discussions
-
రైతు నేతలతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు
చండీగఢ్: రైతు సంఘాల నేతలతో సుహృద్భావ వాతవరణంలో చర్చలు జరిగాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ చెప్పారు. తదుపరి సమావేశం మార్చి 19న జరగబోతోందని అన్నారు. రైతాంగం సమస్యలపై రైతుల సంఘాల నాయకులు, కేంద్ర బృందం మధ్య శనివారం చండీగఢ్లో చర్చలు జరిగాయి. కేంద్ర బృందానికి చౌహాన్ నేతృత్వం వహించారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్ సైతం పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలపాటు చర్చలు కొనసాగాయి. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు నాయకులు పట్టుబట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేదాకా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. రైతుల తరఫున జగ్జీత్ సింగ్ దలేవాల్, సర్వాన్సింగ్ హాజరయ్యారు. -
ఆదిమూలం కేసు: అజ్ఞాతంలోకి వరలక్ష్మి.. టీడీపీ నేతల రహస్య మంతనాలు!
సాక్షి, చిత్తూరు జిల్లా: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కేసు దర్యాప్తునకు అవసరమైన ఆరు రకాల పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరణ పూర్తయిన తర్వాత వరలక్ష్మి నిన్న(గురువారం) డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.వరలక్ష్మి జాడ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆదిమూలం-వరలక్ష్మిల మధ్య రాజీ కుదుర్చేందుకు టీడీపీ నాయకులు రహస్య మంతనాలు జరుపుతుండగా, ఈ క్రమంలోనే వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలుమరోవైపు, ఈ కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.కాగా, బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. -
Lok Sabha elections 2024: కాంగ్రెస్, ఆప్ సీట్ల సర్దుబాటు!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మంతనాలు మొదలెట్టాయి. త్వరలోనే ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం వెలువడనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అయితే ఇప్పటికే కొన్ని ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలనే దానిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో ఆప్ బరిలో దిగనుంది. చాంద్నీ చౌక్, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెడుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో ఈ ఏడు ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. హరియాణాలో ఒకటి, గుజరాత్లో రెండు స్థానాలను ఆప్కే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గురుగ్రామ్ లేదా ఫరీదాబాద్లో ఆప్ పోటీచేయనుంది. గుజరాత్లోని భరూచ్ స్థానం నుంచి ఆప్ నేత ఛైతర్ వసావా, భావ్నగర్లో ఉమేశ్భాయ్ మాక్వానా పోటీ చేస్తారని ఇప్పటికే ఆప్ ప్రకటించింది. -
108, 104 ఉద్యోగుల సమ్మె లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 108, 104 ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం: మంత్రి రజిని ఈ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి రజిని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దక్కాయని వివరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజిపైనా ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా క్రమం తప్పకుండా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వ్యవస్థను, వాహనాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏ సమస్యలు రానీయరని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తోందో, ఉద్యోగులకు కూడా ఏ సమస్యలూ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీలకు ఉద్యోగుల సంఘ నేతలు అంగీకరించారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఫణికుమార్, ఉపాధ్యక్షుడు రాంబాబు, అరబిందో సంస్థ నుంచి ఎంవీ సత్యనారాయణ, రాకేష్ పాల్గొన్నారు. -
ఆరోగ్య రంగానికీ నియంత్రణలు!
న్యూఢిల్లీ: ఆరోగ్య పరిరక్షణ రంగానికి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు.. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆరోగ్య శాఖల మధ్య ఇందుకు ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఇద్దరు తెలియజేశారు. అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యాన్ని సాధించేందుకు మరింత సమర్ధవంత చర్యలకు తెరతీయవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య బీమాను అందుబాటులో అందరికీ అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల జాతీయ బీమా ఏజెన్సీ(ఎన్ఐఏ) వెలువరించిన నివేదిక ప్రకారం 40 కోట్లమందికిపైగా వ్యక్తులకు జీవిత బీమా అందుబాటులో లేదు. అంటే మొత్తం జనాభాలో మూడో వంతుకు బీమా అందడం లేదు. బీమా వ్యాప్తిలేకపోవడం, చాలీచాలని కవరేజీ, ఆరోగ్య పరిరక్షణా వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు కారణాలుగా అధికారులు పేర్కొన్నారు. అయితే చికిత్సా వ్యయాలలో ప్రామాణికత, ఆరోగ్య క్లెయిములను పరిష్కారించడం తదితర అంశాలలో విభిన్న సవాళ్లు, అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలో తాజాగా ఏర్పాటు చేయతలపెట్టిన నియంత్రణ సంస్థ తప్పనిసరిగా వీటిని పరిష్కరించవలసి ఉంటుందని తెలియజేశారు. వెరసి సవాళ్ల పరిష్కార వ్యూహాలు, నియంత్రణ సంస్థ(హెల్త్ రెగ్యులేటర్) పాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు ఆరోగ్య బీమా రంగ కంపెనీలతోపాటు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాకుండా హెల్త్ రెగ్యులేటర్.. ఆరోగ్య క్లెయిముల జాతీయ ఎక్సే్ఛంజీ(ఎన్హెచ్సీఎక్స్) పరిధిని విస్తరించడం, పరిశ్రమను మరింత సమర్ధవంతంగా పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉండటం ముఖ్యమని మరో అధికారి వ్యాఖ్యానించారు. -
ఇంతకూ ఎవరు గెలుస్తారంటావ్!
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటావ్? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఓటరు నాడి ఎలా ఉంది?’’ ప్రభుత్వ కార్యాలయాల్లో తరచూ వినిపించిన ప్రశ్నలివి. అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు తారసపడిన వ్యక్తులతో ఆసక్తిగా ప్రశ్నలడిగారు. వాటికి వస్తున్న జవాబులతో ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ విశ్లేషణ వాతావరణం కనిపించింది. సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్తో ప్రభుత్వ స్థాయిలో కొత్త కార్యక్రమాలేవీ లేవు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి కొత్తగా లబ్ధిదారుల ఎంపిక, లబ్థి చేకూర్చే కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులకు కాస్త విరామం దొరికినట్టయ్యింది. దీంతో ఆ కార్యాలయాల్లో ఎటు చూసినా ఎన్నికలపైనే చర్చోపచర్చలు జరిగాయి. ఉద్యోగులు కాకుండా ఇతరులెవరైనా కార్యాలయానికి వెళ్తే ‘‘ఎవరు గెలుస్తారంటావ్’’ అంటూ ఉద్యోగులు సరదాగా ఆసక్తికర చర్చ పెట్టారు. ఉన్నతాధికారులు సైతం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలివి. వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్(అప్పట్లో టీఆర్ఎస్) అధికారం చేపట్టగా... ఇప్పుడు మూడోసారి కూడా గెలుపుపై అదే ధీమా వ్యక్తం చేస్తూ అందరి కంటే ముందుగా ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటరు నాడిని అంచనా వేస్తూ గత పదేళ్లలో జరిగిన సంక్షేమ పథకాలు, లబి్ధదారులు, ఓటరు నాడి తదితర విశ్లేషణతో గెలుపోటములు ఎలా ఉంటాయో ఊహాజనిత అంచనాలకు దిగారు. స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్న చర్చల్లో కొందరు ఉన్నతాధికారులు సైతం పాలుపంచుకుంటున్నారు. అప్పుడే బెట్టింగ్లు? చాలామంది ఉద్యోగులు, అధికారులు వారి సొంత నియోజకవర్గాలు, పనిచేసిన నియోజకవర్గాల్లో స్నేహితులను ఫోన్లలో అడిగి మరీ ఎన్నికల సరళిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, మరి కొందరు మరో పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తూ కొందరైతే ఏకంగా బెట్టింగులకు సైతం దిగారు. ఇదీ చదవండి: ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్ -
‘సెమీఫైనల్’ వ్యూహాలకు పదును!.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న సారత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలకు బీజేపీ పెద్దలు పదును పెడుతున్నారు. ఈ ఏడాది చివరన ఎన్నికలు జరిగే తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మిజోరం ఎన్నికలకు కార్యాచరణను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ భవనంలో సోమవారం అర్ధరాత్రి వరకు, తిరిగి మంగళవారం ఉదయం దాదాపు పది గంటలపాటు కీలక చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీకున్న బలాబలాలు, బలహీనతలను బేరీజు వేసుకొని వాటిని అధిగమించే అంశంపై మేథోమథనం జరిపారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపునకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకంగా ఉండటం, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, రాజస్తాన్లో 25, మధ్యప్రదేశ్లో 29, ఛత్తీస్గఢ్లో 11 స్థానాలు కలిపి మొత్తంగా 82 స్థానాలు ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితేనే లోక్సభ ఎన్నికల్లో గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులోభాగంగా కొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను, ఇంచార్జీలను మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణలో ఏం చేయాలి? తెలంగాణలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడంతోపాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్లో ఉన్న అసమ్మతిని తమవైపు తిప్పుకునే అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీంతోపాటే కొత్తగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో సహా ఇతర కమిటీల నియామకాలను పూర్తి చేస్తూనే, సంస్థాగత నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఈటల రాజేందర్కు ముఖ్యమైన బాధ్యతలు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై అసంతృప్తిగా ఉన్న నేతలతో మాట్లాడి.. నేతల మధ్య ఐక్యత చెడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు సమాచారం. పార్టీ ప్రచార కార్యక్రమాలు, ఈ నెలలో తెలంగాణలో జరిపే పర్యటనలపైనా చర్చించారు. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, అధికార పక్షం లేదా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న అసమ్మతి నేతలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు అవకాశాలపైనా సమాలోచనలు చేశారు. అలాంటివి సాధ్యంకాని చోట ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకతను సొమ్ముచేసుకునే అంశంపై చర్చించినట్లు చెబుతున్నారు. ఇందులోభాగంగానే ఇటీవల జరిపిన భేటీలో తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ ముందుంచిన ప్రతిపాదనలపైనా ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఆయా అంశాలపై ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్న పార్టీ ఇంచార్జి సునీల్ బన్సల్ అభిప్రాయాలను కూడా ముగ్గురు అగ్రనేతలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. చదవండి: పోలీసులు రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి -
బీజేపీ అధినాయకత్వం వరుస భేటీలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో సాగుతున్న సమాలోచనలపై రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో వేర్వేరుగా చర్చలు జరుపుతుండటంతో రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన పరిణామాలు ఏవైనా చోటుచేసుకోనున్నాయా? ఈ వరుస భేటీల ఆంతర్యమేంటి? ఎలాంటి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్న దానిపై పార్టీలో చర్చలు సాగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ విషయంలో జాతీయ నాయకత్వం ఆచితూచి స్పందిస్తోంది. ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. రాష్ట్ర పార్టీలో సమన్వయ లేమి, నేతల్లో అసంతృప్తి, ఉమ్మడిగా ముందుకెళ్లకపోవడం, కేసీఆర్ సర్కార్పై ప్రజా వ్యతిరేకతను సరైన పద్దతిలో బీజేపీకి అనుకూలంగా మలచకపోవడం, ముఖ్య నేతలు తమ సొంత ప్రచారానికే ప్రయత్నించడం, నాయకత్వం అందరినీ కలుపుకొనిపోవడం లేదనే విమర్శలు వంటివాటిపై కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టింది. జాతీయ నాయకత్వం వద్ద నోరువిప్పుతున్న నేతలు! నాలుగైదు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న చర్చల్లో రాష్ట్ర నేతలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, నాయకుల వ్యవహారశైలి, ఇతర విషయాలను జాతీయ నాయకులకు వివరించినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, విధానాలు సరిపోవని.. ఇప్పటివరకు పాటించిన పద్ధతులకు భిన్నంగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని వారు సూచించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే నాయకత్వ మార్పు, విడిగా ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీలు ఏర్పాటు చేసి పూర్తిగా ఎన్నికల బాధ్యతలు కట్టబెట్టడం వంటి అంశాలు తెరపైకి వచ్చినట్టు సమాచారం. దీనితోపాటు తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని, ఇక్కడ హిందూత్వ ఎజెండాను పక్కనపెట్టి లౌకికవాదంతో బీసీలు, అణగారినవర్గాలకు భరోసా కల్పించేలా సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వినిపించినట్టు తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ విధానాలు, వారి కుటుంబసభ్యులపై వచ్చిన అవినీతి, అక్రమాల ఆరోపణలు, తొమ్మిదేళ్ల పాలన వైఫల్యాలు, హామీల అమల్లో వెనకడుగు వంటి అంశాల్లో బీజేపీ వైఖరిని సుస్పష్టం చేయాలని సూచించినట్టు సమాచారం. అభిప్రాయాలన్నీ తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాష్ట్ర పార్టీ చర్చనీయాంశమైంది. కొత్త వారికి పెద్దపీటతో అసంతృప్తి! గత రెండు, మూడేళ్లలో పార్టీలో చేరిన వారికి జాతీయ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న అభిప్రాయం రాష్ట్రంలోని సీనియర్లు, పాత నేతల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరాక వారు ఏ మేరకు పార్టీకి ఉపయోగపడ్డారు, ఓటర్లను పార్టీవైపు మళ్లించేందుకు కీలకంగా వ్యవహరించారా, వారి సొంత ప్రాంతాలు, జిల్లాలు, నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కృషిచేశారా అన్నది కూలంకషంగా పరిశీలించాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నింటితో నిమిత్తం లేకుండానే పలువురిని ఏకంగా జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించడంతో పార్టీలో నాయకుల మధ్య అసమానతలు తలెత్తాయనే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి దాకా పార్టీ కార్యక్రమాల్లో వారిని వేదికపై కూర్చోబెట్టడం, మాట్లాడే అవకాశం ఇవ్వడం.. ఇదే సమయంలో సీనియర్లు, పాత నాయకులు కిందే కూర్చోవాల్సి రావడం అసంతృప్తిని పెంచుతోందన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఏర్పడిన స్తబ్దతను, సందిగ్ధతను దూరం చేసేలా.. జాతీయ నాయకత్వం నుంచి స్పష్టత అవసరమని నేతలు అంటున్నారు. -
కరెంట్ ఉద్యోగులకు 7% ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారంపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగుల జేఏసీల మధ్య చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యాలు ప్రతిపాదించిన 7 శాతం ఫిట్మెంట్తోపాటు ఇంక్రిమెంట్ల మంజూరు, పలు ఇతర ప్రతిపాదనలకు జేఏసీల ప్రతినిధులు అంగీకారం తెలిపారు. దీనితో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నట్టు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించగా, అన్నిరకాల ఆందోళనలను విరమించుకుంటున్నట్టు ఎలక్ర్టీసిటీ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. పలు విడతల్లో జరిగిన చర్చలతో.. విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై వేసిన పీఆర్సీ కమిటీ తొలుత 5శాతం ఫిట్మెంట్ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీనితో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు నేతృత్వంలోని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు.. తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ర్టీసిటీ ఎంప్లాయిస్ జేఏసీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. తొలుత 6 శాతం, తర్వాత 7 శాతానికి ఫిట్మెంట్ను పెంచుతామని యాజమాన్యాలు ప్రతిపాదించగా జేఏసీలు తిరస్కరించాయి. అయితే శనివారం మరోసారి జరిగిన చర్చల్లో అనూహ్యంగా 7శాతం ఫిట్మెంటే ఫైనల్ కావడం గమనార్హం. చర్చల్లో అంగీకారం కుదిరిన అంశాలపై యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య రాతపూర్వక ఒప్పందం జరిగింది. చర్చల్లో ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్రావు, జి.రఘుమారెడ్డి, పవర్ జేఏసీ నేతలు జి.సాయిబాబు, రత్నాకర్రావు, ఎలక్ట్రిసిటీ జేఏసీ నేత ఎన్.శివాజీ పాల్గొన్నారు. ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవీ.. ♦ 7 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు. 2022 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న 24.992 శాతం డీఏ (కరువు భత్యం) వేతనంలో విలీనం. ♦ 2022 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ వర్తింపు. బకాయిలను జీతం/పెన్షన్తో పాటు 12 నెలల సమ వాయిదాల్లో చెల్లిస్తారు. ♦ ఈపీఎఫ్కు బదులు జీపీఎఫ్ సదుపాయం కల్పనపై విద్యుత్ సంస్థల బోర్డుల్లో సానుకూల నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ♦ వర్క్మెన్, ఇతరులకు సింగిల్ మాస్టర్ స్కేలువర్తింపు. ♦ ఆర్టిజన్ల పర్సనల్ పేను బేసిక్ పేలో విలీనం చేస్తారు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్ఆర్ఏ, సీసీఏ సదుపాయం. ఈ విషయంలో పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వ జీవోల అమలు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.16 లక్షల గ్రాట్యూటీ, అదనపు పెన్షన్ సదుపాయం. ♦ జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.10లక్షలు, ఆర్టీజన్లకు రూ.2లక్షల పరిమితితో వైద్య సదుపాయం. ♦ పెద్ద జబ్బులకు జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.15లక్షల వరకు వైద్య సదుపాయం (ఒక విడతలో రూ.5లక్షల గరిష్ట పరిమితి). ♦ సెల్ఫ్ ఫండింగ్ వైద్య పథకం కింద నెలకు రూ.1,000 చెల్లిస్తే.. ఉద్యోగులు, ఆర్టీజన్లు, పెన్షనర్లకు రూ.12లక్షల వరకు వైద్య సదుపాయం. ♦ ఈఎన్టీ/డెంటల్/కంటి వైద్యానికి పరిమితి రూ.15వేల నుంచి రూ.50వేలకు పెంపు. ఆపై ఖర్చులను సెల్ఫ్ ఫండింగ్ పథకం నుంచి చెల్లిస్తారు. ♦ 5 ఏళ్లలోపు సర్విసు ఉంటే ఒక ఇంక్రిమెంట్, ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య సర్విసుంటే రెండు ఇంక్రిమెంట్లు, 15ఏళ్లకుపైగా సర్వీసు ఉంటే 3 ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ఆర్టిజన్లకు రెండు ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ప్రస్తుత అలవెన్సులను ప్రస్తుత రేట్లతో యథాతథంగా కొనసాగిస్తారు. ♦ జెన్కో ఉద్యోగుల ప్రత్యేక అలవెన్సు కొనసాగింపు 25 నుంచి ఆర్టీజన్ల సమ్మె యథాతథం ఆర్టిజన్లకు 7శాతం ఫిట్మెంట్ను తిరస్కరిస్తున్నామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. విద్యుత్ సంస్థల్లో ఆర్టీజన్లుగా విలీనమైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు. తమను చర్చలకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఆర్టిజన్లకు ఇప్పటికే హెచ్ఆర్ఏ తగ్గించారన్నారు. విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో ఆర్టిజన్లు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగినట్టుగా పీఆర్సీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. -
అక్కడ రష్యా.. ఇక్కడ చైనా..
న్యూఢిల్లీ: యుద్ధంలో మునిగిన ఉక్రెయిన్, రష్యాలతో భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని పోలుస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ‘ ఉక్రెయిన్ను ఆక్రమిస్తూ రష్యా ఆ దేశంతో ఉన్న సరిహద్దులను మార్చేస్తోంది. అదే తరహాలో భారత్తో ఉన్న సరిహద్దును మార్చేందుకు చైనా తన సైన్యం చొరబాట్లతో దుస్సాహసానికి తెగబడుతోంది’ అని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్తో చర్చాగోష్టి తాలూకూ సుదీర్ఘ వీడియోను రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. ‘బలహీన ఆర్థిక వ్యవస్థ, దమ్ములేని నాయకత్వంలో దార్శనికత కొరవడిన ప్రజలు, విద్వేషం, ఆగ్రహం కలగలిసిన ఈ పరిస్థితులను చైనా తనకు అనువుగా మలచుకుంటోంది. లద్దాఖ్లోకి వస్తామంటోంది. అరుణాచల్లో అడుగుపెడతామంటోంది’ అని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్లో ఈనెల 3వ తేదీ నుంచి మొదలయ్యే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానం పంపిన రాహుల్ గాంధీకి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి కాంగ్రెస్ ప్లీనరీ ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఫిబ్రవరి 24 నుంచి 26 దాకా.. మూడు రోజులపాటు తమ పార్టీ 85వ ప్లీనరీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం తెలియజేశారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సైతం ప్లీనరీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
Telangana VRAs: ప్రభుత్వంతో ముగిసిన వీఆర్ఏల చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు ముగిశాయి. వీఆర్ఏ సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలు ఆందోళన విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం వీఆర్ఏలు మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్పై తమకు నమ్మకం ఉందన్నారు. చదవండి: TS: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే? తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రధానితో చర్చకు తలతంపర సర్పంచ్కు పిలుపు
కంచిలి: జాతీయ బాల్య వివాహాల చట్టంలో వయస్సును సవరించడం కోసం ప్రవేశపెట్టనున్న బిల్లుపై భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న చర్చకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 8 మందిని ఎంపిక చేశారు. అందులో కంచిలి మండలం తలతంపర పంచాయతీ సర్పంచ్ డాక్టర్ దొళాయి జగబంధును కూడా ఎంపిక చేస్తూ అమరావతి నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ, ఐదుగురును సర్పంచ్లతో పీఎం మోదీ ఆన్లైన్లో ఈ విషయమై చర్చిస్తారని, ఎంపిక చేసిన 8 మంది ప్రజాప్రతినిధులకు సీఎంఓ కార్యాలయం నుంచి సమాచారం అందించినట్లు తలతంపర సర్పంచ్ డాక్టర్ జగబంధు శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ విధమైన కమిటీలను నియమించి, అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఈ నెల 31వ తేదీన అమరావతిలో ఈ కార్యక్రమం ఉంటుందని, తప్పనిసరిగా హాజరు కావాలని సమాచారం వచ్చినట్లు తెలిపారు. (చదవండి: దొంగ సొత్తు చెరువులో ఉందా..?) -
సర్వత్రా చర్చ.. హాట్ టాపిక్గా సీఎం కేసీఆర్ ప్రకటన
మొయినాబాద్(రంగారెడ్డి జిల్లా): ప్రస్తుతం చర్చంతా 111 జీవోపైనే సాగుతోంది. సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటన చేసింది మొదలు స్థానికంగా ఎక్కడ చూసినా ‘జీవో ఎత్తేస్తారంట కదా..’ అంటూ చర్చించుకోవడం కనిపిస్తోంది. జీవో పరిధిలోని గ్రామాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు ఇది ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నాయి. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం.. మహిళ కాల్ రికార్డింగ్, వీడియోలు, ఫోటోలతో.. ఇదీ జీవో కథ.. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించడంకోసం నిజాం కాలంలో ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. జలాశయాల్లో నీరు కలుషితం కాకుండా 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తెచ్చింది. జలాశయాలకు వరదనీరు వచ్చే ఎగువ ప్రాంతంలో ఉన్న ఏడు మండలాల్లోని 84 గ్రామాలను జీవో పరిధిలో చేర్చింది. నిబంధనల ప్రకారం ఈ గ్రామాల పరిధిలో కొత్త నిర్మాణాలు, పరిశ్రమలు, లేఅవుట్లు, వెంచర్లు ఏర్పాటు చేసేందుకు వీల్లేదు. దీంతో ఈ ప్రాంతంలో నగర విస్తరణ జరగలేదు. జంట జలాశయాల కింది భాగం వరకు పెద్ద నిర్మాణాలు చేపట్టి నగర విస్తరణ జరిగినా జలాశయాలను దాటి మాత్రం రాలేదు. స్థానికంగా భూముల ధరలు పెరగలేదు. అందరికీ ప్రచారాస్త్రం జీవో కారణంగా కొత్త నిర్మాణాలు చేపట్టలేకపోతున్నాం.. భూముల ధరలు పెరగడంలేదంటూ స్థానిక రైతులు, ప్రజలు వ్యతిరేకించారు. 2007లో 111 జీవో వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేసి పోరాటం చేపట్టారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులకు జీవో ఎత్తివేయాలంటూ విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. రాజకీయ పారీ్టలు సైతం ఈ జీవోను ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. రెండు సార్లు టీఆర్ఎస్ కూడా జీవోను ఎత్తేస్తామని హామీ ఇచ్చింది. సీఎం ప్రకటనతో.. ‘హైదరాబాద్ దాహర్తి తీర్చడానికి కృష్ణా, గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నాయని.. జంటజలాశయాల నీళ్లను ఇప్పుడు వాడటం లేదని.. ఇక 111 జీవో కాలం చెల్లిందని.. ఎత్తివేస్తాం’ అంటూ సీఎం ప్రకటన చేయడం హాట్ టాపిక్గా మారింది. సీఎం ప్రకటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, బస్టాపులు, ఆఫీసులు, రోడ్లపై ఎటు చూసినా ఇదే చర్చ. జీవో నిజంగా ఎత్తివేస్తే తమ భూములకు ధరలు పెరుగుతాయని రైతులు పేర్కొంటున్నారు. ఇది సాధ్యం కాదని కొందరు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తోందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో జీవోను ఎత్తివేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రతి పక్ష పారీ్టల నాయకులు ఇది ఎన్నికల డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. ముందస్తు ఎన్నికల వస్తాయనే ఊహాగానాలతోనే సీఎం ఇలాంటి ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా 111 జీవోపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచిచూడాలి. జీవో ఎత్తేస్తేనే మేలు 111 జీవోతో ఇప్పటి వరకు మా భూములకు ధరలు లేవు. భూమిపై బ్యాంకులో అప్పు తీసుకోవాలన్నా ఇబ్బంది ఉంది. జీవో ఎత్తేస్తే భూ ముల ధరలు పెరుగుతాయి. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. -మల్లేష్, రైతు, ఎత్బార్పల్లి మా పోరాట ఫలితమే.. 111 జీవోను వ్యతిరేకిస్తూ 2007 నుంచి పోరాటం చేస్తున్నాం. స్థానికులంతా జీవోను వ్యతిరేకిస్తున్నారు. మా పోరాటంతోనే ఇప్పు డు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటనను త్వరలోనే నిజం చేయాలి. -కొమ్మిడి వెంకట్రెడ్డి, 111 జీవో వ్యతిరేక పోరాట కమిటీ అధికార ప్రతినిధి ఇది ఎన్నికల డ్రామా సీఎం కేసీఆర్ 111 జీవోను ఎన్నికల స్టంట్గా వాడుకుంటున్నారు. గతంలో రెండుసార్లు జీవో ఎత్తేస్తామని హామీ ఇచ్చా రు. ఇప్పుడు ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని మరోసారి జీవోను తెరపైకి తెచ్చారు. ఇది ఎన్నికల డ్రామాలో భాగమే. -మధుసూదన్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు, మొయినాబాద్ -
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి పోరాటం
-
త్రిసభ్య కమిటీ అజెండాలో కీలక అంశాలు
-
కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేకహోదా
-
ఏపీ ప్రత్యేక హోదా అంశం: చర్చలకు రావాలని కేంద్ర హోంశాఖ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై 9 అంశాలపై చర్చ జరుపుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తోంది. జనవరి మొదటివారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాతో పాటు, రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. త్రిసభ్య కమిటీ ఎజెండాలో 9 అంశాలు... ఎజెండా1: ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ఎజెండా 2: ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్ వినియోగ సమస్యపై పరిష్కారం ఎజెండా 3: పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం ఎజెండా 4: రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు ఎజెండా 5: ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు ఖాతాల విభజన ఎజెండా 6: ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ ఎజెండా 7: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు ఎజెండా 8: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎజెండా 9: రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు -
తిలా పాపం... తలా పిడికెడు!
అనుకున్నదే అయింది. అందరూ అనుమానించినట్టే అయింది. ఏ ప్రజాసమస్య పైనా తగిన చర్చ జరగకుండానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణమయ్యాయి. అదీ... మొదట ప్రకటించిన ఆగస్టు 13 కన్నా రెండు రోజుల ముందే ముగిశాయి. ప్రతిపక్షాలు గొంతు చించుకున్నా పట్టించుకోని ప్రభుత్వం, సర్కారు సావధానంగా పోదామన్నా పట్టు వీడని విపక్షం, సాక్షాత్తూ పార్లమెంటరీ స్థాయీ సంఘం కబురు చేసినా సరే ఖాళీ లేదనే అధికార వర్గం, మంత్రి చేతిలోని ప్రకటనను చించివేసే సభ్యుల తెంపరితనం, పెద్దల సభలోనే బల్లలెక్కి అధ్యక్షుడి ఖాళీ కుర్చీ మీదకు నిబంధనావళిని విసిరేయగల దాదాగిరి, సమస్యల పరిష్కారం కన్నా ప్రతిపక్షాలదే తప్పు అన్న ప్రచారమే కీలకమని భావించిన పాలకులు, ప్రతిపక్ష మహిళా ఎంపీలపై మార్షల్స్ దౌర్జన్యం, మహిళా మార్షల్పై ఎంపీలే దాడి చేశారన్న పాలకపక్ష ఆరోపణలు – ఇలా ఈ విడత పార్లమెంట్లో ఎన్నెన్నో వివాదాలు, విషాద దృశ్యాలు. చివరకు, ఈ విడత కూడా విలువైన సభాసమయం వృథా అయింది. తిలాపాపంలో తలా పిడికెడు వాటా అన్ని పక్షాలకూ దక్కింది. లెక్కిస్తే – ఈ సమావేశాల్లో కేవలం 17 సార్లే సభ కొలువు తీరింది. నిజానికి, లోక్సభ 96 గంటలు పనిచేయాల్సి ఉండగా, కేవలం 21 గంటల 14 నిమిషాలే పని చేసింది. ఏకంగా 74 గంటల 46 నిమిషాల సమయం గందరగోళాలకే సరిపోయింది. వెరసి, నిరుడు పార్లమెంట్ ఉత్పాదకత 126 శాతం దాకా ఉంటే, ఈసారి ఏకంగా 22 శాతానికి పడిపోయింది. సాధారణంగా సభా నిర్వహణకు నిమిషానికి రూ. 2.5 లక్షలు, రోజుకు రూ. 9 కోట్లు ఖర్చవుతాయని లెక్క. అంటే విలువైన సమయంతో పాటు, ఎంత ప్రజాధనం వృథా అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ సమావేశాల్లో ప్రభుత్వం 13 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. మరో 20 బిల్లుల్ని ఆమోదించింది. చర్చకు అవకాశమివ్వకుండా, సంఖ్యాబలంతో కీలకమైన బిల్లులకు క్షణాల్లో ఆమోదముద్ర వేస్తూ పోయింది. ‘ఏ మాత్రం చర్చ లేకుండా దాదాపు 35కి పైగా బిల్లుల్ని పాస్ చేశారు. అనేక బిల్లుల్ని పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకైనా పంపకుండానే ఆమోదిస్తున్నార’ని ప్రతిపక్షాల ఆరోపణ, ఆవేదన. సభకు అడ్డుపడి తమ వాదన వినిపించాలనుకోవడం, తామెత్తిన అంశంపై చర్చ జరగాలనడం ప్రతిపక్షాలు ఆది నుంచి చేసేదే. అధికారపక్షం ఎక్కడోచోట సర్దుకొని, అందుకు అంగీకరించడం సంప్రదాయం. కానీ, ఈసారి మోదీ సర్కారు విదేశీ నిఘా సాఫ్ట్వేర్ పెగసస్ వివాదంపై చర్చకు సై అనకుండా, తప్పుకు తిరగడంతో పీటముడి బిగిసింది. సమావేశాలకు ఒక్క రోజు ముందుగా బయటపడ్డ పెగసస్ పైనే చివరి దాకా ప్రతిష్టంభన సాగింది. అదే పట్టుకొని వేలాడిన ప్రతిపక్షాలు ఇతర అంశాలపై చర్చ లేవనెత్తడంలో విఫలమయ్యాయి. మరోపక్క ప్రతిపక్షాల అనుమానాల్ని నివృత్తి చేయాల్సింది పాలకులే. అధికారంలో ఉన్నవారే పెద్దమనసుతో ముందుకు రావడం ఎక్కడైనా మర్యాద, గౌరవం. కానీ, ఆపాటి విశాల హృదయం పాలకపక్షానికి లేకుండా పోయింది. పెగసస్పై ఐరోపా దేశాలు కొన్ని విచారణకు ఆదేశించినా, మనవాళ్ళు అందుకు సిద్ధమనలేదు. కేంద్ర ఐటీ మంత్రేమో ఫోన్లను తాము ట్యాప్ చేయలేదన్నారు కానీ, పెగసస్ సాఫ్ట్వేర్ను హ్యాకింగ్కు వాడారో లేదో చెప్పలేదు. రక్షణ మంత్రేమో లిఖిత పూర్వక ఏకవాక్య సమాధానంలో తమ శాఖ పెగసస్ సాఫ్ట్వేర్ను కొనలేదని సరిపెట్టారు. కానీ, దర్యాప్తు సంస్థలు దాన్ని వాడిందీ లేనిదీ సర్కారు సూటిగా జవాబివ్వలేదు. సభలో ప్రతిష్టంభనకు కారణం ప్రతిపక్షాలే అని ప్రచారం చేస్తే చాలనుకుంది. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి, మాట్లాడలేమంటూ తర్కం లేవదీసింది. ‘కరోనా రెండో వేవ్ మరణాలు స్వతంత్ర భారత ప్రభుత్వాలన్నిటి సమష్టి వైఫల్యం’ అంటూ ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా చేసిన భావోద్వేగభరిత ‘మాఫీనామా’ ప్రసంగమొక్కటే ఈ సమావేశాల్లో అందరినీ కదిలించింది. అధికార, విపక్షాలు రెంటి మధ్య ఒకే ఒక్క అంశంలో అరుదైన ఐక్యత కనిపించింది. అది – సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్ఈబీసీలు – వాడుకలో ఓబీసీలు) జాబితాను రాష్ట్రాలే తయారుచేసుకొనే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఓటుబ్యాంకు ఓబీసీల విషయంలో రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. అయితే, ఓబీసీల జాబితా రూపకల్పనకు రాష్ట్రాలకున్న అధికారాన్ని 2018లో మోదీ ప్రభుత్వమే తొలగించిందనీ, ఇప్పుడా తప్పు దిద్దుకొనేందుకు తాము సహకరించామనీ విపక్షాల వాదన. ఆ బిల్లు పని కాగానే సర్కారు ఈ సమావేశాలకు సెలవిచ్చేసింది. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో జరగాల్సింది ప్రజాసమస్యలపై విలువైన చర్చ. ఈ విడత సభలో చర్చలు లేవు. జరిగిందల్లా రచ్చ. దానితోనే చివరకు సమావేశాలు సమాప్తం కావడం విచారకరం. సభలో ఘటనలతో రాత్రి నిద్ర పట్టలేదంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగం చూపారు. అధికార – ప్రతిపక్షాల మంకుపట్టు, ఓబీసీ బిల్లు వేళ కూడా సభా నాయకుడు – హోమ్ మంత్రుల గైర్హాజరు, ప్రతిపక్షాల ప్రశ్నలకు కొన్నేళ్ళుగా సభలో జవాబివ్వని పాలకుల తీరు చూస్తుంటే నిజంగానే ప్రజాస్వామ్య వాదులకు కన్నీరొస్తుంది. లోక్సభ కొలువుదీరి రెండేళ్ళు దాటినా, ప్రతిపక్షాలకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవ డమూ విడ్డూరమనిపిస్తుంది. మూకబలానికే తప్ప, చర్చకు స్థానం లేనివేళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రోజులు కావా అన్న అనుమానమొస్తోంది. ఇప్పుడిక దీని మీద చర్చ జరగాల్సిందే! -
విబేధాల పరిష్కారం దిశగా తొలి అడుగు
జెనీవా: అగ్రదేశాలు అమెరికా, రష్యాల అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్ల శిఖరాగ్ర సమావేశం బుధవారం జెనీవా వేదికగా జరిగింది. సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి విరోధ భావన నెలకొనలేదని పుతిన్ పేర్కొన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయన్నారు. ‘చాలా అంశాల్లో మేం విబేధిస్తాం. అయితే, ఒకరినొకరు అర్థం చేసుకునే, పరస్పరం దగ్గరయ్యే దిశగా ముందడుగు వేశామని భావిస్తున్నా’ అని పుతిన్ పేర్కొన్నారు. ఇరుదేశాల రాయబారులను తమతమ విధుల్లో చేరేందుకు తాను, బైడెన్ అంగీకరించామన్నారు. రెండు దేశాల మద్య విబేధాలను తొలగించేందుకు, అణ్వాయుధ పరిమితిపై ఒప్పందానికి సంబంధించి చర్చలను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. సైబర్ సెక్యూరిటీపైనా చర్చలు జరపాలని నిర్ణయించారు. ‘చర్చల సమయంలో మా మధ్య ఎలాంటి శత్రు భావం లేదు. అనుకున్న సమయం కన్నా ముందే చర్చలను ముగించాం’ అన్నారు. రెండు గొప్ప శక్తుల మధ్య భేటీగా ఈ సదస్సును చర్చలకు ముందు బైడెన్ అభివర్ణించారు. ముఖాముఖి చర్చలెప్పుడూ మంచిదేనని వ్యాఖ్యానించారు. ఇద్దరు నేతలు అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. గత కొన్ని నెలలుగా ఇరువురు నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చర్చలు ముగిసిన అనంతరం ఇరువురు నేతలు వేర్వేరుగా మీడియా సమావేశంలో పాల్గొనడం విశేషం. మొదట పుతిన్, ఆ తరువాత బైడెన్ చర్చల వివరాలను వేర్వేరుగా మీడియాకు తెలిపారు. సైబర్ భద్రత అంశంపై చర్చలు జరపాలని రెండు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పుతిన్ వెల్లడించారు. అమెరికాలోని వ్యాపార, ప్రభుత్వ సంస్థల వెబ్సైట్స్ను రష్యా హ్యాక్ చేస్తోందని యూఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను పుతిన్ ఖండించారు. చర్చల సందర్భంగా మానవ హక్కుల అంశాన్ని, ప్రతిపక్ష నేత నేవల్నీ జైలు శిక్ష విషయాన్ని బైడెన్ ప్రస్తావించారని పుతిన్ వెల్లడించారు. -
చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి డిసెంబర్ 3న రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావించింది. అయితే, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు.. అక్టోబర్ 14, నవంబర్ 13న రైతులతో చర్చించింది. మంగళవారం(డిసెంబర్ 1) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మూడో దఫా చర్చలు జరగనున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై రైతులు, రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. సాగు చట్టాలు కరోనా కంటే ప్రమాదం కరోనా›హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా అన్నదాతలు నిరసన సాగిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. కరోనాతో ముప్పు ఉంటుందన్న విషయం తమకు తెలుసని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త వ్యవసాయ చట్టాలు కరోనా కంటే మరింత ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ధర్నాలో ఉన్న రైతులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహమ్మారిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏడుగురు వైద్యులతో కూడిన బృందం నవంబర్ 28 నుంచి 90 మంది రైతులకు పరీక్షలు చేసింది. వీరిలో ఎవరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాలేదని డాక్టర్లు చెప్పారు. షరతులు పెడితే.. ఢిల్లీని ముట్టడిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: చర్చల విషయం లో కేంద్రం ఎలాంటి షరతులు విధించరాదని రైతులు పేర్కొన్నారు. అవసరమైతే ఢిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. చలిని సైతం లెక్కచేయకుండా సింఘు, టిక్రీ రహదారులపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. యూనియన్ల మద్దతు.. నిరసన తెలుపుతున్న రైతులకు అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లు (సీఐటీయూ) సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్, అధ్యక్షురాలు కె.హేమలత, సీఐటీయూ కార్యదర్శి కరుమలియన్లు మద్దతు తెలిపారు. రైతుల పోరాటాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేయాలని ఏఐఏడబ్ల్యూయూ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణ కార్యాచరణ ప్రకటించింది. -
అమెరికాతో ద్వైపాక్షిక బంధం : కీలక చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-అమెరికాల మధ్య రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సంప్రదింపులు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్లు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారంపైనా వీరు చర్చలు జరపనున్నారు. పాంపియో, ఎస్పర్ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సంప్రదింపులు చేపట్టనున్నారు. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భారత్-అమెరికా మంత్రుల భేటీలో ఈ అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. పాంపియో, ఎస్పర్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోనూ భేటీ అవుతారు. భారత్తో సరిహద్దు ప్రతిష్టంభనతో పాటు, దక్షిణ చైనా సముద్రంలో సైనిక పాటవాలు, హాంకాంగ్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై బీజింగ్ వైఖరి వంటి పలు అంశాలపై గత కొద్దినెలలుగా అమెరికా చైనా తీరును తప్పుపడుతోంది. ఇక అమెరికన్ మంత్రులతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సంప్రదింపులు సాగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఇప్పటికే స్పష్టం చేశారు. చదవండి : చైనాతోనే అమెరికాకు ముప్పు -
సరిహద్దు వివాదం: ముగిసిన చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు గురువారం ఆరుగంటల పాటు సాగిన ఇరు దేశాల మేజర్ జనరల్ స్ధాయి చర్చలు ముగిశాయి. గాల్వన్ లోయలో సాధారణ స్ధితి నెలకొనేలా చూడటంతో పాటు సరిహద్దుల నుంచి సేనల ఉపసంహరణపై వరుసగా మూడోరోజూ ఇరు దేశాల సీనియర్ సైనికాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. గాల్వన్ లోయలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో కల్నల్ బీ. సంతోష్బాబు సహా 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. కాగా గత రెండు రోజులుగా గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనగా తాజా చర్చల సారాంశం ఇంకా తెలియరాలేదు. మరోవైపు డ్రాగన్ సైన్యంతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు మరణించడం, మరో 18 మంది జవాన్లకు గాయాలవడం మినహా ఏ ఒక్కరి ఆచూకీ గల్లంతు కాలేదని సైనిక వర్గాలు తెలిపాయి. ఇక చైనా దూకుడు తగ్గించకుంటే దౌత్యం యుద్ధం తప్పదని, ఆ దేశ వస్తువుల బహిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
‘భారత్-చైనా చర్చల్లో కీలక పరిణామం’
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుత పరిష్కారం ద్వారా చక్కదిద్దాలని భారత్, చైనాలు నిర్ణయించాయని ఇరు దేశాల మధ్య జరిగిన సైనికాధికారుల చర్చలపై భారత్ వ్యాఖ్యానించింది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. భారత్, చైనాల మధ్య జరిగిన సైనికాధికారుల సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరిందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య శనివారం లడఖ్లో కీలక సంప్రదింపులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, భారత్- చైనా మధ్య ప్రారంభమైన మిలటరీ స్థాయి చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ హాజరుకాగా.. చైనా తరఫున టిబెట్ మిలటరీ కమాండర్ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్ లోయ, పాంగాంగ్ లేక్, గోగ్రా ప్రాంత సరిహద్దు వివాదాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగాయని సమాచారం. ఈ క్రమంలో పాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ నుంచి చైనా బలగాలు వెనుదిరగాలని.. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను వెంటనే తొలగించాలని భారత్ స్పష్టం చేసింది. చదవండి : చైనా కట్టడికి అంతర్జాతీయ కూటమి -
లెక్క కుదర్లేదు ఆర్టీసీ చర్చలు విఫలం..
‘అంతా సవ్యంగానే సాగింది. హైకోర్టు చెప్పిన సూచనల ప్రకారమే చర్చల ఎజెండా సిద్ధం చేశాం. కానీ వాటిని చర్చించేందుకు జేఏసీ నేతలు ఇష్టపడలేదు. మొత్తం డిమాండ్లపై చర్చకు పట్టుబట్టారు. అదెలా కుదురుతుంది. ఇదే విషయం అడిగితే తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లి తిరిగి రాలేదు – అధికారులు ఆర్టీసీ చరిత్రలోనే కాదు ట్రేడ్ యూనియన్ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎన్నడూ చూడలేదు. ఫోన్లు కూడా లాగేసుకుని, పోలీసు పహారా పెట్టి జరిపేవి చర్చలెలా అవుతాయి. యూనియన్ల డిమాండ్లు పక్కన పెట్టి తమ ఎజెండా ప్రకారమే చర్చ జరగాలని అధికారులు చెప్పటం దారుణం – కార్మిక సంఘాల జేఏసీ సాక్షి, హైదరాబాద్ : ఇరవై రెండు రోజుల సమ్మె తర్వాత పట్టువిడుపుల ధోరణి ప్రదర్శిస్తూ ఇటు ప్రభుత్వం చర్చలకు పిలవటం, వెంటనే కార్మిక సంఘాలు స్వాగతించటంతో.. ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ చర్చలు ఇటు జేఏసీ నేతలు, అటు అధికారులు సమావేశ మందిరంలో కూర్చున్న కొద్దిసేపటికే అర్ధంతరంగా ఆగిపోయాయి. ఎవరి పట్టు వారు ప్రదర్శించటంతో చర్చలు విఫలమ య్యాయి. అధికారులది తప్పంటూ కార్మిక సంఘాల జేఏసీ, జేఏసీ తీరు సరికాదంటూ అధికారులు ప్రకటించి నిష్క్రమించారు. మళ్లీ చర్చలకు పిలిస్తే తాము సిద్ధమని జేఏసీ పేర్కొనగా, తాము చర్చల హాలులోనే ఉన్నా మళ్లీ జేఏసీ నేతలు రాలేదని అధికారులు పేర్కొనటం విశేషం. వెరసి మళ్లీ చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఆదివారం దీపావళి కావ టం, సోమవారమే కోర్టుకు నివేదించాల్సి ఉండటంతో పరిస్థితి అయో మయంగా మారింది. విఫలం కావాలన్న ఎజెండాతోనే ప్రభుత్వం ఈ తరహా చర్చలకు ప్లాన్ చేసిందని జేఏసీ ఆరోపించింది. సమ్మె యథాతథంగా సాగుతుందని, 30న సకల జనుల సమర భేరీ భారీ స్థాయిలో నిర్వహించే ఏర్పాట్లు సాగుతున్నాయని జేఏసీ నేతలు వెల్లడించారు. ఉదయమే చర్చలపై సమాచారం.. శుక్రవారం సాయంత్రం ఆరుగురు సభ్యుల అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రగతి భవన్లో అధికారులతో సీఎం దాదాపు 5 గంటల పాటు సమీక్షించి చర్చలకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. కానీ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానిస్తూ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్శర్మ సంతకంతో ఉన్న లేఖలు అందజేశారు. మధ్యాహ్నం 2 గంటలకు చర్చలుంటాయని, ఎండీ కార్యాలయం ఉన్న ఎర్రంమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ కార్యాలయాన్ని వేదికగా పేర్కొన్నారు. దీనికి జేఏసీ నేతలు సమ్మతించి అఖిలపక్ష నేతలతో భేటీ అయి చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా జేఏసీ నేతలు 16 మంది ఆ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. గేట్ వద్దనే వారిని ఆపేసి జేఏసీలోని నాలుగు సంఘాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురు మాత్రమే హాజరు కావాలని పేర్లను పిలిచారు. దీంతో కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్లు రాజిరెడ్డి, వీఎస్రావు, వాసుదేవరావులు చర్చలకు వెళ్లడంతో మిగతావారు బయటే ఉండిపోయారు. లోపలికి వెళ్లిన వారి ఫోన్లు బయటే డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఇది పద్ధతి కాదని, అవసరమైతే తాము వెలుపల ఉన్న నేతలతో మాట్లాడాల్సి ఉంటుందని, ఫోన్లు అనుమతించాలని కోరినా అధికారులు అంగీకరించలేదు. వాటిని స్విచ్ఛాఫ్ చేసి పెట్టిన తర్వాతే అనుమతించారు. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాలు చర్చలకు సిద్ధమయ్యారు. హైకోర్టు సూచించినట్లు 21 అంశాలపై చర్చలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అదెలా సాధ్యమని, అసలు హైకోర్టు 21 అంశాలపైనే చర్చించాలని చెప్పలేదని, జే ఏసీ సూచించిన 26 అంశాలపైన అయినా, కోర్టులో మరో పిటిషన్దారు అయిన టీఎంయూ పేర్కొన్న 45 డిమాండ్లపైన అయినా చర్చించాలని జేఏసీ నేతలు కోరారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వు ఆధారంగానే ఈ చర్చలుంటాయని, అన్ని డిమాండ్లపై సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇదే విషయంలో దాదాపు రెండు గంటలు గడిచాక జేఏసీ నేతలు వెలుపలికి వచ్చారు. మీడియా ప్రతినిధులను కూడా గేట్ వద్దనే పోలీసులు అపేయటంతో, వారు గేట్ వద్దకు వచ్చి చర్చలు మొదలు కాకుండానే అర్ధంతరంగా ఆగిపోయినట్లు వెల్లడించారు. తాము అధికారులు పిలిస్తే ఎప్పుడైనా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని, వారి పిలుపు కోసం ఎదురు చూస్తామని చెప్పి నిష్క్రమించారు. వారు వెళ్లిన గంటన్నర తర్వాత చర్చల్లో పాల్గొన్న ఇద్దరు అధికారులు కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడి నిష్క్రమించారు. కోర్టు ఉత్తర్వును వక్రీకరించారు: జేఏసీ నేతలు ‘ప్రభుత్వానికి చర్చలు ఫలించాలన్న ఆలోచన లేదని ఈ చర్చల తంతుతో తేలిపోయింది. చర్చలు విఫలమయ్యేలా సొంత ఎజెండా రూపొందించింది. చర్చల సారాంశాన్ని సోమవారం హైకోర్టుకు నివేదించాల్సి ఉన్నందున, జేఏసీ నేతలే చర్చలను విఫలం చేశారని కోర్టుకు చెప్పే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అసలు కోర్టు ఆదేశించింది వేరు.. ఇక్కడ జరిగింది వేరు. 21 అంశాలపైనే చర్చించాలని కోర్టు చెప్పలేదు. జేఏసీ సూచించిన 26 అంశాలపై చర్చించమని కోరాం. వాటిల్లో మేం, అధికారులు ఏయే విషయాల్లో పట్టువిడుపులతో వ్యవహరిస్తారనేది తర్వాత సంగతి. ముందు చర్చిస్తే తేలిపోతుంది కదా.. దానికి అధికారులు సిద్ధంగా లేరు. వారు 21 అంశాలపైనే చర్చిస్తామని పట్టుపట్టి కూర్చున్నారు. సమ్మెకు పూర్వం జరిగిన చర్చల్లో 16 మందిని అనుమతించారు. ఇప్పుడు వారిని బయటే ఆపారు. ఫోన్లు లాగేసుకున్నారు. దీనిపై మేం మాట్లాడుతుండగానే అధికారులే సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. వారు మళ్లీ వస్తారని కాసేపు అక్కడే కూర్చుని, సిబ్బందితో టీ తెప్పించుకుని తాగాం. అధికారులు రాకపోవటంతో మేం బయటకొచ్చాం. శత్రు దేశాల మధ్య చర్చలు కూడా ఇంత దారుణంగా ఉండవు. చర్చల తంతు మొత్తం వీడియో రికార్డు చేయించాం. ఆ వీడియోను కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని చూస్తే ఎవరు చర్చలను విఫలం చేశారో తెలుస్తుంది’ మళ్లీ వస్తామని వెళ్లిపోయారు: చర్చల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారులు చర్చలు ఫలవంతమయ్యేలా మేం ప్రయత్నించాం. కానీ జేఏసీ నేతలే సహకరించలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాదని ప్రభుత్వం ఎప్పుడో తేల్చి చెప్పింది. కోర్టుకు కూడా విన్నవించింది. అది మినహాయించి మిగతావాటిల్లోని 21 అంశాలపై చర్చించాలని కోర్టు సూచించింది. ఆ మేరకే 21 అంశాలపై చర్చిద్దామని పేర్కొన్నాం. కానీ అన్ని డిమాండ్లపై చర్చించాలని వారు పట్టుపట్టారు. కాసేపు బయటకు వెళ్లి మాట్లాడుకుని వచ్చారు. మళ్లీ అదే పట్టుపట్టారు. మేం మళ్లీ అదే విషయాన్ని వారికి చెప్పాం. దీంతో తమ వారితో మాట్లాడి వస్తామని చెప్పి వారు వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర వరకు వేచి చూశాం. వారు రాలేదు. దీంతో ఇక వారు చర్చల నుంచి నిష్క్రమించినట్లు భావించి మేం కూడా వెలుపలికి వచ్చేశాం. సమావేశంలో ఆర్టీసీ ఈడీలు ఉండాలని ఎక్కడా రూల్ లేదు. ఫోన్లను అనుమతించటానికి వేరే కారణమేమీ లేదు. సమావేశం మధ్యలో ఫోన్లు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతోనే వాటిని అనుమతించకూడదనుకున్నాం’ మీడియాతో మాట్లాడుతున్న ఆర్టీసీ అధికారులు -
మలేషియా ప్రధానితో మోదీ భేటీ
మాస్కో : ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా ప్రధాని మహతిర్ బిన్ మహ్మద్తో గురువారం భేటీ అయ్యారు. రష్యాలో తూర్పు ప్రాంత ఆర్థిక ఫోరం (ఈఈఎఫ్) సమావేశాల నేపథ్యంలో ఇరువురు నేతలు సంప్రదింపులు జరిపారు. వ్లాదివొటోక్లో వరుస సమావేశాలు సాగుతున్నాయని, మలేషియా ప్రధానితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. భారత్, మలేషియా ప్రజలు పరస్పరం లబ్ధి పొందేలా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. భారత్-రష్యా వార్షిక సదస్సు, ఈఈఎఫ్ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యా చేరుకున్న సంగతి తెలసిందే. వ్లాదివొస్టోక్ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. -
అన్నదాతకు ఆసరా ఎలా?
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా, ప్రత్యేకించి రైతుల ఆత్మహత్యలపైనా పార్లమెంటులో అరుదుగా చర్చ జరుగుతుంటుంది. కనుక లోక్సభలో గురువారం జీరో అవర్లో రైతుల ఆత్మ హత్యలు ప్రస్తావనకు రావడాన్ని స్వాగతించాలి. దేశంలో రైతుల స్థితిగతులు దారుణంగా ఉన్నా యని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఆరోపించినప్పుడు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గత అయిదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. దశాబ్దాలపాటు ఏలిన గత పాలకులే రైతుల ప్రస్తుత దుస్థితికి కారణమని కూడా ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు, ప్రత్యా రోపణల సంగతలా ఉంచితే రైతులు చాలా దుర్భర స్థితిలో ఉన్నారని అందరూ గుర్తించాలి. ఈ చర్చ జరగడానికి ముందు రోజు ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఒక రైతు ఆత్మహత్య గురించిన కథనం మీడియాలో వచ్చింది. రైతు తన కుమార్తెను మెడిసిన్ చదివించాలన్న కోరికతో ఆమెను ఒక కోచింగ్ సెంటర్లో చేర్చాలనుకున్నాడు. అందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని తనఖా పెట్టాలనుకున్నాడు. కానీ అప్పటికే అప్పులున్న ఆ భూమిపై అదనంగా రుణం ఇవ్వడానికి వడ్డీవ్యాపారులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంటలు దెబ్బతినడం, కుటుంబాల్లో అనారోగ్యం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా అనేక కారణాలు రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. తాజా ఉదంతంలో పోలీసులు ఆ రైతు మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. బహుశా ప్రభుత్వం కూడా ఆయన మరణం వెనక సాగు సంబంధ కారణాలు లేవని చెప్పే అవకాశం ఉంది. కానీ బుందేల్ఖండ్ ప్రాంతంలో గత రెండేళ్లలో 20మంది రైతులు కన్నుమూశారు. పంటలు బాగా పండి, ఆ పంటలకు గిట్టుబాటు ధర లభిస్తే... వీరు కుటుంబ సంబంధమైన బాధ్యతల్ని నెరవేర్చుకోలిగేవారు. అందరిలా జీవనం సాగించేవారు. బలవన్మర ణాలకు పాల్పడే స్థితి ఉండేది కాదు. అందువల్ల రైతుల ఆత్మహత్యలను నమోదు చేయడంలోనూ, ఆ కుటుంబాలను ఆదుకోవడంలోనూ ప్రభుత్వాలు పెద్ద మనసుతో వ్యవహరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ వలసపాలన కాలంలో 1830లో పాలకుడిగా ఉన్న లార్డ్ మెట్కాఫ్ బ్రిటన్కు ఒక నివేదిక పంపుతూ భారత్లో గ్రామాలన్నీ వేటికవి రిపబ్లిక్ల వంటివనీ, అవన్నీ స్వయంపోషకాలనీ అభివర్ణించాడు. ఈ కారణం వల్లనే అన్ని ఒడిదుడుకులనూ ఎదుర్కొని భారత్ మనుగడ సాగించగలుగుతున్నదని చెప్పాడు. అప్పట్లో గ్రామాలకున్న ఈ శక్తిసామర్థ్యాలకు వ్యవసాయం, చేతివృత్తులే ప్రధాన కారణమని వేరే చెప్పనవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తూ గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండూ క్రమేపీ దెబ్బతిన్నాయి. ఒకనాడు దేశ మనుగడకూ, దాని ఆత్మవిశ్వాసానికీ వెన్నెముకగా నిలిచిన రైతు ఇప్పుడు తానే ఒత్తిళ్లకు లోనవుతున్నాడు. రేపన్నరోజు గడిచేదెలాగో అర్ధంకాక తనువు చాలిస్తున్నాడు. విత్తనాలు మొదలుకొని అన్నీ సకాలంలో సరైన ధరలకు లభ్యమయ్యేందుకు...దిగుబడులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు... దళారుల బెడద తప్పించేం దుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలిగితే ఈ రైతు ఆత్మహత్యల్ని నివారించడం సాధ్యమవుతుంది. బహుళజాతి సంస్థ మోన్శాంటో దేశమంతా 450 గ్రాముల బీటీ పత్తి విత్తన ప్యాకెట్ను రూ. 1858కి అమ్ముతున్న రోజుల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ విషయంలో పట్టుదలగా పోరాడి, చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆ ప్యాకెట్ ధరను రూ. 750కి తగ్గించేలా చేశారు. ఈ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ పెద్దల ద్వారా ఆయనకు నచ్చజెప్పించినా వైఎస్ లొంగ లేదు. ఆ ఒరవడిని తర్వాత కాలంలో ఎందరు ముఖ్యమంత్రులు అనుసరించగలిగారు? చాలా సంస్థలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొన్న విత్తనాలను మళ్లీ వారికే అత్యధిక ధరకు అమ్ముతున్నాయి. నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న సంస్థలున్నాయి. ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆరుగాలం శ్రమించి అధిక దిగుబడి సాధించినా కనీస మద్దతు ధరకు దిక్కులేదు. వీటన్నిటి సంగతలా ఉంచి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి పంటనష్టం జరిగినప్పుడు సాయం అందించడానికి సవాలక్ష నిబంధనలు అడ్డొస్తాయి. వీటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం అలాంటి రైతుల కుటుంబాలను ఆదు కోవాలన్న స్పృహ కూడా పాలకులకు ఉండటం లేదు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్లో 2014–19 మధ్య 1,513 మంది రైతులు ప్రాణాలు తీసుకుంటే అంతో ఇంతో ఆర్థిక సాయం దక్కింది కేవలం 391 కుటుంబాలకు మాత్రమే. మిగిలిన కుటుంబాలన్నిటి వివరాలూ సేకరించి అర్హతగల ప్రతి కుటుంబానికీ రూ. 7 లక్షల చొప్పున పరిహారం అందించాలని తాజాగా జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పథకాన్ని చెప్పినకంటే ముందే ప్రారంభించి వార్షిక సాయం రూ. 12,500 అందించాలని నిర్ణయించారు. ఉచిత పంటలబీమా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటివి ఏర్పాటుచేశారు. అసెంబ్లీలో గురు వారం చర్చ సందర్భంగా రైతు సంక్షేమానికి తీసుకోబోయే చర్యల్ని వివరించారు. ఇలా సమస్యల్ని సహృదయంతో అర్థం చేసుకుని, మానవీయ కోణంలో ఆలోచించే పాలకులుండటం ఇప్పటి అవసరం. మొన్నటివరకూ కేంద్ర వ్యవసాయమంత్రిగా పనిచేసిన రాధామోహన్ సింగ్ అడిగిన ప్రశ్నకు లోక్సభలో వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల మంగళవారం బదులిస్తూ 2015 తర్వాతనుంచి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను రాష్ట్రాలేవీ పంపలేదని, అందువల్ల జాతీయ క్రైం రికార్డుల బ్యూరో దగ్గర గణాంకాలు లేవని చెప్పారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతులెందరో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వాలున్నప్పుడు వాటినుంచి ఇక ఆశించే దేముంటుంది? ఈ పరిస్థితి మారాలి. పాలకులు చిత్తశుద్ధితో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. -
తుది దశలో చైనా–అమెరికా వాణిజ్య చర్చలు
వాషింగ్టన్: వాణిజ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి అమెరికా – చైనా మధ్య చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఒప్పందం అమలు తీరుతెన్నులే అన్నింటికన్నా పెద్ద సమస్యగా తయారైందని, ఇది దాదాపు పరిష్కారమైనట్లేనని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మినుచిన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య దాదాపు నలభై ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక బంధంలో ఇది పెద్ద మార్పు తేగలదని ఆయన పేర్కొన్నారు. ‘వివాదాల పరిష్కార సాధనలో తుది దశకు మరింతగా చేరువవుతున్నామని భావిస్తున్నాం‘ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా స్టీవెన్ తెలిపారు. ఒప్పంద ఉల్లంఘన జరిగిన పక్షంలో తగు చర్యలు తీసుకునేలా ఇరు పక్షాలకు అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే, చైనా గానీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పక్షంలో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై భారీ టారిఫ్లు వడ్డించే విషయంపై ఆ దేశాన్ని ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అలాగే, అమెరికా గనుక నిర్దిష్ట ఉత్పత్తులపై మళ్లీ టారిఫ్లు విధించినా ప్రతీకార చర్యలు తీసుకోకుండా చైనాపై ఒత్తిడి కూడా తెస్తోంది. కానీ, ఏకపక్షంగా ఉన్న ఒప్పంద అమలు విధివిధానాలను చైనా ఇష్టపడటం లేదు. ఇవి తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యాన్ని కట్టబెట్టేవిగా ఉన్నాయనే చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపర్చిన సంగతి తెలిసిందే. -
ఓల్లు నారాజ్ కావొద్దని..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఏంరా... రాజు ఎటు పోతున్నవ్ అసలే కనిపిత్తలేవ్... ఏంలేదు నర్సన్న రోజు ఎలచ్చన్ల పెచారంకు బోతున్న గందుకే నీకు కనిపిత్తలేను... గట్లనా మరి గదే రోజు పొద్దుగాల్ల కసీర్కాడ ఉన్న హోటల్కు అచ్చి చాయి తాగుతుంటివి.. మూడు నాలుగు రోజుల నుంచి సూత్తున్న కనిపిత్తలేవని అడుగుతున్న. అవు నర్సన్న మస్కట్ బోయేటందుకు విజాకు అప్లికేషన్ పెట్టిన గని ఇంకా మస్తు టైం ఉంది. గందుకే ఉట్టిగా ఇంటికాడ ఉంటే యాష్ట అత్తది. పెచారంకు బోతే పైసలత్తున్నయి. ఇంత బిర్యాని బువ్వ బెడుతుండ్రు... గందుకే పెచారంకు బోతున్న. అగో రోజు మస్తు మజా సేత్తున్నవ్ అన్నట్లు గదరా రాజు.. అవు నర్సన్న మరేంజేస్తం... ఎలచ్చన్లు అయిపోయేదాంకా పెచారంల తిరుగుతున్న.. అవు మల్ల మరి ఏ పార్టీల్లోకు పెచారంకు బోతున్నవ్ రాజు. ఏం లేదు నర్సన్న ఓల్లు ఒక రోజు ముందు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్న. అగో గట్ల గిదేం తరీకర బై రాజు.. ఇగో నర్సన్న ఓల్లయిన గంతే పైసలిత్తుండ్రు. అందరి లెక్కనే బిర్యాని బువ్వ బెడుతుండ్రు. గందుకే ముందు ఓల్లు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్నం. గట్ల గాదురా రాజు. ఏదన్న ఒక పార్టీకే పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏమన్నా మంచిదావురా. ఇగో నర్సన్న.. గిప్పుడు గిట్లనే సెయ్యాలే.. ఏంటికంటే.. ఓల్లయిన ఉట్టిగనే తోల్కపోతలే. అందరు పైసలు, బిర్యాని బువ్వ పెట్టుడు కామన్ జేసిండ్రు. గందుకే ఒక రోజు ముందు సెప్పినోల్లకు పెచారంకు బోతున్నం. మల్ల పొద్దుమీక్కి మా ఇంటికచ్చి పెచారంకు రమ్మని సెప్పినోల్లకు తెల్లారి ఆల్లకు బోతున్నం. ఇగో రాజు నేను అన్నది నీకర్థం గాలే.. నేను సెప్పిదే ఏంటిదంటే ఏదన్న ఒక పార్టీకి పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏం మంచిగలేదు. ఏదన్న ఒక పార్టీతోనే ఉండాలే అని సెప్పుతున్న. గది కరెక్టె గని నర్సన్న. మనకు ఎప్పుడు ఓల్లతోని పని బడ్తదో తెల్వదాయే. గందుకే ఏ పార్టీవోల్లు సెప్పినా పెచారంకు బోయి అత్తున్న. అంటే ఒక పాల్టీలనే తిరగవ్ అన్నట్లు గదరా రాజు. అవ్మల్ల. నర్సన్న ఒక పార్టీలనే దిరిగితే మిగిలిన పార్టీలోల్లతోని లొల్లి. గందుకే ఓల్లను కూడా నారాజ్ సేయకుండా అన్ని పార్టీవోల్లకు బోయి పెచారం సేసి అత్తున్నం. గట్లనే ఏ పార్టీవోల్లతోని బోతే ఆల్ల కండువ గప్పుకుంటున్నం నర్సన్న. అవ్రా రాజు నువ్వు సెప్పింది మస్తుగున్నది. నీ లెక్కనే రాజకీయం చెయ్యాల. మంచి పిలాన్ సేసినవ్. ఓల్లు కూడా నారాజ్ కాకుండా అందరి తాన్కి బోతున్నవ్. ఓల్లు పైసలిత్తే ఆల్లయి తీసుకుంటున్నవ్. మంచి పని జేసినవ్. పోతరా మస్తు లేట్ అయ్యింది పని బాగుంది అని ఆడికెల్లి ఇద్దరు ఎల్లిపోయిండ్రు.. -
ఎన్నికల తర్వాతే భారత్తో చర్చలన్న పాక్
ఇస్లామాబాద్ : భారత్తో శాంతి చర్చల పునరుద్ధరణ 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరమే ఉంటుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి స్పష్టం చేశారు. భారత్లో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లోగా చర్చల పునరుద్ధరణకు అవకాశం లేదన్నారు. ఇస్లామాబాద్లో గురువారం పాక్ విదేశీ వ్యవహారాల సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. స్టాండింగ్ కమిటీ భేటీలో భారత్తో ద్వైపాక్షిక చర్చల అంశాన్ని ప్రస్తావించామన్నారు. పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్తాన్లతో పాక్ సంబంధాలతో పాటు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవలి సౌదీ అరేబియా, చైనా పర్యటనలపై కూడా పాక్ స్టాండింగ్ కమిటీలో చర్చలు జరిపినట్టు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. కాగా పాక్ వ్యతిరేక ప్రచారంతో భారత్లో ఓట్ల వేట సాగుతుందని, పాక్తో సంబంధాలు భారత్లో ఎన్నికల అంశం అవుతుందని ఇటీవల ఇమ్రాన్ఖాన్ పేర్కొన్న క్రమంలో స్టాండింగ్ కమిటీ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం భారత్కు తాను మరోసారి స్నేహహస్తం అందిస్తానని ఇమ్రాన్ ఖాన్ గతంలో చెప్పుకొచ్చారు. రియాద్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియేటివ్ ఫోరమ్ వద్ద మీడియా ప్రతనిధులను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
గులాబీలో సమ్మతిరాగం..
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఫలించింది. అభ్యర్థుల ప్రకటనపై భగ్గుమన్న అసమ్మతి, అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్ చేపట్టిన చర్చలు ఫలప్రదం కావడంతో దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ సమ్మతి రాగం వినిపిస్తోంది. భవిష్య త్తులో వచ్చే అవకాశాలపై అధిష్టానం తరఫున హామీ ఇవ్వడంతో అసంతృప్త నేతలు సైతం పార్టీ అభ్యర్థులతో కలసి ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఇక అసమ్మతికి తెరపడినట్లేనని టీఆర్ఎస్ భావిస్తోంది. చెన్నూరుతో మొదలు... రాజకీయ ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ వారిని సైతం ఆశ్చర్యపరుస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ రద్దయిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఎన్నికలకు ఎక్కువ సమయం ఉండటంతో ఏదైనా కారణంతో అభ్యర్థులను మారు స్తారనే ఆశతో పలువురు ఆశావహులు అసమ్మతి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థులకు పోటీగా ప్రచారం చేయడం, మరికొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాలని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం వెంటనే స్పందించింది. టీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ చర్చల వ్యూహం మొదలుపెట్టారు. చెన్నూరులో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో చర్చలు ఫలించాయి. అనంతరం అన్ని జిల్లాలకు ఇదే సూత్రం అమలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతలకు మధ్య తొలుత అంతరం నెలకొంది. ఉప్పల్లో అభ్యర్థిని మార్చాలని కార్పొరేటర్లు గట్టిగా డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ విషయాల్లోనూ ఇదే జరిగింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సమన్వయం చేసి ఈ సెగ్మెంట్ల అసమ్మతి నేతలను మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అందరూ కలసి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారిన స్టేషన్ ఘన్పూర్, డోర్నకల్, మహబూబాబాద్, ఖమ్మం, షాద్నగర్, మహబూబ్నగర్, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, అలంపూర్, నిర్మల్, మంచిర్యాల, నర్సాపూర్, బెల్లంపల్లి, ముథోల్, మంథని, మానకొండూరు, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి, నర్సాపూర్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ, తుంగతుర్తి సెగ్మెంట్ల అసమ్మతి విషయంలోనూ కేటీఆర్ ఇదే సూత్రం అమలు చేశారు. మొత్తంగా ఎన్నికల నోటిఫిషన్కు పది రోజుల ముందే టీఆర్ఎస్లో అసమ్మతులకు దాదాపుగా ముగింపు పలికినట్లయింది. ఇక రామగుండం, భూపాలపల్లి విషయంలోనూ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసి దీన్ని పూర్తి చేయనున్నారు. కల్వకుర్తిలోనూ కథ సుఖాంతం... కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అసమ్మతి సెగ సమసిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా జైపాల్ యాదవ్ పేరును ప్రకటించడంతో ఇక్కడ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో పార్టీలో చేరి పోటీ చేయాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తుండటంతో ఆ దిశగానూ ఆలోచించారు. దీంతో నారాయణరెడ్డి, ఆయన అనుచరులు జైపాల్ యాదవ్ను మార్చాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. నారాయణరెడ్డితో మంత్రి కేటీఆర్ గురువారం చర్చలు జరిపారు. అభ్యర్థుల మార్పు ఉండబోదని కేసీఆర్ స్పష్టం చేసిన విషయాన్ని నారాయణరెడ్డికి సూచించారు. భవిష్యత్తులో కచ్చితంగా మంచి అవకాశం కల్పిస్తామని నారాయణరెడ్డికి స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ను గెలిపించాలని కోరారు. దీంతో తాను పార్టీ మారాలనే ఆలోచన చేయలేదని, టీఆర్ఎస్ అభ్యర్థితో కలసి ప్రచారం చేస్తామని నారాయణరెడ్డి ప్రకటించారు. ఈ భేటీ అనంతరం కేటీఆర్తో కలసి ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కల్వకుర్తిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభకు వెళ్లారు. దీంతో కల్వకుర్తి టీఆర్ఎస్లో అసమ్మతి ముగిసిపోయింది. అధిష్టానం నిర్ణయం శిరోధార్యం: శంకరమ్మ టికెట్ కేటాయింపులో టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మాహుతికి పాల్పడిన శ్రీకాంతాచారి తల్లి, ఆ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి శంకరమ్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారన్నారు. -
భాగస్వామ్యం బలోపేతం
యమనషి: భారత్–జపాన్ల భాగస్వామ్యం పూర్తిగా పరివర్తనం చెందిందనీ, ఇప్పుడు అది ‘ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం’గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘ఇరు దేశాల బంధంలో ప్రతికూలతలేవీ లేవు. ఉన్నవన్నీ అవకాశాలే’ అని జపాన్ మీడియాతో మోదీ అన్నారు. జపాన్–భారత్ 13వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోదీ జపాన్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశంలోని అత్యంత ఎత్తైన పర్వతం ఫుజి దగ్గర్లోని ఓ రిసార్ట్లో జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ అనధికారిక చర్చలు జరిపారు. ఆదివారం మొత్తంగా మోదీ–అబేలు 8 గంటలపాటు కలిసి గడిపారు. జపాన్–భారత్ సంబంధాల పురోగతిని సమీక్షించి, వ్యూహాత్మకంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ‘సుందరమైన యమనషి ప్రాంతంలో అబెను కలుసుకోవడం అమితానందంగా ఉంది’ అని మోదీ అన్నారు. ప్రత్యేక ఆతిథ్యానికి కృతజ్ఞతలు: మోదీ రోబో పరిశ్రమను సందర్శించిన అనంతరం కవగుచి సరస్సు సమీపంలోని తన సొంత ఇంటికి మోదీని అబే తీసుకెళ్లి విందు ఇచ్చారు. విదేశీ నేతను ఈ ఇంటికి అబే ఆహ్వానించడం ఇదే తొలిసారి. దీనిపై మోదీ ట్వీటర్లో స్పందిస్తూ ‘తన ఇంట్లో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చిన అబేకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాప్స్టిక్లను ఉపయోగించి జపాన్ విధానంలో ఆహారాన్ని ఎలా తినాలో కూడా అబే నాకు నేర్పించారు’ అని తెలిపారు. విందు తర్వాత ఇరువురు ప్రధానులు రైలులో టోక్యోకు చేరుకున్నారు. అక్కడే సోమవారం అధికారిక భేటీలో మోదీ, అబేలు పాల్గొంటారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక సహకారాలను బలపరిచే అంశంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం తరహాలోనే జపాన్ కూడా ఓ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై కూడా వారిద్దరూ చర్చించే అవకాశం ఉంది. తాను ప్రధాని అయ్యాక అబేను కలవడం ఇది 12వ సారని మోదీ చెప్పారు. భారత్కు జీవితకాల మిత్రుణ్ని: అబే భారత్కు తాను జీవితకాల మిత్రుడినని అబే తెలిపారు. తాను అత్యంత ఆధారపడదగ్గ, తనకున్న అత్యంత విలువైన స్నేహితుల్లో మోదీ ఒకరన్నారు. జపాన్ తొలి ప్రధాని, తన తాత నొబుసుకె కిషి 1957లో భారత్ను సందర్శించడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘జపాన్ ఇంత ధనిక దేశం కానప్పుడు నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కిషిని తీసుకెళ్లి జపాన్ ప్రధానిగా వేలాదిమందికి పరిచయం చేశారు. 1958 నుంచే భారత్కు జపాన్ రుణాలు ఇవ్వడం ప్రారంభమైంది’ అని అబే పేర్కొన్నారు. 2007లో తాను భారత్ను సందర్శించినప్పుడు ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పార్లమెంటులో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా తనకు భారత్ కల్పించిన గౌరవాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అబేకి మోదీ బహుమతి హోటల్లో మోదీకి అబే అల్పాహారం విందు ఇచ్చారు. అనంతరం వారిద్దరూ అక్కడి ఉద్యానవనంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. చేతితో మలిచిన రెండు రాతిగిన్నెలను, రాజస్తాన్ పలుగురాళ్లు పొదిగిన దుప్పట్లను, జోధ్పూర్లో తయారైన చెక్కపెట్టెను మోదీ అబేకు బహుమతిగా ఇచ్చారు. వీటన్నింటినీ మోదీ జపాన్ పర్యటన కోసమే ప్రత్యేకంగా తయారు చేయించారు. తర్వాత ఇద్దరూ పారిశ్రామిక రోబోలను తయారుచేసే ఎఫ్ఏఎన్యూసీ పరిశ్రమను సందర్శించారు. ‘ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ఆధునిక సాంకేతికత స్థాయికి తీసుకెళ్తున్నాం. మోదీ, అబే రోబోల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎఫ్ఏఎన్యూసీ పరిశ్రమను సందర్శించారు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. రోబోలు ఎలా పనిచేస్తాయి, వాటి సామర్థ్యాలేంటనే విషయాలను పరిశ్రమ సిబ్బంది వారికి వివరించారు. -
సర్దుబాటు.. 2–3 రోజుల్లో కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల మధ్య ఎడతెగని చర్చలు కొనసాగుతున్నాయి. మిత్రపక్షాలు ఆశిస్తున్న సీట్లలో ఎవరికి ఏయే స్థానాలు ఇవ్వాలనే విషయమై టీడీపీ, టీజేఎస్, సీపీఐ ముఖ్య నేతలు ఎల్. రమణ, కోదండరాం, చాడ వెంకటరెడ్డి తదితరులతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి. కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కీలక చర్చలు ప్రారంభించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు, ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నాలుగు పార్టీల నేతలు సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ చర్చల్లో ఇప్పటివరకు కేవలం 11 సీట్లపై మాత్రమే ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల ఏం చేద్దామన్న దానిపై ఆయా పార్టీల నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇతర పార్టీలు కాంగ్రెస్కు ప్రతిపాదనలు పంపగా కాంగ్రెస్ పార్టీ 95 చోట్ల బరిలో ఉండాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి 12.. అనివార్యమైతే 13, టీజేఎస్కు 6–7, సీపీఐకి 4–5 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని, ఈ మేరకు సీట్ల సంఖ్యపై నాలుగు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని తెలుస్తోంది. శనివారం లేదా ఆదివారం రాత్రికల్లా సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన వీడే అవకాశముందని తెలుస్తోంది. ప్రాథమికంగా జరిగిన చర్చల్లో 70–75 స్థానాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాబలాలపై ఆయా పార్టీల నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారని సమాచారం. మిగిలిన స్థానాలపై శుక్రవారం నాటికి ఓ అంచనాకు రానున్నారు. ఆ తర్వాత మరోమారు అన్ని పార్టీల నేతలు సమావేశమై తుది నిర్ణయానికి వస్తారని సమాచారం. వ్యూహాత్మకంగా ముందుకు... సీట్ల సర్దుబాటు తేలాక ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది... ఆయా పార్టీల తరఫున ఎవరు బరిలో ఉంటారనే విషయాలను అధికారికంగా ప్రకటించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కూటమిలోని పక్షాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి తొలుత 50–60 స్థానాలపై 2–3 రోజుల్లో ప్రకటన చేయాలని, ఆ తర్వాత అధికార పార్టీ అనుసరించే వ్యూహాన్ని పరిశీలించి మిగిలిన అభ్యర్థులను తేల్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కూటమిలోని ఓ ముఖ్య నేత మాట్లాడుతూ ‘కూటమిలో ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది... ఏ పార్టీ అభ్యర్థులెవరు అని ప్రకటించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ మా ప్రకటన కోసం టీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. మేం అక్కడ చెప్పగానే, ఇక్కడ అసంతృప్తులను లాక్కునేందుకు సిద్ధంగా ఉంది. అందుకే అన్ని అంశాలను బేరీజు వేసుకొని ముందుకెళ్తున్నాం. ఈసారి కేసీఆరే మా ట్రాప్లో పడాలి తప్ప మేం కేసీఆర్ ట్రాప్లో పడేది లేదు’అని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని చోట్లా ఇబ్బందే...! విశ్వసనీయ సమాచారం ప్రకారం... పొత్తుల్లో భాగంగా సీపీఐ అడుగుతున్న అన్ని చోట్లా కాంగ్రెస్కు ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. తొలు త 12 స్థానాలను ఇవ్వాలని పట్టుపట్టిన సీపీఐ ఆ తర్వాత 9 స్థానాలతో సరిపెట్టుకుంటామని చెప్పింది. కానీ కాంగ్రెస్ మాత్రం 4–5 స్థానాలను ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సీపీఐ ప్రతిపాదించిన హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, మునుగోడు, దేవరకొండ స్థానాలన్నింటిలోనూ కాంగ్రెస్కు ఇబ్బందికర పరిస్థితులే ఉండటంతో సీపీఐ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంలో స్పష్టత వచ్చేందుకు సమయం పట్టనుంది. మూడు ఓకే.. మూడు పెండింగ్... తెలంగాణ జనసమితి విషయానికి వస్తే ఆ పార్టీ పోటీ చేసే సీట్ల విషయంలో మూడు చోట్ల కాంగ్రెస్, టీజేఎస్ ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఈ అభిప్రాయం ప్రకారం మల్కాజ్గిరి, చెన్నూరు, ముథోల్ స్థానాలు టీజేఎస్కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. వరంగల్ (ఈస్ట్), ఎల్లారెడ్డి, తాండూరు స్థానాలనూ టీజేఎస్ అడుగుతున్నా అక్కడ పోటీ నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని సమాచారం. వాటితోపాటు కొల్లాపూర్, మేడ్చల్, రామగుండం సీట్లనూ టీజేఎస్ అడుగుతోందని, ఆ స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఏడు క్లియర్.. 14పై పీటముడి.. తెలుగుదేశం పార్టీ 12 స్థానాల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఇందులో కూకట్పల్లి, ఉప్పల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, మక్తల్, చార్మినార్, మలక్పేట స్థానాల విషయంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య అవగాహన కుదిరినట్లు కనిపిస్తోంది. మిగిలిన 5 చోట్ల.. మరీ అవసరమైతే 6 చోట్ల టీడీపీ పోటీ చేసేందుకుగాను 13 అసెంబ్లీ స్థానాలపై చర్చ జరుగుతోంది. ఇందులో ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్, కోదాడ, ఖమ్మం, నిజామాబాద్ రూరల్, పటాన్చెరు, సికింద్రాబాద్, సనత్నగర్, ముషీరాబాద్, దేవరకద్ర, మహబూబ్నగర్ స్థానాలున్నాయి. వాటిలో మెజారిటీ స్థానాల్లో తమకు దీటైన అభ్యర్థులున్నందున ఈ స్థానాలను ఇవ్వలేమని కాంగ్రెస్ అంటోంది. తదుపరి చర్చల్లో ఈ సీట్లపై కాంగ్రెస్, టీడీపీ మధ్య స్పష్టత రావాల్సి ఉంది. -
కోదండరామ్తో చర్చలు నిజమే
సాక్షి, హైదరాబాద్: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ను కలసిన మాట వాస్తవమేనని, చర్చలు కొనసాగుతున్నాయని బీజేపీ నేత కిషన్రెడ్డి చెప్పారు. చర్చ ల్లో ఏమైనా పురోగతి ఉంటే మీడియాకు చెబుతామని స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనేది కేంద్ర అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. రేవంత్రెడ్డిపై ఐటీ దాడులు చేయించాల్సిన అవసరం కేంద్రానికి లేదన్నారు. ఆయనపై దాడులు చేస్తే బీజేపీకి వచ్చేదేమీ లేదన్నారు. ఈ దాడుల విషయంలో బీజేపీపై ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి చేసే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఇటీవల ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయని, ఇదీ బీజేపీనే చేయించిందా అని కాంగ్రెస్ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు క్విడ్ప్రోకోలా ఉందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఒవైసీ ఆస్పత్రికి 500 గజాల స్థలం ఇస్తున్నట్లు గతంలో టీఆర్ఎస్ ప్రకటించిందన్నారు. ఆ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసిందని, కోర్టు నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. -
‘కాళేశ్వరం’పై మరోసారి అంతర్రాష్ట్ర చర్చలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై మహారాష్ట్రతో మరోసారి అంతర్రాష్ట్ర చర్చలు జరగనున్నాయి. గతంలో మహారాష్ట్రలో జరిపిన ఒప్పందాల మేరకు జరుగుతున్న పనులు, ప్రస్తుత పరిస్థితులు, భూసేకరణ, అవసరమైన అనుమతులు, తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం తదితర అంశాలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు, కలెక్టర్లతో కూడిన ఈ కమిటీ ఈ నెల 3న హైదరాబాద్లో సమావేశమై ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్చలు జరపనుంది. మహారాష్ట్రతో 2016 ఆగస్టులో కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణ ఒప్పందాల సందర్భంగా 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డలో నీటి నిల్వ, 148 మీటర్ల ఎత్తులో తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, మేడిగడ్డతో భూ అవసరాలు, వాటి సేకరణ, అనుమతులు, వరద నివారణ చర్యలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంటర్స్టేట్బోర్డు ఏర్పాటు చేసి అందులో చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో సమన్వయ కమిటీ, సెక్రటరీల స్థాయిలో స్టాండింగ్ కమిటీ, ముఖ్యమంత్రుల స్థాయిలో బోర్డు ఏర్పాటు చేశారు. వార్ధాతో భూసేకరణ తగ్గే అవకాశం! మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రలో 453 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 40 ఎకరాల సేకరణ మాత్రమే మిగిలి ఉంది. దీనికి మహారాష్ట్ర సహకారం కోరాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీని 101 మీటర్ల లెవల్లో నిర్మించినా.. 100 మీటర్ల లెవల్లోనే నీటిని నిల్వ చేయాలని ఒప్పందం ఉంది. దీని నిర్మాణ పనుల తీరు, ఆమోదించిన డిజైన్స్పై మహారాష్ట్ర అడిగి తెలుసుకునే అవకాశముంది. తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలీ జిల్లాలోనే 509 ఎకరాలు ముంపు ఉండగా, ఆసిఫాబాద్ జిల్లాలో 300 ఎకరాల ముంపును అంచనా వేశారు. తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతం రాష్ట్ర పరిధిలోని కవ్వాల్, మహారాష్ట్ర పరిధిలోని తడోబా వన్యప్రాణి ప్రాంతం పరిధిలో ఉంటోంది. దీంతో అటవీ అనుమతులతో పాటు వణ్యప్రాణి బోర్డు అనుమతులు తప్పనిసరి అయ్యాయి. అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా తమ ప్రాంత భూములు ఇచ్చేందుకు మహారాష్ట్ర సమ్మతి తెలపడంతో పర్యావరణ, అటవీ అనుమతులు దక్కాయి. ఈ అనుమతుల అంశంతో పాటు ప్రస్తుతం తమ్మిడిహెట్టికి బదులుగా వార్ధా నదిపై చేపట్టాలనుకుంటున్న బ్యారేజీ అంశాలను చర్చించాలని నిర్ణయించారు. వార్ధా నదిపై బ్యారేజీ నిర్మాణం చేపడితే మహారాష్ట్రలో ఉండే ముంపు, భూసేకరణ, నీటి లభ్యత విషయంలో ఉన్న అనుమానాలపై తెలంగాణ ఇంజనీర్లు స్పష్టత ఇవ్వనున్నారు. తమ్మిడిహెట్టితో పోలిస్తే వార్ధా బ్యారేజీ నిర్మాణం చిన్నదైనందున భూసేకరణ చాలావరకు తగ్గే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ భేటీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఆదిలాబాద్ సీఈ భగవంతరావు, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, మహారాష్ట్ర తరఫున గడ్చిరోలీ, చంద్రాపూర్ జిల్లాల కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు హాజరుకానున్నారు. -
స్వేచ్ఛా భారత్ దిశగా కదలండి
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా భారత్ దిశగా సాహితీవేత్తలు, కవులు, రచయితలు ముందడుగు వేయాలని ప్రముఖ కన్నడ రచయిత్రి, సీనియర్ జర్నలిస్టు ప్రతిభానందకుమార్ పిలుపునిచ్చారు. భిన్న ఆలోచనలను, విభిన్న సాహిత్యాలను సమాజం ప్రతిబింబించాలని, భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే భావప్రకటనా స్వేచ్ఛను ఎప్పటికీ కోల్పోవద్దని ఆమె సూచించారు. శుక్రవారం బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘కన్నడ సాహిత్యం అప్పుడు–ఇప్పుడు’అనే అంశంపై ప్రతిభా నందకుమార్ కీలక ఉపన్యాసం చేశారు. సామాజిక పరిణామాలకు, మార్పులకు అనుగుణంగా కన్నడ సాహిత్యం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉందని, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడంలో కన్నడ సాహితీవేత్తలు మొదటి నుంచి ముందంజలో ఉన్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు సమాజాన్ని ప్రతిబింబిస్తోన్న సోషల్ మీడియా కంటే బలమైన సాహిత్యాన్ని తాము దశాబ్దాల క్రితమే రాసినట్లు పేర్కొన్నారు. కుచించుకుపోతున్న ప్రజాస్వామిక వాతావరణం పద్మావత్ వంటి సినిమాను వ్యతిరేకించడం, అందులోని కథాంశాన్ని జీర్ణించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి అసహనం తాము ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాతావరణం రోజురోజుకూ కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు, వివక్ష కొనసాగుతున్న రోజుల్లోనే తాము స్వేచ్ఛగా సాహితీ సృజన చేశామని, 35 ఏళ్ల క్రితమే తాను ఎరోటిక్ పొయెట్రీ రాసినట్లు ఆమె గుర్తుచేశారు. కొంతమంది జ్యోతిష్య పండితులు మహిళల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని, ఫలానా రాశి మహిళలు అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉందంటూ చేస్తోన్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై తాను ‘ఆగ్రహం’అనే కవిత రాసినట్లు గుర్తు చేశారు. సృజనాత్మక రచనలకు సోషల్మీడియా సరికొత్త వేదికగా మారుతోందని, స్వేచ్ఛాయుత వాతావరణం కోసం, వివక్ష, పురుషాధిపత్యం లేని సమాజం కోసం నేటితరం రచయితలు కృషి చేయాలని కోరారు. భిన్న సంస్కృతులకు నిలయం.. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులకు, కళలకు హైదరాబాద్ నిలయమని అన్నారు. మగ్ధూం మొహియుద్దీన్, సరోజినీనాయుడు, డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి ఎందరో మహానుభావులు హైదరాబాద్ నుంచి తమ కలాన్ని, గళాన్ని ప్రపంచానికి వినిపించారని చెప్పారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ సాహిత్యంతో పాటు, తెలంగాణ సాహిత్య సంస్కృతులకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కొత్తతరం రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. స్పెయిన్ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ ఎడ్యురో సాంచెజ్ మొరాకో మాట్లాడుతూ.. స్పానిష్ భాషకు తెలుగు భాషకు పోలికలున్నాయని, తెలుగులో ఉన్నట్లుగానే స్పానిష్లోనూ మాండలికాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రెండు ప్రాంతాల మధ్య ఒక చక్కటి సాంస్కృతిక వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ప్రఖ్యాత నర్తకి సోనాల్మాన్సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లేని వైవిధ్యభరిత సంస్కృతి, అత్యున్నత సంప్రదాయాలు, విలువలు ఒక్క భారత్లోనే ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం గొప్పదనమని చెప్పారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభోత్సవ సభలో కన్నడంలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. చర్చాగోష్టులు.. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం స్పెయిన్ మహిళా రచయిత్రుల సాహిత్యంపైనా, పలువురు రచయితలు రాసిన పుస్తకాలపైనా చర్చాగోష్టులు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన దళిత సామాజిక కార్యకర్త సరస్వతి వంట చేస్తూ చెప్పిన రామాయణం, దక్కనీ ఉర్దూలో సాగిన మిజాహియా ముషాయిరా తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 70 మంది కళాకారులు నిర్వహించిన కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్కుమార్, సినీ దర్శకుడు డాక్టర్ కిన్నెరమూర్తి తదితరులు పాల్గొన్నారు. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎస్పీ సింగ్. చిత్రంలో బుర్రా వెంకటేశం -
కిమ్తో మాట్లాడతా..
క్యాంప్డేవిడ్ : ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్తో ఫోన్లో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య చర్చలు సానుకూల ఫలితాలు రాబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఈ చర్చలతో తెరపడుతుందని అన్నారు. వచ్చే వారం దక్షిణ కొరియాతో అధికారిక సంప్రదింపులకు ఉత్తర కొరియా అంగీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్, కిమ్ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో చర్చల ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. తన టేబుల్ వద్దే న్యూక్లియర్ బటన్ ఉందని గతవారం ట్రంప్ను ఉద్దేశించి కిమ్ హెచ్చరించగా..తన వద్ద పెద్ద బటన్ ఉందని, అది కచ్చితంగా పనిచేస్తుంది కూడా అంటూ ట్రంప్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. -
చర్చలకు మేం సిద్ధమే!
సియోల్: దాదాపు రెండేళ్ల తర్వాత దక్షిణకొరియా, ఉత్తరకొరియా దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు వచ్చే వారంలో సమావేశం కానున్నారు. సరిహద్దులోని పాన్ముంజోమ్లో వీరు చర్చలు జరపనున్నారు. ఈ చర్చలను ‘మంచి పరిణామం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. అమెరికాపై ఎక్కడైనా దాడి చేయగల అణు క్షిపణులు తన వద్ద ఉన్నాయనీ, దాడిని సంబంధించిన న్యూక్లియర్ బటన్ తన టేబుల్ పైనే ఉంటుందని కిమ్ ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. దీనికి సమాధానంగా ట్రంప్.. కిమ్ దగ్గర ఉన్న దాని కంటే శక్తిమంతమైన బటన్ తన వద్ద ఉందని హెచ్చరించారు. -
కశ్మీర్పై చర్చలు ప్రారంభిస్తాం!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో శాంతి స్థాపనలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆ రాష్ట్రంలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ డైరెక్టర్ దినేశ్వర్ శర్మకు అప్పగించింది. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోహోం శాఖ మంత్రి రాజ్నాథ్ వివరాలు వెల్లడిస్తూ..‘కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృఢ వైఖరి, నమ్మకంతో ఉంది. ఆ మార్గంలోనే ముందుకు సాగుతుంది. అందులో భాగంగా చర్చల ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించాం. అందుకే భారత ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా దినేశ్వర్ శర్మను నియమిస్తున్నాం. కశ్మీర్లోని అన్ని వర్గాల ప్రజలు, సంస్థలతో ఆయన చర్చలు కొనసాగిస్తారు’ అని తెలిపారు. ఇంతటి సున్నిత అంశంపై చర్చలు జరపగల సామర్థ్యం ఒక పోలీసు అధికారికి ఉంటుందా? అని ప్రశ్నించగా ‘అందులో తప్పేముంది. ఆయన రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి.అదే పెద్ద అనుకూల అంశం’ అని అన్నారు. 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన దినేశ్వర్ శర్మ 2014 నుంచి 2016 వరకూ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు. కశ్మీర్పై చర్చల కోసం కేంద్రం చొరవను కశ్మీర్ సీఎం మెహబూబా స్వాగతించారు. -
పశు వైద్య పట్టభద్రుల చర్చలు విఫలం
ఈ నెల 25న మరోమారు మంత్రి తలసానితో భేటీ! సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనకై 11 రోజులుగా సమ్మె చేస్తున్న పశువైద్య పట్టభద్రులతో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ గురువారం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, నియామక ప్రక్రియను టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ(డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ) ద్వారా చేపట్టాలని పశువైద్య పట్టభద్రులు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని పశుసంపద కేంద్రాలను పశు వైద్యశాలలుగా మార్చాలని, వైద్య సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టులు, నియామకానికి సంబంధించిన విధి విధానాలేమిటో తెలిపాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లును మంత్రి తలసాని ఆదేశించారు. అయితే, పశువైద్య పోస్టుల ఖాళీలు, నియామక ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక సమస్యలను సమీకరించేందుకు గడువు కావాలని డైరెక్టర్ మంత్రిని కోరారు. దీంతో ఈ నెల 25లోగా వివరాలను సమర్పించాలని, తదుపరి చర్చల నిమిత్తం 25న మరోమారు భేటీ కావాలని మంత్రి నిర్ణయించారు. అయితే తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తాము చేస్తున్న సమ్మెను కొనసాగించాలని పశువైద్య పట్టభద్రులు నిర్ణయించారు. మంత్రిని కలసిన వారిలో పశువైద్య పట్టభద్రులు కాటం శ్రీధర్, మౌనిక, అభిలాశ్, పురుషోత్తమ్ నాయక్ తదితరులున్నారు. -
ఎన్నికలయ్యాక అనువైన వాతావరణం
భారత్తో చర్చలపై ఆశాభావం వ్యక్తం చేసిన పాక్ వాషింగ్టన్ : భారత్తో శాంతి చర్చలు జరపడానికి యూపీ తదితర ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం అనువైన సమయంగా పాకిస్తాన్ భావిస్తోంది. ‘ఈ ఎన్నికలన్నీ మార్చి నాటికి అయిపోతాయి. భారత్తో చర్చల పునరుద్ధరణకు అప్పుడు మెరుగైన వాతావరణం ఏర్పడుతుందనుకొంటున్నాం. మేం ఎప్పటికీ చర్చలకు కట్టుబడి ఉన్నాం’అని పాక్ ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అహసన్ ఇక్బాల్ చెప్పారు. భారత్లో అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావించడంపై పెద్దగా ప్రభావం ఉండదని ఓ అమెరికన్ మేధావి అడిగిన ప్రశ్నకు ఇక్బాల్ బదులిచ్చారు. ‘ఇది దురదృష్టకరం. వీటికి భిన్నంగా మన ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉంది. శాంతియుత వాతావరణం కోసం భారత్–పాక్లు కలిసి నడవాలి. భౌగోళిక స్వరూపాలను మనం మార్చలేము’అన్నారు. ఈ విషయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎంతో చొరవ చూపుతున్నారన్నారు. 46 బిలియన్ డాలర్ల ‘చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’(సీపీఈసీ)పై భారత్ అభ్యంతరాలను తొందరపాటు వ్యాఖ్యలు గా ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రాంతీయ సహకారం పెరుగుతుందన్నారు. వ్యతిరేకించేకంటే సీపీఈసీలో చేరి అందులోని విభిన్న అవకాశాలను అందిపుచ్చుకో వాలన్నారు. చైనాతో వర్తకానికి సీపీఈసీ వల్ల భారత్కు అత్యంత దగ్గరి మార్గం ఏర్పడుతుందన్నారు. -
నోట్ల రద్దుపై చర్చ కొనసాగాలి
అఖిలపక్ష భేటీలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్ రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు వ్యవహా రంపై చర్చ కొనసాగించాలని అఖిలపక్ష భేటీలో కేంద్రాన్ని కోరినట్టు టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత ఏపీ జితేందర్రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమా వేశాల నేపథ్యంలో సోమవారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ 9 రోజుల్లో అన్నింటిపై చర్చకు ఆస్కారం లేదు. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం వంటి అంశాలకు 5 రోజులు పూర్తవు తాయి. ఇక మిగిలిన రోజుల్లో అనేక బిల్లు లు రానున్నా నోట్లరద్దుపై చర్చ జర గాలని కోరాను. రెండో విడత సమా వేశాల్లో హైకోర్టు విభజన, ఎయి మ్స్ ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టులు, వెనుక బడిన జిల్లాలకు, మిషన్ కాకతీయ, భగీ రథ పథకాల నిధుల గురించి ప్రస్తావిస్తామని వెల్లడించారు. -
ఫార్మా రైతులతో కొనసాగిన చర్చలు
రైతులతో మరోసారి సమావేశమైన జేసీ కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. ముచ్చర్ల సర్వే నంబర్ 155లోని 630.11 ఎకరాల్లో 211.24 పట్టా, 176 ఎకరాల్లో అసైన్డదారులు, 242.17 ఎకరాల్లో కబ్జా ఉంది. శుక్రవారం అసైన్డదారులతో జేసీ రజత్కుమార్సైనీ, ఆర్డీఓ సుధాకర్రావు, తహసీల్దార్ సుశీల, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రవి తదితరులు రెండో దఫా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. గత సమావేశంలో చెప్పిన విధంగా భూమి అభివృద్ధి చేసినందుకు మొత్తంగా ఎకరాకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో భూములు కొనాలన్నా ధరలు పెరిగిపోయాయని ఎకరాకు రూ.15 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు అసైన్డ భూములకు రూ.8 లక్షల వరకు మాత్రమే ఇచ్చామని, ఇక్కడ భూమి అభివృద్ధి చేసినందుకు అదనంగా మరో రూ.2 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని జేసీ వివరించారు. భూములు ఇవ్వడానికి సిద్ధమైతే ఆగస్టు వరకు పరిహారం చెక్కులు ఇస్తామని ఆలోచించుకొని రావాలని వారితో సమావేశాన్ని ముగించారు. రహదారి విస్తరణకు భూసేకరణ.. ఫార్మా రైతులతో సమావేశం ముగిసిన అనంతరం జేసీ రజత్కుమార్సైనీ ఆర్ అండ్ బీ ఎస్ఈ సంధ్యారాణి, ఆర్డీఓ, తహసీల్దార్ తదితరులతో కలిసి కందుకూరు-మీర్కాన్పేట రహదారి వెంట ఉన్న రైతులతో సమావేశమై చర్చలు జరిపారు. జేసీ మాట్లాడుతూ.. ఫార్మాసిటీ కోసం శ్రీశైలం రహదారి నుంచి నేరుగా మీర్కాన్పేట, యచారం వరకు ఉన్న రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా శ్రీశైలం రహదారి నుంచి మీర్కాన్పేట వరకు రోడ్డును 150 అడుగుల మేర విస్తరించనున్నట్లు చెప్పారు. రైతులంతా భూములు ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం సబ్ రిజిస్టార్ ్ర ధరకు అదనంగా మూడు రెట్లు ఇవ్వాలని రైతులు కోరారు. చివరగా ఎకరాకు రూ.50 లక్షల చొప్పున ఇవ్వాలని లేకపోతే ఇవ్వమని తేల్చిచెప్పారు. అంత ధర ఇవ్వలేమని ఆలోచించుకోవాలని, మరోమారు సమావేశమవుదామని సమావేశాన్ని ముగించారు. ఏఏ రైతు భూమి ఎంత మేర తీసుకోవాల్సి వస్తుందో సర్వే చేసి సోమవారం వరకు ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారుల్ని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈ అమృతరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
28న ఆర్డీఎస్ పై కర్ణాటకతో చర్చలు
♦ బెంగళూరు వెళ్లనున్న మంత్రి హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)పై నెలకొన్న అనిశ్చితికి తెరదించేం దుకు ఎగువ రాష్ట్రమైన కర్ణాటకతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డీఎస్పై చర్చించేందుకు ఈ నెల 28న బెంగళూరుకు రావాల్సిందిగా కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎం.బి. పాటిల్...రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావును శనివారం ఆహ్వానించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నడుమ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న ఆర్డీఎస్ వివిధ కారణాలతో తెలంగాణ ప్రాంత ఆయకట్టు రైతులకు నీరు అందించలేకపోతున్న వైనాన్ని హరీశ్రావు శనివారం ఫోన్లో పాటిల్తో చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డీఎస్ పనులు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 15.9 టీఎంసీల ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా 5-6 టీఎంసీలకు మించి రావడం లేదని...ఫలితంగా నిర్దేశిత ఆయకట్టులో కనీసం 20 వేల ఎకరాలు కూడా సాగుకు నోచుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రైతులు తరచూ తూములు పగలగొట్టడం, నీటిని అక్రమంగా తరలించుకుపోవడం వంటి చర్యలతో ఆర్డీఎస్ ద్వారా తెలంగాణలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తును 15 సెంటీమీటర్ల మేర పెంచేందుకు, లైనింగ్ మరమ్మతులకు ఉమ్మడి రాష్టంలో రూ. 72 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని హరీశ్రావు ప్రస్తావించారు. ఇందులో రూ. 58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినా పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆర్డీఎస్పై నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పాటిల్కు సూచించారు. దీనిపై స్పందించిన పాటిల్.. ఈ నెల 28న హరీశ్రావును బెంగళూరుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. -
నేడు మున్సిపల్ జేఏసీతో ఈటల చర్చలు
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె విరమణ కోసం మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. మునిసిపల్ కార్మిక జేఏసీతో శుక్రవారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చర్చలు జరపనున్నారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గురువారం ఈటలతో ఫోన్లో సంప్రదింపులు జరిపి సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఈటల సీఎం కేసీఆర్తో గురువారం మాట్లాడిన తర్వాత, శుక్రవారం చర్చలు జరిపేందుకు అంగీకరించారు. ఈ చర్చల్లో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సైతం పాల్గొనే అవకాశముంది. కనీస వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర 16 డిమాండ్లతో కార్మికులు గత నెల 6న సమ్మె ప్రారంభించిన సంగతి తెలిసిందే. సమ్మె 40 రోజుల కు చేరడంతో ప్రభుత్వం, కార్మిక నేతలు కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. పారిశుధ్య కార్మికులకు నగర పంచాయతీల్లో రూ.7,300 నుంచి రూ.9 వేలకు, మునిసిపాలిటీల్లో రూ.8,300 నుంచి 10 వేలకు, కార్పొరేషన్లలో రూ.8,500 నుంచి రూ.11 వేలకు పెంచాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉం ది. శ్లాబు విధానంలో పెంచాలనే ఈ ప్రతిపాదనలనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో నేటి చర్చల్లో తేలే అవకాశముంది. -
పాకిస్తాన్తో మళ్లీ చర్చలు
-
మోదీ- షరీఫ్ చర్చల ముఖ్యాంశాలు
షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా శుక్రవారం రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గంటపాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదంపై వారు లోతుగా చర్చించారు. వాటిలో ముఖ్యాంశాలు.. ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఇరుదేశాల భద్రత సలహాదార్లు అజిత్ దోవల్(భారత్), సర్తాజ్ అజీజ్ (పాక్) ఢిల్లీలో సమావేశమై ఉగ్రవాద అంశాలపై చర్చిస్తారు. (అజీజ్కు పాక్లో దార్శనికుడిగా, ఆర్థికవేత్తగా పేరుంది) పాక్లో జరుగుతున్న 26/11 ముంబై దాడుల విచారణను వేగవంతం చేసేందుకు.. స్వర నమూనాలను అందించడం సహా.. అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు అంగీకారం. (ఈ విచారణలో తీవ్ర జాప్యం, అలసత్వంపై భారత్ ఇప్పటికే పలుమార్లు తీవ్ర అభ్యంతరం తెలిపింది. దాడుల సూత్రధారి లఖ్వీని జైలు నుంచి విడుదల చేయడాన్ని నిరసించింది. అందుకు బాధ్యత వహించాల్సిన పాకిస్తాన్పై చర్య తీసుకోవాలంటూ ఐరాసలో ఒక తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టింది. చైనా అడ్డుకోవడంతో అది వీగిపోయింది) వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట శాంతి నెలకొనేందుకు తీసుకునే చర్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డెరైక్టర్ జనరల్, పాక్ రేంజర్స్ డెరైక్టర్ జనరల్ల మధ్య అతిత్వరలో భేటీ. తర్వాత ఇరుదేశాల డెరైక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) భేటీ. శాంతి స్థాపన, అభివృద్ధి సాధన ఇరుదేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టీకరణ. ఆ దిశగా, అన్ని అపరిష్కృత అంశాలపై చర్చలు జరపాలని నిర్ణయం. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని మోదీ, షరీఫ్లు తీవ్రంగా ఖండించారు. దక్షిణాసియా నుంచి ఉగ్రవాద భూతాన్ని తరిమేసేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం. పాక్ జైళ్లలో ఉన్న 355 మంది భారత జాలర్లను, భారత జైళ్లలోని 27 మంది పాక్ జాలర్లను, వారి పడవలతో సహా 15 రోజుల్లోగా విడుదల చేయాలని నిర్ణయం. మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక యంత్రాంగ రూపకల్పన. వచ్చే సంవత్సరం ఇస్లామాబాద్లో జరగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవాలన్న షరీఫ్ ఆహ్వానానికి మోదీ సానుకూల స్పందన. (2004 జనవరిలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాక్ పర్యటన అనంతరం భారత ప్రధాని పాక్కు వెళ్లడం ఇదే ప్రథమం) -
పాకిస్తాన్తో మళ్లీ చర్చలు
భారత్, పాకిస్తాన్ సంబంధాల్లో కీలక ముందడుగు.. రెండు దేశాల మధ్య కొన్నాళ్లుగా పేలుతున్న మాటల తూటాలకు విరామం..దాయాది దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా మరో ప్రయత్నం.. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభనను తొలగించేందుకు అంగీకారం.. సరిహద్దుల్లో ఉద్రిక్తతను చల్లార్చేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభం.. దక్షిణాసియా నుంచి ఉగ్రవాద భూతాన్ని తరిమికొట్టాలనే విషయంలో ఏకాభిప్రాయం.. ముంబై దాడుల విచారణను వేగవంతం చేసేందుకు సానుకూలత.. కశ్మీర్ ప్రస్తావన లేని సంయుక్త ప్రకటన.. దాదాపు పుష్కరం తరువాత ఒక భారత ప్రధాని పాకిస్తాన్ పర్యటనకు వెళ్తున్న చారిత్రక సందర్భం..! భారత్, పాకిస్తాన్ దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ల మధ్య శుక్రవారం రష్యాలోని ఉఫాలో జరిగిన కీలక భేటీ సాధించిన విజయాలివి. - తొలగిన ప్రతిష్టంభన; త్వరలో ఇరుదేశాల భద్రత సలహాదారుల సమావేశం - రష్యాలో మోదీ, షరీఫ్ల ప్రత్యేక భేటీ - సంయుక్త ప్రకటన విడుదల చేసిన విదేశాంగ కార్యదర్శులు - ముంబై దాడుల విచారణ వేగవంతం - సరిహద్దు దళాల డీజీల భేటీ.. బోట్లతో సహా మత్స్యకారుల విడుదల - కశ్మీర్ ప్రస్తావన లేకపోవడంపై పాక్లో నిరసన - 2016లో పాక్ వెళ్లనున్న మోదీ ఉఫా(రష్యా): భారత్, పాకిస్తాన్ సంబంధాల్లో కొన్నాళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. కశ్మీర్ ప్రస్తావన లేకుండా సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా శుక్రవారం రష్యాలోని ఉఫాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గంటపాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదంపై వారు లోతుగా చర్చించారు. ఆ తరువాత రెండు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఎస్.జైశంకర్, ఇజాజ్ అహ్మద్ చౌధరి సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అందులో భారత్, పాక్ల మధ్య సంబంధాలను మెరుగుపర్చే దిశగా ఐదు పాయింట్ల రోడ్మ్యాప్లు ఆవిష్కరించారు. సంయుక్త ప్రకటనలో కానీ, రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల సంయుక్త మీడియా సమావేశంలో కానీ కశ్మీర్ సమస్య ప్రస్తావన రాకపోవడం గమనార్హం. ఉఫాలో మోదీ, షరీఫ్ల మధ్య చర్చల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు సడలేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని సంయుక్త ప్రకటనలో వివరించారు. కశ్మీర్ ప్రస్తావన ఉండాల్సింది ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేలా, దార్శనికుడిలా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యవహరించారని భారత్ ప్రశంసించింది. ‘ఈ రోజు(శుక్రవారం) తీసుకున్న నిర్ణయాలపై సంతోషంగా ఉన్నారా?’ అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ‘అవును’ అంటూ షరీఫ్ సమాధానమిచ్చారు. మోదీ, షరీఫ్ల భేటీ ఒక సానుకూల ముందడుగు అని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయితే, సంయుక్త ప్రకటనలో కశ్మీర్ సమస్య ప్రస్తావన లేకపోవడంపై పాక్ ప్రతిపక్షాలు, మీడియా షరీఫ్పై విరుచుకుపడ్డాయి. కశ్మీర్ ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, సంయుక్త ప్రకటనలో ఆ ప్రస్తావన ఉండాల్సి ఉందని మాజీ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించారు. మళ్లీ ఏడాది తరువాత..! గత సంవత్సరం మేలో నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి నవాజ్ షరీఫ్ హాజరైన సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ఆ తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నవంబర్లో కఠ్మాండూలో జరిగిన సార్క్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కలుసుకున్నప్పటికీ ముక్తసరిగానే మాట్లాడుకున్నారు. అప్పుడు ప్రత్యేక చర్చలేవీ చోటు చేసుకోలేదు. తరువాత ఇద్దరు నేతలు సానుకూల వాతావరణంలో చర్చలు జరపడం, ఇరుదేశాల మైత్రికి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువరించడం ఇదే ప్రథమం. గత సంవత్సరం ఆగస్ట్లో భారత్, పాక్ల విదేశాంగ కార్యదర్శుల మధ్య ఇస్లామాబాద్లో చర్చలు జరగాల్సి ఉండగా.. ఈ చర్చలకు సంబంధించి ఢిల్లీలోని పాక్ రాయబారి కశ్మీర్ వేర్పాటువాద నేతలతో భేటీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారత్ చర్చల్లోంచి తప్పుకుంది. తుర్క్మెనిస్తాన్కు మోదీ.. మూడు రోజుల రష్యా పర్యటన అనంతరం మోదీ శుక్రవారం తుర్క్మెనిస్తాన్కు వెళ్లారు. ‘రష్యా పర్యటన సంతృప్తికరం. భేటీలు, చర్చలు ఫలప్రదంగా జరిగాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. అంతకుముందు అఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో మోదీ భేటీ అయ్యారు. అఫ్ఘాన్ భద్రత, ఆ దేశంలో భారత సహాయక చర్యలు తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. -
మరోసారి చర్చల పర్వం
ఇరుగూ పొరుగూ అన్నాక పొరపొచ్చాలు సహజం. అడపా దడపా ఘర్షణలూ తప్పవు. కానీ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్నంత బలహీనంగా, పెళుసుగా ఏ రెండు దేశాల సంబంధాలూ ఉండవన్నది నిజం. రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగడం, ఒక ఆశారేఖ తళుక్కుమనడం... ఇంతలోనే అధీనరేఖవద్ద తుపాకులు గర్జించడం, రెండువైపులనుంచీ హెచ్చరికలు, పరస్పర ఆరోపణలు వెల్లువెత్తడం ఒక రివాజుగా మారింది. మధ్యన ఏదో అంశంపై అలకలు, కార్యదర్శుల స్థాయి చర్చలో, మరొకటో నిలిచిపోవడమూ మామూలే. అందువల్లే శుక్రవారం రష్యాలోని ఉఫాలో బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ (ఎస్ఓసీ) సదస్సుల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య జరిగిన చర్చలను అందరూ స్వాగతిస్తున్నా వాటిపై పెద్ద ఆశలేమీ పెట్టుకోవడం లేదు. అయితే అధినేతలిద్దరి మధ్యా ముందు అరగంట చర్చలుంటాయనుకున్నది గంటసేపు జరగడం ఒక శుభసూచకమని విశ్లేషకుల భావన. నిరుడు తన ప్రమాణస్వీకారానికి మిగిలిన సార్క్ దేశాల అధినేతలతోపాటు నవాజ్ షరీఫ్ను ఆహ్వానించడంద్వారా నరేంద్ర మోదీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పుడే ఇద్దరి మధ్యా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకు ఏడాదిక్రితం పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నవాజ్ ఇరు దేశాల సంబంధాలపై విభిన్నంగా మాట్లాడటంవల్ల ఈ చర్చల ఫలితంపై ఎన్నో ఆశలు రేకెత్తాయి. తమ భూభాగాన్ని ఉగ్రవాదులు భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడాన్ని అంగీకరించబోమని నవాజ్ అప్పట్లో చెప్పారు. అంతేకాదు...ముంబై దాడుల్లో తమ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రమేయం గురించి కూడా సమీక్షిస్తానని, కార్గిల్ విషయంలో జరిగిందేమిటో వెల్లడిస్తానని అన్నారు. అటు తర్వాత ఐక్యరాజ్యసమితిలో మాట్లాడినప్పుడు కూడా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం గురించి నొక్కిచెప్పారు. పాక్ ప్రధానిగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం అసాధారణం. ఈలోగా ఇక్కడ మోదీ అధికారంలోకి రావడం, రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక చర్చలు జరగడంతో ఇరు దేశాల మధ్యా కొత్త శకం ఆవిష్కృతం అవుతుందనుకున్నారు. అయితే, ఆ చర్చలైన కొన్ని రోజులకే పరిస్థితులు మారిపోయాయి. సరిహద్దుల్లో యధావిధిగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ముందు రెచ్చగొట్టింది మీరంటే మీరని ఆరోపణలు వినిపించాయి. మోదీ-నవాజ్ ద్వైపాక్షిక చర్చలకు కొనసాగింపుగా నిరుడు ఆగస్టులో ఇస్లామాబాద్లో జరగాల్సిన భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు హఠాత్తుగా రద్దయ్యాయి. న్యూఢిల్లీలో పాకిస్థాన్ హైకమిషనర్ మన ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా వేర్పాటువాద హురియత్ నేతలతో సమావేశం కావడంవల్లే ఈ స్థితి ఏర్పడింది. ‘మీరు ఎవరితో చర్చలు జరపాలనుకుంటున్నారు...భారత ప్రభుత్వంతోనా, వేర్పాటువాదులతోనా, తేల్చుకోండి’ అని మన ప్రభుత్వం ఆ సందర్భంగా పాక్కు అల్టిమేటం కూడా ఇచ్చింది. ఆ తర్వాత నిరుడు కఠ్మాండూలో జరిగిన సార్క్ దేశాల అధినేతల సమావేశంలో మోదీ, నవాజ్లు పరస్పరం ఎదురుపడి చిరునవ్వులు చిందించుకోవడం మినహా పలకరింపులే లేవు... ఇక ద్వైపాక్షిక చర్చల మాట చెప్పేదేముంది? ఇలాంటి సమయంలో ఉఫాలో రెండు దేశాల అధినేతల మధ్యా జరిగిన చర్చలు ఆశ్చర్యపరచడం సహజమే. ఇరు దేశాలమధ్యా స్తంభించిన చర్చల ప్రక్రియను పునరుద్ధరించుకోవాలని, ముంబై దాడి కేసు నిందితులపై విచారణ త్వరితగతిన జరగడానికి వీలైన చర్యలు తీసుకోవాలని చర్చల అనంతరం విడుదలైన ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఈ చర్చలు ప్రధానంగా ఉగ్రవాదంపైనా, దాని ధోరణులపైనా సాగాయని వివరించింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు ప్రకటన తెలిపింది. ఈ చర్చలకు కొనసాగింపుగా భారత్కు చెందిన సరిహద్దు భద్రతా దళానికి, పాకిస్థాన్ రేంజర్స్ మధ్యా...ఆ తర్వాత ఇరు దేశాల మిలిటరీ డెరైక్టర్ జనరళ్ల మధ్యా సంప్రదింపులు సాగుతాయని ఈ ఉమ్మడి ప్రకటన చెప్పడం ఆశావహమైన పరిణామం. అలాగే, ముంబై దాడుల్లో ప్రమేయమున్నదని చెబుతున్న ఉగ్రవాదుల స్వర నమూనాలను అందించడంతోసహా వివిధ చర్యలు తీసుకోవాలనుకోవడం కూడా ఒక ముందడుగే. అయితే, రెండు దేశాలకూ మధ్య అత్యంత కీలకమైన సమస్యగా ఉన్న కశ్మీర్ సంగతి ఇందులో ప్రస్తావనకే రాకపోవడంవల్ల ఈ చర్చల కథ కూడా కంచికే వెళ్తుందా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. ఈ చర్చల కోసం నరేంద్రమోదీ ఒక మెట్టు దిగారనే చెప్పాలి. స్నేహితులను ఎంచుకున్నట్టుగా మన పొరుగువారిని ఎంపిక చేసుకోవడం సాధ్యంకాదు. ఆ పొరుగు గిల్లికజ్జాలు పెట్టుకునేదైనా... వారి వ్యవహార శైలి మనకు నచ్చకపోయినా వారిని దారికి తెచ్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేయకతప్పదు. నిరుడు ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను మన దేశం నిలిపేయడాన్ని ఈ కారణంతోనే దౌత్య నిపుణులు వ్యతిరేకించారు. చర్చలనేవి నిరంతర ప్రక్రియగా ఉండక తప్పదు. అందులో మన వైఖరేమిటో చెప్పడం, వారి వాదనలేమిటో తెలుసుకోవడం, ఉభయులూ కలిసి పనిచేయడానికి గల అవకాశాలేమిటో చూడటం, సమస్యల విషయంలో ఒక పరిష్కారాన్ని అన్వేషించడానికి ప్రయత్నించడం తప్పనిసరి. ఉగ్రవాదానికి ఊతమీయడంవంటి అంశాల్లో గట్టిగా అభ్యంతరాలు చెప్పడం, తీరు మారనప్పుడు ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఏకాకిని చేయడం, ఒత్తిళ్లు తీసుకురావడం చేయాలి. దీనికి ఓపిక ఉండాలి. వాస్తవ పరిస్థితులను గమనించే చాకచక్యం ఉండాలి. ఇప్పుడు పాకిస్థాన్తో చర్చలకు సిద్ధపడటం ద్వారా మోదీ తనకు ఆ ఓపిక, ఆ చాకచక్యం ఉన్నాయని నిరూపించారు. అయితే, ఈ చర్చలు సత్ఫలితాలనీయాలంటే పాకిస్థాన్ తన పోకడను మార్చుకోవాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తనకు చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించుకోవాలి. అదంత సులభం కాదు. పాక్లో తన మాటే నెగ్గాలని అక్కడి సైన్యం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా భారత్తో సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపించినప్పుడల్లా మోకాలడ్డుతుంది. అంతర్గతంగా పాకిస్థాన్లో ఆ సమస్య పరిష్కారమై అంతిమంగా ఇరుదేశాల మధ్యా శాంతిసామరస్యాలు నెలకొంటే అది రెండుచోట్లా అభివృద్ధికి బాటలు పరుస్తుంది. -
లారీలు రోడ్డెక్కాయ్
-
అలా ఓ నిర్ణయానికి వచ్చేవారు...
పెను సమస్యలేవైనా మీదపడ్డప్పుడు ఒక నిర్ణయానికి రావాలంటే, వాడి వేడి చర్చలతో తలలు బద్దలు కొట్టుకోవాల్సిందే! ఎడతెగని చర్చలు ఒక్కోసారి ఒక పట్టాన కొలిక్కి రావు. వేడెక్కిన బుర్రను చల్లార్చే సాధనాలేవీ అందుబాటులో ఉండవు. ఆధునికులకు ఈ పరిస్థితి అనుభవపూర్వకమే! ప్రాచీనకాలంలో పర్షియన్లు పెద్ద పెద్ద సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే ముందు రెండు విడతలుగా చర్చలు జరిపేవారు. తప్పతాగిన స్థితిలో మొదటి విడత చర్చలు సాగించేవారు. మర్నాడు మళ్లీ సమావేశమై ‘మందు’మార్బలమేమీ లేకుండా, పెద్దమనుషుల్లా అదే విషయంపై చర్చ కొనసాగించేవారు. చర్చ ఒక కొలిక్కి వచ్చి, సమస్యకు పరిష్కారం లభించాక ఆ ఆనందంలో వారు తిరిగి ‘మదిరా’నందంలో మునిగిపోయేవారు. క్రీస్తుపూర్వం 450 ఏళ్ల నాడు పర్షియాలో అన్నిచోట్లా ఈ పద్ధతి ఉండేది. అప్పట్లో పర్షియాలో పర్యటించిన గ్రీకు చరిత్రకారుడు హెరిడాటస్ ఈ వింతాచారాన్ని చూసి విస్తుపోయి, తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చాడు. -
ఆర్టీసీ సమ్మెపై చర్చలు విఫలం
-
ఉగ్రరహిత వాతావరణంలో చర్చలు
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య అన్ని కీలక అంశాలనూ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి.. ఉగ్రవాద రహిత, హింసా రహిత వాతావరణం అవసరమని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్షరీఫ్తో పేర్కొన్నారు. సోమవారం పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా నవాజ్కు శుభాకాంక్షలు తెలుపుతూ పంపిన సందేశంలో ఈ విషయాన్ని మోదీ ఉద్ఘాటించారు. జమ్మూలో గత రెండు రోజుల పాటు వరుసగా రెండు ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో మోదీ పై విధంగా స్పందించటం గమనార్హం. ఉగ్రవాదరహిత, హింసారహిత వాతావరణంలో ద్వైపాక్షిక చర్చల ద్వారానే కీలకాంశాలన్నిటినీ పరిష్కరించుకోగలమనేది తన ప్రగాఢ విశ్వాసమని మోదీ సామాజిక వెబ్సైట్ ట్వీటర్లో కూడా వ్యాఖ్యానించారు. -
సంగీత త్యాగరాజు
-
అవసరమైతే మావోయిస్టులతో చర్చలు
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శామీర్పేట: మావోయిస్టుల ఎజెండే తమ ప్రభుత్వ ఎజెండా అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో జరిగిన 12వ బ్యాచ్ సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టులకు కావాల్సింది పేదలకు భూములు పంచడం.. సంక్షేమ ఫలాలు అందడం లాంటివని, వీటిని తమ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. అలాంటప్పుడు మావోయిస్టులతో సమస్య ఉత్పన్నం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా వారితో మాట్లాడుతారని, ఇందులో భేషజాలు లేవన్నారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం అంతగా లేదన్నారు. ఛత్తీస్గఢ్లో మాదిరిగా ఇక్కడ మావోయిస్టుల మెరుపుదాడులు జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. -
బీజేపీ, శివసేన చర్చలు షురూ..
సాక్షి, ముంబై: శివసేన, బీజేపీల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీరి మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. పొత్తు విషయంపై అధికారికంగా ఎవరు చెప్పకపోయినప్పటికీ పాత ఫార్ములాతో మంత్రిమండలి విస్తరించాలని శివసేన పట్టుబడుతుండగా దీనికి బీజేపీ సమేమిరా అంటుందని తెలిసింది. శివసేనతో చేతులు కలిపేందుకు సుముఖంగా ఉన్నట్టు ఇటీవలే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే శుక్రవారం సాయంత్రం మాతోశ్రీలో శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, చంద్రకాంత్ పాటిల్లతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆ పార్టీ నేత సుభాష్ దేశాయి, ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నట్టు తెలిసింది. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు.. శివసేన 1995 ఫార్ములా డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ ఫార్ములా ప్రకారం ఉపముఖ్యమంత్రితోపాటు హోంశాఖ, ప్రజాపనుల శాఖ, విద్యుత్ శాఖ, జలవనరుల శాఖ తదితర ఆరు కేబినేట్ మంత్రి పదవులు కావాలని శివసేన కోరింది. అదేవిధంగా సహాయక మంత్రి పదవులను కూడా శివసేనకు కేటాయించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగాలేదని, ఒకవేళ మరీ అవసరమైతే శివసేనకు హోం శాఖ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చర్చలు కొలిక్కి వస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పార్టీలూ ఏదోఒక విధంగా ‘పొత్తు’ కుదుర్చుకోవాల్సిందేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మావోయిస్టులతో చర్చలకు సిద్ధం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు: మావోయిస్టులను తిరిగి జనజీవన శ్రవంతిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా చర్చలతో పాటు చట్టపరిధిలో అన్ని చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై విపక్ష భారతీయ జనతా పార్టీ అనవరసర రాద్ధాంతం చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా విధానసౌధలోని ఆయన విగ్రహం వద్ద శుక్రవారం నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘మావోయిస్టులను జనజీవన శ్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా వారితో చర్చలు జరపడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో పాత్రికేయులు గౌరిలంకేష్కూడా ఒకరు. బీజేపీ నాయకులకు సమాజంలోని అందరూ చెడ్డవారుగా కనిపిస్తారు. అందువల్లే గౌరిలంకేష్ను బృందం నుంచి తప్పించాలని కోరుతున్నారు. అయితే వారి ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గం. మావోయిస్టులను జనజీవన శ్రవంతిలో కలిపే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయము.’ అని స్పష్టం చేశారు. గౌరి లంకేష్ను తప్పించండి..... నక్సల్స్తో చర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంలోని గౌరి లంకేష్ను వెంటనే ఆ స్థానం నుంచి తప్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్వాలను శుక్రవారం కలిసి వినతి పత్రం అందించారు. అంతేకాకుండా మావోయిస్టులు జనజీవన శ్రవంతిలో కలవడానికి వీలుగా రూపొందించిన ‘ప్యాకేజీ’ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకు అందుతోందని వారు వినతి పత్రంలో ఆరోపించారు. ఈ విషయం పై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు వజుభాయ్ రుడాభాయ్వాలతో పేర్కొన్నారు. కాగా, గవర్నర్ను కలిసిన వారిలో మాజీ ముఖ్యమంత్రి కే.ఎస్ ఈశ్వరప్ప, సీ.టీ రవి తదితరులున్నారు. -
బీజేపీలోకి ‘ఆమంచి’?
-
బీజేపీలోకి ‘ఆమంచి’?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో ఆమంచి త్రిముఖ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టీడీపీ సానుభూతి ఎమ్మెల్యేగా ఉంటానని మీడియా ముందు ప్రకటించారు. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పోతుల సునీత మరో కీలక ఎంపీతో పాటు కొందరు మంత్రులు పార్టీలో ఆమంచి చేరికను అడ్డుకున్నారు. దీంతో ఆయన కొద్దినెలలుగా రాజకీయాలకు దూరంగా ఉండి సొంత కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన ఆమంచి నియోజకవర్గంలో పలు అధికారక వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులను చూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. కేసులో మొదటి ముద్దాయి ఆయనే. ఏ సమయంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయన రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆయన సోదరుడి ఇసుక క్వారీపై దాడులు జరిగాయి. 12లారీలను సీజ్ చేసి సోదరుడుపై నాన్ బెయిల్బుల్ కేసులు బనాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరితే కేసులు, ఇతరత్రా సమస్యల నుంచి గట్టెక్కవచ్చన్నది ఆయన నిర్ణయంగా ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ అయిన కొణిజేటి రోశయ్యకు ఏకలవ్య శిష్యుడైన ఆమంచి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఆయన వర్గం కూడా ఖండించకపోవడం గమనార్హం. -
సీఎం అధికారాలను కత్తిరించే యోచన లేదు
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో చర్చలు సఫలం అయ్యాయిన టీఆర్ఎస్ ఎంపీ కేకే తెలిపారు. హైదరాబాద్లో శాంతిభద్రతల అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం రాజ్నాథ్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం కేకే మాట్లాడుతూ రాష్ట్ర అధికారాలను తగ్గించబోమని రాజ్నాథ్ చెప్పారని, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే నడుచుకుంటామన్నారన్నారు. ముఖ్యమంత్రి అధికారాలను హరించబోమని, రాష్ట్రాల హక్కుల అధికారాల్లో జోక్యం చేసుకోమని రాజ్నాథ్ చెప్పారని కేకే తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతామన్నారన్నారు. కాగా అంతకు ముందు గవర్నర్కు అధికారాలు అప్పగింత అంశంపై ఎంపీలు హోంమంత్రితో చర్చించారు. గవర్నర్కు ప్రత్యేక అధికారాలు ఇస్తే రాష్ట్ర హక్కులను హరించడమేనని ఎంపీలు తేల్చి చెప్పారు. గవర్నర్కు అధికారాలు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఇక నరసింహన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. -
చర్చకు సిద్ధంగా ఉన్నాం : యనమల
హైదరాబాద్ : రాజకీయ హత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం దద్దరిల్లింది. రాజకీయ హత్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 2004 నుంచి జరిగిన రాజకీయ హత్యలపై చర్చిద్దామని ఆయన మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు పరిటాల రవి అంశాన్ని లేవనెత్తారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టిన తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించటంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. -
ఓ అభిప్రాయానికి వచ్చాం!
-
ఇచ్చి పుచ్చుకుందాం....!
-
వివాదాలతో ఇరువురికీ నష్టం: బాబు
సాక్షి, హైదరాబాద్: వివాదాలు పడుతూ ఉంటే సమయం వృథా అని ఇరు రాష్ట్రాలూ నష్టపోతాయని, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావుతో భేటీలో స్పష్టం చేశానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివారం రాజ్భవన్లో కేసీఆర్తో చర్చల అనంతరం.. చంద్రబాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన హేతుబద్ధత లేకుండా జరిగిందని, రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ఉంటే ఈ సమస్యలుండేవి కావని కేసీఆర్ కూడా అభిప్రాయపడ్డారన్నారు. ‘‘సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల విభజన అంశం చర్చించాం. సీఎస్లు దీన్ని పరిష్కరిస్తారు. సమస్యలేమైనా ఉంటే సీఎంలు ఇద్దరం మళ్లీ మాట్లాడతాం. కేంద్ర సర్వీసు అధికారుల విభజన ఈ నెల 22, 23 తేదీల నాటికి కొలిక్కి వస్తుంది’’ అని బాబు చెప్పారు. హైదరాబాద్ అంశం కేంద్రం సెక్షన్ 8లో పెట్టినా స్పష్టత ఇవ్వకపోవడం వల్ల సమస్యలు ఏర్పడుతోందన్నారు. ఇతర దేశాలనుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలంటే బందరు పోర్టు సేవలు అవసరమవుతాయని కేసీఆర్ ప్రస్తావించారన్నారు. ఏపీ రాజధాని గురించి కేసీఆర్ అడిగారని, తెలుగు వ్యక్తిగా, సీఎంగా, సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినందున అడగడంలో తప్పులేదన్నారు. ‘‘రాష్ట్రంలో ఏ స్కీము ఉంచాలో దేన్ని తీసేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. ఫీజు రీయంబర్స్మెంట్కు సంబంధించి కొత్త పథకాన్ని పెడుతున్నామని కేసీఆర్ చెప్పారే తప్ప ఫలానా వారికి ఇవ్వబోమనడం లేదు. అక్కడ పన్నులు చెల్లించే వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. స్థానికతకు 1956 కటాఫ్ అంటే అమలుకు వీలుకాదు. ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అది వారి సొంత ప్రాంతమని నిబంధనలు చెబుతున్నాయి’’ అని బాబు వ్యాఖ్యానించారు. సర్వేలో ఇబ్బందులుంటే.. అక్కడి టీడీపీ చూస్తుంది: రాజకీయ పార్టీగా సర్వేలోని మంచి చెడ్డలను బేరీజు వేసి ఇబ్బందులుంటే విభేదిస్తామని, తెలంగాణలోనూ టీడీపీ ఉంది కనుక అక్కడి పార్టీ నేతలు దాన్ని చూస్తారన్నారు. టీసీఎస్గా ఉన్న రాజీవ్శర్మ ఉత్తరాదికి చెందిన వారని, ఆయన లాటరీలో ఏపీకి వస్తే.. తెలంగాణకు ఇస్తామని ఎన్ఓసీ ఇవ్వండని కేసీఆర్ నవ్వుతూ అడిగారని బాబు చెప్పారు. ‘‘తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కావాలి కనుక ఏపీ సమావేశాలు ముందుగా ముగించాలని కేసీఆర్ అడిగారు. సమావేశంలోనే ఏపీ స్పీకర్ కూడా ఉన్నందున ఆ మేరకు నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తామన్నారు’’ అని చెప్పారు. -
ఓ అభిప్రాయానికి వచ్చాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదం నెలకొన్న ఉద్యోగుల విభజన, అసెంబ్లీలో భవనాల కేటాయింపు, తొమ్మిదో, పదో షెడ్యూల్లోని సంస్థల అంశంలో ఒక అభిప్రాయానికి వచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. ఇంకా ఏవైనా అంశాలు ఉంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ చర్చలు జరిపి పరిష్కరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారుల చర్చల అనంతరం కేసీఆర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని.. ఇరు రాష్ట్రాలు అహం లేకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో దాదాపు రెండు గంటల పాటు తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు, ఇరు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఇరు రాష్ట్రాల సీఎస్లు రాజీవ్శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు నాగిరెడ్డి, పీవీ రమేష్, ముఖ్యమంత్రుల ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, అజయ్ సహానీ సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర కేడర్ ఉద్యోగులు 67 వేల మంది ఉంటే అందులో 22 వేల వరకు ఖాళీలున్నాయని... మిగతా 45 వేల మంది ఉద్యోగులను మాత్రమే విభజించాల్సి ఉంటుందన్నారు. అదేమీ పెద్ద సమస్య కాదని, ఇరు రాష్ట్రాల సీఎస్లు దీనిపై చర్చించి పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ తెలంగాణ డీజీపీ, సీఎస్లుగా ఉన్న అధికారులను ఆంధ్రాకు కేటాయిస్తే.. వారిని తెలంగాణకు ఇవ్వడానికి ఎన్వోసీ ఇవ్వాలని కోరగా చంద్రబాబు అంగీకరించారని కేసీఆర్ తెలిపారు. గౌరవం కాపాడుతాం.. శాసనసభకు సంబంధించి భవనాల కేటాయింపుపై పత్రికల్లో వార్తలు రావడం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చామని కేసీఆర్ తెలిపారు. పాత అసెంబ్లీ భవనంలో ఉన్న తెలంగాణ శాసనసభ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు అప్పగించాలని సూచించామన్నారు. తెలుగువాళ్లం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ... సాధారణ అంశాలపై ఇరువురం కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని నిర్ణయించామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ ఆరో తేదీతో ముగించడానికి చంద్రబాబు అంగీకరించారని కేసీఆర్ తెలిపారు. పదో తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయన్నారు. ‘‘తెలంగాణకు సముద్రం లేదు. తెచ్చిపెట్టుకుంటే రాదు. మనకు దగ్గర్లో ఉండే మచిలీపట్నం పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్తో ఎన్నో అవసరాలు ఉంటాయి. అలాంటి వాటిపై ఇరువురం కూర్చుని చర్చలతో పరిష్కరించుకుంటూ పరస్పరం సహకరించుకుంటాం..’’ అని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు పరస్పరం పరిష్కరించుకుంటే కేంద్రానికి అంతకు మించిన సంతోషం మరొకటి లేదన్నారు. ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకోలేని పక్షంలో కేంద్రం జోక్యం ఉంటుందని చెప్పారు. తొమ్మిదో, పదో షెడ్యూల్లోని సంస్థలు ఏ ప్రాంతంలో ఉంటే.. ఆ రాష్ట్రానికి చెందుతాయని విభజన చట్టంలో స్పష్టంగా ఉందని కేసీఆర్ తెలిపారు. ఎక్కడ సంస్థ ఉంటే ఆ రాష్ట్రానికే వాటి అధిపతులను నియమించే అధికారం ఉంటుందని, జాయింట్ ఎండీ పోస్టును పొరుగు రాష్ట్రం నియమించవచ్చని సూచించారు. దీనికి ఏపీ సీఎం అంగీకరించినట్లు చెప్పారు. నిథిమ్, నాక్ల నియామకాలపై చర్చించామని, మరేఅంశాలు చర్చకు రాలేదని పేర్కొన్నారు. -
ఇచ్చిపుచ్చుకుందాం..!
గవర్నర్ సమక్షంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల చర్చలు తెలంగాణకు సముద్రం లేదు... తెచ్చిపెట్టుకుంటే రాదు. మనకు దగ్గర్లో ఉండే మచిలీపట్నం పోర్టు నుంచి ఎగు మతులు, దిగుమతులు చేసుకుంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్తో ఎన్నో అవసరాలు ఉంటాయి. అలాంటి వాటిపై ఇరువురం కూర్చుని చర్చలతో పరిష్కరించుకుంటూ పరస్పరం సహకరించుకుంటాం.. - తెలంగాణ సీఎం కేసీఆర్ 'కేసీఆర్, నేను కొత్తేమీ కాదు. 1984 నుంచి పరిచయముంది. రాజకీయాల్లో కొన్ని వైఖరులు తీసుకున్నా ప్రజల విషయంలో సరైన విధానాల్లో వెళ్లాలి. గతంలో మేము కొన్ని సమయాల్లో విభేదించుకున్నా.. విమర్శించుకున్నా.. ఆ సందర్భం వేరు. కానీ నేడు ఇద్దరం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది' - ఏపీ సీఎం చంద్రబాబు పరిష్కరించుకున్న అంశాలివీ... ఉద్యోగుల పంపిణీ..: రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీని స్థానికత ఆధారంగా చేసుకోవడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు. ఇందుకోసం అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసేందుకూ ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. వారం పది రోజుల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తిచేయాలని నిర్ణయించారు. ఐఏఎస్, ఐపీఎస్ల విభజనపై 22వ తేదీకి స్పష్టత వచ్చే అవకాశాల నేపథ్యంలో.. ఒకవేళ తెలంగాణ సీఎస్, డీజీపీలను ఏపీకి కేటాయించిన పక్షంలో వారిని తిరిగి తెలంగాణకే ఇచ్చేందుకు ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. అందుకు చంద్రబాబు అంగీకరించారు. సంస్థల సేవలు..: విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల సేవలకు సంబంధించి ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ఒప్పందాలు చేసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. తెలంగాణలో ఉన్న సంస్థలకు ఎండీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఏపీ ప్రభుత్వం జేఎండీని ఏర్పాటు చేసుకోవాలని; ఏపీలో ఉన్న సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎండీని ఏర్పాటు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం జేఎండీని ఏర్పాటు చేసుకోవాలని ఇరు రాష్ట్రాలూ అంగీకరించాయి. అసెంబ్లీ భవనాలు..: అసెంబ్లీ, మండలిలో భవనాలు, స్థలం కేటాయింపుల విషయంలో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో గవర్నర్ నరసింహన్ నిర్వహించిన సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర చర్చలు, సహాయ సహకారాలకు నాంది పలికింది. గవర్నర్ నిర్వహించిన ఒక్క సమావేశంలోనే ప్రధానమైన మూడు సమస్యలకు పరిష్కారం లభించింది. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు వివాదాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్లతో సమావేశం నిర్వహించారు. రాజ్భవన్లో మధ్యాహ్నం 12 గంటలనుంచి సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో.. మూడు అంశాలకు పరిష్కారం లభించింది. ఉద్యోగుల పంపిణీ, అసెంబ్లీ భవనాల స్థల కేటాయింపులు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సీఎస్లు, ఆర్థికశాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. కోర్టులకెళితే ఏళ్లు గడుస్తాయి: గవర్నర్ గవర్నర్ నరసింహన్ తొలుత ఇద్దరు సీఎంలతో సుమారు 20 నిముషాల పాటు సమావేశమై మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, గిల్లికజ్జాలను, కీచులాటలను కాదని, దీన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని సూచించారు.విభజన సమయంలో కచ్చితంగా సమస్యలు వస్తాయని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వివాదాలు, గొడవలు పడరాదని హితవుపలికారు. కొన్ని అంశాలు కేంద్ర పరిధిలో ఉన్నాయని, వాటి పరిష్కారానికి రెండు రాష్ట్రాల సీఎంలు తనను వినియోగించుకోవచ్చునని కూడా గవర్నర్ సూచించారు. ఇరురాష్ట్రాల ప్రజలు తెలుగు వారేనని తగువు పడితే ప్రజలను చులకన చేయడమేనని గవర్నర్ అన్నారు. దీనికి చంద్రబాబు, కేసీఆర్లు స్పందిస్తూ.. ఇక తామే తరచూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. ‘ఉద్యోగుల’పై సీఎస్ల భేటీలో..: సీఎంలతో వేరుగా మాట్లాడిన అనంతరం గవర్నర్ సమక్షంలో ఇద్దరు సీఎంలు, రెండు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, సీఎస్లు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తొలుత ఉద్యోగుల పంపిణీపై చర్చను ప్రారంభించారు. ‘‘కేవలం 45,000 మంది రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీయే కదా.. రెండు రాష్ట్రాల సీఎస్లు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే ఇద్దరు ముఖ్యమంత్రులం కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం’’ అని పేర్కొన్నారు. ఇందులో పంచాయితీలు అవసరం లేదని కేసీఆర్ పేర్కొనగా.. చంద్రబాబు కూడా స్పందిస్తూ రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలం కలిసే ఉందామని స్పందించారు. ఈ దశలో కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుంటా అసెంబ్లీ, మండలి విషయంలో తెలంగాణ సభాపతులు పేర్కొన్న ప్రకారం అంగీకరించామని, ఇందులో సమస్యే లేదని చెప్పారు. దీనిపై మధుసూదనాచారి, స్వామిగౌడ్ స్పందిస్తూ అవునన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని కోసం కేంద్ర ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సహకరించాలని కేసీఆర్ను కోరారు. ఈ విషయంలో కచ్చితంగా సహకరిస్తామని కేసీఆర్ బదులిచ్చారు. నదీ జలాల విషయంలో కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. గత జ్ఞాపకాలతో... అధికారికంగా నిర్వహించిన గవర్నర్ సమావేశంలో రెండు వైపుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. గవర్నర్ మధ్యలో కూర్చుండగా గవర్నర్ కుడివైపున చంద్రబాబు, ఎడమ వైపున కేసీఆర్ కూర్చున్నారు. మధ్యాహ్నం12 గంటలకు కేసీఆర్ రాజభవన్కు చేరుకోగా 12.05 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు. ఈ భేటీ సందర్భంగా కేసీఆర్, చంద్రబాబు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. గతంలో బాబు మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. -
చర్చించుకుందాం రండి!
నల్లధనంపై భారత అధికారులకు స్విస్ ఆహ్వానం న్యూఢిల్లీ/బెర్న్: నల్లధనం ఖాతాల విషయంలో చర్చలు జరపడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత అధికారులను తమ దేశానికి ఆహ్వానించింది. అయితే దీనిపై తదుపరి వివరాలను తెలపడానికి స్విస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల ద్వారా బయటకు వచ్చిన భారత ఖాతాదారుల జాబితా విషయంలో ఎలాంటి చర్చలూ ఉండవని తెలుస్తోంది. ఆయా బ్యాంకుల్లో పనిచేసిన మాజీ ఉద్యోగుల ద్వారా ఈ జాబితాలు బయటకు వచ్చాయని సమాచారం. అక్రమపద్ధతుల్లో బయటకు వచ్చిన వివరాలపై తాము మాట్లాడబోమని స్విస్ అధికారులు అంటున్నారు. ‘నల్ల’ నోట్లలో నకిలీలు భారత్కు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు స్విట్జర్లాండ్లో దాచుకున్న నల్లధనం గురించి ఓ వైపు తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతుంటే మరో పక్క ఈ నల్లధనంలో నకిలీనోట్లు వస్తున్నాయని స్విస్ అధికారులు గుర్తించారు. యూరోలు, డాలర్ల తర్వాత భారత కరెన్సీలోనే ఎక్కువగా నకిలీనోట్లు వస్తున్నాయని స్విస్ పోలీసులు తెలిపారు. 2013 సంవత్సరంలో 2,394 నకిలీ యూరోనోట్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అలాగే 1,101 నకిలీ అమెరికా డాలర్లు వచ్చినట్లు కనుగొన్నారు. ఇక భారత కరెన్సీ విషయానికి వస్తే 2013లో 403 నకిలీనోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఈ విషయంలో భారత్ మూడోస్థానంలో ఉందని స్విస్ పోలీసులు విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇందులో రూ. 500 నోట్లు 380, 23 వెయ్యిరూపాయల నోట్లు ఉన్నట్టు గుర్తించారు. -
నక్సల్స్తో చర్చల ప్రసక్తే లేదు
ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రి భేటీ దాడులను తిప్పికొట్టాలని పిలుపు ఒకే విధానాన్ని అనుసరించాలి బలగాల ఆధునీకరణ, నిధుల పెంపునకు రాజ్నాథ్ హామీ న్యూఢిల్లీ: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే నక్సల్ హింసను అరికట్టేందుకు రాష్ట్రాలతో కలిసి తగిన విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేసింది. మావోయిస్టు ప్రభావితమైన పది రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం సమావేశమయ్యారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు సమస్యపై జరిగిన తొలి సమావేశం ఇదే. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వ ప్రాథమ్యాలను వివరించిన రాజ్నాథ్... మావోయిస్టులు విసిరే సవాళ్లను తిప్పికొట్టే విధంగా ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలను సర్వ సన్నద ్ధం చేయడానికి తగిన నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక పరికరాలను సమకూర్చి బలగాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. మావోయిస్టులతో ఎలాంటి చర్చలు ఉండబోవని, వారి దాడులను సమర్థంగా ఎదుర్కోవాలని పోలీసులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలూ ఒకే విధానాన్ని అనుసరించాలని రాజ్నాథ్ సూచించారు. భద్రత పెంపు, అభివృద్ధి, సాధికారత, సంక్షేమ పథకాల అమలు మార్గాలను అనుసరించి మావోయిస్టు సమస్యను అధిగమించవచ్చని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన ప్రత్యేక పోలీస్ దళం గ్రేహౌండ్స్ తరహాలో తొలి విడతగా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక దళాల ఏర్పాటుకు సహకరిస్తామని రాజ్నాథ్ చెప్పారు. మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించేలా రివార్డు మొత్తాన్ని పెంచాలని, మావోయిస్టు ఆపరేషన్లలో పాల్గొనే పోలీసుల భత్యాలను కూడా పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నక్సల్ ప్రభావిత జిల్లాలకు భద్రతా నిధులను భారీగా పెంచనున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ అధిపతులు కూడా హాజరయ్యారు. కాగా, మావోయిస్టులు హింసను వీడి చర్చలకు ముందుకొచ్చినపక్షంలో కేంద్రం కూడా సానుకూలంగా ఉంటుందని ఈ భేటీ తర్వాత హోంశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
ఎవరి లెక్కలు వారివి..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలివిడత ప్రాదేశిక పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల్లో ఊహలపల్లకిలో విహరిస్తున్నారు. ప్రస్తుతం ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ అంచనాల్లో బిజీ అయ్యారు. తొలివిడతలో భాగంగా జిల్లాలో 16 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో 16 జెడ్పీటీసీ స్థానాలు, 300 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సార్వత్రిక ఎన్నికల పూర్తయ్యే వరకు చేపట్టొద్దని న్యాయస్థానం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కనీసం నెలరోజుల పాటు ఫలితాల కోసం నిరీక్షణ తప్పదు. ఈనేపథ్యంలో ముందస్తుగా ఫలితాలు ఎలా ఉం టాయనే కోణంలో అభ్యర్థులు అంచనాలకు ఉపక్రమించారు. అనుచరగణంతో కలిసి లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అనుకున్నట్లే జరిగిందా..? ప్రాదేశిక ప్రచారంలో తమ పరిధిలోని అన్ని వర్గాలను కలుపుకొని సాగిన నేతలు.. పోలింగ్ వరకు అదే పంథాను అమలుచేశారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ అనుకున్నట్లే జరిగిందా..లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలి స్తున్నారు. కొందరు ఓటర్లతో పరోక్షంగా ఓటు ఎవరికి వేశావంటూ విషయాన్ని రాబడుతున్నారు. క్రాస్ ఓటింగ్తో ఎవరికి లాభం..? ఆదివారం జరిగిన ప్రాదేశిక పోలింగ్లో చాలావరకు క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో ఓటర్ల మాటల్లోనూ ఇదే తరహాలో సమాధానాలు వస్తున్నాయి. దీంతో అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. ముఖ్యంగా ఇటీవల జిల్లాలో పేరున్న బడానేతలు పార్టీలు మారడం ఓటింగ్పై తీవ్ర ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. దీంతో తమ పరిధిలో ఏ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది.. క్రాస్ ఓటింగ్ ఎవరికి అనుకూలం కాబోతోంది..? అనే కోణంలో అభ్యర్థుల అంచనాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాంగంగా కొందరు అభ్యర్థులు తమ అనుచరగణాన్ని క్షేత్రస్థాయిలోకి పంపి సమాచారాన్ని రాబడుతున్నారు. ఏదైతేనేం ఎన్నికల ఫలితాలు వస్తేగాని అసలు సంగతి బయటపడదు. -
టీడీపీ-బీజేపీ పొత్తుపై మంతనాలు!
-
టీడీపీ-బీజేపీ పొత్తుపై మంతనాలు!
సీఎం రమేష్ను సంప్రదించిన జవదేకర్ ? నేడు మోడీని కలవనున్న పవన్ కల్యాణ్? సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీపీడీ మధ్య సర్దుబాట్లపై చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులుగా నగరంలో మకాం వేసి ఉన్న బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, పొత్తు బాధ్యతలు చూస్తున్న అరుణ్ జైట్లీ దూతగా వచ్చిన ప్రకాశ్ జవదేకర్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, పార్టీ సీనియర్లు నల్లు ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులతో సోమవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. గతంలో పొత్తు ప్రాతిపదికలను వీరి నుంచి తెలుసుకున్న అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోటరీలోని నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ను ఫోన్లో సంప్రదించినట్టు తెలిసింది. ఈ వివరాలను కిషన్రెడ్డికి చెప్పగా... పొత్తును కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. జవదేకర్ అసహనం వ్యక్తంచేస్తూ... ముగిసిన వ్యవహారాన్ని మళ్లీ తిరగదోడవద్దని సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో తెలంగాణలో మెజారిటీ సీట్లన్నా దక్కేటట్లు చూడమని కోరడంతో జవదేకర్ మధ్యాహ్నం మరోసారి సీఎం రమేష్ను సంప్రదించారని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో బీజేపీ చెప్పినట్టు టీడీపీ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చెప్పినట్టు బీజేపీ వినాలన్న సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు బీజేపీ తెలంగాణలో 64 అసెంబ్లీ, 9 లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో 6 లోక్సభ, 25ఎమ్మెల్యేల సీట్లు కోరుతున్నట్టు తెలిసింది. కాగా, తెలంగాణ శాఖ సమ్మతించినా లేకున్నా తాము పొత్తుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ నేతలు జవదేకర్కు స్పష్టం చేశారు. 21 నాటికి పార్టీ ప్రణాళిక ముసాయిదా మూడు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ ఎన్నికల ప్రణాళిక ముసాయిదాకు ఒక రూపం ఇచ్చారు. డాక్టర్ రాజేశ్వరరావు నాయకత్వంలోని ఈ కమిటీ ఈనెల 21న ముసాయిదా ప్రతిని పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డికి అందజేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు సంక్షేమం, అభివృద్ధిపై అనేక హామీలు గుప్పించినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్, మోడీ భేటీ నేడు? జనసేన పార్టీని ప్రారంభించిన సినీనటుడు పవన్కల్యాణ్ మంగళవారం అహ్మదాబాద్ లేదా న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. దక్షిణాదికి చెందిన ఓ సినీ ప్రముఖుడి మధ్యవర్తిత్వంతో ఈ భేటీ జరుగుతున్నట్టు తెలిసింది. వాస్తవానికి పవన్ కల్యాణ్ సోమవారమే కలుస్తారని ప్రచారం జరిగింది. పురందేశ్వరి ఏ సీటూ కోరలేదు: బీజేపీ కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఏ లోక్సభ సీటూ కోరలేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ తెలిపారు. ఆమె స్వచ్ఛందంగానే పార్టీలో చేరారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం సీటును కేటాయించమని ఆమె కోరినట్టు మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. -
చర్చలు జరుగుతున్నాయి
‘దేవయాని ఉదంతం పరిష్కారం’పై భారత్, అమెరికాల ప్రకటన అమెరికాలో భారత సీనియర్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్ట్పై అమెరికా, భారత్ల మధ్య తలెత్తిన వివాదం పరిష్కారం దిశగా కదుల్తోంది. దౌత్యపరమైన, ప్రైవేటు మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని రెండు దేశాలు శనివారం ప్రకటించాయి. ద్వైపాక్షిక సంబంధాలు తమకు అత్యంత విలువైనవని స్పష్టం చేశాయి. వివాద పరిష్కార యత్నాల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెరీ త్వరలో భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్కు ఫోన్ చేయాలనుకుంటున్నారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకి వెల్లడించారు. సమస్య పరిష్కారం కోసం వివిధ స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయని సల్మాన్ ఖుర్షీద్ కూడా తెలిపారు. సామరస్య పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మా దౌత్యవేత్తకు మీ దగ్గర గౌరవమర్యాదలు లభించాలని మేం ఆశించడం అసంబద్ధమవుతుందా?’ అని అమెరికాను ఆయన ప్రశ్నించారు. మరోవైపు, దేవయానిని ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్కు బదిలీ చేయడం వల్ల ఆమెకు లభించిన సంపూర్ణ దౌత్య రక్షణ గతకాలానికి వర్తించదని, ఆ రక్షణ ప్రస్తుత స్థాయి నుంచే అమల్లోకి వస్తుందని అమెరికా స్పష్టం చేసింది. పరిమితమైన దౌత్య రక్షణ లభించే డెప్యూటీ కాన్సుల్ జనరల్ హోదా నుంచి సంపూర్ణ దౌత్య రక్షణ లభించే ఐరాస మిషన్కు బదిలీ కావడం వల్ల ఆమెపై ఉన్న గత కేసులన్నీ మాయమైపోవని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకి వ్యాఖ్యానించారు. ఆమె సీఐఏ ఏజెంట్: దేవయాని తండ్రి ఆరోపణ వివాదానికంతటికీ కారణమైన పనిమనిషి సంగీత రిచర్డ్స్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఏజెంట్ అయ్యుండొచ్చని దేవయాని తండ్రి ఉత్తమ్ ఖొబ్రగడే శనివారం ఆరోపించారు. కుట్రలో భాగంగానే తన కూతురిని బలిపశువును చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దేవయానిపై కేసులను ఉపసంహరించుకుంటేనే తమకు న్యాయం లభిస్తుందన్నారు. -
ఆర్టీసీ చర్చలు అసంపూర్ణం
కార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య నేడు మళ్లీ చర్చలు కార్మికుల డిమాండ్లు సర్కారు అంగీకరిస్తే సమ్మె విరమించే అవకాశం! విలీనం సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తామన్న మంత్రి ఆర్థిక అంశాల పరిశీలనకు అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో జీవోలో ఎక్కడా విలీనం ప్రస్తావనే లేని వైనం కార్మిక సంఘాలను సర్కారు తప్పుదోవ పట్టించిందనే విమర్శలు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం జరి పిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బస్భవన్లో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే ఆర్టీసీ యూనియన్లు సమ్మె విరమించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) ప్రతినిధులతో తొలుత వేర్వేరుగా, తర్వాత రెండు సంఘాలతో ఉమ్మడిగా చర్చలు సాగాయి. ప్రజా రవాణా సమ్మె వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, సమ్మె విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఏకైక డిమాండ్తో ఉద్యోగ, కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో తాము సమ్మె చేస్తున్నామని, విరమణపై తమకు తాముగా నిర్ణయం తీసుకోలేమని సంఘాల నేతలు చెప్పారు. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ విభజన తర్వాత అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ‘విలీనంపై నిర్ణయం తీసుకోవడం నా పరిధిలో లేదు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తాం. ఎన్ఎంయూ, ఈయూ ప్రతినిధులకూ చోటు కల్పిస్తాం’ అని మంత్రి హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల మిగతా డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ ఆర్థిక మంత్రి, సీఎంతో చర్చించి శుక్రవారం మళ్లీ కార్మిక సంఘాలతో మాట్లాడతానని మంత్రి చెప్పారు. చర్చల్లో ఈయూ అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పద్మాకర్, ప్రచార కార్యదర్శి ప్రసాదరెడ్డి, సమైక్యాంధ్ర పోరాట కమిటీ కన్వీనర్ దామోదరరావు, ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్, సమైక్యాంధ్ర స్టీరింగ్ కమిటీ నేతలు ప్రసాదరావు, చంద్రయ్య పాల్గొన్నారు. విలీనం ఊసు లేని జీవో సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వ వర్గాలు ప్రయత్నించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం చేశాయి. వాస్తవానికి ఆర్టీసీకి సంబంధించిన కొన్ని ఆర్థిక అంశాల పరిశీలనకు అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి గురువారం జీవో (నంబర్ 954) జారీ చేశారు. ఆ జీవోలో ఎక్కడా విలీనం అన్న ప్రస్తావనే లేదు. ‘కార్మిక సంఘాలు లేవనెత్తిన కొన్ని ఆర్థిక అంశాల్ని పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీలో రవాణాశాఖ ఉప/సంయుక్త/అదనపు కార్యదర్శి, ఆర్టీసీ ఆర్థిక సలహాదారు, కార్మిక సంఘాల ప్రతినిధి సభ్యులుగా నియమితులయ్యారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(పాలన) కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఆర్టీసీ ఎమ్డీ అవసరమని భావిస్తే మరికొంత మందిని సభ్యులుగా నియమించడానికి అవకాశం ఉంది. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించాలి’ అని మాత్రమే జీవోలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాల్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. విలీనంపై స్పష్టమైన జీవో ఇవ్వాలి విలీనం సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి హామీ ఇచ్చినా.. అందుకు భిన్నంగా అస్పష్టమైన జీవో జారీ కావడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు హామీ ఇచ్చిన మేరకు స్పష్టమైన జీవో ఇవ్వాలని ఈయూ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సంఘాల డిమాండ్లు కొన్ని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. సమ్మె కాలాన్ని ఆన్డ్యూటీగా పరిగణించి మొత్తం జీతం చెల్లించాలి. సమ్మె విరమణ జరిగిన వెంటనే రెగ్యులర్ కార్మికులకు రూ.40 వేలు, కాంట్రాక్టు కార్మికులకు రూ.30 వేల చొప్పున అడ్వాన్స్ చెల్లించాలి. సీమాంధ్రలో కార్మికులకు దసరా అడ్వాన్స్ తక్షణం ఇవ్వాలి. ఆర్టీసీకి మోటారు వాహన పన్ను మినహాయింపు ఇవ్వాలి. డీజిల్ మీద వ్యాట్ విధించకుండా మినహాయించాలి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం తక్షణం రూ.1,000 కోట్ల ఆర్థిక సహాయం చేయాలి. పల్లె వెలుగు బస్సుల నష్టాలను ప్రభుత్వమే భరించాలి. 8% డీఏ మంజూరు చేసి బకాయిల్ని తక్షణం చెల్లిం చాలి. లీవ్ ఎన్క్యాష్మెంట్కు అవకాశమివ్వాలి. డీజిల్ ధర పెరిగినప్పుడు చార్జీలు పెంచుకొనే అధికారం ఆర్టీసీకి ఇవ్వాలి. వేతన పెంపు ప్రక్రియను పూర్తి చేసి, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలి. అప్పటివరకు 40 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలి. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి. -
సిగపట్లు వీడి చర్చలకు సిద్ధం
రాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం మాని చర్చలకు సిద్ధపడ్డారు. ఇది శుభపరిణామం. ఒకరినొకరు తిట్టుకుంటే విద్వేషాలు పెరిగడమేగానీ ఫలితం ఏమీ ఉండదు. ఇప్పటికే గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఉద్యమాల ఫలితంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధి కుంటుపడింది. 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని కాంగ్రెస్ ప్రకటించడంతో తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ చిరకాల వాంఛ నెరవేరుతుందని భావించారు. అప్పటి నుంచి వారు అనేక విధాల ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అదుగో ఇదుగో అంటూ కాంగ్రెస్ పార్టీ నాన్చుతూ వచ్చింది. రెండో ఎస్ఆర్సి - పార్టీల అభిప్రాయాలు - ఏకాభిప్రాయం - చర్చల ప్రక్రియ - తెలంగాణకు కాల నిర్ణయం లేదు - వారం అంటే ఏడు రోజులు కాదు - నెల అంటే 30 రోజులు కాదు - సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది - అది కీలక సమస్య - సంప్రదింపులు - ప్రాంతాల మనోభావాలు - చిన్న రాష్ట్రాల సమస్య తలెత్తే ప్రమాదం ..... అని అనేక సాకులు చెప్పు కుంటూ కాలం వెళ్లబుచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్లో కదలిక వచ్చింది. ఎన్ని ఆందోళనలు జరిగినా పట్టీ పట్టనట్లు వ్యవహరించిన కాంగ్రెస్ ఆదరాబాదరాగా యుపిఏ నేతలను సమావేశ పరిచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం పొందింది. ఆ తరువాత సిడబ్ల్యూసిని సమావేశపరిచింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు - పది జిల్లాలతో ప్రత్యేక తెలంగాణగా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించేశారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ - పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రంలో పరిస్థితి కాస్త మెరుగుపడిందనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ఒక్కసారిగా బాంబు పేల్చింది. వారికి కావలసింది రాష్ట్ర ప్రయోజనం కాదని, సీట్లు, ఓట్లు అన్న విషయం స్పష్టమైపోయింది. నదీజలాలు, ఆస్తులు, అప్పులు, సీమాంధ్రకు రాజధాని .....వంటి కీలక అంశాలకు సంబంధించి స్పష్టతలేకుండా తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ఓ ప్రకటన చేసేశారు. విభజన ప్రకటనతో సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. రాజకీయాలకు అతీతంగా, నాయకులతో సంబంధంలేకుండా ప్రజలే ఉద్యమించారు. కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపిలను, ఎమ్మెల్యేలను నిలదీశారు. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఉద్యోగులు కూడా సమైక్యాంధ్ర కోసం సమ్మె చేయడం ప్రారంభించారు. రోజురోజుకు ప్రజల నుంచి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి ఎక్కువైపోయింది. మరో పక్క ఇంతకాలం ఉద్యమం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పొందే సమయంలో సీమాంధ్రులు ఉద్యమించడం పట్ల తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇరు ప్రాంతాల నేతలు, ఉద్యోగులు, ప్రజలు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన ప్రకటన వల్ల తలెత్తిన సమస్యలపై చర్చించేందుకు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఈ నెల 19న సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి ఇరు ప్రాంతాల నుంచి పదిమంది చొప్పున నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో అన్ని విషయాలను చర్చించి మంచి ఆలోచనలు వస్తే వాటిని అమలు చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. రెండు ప్రాంతాల నేతలు కలిసి కూర్చొని చర్చించుకుందామన్న మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డిలు చేసిన ప్రతిపాదనకు మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంతాలకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.