు ఇది RR కాదు CSK
-
CSK IPL ట్రోఫీ కి ప్రత్యేక పూజలు..!
-
ధోని నోట రిటైర్మెంట్ మాట ఎప్పటికి క్లారిటీ వచ్చింది..
-
CSK వద్దనుకుంది GT కొనుక్కుంది 20 లక్షలు తీసుకుని చెన్నై పై రెచ్చి పోయడుగా ....
-
'అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ అనంతరం సీఎస్కే స్టార్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా సీఎస్కేలో అంబటి రాయుడు కీలకపాత్ర పోషించాడు. గతంలో సీఎస్కే టైటిల్స్ సాధించడంలోనూ రాయుడు పాత్ర కీలకం. కాగా తన చివరి ఐపీఎల్ మ్యాచ్లోనూ రాయుడు తన ఇంపాక్ట్ చూపించాడు. వర్షంతో 15 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేయడంతో సీఎస్కే బ్యాటర్స్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. ఈ క్రమంలో రాయుడు ఐదో స్థానంలో వచ్చి 8 బంతుల్లో రెండో సిక్సర్లు, ఒక ఫోర్తో 19 పరుగుల దనాధన్ ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. అయితే రాయుడు మెరుపు ఇన్నింగ్స్ సీఎస్కే లక్ష్యాన్ని కరిగించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అంబటి రాయుడుపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడుతో తన అనుబంధాన్ని ధోని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ''మైదానంలో ఉన్నప్పుడు 100 శాతం శ్రమించడం రాయుడు లక్షణం. మేమిద్దరం ఒకప్పుడు ఇండియా ‘ఎ’ తరఫున కలిసి ఆడాం. అటు పేస్ను, ఇటు స్పిన్ను సమర్థంగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. అతను జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయగలడని నేను ఎప్పుడైనా నమ్మేవాడిని. నాలాగే రాయుడుకు కూడా ఎక్కువగా ఫోన్ వాడే అలవాటు లేదు'' అని ధోని అన్నాడు. కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్కింగ్స్కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్తో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 203 మ్యాచ్లాడి 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా చరిత్రకెక్కాడు. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా! -
#MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే విజేతగా నిలవడంపై దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజన్ మొత్తం ధోని నామస్మరణతోనే మార్మోగిపోయింది. సీఎస్కే ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు తండోపతండాలుగా వచ్చేవారు. దీనికి ప్రధాన కారణం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని. ధోని భజన మరీ ఎక్కువైపోయిందన్నా పర్లేదు.. కానీ ఒక విషయం మాత్రం తప్పక తెలుసుకోవాల్సిందే. సీఎస్కే విజేతగా నిలవడంపై మన దేశ అభిమానులే కాదు.. దాయాది దేశం పాకిస్తాన్ అభిమానులు కూడా తెగ సంతోషపడిపోయారు. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్గా నిలిచిన తర్వాత పాకిస్తాన్లో కొన్నిచోట్ల క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. ధోని కటౌట్స్తో వీధుల్లో తిరుగుతూ భారీ ఎత్తున కేక్ కటింగ్స్ నిర్వహించారు. ఈ చర్యతో వైరం అనేది దేశాల మధ్యే కానీ ఆటపై కాదని తెలియజేశారు. ఇక పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రమీజ్ రజా, సక్లెయిన్ ముస్తాక్, షోయబ్ అక్తర్, సయీద్ అన్వర్ సహా మరికొంతమంది సీఎస్కే టీమ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక ధోని టైటిల్ గెలిచిన అనంతరం మాట్లాడుతూ కాస్త ఎమోషన్కు గురయ్యాడు. రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అనిపించినప్పటికి వచ్చే సీజన్ ఆడాలా వద్దా అనే దానిపై మరో ఏడు, ఎనిమిది నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటా. అప్పటికి శరీరం సహకరించి ఫిట్గా ఉంటే అభిమానుల కోసం మరో ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ పేర్కొన్నాడు. చదవండి: ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు! -
ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జడేజా ఆఖర్లో వచ్చి సిక్స్, ఫోర్తో సీఎస్కేకు విజయాన్ని అందించాడు. కాగా సీఎస్కే ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జాబితాలో ముంబై ఇండియన్స్తో కలిసి సీఎస్కే సమంగా నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే.. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని, దీపక్ చహర్ల మధ్య జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీపక్ చహర్ తన షర్ట్పై ఆటోగ్రాఫ్ అడిగితే తొలుత ఇవ్వడానికి ధోని నిరాకరించడం వైరల్గా మారింది. అయితే చహర్ ధోనిని బతిమిలాడడంతో చివరకు షర్ట్పై తన సంతకం చేశాడు. అయితే ఇదంతా సరదా కోసం మాత్రమే. ఎందుకంటే చహర్ అడిగినప్పుడు స్పందించని ధోని.. మళ్లీ చిరునవ్వుతో అతని జెర్సీపై సంతకం చేయడం.. ఆ తర్వాత స్వయంగా ధోనినే చహర్ను హగ్ చేసుకోవడం కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఎంత మంచి రిలేషన్షిప్ ఉందనేది దీన్నబట్టే అర్థమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో శుబ్మన్ గిల్ క్యాచ్ను దీపక్ చహర్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. మూడు పరుగుల వద్ద లభించిన లైఫ్తో గిల్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా చహర్ క్యాచ్ మిస్ చేయడంతోనే ధోని అతనికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించాడని అభిమానులు కామెంట్ చేశారు. MS Dhoni when Deepak Chahar came for Autograph. Their bond is so cute.#ChennaiSuperKings #MSDhoni𓃵 #csk pic.twitter.com/3ggKY2mAFM — MS Dhoni Fan (@dhonizero7) May 30, 2023 చదవండి: డానిల్ మెద్వెదెవ్కు షాక్.. ఐదోసారి కలిసి రాని 'ఫ్రెంచ్' -
ఐపీఎల్ విక్టరీ: ఈ మిరాకిల్ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్ చేసుకుందాం!
సాక్షి,ముంబై: ఐపీఎల్ 2023 టైటిల్ గెల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఫ్రాంచైజీ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రశంసలు కురిపించారు. ఈ అద్భుతం లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మాత్రమే సాధ్యమంటూ కితాబిచ్చారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి జట్టును ఆయన అభినందించారు. ఈ మేరకు మంగళవారు ఉదయం ఆయన ధోనితో మాట్లాడారు. “అద్భుతమైన కెప్టెన్ మీరు. అద్భుతం చేసారు. మీరు మాత్రమే చేయగలరు. మీ టీంని చూసి గర్విస్తున్నాను అంటూ ఆయన ధోనీని అభినందనల్లో ముంచెత్తారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) అంతేకాదు గత కొన్ని రోజులుగా బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్తో అలిసిపోయారు.. విశ్రాంతి తీసుకోండి అంటూ ధోనీకి సలహా ఇచ్చారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు జట్టుతో పాటు చెన్నైకి రావాలని కూడా ఆయన ఆహ్వానించారు. (ఐపీఎల్ చాంపియన్ సీఎస్కే ఓనరు, నికర విలువ ఎంత? విషయాలు తెలుసా?) Mr N Srinivasan, former Chairman of the ICC, former President of BCCI and TNCA, Mrs. Chitra Srinivasan and Mrs Rupa Gurunath present @msdhoni with a special memento commemorating the very special 200th 👏#TATAIPL | #CSKvRR | @ChennaiIPL pic.twitter.com/nixs6qsq2P — IndianPremierLeague (@IPL) April 12, 2023 మరిన్ని బిజినెస్ వార్తల కోసం సాక్షిబిజినెస్ -
CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?
ఐపీఎల్ 2023 టైటిల్ను చెన్నై సూపర్ కింగ్స్ను దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్పై ఘన విజయం సాధించింది. సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చివరి ఓవర్లో పది పరుగులు కావాల్సిన సమయంలో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి జట్టును ఛాంపియన్గా మార్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇండియ ఫస్ట్ స్పోర్ట్స్ యునికార్న్ ఎంటర్ప్రైజ్గా అవతరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడగా నిలిచిన జట్టుగా పేరొందిన సీఎస్కేకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.ఈ క్రమంలో సీఎస్కే యాజమాని ఎవరు, పెట్టుబడి, నికర విలువ ఎంత అనేది విశేషంగా మారింది. ఎన్ శ్రీనివాసన్ సీఎస్కే టీం యజమాని, ప్రముఖ పారిశశ్రామికవేత్త ఎన్ శ్రీనివాసన్. ఈయనకు క్రికెట్తో అనుబంధం చాలా సుదీర్ఘమైందే. అంతర్జాతీయ క్రికెట్ సర్క్యూట్లో పాపులర్ నేమ్. పలు నివేదికల ప్రకారం ప్రస్తుతం నికర నికర విలువ రూ.720 కోట్లుగా తెలుస్తోంది. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్వర్త్ ఎంతో తెలుసా?) ప్రాథమిక విద్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఎన్ శ్రీనివాసన్ చెన్నైలోని లయోలా కాలేజీలో గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) చేశారు. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) క్రికెట్ పరిచయం బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన తర్వాత, శ్రీనివాసన్ 2011లో బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. 2014లో శ్రీనివాసన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ ఎంపిక కావడంతో జగ్మోహన్ దాల్మియా నియమితులయ్యారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్. 2008 సంవత్సరంలో సీఎస్కేను కొనుగోలు చేశారు. దేశంలోని సిమెంట్ పరిశ్రమలో పాపులర్ అయిన ఇండియా సిమెంట్ ఓనర్ కూడా. బీసీసీఐ చీఫ్గా , ఐసీసీ మాజీ ఛైర్మన్గా కూడా పనిచేశారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్) 2016 Born Kids will Never Realise How Combination of Indian Captain MS Dhoni and BCCI President N. Srinivasan Was 💙🇮🇳 pic.twitter.com/t0APYnCvOm — Junaid Khan (@JunaidKhanation) March 29, 2023 చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు శ్రీనివాసన్ 2008లో చెన్నై ఫ్రాంచైజీని (చెన్నై సూపర్ కింగ్స్) సుమారు రూ. 752 కోట్లకు కొనుగోలు చేయడంతో జెంటిల్మన్ గేమ్తో ఆయన రిలేషన్ మరింత బలపడింది. ఫ్రాంచైజీ విలువ ఇప్పుడు దాదాపు సుమారు రూ. 7443 కోట్లుగా ఉంది. ప్రొఫెషనల్ జర్నీ చెన్నైకి చెందిన సిమెంట్ తయారీ కంపెనీ ఇండియా సిమెంట్స్కి కో ఫౌండర్ తండ్రి నారాయణస్వామి తరువాత 1989లో శ్రీనివాసన్ వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు. బొగ్గు ,ముడిసరుకు ధరలపెరుగుదల కారణంగా మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.218 కోట్ల నష్టాన్ని నివేదించింది. ఈక్రమంలోనే తిరునెల్వేలిలో 600 ఎకరాల భూమిని డబ్బు ఆర్జించే దిశగా సంస్థ ఉందని, ఈ ఏడాది (2023)వడ్డీతో సహా రూ. 500 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని భావిస్తున్నట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఐపీఎల్ విజేతగా నిలివడంతో మార్కెట్లో ఇండియా సిమెంట్స్ షేర్ 3 శాతం లాభపడి. 199.50 వద్ద ముగిసింది. Attended the Platinum Jubilee celebrations of India Cements Ltd in Chennai today. India cement has played a crucial role in India’s growth under the leadership of N. Srinivasan Ji. Congratulated the entire team and also released a special postal stamp on this occasion. pic.twitter.com/xpWWj990Ye — Amit Shah (@AmitShah) November 12, 2022 ఇలాంటి ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
బ్యాటింగ్ చేసేది గిల్ అయితే కీపింగ్ చేసేది ధోని...
-
ధోనికి జడేజాకు మధ్య విబేధాలు ఇంకా ప్రూఫ్స్ కావాలా ....!
-
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
ఐపీఎల్ 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్వర్త్ ఎంతో తెలుసా?
క్రికెట్ దిగ్గజం ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 టైటిల్ను చేజిక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో విజేతగా నిలిచి అభిమానులను ఉర్రూత లూగించింది టీం. దీంతో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. The interaction you were waiting for 😉 MS Dhoni has got everyone delighted with his response 😃 #TATAIPL | #Final | #CSKvGT | @msdhoni pic.twitter.com/vEX5I88PGK — IndianPremierLeague (@IPL) May 29, 2023 భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో, క్రికెట్ కరియర్లో అనేక రికార్డులను నమోదుచేసిన ధోని కేవలం గ్రౌండ్లోనే కాదు, వెలుపల కూడా తగ్గేదేలే అంటూ పెర్ఫెక్ట్ బిజినెస్మేన్లా సక్సెస్పుల్గా దూసుకుపోతున్నాడు మాజీ కెప్టెన్ పలు పెట్టుబడులు ప్రసిద్ధ బ్రాండ్ ఎండార్స్మెంట్లతో ఇండియాలో టాప్ రిచెస్ట్ ప్లేయర్గా ఉన్నాడు. ఎంఎస్ ధోని నికర విలువ ఎంత? అంచనాల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నికర విలువ దాదాపు రూ. 1040 కోట్లు. వార్షిక వేతనం, 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అనేక రకాలు పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్తో పాటు, ఐపీఎల్ రెమ్యునరేషన్తో కలిపి మొత్తం ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడు. ఐపీఎల్ టీం సీఎస్కే ద్వారా రూ. 12 కోట్ల ఆదాయం వస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారం గత పదహారు సీజన్లలో ఐపీఎల్ ద్వారా రూ. 178 కోట్లకు పైగా సంపాదించాడు. ఒక విధంగా చెప్పాలంటే అతని మొత్తం సంపాదనలో ఇది చిన్న మొత్తమే. ఖటాబుక్, కార్స్ 24, షాకా హ్యారీ, గరుడ ఏరోస్పేస్ వంటి అనేక వాటిలో ఇన్వెస్టర్గా ఉన్నాడు. ఇంకా ఫిట్నెస్, యాక్టివ్ లైఫ్స్టైల్ బ్రాండ్ సెవెన్లో మెజారిటీ వాటాదారు.సేంద్రీయ వ్యవసాయం, డ్రోన్లు, క్రీడా దుస్తులు, జిమ్ బిజినెస్.. ఇలా మొత్తం కలిపి ప్రతీ ఏడాది రూ. 4 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కోకా కోలా, ఇండియా సిమెంట్స్, డ్రీమ్ 11, గోడాడీ , రీబాక్ వంటి బ్రాండ్లు ఎంఎస్ ఖాతాలో ఉన్నాయి. దీంతోపాటు ఫుట్బాల్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్సి, హాకీ టీమ్ రాంచీ రేస్ , మహి రేసింగ్ టీమ్ ఇండియాలో వాటాలున్నాయి. (ఐపీఎల్ 2023: ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీల సంపాదన ఎంతో తెలుసా?) ధోని సాక్షి ధోని లగ్జరీ లైఫ్ స్టైల్ ధోనీ, అతని భార్య సాక్షి ధోనీ ఇద్దరూ లగ్జరీ వస్తువులు, ఇళ్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జార్ఖండ్లోని రాంచీలో వీరికి ఒక భారీ ఫామ్హౌస్ ఉంది. ఇక్కడే ధోనీ సాక్షి, వారి కుమార్తె జీవాతో నివసిస్తున్నారు, దీని ధర రూ. 10 కోట్ల కంటే ఎక్కువ. దీంతోపాటు జంటకు డెహ్రాడూన్లో రూ. 17.8 కోట్ల ఇల్లు కూడా ఉంది. ఇక ధోనికి కార్లు, బైక్లపై ఉండే పప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కళ్లు చెదిరే కలెక్షన్ అతని సొంతం. హమ్మర్ హెచ్2, ఆడి క్యూ7, మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, మహీంద్రా స్కార్పియో, ఫెరారీ 599 జిటిఓ, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్హాక్, నిస్సాన్ జోంగా, పోంటియాక్ ఫైర్బర్డ్ ట్రాన్స్ ఆమ్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ, హిందుస్తాన్ అంబాటోరోస్, రోల్స్ రాయ్టోర్ల లాంటి ఉన్నాయి. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) ఇది కాకుండా ధోని జీవితం ఆధారంగా తీసిన హిట్ మూవీ 'ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ' ద్వారా దాదాపు రూ. 30 కోట్లు సంపాదించాడు. ఈ మూవీలో రీల్ ధోని పాత్రను దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషించారు. కెప్టెన్ కూల్గా పాపులర్ అయిన ధోని, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే అన్నిరకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే -
చెన్నై పాంచ్ పటాకా
-
550 పరుగుల మార్క్ దాటాడు.. ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్లో సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్పాండే బౌలింగ్లో చెత్త గణాంకాలను నమోదు చేశాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన తుషార్ దేశ్పాండే 56 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాండే బౌలింగ్ను సాయి సుదర్శన్, సాహాలు చీల్చి చెండాడారు. తుషార్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో సాయి సుదర్శన్ ఒక సిక్స్, మూడు ఫోర్లు సహా 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే తుషార్ దేశ్పాండే చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్గా ఫెర్గూసన్తో కలిసి దేశ్పాండే నిలిచాడు. తొలి స్థానంలో షేన్ వాట్సన్-ఆర్సీబీ.. 4 ఓవర్లలో 61/0 (2016 ఫైనల్లో ఎస్ఆర్హెచ్తో), రెండో స్థానంలో లోకీ ఫెర్గూసన్ కేకేఆర్.. 4 ఓవర్లలో 56/0(2021 సీఎస్కేతో ఫైనల్లో) ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అత్యంత చెత్త బౌలర్గా తుషార్ దేశ్పాండే రికార్డులకెక్కాడు. ఈ సీజన్లో తుషార్ దేశ్పాండే 9.92 ఎకానమీ రేటుతో 564 పరుగులు సమర్పించుకొని ఓవరాల్గా తొలి స్థానంలో నిలిచాడు. తుషార్ తర్వాత 2022 సీజన్లో ప్రసిద్ కృష్ణ 8.28 ఎకానమీతో 551 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. 2020 ఐపీఎల్ సీజన్లో కగిసో రబాడ 8.34 ఎకానమీతో 548 పరుగులు సమర్పించుకొని మూడో స్థానంలో, సిద్దార్థ్ కౌల్ 2018లో 8.28 ఎకానమీతో 547 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. ఐదోస్థానంలో డ్వేన్ బ్రావో 2018లో 9.96 ఎకానమీతో 533 పరుగులు సమర్పించుకున్నాడు. Most runs conceded by a bowler in an IPL season: 564 - Tushar Deshpande, 2023 (Eco 9.92) 551 - Prasidh Krishna, 2022 (8.28) 548 - Kagiso Rabada, 2020 (8.34) 547 - Siddarth Kaul, 2018 (8.28) 533 - Dwayne Bravo, 2018 (9.96)#GTvCSK #IPL2023Finals pic.twitter.com/wZTuTZlE3V — Bharath Seervi (@SeerviBharath) May 29, 2023 చదవండి: ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్గా చరిత్ర -
ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్గా చరిత్ర
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ సీఎస్కేతో జరిగిన ఫైనల్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కేవలం నాలుగు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నప్పటికి తన మెరుపులతో ఆకట్టుకున్నాడు. Photo: IPL Twitter అయితే సాయి సుదర్శన్ తన ఇన్నింగ్స్ను నిధానంగా ఆరంభించినప్పటికి అసలు సమయంలో తనలోని డేంజరస్ బ్యాటర్ను వెలికి తీశాడు. సాహా ఔటైన తర్వాత గేర్ మార్చిన సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన తుషార్ దేశ్పాండేకు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో ఒక సిక్సర్ సహా మూడు ఫోర్లు కలిపి 20 పరుగులు పిండుకున్నాడు. 31 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన సాయి సుదర్శన్.. తర్వాతి 16 బంతుల్లోనే 46 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో సాయి సుదర్శన్ ఐపీఎల్లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా సాయి సుదర్శన్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు మనీష్ పాండే 2014 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ తరపున పంజాబ్ కింగ్స్పై 94 పరుగులు చేశాడు. 2012 ఫైనల్లో సీఎస్కేపై కేకేఆర్ తరపున మన్విందర్ బిస్లా 89 పరుగులు చేశాడు. అయితే రజత్ పాటిదార్(ఆర్సీబీ తరపున 112 నాటౌట్ వర్సెస్ కేకేఆర్) సెంచరీ చేసినప్పటికి అది ఫైనల్ మ్యాచ్ కాదు.. ఎలిమినేటర్లో పాటిదార్ సెంచరీ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. అయితే ఫైనల్లో అన్క్యాప్డ్ ప్లేయర్గా అత్యధిక పరుగులు చేసిన ఘనతను సాయి సుదర్శన్ దక్కించుకున్నాడు. Photo: IPL Twitter ► ఇక ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్గా సాయి సుదర్శన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇంతకముందు షేన్ వాట్సన్ 117 పరుగులు నాటౌట్(2018లో ఎస్ఆర్హెచ్తో ఫైనల్లో) తొలి స్థానంలో, రెండో స్థానంలో సీఎస్కే తరపున వృద్ధిమాన్ సాహా 115 పరుగులు పంజాబ్ కింగ్స్ తరపున, 2014లో కేకేఆర్పై ఫైనల్లో, మురళీ విజయ్ 95 పరుగులు(సీఎస్కే), మనీష్ పాండే(94 పరుగులు, కేకేఆర్) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ ఫైనల్లో 50 ప్లస్ స్కోరు చేసిన రెండో యంగెస్ట్ బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇవాళ సీఎస్కేతో ఫైనల్లో (47 బంతుల్లో 96 పరుగులు) 21 ఏళ్ల 226 రోజుల వయసులో సుదర్శన్ ఈ ఫీట్ సాధించాడు. తొలి స్థానంలో మనన్ వోహ్రా 2014లో 20 ఏళ్ల 318 రోజుల వయసులో; శుబ్మన్ గిల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో(2021లో సీఎస్కేతో జరిగిన ఫైనల్లో కేకేఆర్ తరపున) మూడో స్థానంలో, రిషబ్ పంత్ 23 ఏళ్ల 37 రోజుల వయసులో(2020లో ముంబై ఇండియన్స్తో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున) నాలుగో స్థానంలో ఉన్నాడు. Sai Sudharsan masterclass in the IPL 2023 Final. pic.twitter.com/SiRywPhOqz — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 చదవండి: శుబ్మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్గా -
శుబ్మన్ గిల్ చరిత్ర.. టీమిండియా తరపున రెండో బ్యాటర్గా
ఐపీఎల్ 16వ సీజన్ శుబ్మన్ గిల్కు ఎప్పటికి గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ కొడుతుందో లేదో తెలియదు కానీ గిల్కు మాత్రం కెరీర్లో బెస్ట్ టోర్నీగా మిగిలిపోతుంది. సోమవారం సీఎస్కేతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో నాలుగో సెంచరీ బాదుతాడని గుజరాత్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికి ధోని సూపర్ ఫాస్ట్ స్టంపింగ్కు 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్కు తెరపడినట్లయింది. ఈ క్రమంలో ఆరెంజ్ క్యాప్ అందుకోనున్ను శుబ్మన్ గిల్ ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు అందుకున్న రెండో భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ సీజన్లో గిల్ 17 మ్యాచ్లు ఆడి 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు సహా నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. ఇక ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కింగ్ కోహ్లి పేరిట ఉంది. 2016 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున కోహ్లి 973 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ కోహ్లి చేసిన పరుగులే అత్యుత్తమం. ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. తొలి టీమిండియా బ్యాటర్గానూ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లి, గిల్ తర్వాత జాస్ బట్లర్ 863 పరుగులు(రాజస్తాన్ రాయల్స్, 2022), డేవిడ్ వార్నర్ 848 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2016), కేన్ విలియమ్సన్ 735 పరుగులు(ఎస్ఆర్హెచ్, 2018) వరుసగా ఉన్నారు. ఇక ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక బౌండరీలు బాదిన జాబితాలోనూ గిల్ చోట సంపాదించాడు. ఐపీఎల్ 16వ సీజన్లో గిల్ గుజరాత్ టైటాన్స్ తరపున 118 బౌండరీలు బాదాడు. ఓవరాల్ జాబితాలో గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక జాస్ బట్లర్ 128 బౌండరీలతో(రాజస్తాన్ రాయల్స్, 2022లో) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 122 బౌండరీలు(ఆర్సీబీ, 2016లో), డేవిడ్ వార్నర్ 119 బౌండరీలు(ఎస్ఆర్హెచ్, 2016లో) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Brief but looking dangerous - Shubman Gill was in the mood tonight.#TATAIPL #CSKvGT #IPLonJioCinema #IPLFinal pic.twitter.com/B1IeAqAHCL— JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: సూపర్ఫాస్ట్ స్టంపింగ్; చహర్ వదిలినా ధోని వదల్లేదు -
'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఎంటర్టైన్ చేసి తీరుతాం'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. వాస్తవానికి ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. కానీ వర్షం లేకపోవడంతో టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. కాగా టాస్ అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''వర్షం పడే సూచనలు ఉండడంతో ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక క్రికెటర్గా మంచి ఆట ఆడాలని అనుకుంటాం. నిన్న(ఆదివారం) జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ల భాగంగా మేం మొత్తం డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాం. అయితే మాకంటే ఎక్కువగా బాధపడింది అభిమానులు. నిన్నటి మ్యాచ్ కోసం రాత్రంతా ఎదురుచూసి నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇవాళ వాళ్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలుగుతుందని చిన్న నమ్మకం. వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఐదు ఓవర్లు మ్యాచ్ ఆడే అవకాశాలుంటాయనుకున్నాం. కానీ దేవుడి దయవల్ల ఇవాళ 20 ఓవర్ల కోటా గేమ్ జరిగేలా ఉంది. అలా జరిగితేనే టోర్నీకి సరైన ముగింపు ఉంటుంది. ఇక క్వాలిఫయర్-1 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'' అంటూ తెలిపాడు. 🚨 Toss Update 🚨 Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans. Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/HYMcLKhfKy — IndianPremierLeague (@IPL) May 29, 2023 చదవండి: IPL 2023 Final: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సీఎస్కే అప్డేట్స్ వర్కింగ్ డే రోజున ఐపీఎల్ ఫైనల్.. ఉద్యోగుల సిక్లీవ్స్ కష్టాలు! -
IPL 2023 Final: గెలిపించిన జడేజా.. ఐపీఎల్16వ సీజన్ విజేత సీఎస్కే
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచింది. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని విధించగా.. సీఎస్కే నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన దశలో జడేజా ఆఖరి రెండు బంతుల్లో సిక్సర్, ఫోర్ కొట్టి సీఎస్కేను గెలిపించాడు. అంతకముందు ఓపెనర్లు రుతురాజ్ 26, డెవాన్ కాన్వే 47 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శివమ్ దూబే 32 నాటౌట్, రహానే 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో జడేజా ఆరు బంతుల్లో 16 పరుగులు నాటౌట్ తన విలువేంటో మరోసారి చాటిచెబుతూ సీఎస్కేను ఐదోసారి చాంపియన్గా నిలిపాడు. ఈ విజయంతో ఐదోసారి టైటిల్ అందుకున్నసీఎస్కే ముంబై ఇండియన్స్తో కలిసి సమంగా నిలిచింది. ధోని గోల్డెన్ డక్.. ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్కే గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే 150 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే 25, జడేజా రెండు పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లలో సీఎస్కే 133/3 12 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే మూడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. శివమ్ దూబే 25, అంబటి రాయుడు 9 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 171.. వంద పరుగులు దాటిన సీఎస్కే 171 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే వంద పరుగుల మార్క్ను దాటింది. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అజింక్యా రహానే 26, శివమ్ దూబే 8 పరుగులతో ఆడుతున్నారు. నూర్ అహ్మద్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు ధాటిగా ఆడుతున్న సీఎస్కేను నూర్ అహ్మద్ దెబ్బ తీశాడు. ఓపెనర్లు రుతురాజ్, కాన్వే రూపంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. సీఎస్కే విజయానికి 48 బంతుల్లో 93 పరుగులు కావాలి. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. రుతురాజ్ ఔట్ 26 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ నూర్ అహ్మద్ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. 6 ఓవర్లలో సీఎస్కే 72/0 ఆరు ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. కాన్వే 22 బంతుల్లో 44 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. రుతురాజ్ 25 పరుగులతో సహకరిస్తున్నాడు. దంచుతున్న రుతురాజ్, కాన్వే.. 4 ఓవర్లో సీఎస్కే 52/0 171 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. రుతురాజ్ 23, కాన్వే 29 పరుగులతో ధాటిగా ఆడుతున్నారు. టార్గెట్ 171.. 2 ఓవర్లలో సీఎస్కే 24/0 2 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 11, డెవాన్ కాన్వే 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. డక్వర్త్ లూయిస్ పద్దతిలో సీఎస్కే టార్గెట్ 15 ఓవర్లలో 171 గంటన్నర పాటు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు టార్గెట్ను కుదించారు. 15 ఓవర్లలో సీఎస్కే టార్గెట్ 171 పరుగులుగా నిర్ధేశించారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. టార్గెట్ 215.. మ్యాచ్కు వర్షం అంతరాయం గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మధ్య ఫైనల్మ్యాచ్కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. సీఎస్కే ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి ఓవర్లో నాలుగు బంతులు పడగానే వర్షం మొదలైంది. ప్రస్తుతం సీఎస్కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ మెరుపులు.. సీఎస్కే టార్గెట్ 215 సీఎస్కేతో జరుగుతున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు) నాలుగు పరుగలతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ సాహా 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. గిల్ 39, పాండ్యా 21 పరుగులు నాటౌట్గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో పతీరానా రెండు వికెట్లు తీయగా.. జడేజా, దీపక్ చహర్లు చెరొక వికెట్ తీశారు. 18 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 182/2 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 79, పాండ్యా 8 పరుగుతో క్రీజులో ఉన్నారు. సాయి సుదర్శన్ ఫిఫ్టీ.. గుజరాత్ 16 ఓవర్లలో 153/2 సీఎస్కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. సాయి సుదర్శన్ 32 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో గుజరాత్ 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 57, పాండ్యా ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాహా(54)ఔట్ 54 పరుగులు చేసిన సాహా దీపక్ చహర్ బౌలింగ్లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ 131 పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 36, పాండ్యా క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 109/1 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. సాహా 48, సాయి సుదర్శన్ 20 పరుగులతో ఆడుతున్నారు. ధోని సూపర్ స్టంపింగ్.. గిల్(39) ఔట్ సీఎస్కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ధోని సూపర్ఫాస్ట్ స్టంపింగ్కు గిల్ వెనుదిరగాల్సి వచ్చింది. 39 పరుగులు చేసిన గిల్ జడ్డూ బౌలింగ్లో షాట్ ఆడే ప్రయత్నంలో ముందుకు వచ్చాడు. అంతే ధోని సూపర్ఫాస్ట్గా బంతిని అందుకొని వికెట్లను గిరాటేయడంతో గిల్ స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. 3 ఓవర్లలో గుజరాత్ స్కోరు 24/0 మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. సాహా 20, గిల్ 4 పరుగులుతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు మ్యాచ్కు వర్షం ముప్పు అంతలా కనిపించడం లేదు. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ 🚨 Toss Update 🚨 Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans. Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/HYMcLKhfKy — IndianPremierLeague (@IPL) May 29, 2023 ఇరుజట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు తలపడగా.. గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు.. సీఎస్కే ఒకసారి విజయం సాధించాయి. ఇక ఫైనల్లో సీఎస్కే గెలిచి ఐదోసారి ఛాంపియన్గా నిలుస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
వర్కింగ్ డే రోజున ఐపీఎల్ ఫైనల్.. ఉద్యోగుల సిక్లీవ్స్ కష్టాలు!
ఐపీఎల్ 16వ సీజన్కు ఆదివారంతోనే(మే 28న) శుభం కార్డు పడాల్సింది. కానీ వర్షం కారణంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన సోమవారానికి(మే 29) వాయిదా పడింది. మ్యాచ్కు ఈరోజు కూడా వర్షం ముప్పు ఉన్నప్పటికి అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయం సంతోషం కలిగించేదే అయినా.. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఉద్యోగం చేసే కొంతమంది క్రికెట్ ప్రేమికులు మాత్రం తమ బాస్కు ఏం కారణం చెప్పి తొందరగా ఆఫీస్ నుంచి బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండడంతో ఆలోగా ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే నైట్షిఫ్ట్ సహా లేట్నైట్ వర్క్ చేసేవాళ్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు సిక్లీవ్స్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇక జియో సినిమా కూడా ఐపీఎల్ ఫైనల్ విషయమై ఒక ఫన్నీ మీమ్ను షేర్ చేసింది. హెచ్ఆర్ ఉద్యోగి ముందు కుప్పలుతెప్పలుగా సిక్ లీవ్ లెటర్స్ ఉండడం.. ఆమె దానిపై సంతకాలు చేస్తుండడం కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వాస్తవానికి మరి ఇంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ.. ఐపీఎల్ ఫైనల్ కావడంతో సాయంత్రం పనిచేసే ఆఫీసుల్లో మాత్రం ఉద్యోగుల నుంచి ఇలాంటి కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎప్పటిలాగే ఫుల్ ఎంజాయ్ చేసి సోమవారం కాస్త లేట్ అయినా ఆఫీస్కు వెళ్లేవారు. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేనివాళ్లు ఫైనల్ మ్యాచ్ను ఎంజాయ్ చేయాలని తమ ప్రణాళికలు రచించుకున్నారు. కొందరు పబ్లు, బార్లకు వెళ్లి మందు తాగుతూ మ్యాచ్ చూస్తూ చిల్ అవుదామనుకున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ ఫైనల్ చూస్తూ ఆనందంగా గడిపేయాలనుకున్నారు. కానీ వరుణుడు వారి ఆశలకు గండికొట్టాడు. దీంతో సోమవారానికి మ్యాచ్ వాయిదా పడింది. కానీ సోమవారం వారంలో మొదటి పని దినం కావడం.. రోజంతా మీటింగ్స్ ఉంటాయన్న కారణంతో ఎక్కడ మ్యాచ్ మిస్ అవుతామేమోనన్న భయం సగటు క్రికెట్ అభిమానికి ఉంటుంది కదా..! Office HR depts across the country dealing with sick leave requests today...#IPLFinal #IPLonJioCinema pic.twitter.com/A0mmlS14xH — JioCinema (@JioCinema) May 29, 2023 ✌🏽No sick leaves, show this to your manager to wind up your work by 6:30 PM today! 🙏🏽#IPLonJioCinema #IPLFinal #GTvCSK #Dhoni pic.twitter.com/Pfzz3XMI60 — JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత #GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి -
ధోని చివరి మ్యాచ్ వాన గండం తప్పదా...!
-
IPL 2023 Final: విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఐపీఎల్ విన్నర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ అఫైర్స్ నుండి జోక్స్ వరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే మహీంద్రా ఆదివారం(మే 28) నాటి ఫైనల్ మ్యాచ్కు ముందు ఆశ్చర్యకర కమెంట్స్ చేశారు. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్, క్రికెట్ ఐకాన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కీలకమైన ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్మన్ గిల్ ప్రతిభను నమ్ముతున్నాను. అతను మరింత రాణించాలను కుంటున్నా. కానీ తాను మాత్రం ఎంఎస్ ధోనీకి ఫ్యాన్నే అంటూ.. ఈ ఫైనల్ పోరులో కప్పు అతనిదే అన్నట్టు కమెంట్ చేశారు. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దా అంటూ ట్వీట్చేశారు. ఈ ట్వీట్ ఇప్పటిదాకా 237.5 వేల లైక్స్ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ ఎస్యూవీని శుభ్మాన్ గిల్కు బహుమతిగా ఇచ్చారు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) డోంట్ మిస్ టు క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 టైటిల్ పోరులో, గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో 60.79 సగటుతో శుభ్మన్ గిల్ పరుగులు చేసిన ఆటగాడు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు. శుభ్మాన్ గిల్ సిక్సర్ మోత మోగించి సూపర్ ఫెర్ఫామెన్స్తో విరాట్ కోహ్లీ, ఎం ధోని, యువరాజ్ సింగ్ , సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు దక్కించుకున్నాడు. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్మేకర్ స్పందన ఇది!) I was asked which team I’m supporting in tonight’s #IPL2023Final Well, I’m a believer in Shubhman’s talents & would like to see them flower tonight BUT I’m a bigger fan of #MSDhoni & can’t help but hope for him to blaze a trail of glory tonight. 😊So let the best team win…! — anand mahindra (@anandmahindra) May 28, 2023 -
గుజరాత్ గ్రేట్ చెన్నై తోపు ...
-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
చెన్నై స్టేడియం లో ధోని చేసిన పనికి ...
-
ఐపీల్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు అంటే ..
-
చెన్నైVS గుజరాత్
-
ఒక్క విషయం చాలు గుజరాత్ తో గెలిచేది చెన్నై...
-
వారెవ్వా గిల్ ఆవిషయంలో ధోని తరువాత ఇతనే..
-
ధోని కప్.. గిల్ సెంచరీ.. ఫైనల్ పై ఉత్కంఠ..
-
#GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం(మే 28న) ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవాలి. కానీ వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్డేకు వాయిదా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి 11 దాటినా వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా పలు సీజన్లలో మ్యాచ్లు రద్దు కావడం లేదా ఓవర్లు కుదించి ఆడడం జరిగింది. కానీ గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడింది లేదు.. రిజర్వ్ డేకు వాయిదా పడింది లేదు. ఇక ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఫైనల్మ్యాచ్ చూద్దామని వచ్చిన అభిమానులకు వరుణుడి కారణంగా తీవ్ర నిరాశే మిగిలింది. రాత్రి 9 గంటల తర్వాత అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 Fans leave the Narendra Modi Stadium. A sad end to what could have been an amazing Sunday. #IPLFinals to be played tomorrow it seems. #Ahmedabad #IPL2023Final #CskvsGttickets #MSDhoni𓃵 #rain pic.twitter.com/vGlfVQzBb9 — 7 & 18 & 45 (@Tamil_paiyan_01) May 28, 2023 చదవండి: #IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం -
#IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం
ఐపీఎల్ 2023 ఫైనల్ ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉన్నప్పటికి వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. సోమవారం మ్యాచ్కు రిజర్వ్ డే ఉన్నప్పటికి వర్షం పడే అవకాశం 60శాతం ఉన్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయం పక్కనబెడితే.. స్టేడియంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై ఒక మహిళా అభిమాని దౌర్జన్యం చేసింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు మహిళ పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఆ తర్వాత అతన్ని కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా తన్నింది. అయితే ఆ అధికారి మాత్రం ఆమెను ఏమనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా మరోసారి మహిళ తన కాలితో అతన్ని తన్నడం అక్కడి కెమెరాలకు చిక్కింది. పక్కనే ఉన్నవాళ్లు గొడవను చూస్తూ ఆనందిస్తున్నారే తప్ప ఒక్కరు కూడా అడ్డుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. This woman slapped and hit this male officer like anything and the helpless guy couldn't do anything. Is this woman empowerment? Worst Fanbase Ever 🤮🤮@ChennaiIPL #CSKvGT #GTvCSK #Rain #Ahmedabad pic.twitter.com/lH8N0bsSL5 — Harshit 🇮🇳 (@Imharshit_45) May 28, 2023 చదవండి: దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా! -
దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే పడాలా!
కరోనాతో రెండేళ్ల పాటు ఐపీఎల్ చాలా చప్పగా సాగింది. స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో ఆటగాళ్లు కూడా కాస్త బోర్ ఫీలయ్యారు. అయితే ఐపీఎల్ 16వ సీజన్ ఆ సీన్ను మొత్తం రివర్స్ చేసేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన సీజన్గా ఐపీఎల్ 2023 చరిత్రకెక్కనుంది. కారణం దాదాపు అన్ని మ్యాచ్లు ఉత్కంఠగా సాగడం.. స్టేడియాల్లోకి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం.. ధోని లాంటి ఆటగాళ్ల కోసం ఈ సీజన్ను టీవీల్లోనూ చాలా మంది ఎంజాయ్ చేయడం కనిపించింది. అలా దాదాపు రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్కు నేటితో తెరపడనుంది. ఆదివారం(మే 28న) ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. సీఎస్కే ఐదోసారి కప్పు కొడుతుందా లేక గుజరాత్ వరుసగా రెండోసారి టైటిల్ను నిలబెట్టుకుంటుందా అనేది పక్కనబెడితే మాకు మాత్రం ఫుల్ కిక్కు ఖాయం అని అభిమానులు భావించారు. కానీ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్కు వరుణుడు శనిలాగా తయారయ్యాడు. ఫైనల్ మ్యాచ్ను వీక్షించాలని మధ్యాహ్నం నుంచే స్టేడియం ముందు ప్రేక్షకులు బారులు తీరారు. అదే సమయంలో వరుణుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో టాస్ కూడా ఆలస్యం అయింది. మ్యాచ్ సమయం గంట దాటినా వర్షం జోరు మాత్రం తగ్గడం లేదు. పూర్తి మ్యాచ్ కాకపోయినా కనీసం ఐదు ఓవర్ల ఆట అయినా సాధ్యపడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. మ్యాచ్కు రిజర్వ్ డే ఉన్నప్పటికి సోమవారం కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ జరగకుండానే టైటిల్ విజేతను ప్రకటిస్తారేమోనని అభిమానులు బాధపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే లీగ్లో టాపర్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుంది. అలా చూస్తే ఇది సీఎస్కేకు నష్టం మిగిల్చే అంశం. ధోనికి చివరి ఐపీఎల్ అని భావిస్తున్న వేళ వర్షం కారణంగా ఇలా జరిగితే మాత్రం సీఎస్కే అభిమానులకు మింగుడుపడని అంశమే. అయితే ఐపీఎల్ 16వ సీజన్లో ఏ మ్యాచ్కు అడ్డుపడని వరుణుడు ఫైనల్ మ్యాచ్కు ఇలా చేయడం ఏంటని అభిమానులు తెగ ఫీలవుతున్నారు. ఏదో కాసేపు పడి వర్షం ఆగిపోతుందనుకుంటే పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. దిక్కుమాలిన వర్షం.. ఇన్ని రోజులు లేని వర్షం ఇప్పుడే పడాలా.. అంటూ అభిమానులు కామెంట్ చేశారు. Narendra Modi Stadium leaks rainwater from one side of the stadium and crowd had to leave that area. #CSKvsGT #rain #IPL2023Final pic.twitter.com/0MlxDDxH4g— Silly Context (@sillycontext) May 28, 2023 Rain stoppedToss at 9:10#CSKvGT #IPLFinals #IPL2023Final #Ahmedabad #rain #MSDhoni #Ahmedabad pic.twitter.com/YEyDQef1hm— proper thought. (@ThoughtProper) May 28, 2023 -
పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్కు ఇవాళ్టితో శుభం కార్డు పడనుంది. పది జట్లు పోటీ పడితే ఆఖరికి రెండు జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం(మే 28న) గుజరాత్ టైటాన్స్, సీఎస్కేలు ఫైనల్లో తలపడుతున్నాయి.ఐదోసారి ఛాంపియన్స్గా నిలవాలని సీఎస్కే భావిస్తుంటే.. వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ను చేజెక్కించుకోవాలని గుజరాత్ పట్టుదలతో ఉంది. అయితే గడిచిన 15 సీజన్లలో చాలా సందర్భాల్లో క్వాలిఫయర్-1లో గెలిచి ఫైనల్కు చేరిన జట్టు ఐపీఎల్ ఛాంపియన్గా నిలవడం విశేషం. 2011 నుంచి 12 సీజన్లలో తొమ్మిదిసార్లు క్వాలిఫయర్-1లో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లిన జట్లే కప్పు కొట్టాయి. గత రికార్డుల ప్రకారం 2011 నుంచి ఇప్పటివరకు 9 సార్లు క్వాలిఫైయర్-1 విజేతనే ట్రోఫీని సొంతం చేసుకుంది. కేవలం మూడు సార్లు మాత్రమే క్వాలిఫైయర్-2 టీమ్ చాంపియన్గా నిలిచింది. అలా చూస్తే ఈసారి గుజరాత్ టైటాన్స్దే కప్ అని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ ధోనీ సేనను తక్కువ అంచనా వేయలేం. ఐదోసారి కప్ గెలుస్తుందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. అయితే క్వాలిఫైయర్ 1 పోరులో అనూహ్యంగా సీఎస్కే చేతిలో ఓడిన గుజరాత్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో పంజా విసిరింది. చాంపియన్ ఆటతో బలమైన ముంబై ఇండియన్స్ను 62 రన్స్తో చిత్తు చేసింది. సొంతగడ్డపై గుజరాత్ అవకాశాలను కొట్టిపారేయలేం. కానీ, మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన తెలివైన వ్యూహాలతో మ్యాచ్ను చెన్నై వైపు తిప్పగల దిట్ట. దాంతో, విజేతగా నిలిచేది ఎవరో ఫస్ట్ ఇన్నింగ్స్తో దాదాపు తెలుస్తుంది. 2011 నుంచి విజేతలను ఒకసారి పరిశీలిస్తే.. ఐపీఎల్ 2011 – ఆర్సీబీ కప్పు ఆశలపై సీఎస్కే నీళ్లు చల్లింది. వరుసగా రెండోసారి సీఎస్కే చాంపియన్గా నిలిచింది (క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2012 – కోల్కతా నైట్ రైడర్స్ తొలిసారి చాంపియన్గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2013 – ఫైనల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.(క్వాలిఫయర్-2 విజేత) ఐపీఎల్ 2014 – కోల్కతా నైట్ రైడర్స్ రెండోసారి చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ముంబై ఇండియన్స్పై గెలుపొందింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2015 – ఫైనల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2016 – డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారి కప్పు కొట్టింది. ఫైనల్లో కోహ్లీసేన ఓటమి పాలైంది.(క్వాలిఫయర్-2 విజేత) ఐపీఎల్ 2017 – ముంబై ఇండియన్స్ ఫైనల్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్పై గెలిచి ట్రోఫీ అందుకుంది.(క్వాలిఫయర్-2 విజేత) ఐపీఎల్ 2018 – చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై గెలిచింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2019 – ముంబై ఇండియన్స్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్పై గెలిచింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2020 – ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ముంబై ఇండియన్స్ ఐదోసారు ట్రోఫీని ముద్దాడింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2021 – చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ అందుకుంది. ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది.(క్వాలిఫయర్-1 విజేత) ఐపీఎల్ 2022 – క్వాలిఫైయర్ 1లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఆరంగేట్రం సీజన్లోనే చాంపియన్గా నిలచింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది.(క్వాలిఫయర్-1 విజేత) చదవండి: ఐపీఎల్కు గుడ్బై చెప్పిన అంబటి రాయుడు -
IPL 2023 Final: వర్షం కారణంగా మ్యాచ్ సోమవారానికి వాయిదా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షంతో కనీసం టాస్ వేయడానికి వీలు పడలేదు. మధ్యలో ఒక పది నిమిషాలు తెరిపినివ్వడంతో మ్యాచ్ జరుగుతుందని అభిమానులు సంతోషపడ్డారు. కానీ కాసేపటికే వరుణుడు మళ్లీ జోరందుకున్నాడు. అప్పటినుంచి రాత్రి 11 గంటలయినా ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్ రిఫరీ సైమన్ డౌల్.. అంపైర్లతో చర్చించి మ్యాచ్ను సోమవారానికి(మే 29) వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు. ఇక సోమవారం కూడా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ జరగకుంటే తొలుత 5 ఓవర్లు మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చేలా చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యపడకపోతే మ్యాచ్ను రద్దు చేసి లీగ్ స్టేజీలో గ్రూప్ టాపర్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ను విజేతగా ప్రకటిస్తారు. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 వర్షం కారణంగా టాస్ ఆలస్యం ఐపీఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం (మే 28న) అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ► ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్కు వేళైంది. విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. దాంతో, పాండ్యా సేన రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా సీఎస్కే ఐదోసారి కప్పును ఎగరేసుకుపోతుందా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. -
స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మరికొద్ది గంటల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. మరి ఫైనల్లో ఎవరు విజేత అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్గా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ గెలుస్తుందా అనేది చూడాలి. ఈ విషయం పక్కనబెడితే.. గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా ఫైనల్ మ్యాచ్కు ముందు అహ్మదాబాద్లోని నరేంద్ర స్టేడియంలో స్కూటీపై చక్కర్లు కొట్టడం వైరల్గా మారింది, పైగా నెహ్రాకు తోడుగా స్కూటీపై మోహిత్ శర్మ, రషీద్ ఖాన్లు కూడా ఉండడం ఆసక్తి కలిగించింది. కాగా ఈ వీడియోనూ జియో సినిమా స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ''గుజరాత్ టైటాన్స్ ON Their Way To #IPLFinal Like..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక గుజరాత్ టైటాన్స్కు బౌలింగ్ పెద్ద బలం అని చెప్పొచ్చు. పర్పుల్క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ నుంచే ముగ్గురు బౌలర్లు ఉండడం విశేషం. మహ్మద్ షమీ 28 వికెట్లతో టాప్లో ఉండగా.. రషీద్ ఖాన్ 27, మోహిత్ శర్మ 24 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీడియో చూసిన అభిమానులు.. ''ఆ ఇద్దరు గుజరాత్ టైటాన్స్కు బలం.. కాస్త జాగ్రత్త'' అంటూ కామెంట్ చేశారు #GujaratTitans on their way to the #IPLFinal like... pic.twitter.com/nldijNxMR8 — JioCinema (@JioCinema) May 27, 2023 చదవండి: సీఎస్కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్ డబుల్ ధమాకానా? -
సీఎస్కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్ డబుల్ ధమాకానా?
రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్కు మరొక రోజులో తెరపడనుంది. ఈ సీజన్లో పది జట్లు బరిలోకి దిగితే.. ఆఖరి అంకానికి రెండు జట్లు చేరుకున్నాయి. ఒకటి నాలుగుసార్లు ఛాంపియన్ సీఎస్కే అయితే.. రెండో జట్టు గతేడాది డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్. 2022 సీజన్లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచిన సీఎస్కే అంచనాలకు మించి రాణించి ఫైనల్లో అడుగుపెట్టగా.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ గతేడాది ఆటనే గుర్తుచేస్తూ రెండోసారి ఫైనల్ చేరింది. మరి ఈ ఇద్దరిలో విజేత అయ్యేది ఎవరు? ధోని సారధ్యంలో సీఎస్కే ఐదోసారి కప్ కొడుతుందా లేక పాండ్యా సారధ్యంలో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోతుందా అన్నది మరొక రోజులో తెలియనుంది. సీఎస్కే బలం ఓపెనింగ్.. సీఎస్కే బలం ఓపెనింగ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ జంట సీఎస్కేకు అదిరిపోయే ఆరంభాలు ఇస్తూ పటిష్టస్థితిలో నిలుపుతున్నారు. తర్వాతి పనిని రహానే, శివమ్ దూబే, జడేజాలు పూర్తి చేస్తుండగా.. ఆఖర్లో ధోని ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక బౌలింగ్లో ధోని తనదైన వ్యూహాలతో తెలివిగా ఉపయోగించుకుంటున్నాడు. దీపక్ చహర్, రవీంద్ర జడేజా, మతిషా పతిరానా, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్ పాండేలు అదరగొడుతున్నారు. ధోని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వారితో బౌలింగ్ చేయించి ఫలితాలు రాబడుతున్నాడు. గుజరాత్ సగం బలం గిల్.. ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్కు సగం బలం శుబ్మన్ గిల్ అని నిస్సేందహంగా చెప్పొచ్చు. వరుస శతకాలతో రెచ్చిపోతున్న గిల్కు ముకుతాడు వేస్తేనే సీఎస్కేకు అవకాశం ఉంటుంది. గిల్ మినహా జట్టులో పెద్దగా రాణిస్తున్నవారు లేకపోయినప్పటికి అవసరానికి పాండ్యా, సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్లు మెరుస్తున్నారు. ఇక రషీద్ ఖాన్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ విజయాల్లో కీలకంగా మారాడు. ఇక బౌలింగ్లో షమీ, మోహిత్ శర్మ, రషీద్, నూర్ అహ్మద్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రేపటి ఫైనల్ పోరు ఉత్కంఠగా సాగడం ఖాయమనిపిస్తోంది. చూడాలి సీఎస్కే ఐదోసారి కప్కొట్టి ధోనికి కానుకగా ఇస్తుందో లేక గుజరాత్కు రెండోసారి టైటిల్ అందించి పాండ్యా విజయవంతమైన కెప్టెన్గా నిలుస్తాడో చూడాలి. Two Captains. Two Leaders. One bond 🤝 It's a bromance that has developed over time 🤗 But come Sunday these two will be ready for 𝙁𝙞𝙣𝙖𝙡 𝙎𝙝𝙤𝙬𝙙𝙤𝙬𝙣 ⏳#TATAIPL | #CSKvGT | #Final | @msdhoni | @hardikpandya7 pic.twitter.com/Bq3sNZDgxB — IndianPremierLeague (@IPL) May 27, 2023 చదవండి: ముందే అనుకున్నారా.. కలిసే సెంచరీలు కొడుతున్నారు! -
జడ్డూకు ఫుల్ డిమాండ్.. సీఎస్కే నుంచి బయటికి వస్తే?!
సీఎస్కే జట్టులో ముఖ్యమైనవాళ్లలో రవీంద్ర జడేజా ఒకడు. కొన్నేళ్లుగా జడ్డూ సీఎస్కేతో పాటే కొనసాగుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ధోని తర్వాత అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది ధోని కెప్టెన్గా తప్పుకోవడంతో సీఎస్కే జడేజాకు పగ్గాలు అప్పజెప్పింది. అయితే కెప్టెన్సీ ఒత్తిడిని భరించలేని జడ్డూ సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో మళ్లీ ధోనినే నాయకుడిగా నియమించింది. అలాంటి జడేజాకు సీఎస్కే మేనేజ్మెంట్తో పొసగడం లేదనే పుకార్లు వస్తున్నాయి. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించిన తర్వాత ధోనీతో జడేజాకు కొన్ని చర్చలు జరిగాయని అంటున్నారు. అంతేకాదు.. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్, జడేజాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. చెన్నై జట్టులో జడేజా సంతృప్తికరంగా లేడని ఎప్పటినుంచో చాలా మంది అనుకుంటున్నారు. ఈ కారణాలన్నింటి కారణంగా రవీంద్ర జడేజా సీఎస్కే జట్టు నుంచి తప్పుకుంటాడా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. గత ఎడిషన్లోనూ జడ్డూ, మేనేజ్మెంట్ మధ్య విభేదాలున్నట్లు అనిపించింది. అయినా జడేజా ఈ ఎడిషన్లో సీఎస్కే జట్టులో కొనసాగాడు. ఒకవేళ జడ్డూ ఉన్నపళంగా సీఎస్కే నుంచి బయటికి వచ్చి వేలం జాబితాలోకి చేరితే.. అంత నాణ్యమైన ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఇతర జట్లు పోటీపడడం సహజమే. మరి అంత డిమాండ్ కలిగిన జడ్డూపై ఒక మూడు జట్లు మాత్రం ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఆర్సీబీ(RCB): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈ సీజన్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ బలహీనంగా ఉండడంతో చాలా పరాజయాలను చవిచూసింది. షాబాజ్ అహ్మద్ ఆల్రౌండర్గా రాణించడంలో విఫలమైనందున ఒకవేళ రవీంద్ర జడేజా చేరితే మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే, లోయర్ ఆర్డర్లో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా బలపడుతుంది. లక్నో సూపర్ జెయింట్స్(LSG): లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఎడిషన్లో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ మెరుపులు మెరిపించే సత్తా ఉన్న జడేజాను లక్నో సూపర్జెయింట్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్(MI) ముంబై ఇండియన్స్ కూడా జడ్డూ మీద ఆసక్తి చూపిస్తుంది. రవీంద్ర జడేజా లాంటి ఆటగాడు కోసం ముంబై ఇండియన్స్ ఎదురుచూస్తోంది. జడేజా జట్టులోకి వస్తే జట్టు బ్యాలెన్స్ మెరుగ్గా ఉంటుందనేది నిజం. తదుపరి ఎడిషన్లో రవీంద్ర జడేజాను కొనుగోలు చేసే అవకాశం వస్తే ముంబై ఇండియన్స్ ఆ అవకాశాన్ని వదులుకోలేరన్నది నిజం. ఇక ఈ సీజన్లో జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. సీఎస్కే పదోసారి ఫైనల్ చేరడంలో జడ్డూ పాత్రనే కీలకం. గుజరాత్తో జరిగిన క్వాలిఫయర్-1లో జడేజా తొలుత బ్యాటింగ్లో 22 పరుగులు.. తర్వాత బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడిన ఈ స్పిన్ ఆల్రౌండర్.. 175 పరుగులు చేయడం సహా.. 19 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ధోనితో సమానంగా గిల్.. రికార్డులు బద్దలు -
ముంబయి చిత్తు చిత్తు.. CSK పై రివెంజ్ కు రెడీ
-
పతిరణకు నేను ఉన్న అంటున్న ధోని..
-
చెపాక్లో ఇదే చివరిసారి అనుకున్నారేమో..!
ఐపీఎల్ 16వ సీజన్లో ఫైనల్ చేరుకున్న సీఎస్కే కూల్గా ఉంది. ఇవాళ(మే 26న) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. ఆదివారం(మే 28న) జరగనున్న ఫైనల్లో సీఎస్కే.. గుజరాత్, ముంబై ఇండియన్స్లో ఎవరిని ఎదుర్కోనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సీజన్లో సీఎస్కే టైటిల్ కొడితే ధోని రిటైర్ అవుతాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా గాసిప్స్ వదులుతూనే ఉన్నారు. ధోని కూడా వచ్చే సీజన్లో తాను ఆడేది లేనిది మరో ఎనిమిది-తొమ్మిది నెలల్లో చెబుతానని పేర్కొన్నాడు. అందుకే ఈ సీజన్లో సీఎస్కే కప్ కొడితే.. వచ్చే సీజన్లో ధోని జట్టుకు ప్లేయర్గా కాకుండా మెంటార్గా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే ఫైనల్ చేరుకున్న సీఎస్కే తమ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. శుక్రవారం(మే26న) సీఎస్కే జట్టు అహ్మదాబాద్కు చేరుకోనుంది. ఇక సీఎస్కే కెప్టెన్ ధోని మాత్రం చెపాక్ గ్రౌండ్ సిబ్బందితో సరదాగా గడిపాడు. దాదాపు 16 ఏళ్ల పాటు తనపై అభిమానం పెంచుకున్న చెపాక్ స్టేడియం సిబ్బందికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చి క్యాష్ రివార్డ్స్ అందజేశాడు. అంతేకాదు వారికి థ్యాంక్స్ గివింగ్ టోకెన్ అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ '' చెపాక్లో చివరిసారి అనుకున్నారు.. అందుకే తలాపై అభిమానంతో'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Anbuden Thala - A mark of respect for the markers and the ground staff who toil hard to make us game ready! 💛📹#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/MTyFpvEWud — Chennai Super Kings (@ChennaiIPL) May 25, 2023 చదవండి: #MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్కు వచ్చిందో అంతే! -
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
ధోని గురించి ఆఒక్క మాటతో టచ్ చేసిన హర్దిక్ పాండ్య,
-
పీక్స్ కి చేరిన ధోని రవీంధ్ర జడేజా గొడవలు...మధ్యలో ఏంట్రీ ఇచ్చిన జడ్డు వైఫ్
-
CSK సక్సెస్ ఫార్మలా చెప్పిన ధో ని
-
ధోని పట్టిందల్లా బంగారమే!
నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ఫైనల్లో అడుగుపెట్టింది. సీఎస్కే పదోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో నిలవడం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా సంతోషం వ్యక్తం చేశాడు. టోర్నీ ఆసాంతం చెన్నైని అద్భుతంగా నడిపించిన మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni)ని అతను ఆకాశానికెత్తేశాడు. జడేజా, దీపక్ చాహర్ తప్పించి జట్టులో స్టార్ బౌలర్లు లేకపోయినా సీఎస్కేను ఫైనల్కు చేర్చిన మహీపై ప్రశంసలు కురిపించాడు. ధోని ముట్టకున్న ప్రతీది బంగారమవుతుంది. ధోని ప్రతి విషయాన్ని చాలా సులువుగా మార్చుతాడు. యావత్ భారతదేశం మొత్తం ధోని ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని కోరుకుంది’ అని రైనా వెల్లడించాడు. ఏమంత అనుభవం లేని మహీశ్ థీక్షణ, మతీశా పతీరానా(శ్రీలంక), తుషార్ దేశ్పాండే వంటి బౌలర్లపై నమ్మకం ఉంచి, వాళ్లను మ్యాచ్ విన్నర్లుగా మార్చాడు. తెలివైన వ్యూహాలతో, సరైన సమయంలో బౌలింగ్ మార్పులతో ధోనీ ఫలితాలు రాబట్టాడు. గత సీజన్లో దారుణ ప్రదర్శనతో 9వ స్థానంలో నిలిచిన ధోనీ సేన ఈసారి రెండో స్థానం సాధించింది. ఒక్క ఏడాదిలో జట్టు కూర్పు, ఆటగాళ్ల ఆట తీరు మారడం వెనక ధోని తన మార్క్ చూపించాడు. అందుకు ఉదాహారణ వీళ్లే.. కెరీర్ ఇక ముగిసింది అనుకున్న అజింక్యా రహానేకు దన్నుగా నిలిచాడు. యంగ్స్టర్ శివం దూబే సిక్సర్ల దూబేగా మారడం వెనక ధోని ఉన్నాడు. జట్టులో సహృదయ వాతావరణం ఉండేలా చూసి, ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన ధోని సీఎస్కేను ఛాంపియన్గా తయారుచేశాడు. ఈ నేపథ్యంలోనే రైనా ధోని ఏదీ ముట్టుకున్నా అది బంగారమైతుందన్నాడు. చదవండి: పాపం చివరకు వికెట్ కీపర్ బకరా అయ్యాడు! ఒక ప్లేఆఫ్.. 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు -
జియో సినిమా రికార్డ్ బద్దలు!
IPL 2023 CSK-GT match: జియో సినిమా (JioCinema) యాప్ తన రికార్డ్ను తానే బద్దలు కొట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో మే 23న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జియో సినిమాలో అత్యధిక వీక్షకుల సంఖ్యను సాధించింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో జియోసినిమా యాప్ ఏకకాల వీక్షకుల సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంది. కాగా ఈ ప్లేఆఫ్ మ్యాచ్లో 15 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. జియో సినిమాలో ఇంతకుముందున్న వీవర్స్ రికార్డు 2.4 కోట్లు. ఇది ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మ్యాచ్ సందర్భంగా నమోదైంది. భారతదేశంలోని వీక్షకులందరికీ జియో సినిమా ఐపీఎల్ 2023ని ఉచితంగా ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 1300 కోట్ల వీవ్స్ వీక్షకుల ఎంగేజ్మెంట్ పరంగా జియో సినిమా రోజూ కొత్త మైలురాళ్లను దాటుతూనే ఉంది. ఈ యాప్లో మొత్తం వీక్షణలు ఇప్పటికే 1300 కోట్లను దాటాయి. ఇది ప్రపంచ రికార్డు అని ఆ కంపెనీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్ట్రీమింగ్ యాప్ ఐపీఎల్ కారణంగా రోజూ లక్షల కొద్దీ కొత్త వీక్షకులను సంపాదిస్తూనే ఉంది. ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కో మ్యాచ్కి సగటు స్ట్రీమింగ్ సమయం ఇప్పటికే 60 నిమిషాలు దాటిపోయిందని కంపెనీ పేర్కొంది. ఇక స్పాన్సర్షిప్లు, ప్రకటనదారుల పరంగా జియో సినిమా 26 మార్క్యూ స్పాన్సర్లను సాధించగలిగింది. ఏ క్రీడా ఈవెంట్కైనా ఇదే అత్యధికం. ఇదీ చదవండి: జియో సినిమా దెబ్బకు హాట్స్టార్ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్స్క్రైబర్లు -
ఓడిపోయాం అంతే.. సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు!
-
సీఎస్కేను విడిచి వెళ్లను.. మరో 8,9 నెలల్లో నిర్ణయం తీసుకుంటా!
-
'సీఎస్కేను విడిచి వెళ్లను.. మరో 8,9 నెలల్లో నిర్ణయం తీసుకుంటా!'
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ సీజన్ ధోనికి చివరిదని ఇంకా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడో లేదో తెలీదు కానీ పదోసారి ఫైనల్లో అడుగుపెట్టిన సీఎస్కే ఎలాగైనా టైటిల్ కొట్టి ధోనికి గిఫ్ట్గా అందించాలని భావిస్తోంది. ఇక మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా బోగ్లే ధోని రిటైర్మెంట్ గురించి ఇన్డైరెక్ట్గా ప్రశ్న వేశాడు. చెన్నై వేదికగా ఈ సీజన్లో ధోని ఫైనల్ మ్యాచ్(ఐపీఎల్ 2023 ఫైనల్) ఆడబోతున్నాడా అని అడిగాడు. దీనిపై ధోని స్పందిస్తూ.. ''ఏమో ఆడతానో లేదో తెలీదు.. దానికి మరో ఎనిమిది, తొమ్మిది నెలలు సమయం ఉంది. అప్పుడు ఆడాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటా. ఇప్పటినుంచే ఆ తలనొప్పి ఎందుకు? ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. సీఎస్కేతో ఉంటా.. జట్టును విడిచివెళ్లను.. అది ఆట రూపంలో కావొచ్చు. లేదా బయటినుంచి మద్దతు అవ్వొచ్చు'' అంటూ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ ప్రదర్శనపై మాట్లాడుతూ..''ఐపీఎల్ చాలా పెద్దది.. ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు 8 టాప్ టీంలు ఉండేవి.. ఇప్పుడు పది అయ్యాయి. అయితే ఇదొక ఫైనల్గా మాత్రమే తీసుకోము. ఎందుకంటే మేము ఫైనల్లో అడుగుపెట్టడం వెనుక రెండు నెలల కష్టం ఉంది. జట్టు మొత్తం కాంట్రిబ్యూషన్ ఉంది. అయితే మిడిలార్డర్ కాస్త బలపడాల్సి ఉంది. గుజరాత్టైటాన్స్ ఒక అద్బుత జట్టు.. చేజింగ్లో ఒక దశలో మమ్మల్ని భయపెట్టారు. జడ్డూ చక్కగా బౌలింగ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. కఠినంగా ఉన్న పిచ్లపై జడ్డూ బౌలింగ్ శైలి బాగుంటుంది. బౌలర్లందరిని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం సపోర్ట్ స్టాప్, బ్రావో , ఎరిక్ లాంటి వ్యక్తులు ఉన్నారు. ఒక కెప్టెన్గా నా జట్టును గెలిపించుకోవడం నా బాధ్యత. అందుకోసం ఫీల్డర్లను అటు ఇటు మార్చడం నాకున్న అలవాటు. నేను ఫీల్డర్లకు ఎప్పుడు చెప్పేది ఒకటే.. నా దృష్టిని పరిశీలిస్తూ ఫీల్డింగ్ చేయండి. క్యాచ్లు మిస్ అయినా పర్లేదు.. పరుగులు రాకూడదు అనేది నా పాలసీ.. ఇక ఆదివారం వరకు ఎదురు చూడాలి.. ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ'' అంటూ ముగించాడు. చదవండి: ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా? -
ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా?
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విషయం పక్కనబెడితే.. ధోని వేసిన మాస్టర్ప్లాన్కు హార్దిక్ పాండ్యా అడ్డంగా చిక్కడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో ఆరో ఓవర్ మహీష్ తీక్షణ వేశాడు. స్ట్రైక్లో పాండ్యా ఉండడంతో ధోని ఫీల్డ్ను సెట్ చేశాడు. ఈ క్రమంలో ఆఫ్సైడ్లో జడేజాను ఉంచాడు. తీక్షణ వేసిన ఐదో బంతిని పాండ్యా ఆఫ్సైడ్ దిశగానే ఆడాడు. అంతే నేరుగా బంతి జడ్డూ చేతుల్లోకి వెళ్లడంతో పాండ్యా నిరాశగా పెవిలియన్ చేరాడు. వీడియో చూసిన అభిమానులు.. ''ప్లాన్ వేసింది ఎవరు.. మాస్టర్మైండ్ ధోని.. ఇక పాండ్యా చిక్కకుండా ఉంటాడా చెప్పండి'' అంటూ కామెంట్ చేశారు. 👀 Dhoni moved a fielder to the off-side a ball prior to Hardik getting dismissed! #GTvCSK #TATAIPL #Qualifier1 #IPLonJioCinema pic.twitter.com/oJow2Vp2rj — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: 150 వికెట్లు.. 2వేలకు పైగా పరుగులు; తొలి ఆల్రౌండర్గా చరిత్ర -
150 వికెట్లు.. 2వేలకు పైగా పరుగులు; తొలి ఆల్రౌండర్గా చరిత్ర
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కేను విజేతగా నిలిపేందుకు జట్టు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన వంతు కృషి చేస్తున్నాడు. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-1 పోరులో జడ్డూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్లో 16 బంతుల్లో 22 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన జడ్డూ ఆ తర్వాత బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 18 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జడేజా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గుజరాత్తో మ్యాచ్లో దాసున్ షనకను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఐపీఎల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అయితే ఐపీఎల్లో రెండువేలకు పైగా పరుగులు, 150 వికెట్లు తీసిన తొలి ఆల్రౌండర్గా జడేజా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు డ్వేన్ బ్రావో 1560 పరుగులు, 183 వికెట్లు తీయగా.. ఆ తర్వాత సునీల్ నరైన్ 1046 పరుగులు చేయడంతో పాటు 163 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఇద్దరు జడ్డూ కంటే ఎక్కువ వికెట్లు తీసినప్పటికి బ్యాటింగ్లో మాత్రం రెండు వేల పరుగుల మార్క్ను అందుకోలేకపోయారు. Jaddu-giri 🤘 Ravindra Jadeja is once again spinning trouble for batters at #Anbuden 🤩#IPL2023 #IPLonJioCinema #GTvCSK #Qualifier1 #Yellove pic.twitter.com/OROqcccAVh — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: జడ్డూ చిరుత పులిలా.. మొయిన్ అలీ ముసలోడిలా! -
జడ్డూ చిరుత పులిలా.. మొయిన్ అలీ ముసలోడిలా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఇది చోటుచేసుకుంది. షమీ వేసిన 20వ ఓవర్ నాలుగో బంతిని మొయిన్ అలీ మిస్ చేశాడు. అయితే నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న జడేజా పరుగు కోసం చిరుత పులిలా పరిగెత్తుకొచ్చాడు. అయితే ఇది గమనించని మొయిన్ అలీ అప్పుడు క్రీజు నుంచి కదిలాడు. అయితే బంతిని అందుకున్న సాహా వికెట్ల వైపు విసరగా.. అప్పటికే జడ్డూ తన బ్యాట్ను క్రీజులో ఉంచాడు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. జడేజా బ్యాట్ పెట్టేలోపు మొయిన్ అలీ ఇంకా అతని వెనకాలే ఉన్నాడు. ఒకవేళ సాహా నేరుగా నాన్స్ట్రైక్ ఎండ్వైపు బంతిని విసిరి ఉంటే మొయిన్ అలీ కచ్చితంగా రనౌట్ అయ్యేవాడే కానీ తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు..''జడ్డూ చిరుతపులిలా పరిగెత్తుకొస్తే.. మొయిన్ అలీ మాత్రం ముసలోడిలా పరిగెత్తాడు'' అంటూ కామెంట్ చేశారు. Jadeja returned from School and Moeen Ali is just going to School 😭 pic.twitter.com/9xz1SFhUpT — ♚ (@balltamperrer) May 23, 2023 చదవండి: దీపక్ చహర్ అరుదైన ఘనత.. -
దీపక్ చహర్ అరుదైన ఘనత..
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ అరుదైన ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో సాహాను ఔట్ చేయడం ద్వారా దీపక్ చహర్ ఒక రికార్డు అందుకున్నాడు. అదేంటంటే ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దీపక్ చహర్ మూడో స్థానంలో నిలిచాడు. పవర్ ప్లేలో ఇప్పటివరకు దీపక్ చహర్ 53 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ కూడా అన్నే వికెట్లతో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో భువనేశ్వర్ కుమార్ 61 వికెట్లతో ఉండగా.. 55 వికెట్లతో సందీప్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ 52 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. Deepak Chahar 🤝 Wickets in Powerplay 🕺 A #Yellove story for the ages! 💯#GTvCSK #TATAIPL #Qualifier1 #IPLonJioCinema | @ChennaiIPL @deepak_chahar9 pic.twitter.com/Ethh2nnjZu — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: #NoBall: ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు.. -
#NoBall: ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు..
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్టైటాన్స్తో క్వాలిఫయర్-1 పోరులో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే నోబాల్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్ నల్కండే బౌలింగ్లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మూడో బంతిని గైక్వాడ్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న గిల్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. డేంజరస్ బ్యాటర్ రుతురాజ్ వెనుదిరగడంతో తొలి వికెట్ దక్కిందన్న సంతోషం దర్శన్ నల్కండే మొహంలో కనిపించింది. కానీ మరుక్షణమే ఆ సంతోషం ఆవిరైంది. అంపైర్ నోబాల్ ప్రకటించడంతో రుతురాజ్ ఊపిరి పీల్చుకొని వెనక్కి వచ్చాడు. అలా నోబాల్ అవడంతో బతికిపోయిన రుతురాజ్ ఆ తర్వాత 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అంటే ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు అన్నమాట. తొలి ఇన్నింగ్స్ కావడంతో రుతురాజ్ ఇన్నింగ్స్ ఎంతవరకు గుజరాత్కు నష్టం తెస్తుందనేది చెప్పలేం. Gaikwad: From🙁 to 🤩 A twist of fate sees Ruturaj maximize with the bat in #GTvCSK ⚔️#IPLPlayOffs #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @ChennaiIPL pic.twitter.com/dOfabAaXTS — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్ -
డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ను స్టార్స్టోర్ట్స్లో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్లో ఒక్కో డాట్ బాల్ను సదరు బ్రాడ్కాస్ట్ సంస్థ స్కోరుబోర్డులో ఒక్కో చెట్టు గుర్తును చూపించింది. అదేంటి డాట్ బాల్ అనగానే స్కోరు బోర్డును సున్నా కనిపించాలి గాని ఇలా చెట్టు కనిపించడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక బీసీసీఐ చేసిన ఒక గొప్ప ఆలోచన బయటకొచ్చింది. అదేంటంటే.. Green Initiative(పర్యావరణం పెంపొందించడానికి) పేరిట బీసీసీఐ ఒక వినూత్న కార్యం చేపట్టింది. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్లో అన్ని డాట్ బాల్స్ను కలిపి 500 మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. బీసీసీఐ ఆలోచనను అభినందించిన స్టార్స్టోర్ట్స్ యాజమాన్యం గుజరాత్, సీఎస్కే ప్లేఆఫ్ మ్యాచ్లో నమోదైన డాట్ బాల్స్ స్థానంలో చెట్టు గుర్తును ఉంచేలా ప్రణాళిక రూపొందించింది.ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పర్యావరణాన్ని కాపాడేందుకు బీసీసీఐ చేసిన గొప్ప ఆలోచనను మెచ్చుకుంటున్నారు. Qualifier 1 | #GTvCSK What's that Tree for @JioCinema??#IPLPlayOffs #CricketTwitter pic.twitter.com/TYiOy8tczr — Anika🇮🇳 (@SportsIndia036) May 23, 2023 చదవండి: ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు -
IPL 2023: క్వాలిఫయర్-1లో ఘన విజయం.. ఫైనల్లో సీఎస్కే
గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో సీఎస్కే 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. 173 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకు ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ 42 పరుగులు చేయగా.. రషీద్ ఖాన్ 16 బంతుల్లో 30 పరుగులు మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. సీఎస్కే బౌలర్లలో జడేజా, దీపక్ చహర్, మతీశా పతీరానా, మహీష్ తీక్షణలు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. తుషార్ దశ్పాండే ఒక వికెట్ తీశాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ఫైనల్లో ప్రవేశించడం ఇది పదోసారి కావడం విశేషం. 15 ఓవర్లలో గుజరాత్ 102/6 15 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోక దిగిన గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయ్ శంకర్ 6 పరుగులు, రషీద్ ఖాన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. తిప్పేసిన జడేజా, చహర్.. ఐదో వికెట్ డౌన్ సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన బౌలింగ్ మాయాజాలంతో ప్రమాదకర మిల్లర్ను బోల్తా కొట్టించాడు. 4 పరుగులు చేసిన మిల్లర్ జడ్డూ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. మరుసటి ఓవర్లో దీపక్ చహర్ బౌలింగ్లో 42 పరుగులు చేసిన గిల్.. కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ 88 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 9 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 59/2 9 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. గిల్ 32, షనక 10 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 173.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్ 173 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ 20 పరుగులతో ఆడుతున్నాడు. అంతకముందు 8 పరుగులు చేసిన పాండ్యా తీక్షణ బౌలింగ్లో, 12 పరుగులు చేసిన సాహా దీపక్ చహర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగారు. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 173 గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. డెవాన్ కాన్వే 40 పరుగులు చేయగా.. ఆఖర్లో జడేజా 16 బంతుల్లో 22, మొయిన్ అలీ 4 బంతుల్లో 9 పరుగులు నాటౌట్గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మ్ద్లు తలా ఒక వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 125/4 గుజరాత్తో మ్యాచ్లో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన కాన్వే షమీ బౌలింగ్లో రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రాయుడు 4, జడేజా 2 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 13 ఓవర్లలో 99/2 శివమ్ దూబే(1 పరుగు) రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. అంతకముందు 60 పరుగులు చేసిన రుతురాజ్ మోహిత్ శర్మ బౌలింగ్లో మిల్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 13 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. కాన్వే 31, రహానే 4 పరుగులతో ఆడుతున్నారు. ఫిఫ్టీతో మెరిసిన రుతురాజ్.. 10 ఓవర్లలో సీఎస్కే 85/0 గుజరాత్టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1 పోరులో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అర్థసెంచరీ మెరిశాడు. సీజన్లో నాలుగో అర్థసెంచరీ సాధించిన గైక్వాడ్ 36 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఫిప్టీ సాధించాడు. ప్రస్తుతం సీఎస్కే 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. రుతురాజ్ 59, కాన్వే 24 పరుగులతో ఆడుతున్నారు. ఆరు ఓవర్లలో సీఎస్కే 49/0 6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. రుతురాజ్ 33, కాన్వే 14 పరుగులతో ఆడుతున్నారు. నో బాల్తో బతికిపోయిన రుతురాజ్.. 3 ఓవర్లలో సీఎస్కే 23/0 గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-1 పోరులో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ నో బాల్ కారణంగా ఔట్ నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్లో దర్శన్ నల్కండే వేసిన మూడో బంతికి రుతురాజ్ గిల్కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఇక 3 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రుతురాజ్ 18, కాన్వే 3 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మంగళవారం(మే 23న) క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్, సీఎస్కే తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ Hardik Pandya wins the toss & elects to do what his team does best - 𝘊𝘏𝘈𝘚𝘌 😎 Predict what total #CSK will restrict them to in Qualifier 1 💬#IPLonJioCinema #TATAIPL #GTvCSK #IPLPlayoffs #IPL2023 | @gujarat_titans @ChennaiIPL pic.twitter.com/kNV55gQl6J — JioCinema (@JioCinema) May 23, 2023 ఈ మ్యాచ్లో ఇరుజట్లు ఫెవరెట్గా కనిపిస్తున్నప్పటికి హోంగ్రౌండ్లో ఆడడం సీఎస్కేకు కలిసొచ్చే అంశం. ఇరుజట్ల బలబలాలు సమానంగా ఉన్నప్పటికి గుజరాత్తో పోలిస్తే సీఎస్కే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది. ఇక ఇరుజట్లు గతంలో మూడుసార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్నే విజయం వరించింది. -
'నాలుగేళ్ల వయసులో వాడేంటో తెలిసింది... ఇది ఊహించిందే!'
శివమ్ దూబే గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆడుతున్న ఈ యంగ్ ప్లేయర్ తానేంటో ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు. పవర్ హిట్టర్గా పేరు పొందిన శివమ్ దూబే ఈ సీజన్లోనూ మరింత రాటుదేలాడు. భారీ సిక్సర్లకు పెట్టింది పేరైన దూబే గ్రౌండ్లోకి అడుగుపెట్టింది మొదలు సిక్సర్లు బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సీజన్లో సీఎస్కే తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా దూబే నిలిచాడు. 12 ఇన్నింగ్స్ల్లో దూబే 12 ఫోర్లు, 33 సిక్సర్లతో 385 పరుగులు చేశాడు. ఫోర్లు కొట్టడం కంటే సిక్సర్లు కొట్టడమే ఇష్టమని శివమ్ దూబే పేర్కొన్నాడు. అయితే దూబే బాదుడును తండ్రి రాజేశ్ దూబే ముందే ఊహించాడట. దూబే నాలుగేళ్ల వయసులోనే వాడి హిట్టింగ్ పవరేంటో తెలిసిందని రాజేశ్ దూబే చెప్పుకొచ్చాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాజేశ్ దూబే మాట్లాడుతూ.. ''వాడికి(శివమ్ దూబే) నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే హిట్టింగ్ పవర్ ఏంటో చూశాను. టెన్నిస్ బంతి పడడమే ఆలస్యం ముందుకొచ్చి బంతిని కసితీరా బాదేవాడు. అప్పుడే నిర్ణయించుకున్నా వాడు క్రికెటర్ అవ్వాలని. అందుకోసం ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేయించేవాడిని. అలా 20 నుంచి 24 ఏళ్ల పాటు వాడి తొలి కోచ్ను అయ్యా. స్వయానా నేను రెజ్లర్ కావడం వాడి శిక్షణకు కాస్త ఉపయోగపడింది. ఇక ప్రాక్టీస్ తర్వాత ఊరిలోనే ప్రత్యేకంగా తయారు చేసిన ఆముదం నూనెతో గంటన్నర పాటు దూబే శరీరానికి మసాజ్ చేసేవాడిని. అండర్-14 వెళ్లేవరకు దూబేకు ఓనమాలు నేర్పిన గురువునయ్యాను. ఆ తర్వాత వాడు క్రమంగా ఎదిగాడు. ఇంటికొచ్చిన ప్రతీసారి కూడా వాడితో నేను క్రికెట్ ఆడేవాడిని. బ్యాటింగ్లో లోపాలు ఉంటే గుర్తించి చెప్పేవాడిని. ఆరు అడుగులకు పైగా ఎదిగిన వాడు బ్యాట్ పట్టి సిక్సర్లు కొడితే మైదానం బయటే పడేవి. పవర్ హిట్టింగ్ అనేది వాడికి చిన్నప్పటి నుంచే ఇష్టం. ఐపీఎల్లో వాడు కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేదు. నా దృష్టిలో దేశానికి ఆడడం గొప్ప అచీవ్మెంట్. అది దూబే సాధించాడు. 2019 నవంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకు టీమిండియా తరపున 14 మ్యాచ్లాడడం గొప్ప విషయం. అయితే ఆ తర్వాత తుది జట్టులో చోటు కోల్పోవడం బాధించినా.. ఈ సీజన్లో దూబే చేస్తున్న ప్రదర్శను చూసిన తర్వాత మళ్లీ టీమిండియాలో అడుగుపెడతాడని నమ్మకం వచ్చింది.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజీలో బద్దలైన రికార్డులివే కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా -
గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఎవరి బలమెంత..?
-
ఛాంపియన్ ఎవరు?
-
ప్లేఆఫ్ ముంగిట ధోని ఫిట్నెస్పై హస్సీ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే రెండో జట్టుగా ప్లేఆఫ్కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్పై 77 పరుగుల విజయంతో 17 పాయింట్లు ఖాతాలో వేసుకున్న సీఎస్కే గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-1 ఆడనుంది. కేకేఆర్తో మ్యాచ్ను లక్నో సూపర్ జెయింట్స్ విజయం దిశగా పయనిస్తున్నప్పటికి అనుకున్న ఓవర్లలో పూర్తి చేయకపోవడంతో రన్రేట్ సీఎస్కే కంటే తక్కువ ఉంది. దీంతో సీఎస్కే రెండో స్థానంలో నిలచి సొంత ప్రేక్షకుల మధ్య క్వాలిఫయర్-1 ఆడనుంది. ఇదిలా ఉంటే ధోని ఫిట్నెస్పై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని.. అందుకే పరుగులు తీసేందుకు ఇష్టపడడం లేదని తెలిపాడు. సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో మైక్ హస్సీ కామెంటేటర్తో మాట్లాడాడు. ధోని మోకాలి సమస్య వంద శాతం సమసిపోలేదు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అందుకే ఎక్కువగా పరుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. బ్యాటింగ్కు కూడా ఆఖరి 2-3 ఓవర్లలో రావడానికి కారణం కూడా అదే. నొప్పిని భరిస్తూనే తన పనిని పూర్తి చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇంత బాధపెట్టుకొని కూడా అతను తన టార్గెట్ను మిస్ అవకుండా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకొని సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాడు. కాగా ధోని విషయంలో హస్సీ చేసిన వ్యాఖ్యలు నిజమే. ధోని కూడా మ్యాచ్ల్లో చాలాసార్లు తన మోకాలికి బ్యాండేజీ లేదా ఐస్క్యాప్ పెట్టుకోవడం కనిపించింది. అంతేకాదు ధోనికి ఈ సీజన్ చివరిదని రూమర్లు కూడా వచ్చాయి. కానీ రూమర్లను స్వయంగా కొట్టిపారేసిన ధోని 2024 ఐపీఎల్ కూడా ఆడొచ్చని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఇక హస్సీ వ్యాఖ్యలు సీఎస్కే అభిమానులను ఆందోళనలో పడేసింది. ఒకవేళ ప్లేఆఫ్ సమయానికి ధోనికి మోకాలి సమస్య ఎక్కువై మ్యాచ్కు దూరమైతే సీఎస్కే పరిస్థితి ఏంటని తెగ బాధపడుతున్నారు. ''దయచేసి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. ప్లేఆఫ్స్కు చేరుకున్న సమయంలో ధోని ఫిట్నెస్పై ఆందోళన కలిగించేలా మాట్లాడడం సరికాదని'' అభిమానులు పేర్కొన్నారు. చదవండి: జడేజాపై సీరియస్ అయిన ధోని! -
జడేజాపై సీరియస్ అయిన ధోని!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ప్లేఆఫ్కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. 224 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితం కావడంతో 17 పాయింట్లతో సీఎస్కే ప్లేఆఫ్కు అర్హత సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని జడేజాపై సీరియస్ కావడం ఆసక్తి కలిగించింది. ఈ ఘటన సీఎస్కే ఆటగాళ్లు ఒకరినొకరు అభినందించుకున్న అనంతరం జరిగింది. డగౌట్వైపు వెళ్తున్న సమయంలో జడ్డూ దగ్గరికి వచ్చిన ధోని సీరియస్గా ఏదో అంశమై చర్చించాడు. అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన జడేజా మొహం ఒక్కసారిగా మారిపోయింది. ధోని మాట్లాడుతూ జడ్డూ భుజాలపై చేతులు వేసి ఏదో తప్పు చేసినట్లుగా క్లాసు పీకాడు. ఈ సమయంలో జడేజా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత చేతుల తీసేసిన ధోని జడేజా చెప్పేది వినకుండా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇద్దరి మధ్య ఏ విషయంలో సీరియస్ చర్చ జరిగిందనేది అర్థం కాలేదు. అయితే మ్యాచ్లో జడేజా బ్యాటింగ్లో ఏడు బంతుల్లో 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి బౌలింగ్లో 4 ఓవర్లు వేసి 50 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బహుశా ఇదే విషయమై ధోని కూడా జడేజాను హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ చేశారు. pic.twitter.com/eSlQpheFFc — The Game Changer (@TheGame_26) May 20, 2023 చదవండి: నిలకడకు నిలువుటద్దం.. ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్కు -
నిలకడకు నిలువుటద్దం.. ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్కు
ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ ఆడడం దాదాపు ఖరారైనట్లే. ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ని 77 పరుగుల భారీ తేడాతో ఓడించిన సీఎస్కే సీజన్లో 8వ విజయాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో 12వ సారి ప్లేఆఫ్స్ ఆడనున్న ధోని సేన అత్యధికసార్లు ప్లేఆఫ్స్కు వెళ్లిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 17 పాయింట్లతో సీఎస్కే గుజరాత్ టైటాన్స్తో మొదటి క్వాలిఫైయర్ ఆడడం దాదాపు ఖాయమే. సీఎస్కే క్వాలిఫైయర్ ఆడకుండా ఆపాలంటే లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్పై 100+ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇది అసాధ్యమైనప్పటికి టి20 క్రికెట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం ఐపీఎల్లో ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్కు.. ఇక ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ప్లేఆఫ్ చేరడం ఇది 12వ సారి. 2008 ఆరంభ సీజన్ మొదలుకొని 2023 వరకు జరిగిన 16 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్ చేరడం అంటే మాటలు కాదు. ధోని లాంటి నాయకుడు జట్టులో ఉండడం.. నిలకడకు నిలువుటద్దంలా నిలిచింది సీఎస్కే. మధ్యలో రెండు సీజన్లలో(2016,2017) సీఎస్కే బ్యాన్కు గురైన సంగతి తెలిసిందే. ఇక 2020, 2022లో రెండు సీజన్లు మాత్రమే దారుణంగా ఆడిన సీఎస్కే ఏడో స్థానానికి పరిమితమైంది. ఇది మినహా మిగతా అన్నిసార్లు ప్లేఆఫ్ చేరిన జట్టుగా నిలిచింది. ఇందులో నాలుగుసార్లు ఛాంపియన్గా(2010, 2011, 2018, 2021), ఇక 2008, 2012, 2013, 2015, 2019లో రన్నరప్గా నిలవడం విశేషం. 2009లో నాలుగోస్థానం, 2014లో మూడో స్థానానికి పరిమితమైంది. A terrific victory in Delhi for the @ChennaiIPL 🙌 They confirm their qualification to the #TATAIPL 2023 Playoffs 😎 Scorecard ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/OOyfgTTqwu — IndianPremierLeague (@IPL) May 20, 2023 CSK qualifies for the 12th time in 14 seasons of the IPL. - The most consistent side under the leadership of MS Dhoni! pic.twitter.com/UKtIMwQdvY — Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2023 చదవండి: #JadejaVsWarner: బుట్టబొమ్మ వర్సెస్ పుష్ప -
#JadejaVsWarner: బుట్టబొమ్మ వర్సెస్ పుష్ప
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో వార్నర్, జడేజా మధ్య జరిగిన ఫన్నీ సంఘటన నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ దీపక్ చహర్ వేశాడు. ఓవర్ మూడో బంతిని వార్నర్ కవర్స్ దిశగా ఆడాడు. రిస్క్ ఉన్నప్పటికి సింగిల్ పూర్తి చేశాడు. అయితే మొయిన్ అలీ త్రో వేయగా రహానే దానిని అందుకున్నాడు. ఇక్కడ వార్నర్ మరో పరుగు తీయడానికి ప్రయత్నించాడు. అవతలి ఎండ్లో ఉన్న జడేజా బంతి తనకు వేయమంటూ సైగ్ చేశాడు. దీంతో రహానే బంతిని జడ్డూవైపుకు విసిరాడు. అప్పటికే వార్నర్ క్రీజులోకి వెళ్లిపోయాడు. కానీ ఇక్కడే ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. బంతిని అందుకున్న జడ్డూ త్రో వేస్తానని బెదిరించడం.. వార్నర్ కూడా నాకేం భయం లేదు అన్నట్లుగా క్రీజు దాటాడు.. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కాసేపటికి వార్నర్ జడ్డూ స్టైల్లో బ్యాట్ను కత్తిలా తిప్పడం.. జడ్డూ కూడా తగ్గేదేలా అంటూ పుష్ప స్టైల్ను అనుకరించడంతో నవ్వులు విరపూశాయి. వార్నర్, జడ్డూ చర్యను పిలిప్ సాల్ట్ సహా సీఎస్కే ఆటగాళ్లు బాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Butta Bomma ⚔️ Pushpa 😀pic.twitter.com/Ron09NWd1p — Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2023 చదవండి: అంతులేని అభిమానం.. ఒక్కడి కోసం బస్సును చుట్టుముట్టారు -
అంతులేని అభిమానం.. ఒక్కడి కోసం బస్సును చుట్టుముట్టారు
ఐపీఎల్ ఏ ముహుర్తానా మొదలైందో తెలియదు కానీ క్రికెట్ అభిమానులకు ధోని ఫీవర్ పట్టుకుంది అని మాత్రం చెప్పగలం. ధోని ఎక్కడికి వెళ్లినా వస్తున్న క్రేజ్ మాత్రం ఒక లాగానే ఉంటుంది. తాజాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో సీఎస్కే మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు సీఎస్కే స్టేడియానికి వస్తున్న వీధులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. కారణం బస్సులో ధోని ఉండడమే. స్టేడియానికి వెళ్లే దారి పొడవునా సీఎస్కే జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును చుట్టుముట్టారు. కొందరు కార్ల బానెట్లపై నిలబడి తమ అభిమాన ఆటగాడికి చేతులూపారు. ధోని చూడడానికి చాలా మంది రావడంతో బస్సు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. కాసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికి ఆ తర్వాత బస్సుకు దారి ఇచ్చారు. అయితే అభిమానానికి హద్దులుండవని ఈ సంఘటనతో మరోసారి రుజువు అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా.. సరిహద్దు లేని అభిమానం అంటే ఇదే అంటూ కామెంట్ చేశారు. ఇక సీఎస్కే కూడా బస్సును చుట్టుముట్టిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఒక్కడి కోసం రాజధాని నగరం జనంతో నిండిపోయింది.. ఈ దృశ్యం చూడడానికి మా కళ్లు చాలడం లేదు అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక సీఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా దర్జాగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ప్రస్తుతం సీఎస్కే 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నప్పటికి.. లక్నో కూడా 15 పాయింట్లతోనే ఉంది. Fans behind the CSK bus in Delhi. This is madness. pic.twitter.com/P594b5r8QL — Johns. (@CricCrazyJohns) May 20, 2023 Thaana Serndha Kootam at ThalaiNagaram! 🦁#DCvCSK #WhistlePodu #Yellove 💛 pic.twitter.com/LrgHw3SQYM — Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2023 చదవండి: ఏందీ క్రేజ్.. బంతులు వేయాలంటే భయపడుతున్నారు! -
ఏందీ క్రేజ్.. బంతులు వేయాలంటే భయపడుతున్నారు!
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ప్లేఆఫ్కు చేరుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. దీనిలో భాగంగా తొలి అంకం దిగ్విజయంగా పూర్తైంది. శనివారం ఢిల్లీతో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో సీఎస్కే 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రుతురాజ్, కాన్వేలు అర్థసెంచరీలతో రాణించగా.. మధ్యలో శివమ్ దూబే, ఆఖర్లో జడేజా విలువైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే మ్యాచ్లో మాత్రం వీరందరిని దాటి ధోని మరోసారి హైలెట్ అయ్యాడు. తాను ఆడింది ఐదు బంతులు.. చేసింది నాలుగు పరుగులు.. అయినా స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. మ్యాచ్ ఢిల్లీలో జరుగుతున్నా సపోర్ట్ మాత్రం సీఎస్కేకే. ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడో ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. అందుకే స్టాండ్స్ అన్ని సీఎస్కే జెర్సీలతో నిండిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ధోనిపై ఉన్న అభిమానం మరొక ఎత్తు. సీజన్లో ధోని క్రేజ్ ఎలా ఉందంటే అతను ఒక్క బంతి ఆడినా చాలు మాకు అదే మహాభాగ్యం అన్నట్లుగా అభిమానులు పరవశించిపోతున్నారు. అయితే ధోని క్రేజ్కు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలో సరైన బంతులు వేయడంలో విఫలమవుతున్నారు. తాజాగా సీఎస్కే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన చేతన్ సకారియా బౌలింగ్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఓవర్ చివరి రెండు బంతులు వేయాల్సిన చోట ఒక నోబాల్, వైడ్బాల్ వేశాడు. కారణం ఎదురుగా క్రీజులో ఉంది ధోని. దీంతో అటు స్టేడియం మొత్తం ధోని.. ధోని అరుపులతో దద్దరిల్లడంతో ఒత్తిడికి లోనవుతున్న బౌలర్లు బంతులను సరిగా వేయడం లేదని అభిమానులు వాపోయారు. చదవండి: '16.25 కోట్లు పట్టుకుపోతున్నాడు.. ఇంపాక్ట్గా కూడా పనికిరాలేదా?'