eyes
-
'ఇది కాస్మెటిక్ సర్జరీనే కానీ కళ్లకు'..ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా..!
మహిళలు కాస్మెటిక్ సర్జరీలతో అందాన్ని రెట్టింపు చేసుకుంటుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారలు, ప్రముఖులే వీటిని చేయించుకుంటుంటారు. ఓ మోస్తారు స్థాయిలో డబ్బున్న వాళ్లు చేయించుకునే సర్జరీలివి. ఇంతవరకు బ్రెస్ట్, పెదాలు, ఫేస్లిఫ్ట్లు, బోటాక్స్ వంటి కాస్మెటిక్ సర్జరీల గురించి విన్నాం. కానీ కంటికి కాస్మెటిక్ సర్జరీలు చేయడం గురించి వినలేదు కదా..!. ఇదేంటి కంటికి ఏం చేస్తారు అనుకోకండి. ఎందుకంటే నీలిరంగు, తేనె కళ్లతో ఉండేవాళ్లని చూస్తుంటాం కదా..! అలా మన కళ్లను నచ్చిన రంగుతో అందంగా మార్చుకునే సర్జరీనే ఇది. అయితే దీనికి ఖర్చు ఎంతవుతుందో తెలుసా..!.యూఎస్కి చెందిన డాక్టర్(US Doctor) బ్రియాన్ బాక్సర్ వాచ్లర్(Dr Brian Boxer Wachler) ఈ వినూత్న కాస్మెటిక్ సర్జరీ(cosmetic surgery)నే చేస్తున్నారు. ఇలా కంటి రంగుని మార్చడాన్ని కెరాటోపిగ్మెంటేషన్ సర్జరీగా పిలుస్తారు. కార్నియాలోకి వర్ణద్రవ్యాన్ని ఇంజెక్ట్ చేసి కంటి రంగుని మార్చే ప్రక్రియ ఇది. దీనికి జస్ట్ 15 నుంచి 20 నిమిషాలుపడుతుంది అంతే..!. ఈ కార్నియాకి ఇచ్చే ఇంజెక్షన్లో ఈ ఐ డ్రాప్స్ తిమ్మిరిని కలుగజేస్తాయి. అందువల్ల నొప్పి కూడా అస్సలు తెలియదు. ఇంత తక్కువ వ్యవధిలో ఎలాంటి నొప్పి లేకుండా చేసే ఈ సర్జరీ ఖరీదు మాత్రం అత్యధికమే. ఒక కంటికి సుమారు రూ. 5 లక్షల దాక అవుతుంది. అంటే రెండు కళ్లకు దగ్గర దగ్గర రూ. 10 లక్షలు పైనే ఖర్చు అవుతుందన్న మాట. ఈ సర్జరీ రిజల్ట్ తక్షణమే కనిపిస్తుంది. చాలామంది ఔత్సాహికులు మాత్రం ఆకుపచ్చ, సతత హరిత, రివేరా నీలం, పారిస్ నీలం వంటి రంగులను ఎంచుకుంటారట. ఎక్కువమంది హనీ గోల్డ్, స్టీల్ గ్రే, ఆలివ్ ఆకుపచ్చలకే ప్రాధాన్యత ఇస్తారట. తన పేషంట్లలలో చాలామంది ఈ సర్జరీ చేయించుకున్న వెంటనే తన కళ్లలోని మార్పుని చూసి ఆశ్చర్యపోవడం, కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగంగా మాట్లాడటం వంటివి చేస్తారని డాక్టన్ బ్రయాన్ చెబుతున్నారు. అయితే తాను మాత్రం ఈ సర్జరీని ట్రై చేయాలని అనుకోవడం లేదని అన్నారు. కేవలం అందం కోసం ఆరాటపడే వాళ్ల కళ్లలో ఆనందం కోసం ఈ సరికొత్త కాస్మెటిక్ సర్జరీ ప్రక్రియని కనుగొన్నట్లు తెలిపారు. ఆధునాతన లేజర్ని ఉపయోగించి ఈ మొత్తం కాస్మెటిక్ సర్జరీని పూర్తి చేస్తానని అన్నారు. ఇది చాలా సురక్షితమైనదని పేర్కొన్నారు. అంతేగాదు తన పేషంట్ల అనుభవాలకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఈ సర్జరీ గురించి వివరించారు. అయితే నెటిజన్లు ఈ అందం పిచ్చి రాబోయే రోజుల్లో ఎలాంటి భయానక కాస్మెటిక్ సర్జరీలు చేయించుకునేందుకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తూ.. చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Brian Boxer Wachler, MD (@drboxerwachler) (చదవండి: ఇద్దరు నారీమణుల సాహసం..భూగోళాన్ని చుట్టొచ్చారు..!) -
ఈ తేనె కళ్ల వెనుక ఇంత కథ ఉందా?
-
మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? ఎలా సరిదిద్దాలి..?
చిన్నపిల్లలు తమ కళ్లను అటు ఇటు తిప్పి చూస్తున్నప్పుడు వాళ్ల రెండు కన్నులు సమానంగా ఉండాలి. అలా కాకుండా వాటిలో ఏదైనా కనుపాప పక్కకు చూస్తున్నట్లుగా ఉండి. కన్నుల మధ్య అలైన్మెంట్ లోపించడాన్ని మెల్ల కన్నుగా చెప్పవచ్చు. కొంతమంది చిన్నారుల్లో ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పిల్లల్లో చూపు కాస్త మసగ్గా ఉండవచ్చు లేదా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు. అందుకే చిన్నారులు తమ మూడో నెల వరకు ఒకేచోట దృష్టి కేంద్రీకరించలేరు. మూడు నెలల వయసప్పటి నుంచి పిల్లలు ఒక వస్తువు (ఆబ్జెక్ట్) మీద దృష్టి పెట్టడం మెుదలుపెడతారు. మూడు నెలల వయసు దాటాక పిల్లల్లో మెల్లకన్ను కనిపిస్తుంటే వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. అంతేతప్ప మెల్ల అదృష్టమనే అపోహతో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజానికి అది దురదృష్టం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా, కారణాలూ, చికిత్స త్వరగా ఎందుకు చేయించాలనే అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? పిల్లల కన్నులు ఒకేలా లేకపోవడం, ఒక పక్కకు చూసినప్పుడు వాళ్లలో కేవలం ఒక కన్నుకు మాత్రమే ఆ పక్కకు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘మెల్ల’ అని అనుకోవచ్చు. పసిపాపలు బలహీనంగా ఉండి, వాళ్లలో ఏదైనా రుగ్మత ఉండటం వల్ల ఈ లక్షణం కనిపించినా దాన్ని మెల్ల అనే అనుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పై లక్షణాలు కనిపిస్తే దాని గురించి అంతగా ఆందోళన అక్కర్లేదు. అయితే మూడు నెలలు దాటాక కూడా అవే లక్షణాలు కనిపిస్తే వెంటనే పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించాలి.కారణాలు... మెల్లకన్ను రావడానికి ఇదీ కారణమని నిర్దిష్టంగా చెప్పడం కష్టం. కొందరిలో పుట్టుకతోనే రావచ్చు. లేదా దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఉండటం వల్ల... అంటే హ్రస్వ దృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం, మజిల్ ఇంబాలెన్సెస్, నరాల సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. అయితే స్పష్టంగా కనిపించడం అన్నది కాస్త పిల్లలు పెద్దయ్యాక జరుగుతుంటుంది. మెదడుకు సంబంధించిన రుగ్మతలు, జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కూడా మెల్ల కన్ను వస్తుంది. త్వరిత నిర్ధారణ చాలా ముఖ్యం చిన్నారుల్లో మెల్ల కన్ను ఉన్నట్లు చూడటంగానీ లేదా అనుమానించడం గాని జరిగినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. వుూడు నెలలు దాటాక లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించి, తగిన చికిత్స అందించక΄ోతే ఆ కండిషన్ శాశ్వతం అయ్యే అవకాశం ఉంది. మెల్లకన్ను ఉన్న పిల్లల్లో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఏమైనా ఉన్నాయా అని నిర్ధారణ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే చక్కదిద్దేందుకు కళ్లద్దాలు (కరెక్టివ్ స్పెక్టకిల్స్) వాడటం తప్పనిసరి. ఆ తర్వాత కూడా డాక్టర్ చెప్పిన విధంగా పిల్లలను కంటి డాక్టర్ ఫాలో అప్లో ఉంచాలి. మెల్లకన్నుకు వీలైనంత త్వరగా చికిత్స చేయించకోకపోతే అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్కు / కాంప్లికేషన్కు దారితీయవచ్చు. అంటే... మెల్ల ఉన్న కంటిలో చూపు క్రవుంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆరేళ్ల లోపు దీన్ని చక్కదిద్దకోకపోతే ఆ దృష్టిలోపం శాశ్వతమయ్యే అవకాశాలూ ఎక్కువే.చికిత్సమెల్ల కన్నుల్లోని అకామడేటివ్, ఈసోట్రోపియా అనే రకాలకు ‘ప్లస్’ కళ్లజోళ్లను డాక్టర్లు సూచిస్తారు. ఒక కన్నులో దృష్టిలోపం ఉండి, ఒక కన్ను నార్మల్గా ఉన్నప్పటికీ... దృష్టిలోపం ఉన్న కన్ను క్రమంగా మెల్లకన్నులా మారుతుంది. రానురానూ ఇది ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా) అనే కండిషన్కు దారితీస్తుంది. దీనికి కూడా కళ్లజోడు వాడటమే సరైన చికిత్స. అప్పుడప్పుడూ కనిపించే మెల్ల కన్ను (ఇంటర్మిటెంట్ స్క్వింట్) అనేది కంటి కండరాల బలహీనత వల్ల వస్తుంది. కంటి వ్యాయామాల ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కొందరు చిన్నారులు పుట్టుకతోనే మెల్లకన్ను కలిగి ఉంటారు. దీనికి న్యూరాలజిస్ట్ సహాయంతో చికిత్స అందించాల్సి వస్తుంది. వీటన్నింటితోనూ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు కంటి వైద్య నిపుణులు శస్త్రచికిత్సను సూచిస్తారు. ఈ శస్త్రచికిత్స చాలా సులువైనదీ, ఫలితాలు కూడా చక్కగా ఉంటాయి. ఇప్పటికీ చాలాచోట్ల మారుమూల పల్లెల్లో మెల్ల కన్ను అదృష్టమనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. చిన్నారులు తమ దృష్టి జ్ఞానం కోల్పోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మెల్లకన్నుకు చికిత్స అందించడం అవసరం.డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: వాసన కోల్పోవడం..ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో..!) -
కంటిపై సోరియాసిస్ ప్రభావం!
ఒళ్లంతా పొడిబారిపోయి చర్మంపైనుండే కణాలు పొట్టులా రాలిపోయే చర్మవ్యాధి సోరియాసిస్ గురించి తెలియనివారుండరు. తమ సొంత వ్యాధినిరోధక వ్యవస్థ తమ సొంత కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్ డిసీజ్) వల్ల ఇలా చర్మంపై పొట్టురాలిపోతూ ఉంటుంది. చర్మవ్యాధిగానే చూసే దీని ప్రతికూల ప్రభావాలు కొంతవరకు కంటిపైనా ఉంటాయి. అదెలాగో చూద్దాం.ఈ జబ్బు ఉన్నవాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యాత్మక కండిషన్లు తలెత్తవచ్చు. అవి... కంటిలోని ఐరిస్, కోరాయిడ్, సీలియరీ బాడీ అనే నల్లపొరలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) రావచ్చు. (ఇలా జరగడాన్ని ‘యువైటిస్’ అంటారు). కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు (కెరటైటిస్). కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ (కంజంక్టివైటిస్) వచ్చే అవకాశాలున్నాయి. కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి సమస్యలూ రావచ్చు.జాగ్రత్తలు / చికిత్స : గతంతో పోలిస్తే ఇప్పుడు సోరియాసిస్కు అత్యంత అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ తరహా ఆధునిక చికిత్సలతో సోరియాసిస్ను వీలైనంతగా అదుపులో పెట్టడం సాధ్యమవుతోంది. పైన పేర్కొన్న కంటికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు సోరియాసిస్కు చికిత్సలు తీసుకుంటూనే... ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించడం చాలా అవసరం. -
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అన్ని డార్క్ సర్కిల్స్ ఒకటి కాదు..
చాలా మంది.. కంటికింద నల్లని వలయాలు కనిపిస్తుంటే ఒత్తిడికి గురవుతున్నామనో నిద్ర సరిగా పోవడం లేదనో అనుకుంటూ ఉంటారు. మార్కెట్లో లభించే క్రీములను రాస్తూ ఉంటారు. కానీ, సరైన పరిష్కారం లభించదు. డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణం అనారోగ్యం అని తెలుసుకుంటే పరిష్కారం కూడా సులువు అవుతుంది.΄ాతికేళ్ల ఏంజెల్ మెడిసిన్ విద్యార్థిని. కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు తన శరీరంలో ఏదో తీవ్రమైన సమస్యకు సంకేతమని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. ఒక ఈవెంట్లో ఏంజెల్ను కలిసిన డెర్మటాలజిస్ట్ ఆమె కళ్లకింద నల్లటి వలయాలను చూసి, అలెర్జీల సమస్యలను సూచిస్తున్నాయనిచెప్పాడు. అందరిలో ఆ విషయం గురించి ఎక్కువ చర్చించలేక ఇంటికి వెళ్లాక డెర్మటాలజిస్ట్కు ఫోన్ చేసింది. డెర్మటాలజిస్ట్ లారెన్ మాట్లాడుతూ – ‘ఈ సమస్యను పెరియార్బిటల్ హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. రక్తనాళాలకు సంబంధించిన సమస్య వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయ’ని వివరించారు. ఇన్నాళ్లూ నిద్రలేమి వల్ల కలిగే సాధారణ సమస్య ఇది అనుకుంది. డాక్టర్ చెప్పిన విధంగా తన కుటుంబంలో జన్యుపరంగా ఉబ్బసం, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకుంది. ‘మీకున్న అలెర్జీ ఏంటో కనుక్కొని, దానికి తగిన మందులు తీసుకుంటే నల్లని వలయాల సమస్య దూరం అవుతుంది’ అని డాక్టర్ చెప్పడంతో తగిన చికిత్స తీసుకోవడం మొదలుపెట్టింది. రోగనిరోధక శక్తి తగ్గుదలకళ్ల కింద వలయాలు మాత్రమే కాదు చర్మం ముడతలు పడటం, ముక్కుకు అడ్డంగా ఉన్న అలెర్జీ మచ్చలు కూడా తగ్గుతుండే రోగనిరోధక శక్తికి సూచికలు అంటున్నారు వైద్యులు. పోషకాహార నిపుణులు, బ్యూటీషియన్స్ కూడా నల్లటి వలయాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని వివరిస్తున్నారు. వాటిలో... ∙జన్యుపరమైనవి, పోషకాహార లో΄ాలు, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అలసట, జీర్ణకోశ సమస్యలు, ఏదీ తినాలని లేకపోవడం.. వంటివన్నీ కంటికింద భాగాన్ని నల్లగా చేస్తాయి. రకరకాల అలెర్జీలు, సైనస్ సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. కారణాన్ని గుర్తించి, వాటికి దూరంగా ఉంటే అవే తగ్గిపోతాయి. క్రీములకన్నా మేలైనవి.. నల్లటి వలయాలు తగ్గడానికి మార్కెట్లో రకరకాల క్రీములు లభిస్తుంటాయి. వీటిని వాడినా మార్పు రాలేదంటే సాధారణ సమస్య కాదని గుర్తించాలి. ∙రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. అందుకు ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత ద్రవాహారాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. →ఫేషియల్ ఎక్సర్సైజ్ల వల్ల చర్మ కణాలు చురుకు అవుతాయి. రక్తప్రసరణ మెరుగై చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. → అలోవెరా, తేనె .. వంటి వాటిని అప్లై చేస్తూ సాధారణ చర్మ సమస్యలను నివారించుకోవడానికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకోవచ్చు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఅనర్థాలను నివారించాలంటే.. తీవ్ర అనారోగ్య సమస్యలను గుర్తించడానికి నల్లని వలయాలను ఒక సూచికగా తీసుకోవాలి. ఆస్తమా, బ్రాంకైటిస్, డస్ట్ అలెర్జీల వల్ల నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. చర్మం ΄÷డిబారినా, బి12, ఐరన్ లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. బరువు పెరగడంతో చర్మం మందం అవడం, బరువు తగ్గినప్పుడు చర్మం పలచబడటం, వయసు పైబడటం వల్ల చర్మంలో వచ్చిన మార్పుల వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కంటి దగ్గర ఉండే భాగాన్ని అలెర్జీ ఉన్నప్పుడు రుద్దుతూ ఉన్నా, మొబైల్, లాప్టాప్.. వంటి స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉపయోగించినా, నైట్ షిఫ్ట్స్ వల్ల, సరైన నిద్ర లేకపోవడం వల్ల నల్లటి వలయాలు ఏర్పడతాయి. 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. డ్రై స్కిన్ ఉందంటే మాయిశ్చరైజర్ వాడాలి. బరువు పెరుగుతున్నారంటే ఫిట్నెస్, పోషకాహారం జాగ్రత్తలు తీసుకోవాలి. అలెర్జీ సమస్యలకు వైద్య చికిత్స తప్పనిసరి. – డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
మధుమేహం ముప్పు : ‘కళ్లు’ చెబుతాయి!
ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెడుతున్నసమస్య డయాబెటిస్ లేదా మధుమేహం. మారుతున్న జీవనశైలి, ఆహారం తదితర కారణాలరీత్యా వయసుతో సంబంధం లేకుండా తొందరగా షుగర్వ్యాధికి గురవుతున్నారు. కేసుల సంఖ్యకూడా వేగంగానే పెరుగు తోంది. మధుమేహం కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ , శాశ్వత నరాల, కంటి, పాదాల సమస్యలకు దారితీస్తుంది. అయితేఏ వ్యాధినైనా ముందుగా గుర్తించడం కీలకం. అలాగే డయాబెటిస్ను వార్నింగ్ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు,సరైన చికిత్స తీసుకుంటే, ప్రభావం తీవ్రతనుంచి బయటపడవచ్చు. అయితే దీన్ని గుర్తించడం ఎలా? ముఖ్యంగా కంటి చూపులో ఎలాంటి మార్పులొస్తాయి? తెలుసుకుందాం!డయాబెటిస్ లేదా ప్రమాదం పొంచి ఉందని మన శరీరం ముందుగానే హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఆకలి ఎక్కువగా ఉండటం, తొందరగా ఆలసిపోవడం లాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా కళ్లలో జరిగే కొన్ని మార్పులు డయాబెటిస్కు ముందస్తు లక్షణమని వైద్యులు చెబుతున్న మాట. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగితే అది కంటి నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో కంటి చూపు మందగిస్తుంది. ఉదయం లేవగానే కళ్లు మసకగా అనిపించడం, దృష్టి మసక బారుతుంది. అంతేకాదు కళ్లలో నొప్పి, అలసట ఒత్తిడిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే షుగర్కు ప్రాథమిక లక్షణంగా భావించి అలర్ట్ అవ్వాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరిగి కంటి నరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించు కోవాలి. చికిత్స చేయించు కోవాలి. లేదంటే డయాబెటిక్ రెటినోపతికి దారికావచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి ప్రారంభ దశదృష్టిలో మచ్చలు లాగా, ఏదో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అస్పష్టమైన దృష్టిదృష్టిలో హెచ్చుతగ్గులు నల్లటి చుక్కల్లాగా, ఖాళీ ప్రదేశం ఉన్నట్టుచూపు కోల్పోవడం లాంటివి కనిపిస్తాయి. దీన్ని ముందుగానే గుర్తించి, సరైన చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి శాశ్వతంగా కంటి చూపును కోల్పోవచ్చు. నోట్: లక్షణాలు కనిపించినా, వ్యాధి నిర్ధారణ అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళన సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది. మా లైఫ్స్టయిల్ తో సంబంధమున్న వ్యాధులు చాలా జీవనశైలి మార్పులు, కొద్దిపాటి వ్యాయామం, ఆహారమార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ఏదైనా నిపుణులైన వైద్యుల సలహాల మేరకు ఈ మార్పులు చేసుకోవాలి. -
‘బ్లీడింగ్ ఐస్’ వ్యాధి అంటే..! సోకితే అంతేనా..!
కొన్ని రకాల వ్యాధులు చాపకింద నీరులా నెమ్మదిగా వస్తాయి. మనం కూడా పెద్ద సమస్య కాదని, లైట్గా తీసుకుంటాం. అది కాస్త మనం చూస్తుండగానే సీరియస్గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి వ్యాధి బారినపడి ఇక్కడొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన స్పెయిన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..స్పెయిన్లో 74 ఏళ్ల వ్యక్తి ప్రాణాంతకమైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) బారిన పడి మరణించాడు. దీనిని "బ్లీడింగ్ ఐస్ వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ వ్యాధి. దీని కారణంగా మరణాల రేటు సుమారు 40% వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఆ వ్యక్తి మాడ్రిడ్కు నైరుతి దిశలో వంద మైళ్ల దూరంలో ఉన్న టోలెడోలో టిక్ కాటుకు గురవ్వడంతో జూలై 19న మోస్టోల్స్ ప్రాంతంలోని రే జువాన్ కార్లోస్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అతడి పరిస్థితిని గుర్తించిన తర్వాత హై-డిపెండెన్సీ ఐసోలేషన్ యూనిట్కు తరలించారు. మొదట్లో పరిస్థితి నిలకడగా ఉన్నా..తర్వాత.. తర్వాత అతడి పరిస్థితి క్షీణించి మరణించడం జరిగింది. దీన్ని క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) సంబంధిత మరణంగా పేర్కొన్నారు. అంతేగాదు వైద్యులు అప్రమత్తమై ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టేలా తదుపరి కేసుల్లో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు ఈ టిక్ బోర్న్ వ్యాధి ఎబోలా మాదిరిగా ఉంటుందని, డబ్ల్యూహెచ్ఓ జాబితా చేసిన తొమ్మిది వ్యాధికారక క్రిములకు సంబంధించినదని, అంటువ్యాధిలాంటిదని వెల్లడించారు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే..క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (CCHF) అనేది టిక్ కాటు ద్వారా మానవులకు వ్యాపించే అరుదైన వైరల్ వ్యాధి. జంతువులను వధించిన వెంటనే, తక్షణమే వైరమిక్ జంతు కణజాలాలతో (వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించిన జంతు కణజాలం) సంపర్కం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా, బాల్కన్లు, మధ్యప్రాచ్యం, ఆసియాలలో ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధిని తొలిసారిగా 1944లోక్రిమియన్ ద్వీపకల్పంలో గుర్తించారు. అందువల్లే దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని వైద్యులు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాధిని 1956లో కాంగో బేసిన్లో గుర్తించడం జరిగింది. దీంతో ఈ వ్యాధికి ఈ రెండు ప్రాంతాల మీదుగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే పేరుని పెట్టారు నిపుణులు.ఈ వ్యాధి లక్షణాలు..తీవ్ర జ్వరంతీవ్రమైన తలనొప్పివెన్ను, కీళ్ల నొప్పులుకడుపు నొప్పి, వాంతులుఎర్రటి కళ్ళు , ఎర్రబడిన ముఖంనోటి పైకప్పు మీద ఎర్రటి మచ్చలుకామెర్లుమానసిక స్థితి, ఇంద్రియ అవగాహనలో మార్పులుఆందోళననిద్రమత్తురక్తస్రావం.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం..ఆస్పత్రిలో చేరిని వారిలో దాదాపు 50% మంది మరణిస్తారని పేర్కొంది. నివారణటిక్ కాటును నివారించడానికి డీఈఈటీ కలిగిన క్రిమి వికర్షకాన్ని ఉపయోగించండి.సీసీహెచ్ఎఫ్ ఉన్న జంతువులను నిర్వహించేటప్పుడు చేతి తొడుగులు, పొడవాటి చేతులు, ప్యాంటు ధరించండి.సోకిన జంతువులు లేదా వ్యక్తుల శరీర ద్రవాలు మీపై ప్రసరించకుండా జాగ్రత్త పడండి. (చదవండి: అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!) -
మూడు కన్నుల ఎద్దు.. వైరల్ వీడియోలో నిజమెంత?
మూడు కన్నులు ఉండే ఎద్దును మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు దానికి మూడు కొమ్ములు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపోతారు. ఇటువంటి విచిత్రమైన ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఎద్దు మెడలో గంట కూడా ఉంది. దీనిని చూసినవారంతా ఈ వీడియో నిజమేనా? అని ప్రశ్నిస్తున్నారు.కొందరు సోషల్ మీడియా యూజర్స్ దీనిని శివుని నందిగా పరిగణిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వీడియోను పరిశీలించిన నిపుణులు.. ఎవరో దీనిని ఎడిట్ చేశారని, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తున్నారు. ఈ ఎద్దుకున్న మూడవ కన్ను మిగిలిన రెండు కళ్ళకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎవరో చాలా తెలివిగా దాని రెండు కళ్ల మధ్యన ఈ మూడో కన్ను ఉండేలా ఎడిట్ చేశారని తెలుస్తోంది. మొదటిసారి ఎద్దును చూడగానే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే పరిశీలనగా చూస్తే మూడో కన్ను రహస్యం బయటపడుతుంది.కాగా ఈ వీడియోను @prem_collection__60 అనే ఖాతాతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 47 లక్షలకు పైగా వీక్షణలు దక్కగా, నాలుగు లక్షల మంది లైక్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక యూజర్ ‘హే! నంది మహారాజ్.. నా తరపున భోలేనాథ్కి జై శ్రీరామ్ అని చెప్పు అని రాయగా, మరొకరు ఈ వీడియో ఫేక్ అని రాశారు. ఇంకో యూజర్ మ్యుటేషన్ కారణంగా ఇలా జరుగుతుందని రాశారు. Oh, there's a cow with three horns and three eyes that always surprises everyone 🥰🥰 pic.twitter.com/ujYoy0wSm9— Nam Police (@boynam_boy) May 8, 2024 -
భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!
అయోధ్యలోని భవ్యరామాలయంలో రామ్లల్లా ప్రతిష్టుతుడైనప్పటి నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ రామ్లల్లాను బాలా రాముడి విగ్రహాన్ని ముగ్ధమనోహారంగా అందర్నీ చూపుతిప్పుకోని రీతీలో ఆకర్షణగా తీర్చిదిద్దారు ప్రముఖ శిల్పి యోగిరాజ్. ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు కృష్ణ శిలను ఎంపిక చేసుకోవడమే గాక రాముడి కళ్లను చక్కగా చిన్నపిల్లాడిలా నవ్వుతున్నట్లు తీర్చిదిద్దడం అందర్నీ భక్తితో తన్మయత్వానికి గురయ్యేలా చేసింది. ప్రతి ఒక్కరూ ..శిల్పి యోగిరాజ్ కళా నైపుణ్యాన్ని వేన్నోళ్ల కొనియాడారు. ఎవరికి దక్కుతుంది ఇంతటి అదృష్టం అంటూ ప్రశంసించారు. తానుచెక్కిన శిల్పమే పూజలందుకోవడం కంటే గొప్ప వరం ఓ శిల్పికి ఏం ఉంటుంది, అలాంటి అదృష్టం ఎవరీ దక్కుతుందంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈమేరకు శిల్పి యోగిరాజ్ తాను రామలల్లా విగ్రహాన్ని, ఆ దివ్య నేత్రాల్ని చెక్కడానికి ఉపయోగించిన సుత్తి, ఉలి వంటి పనిముట్లను నెట్టింట షేర్ చేశారు. వెండి సుత్తితో కూడిన బంగారు ఉలి పోటోలను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. వాటితోనే రాముడి దివ్య నేత్రాలను చెక్కానని చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఆయన తీర్చిదిద్దిన..పద్మాసనంపై ఐదేళ్ల పిల్లవాడిగా ఉన్న బాలరాముడి విగ్రహం గర్భగుడిలో కొలువై పూజలందుకుంటోంది. ఇక శిల్పి యోగిరాజ్ ప్రసిద్ధ శిల్పాల వంశానికి చెందినవాడు. మొదట్లో ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత తన కులవృత్తినే వృత్తిగా మార్చుకుని పూర్వీకుల అడుగుజాడల్లో నడిచి ప్రముఖ శిల్పిగా మారాడు. 2008 నుంచి యోగిరాజ్ విగ్రహాలను రూపొందిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Arun Yogiraj (@arun_yogiraj) (చదవండి: ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్) -
షాకింగ్ ఘటన: అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి!
కళ్లు లేకుండా శిశువు జన్మించడం అంటే మాములుగా కొద్దిమందిలో జరిగేదేగా అనేకోకండి. ఎందుకుంటే కళ్లే ఏర్పడకుండా పుట్టడం వేరు. కళ్లు లేకపోవడం వేరు. అంటే.. చూపు కనిపించని అంధులకైనా కంటి నిర్మాణం ఉంటుంది. కాకపోతే దృష్టి లోపం ఉంటుంది. అసలు కంటి స్థానంలో కణజాలం లేదా ఆప్టికల్ నరాలే లేకుండా పుడితే వారిని కళ్లే ఏర్పడకుండా జన్మించిన శిశువు అంటాం. ఈ పరిస్థితి అరుదైనా జన్యు సమస్య కారణంగా ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నారులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మంది దాక ఉన్నారట. అలాంటి చిన్నారే యూఎస్లోని మిస్సౌరీలో ఓ ప్రవేటు ఆస్పత్రిలో జన్మించాడు. ఆ చిన్నారి పేరు రెన్లీ. ఆ శిశువు పుట్టుకతో అనోఫ్తాల్మియాతో జన్మించాడు. అందువల్ల ఆ చిన్నారికి కంటి కణజాలం లేదా ఆప్టిక్ నరాలు ఉండని ఒక విధమైన జన్యు పరిస్థితి అని చెప్పారు వైద్యులు. ఈ మేరకు సదరు చిన్నారి తల్లి మాట్లాడుతూ..సిజేరియన్ ద్వారా జన్మించిన తన చిన్నారి రోగ నిర్థారణ కోసం తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలోనే వేచి ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యింది. చివరికి వైద్యలు కార్టిసాల్ లేకుండానే జన్మించాడని, అందువల్లే కళ్లు మూసుకుపోయాయని చెప్పారని తెలిపింది. ఇది చాలా అరుదైన పరిస్థితి అని, ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇదే జన్యు మార్పు కొంతమందికి ఒక కన్ను మాత్రమే ప్రభావితమవుతుందని, కానీ చిన్నారి రెన్లీ విషయంలో అందుకు విరుద్ధంగా రెండు కళ్లు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితి అతడి మేథస్సును, శారిరీక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రెన్లీకి భవిష్యత్తులో వచ్చే తన పిల్లలకు కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం 50 శాతం ఉందని తేల్చి చెప్పారు వైద్యులు. ప్రస్తుతం రెన్లీకి కళ్లుని తెప్పించే చికిత్సలు ఏమీ లేనప్పటికీ కంటి సాకెట్ల చుట్టూ ఎముక, మృదు కణజాల పెరుగుదలకు సహాయపడటానికి ప్రొస్టెటిక్ కళ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్ది వారాల్లో రెన్లీకి కృత్రిమ కళ్లు అమర్చడానికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలిపారు వైద్యులు. అనోఫ్తాల్మియాకు కారణం.. ఇది ఎందువల్ల వస్తుందనడానికి కారణాలు తెలియాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది శిశువుల్లో వారి జన్యువులు లేదా క్రోమోజోమ్లలో మార్పు కారణంగా ఈ పరిస్థితిని కలిగి ఉంటారు. అలాగే గర్భధారణ సమయంలో ఐసోట్రిటినోయిన్ వంటి మందులను తీసుకోవడం వల్ల కూడా అనోఫ్తాల్మియా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో ఎక్స్రేలు లేదా ఇతర రకాల రేడియేషన్లకు గురికావడం లేదా మందులు లేదా పురుగులమందుల రసాయానాలు తదితరాలు పిండంలో ఈ లోపం ఏర్పడటానికి కారణమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితికి సంబంధించిన లక్షణాలు.. ⇒ ప్రీ మెచ్చూర్ కంటి శుక్లం: కంటిపై మేఘావృతమైన ఫిల్మ్ కలిగి మబ్బుగా ఉంటుంది. దృష్టి బలహీనమై రంగులను గుర్తించడానికి కష్టమవుతుంది. ⇒ కోలోబోమా కణాజాలం కనిపించకుండా పోతుంది. ఎక్కువగా కనుపాపలో జరుగుతుంది. ⇒ వేరు చేసిన రెటీనా ఇది పూర్తి అంధత్వానికి దారితీసే పరిస్థితి ⇒ ప్టోసిస్ ప్టోసిస్ లేదా సైడోప్టోసిస్, అనేది కండరాలు, నరాలు ఉన్నప్పటికీ పడిపోతున్న కనురెప్పను సూచిస్తుంది. (చదవండి: మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!) -
'కంటిచూపు' ను ఈ జాగ్రత్తలతో కాపాడుకుందాం..!
ఈ రోజుల్లో కొంతమందికి చిన్న వయసులోనే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన గాని, కొన్ని అలవాట్ల వల్ల గాని కంటి చూపు మందగిస్తుంది. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ వచ్చిన వారికి మాత్రమే కాదు, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం. పోషకాల లోపం.. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును పెంచే ఆహార పదార్థాలను విరివిగా తీసుకోండి. విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాల పదార్థాలు, క్యారట్, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోండి. చత్వారం వంటివి ఉన్న పెద్దవారికే కాదు.. పిల్లలకు కూడా నేత్ర పరీక్ష అవసరం.చూపు సమస్యలను ముందే గుర్తించకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడటమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మధుమేహం, హైబీపీ ఉన్న వారికి కంట్లోని రెటీనా పొరలో మార్పులు వస్తుంటాయి, నీటికాసుల వంటి ప్రమాదకర సమస్యలకు కూడా ముందస్తుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి నేత్ర పరీక్ష చేయించుకోవాలి. ఇవి కూడా చదవండి: 'లవంగం టీ' ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!? -
కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు శాశ్వతంగా పోవాలంటే..?
మన ఏజ్ ఎంత? అని చెప్పేసేవి మన కళ్లే. వయసు చిన్నదైనా సరే మన కళ్లు కింద నలుపు ఉండి, ముడతులు వచ్చాయా అంతే పెద్దొళ్లుగా కింద ట్రీట్ చేసేస్తారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దగ్గర నుంచి ఆఫీస్లో పనిచేసే మహిళల వరకు అందర్నీ వేధించే సమస్యే ఇది. ధైర్యం చేసే ఏమైనా రాద్దాం అంటే కళ్లు కదా! ఏదైన సమస్య వస్తుందని భయపడుతుంటా. అలాంటి వాళ్లంతా ఇలా చేస్తే ఆ సమస్యకు సులభంగా చెక్పెట్టొచ్చు. కళ్లకింద ఏర్పడిన నల్లటి వలయాలు, ముడతలు, మచ్చలు అందమైన ముఖారవిందాన్ని పాడుచేస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే... రాత్రి పడుకునేముందు కొద్దిగా అలోవెరా జెల్ను తీసుకుని కళ్ల కింద రాసి మర్దన చేసి పడుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి. విటమిన్ ఇ ఆయిల్ కొల్లాజెన్ బూస్టర్గా పనిచేసి కళ్లకింద రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు తోడ్పడు తుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్ను కళ్లకింద రాసి మర్దన చేయాలి. పై రెండూ అందుబాటులో లేని వారు కనీసం కొబ్బరి నూనెను అయినా కళ్లకింద రాసుకుని మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క చిట్కానైనా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లోనే ముడతలు, మచ్చలు పోయి ముఖారవిందం బాగుంటుంది. (చదవండి: చలికాలంలో జుట్టు పొడిబారి డల్గా ఉంటుందా? ఈ టిప్స్తో సమస్యకు చెక్పెట్టండి!) -
అందమైన కనుబొమ్మలకు కలోంజీ!
నల్ల జీలకర్ర (కలోంజీ) విత్తనాలను పొడిచేయాలి. ఈ పొడిలో ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్ను వేసి చక్కగా కలపాలి. ఇప్పుడు తడి కాటన్ వస్త్రంతో కనుబొమ్మలను శుభ్రంగా తుడిచి.. నల్ల జీలకర్ర మిశ్రమాన్ని ప్యాక్లా వేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. కనుబొమ్మలను తడిలేకుండా తుడిచి కొద్దిగా ఆలివ్ ఆయిల్ను కనుబొమ్మలపైన రాసి ఐదునిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ ప్యాక్ను వారానికి మూడుసార్లు వేయడం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగి కనుబొమల మీద వెంట్రుకలు పెరుగుతాయి. నల్లజీలకర్ర ప్యాక్ పలుచటి కనుబొమలను ఒత్తుగా మారుస్తుంది. కనుబొమలు తీరైన ఆకృతిలో చక్కగా మెరుస్తాయి. కలోంజిలోని ΄ోషకాలు కనుబొమల వెంట్రుకలు రాలకుండా చేస్తాయి. కనుబొమలు తెల్లబడడం మొదలైన వారు సైతం ఈ ΄్యాక్ను వాడితే వెంట్రుకలు నల్లగా మారతాయి. (చదవండి: తవ్వకాల్లో బయటపడిన రెండు వేల ఏళ్ల నాటి బ్యూటీ పార్లర్!) -
గాలిలో స్పృహ కోల్పోయి, గుడ్లు తేలేసి, తల వాల్చేసి.. నవ్విస్తున్న పారాగ్లైడర్
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు. ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05 — Enezator (@Enezator) September 13, 2023 -
పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు!
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఏలియన్ లాంటి పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది. చర్మంపై పలు చోట్లు పగుళ్లు కనిపిస్తున్నాయి. కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వింత శిశు జననం స్థానికంగా సంచలనం కలిగించింది. కాగా ఇటువంటి శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని వైద్యులు తెలిపారు. కాగా ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వింతవింత శబ్ధాలు చేస్తున్నాడు. సాధారణంగా ఇటువంటి శిశువులు జన్మించిన వెంటనే చనిపోతారని వైద్యులు తెలిపారు. అయితే ఈ శిశువు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బేహడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజుల క్రితం పురిటి నొప్పులతో ఒక ఆసుపత్రిలో చేరింది. ఆగస్టు 30న ఆమెకు నార్మల్ డెలివరీ జరిగింది. అప్పుడే జన్మించిన శిశువును చూడగానే తల్లి హడలెత్తిపోయింది. పిల్లాడు ఏలియన్ మాదిరిగా ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా డాక్టర్ వినోద్ పాగ్రానీ మాట్లాడుతూ ఇలా జన్మించే శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని, ఈ స్థితిలో జన్మించే శిశువుల చర్మంలో తైలగ్రంథులు ఉండవని, ఫలితంగా చర్మం పగిలిపోతుందన్నారు. మూడు లక్షల శిశు జననాలలో ఒకటి ఈ విధంగా ఉండవచ్చన్నారు. ఇటువంటి శిశువు ఎక్కువకాలం జీవించదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి శిశువులు ఐదారురోజుల వరకూ జీవిస్తారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. నలుగురు దుర్మరణం! -
ఇంటి చిట్కాలతో బ్లాక్ సర్కిల్స్కు చెక్ పెట్టండి
సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆయా భాగాలు కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మందికి ఎన్ని జాగ్రత్తలు పాటించినా నల్లటి వలయాలు బాధిస్తుంటాయి. ఈ సమస్యకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అదెలా చూసేద్దాం. ►టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ►రోజ్వాటర్లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేయాలి. ►అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్లకింద ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. ► ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్లపై రుద్దవచ్చు. లేదా వాటి రసం తీసి ఆయా భాగాలపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు తప్పక ఫలితం కనిపిస్తుంది. ► ఒక టీస్పూన్ బొప్పాయిరసం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం పోతుంది. -
భారీ లాభాలపై అదానీ గురి..
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ భారీ లాభాలపై గురి పెట్టింది. రానున్న రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల నిర్వహణ లాభాల(ఇబిటా)ను అందుకోవాలని ఆశిస్తోంది. ఇందుకు విమానాశ్రయాలుసహా.. సిమెంట్, పునరుత్పాదక ఇంధనం తదితర పలు బిజినెస్లను పటిష్ట వృద్ధి బాటలో నిలపాలని ప్రణాళికలు వేస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. గ్రూప్ నిర్వహణలోగల పోర్టులు, రవాణా, లాజిస్టిక్స్, విద్యుత్ ప్రసారం, సోలార్ ప్యానెళ్లు తదితర విభాగాలను పరుగు తీయించే యోచనలో ఉంది. ఈ బాటలో గ్రూప్ చేపడుతున్న మౌలిక సదుపాయాల కొత్త పెట్టుబడులు రానున్న కాలంలో నగదును సృష్టించగలదని అంచనా వేస్తోంది. యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈ నెల మొదట్లో 2.65 బిలియన్ డాలర్ల విలువైన రుణాలను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. తద్వారా ఇన్వెస్టర్లలో గ్రూప్పట్ల నమ్మకం మరింత బలపడేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 20 శాతం వృద్ధి బాటలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇబిటాలో 20 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. దీంతో రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల ఇబిటాకు చేరుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)కి గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీల ఇబిటా ఉమ్మడిగా 36 శాతం జంప్చేసి రూ. 57,219 కోట్లను తాకింది. గ్రూప్లో 83 శాతం వాటా కలిగిన మౌలిక సదుపాయాల కీలక బిజినెస్లు వార్షికంగా 23 శాతం పురోగతిని సాధించాయి. ఇంధనం, రవాణా, లాజిస్టిక్స్తోపాటు అదానీ ఎంటర్ప్రైజెస్కుగల ఇన్ఫ్రా వెంచర్లతో కూడిన విభాగాలు ఉమ్మడిగా రూ. 47,386 కోట్ల ఇబిటాను అందుకున్నాయి. -
మెల్లను నయంచేసే హెడ్సెట్.. కళ్లద్దాలు, ఆపరేషన్లు అవసరం లేదు!
కంటి సమస్యల్లో మెల్ల చిన్నప్పుడే ఏర్పడి, జీవితాంతం వేధిస్తుంది. లావాటి కళ్లద్దాలతో మెల్ల వల్ల ఏర్పడే దృష్టిలోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. శస్త్రచికిత్సతో మెల్లకన్నును పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. అయితే, ఇవి కొంత ఇబ్బందికరమైన ప్రక్రియలు. మెల్లను నయం చేయడానికి ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన త్రీడీ విజువల్ డిజైనర్ హేచాన్ ర్యు ఒక ప్రత్యేకమైన హెడ్సెట్ని రూపొందించారు. ‘సింప్లిసిటీ విత్ ప్రొఫెషనలిజం’ (ఎస్డబ్ల్యూపీ) పేరుతో రూపొందించిన ఈ హెడ్సెట్ని కళ్లను కప్పి ఉంచేలా తయారు చేశారు. ఇందులోని లెన్స్ దీనిని ధరించిన వారి లోపానికి అనుగుణంగా సర్దుకుని, సౌకర్యవంతంగా చూసేందుకు వీలు కల్పిస్తాయి. ఈ హెడ్సెట్లోని మోటరైజ్డ్ ప్రిజమ్ లోపల తిరుగుతూ కళ్లకు తగిన వ్యాయామం కల్పిస్తుంది. ఇది క్రమంగా మెల్లకంటిని సరైన కోణంలోకి తీసుకొస్తుంది. లోపం పూర్తిగా నయమయ్యేంత వరకు దీనిని కొన్ని వారాల నుంచి నెలల పాటు వాడాల్సి ఉంటుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
చిన్నారి కంటి నుంచి వస్తోన్న ప్లాస్టిక్, పేపర్ ముక్కలు, బియ్యం గింజలు
-
పాప కళ్లలోంచి బియ్యం గింజలు, గోర్లు.. వైద్యులు ఏం చెప్పారంటే..?
ఖమ్మం: సహజంగా ఎవరి కంటి నుంచైనా నీరు కారడం, పూసులు రావడం సహజమే. కానీ ఓ చిన్నారి కంటి నుంచి బియ్యం గింజలు, ప్లాస్టిక్ ముక్కలు, గోర్లు ఇలాంటివి వస్తున్నా యి. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా.. పాప కంట్లో వ్యర్థాలను పెట్టుకోవడంతో అవి కాసేపటికి బయటకు వస్తున్నాయని తేల్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలుకు చెందిన భూక్యా దస్రూ, దివ్య దంపతుల కుమార్తె ఆరేళ్ల సౌజన్యకు మూడు నెలల క్రితం కంట్లో నుంచి పత్తి గింజ పడగా.. తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా మళ్లీ కంట్లో నుంచి పేపర్, ప్లాస్టిక్ ముక్కలు, బియ్యం గింజలు పడడంతో ఆందోళనకు గురైన వారు శనివారం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో వైద్యులు పరీక్షించి పాప గోళ్లు కొరికి ఆ ముక్కలను కంట్లో పెట్టుకుంటుండడంతో పాటు ఇతర వ్యర్థాలను కంట్లో పెట్టుకోగా, ఆతర్వాత బయటకు వస్తున్నాయని తెలిపారు. పాపను రెండు గంటల గాటు పరిశీలనలో ఉంచగా, ఆమె గోర్లు కొరికి కంట్లో పెట్టుకున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తేల్చారు. కౌన్సెలింగ్ ద్వారా ఈ అలవాటును మాన్పించవచ్చని వైద్యులు చెప్పినా.. తల్లిదండ్రులు మాత్రం వాటంతట అవే కంట్లోంచి వస్తున్నాయంటూ వాపోయారు. దీంతో రెండు రోజులు సౌజన్యను ఆస్పత్రిలోనే పరిశీలనకు ఉంచి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చాక డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి ఆర్ఎంఓ సంతోష్రెడ్డి, సూపరింటెండెంట్ రామస్వామి తెలిపారు. చదవండి: షాకింగ్.. గుండెపోటుతో పదమూడేళ్ల బాలిక మృతి -
కంట్లో నుంచి ప్లాస్టిక్ కవర్లు..
-
వాలు కనుల కోసం ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్.. ఎలా పనిచేస్తుందంటే!
కళైన ముఖానికి.. వాలు కనులు తెచ్చిపెట్టే అందమే వేరు. అందుకే కొంతమంది అమ్మాయిలు.. తమ కనురెప్పలకు మస్కారా అప్లై చేస్తూ.. ఐలాష్ స్టిక్కర్స్ అతికించుకుంటూ తమ కన్నుల సోయగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి బ్యూటీ లవర్స్ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్! ఇందులో చాలా మోడల్స్.. చాలా ఆప్షన్స్తో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. 1. ఈ మోడల్ టూల్.. త్రీ టెంపరేచర్ మోడ్స్తో పనిచేస్తుంది. మొదటి మోడ్ షార్ట్ ఐలాషెస్కి బ్లూ లైట్తో లో – టెంపరేచర్ని, రెండవ మోడ్.. స్టాండర్డ్ ఐలాషెస్కి ఎల్లో కలర్తో మీడియం టెంపరేచర్ని అందించగా.. మూడవ మోడ్ హార్డ్ ఐలాషెస్కి రెడ్ కలర్తో హై టెంపరేచర్ని అందిస్తుంది. 10 సెకండ్స్లో ఫాస్ట్ హీటింగ్, 40 సెకండ్స్లో రాపిడ్ కర్లింగ్ సెట్ చేస్తుంది. పైగా ఈ ట్రీట్మెంట్ తీసుకున్న 24 గంటల పాటు కనురెప్పలు అలానే బ్యూటీపుల్ లుక్తో ఉంటాయి. ఈ టూల్కి ఉండే మినీ హీటర్.. డబుల్ లేయర్ కోంబ్తో సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి ఒక్కసారి చార్జింగ్ పెడితే చాలా కాలం నడుస్తుంది. 2. ఈ టూల్ కూడా మల్టీ ఫంక్షనల్ డివైజే. ఒకే ఒక్క నిమిషంలో త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్తో పనిచేస్తుంది. దీనికి సుమారు 2 గంటలు చార్జింగ్ పెడితే... కొన్ని రోజుల పాటు చక్కగా పనిచేస్తుంది. ఈ టూల్ అచ్చం హెయిర్ కర్లర్లా.. మినీ హీటర్ విచ్చుకుని.. రెండు భాగాలుగా విడిపోయి.. కనురెప్పలను అందంగా మెలి తిప్పుతుంది. అందుకు ఈ టూల్ ముందున్న చిన్న బటన్ యూజ్ అవుతుంది. 3.ఈ టూల్.. పైవాటిలానే పని చేస్తుంది. అయితే ఆప్షన్స్, టెంపరేచర్ వంటివి డివైజ్కి ఉన్న డిస్ప్లేలో స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో వినియోగదారులకు మరింత ఈజీగా ఉంటుంది. భలే ఉన్నాయి కదూ? వీటిని ఒక పెన్ మాదిరి సులభంగా హ్యాండ్ బ్యాగ్లోనో లేదా మేకప్ కిట్లోనో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మరింకెందుకు ఆలస్యం? క్వాలిటీపై వినియోగదారుల రివ్యూస్ని గమనించి.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయండి. -
వేసవి గాలుల తీవ్రరూపం.. కళ్లు పొడి బారుతున్నాయ్ జాగ్రత్త!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వేసవి గాలులు తీవ్రరూపం దాల్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అలాంటి వారికి వేడి గాలుల ప్రభావంతో కళ్లు పొడిబారిపోతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో టియర్ పొర (కన్నీటి గ్రంధి) దెబ్బతిని కంటికి తేమ అందక డ్రై అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. దీంతో పిల్లలు ఇంట్లోనే స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. పిల్లల్లో అత్యధికులు రోజులో 3నుంచి 5గంటల పాటు స్మార్ట్ఫోన్లు చూస్తున్నారు. అలాంటి వారిలో కంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా నిమిషానికి 8 సార్లు కంటి రెప్పల్ని ఆర్పుతుంటాం. అలా చేయడం వల్ల కార్నియాకు అవసరమైన నీరుచేరి కళ్లు డ్రై కాకుండా చేస్తాయి. స్మార్ట్ఫోన్ చూసే సమయంలో కనురెప్పలు నిమిషానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఆర్పుతుంటారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కళ్లు డ్రై అవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం కంటి దురదలు, కళ్ల మంటలు రావడం, కొందరికి తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నట్టు చెబుతున్నారు. వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలుంటాయంటున్నారు. చికిత్స పొందకుంటే నల్లగుడ్డుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స పొందాలి కళ్లు డ్రై అయిన వారిలో దురదలు, కళ్లు మంటలు, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే క్రమేణా నల్లగుడ్డుపై ప్రభావం చూపవచ్చు. ప్రతిరోజూ ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం వలన సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ మందులు దీర్ఘకాలం వాడినా ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. సమస్య రాకుండా ఉండాలంటే కంటికి దూరంగా.. బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని స్మార్ట్ఫోన్, కంప్యూటర్లను వినియోగించాలి. – సి.త్రివేణి, నేత్ర వైద్య నిపుణురాలు, విజయవాడ ఏం చేయాలంటే.. ► వేసవిలో ప్రయాణాలు చేసేవారు విధిగా కళ్లజోడు వినియోగించాలి. ► తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవడం మంచిది. ► స్మార్ట్ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని ఉపయోగించాలి. ► కళ్లకు ఫోన్ను 15 సెం.మీ. దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టకూడదు. ► 20 నిమిషాలపాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్లపాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడం ద్వారా కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై కాకుండా చేస్తుంది. ► ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్ఫోన్ వినియోగించకూడదు. ► కంప్యూటర్పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాస్ వాడితే మేలు. ► రోజులో ఎక్కువసేపు స్మార్ట్ఫోన్, కంప్యూటర్పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం ద్వారా దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చు. -
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలకు చెక్! ధర ఎంతంటే
Manual Eye And Face Massager: ముఖంలో కళ్లు ఎంత ప్రత్యేకమో అంతే సున్నితం. కళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సురక్షితమైన జాగ్రత్తలు తప్పనిసరి. పైగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలను దూరం చేయాలంటే.. ఇక్కడ కనిపిస్తున్న మసాజర్ని వెంట ఉంచుకోవాల్సిందే. ఈ మాన్యువల్ ఐ అండ్ ఫేస్ మసాజర్.. కళ్లకు సంబంధించి పర్ఫెక్ట్ బ్యూటీ టూల్ అని చెప్పుకోవచ్చు. ముఖానికి కూడా చక్కటి మసాజ్ని అందిస్తుంది. ఇది ఐ బ్యాగ్స్ని దూరం చేయడంతో పాటు డార్క్ సర్కిల్స్ని తొలగించి కళ్లను, ముఖాన్ని అందంగా మారుస్తుంది. ముఖ కండరాలకు రిలాక్స్ మసాజర్లోని బాల్ 360 డిగ్రీలు తిరుగుతూ సరికొత్త యవ్వనాన్ని అందిస్తుంది. కంటి చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖ కండరాలను రిలాక్స్ చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నుదుటి మీద ఏర్పడే ముడతలను దూరం చేయడంతో పాటు.. పెదవులు, బుగ్గల మధ్య ఏర్పడే సన్నటి గీతలను పోగొడుతుంది. దీని ఎర్గోనామిక్ నాన్ – స్లిప్ హ్యాండిల్.. కాంపాక్ట్ డిజైన్తో, స్కిన్ ఫ్రెండ్లీ టచ్తో.. ఏ వేళలోనైనా ఎక్కడైనా వినియోగించడానికి.. చాలా సులభంగా ఉంటుంది. ఈ టూల్ ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగేంత చిన్నది. తేలికైనది కూడా. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్లో లేదా కాస్మెటిక్ బ్యాగ్లో చక్కగా సరిపోతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ధర 199 డాలర్లు. అంటే 16,251 రూపాయలు. దీన్ని ప్రియమైన వారికి బహుమతిగానూ ఇవ్వచ్చు! చదవండి: Anasuya Bharadwaj: ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం కదా.. ఇదీ అంతే: అనసూయ తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
మానవ నిర్మిత రెటీనా త్వరలోనే సాధ్యం కానుందా?! మృతకణాల స్థానంలో..
కంటి చూపుకు రెటీనా తెర ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో తెలిసిందే. వయసు పెరగడంతో వచ్చే కొన్ని కంటి సమస్యలతో రెటీనా దెబ్బతిని చాలామంది కనుచూపు కోల్పోవడం పరిపాటి. అయితే చాలా తొందర్లోనే మానవులకు ‘ల్యాబ్’లో నిర్మించిన రెటీనా సాకారం కానుందా? దాన్ని మనుషుల్లో ప్రయోగించి చూశాక... అది విజయవంతమైతే... త్వరలోనే చూపు లేని ఎంతో మందికి చూడటం సాధ్యపడనుందా? అవుననే అంటున్నారు యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్–మేడిసన్కు చెందిన పరిశోధకులు. ఆ వివరాలేమిటో చూద్దాం. కాంతి వల్ల కంటి వెనక ఉండే పలుచని పొర అయిన ‘రెటీనా’ వల్లనే దృష్టిజ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే. ప్రమాదాల్లో రెటీనా ఊడిపోవడం, వయసు పెరుగుతున్న కొద్దీ కంటి జబ్బుల కారణంగా రెటీనా బలహీనపడి చూపు మందగించడం... ఇలాంటి కారణాలతో చాలా మంది అంధత్వానికి లోనవుతున్నారు. వీళ్లందరికీ దృష్టిజ్ఞానం ఇవ్వడం కోసం చాలా పరిశోధనలే చోటు చేసుకుంటున్నాయి. అందునా పరిశోధనశాల (ల్యాబ్)లో రెటీనాను రూపొందించడానికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొందరు శాస్త్రవేత్తలు ‘ఆర్గనాయిడ్స్’ అనే తరహా కణాలను 2014లోనే రూపొందించారు. ఇవి అచ్చం రెటీనా పనే చేస్తాయి. అంటే తమపై ‘3–డి’ ఇమేజ్ను ప్రతిబింబించేలా చేయగల కణాల సమూహాలివి. మనిషి చర్మం నుంచి ‘మూలకణాల్లాంటి (స్టెమ్సెల్స్లాంటి) వాటిని సేకరించడంతో ఈ ప్రయత్నం సాకారమైంది. అటు తర్వాత మరో అడుగు ముందుకేసి రకరకాల రెటీనాలను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతకణాల స్థానంలో పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందాలే.. ల్యాబ్లో రూపొందించిన రెటీనా కణాలు వివిధ వేవ్లెంత్ గల కాంతి కిరణాలకు స్పందిస్తున్నాయనీ, అవి పొరుగున ఉన్న ఇతర కణాలతోనూ అనుసంధానమవుతున్నాయంటూ గతేడాది (2022)లో నిరూపించగలిగారు. ‘‘మేము ఆర్గనాయిడ్స్ నుంచి కొన్ని కణాలను సేకరించి, వాటిని రకరకాల జబ్బుల కారణంగా దెబ్బతిన్న రెటీనాలోని మృతకణాల స్థానంలో అమర్చాడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఇదే మాముందున్న సవాలు’’ అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఆఫ్తాల్మాలజిస్టు డాక్టర్ డేవిడ్ గామ్. తమ ముందున్న ప్రతిబింబాన్ని తీసుకున్న ఆ కణాలు యాగ్జాన్స్ అనే పురికొసలాంటి కణాల ద్వారా... వెనక ఉన్న ‘సైనాప్స్’ అనే ఓ సిగ్నల్ బాక్స్ లాంటి దాన్నుంచి వెలువడాలి. ఆ సమాచారాన్ని ఎట్టకేలకు మెదడుకు చేరవేయాలి. కణాల్లోంచి వేరు చేసి అమర్చాక కూడా అవి రెటీనా నుంచి బయల్దేరి యాగ్జాన్స్ ద్వారా మెదడు కేంద్రం వరకు చక్కగా అనుసంధానితమవుతూనే (రి–కనెక్ట్ అవుతూనే) ఉండాలి. ఈ మధ్యలో ఎక్కడా సిగ్నల్స్ను కోల్పోకూడదు. అప్పుడే ‘చూడటం’ అనే ప్రక్రియ (విజన్ ప్రాసెస్) పూర్తవుతుంది. ‘రేబీస్ వైరస్’ను అంటించి శాస్త్రవేత్తలు ఇక్కడో విచిత్రాన్ని చేసి చూశారు. ఎక్కడా సిగ్నల్స్ కోల్పోని విధంగా అంతటా అనుసంధానం చక్కగా జరుగుతోందా, లేదా అనే విషయాన్ని పరిశీలించడం కోసం ఈ రెటీనా కణాలకు కావాలనే ‘రేబీస్ వైరస్’ను అంటించారు. ఇది న్యూరోవైరస్ కావడం వల్ల దీన్ని ఎంచుకుని, వారం రోజుల వ్యవధిలో ఈ వైరస్ చివరి కణం వరకూ చేరిందంటే అన్ని కణాలూ చక్కగా అంటుకుని, అనుసంధానితమై ఉన్నాయని అర్థం. ‘‘ల్యాబ్లో కొనసాగిన ఈ ఫలితాలన్నీ పరిశోధనశాల వరకైతే చక్కగానే ఉన్నాయి. ఇక చివరి టాస్క్ ఏదైనా ఉందంటే... అది మానవులపై పరిశోధనలు (హ్యూమన్ ట్రయల్స్) సాగించడమే. ఈ కణాల అమరిక బాగా జరిగి అవి రెటినాలోని కణాలుగా మనగలుగుతూ, రెటినల్ గ్యాంగ్లియాన్ సైనాప్సెస్ అమరికతో మనకు దృష్టిజ్ఞానాన్నిచ్చే ‘ఆప్టిక్ నర్వ్’తో చక్కగా అనుసంధానమైతే చాలు! అదే జరిగితే రెటినైటిస్ పిగ్మెంటోజా, ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్, గ్లకోమా వంటి అనేక జబ్బుల కారణంగా చూపుకోల్పోయిన / చూపు మందగించిన వారికి చూపును ఇవ్వగలిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అంటూ ఎంతోమందిలో ఓ ఆశాభావాన్ని రేకెత్తేంచే చల్లటి కబురు చెబుతున్నారు ఆఫ్తాల్మాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ గామ్. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘పీఎన్ఏఎస్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరంటే..? షాకింగ్ విషయాలు Health Tips: రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగడం, గుప్పెడు శనగలు నానబెట్టి తింటే -
Beauty: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం
Eye Care- Beauty Tips In Telugu: కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాలను కళ్లు వ్యక్తపరుస్తాయి. అలాంటి కళ్లకు సంబంధించిన సంరక్షణ తీసుకుంటే కలువల్లాంటి కళ్లు మీసొంతం అవుతాయి ఇలా... ఒత్తైన కనుబొమ్మలు ►పడుకోబోయే ముందు రోజ్ వాటర్లో కాటన్ని ముంచి, కళ్ల చుట్టూ శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి పోయి కళ్లు తేజోవంతమవుతాయి. ►రాత్రి కనుబొమలకు, కను రెప్పలకు ఆముదం పట్టించి, తెల్లవారి కడిగేస్తే కనుబొమలు, రెప్పలు ఒత్తుగా అవుతాయి. ముడతలు మాయం ►కళ్ల చుట్టూ తేనెతో మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కళ్లచుట్టూ ఉన్న ముడతలు మటుమాయం అవుతాయి. నల్లని వలయాలు తగ్గుముఖం ►పచ్చిపాలలో కాటన్ ముంచి, కళ్లచుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి. ►కీరా జ్యూస్లో, రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ►టొమాటో జ్యూస్లో నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి అర గంట తరువాత కడిగెయ్యాలి. ►కొబ్బరినూనెతో కళ్ల చుట్టూ సుతిమెత్తగా మర్దనా చేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే కళ్లకి అలసటతగ్గడమే కాకుండా నల్లటి వలయాలు కూడా నయం అవుతాయి. చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్లో ఈ సమస్యలు.. -
కళ్లు నులుముకోకండి... కష్టాలు తెచ్చుకోకండి! ఘోస్ట్ ఇమేజ్ కనిపిస్తే..!
కళ్లలో కనుపాపగా పిలిచే నల్లగుడ్డు గోళాకారంలో ఉంటుంది. దానిపైన ఓ పారదర్శకపు పొర కారు అద్దంలా (విండ్షీల్డ్) ఉంటుంది. ఆ పొర క్రమంగా త్రిభుజాకారపు పట్టకంలా లేదా ఓ పిరమిడ్ ఆకృతి పొందవచ్చు... లేదా పైకి ఉబికినట్లుగా కావచ్చు. కనుపాప ఇలా ‘కోనికల్’గా మారడాన్ని ‘కెరటోకోనస్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. ఇది బాలబాలికల్లో పదేళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో కనిపిస్తుంది. కొందరిలో ముఫ్ఫై ఏళ్ల తర్వాత కూడా కనిపించవచ్చు. ఎందుకిలా జరుగుతుందంటే? కంట్లో ఉండే నల్లగుడ్డు/కంటిపాపపై పొర... ప్రోటీన్లతో నిర్మితమై, సూక్ష్మమైన ఫైబర్ల సహాయంతో నల్లగుడ్డుపై అంటుకుని ఉంటుంది. ఇందుకు తోడ్పడే కణజాలాన్ని ‘కొల్లాజెన్’ అంటారు. ఈ కొల్లాజెన్ బలహీనపడి, కంటిపాపపై పొరను సరిగా అంటుకునేలా చేయనప్పుడు దాని ఆకృతి ‘కోన్’ లా మారుతుంది. మరీ బలహీనపడ్డప్పుడు ఈ పొర అతిగా పలుచబడి, నెర్రెలు బారవచ్చు కూడా. నార్మల్గా 500 మైక్రాన్లుండే ఈ పొర 150 నుంచి 100 మైక్రాన్లంత పలచబడుతుంది. దాంతో కొద్దిగా నులుముకున్నా అది నెర్రెలుబారుతుంది. విస్తృతి : భారత్లో దీని విస్తృతి చాలా ఎక్కువ. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దీని విస్తృతి 0.13% మాత్రమే. ఉదా: యూఎస్లో ఈ కేసులు 0.54% ఉండగా... మనదేశంలో 2.3 శాతం. ఇరాన్లో 2.5% ఉండగా సౌదీ అరేబియాలో 4.79 శాతం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో దీని విస్తృతి ఇంకా ఎక్కువ. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో కేసులు 5 నుంచి 8 రెట్లు ఎక్కువ. లక్షణాలు : ►రెండు కళ్లనూ ప్రభావితం చేస్తుంది. మసగ్గా కనిపించడం ప్రధాన లక్షణం. మసకబారడం రెండు కళ్లలోనూ సమానంగా జరగకపోవచ్చు. ఒక కన్నులోనే ఈ సమస్య రావడం చాలా అరుదు. ►దృశ్యాలు స్పష్టంగా ఉండవు. దీన్ని డిస్టార్టెడ్ విజన్ అంటారు. ఉదా: సరళరేఖలు ఒంగినట్లు కనిపించవచ్చు. ►ఒకే వస్తువు రెండుగా కనిపించవచ్చు. వస్తువు చుట్టూ నీడలా మరో ఇమేజ్ కనిపించవచ్చు. దాన్ని ‘ఘోస్ట్ ఇమేజ్’ అంటారు. ►వెలుతురుని కళ్లు భరించలేకపోవచ్చు ∙అరుదుగా కళ్లు ఎర్రబారడం, వాపురావడం జరగవచ్చు. ►ఈ కేసుల్లో మయోపియా (దగ్గరవి మాత్రమే కనిపించి, దూరం వస్తువులు అస్పష్టంగా ఉండటం) సాధారణం ►ఆస్టిగ్మాటిజం కూడా రావచ్చు. అంటే గ్రాఫ్లోని అడ్డుగీతలూ, నిలువుగీతలూ ఒకేసారి కనిపించకపోవచ్చు. ఏవో ఒకవైపు గీతలే కనిపిస్తాయి. గుర్తించడం (డయాగ్నోజ్) ఎలా? ►కొంతమేర కంటికే కనిపిస్తుంది. నిర్ధారణకు డాక్టర్లు కొన్ని కంటి పరీక్షలు చేస్తారు. కార్నియా షేపు మారడాన్ని తెలుసుకునేందుకు ‘కార్నియల్ టొపాగ్రఫీ’, ‘కార్నియల్ టోమోగ్రాఫీ’ (పెంటాక్యామ్) అనే కంప్యూటర్ పరీక్షలతో నిర్ధారణ చేస్తారు. చికిత్స : ►కార్నియా దెబ్బతినకముందే కనుగొంటే చూపును చాలావరకు కాపాడవచ్చు. ►దీన్ని అర్లీ, మాడరేట్, అడ్వాన్స్డ్, సివియర్గా విభజిస్తారు. ఈ దశలపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. ►అర్లీ, మాడరేట్ కేసుల్లో కొల్లాజెన్ను బలోపేతం చేసే చికిత్సలు చేయాలి. ►ఈ దశలో కంటి అద్దాలు మార్చడం/ కాంటాక్ట్ లెన్స్ (రిజిడ్ గ్యాస్ పర్మియబుల్ కాంటాక్ట్స్)తో చికిత్స ఇవ్వవచ్చు కొంతమందిలో ఇంటాక్ట్స్ రింగులు వాడి... కార్నియాను మునపటిలా ఉండేలా నొక్కుతూ చికిత్స చేస్తారు. ►‘కార్నియల్ కొల్లాజెన్ క్రాస్ లింకింగ్’ అనే చికిత్సతో మరింత ముదరకుండా నివారించవచ్చు. ఇది అధునాతనమైనదీ, సులువైనది, ఖచ్చితమైన చికిత్స కూడా. రోగుల పాలిట వరమనీ చెప్పవచ్చు. ►దీనివల్ల కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చాలా తగ్గాయి. కొంతమందిలో క్రాస్లింకింగ్తో పాటు లేజర్ చికిత్స కూడా చేస్తారు. మరికొంతమందిలో క్రాస్లింకింగ్తో పాటు ఐసీఎల్ అనే లెన్స్ను అమర్చుతారు. ►చివరగా... అడ్వాన్స్డ్ దశలోనూ, అలాగే సివియర్ దశల్లో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ (కంటిపాప/నల్లగుడ్డు) మార్పిడి చికిత్స చేయాల్సి రావచ్చు. ఆ శస్త్రచికిత్స తర్వాత కాంటాక్ట్లెన్స్ ధరించాల్సి ఉంటుంది. నివారణ: పదేళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వారు మయోపియా, ఆస్టిగ్మాటిజమ్, కళ్లద్దాలు వాడాక కూడా అస్పష్టంగా కనిపించడం, ఒకే వస్తువు చుట్టూ మరో నీడ (ఘోస్ట్ ఇమేజ్), ఖాళీలు కనిపించడం (హ్యాలోస్), ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ ఇమేజ్) ఉన్నవారు కెరటోకోనస్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కూడా స్క్రీనింగ్ తప్పక చేయించుకోవాలి. ఒకవేళ ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో ఉన్నట్లు తేలితే... ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత మంచిది. కంటి అలర్జీ ఉన్నవారు కూడా కెరటోకోనస్ స్క్రీనింగ్ చేయించుకోవడం మేలు. ముప్పు ఎవరెవరిలో ఎక్కువ... ముప్పు కలిగించే అంశం ఏ మేరకు ముప్పు ఆక్యులార్ అలర్జీ - ముప్పు 1.42 రెట్లు ఎక్కువ కళ్లు నులుముకోవడం- ముప్పు 3 రెట్లు ఎక్కువ ఆస్తమా (అలర్జీ కారణంగా)- ముప్పు 1.9 రెట్లు ఎక్కువఎగ్జిమా (అలర్జీ కారణంగా)- ముప్పు 2.9 రెట్లు ఎక్కువ కుటుంబ చరిత్ర- ముప్పు 6.4 రెట్లు ఎక్కువ తల్లిదండ్రుల్లో ఉంటే ముప్పు 2.8 రెట్లు ఎక్కువ -డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు -
కంటిలో నుంచి బియ్యపు గింజలు.. బాలిక నరకయాతన..
-
తండ్రి కొడుకుల హత్య కేసు: మరణాంతరం నేత్ర దానం
ఉప్పల్: ఉప్పల్లో ఇటీవల దారుణ హత్యకు గురైన తండ్రీ కొడుకులు నర్సింహ శర్మ, శ్రీనివాస్ల నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పతికి దానం చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నరసింహ శర్మ కుమారుడు, కూతుళ్లు పేర్కొన్నారు. (చదవండి: తండ్రి కొడుకుల జంట హత్య కేసు దర్యాప్తు ముమ్మరం) -
కళ్లకింద నల్లటి వలయాలా?.. ఇంట్లోనే చక్కటి పరిష్కారం
ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, కంప్యూటర్ స్క్రీన్ వైపు అధికంగా చూడటం వల్ల చాలామందికి కళ్లు ఎర్రబడటం, మంటలు, కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటికి ఇంటిలో సహజంగా దొరికే వాటితోనే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి. ►కళ్ల ఎర్రబడి, మంట పుడుతుంటే ఉదయం లేదా సాయంత్రం.. సుమారు పది నిమిషాలు ఐస్క్యూబ్స్తో కళ్లను మసాజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా చర్మం మీద కాకుండా.. కాటన్ క్లాత్లో చుట్టి.. మెల్లిగా కళ్లను మసాజ్ చేయాలి. ఒకవేళ ఐ మాస్క్ ఉంటే.. దానిని కొంతసేపు ఫ్రిజ్లో ఉంచి కళ్లకు పెట్టుకోవచ్చు. చల్లని టీ బ్యాగులు: కోల్డ్ కంప్రెస్ లేదా ఐ మాస్క్ లేకుంటే.. ఉపయోగించిన టీ బ్యాగ్లు మీకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. గ్రీన్ టీ వంటి అనేక టీలు యాంటీ ఆక్సిడెంట్లతో కూడి ఉండటం వల్ల వీటిని ఫ్రిజ్లో పెట్టి కళ్ల మీద పెట్టుకుంటే చాలు... కళ్లకింద ఉండే క్యారీబ్యాగ్స్ను, డార్క్ సర్కిళ్లను తగ్గిస్తాయి. ►తాజా కీరదోసకాయను ఒక మాదిరి పరిమాణంలో గుండ్రటి ముక్కలుగా తరిగి.. వాటిని ఒక గిన్నెలో పెట్టి అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచండి. తర్వాత వాటిని ఫ్రిజ్ నుంచి తీసి కళ్లపై ఉంచి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బాదం నూనె: బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమాన్ని ఉపయోగిస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా మటుమాయం అవుతాయి. పడుకునే ముందు మీ డార్క్ సర్కిల్స్ను బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమంతో కలిపి మసాజ్ చేయాలి.. ఉదయం లేచిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే కళ్ల మంటలు తగ్గి హాయిగా ఉంటుంది. చల్లని పాలు: పాల ఉత్పత్తులు విటమిన్–ఎ ను కలిగి ఉంటాయి. ఇందులో రెటినోయిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచడంలో గొప్పగా పనిచేస్తాయి. చల్లని పాల గిన్నెలో కాటన్ మేకప్ రిమూవర్ ప్యాడ్ను నానబెట్టండి. అనంతరం 10 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే.. డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుతుంది. కంటి నిండా నిద్ర: నిర్ణీత సమయం పడుకోకపోవడం వల్ల కళ్ల కింద ద్రవం పేరుకుపోతుంది. కాబట్టి కంటినిండా హాయిగా∙నిద్రపోవాలి. క్రమగా వ్యాయామం చేయాలి. ఈ సహజ నివారణలతో కంటిచుట్టూ ఉండే నల్లటి వలయాలను సులువుగా ఛేదించవచ్చు. -
బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లో మరింత దూసుకుపోనుంది. ముఖ్యంగాఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించిన తర్వాత ఆసియాలోని అత్యంత ధనవంతుడు తన సామ్రాజ్య ఆహార కార్యకలాపాలను రెట్టింపు చేసేలా, స్థానిక, విదేశీ కొనుగోళ్లపై దృష్టిపెట్టడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బిలియనీర్ గౌతమ్ అదానీ 400 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లతో ఆహారవ్యాపారంలోకి మరింత దూకుడుగా వస్తున్నారని యూఎస్ ఫుడ్ అండ్ అగ్రి ఆర్గనైజేషన్ తెలిపింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన అదానీ తన రెట్టింపు ఆదాయాలను దేశీయ ఆహార ఉత్పత్తి పరిశ్రమలో వాటాల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అదానీకి చెందిన కిచెన్ ఎసెన్షియల్స్ సంస్థ అదానీ విల్మార్ లిమిటెడ్ తమ మార్కెట్ రీచ్ను పెంచడానికి ప్రధాన ఆహారాలు, పంపిణీ కంపెనీలలో బ్రాండ్లను కొనుగోలు చేయాలని చూస్తున్నామని అదానీ విల్మార్ సీఎండీ అంగ్షు మల్లిక్ బుధవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు రానున్న మార్చి నాటికి రెండు డీల్స్ పూర్తి చేయనున్నామని కూడా మల్లిక్ వెల్లడించారు. ఇందుకు 5 బిలియన్ రూపాయలను కంపెనీ కేటాయించిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాదికి 30 బిలియన్ రూపాయల ప్రణాళికా బద్ధమైన మూలధన వ్యయంతో పాటు అంతర్గత నిల్వల నుంచి అదనపు నిధులు వస్తాయని చెప్పారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఇ-కామర్స్ పంపిణీలో 50 శాతం వృద్ధిని సాధిస్తోందని మల్లిక్ చెప్పారు. ఫిబ్రవరినుంచి తమ ఫుడ్ కంపెనీ షేర్లు మూడు రెట్లు పెరిగియన్నారు. మెక్కార్మిక్ స్విట్జర్లాండ్ నుండి కోహినూర్ కుకింగ్ బ్రాండ్తో సహా పలు బ్రాండ్లను అదానీ విల్మార్ ఇటీవల కొనుగోలుచేసింది.తద్వారా కోహినూర్ బాస్మతి బియ్యం, రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ కూరలు, ఫుడ్పై ప్రత్యేక హక్కులు పొందించింది. అదానీ గ్రూప్ గత ఏడాదిలో 17 బిలియన్ డాలర్ల విలువైన దాదాపు 32 కంపెనీలను కొనుగోలు చేసింది. కాగా రిలయన్స్ రీటైల్ వింగ్ రిలయన్స్ రిటైల్ సరసమైన ధరలకు అధిక నాణ్యత గల ఉత్పత్తులను అభివృద్ధి చేసి, డెలివరీ చేసే లక్ష్యంతో ఎఫ్ఎంసిజి వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఏజీఎంలో ప్రకటించింది. -
గని ప్రమాదంలో కళ్లు కోల్పోయిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గని ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల్లో ఇద్దరు ఒక కంటి చూపు కోల్పోయారు. గురువారం జరిగిన ప్రమాదంలో కార్మికులు చింతల రామకృష్ణ, బండి రాజశేఖర్, శ్రీనివాస్లు తీవ్రగాయాలపాలవ్వడంతో హైదరాబాద్కు తరలించి వైద్యసేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. వారిలో రామకృష్ణ, రాజశేఖర్లకు ఒక్కో కన్ను పూర్తిగా దెబ్బతిన్నట్లు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపినట్లు సింగరేణి అధికారులు చెప్పారు. కాగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కార్మికులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించి, కంటిచూపు వచ్చేలా చూడాలని వైద్యులను కోరారు. -
మహాగణపతికి కంటిపాప అమరిక
ఖైరతాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ లక్ష్మీ మహాగణపతికి ఆదివారం ఉదయం దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ సూచించిన ముహూర్తంలో కంటిపాప (నేత్రోనిలనం)ను శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ అమర్చారు. 50 అడుగుల విగ్రహానికి కంటిపాపను అమర్చడం ద్వారా విగ్రహానికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు. విగ్రహ పనులన్నీ పూర్తికావడంతో సోమవారం సాయంత్రం వరకు కర్రలను పూర్తిగా తొలగిస్తామని, ఆ తర్వాత మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనం ఇస్తారని తెలిపారు. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. -
ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ చూసేవాళ్లు! ఇవి ట్రై చేస్తే..
Tips To Relax Eyes- Stress Relief: ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల కళ్లు ఒత్తిడికి గురై అలసిపోతుంటాయి. ఇలాంటి కళ్ల ఒత్తిడిని తగ్గించి ఉపశాంతిని కలిగించే మాస్క్లను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... రోజ్వాటర్తో.. ►రోజ్వాటర్లో కాటన్ ముక్కను కాసేపు నానబెట్టాలి. తరువాత కాటన్ను రెండుకళ్లపై మొత్తం కప్పి ఉంచి, పదిహేను నిమిషాలు తరువాత తీసేయాలి. ఒకసారి ఇలా చేసిన తరువాత కాటన్ను రిఫ్రిజిరేటర్లో పెట్టి మరోసారి కూడా వాడుకోవచ్చు. నల్లని వలయాలు సైతం తగ్గుముఖం ►టీ బ్యాగ్లను చల్లటి నీటిలో నానబెట్టాలి. తరువాత టీ బ్యాగ్లను నీటి నుంచి బయటకు తీసి, టీబ్యాగ్లో అధికంగా ఉన్న నీటిని పిండి కళ్లమీద పెట్టుకుని పదినిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఒత్తిడి తగ్గడంతోపాటు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. బంగాళదుంప, పుదీనా పుదీనాతో.. ►బంగాళదుంప, పుదీనా ముఖాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ►అదేవిధంగా కళ్ల ఒత్తిడిని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. ►పుదీనా రసం, బంగాళ దుంప రసాన్ని సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి పదినిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ►మిశ్రమం చల్లబడిన తరువాత .. కాటన్ బాల్ను ముంచి కళ్లమీద పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచుకోవాలి. ►కళ్ల ఒత్తిడి తగ్గడంతోపాటు, కళ్లచుట్టూ ఏర్పడిన ముడతలు తగ్గుముఖం పడతాయి. ►వీటిలో ఏ ఒక్కటి పాటించినా కళ్లకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చదవండి: Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. Mental Health: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఆ మూడింటిపై నియంత్రణ లేకపోతే! అంతే ఇక.. -
రూ.10 వేల కోట్ల ఆదాయంపై కన్నేసిన బ్లూస్టార్
న్యూఢిల్లీ: ఎయిర్ కండిషనింగ్, వాణిజ్యపర రిఫ్రిజిరేటర్ల తయారీ దిగ్గజం బ్లూ స్టార్.. మధ్య కాలంలో తన ఆదాయాన్ని రూ.10,000 కోట్లకు పెంచు కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా, ఐరోపా మార్కెట్లలోకి ప్రవేశించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ‘తదుపరి దశ వృద్ధిలో భాగంగా అంతర్జాతీయంగా ప్రధాన కంపెనీగా బ్లూస్టార్ మారుతుంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాలలో మరింత విస్తరణ, వినూత్న ఉత్పత్తులు, పరిష్కారాల పరిచయంతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటామని బ్లూస్టార్ వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటాం. వ్యయ నియంత్రణ చేపడతాం. భారతదేశం మాతృ కేంద్రంగా కొనసాగుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్కు సంబంధించి అన్ని విభాగాల్లో బ్లూ స్టార్ ప్రధాన బ్రాండ్గా ఉండడానికి కృషి చేస్తుంది. ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తుల తయారీలో ముఖ్య కేంద్రంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ వీర్ ఎస్ అద్వానీ తెలిపారు. కాగా 2021-22లో బ్లూ స్టార్ రూ.6,081 కోట్ల టర్నోవర్ సాధించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో 20 ఎకరాల్లో రూమ్ ఏసీల తయారీ కేంద్రం స్థాపిస్తోంది. ఈ కేంద్రం కోసం బ్లూ స్టార్ రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది. పూర్తి వార్షిక తయారీ సామర్థ్యం 12 లక్షల యూనిట్లుగా ఉండనుంది. -
అసలే వేసవి, ఆపై కంప్యూటర్ కాలం.. కళ్లు ‘కళ’ తప్పితే.. చిన్న వయసులోనే!
సాక్షి, పార్వతీపురం: కళ్లు నిత్యం తడిగా ఉంటాయి.. కంటినిండా నీరు ఉంటుంది.. ఒక విధంగా చెప్పాలంటే నేత్రాలు నిండు జలాశయాలు వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యం కారణంగా కంటిలో తడి ఆరిపోతోంది. నేత్ర వ్యాధులు అధికమవుతున్నాయి. చివరకు చూపు మసకబారుతోంది. అన్ని ఇంద్రియాల్లో కంటే కన్ను చాలా విలువైనది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు కలకాలం చల్లాగా ఉండాలి. చూపు శాశ్వతమవ్వాలి. కానీ మనిషి దుష్ప్రవర్తన కారణంగా కంటి సమస్యలు ఏర్పడి పిన్న వయస్సులోనే అంధత్వం ఏర్పడుతోంది. మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు ఎండిపోకుండా చేస్తాయి. వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడి ఆరిపోయి దురదలు ప్రారంభమవుతున్నాయి. వేసవి ప్రయాణాల్లో కంటి రెప్పలు నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే కొట్టుకుంటున్నాయని వైద్యులు ఒక సర్వేలో పేర్కొన్నారు. ఫలితంగా కంటి సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తలనొప్పి వంటివి కూడా వస్తున్నాయని వెల్లడించారు. చదవండి👉🏼 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! అధిక వినియోగం ముప్పు.. ప్రస్తుతం సాంకేతికత రాజ్యమేలుతోంది. అన్ని చోట్లా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి పైగా ప్రజలు మొబైల్ వినియోగిస్తున్నారు. నిత్యం కంప్యూటర్తో వర్క్ చేయడం, మొబైల్ ఆపరేటింగ్లో తలమునకలవ్వడం కారణంగా కళ్లు పొడిబారి పోతున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 మందిలో 60 నుంచి 70 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 99 శాతం మంది కార్నియ సమస్యలకు గురవుతున్నారు. వేడిగాలుల బారిన పడడం, ఆండ్రాయిడ్, కంప్యూటర్ వినియోగించడం, రాత్రి 12 గంటల వరకు సెల్ఫోన్తో గడపడం కారణంగా ఈ సమస్య వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 15 నుంచి 40 ఏళ్ల మద్య ఉన్నవారే అధికంగా ఈ సమస్యకు గురవుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. చదవండి👉🏻 నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి! సాధారణ కన్ను పొడిబారిన కన్ను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► వేసవిలో ప్రయాణించే వారు తప్పనిసరిగా కళ్లజోడు ధరించాలి. ► ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగం తగ్గించుకోవాలి. ► కంప్యూటర్ల వద్ద గంటలకొద్దీ గడపరాదు. ► కంటి రెప్పలు ఎక్కువసార్లు కొట్టుకొనే విధంగా ప్రయత్నించాలి. ► తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ► కంటికి దురదలు వచ్చే సమయంలో చేతితో నలపరాదు ► కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చదవండి👉🏾 చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స అవగాహన తప్పనిసరి రోజురోజుకూ కంటి సమస్యలు అధిగమవుతున్నాయి. 70 శాతం మంది కంటి రోగాలతో బాధపడుతున్నారు. ఇవి చిన్నవైనప్పటికీ జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బయట ప్రయాణాలు వద్డు. ఆండ్రాయిడ్ మొబైల్ను చిన్నారులకు ఇవ్వరాదు. టీవీ, సెల్ఫోన్, కంప్యూటర్ వాడే సమయంలో అరగంట కొకసారి ప్రతి పది నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వాలి. ఏవైనా కంటి సమస్యలు వస్తే నేరుగా వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ జీరు నగేష్రెడ్డి, వైఎస్సార్ కంటి వెలుగు జిల్లా ఇన్చార్జ్, పార్వతీపురం మన్యం -
కంటిని కాపాడుకోవాలంటే.. ఇలా చేయాల్సిందే..
ఒకప్పుడు చత్వారం అంటే నలభై ఏళ్లు దాటిన తర్వాత మొదలయ్యేది. హ్రస్వదృష్టి, దూరదృష్టి వంటి సమస్యలకు కళ్లద్దాలు వాడాల్సి వచ్చేది. ఇప్పుడు చిన్న వయసులోనే కంటి సమస్యలు మొదలవుతున్నాయి. నూటికి పదిమంది కళ్లద్దాల అవసరం ఉన్న రోజుల స్థానంలో నూటికి యాభై మందికి కళ్లజోళ్లు దేహంలో భాగమైపోతున్నాయి. పిల్లలకు ప్రైమరీ స్కూల్లో ఉండగానే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. అప్పుడు తప్పించుకున్న పిల్లలకు కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్య కళ్లద్దాల అవసరాన్ని కల్పిస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పోషకాహారలోపం, కంటికి వ్యాయామం లేకపోవడమే. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ వచ్చిన వారికి, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం. వ్యాయామం ఇలా.. వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో కంటికి కూడా అంతే అవసరం. రోజూ కొద్ది సేపు కంటి వ్యాయామాలు చేయడం వలన కంటి చూపు వృద్ధి చెందుతుంది. పక్కనున్న ఫొటోను పరిశీలించండి. 1. తలను, మెడను నిటారుగా ఉంచి... కుడివైపుకు, ఎడమవైపుకు చూడాలి. 2. ఇంటి పై కప్పును, నేలను చూడాలి. ఇలా చేస్తున్నప్పుడు కనుగుడ్డు మాత్రమే కదలాలి. తలను పైకెత్తకూడదు, కిందకు దించకూడదు. 3. వలయాకారంగా క్లాక్వైజ్, యాంటీ క్లాక్వైజ్గా తిప్పాలి. 4. దూరంగా ఉన్న వస్తువు మీద పది సెకన్లపాటు దృష్టి కేంద్రీకరించాలి. 5. ఆ తర్వాత ఐ మూలగానూ, దానికి వ్యతిరేక దిశలోనూ చూడాలి. 6. ముక్కు కొనను చూడాలి. ఈ ప్రక్రియ మొత్తానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. ఇలా రోజులో ఎన్నిసార్లయినా చేయవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువ సేపు చూసేవాళ్లు గంటకోసారి చేయవచ్చు. వీటిని తిందాం! మన శరీరంలో ఏదైనా అనారోగ్యం కలిగిందంటే దానికి ముఖ్య కారణం పోషకాల లోపం కూడా కారణం అవ్వచ్చు. అలాగే ఈ కంటి చూపుకు కూడా. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలను తెలుసుకుందాం. ఇవన్నీ మనకు సులువుగా దొరికేవే. మునగ ఆకులలో విటమిన్ – ఎ, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటి ఆకులను పప్పుతో కలిపి వండుకుని తింటే చాలా మంచిది. ఇతర ఆకుకూరల్లో పొన్నగంటి, మెంతికూర, తోటకూరలను వారంలో కనీసం రెండుసార్లయినా తీసుకోవాలి. విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాలు, పాల ఉత్పత్తులు, క్యారెట్లు, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. -
కరోనా వచ్చి వెళ్లాక.. వదలని బాధలు ఇవే!
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబళించిన కరోనా మహమ్మారి దాని బారినపడి కోలుకున్న బాధితుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో తాజా పరిశోధనల్లో వెల్లడైంది. జుట్టు రాలడం మొదలు పళ్లు కొరకడం వరకు ఎన్నో కొత్త సమస్యలు సృష్టించిందని తేలింది. ఆపాదమస్తకమంతా మనిషి శరీరంలో కరోనా తెచ్చిన మార్పులు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం. జుట్టు ►కరోనా బారినపడిన 2–3 నెలల్లోనే బాధితులకు విపరీతంగా జుట్టు రాలినట్లు ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. టెలోజెన్ ఎఫ్లువియమ్ అనే పరిస్థితే ఇందుకు కారణమని తేల్చింది. ►శరీర ఉష్ణోగ్రతలు పెరగడం, ఆకలి లేకపోవడం, వైరస్ బారిన పడ్డామన్న ఆందోళన, లాక్డౌన్ల విధింపుతో ఒత్తిడి లేదా మహమ్మారి వ్యాప్తితో జీవనశైలిలో వచ్చిన మార్పులు కేశాల సాధారణ ఎదుగుదల, అవి రాలే కాలచక్రంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ►అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏమిటంటే రాలిన జుట్టులో చాలా వరకు లేదా మొత్తమంతా తిరిగి వస్తుందని రిచర్డ్ స్పెన్సర్ అనే ట్రైకాలజిస్ట్ తెలిపారు. మానసిక ఆరోగ్యం ►క్వారంటైన్, భౌతికదూరం నిబంధనలు బాధితుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఈ పరిణామం వారిలో ఆందోళన, ఉద్రేకం, కుంగుబాటు, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీసింది. ►కరోనా నుంచి కోలుకున్న 90 రోజుల్లోనే ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు మానసిక అనారోగ్యానికి గురైనట్లు ఒక అధ్యయనం తెలిపింది. ►ప్రతి ముగ్గురు కరోనా రోగుల్లో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడ్డట్లు మరో సర్వే తేల్చింది. కళ్లు ►కరోనా వ్యాప్తితో సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువ కావడం వల్ల చాలా మంది కళ్లు పొడిబారడం, దురదపెట్టడం, ఎర్రబడటం, మసకబారడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. తెరలపై ఉండే నీలికాంతి ప్రభావమే ఇందుకు కారణం. ►పలు అధ్యయనాల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 11 శాతం మంది కళ్ల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో చాలా మందికి తరచుగా సోకుతున్నది కళ్లకలక. ఉదరం ►కొందరు గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల ప్రకారం... కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే పేగుల సంబంధ వ్యాధి కేసులు పెరిగాయి. పొత్తికడుపులో నొప్పి, విరేచనాలు, మలబద్ధకం వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా కరోనా బాధితులకు తలెత్తాయి. ►ఒత్తిడి, ఆందోళన కారణంగా ఐబీఎస్ వంటి రోగాల సంఖ్య పెరిగాయని ఓ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అభిప్రాయపడ్డారు. పళ్లు ►కరోనా వ్యాప్తి మొదలయ్యాక పళ్లు కొరకడం, బిగపట్టడంతో బాధపడుతున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగింది. ఏడీఏ అనే సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం 2,300 మంది డెంటిస్టుల్లో 71 శాతం మంది ఇదే విషయాన్ని తెలియజేశారు. బ్రక్సిజం అని పిలిచే ఈ వ్యాధి మనిషి తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు వస్తుందన్నారు. ►జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకా రం ఇదే కాలంలో పంటి, దవడ నొప్పులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. బరువు ►కరోనా మహమ్మారిని వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్లు/క్వారంటైన్ నిబంధనలతో ప్రజల బరువులో మార్పులు చోటుచేసుకున్నాయి. తక్కువగా తినడం, శారీరక శ్రమ తగ్గడం లేదా ఒత్తిడి ఇందుకు కారణం కావొచ్చు. ►ఒక అధ్యయనం ప్రకారం కరోనా రోగుల్లో 39 శాతం మంది బరువు పెరిగారు. కాలేయం ►కరోనా వ్యాప్తి కాలంలో తీవ్ర మద్యపాన సేవనం వల్ల తలెత్తే హెపటైటిస్ అనే కాలేయ వ్యాధి కేసుల సంఖ్య భారీగా పెరినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీని చికిత్స కోసం బాధితులు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ►కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన కొందరు బాధితుల్లో కాలేయ ఆమ్ల ద్రవాల స్థాయి సైతం పెరిగింది. పాదాలు ►పాదాల సంబంధ వ్యాధుల వైద్యురాలు ఎమ్మా కొన్నాకీ ప్రకారం ప్రజల్లో కండరాలు పట్టేయడం, మడమలు నొప్పిపెట్టడం వంటి సమస్యలు పెరిగాయి. పాదాలకు ఆసరా కల్పించే పాదరక్షలు ధరించే పరిస్థితి లేకపోవడం ఈ సమస్యకు ఒక కారణమై ఉండొచ్చని ఆమె అంచనా వేశారు. ►అరికాలు, చీలమండ, దాని వెనుకాల నొప్పితో బాధపడే వారి కేసుల సంఖ్య కూడా పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. చర్మం ►కరోనా నుంచి కోలుకున్న బాధితులు ఎదుర్కొన్న అతిసాధారణ చర్మ సంబంధ సమస్యల్లో దద్దుర్లు ఒకటి. ►కాళ్లు, చేతులు ఎరుపెక్కడం, నొప్పి రావడం, చర్మం దురదపెట్టడం దీని లక్షణాలు. ఈ పరిస్థితిని ‘కోవిడ్ టోస్’గా పేర్కొంటారు. -
మీకు డయాబెటిస్ ఉందా.. అయితే మీ కళ్లు జాగ్రత్త!!
డయాబెటిస్ అనే రుగ్మత తల నుంచి మొదలుపెట్టి... కాలి వేళ్ల వరకు ఏ భాగానైనా ప్రభావితం చేయగలదు. కంటిపై ప్రభావం చూపిందంటే ‘చూపే’ ఉండదు కాబట్టి కళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. అది కంటిపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. కంటికి వెనక భాగంలో రెటీనా అనే తెర ఉంటుంది. మనకు కనిపించే ప్రతి దృశ్యం దీనిపై తలకిందులుగా పడుతుంది. ఆ ఇమేజ్ తాలూకు సిగ్నల్స్... ఆప్టిక్ నర్వ్ అనే నరం ద్వారా మెదడుకు చేరడం వల్లనే మనం ‘చూడ’గలుగుతాం. అన్ని అవయవాల్లాగే ఈ రెటీనాకు కూడా సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. చక్కెర నియంత్రణలో లేని కొందరిలో కంటిపై దుష్ప్రభావం పడి ‘డయాబెటిక్ రెటినోపతి’ అనే కండిషన్ వస్తుంది. ఇలాంటివారిలో రెటీనాకు చేరే రక్తనాళాలు బలహీనపడి, వాటిపై అక్కడక్కడ చిన్నపాటి ఉబ్బుల్లాంటివి కనిపించవచ్చు. ఇలా రక్తనాళాల్లోని బలహీన ప్రాంతాలు ఉబ్బడాన్ని ‘మైక్రో అన్యురిజమ్స్’ అంటారు. కొన్నిసార్లు బలహీనంగా ఉండటతో ఉబ్బిన రక్తనాళాలు చిట్లిపోయి, పోషకాలు, ఆక్సిజన్ లీక్ అయి, అవి రెటీనాకు అందవు. ఆ తర్వాత అతిసన్నటి ఈ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇలా జరిగిన కూడా పోషకాలూ, ఆక్సిజన్ అందవు. ఫలితంగా రెటీనా ఉబ్బడం (థికెనింగ్/రెటినల్ ఎడిమా/మాక్యులార్ ఎడిమా) జరుగుతుంది. అసాధారణమైనరీతిలో అవాంఛిత నాళాలు పెరుగుతాయి. డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు తొలినాళ్లలో కనిపించవు. రెటినల్ ఎడిమా వచ్చినపుపడు చూపు మందగించడమూ, చిన్న చిన్న అక్షరాలు కనపడకపోవడం జరుగుతాయి. అవాంఛిత, అసాధారణ రక్తనాళాల నుంచి రక్తస్రావం అయి, కంటిలోని విట్రియస్ అనే జెల్లీలోకి స్రవించినప్పుడు దాన్ని తొలిసారి గుర్తించవచ్చు. తర్వాత కంటి ముందు నల్లటి చుక్కలు తేలుకుంటూ పోతున్నట్లుగానూ, అల్లుకుపోతున్నట్లుగా కనిపిస్తుంటాయి. అప్పటికీ జాగ్రత్తపడకుండా, నిర్లక్ష్యం వహిస్తే క్రమంగాగానీ, అకస్మాత్తుగాగాని కంటిచూపు పోవచ్చు. విట్రియస్లోకి రక్తస్రావం జరిగాక... కనుగుడ్డు నుంచి రెటీనా విడిపోయే అవకాశం ఉంది. దీన్నే రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఏడాదికి కనీసం ఒకసారైనా కంటి వైద్యనిపుణులను కలవాలి. అందునా ముఖ్యంగా రెటీనా స్పెషలిస్ట్ను కలవడం మంచిది. ఏదైనా తేడా గమనిస్తే వెంటనే వారు తగిన చికిత్స అందిస్తారు. తొలిదశలోనే చికిత్స అందితే కంటిచూపు కోల్పోయే ప్రమాదాన్ని నివారించవచ్చు. చికిత్స : బాధితుడి పరిస్థితినీ, అవసరాన్ని బట్టి కంటి డాక్టర్లు ఫ్లోరెసీన్ యాంజియోగ్రఫీ, ఓసీటీ అనే ప్రత్యేకమైన పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో చేతి రక్తనాళం నుంచి ఒక రంగును ప్రవేశపెట్టి, ఒక ప్రత్యేకమైన కెమెరా ద్వారా కంటిఫొటోలు తీస్తారు. దాంతో ఏయే భాగాల్లో రక్తం లీక్ అవుతుందో లేదా ఎక్కడ రక్తనాళాల్లో అడ్డంకి ఉందో తెలుస్తుంది. ఓసీటీలో మాక్యులార్ ఎడిమాను గుర్తిస్తారు. ఇక డయాబెటిక్ రెటినోపతిలో కంటికి ఏర్పడే నష్టాన్ని బట్టి అనేక రకాల చికిత్సలు అవరమవుతాయి. ఉదాహరణకు లేజర్ ఫొటోకోయాగ్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా లీకేజీలను అరికడతారు. అసాధారణంగా, అవాంఛితంగా పెరిగిన రక్తనాళాలనూ తగ్గిస్తారు. మాక్యులార్ ఎడిమా విషయంలో కంటికి ఇంజెక్షన్లు (యాంటీ–వెజ్) ఇచ్చి, వాపును తగ్గిస్తారు. కొన్ని సందర్భాల్లో అత్యాధునికమైన విట్రియో రెటినల్ మైక్రోసర్జరీ, ఎండోలేజర్ చికిత్స వంటి వాటితో చికిత్స అందించాల్సిరావచ్చు. డాక్టర్రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు చదవండి: చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం! -
సోరియాసిస్... కంటిపై దాని ప్రభావం!
చర్మం బాగా పొడిబారిపోయి దానిపైన ఉండే కణాలు పొట్టులా రాలిపోయే స్కిన్ డిసీజ్ అయిన సోరియాసిస్ గురించి తెలియని వారుండరు. మన సొంత వ్యాధినిరోధక వ్యవస్థ మన కణాలపైనే ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్ డిసీజ్)వల్ల ఇలా చర్మంపై పొట్టురాలిపోతూ ఉంటుంది. అందరూ దాన్ని చర్మవ్యాధిగానే చూస్తారు. కానీ దాని దుష్ప్రభావాలు కంటిపైన కూడా కొంతవరకు ఉంటాయి. ఈ జబ్బు ఉన్నవాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యాత్మక కండిషన్లు తలెత్తవచ్చు. అవి... ► కంటిలోని ఐరిస్, కోరాయిడ్, సీలియరీ బాడీ అనే నల్లపొరలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) రావచ్చు. (ఇలా జరగడాన్ని ‘యువైటిస్’ అంటారు). ► కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావచ్చు (కెరటైటిస్). ► కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ (కంజంక్టివైటిస్) వచ్చే అవకాశాలున్నాయి. ► కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి సమస్యలూ రావచ్చు. జాగ్రత్తలు / చికిత్స : గతంతో పోలిస్తే ఇప్పుడు సోరియాసిస్కు అత్యంత అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ తరహా ఆధునిక చికిత్సలతో సోరియాసిస్ను అదుపులో పెడుతున్నారు. పైన పేర్కొన్న కంటికి సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు సోరియాసిస్కు చికిత్సలు తీసుకుంటూనే... ఒకసారి కంటివైద్యుడిని కూడా సంప్రదించడం అవసరం. -
వరల్డ్ సైట్ డే 2021: మీ కళ్లను ప్రేమించండి!
సాక్షి, హైదరాబాద్: మనిషికి ప్రకృతి అందించిన అత్యంత అందమైన బహుమతి, గొప్ప వరం కళ్ళు. అందుకే సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. ఒక్కపది నిమిషాలు కళ్లుమూసుకుని లోకానికి చూడడానికి ప్రయత్నిస్తే వీటి విలువ మనకు అర్థమవుతుంది. దృష్టి లోపం, అంధత్వం, దృష్టి సంబంధిత సమస్యల గురించి అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో గురువారం వరల్డ్ సైట్ డే ను జరుపుకుంటారు. ఈ క్రమంలో లవ్ యువర్ ఐస్ అనే నినాదంతో ఈ ఏడాది అక్టోబర్ 14న ఈ డే జరుపుకోవాలని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రకటించింది. 2000 సంవత్సరంలో, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చెందిన సైట్ ఫస్ట్ క్యాంపెయిన్ ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ విజన్ గ్లోబల్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రచారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొని, తమ కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పిలుపునిస్తోంది. 2030 నాటికి సభ్య దేశాలు రెండు కొత్త ప్రపంచ లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. రిఫ్రాక్టెవ్ ఎర్రర్స్ నివారణలో 40 శాతం వృద్ధిని, కంటిశుక్లం శస్త్రచికిత్సల కవరేజీలో 30శాతం పెరుగుదల సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా భవిష్యత్తులో కంటి సంరక్షణలోనూ నాణ్యమైన సేవలను అందించడంలో కూడా కీలక పాత్ర పోషించాలని భావించాయి. కొందరికి పుట్టుకతోనే దృష్టి లోపాలొస్తే మరి కొందరికి వయసు రీత్యా ఏర్పడతాయి. ఈ రెండింటితోపాటు ప్రస్తుత జీవన పరిస్థితుల్లో మానవ నిర్లక్ష్యం కూడా కారణమని నిపుణులు చెబుతున్న మాట. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది నివారించగల దృష్టి లోపంతో బాధపడుతున్నారు. అంతేకాదు ప్రపంచంలో 80 శాతం మందిని అంధత్వంనుంచి నివారించే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక బిలియన్ ప్రజలు దగ్గరి లేదా దూరపు చూపు మందగింపు (మయోపియా లేదా హైపర్ మెట్రోపియా) సమస్యతో బాధపడుతున్నారు. ఇది నివారించగలిగే సమస్య. పిల్లలు, యువకులు, వృద్ధుల వరకు అందరూ ఈ సమస్యలతో బాధ పడుతుండగా,మెజారిటీ 50 ఏళ్లు పైబడిన వారు ఇందులో ఉన్నారు. ఇన్ఫెక్షియస్ కంటి జబ్బులు, దెబ్బలతోపాటు కంటి శుక్లం, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయస్సు పెరిగే కొద్దీ వ్యక్తి దృష్టిని ప్రభావితం చేస్తాయి. వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కనీస జాగ్రత్తలు, కొన్ని సాధారణ చికిత్సలతో చాలా దృష్టి లోపాలను నివారించవచ్చు. కాలుష్యం, ప్రమాదాలు, విటమిన్ల లోపం, రసాయన పరిశ్రమల కార్మికులు, ఎక్కువ సేపు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లపై గంటల తరబడి పనిచేయడం వల్ల కూడా కంటిచూపు దెబ్బ తినే ప్రమాదం ఉంది. అయితే ఎప్పటికప్పుడు సంబంధిత పరీక్షలు, శ్రద్ధ అవసరం. దురదృష్టవశాత్తు మనలో చాలా మంది లేదా ప్రతి రెండో లేదా మూడో వ్యక్తి ఏదో ఒక రకమైన కంటి సమస్య లేదా వ్యాధులతో బాధపడుతున్నారని అనుకుందాం. వాటిలో కొన్ని అంత తీవ్రంగా ఉండకపోయినా, కొన్ని మాత్రం చాలా ప్రాణాంతకం కావచ్చు. అందుకే ముందస్తు పరీక్షలు అవసరం. కంటి ఆరోగ్యం, ఆహారం, జాగ్రత్తలు కంటి ఆరోగ్యంకోసం ఆకుకూరలు, గుడ్లు, బీన్స్, క్యారెట్ వంటి ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ధూమపానాన్ని మానుకోవాలి. లేదంటే కంటి శుక్లాలు, కంటి నరాలు దెబ్బ తినడంతోపాటు అనేక దృష్టి సంబంధిత సమస్యలు వస్తాయి. అధిక ఎండనుంచి రక్షించుకునేందుక యూవీ ప్రొటెక్టెడ్ సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. ఒకవేళ ప్రమాదకరమైన కెమికల్స్ లేదా పనిముట్లతో పనిచేస్తున్నట్టయితే కంటిరక్షణకు సంబంధించిన కళ్లజోడు ధరించాలి. కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడిపితే కళ్లు పొడిబారిపోతాయి. దీనికి నివారణకు ఎక్కువ సార్లు కళ్లను మూస్తూ తెరుస్తూ (బ్లింక్) ఉండేలా చూసుకోవాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించడం మంచిది. అధికంగా స్టెరాయిడ్స్, నొప్పి నివారణ మాత్రలు వాడడం ఇందుకు ముఖ్య కారణం. అలాగే పిల్లల్లో వచ్చే కంటి సమస్యల నివారణకు మంచి పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు, రోజులో కనీసం గంట అయినా వారిని సూర్యరశ్మి తగిలేలా ఆరు బయట ఆడుకునేలా చూడాలి. నేత్రదానం వీటితోపాటు మరింత ముఖ్యమైనది నేత్ర దానం. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి నేత్ర దానం చేయడం ద్వారా ఇద్దరికి కంటి చూపును ప్రసాదించ వచ్చు. తద్వారా అనేక మంది చూపు లేని వారికి మేలు జరుగుతుంది. మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు ఇపుడే ఐ డొనేషన్ కోసం ప్రతిజ్ఞ చేద్దాం. -
ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!
-
మాట్లాడాలని పిలిచి బాలిక కంట్లో యాసిడ్ పోసి..
భోపాల్: ఇద్దరు యువకులు తమ కుటుంబంలోని మహిళ ఓ యువకుడితో పారిపోవడానికి సహకరించిందనే కోపంతో బాలిక కళ్లలోకి యాసిడ్ పోశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆమె చూపు కోల్పోయే పరిస్ధితి లేదని రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఆమె చిత్రకూట్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల ప్రకారం.. బాధితురాలు పన్నా జిల్లాలోని బార్హో గ్రామంలో నివసిస్తుంది. ఆ ఊర్లోని ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడాలని పిలివడంతో ఆమె తన సోదరుడితో కలిసి వారి ఫాంహౌస్కు వెళ్లింది. నిందితులు ఆమె సోదరుడిని దారుణంగా కొట్టి, బాలికను వేధించి ఆమె కళ్లలోకి యాసిడ్ పోశారు. ఆ తర్వాత ఆమె బాధతో కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ బాలిక నొప్పితో వణుకుతూ పొలంలో పడిపోయింది. బాలిక పరిస్థితి చూసిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్ నాథ్ మాట్లాడుతూ.. ఈ ఘటన సిగ్గుచేటని నిందితులపై కఠినచర్యలు చేపట్టాలని, బాధితురాలికి ప్రభుత్వం బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు. బాలికకు ఆమె తోబుట్టువులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: అత్యాచారం కేసు: గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలని కోర్టు ఆదేశం -
హృదయ విదారకం.. కళ్లు పీకేసిన ఎలుగుబంటి
సాక్షి, రాజన్నసిరిసిల్ల(కరీంనగర్): రాజన్న సిరిసిల్లలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. రుద్రంగి మండల కేంద్రంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. దేగావత్ తండాకు చెందిన గంగాధర్ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసి అతడి కళ్లను పీకేసింది. స్థానికులు పెద్ద ఎత్తున అరుపులు,కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడినుంచి అడవిలోకి పారిపోయింది. దీంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తిని స్థానికులు నీళ్లు తాగించి మెరుగైన చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
కళ్లు లేకున్నా కాంతిని గ్రహిస్తాయి!
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: కళ్లు లేకుండా కాంతిని గ్రహించవచ్చా? అంటే.. అవును అంటోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిశోధన బృందం. కొన్ని క్రిములు (ప్లానేరియన్ ఫ్లాట్వారమ్స్) కళ్లు లేకుండానే కాంతిని గ్రహించగలుగుతున్నాయని హెచ్సీయూలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ఆకాష్ గుల్యాని నేతృత్వంలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రిమి శరీరం అంచుల్ని అంటిపెట్టుకుని ఉన్న ప్రొటీన్లతో కూడిన ఒక కంటి- స్వతంత్ర వ్యవస్థ (ఎక్స్ట్రాక్యులర్) ఇందుకు తోడ్పడుతున్నట్లు వారు గుర్తించారు. ఈ మేరకు హెచ్సీయూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తలను తొలగించినప్పటికీ ప్లానేరియన్లు బతికి ఉండగలవని, అంతేకాకుండా తక్కువ మోతాదుల్లో అతి నీలలోహిత వెలుగు పడినప్పుడు, ఆ కాంతి వనరు నుంచి పక్కకు వెళ్లిపోగలవని ఇంతకుముందు జరిగిన పరిశోధన స్పష్టం చేసింది. తాజాగా పరిశోధకులు.. దృష్టి లోపంతో బాధ పడుతున్నవారికి కంటి చూపునిచ్చేందుకు, అలాగే కాంతి సహాయంతో కణాల అంతర్గత పనితీరును నియంత్రించేందుకు, ఈ సహజ కాంతి గ్రాహక ప్రొటీన్లు ఉపయోగపడతాయా అని తెలుసుకోవడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఈ క్రిములు కళ్లు లేకుండా కాంతిని ఎలా గ్రహించ గలుగుతున్నాయి, అవి కాంతిని గ్రహించేందుకు ఇతర కాంతి గ్రాహక వ్యవస్థ ఏదైనా ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే గుల్యానీ నేతృత్వంలోని బృందం.. ఫ్లాట్వార్మ్స్ శరీర అంచుల వెంబడి ఉన్న కంటి–స్వతంత్ర వ్యవస్థ (ఐ–ఇండిపెండెంట్ సిస్టమ్ (ఎక్స్ట్రాక్యులర్), తల లేని క్రిమి సైతం తల ఉన్న క్రిమి మాదిరి నమ్మశక్యంకాని సమన్వయంతో కదిలేలా చేస్తోందని కనిపెట్టినట్లు ప్రకటన వెల్లడించింది. -
రెప్పపాటులో రికార్డు కొట్టేసింది..
నాకు నేనే సాటి.. నాకెవరూ రారు పోటీ అంటోంది ఈ ఫొటోలో ఉన్నామె. పోటీ ఎందులో అంటారా? ఆమె కళ్లు చూశారా.. ఆ కంటి రెప్పలకున్న వెంట్రుకలు చూశారా..? అంతపెద్దగా ఉన్నాయేంటి అనుకుంటున్నారా? అవును ప్రపంచంలోకెల్లా అతి పొడవైన కనురెప్ప వెంట్రుకలు ఉన్న ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఈ విషయంలో 2016లోనే రికార్డు సృష్టించిన ఆమె.. ఇప్పుడా రికార్డును తనే బ్రేక్ చేసింది. చైనాలోని చాంగ్జౌ నగరానికి చెందిన యూ జియాంజియా 2016లో 12.5 సెంటీమీటర్ల (4.88 అంగుళాలు) పొడవైన కనురెప్పల రోమాలతో రికార్డు సృష్టించింది. సీన్ కట్చేస్తే.. ఐదేళ్లలో అవి రెట్టింపు అయ్యాయి. ఎడమ కనురెప్ప వెంట్రుకలు ఏకంగా 20.5 సెంటీమీటర్ల (8 అంగుళాలు) పొడవు పెరిగాయి. దీనితో మరోసారి గిన్నిస్ బుక్లోకెక్కింది. తాను ఓసారి పర్వత ప్రాంతాల్లో ఏడాదిన్నర నివసించానని, అప్పుడే బుద్ధుడు పొడవైన వెంట్రుకలను బహుమానంగా ఇచ్చాడని ఆమె అంటోంది. చదవండి: చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. తిమింగలం నోటిలో 30 సెకన్ల పాటు -
నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..
రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా.. బెడ్పై అటు ఇటు దొర్లుతున్నా కళ్లు మూసుకోవడం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి.. ఎంచక్కా నిద్రపోండి. పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ను దూరంగా పెట్టడం మంచిది. రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి. ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది. -
కళ్లతోనే.. కరోనా వైరస్ వ్యాప్తి
తమిళనాడు,కొరుక్కుపేట: కరోనా వైరస్ వ్యాప్తిలో కళ్లు ముఖ్యపాత్ర వహిస్తున్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగర్వాల్ కంటి ఆస్పత్రి వైద్యసేవల విభాగం డాక్టర్ ప్రీతి రవిచందర్ తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ను నివారించడంలోనూ, వ్యాపింపజేయడంలోనూ కళ్లు ముఖ్య పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. వ్యక్తులు దగ్గినప్పుడు నీటి కణాలు కంట్లోకి పడినా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్నారు. ఈ వైరస్ దేహంలోని అన్ని భాగాలకు చేరుతుందని, తద్వారా ప్రాణాపాయం కలుగుతుందని వివరించారు. సబ్బుతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వేడి నీరు, వేడి ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిదన్నారు. నీటిని వీలైనంత ఎక్కువసార్లు తాగాలన్నారు. -
కళ్లల్లో కల్లోలం
నేత్రాలు నిండు జలాశయాల వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యంతో కళ్లల్లో నీరు ఆవిరవుతోంది. కళ్ల సహజత్వాన్ని మెల్లగా కోల్పోయేలా చేసే టీవీ.. కంప్యూటర్ల జాబితాలోకి స్మార్ట్ఫోన్లు వచ్చి చేరాయి. అధిక గంటలు స్మార్ట్ఫోన్, కంప్యూటర్తో గడిపేస్తుండటంతో కళ్లల్లో కల్లోలం అలముకుని ఎడారిలా మారిపోతున్నాయి. చివరకు చూపుపై ప్రభావం పడుతోంది. ఇందులో భాగంగా కళ్లు పొడిబారడం అనే సమస్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. సాక్షి, నెహ్రూనగర్ (గుంటూరు): ఆధునిక టెక్నాలజీతో అందరికీ అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ఫోన్లు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరానికి మించి వినియోగిస్తుండడంతో మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు యువతీ, యువకులతో పాటు పెద్దవారిలోనూ ఇదే సమస్య మొదలైంది. ఒకప్పుడు కంప్యూటర్తో గంటల తరబడి గడిపేవారు. అవసరం లేకపోయినా ఇంటర్నెట్ చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ కాలం వెల్లబుచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్లతో పాటు స్మార్ట్ఫోన్లు జతకలిశాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ ఆధునిక పరికరానికి అతుక్కుపోతున్నారు. మనిషి రోజులో 16 గంటల పాటు మేల్కొని ఉంటే అందులో 3 నుంచి 4 గంటల పాటు స్మార్ట్ఫోన్ చూస్తూ గడిపేవారు అధికంగా ఉంటున్నారు. నిద్రపోయే 8 గంటల సమయాన్ని సైతం యువత కుదిస్తే మరో రెండు, మూడు గంటలను స్మార్ట్ఫోన్కే కేటాయిస్తోంది. ఫలితంగా శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటోంది. ఇందులో కళ్లు పొడిబారడం అనే సమస్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. నిత్యం ఐదు నుంచి ఆరు గంటలు స్మార్ట్ఫోన్ వాడే వారిలో కళ్లు డ్రై అవడంతో పాటు కార్నియా సమస్యలు వస్తాయని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి వస్తుందంటే.. 50 సంవత్సరాలు నిండిన స్త్రీలకు, బహిష్టు ఆగిన తర్వాత హార్మోన్ థెరపీలో ఉన్నవారికి, కాలుష్య వాతావరణంలో ఎక్కువగా తిరిగే వారికి, కళ్లల్లో కాంటాక్ట్ లెన్స్ వాడే వారికి, ధూమపానం చేసే వారికి, ఎక్కువ సమయం కంప్యూటర్పై పనిచేసే వారికి, కొన్ని రకాలైన మందులు (బీపీ, అలర్జి, మానసిక వ్యాధిగ్రస్తుల మందులు, గర్భ నిరోధక మాత్రలు) వాడే వారితో పాటు కీళ్ల నొప్పులు, మధుమేహం వ్యాధి మందులు వాడే వారికి కూడా డ్రై ఐ రావచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రయాణాలు చేసే వారు కూలింగ్ గ్లాస్ వాడాలి. తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవాలి. స్మార్ట్ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని చూడాలి. కళ్లకు ఫోన్కు మధ్య 15 సెంటీమీటర్ల దూరంగా పెట్టుకుని చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టుకోకూడదు. 20 నిమిషాల పాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్ల పాటు దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడంతో పాటు కనురెప్పలు కొట్టడం వల్ల నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై అవకుండా దోహదం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చీకట్లో స్మార్ట్ఫోన్ను వినియోగించరాదు. కంప్యూటర్పై పనిచేసే వారు యాంటీ రిఫ్లేక్టివ్ గ్లాసెస్ వాడితే మంచిది. రోజులో ఎక్కువ సేపు స్మార్ఫోన్, కంప్యూటర్పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయిట్మెంట్లు వాడటం ద్వారా దుష్ఫలితాలు దరిచేరకుండా చూసుకోవచ్చు. నేత్ర పరీక్ష నిర్వహిస్తున్న వైద్యుడు (ఫైల్) డ్రై ఐని అశ్రద్ధ చేస్తే చూపు కోల్పోతారు డ్రై ఐ వచ్చిన వారు ఆర్టిఫీషియల్ ఐ వాటర్ (కృత్రిమ కంటినీళ్లు) చాలా కాలం వాడాలి. వాడే టియర్ డ్రాప్స్ ఎలాంటి ప్రిజర్వేటివ్ లేకుండా వాడితే మంచిది. పొడి బారిన కళ్ల సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సైక్లోస్పోడిన్ ఐ డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది. ఈ డ్రాప్స్ ఎక్కువ ఉత్ప్రేరితం చేసి కంట్లో ఎక్కువ నీళ్లు వచ్చేలా దోహదం చేస్తాయి. డ్రై ఐని అశ్రద్ధ చేస్తే కంట్లోని కార్నియాపై తెల్లటి మచ్చలు వచ్చి చూపు కోల్పోయే అవకాశం ఉంది. కంటికి పని కల్పించే టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ వంటి వస్తువులను సరైన దూరంలో నుంచి చూస్తే చాలా వరకు కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. వీలైనంత వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కళ్లను పక్కకు మరల్చాలి. డాక్టర్ మెండా ఫర్నీకుమార్, కంటి వైద్య విభాగాధిపతి, జీజీహెచ్, గుంటూరు నేత్రాలు పొడిబారే లక్షణాలు కళ్లు అలసినట్లుగా ఉండడం. కళ్లల్లో మంట, కంట్లో దురదగా ఉండటం, కళ్లల్లో నీళ్లు రావడం, కళ్లు నొప్పిగా ఉండడం, కళ్లల్లో ఇసుకపోసినట్లుగా ఒత్తుకోవడం ఈ లక్షణాలు ఉంటే డ్రై ఐ (కళ్లు పొడిబారడం) సమస్యతో బాధపడుతున్నట్లే. డ్రై ‘ఐ’ ఎలా గుర్తిస్తారు డ్రై ఐ కనుగొనేందుకు కంటి వైద్యులు ఘమర్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్షలో కంట్లో నీరు ఎంత ఉందో కొలిచేందుకు ఒక ఫిల్టర్ పేపర్ వాడతారు. సాధారణంగా 35 మిల్లీమీటర్ల పేపర్ తడిగా అయితే నార్మల్గా ఉన్నట్లు, 5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా తడి ఉంటే అతి ప్రమాదకర డ్రై ఐగా నిర్ధారిస్తారు. -
సురక్షిత దీపావళి
దీపావళి పండగ మనసుకే కాదు... దీపకాంతులతో కళ్లకూ పండగే. రంగురంగుల కాంతులీనుతూ వెలిగే బాణాసంచా, మతాబులు కళ్లను మిరుమిట్లు గొలుపుతాయి. కానీ ఆ సంబరాలూ సంరంభాలూ కళ్లకు ప్రమోదమే గానీ ప్రమాదం తెచ్చిపెట్టకూడదు. సురక్షితమైన దీపావళి వేడుకలతో మన కళ్లను కాపాడుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోండి. పనిలో పనిగా కళ్లతో పాటు ఒంటినీ సంరక్షించుకోండిలా. జాగ్రత్త ►దీపావళి బాణాసంచాతో గాయం అయ్యేందుకు చర్మానికే ఎక్కువ అవకాశం. కారణం... చర్మం మానవ శరీరాన్నంతా కప్పి ఉంచే అత్యంత పెద్ద అవయవం కావడమే. ►బాణాసంచా కేవలం లైసెన్స్డ్ షాప్లోనే కొనాలి. ►ఇంట్లో ఓ కార్డ్బోర్డ్ బాక్స్ వంటి దాన్లో పెట్టాలి. ►ఆ పెట్టెను మంట తగిలేందుకు అవకాశమున్న కిచెన్, పొయ్యి వంటి వాటికి దూరంగా ఉంచాలి. ►బాణాసంచాను చెల్లాచెదురుగా ఉంచకూడదు. ►సాయంత్రం వాటిని కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి. ►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి. ►వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది. ►నిత్యం నీళ్లు ఎక్కువగా తాగడం చర్మానికి ఎంతో మంచిది. అయితే దీపావళి సందర్భంగా ఆ నిబంధనను మరింత శ్రద్ధగా పాటించాలి. ఎందుకంటే... పొరబాటున చర్మం కాలితే ఆ ప్రక్రియలో చర్మం నీటిని కోల్పోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటే గాయం తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ►బాణాసంచా కాల్చేప్పుడు ఎప్పుడూ ఒకే సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు–మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు. ►కాల్చేసమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది. ►కాల్చేప్పుడు టపాకాయ నుంచి మనం దూరంగా ఉండటానికి వీలుగా మోచేతిని వంచకుండా పూర్తిగా సాగదీయాలి. మోచేతిని ఎంతగా వంచితే టపాకాయకు అంత దగ్గరవుతాం. ►టపాసు నుంచి తలను వీలైనంత దూరంగా ఉంచాలి. ►ప్రమాదవశాత్తు చర్మం కాలితే రగ్గు వంటివి కప్పవద్దు. ►నీళ్ల బకెట్ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి. ►గాయానికి తడి టవల్ను చుట్టి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ►వేడి సోకడం వల్ల చర్మానికి అయ్యే గాయాన్ని మూడు విధాల వర్గీకరించవచ్చు. మొదటిది పైపైన (సూపర్ఫీషియల్), ఓమోస్తరు లోతుగాయం (మీడియన్ డెప్త్), మూడో రకం తీవ్రంగా కాలిన గాయాలు (డీప్ బర్న్స్). ►వీటిల్లో మీడియన్ డెప్త్, డీప్ బర్న్ గాయాల వల్ల చర్మంపై మచ్చ (స్కార్) మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ►గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ►గాయాన్ని కడగడానికి సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీళ్లను మాత్రమే ఉపయోగించాలి. ►ఐస్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదు. ►డాక్టర్ దగ్గరికి వెళ్లేవరకు తడిగుడ్డతో గాయాన్ని కప్పి ఉంచవచ్చు. ►కాలిన గాయలు తీవ్రమైతే ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ►గాయం అయిన సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు. ►కాలి, చేతుల వేళ్లకు తీవ్రమైన మంట సోకితే అవి ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్య తడి వస్త్రం ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలి. ►బాణాసంచా ఎప్పుడూ ఆరు బయటే కాల్చాలి. ►ఇంటి కారిడార్లలో, టెర్రెస్పైన, మూసేసినట్లుగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు. ►టపాకాయలను, బాంబులను డబ్బాలు, పెట్టెలు, ప్లాస్టిక్ బాక్స్ల వంటి వాటిల్లో పెట్టి కాల్చడం ఎంతమాత్రమూ తగదు. ►మరింత శబ్దం వస్తుందని కుండలవంటి వాటిల్లో పెట్టి అస్సలు కాల్చకూడదు. టపాకాయతో పాటు కుండ కూడా పేలిపోయి పెంకుల వల్ల గాయపడే ప్రమాదం ఉంది. ►చిన్న పిల్లలను ఎత్తుకొని అస్సలు కాల్చకూడదు. ఐ కేర్ ►మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రభావం. ►ఇక పరోక్షంగా కూడా... సల్ఫర్, గన్పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు. ►తీక్షణమైన వెలుగును నేరుగా చూడవద్దు. దానివల్ల కార్నియల్ బర్న్స్ రావచ్చు. అందుకే బాణాసంచా కాలేసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు. ►కొన్ని రకాల బాణాసంచా నుంచి నిప్పురవ్వల వంటివి కంటికి తాకే అవకాశం ఉన్నందున అలాంటి వాటిని కాల్చే సమయంలో... కాల్చగానే వీలైనంత దూరం పోవాలి. ►కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు. ►బాణాసంచా కాల్చేసమయాల్లో కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది. ►వెలుగులు, రవ్వలతోపాటు వేడిమి వల్ల కూడా కన్ను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లడం మంచిది. ►రాకెట్ వంటివి పైకి వెళ్లకుండా కంటిని తాకితే దానికి గాయం (మెకానికల్ ఇంజ్యూరీ) కూడా అయ్యే అవకాశం ఉంది. గాయం వల్ల ఒక్కోసారి కంటి లోపల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ►డైరెక్ట్ మంట కంటికి తగిలి కన్నుగాని, కనురెప్పలుగానిక తాగే అవకాశం ఉంది. ఫలితంగా కార్నియా దెబ్బతింటే శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ►అలాంటిదే జరిగితే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప ఇతర చికిత్సలతో ఫలితం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ►గాయం ఎలాగైనప్పటికీ ఒక కన్ను మూసి విజన్ పరీక్షించి చూసుకోవాలి. చూపులో ఏమాత్రం తేడా ఉన్నా వీలైనంత త్వరగా కంటి డాక్టర్ను కలిసి చూపించుకోవాలి. -
‘ఆయన కళ్లు ఎలుకలు తినేశాయి’
కోల్కతా : మార్చురీలో ఉంచిన మృతదేహంనుంచి కళ్లు మాయమైన ఘటన పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్కతాకు చెందిన శంభునాథ్ దాస్ (69) గత ఆదివారం ఓ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ‘ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’కు తరలించారు. ఆసుపత్రికి తీసుకురావటానికి ముందే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోస్ట్మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టమ్ అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే శంభునాథ్ మృతదేహంలో కళ్లు లేకపోవటం గుర్తించిన వారు ఆసుపత్రి సిబ్బందిని పశ్నించారు. ‘‘ ఆయన కళ్లను ఎలుకలు తినేశాయి’’ అని సిబ్బంది చెప్పిన సమాధానంతో వారు నిర్ఘాంతపోయారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ శుంభునాథ్ కొడుకు సుశాంత ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై స్పందించిన అధికారులు మంగళవారం దర్యాప్తుకు ఆదేశించారు. -
రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు చమురు ఎగుమతులతో సమద్ధిగా ఎదిగిన దేశం వెనిజులాలో నిత్యావసరాల కోసం అక్కడి ప్రజలు నిత్యం ఆందోళనలు చేయడం, వారిని పోలీసులు పాశవికంగా అణచివేయడం నిత్యకత్యమైంది. అలాగే వంట గ్యాస్ కోసం తల్లి ఆండ్రియానా వెంట కుమారులు రూఫో ఛాకన్ (16), ఆండ్రియాన్ (14)లు తారిబా పట్టణంలో రెండు వారాల క్రితం ఆందోళన చేస్తుండగా, వారిపైకి పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కాల్చారు. ఆ బుల్లెట్లకు సంబంధించిన 51 ముక్కలు వచ్చి రూఫో ఛాకన్ ముఖానికి తగులగా, వాటిల్లో 16 ముక్కలు నేరుగా రెండు కళ్లలోకి దూసుకుపోయాయి. దీంతో రెండు కళ్ల నుంచి రక్తం చిమ్మింది. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స అందించినప్పటికీ రెండు కళ్లు పోయాయి. చూపు తెప్పించే ఆస్కారమే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వంట గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్న తల్లికి అండగా తాను ఆందోళనకు వెళ్లినందుకు ఇప్పుడు తల్లికి భారంగా మారాల్సి వచ్చిందని ఆ తనయుడు బాధ పడుతున్నాడు. ఇంక తానే మాత్రం ఏడ్వదల్చుకోలేదని, ఆస్పత్రిలోనే కావాల్సినంత ఏడ్చేశానని మీడియా ముందు వాపోయాడు. తాను మదిలో రంగులు మర్చిపోకముందే చూపు రావాలని కోరుకుంటున్నానని, తనకు జీవితంలో ఏ కలలు చావలేదని, చూపు కోసం తాను ఎంత కష్టపడాలన్నా పడతానని, అలాంటి దారి ఉంటే చూపుమని మీడియాను కూడా వేడుకున్నాడు. బాధ్యతారహితంగా రబ్బర్ బుల్లెట్లను పేల్చిన ఇద్దరు పోలీసులను వెనిజులా యంత్రాంగం గుర్తించి వారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికా ఆంక్షల వల్ల ఇప్పుడు వెనిజులాలో చమురు, వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. -
మీరు ఏసీ కింద గంటలతరబడి ఉంటున్నారా?
వేసవి వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూఎయిర్ కండిషనర్ల రొద మొదలువుతుంది.ఉక్కపోత నుంచి తేరుకుని కంటి మీద కాస్త కునుకు పడాలంటే మాత్రం ఏసీ ఉండాల్సిందే. ఇంతవరకు బాగానే ఉన్నా శరీరానికి చల్లదనాన్ని పంచే ఎయిర్ కండిషనర్లు రకరకాల ఆరోగ్య సమస్యలను కూడా మోసుకొస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. మొబైల్, డిజిటల్ తెరల కారణంగా ఇటీవల కంటి సమస్యలు నగరంలో పెరుగుతున్న నేపధ్యంలో పులి మీద పుట్రలా ఇప్పుడు ఎయిర్ కండిషనర్లు కూడా కంటి ఆరోగ్యానికి ముప్పుతెస్తున్నాయంటున్నారు నగరానికి చెందిన అగర్వాల్ కంటి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ బద్రీ ప్రసాద్ డాగ్నె. ఆయన చెబుతున్న మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. సాక్షి, సిటీబ్యూరో :సమ్మర్ వస్తే చాలు సిటీలో ఎయిర్ కండిషన్లు మోత మోగిస్తుంటాయి. ఇల్లు, ఆఫీసులు, ప్రయాణం చేసే కార్లు, బస్సులు, మెట్రోరైళ్లు.. ఇలా ఏది చూసినా చల్లదనమే. ఎండలు పెరగడంతో పాటు వేడిని తట్టుకునే శక్తి కూడా మనలో లోపిస్తుండడంతో ఎయిర్ కండిషనర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఒక అంచనా ప్రకారం వేసవి కాలంలో ఓ కార్పొరేట్ ఉద్యోగి సగటున 14 నుంచి 16 గంటల పాటు ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలోనే ఉంటున్నట్టు తేలింది. ఎయిర్ కండిషనర్లు శరీరానికి అవసరమైన చల్లదనంతో పాటు కొన్ని రకాల అనారోగ్య సమస్యల్ని కూడా మోసుకొస్తున్నాయి. కృత్రిమ పద్ధతుల్లో గాలిని, వాతావరణాన్ని మార్చే ప్రక్రియ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి వచ్చే ‘డ్రై ఐ సిండ్రోమ్’ వేసవి కాలంలోనే బాగా కనిపిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. పొరలు పొడిబారి.. కన్ను తన విధిని తాను సక్రమంగా, సరైన విధంగా నిర్వర్తించేందుకు నిర్ణీత పరిమాణంలో కళ్లలో నీటి బిందువులు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నీటి బిందువులు బాహ్యంగా ఆయిలీ లేయర్, మధ్యలో వాటర్ లేయర్, లోపల ప్రొటీన్ లేయర్తో సంరక్షించబడుతుంటాయి. ఎయిర్ కండిషన్డ్ రూమ్లో అత్యంత తక్కువ టెంపరేచర్ ఉండే పరిస్థితుల్లో పరిసరాల్లో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. తద్వారా నీటి బిందువులకు రక్షణ కవచాలుగా ఉండాల్సిన పొరలు బలహీనపడిపోతాయి. శరీరానికి తగిలే గాలి పూర్తిగా పొడి బారినది అవడం వల్ల అది కంటి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించి ‘్రౖడై ఐ సిండ్రోమ్’గా మారుతుంది. డ్రై ఐ సిండ్రోమ్ లక్షణాలివే.. కళ్లు పొడిబారడం, కళ్లలో మంట, దురద, కంటి నుంచి నీరు కారడం, ఎర్రబడడం, చూపు మసకబారడం వంటి లక్షణాలతో ఈ డ్రై ఐ సిండ్రోమ్ వస్తుంది. ఇలా ఎక్కువ సేపు ఇదే రకమైన ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఉండడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. మరోవైపు ఏసీ మిషిన్ల నిర్వహణ సరిగా లేకపోతే వ్యాప్తి చెందే వైరస్, బాక్టీరియా, ఫంగస్ కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఓ వైపు పొడి వాతావరణం కూడా దీనికి జత కలవడం మరింత ప్రమాదకరంగా మారి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. నగరంలో ఉండే కాలుష్య వాతావరణం సమస్యను మరింత జటిలం చేస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరి.. ఏసీ వినియోగించేటప్పుడు టెంపరేచర్ 23 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకూ మాత్రమే ఉండాలి. దీనితో పాటు అవసరమైతే ఫ్యాన్ కూడా వినియోగించవచ్చు. ఎయిర్ కండిషనర్లకు మరీ దగ్గరగా లేదా నేరుగా కంటి మీద చల్లని గాలి పడేలా కూర్చోవడం ఎక్కువ సేపు గడపడం చేయవద్దు. ఏసీలో పనిచేస్తున్నప్పటికీ దాహం వేసే వరకూ ఆగకుండా తరచుగా మంచి నీరు తాగుతుండాలి. ఏసీ గదుల్లో కంప్యూటర్ల ముందు పనిచేసేవారు తరచుగా కళ్లు మూసి, తెరవడం చేస్తుండాలి. మంచి నిద్ర కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. వైద్యుల సూచనలను అనుసరించి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వినియోగించాలి. కంటి ఆరోగ్య సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయిస్తుండాలి.– డాక్టర్ బద్రీ ప్రసాద్ డాగ్నె,అగర్వాల్ కంటి ఆస్పత్రి (సంతోష్నగర్) -
కళ్ల కింద నలుపు తగ్గాలంటే...
మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. ఇవి ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కళ్ల కింద నలుపు తగ్గాలంటే... అర టీ స్పూన్ బాదంపప్పు పొడి, కొద్దిగా గంధం పొడి, అర టీ స్పూన్ బంగాళదుంప రసం, పది చుక్కల నిమ్మరసం కలిపి కళ్ల కింద నల్లని వలయాలున్నచోట మృదువుగా రాయాలి. పదినిమిషాలు కళ్లుమూసుకొని, విశ్రాంతి తీసుకొని, తర్వాత చల్లని నీళ్లతో శుభ్రపరచాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల నల్లని వలయాలు తగ్గుతాయి. గింజలేని ద్రాక్షపండ్లను సగానికి కట్ చేసి, నలుపుదనం ఉన్నచోట ఉంచి, పది నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రపరుచుకోవాలి. టీ స్పూన్ తేనెలో 2–3 కుంకుమపువ్వు రేకలు కలిపిన మిశ్రమాన్ని నల్లనివలయాలు, మచ్చలు ఉన్న చోట రాస్తే నలుపు తగ్గి, ముఖ కాంతి పెరుగుతుంది.రాత్రి పడుకునే ముందు క్యాబేజీని ఉడికించిన నీళ్లను చల్లార్చి ఆ నీటిని దూది ఉండతో కళ్లకిందా, ముఖమంతా రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖం శుభ్రపరుచుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి. ముఖకాంతి పెరుగుతుంది. -
చీకట్లు నింపిన వెలుగులు
గోల్కొండ: దీపావళి పండుగ కొందరు జీవితాల్లో చీకట్లు నింపింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దాదాపుగా కంటి చూపు కోల్పోయారు. బాణసంచా కాల్చిన సంఘటనలో గాయపడ్డవారు మొత్తం 45 మంది వివిధ రకాల కంటి గాయాలతో సరోజిని ఆసుపత్రిలో చేరారు. వీరిలో 33 మందిని ఔట్ పేషెంట్ చికిత్స చేసి పంపించి వేశారు. 14 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చి చికిత్స అందించారు. కాగా వీరిలో ఇద్దరికి శాశ్వతంగా ఒకరికి కంటి చూపు రాదని డాక్టర్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి గేటు ఎదుట టపాకాయలు కాలుస్తుండటం చూస్తున్న వనస్థలిపురానికి చెందిన కృష్ణమాచారికి ఒక టపాకాయ వచ్చి కుడి కన్నుకు తాకింది. అదే విధంగా లాలాపేటలో రిషికేష్ (14)కి టపాకాయలు ముఖం మీద పడ్డాయి. ఇందులో రిషికేష్ ముఖానికి తీవ్ర గాయలయ్యాయి. బుధవారం రాత్రి ఇరుగుపొరుగువారి కాల్చిన టపాసుల్లో పేలనివాటిని మాదన్నపేట్కు చెందిన సమీర్ఖాన్ గురువారం ఉదయం వాటిని కాలుస్తుండగా అవి ఒకేసారి పేలి కంట్లో పడ్డాయి. కాగా ఈ సంఘటనలో మదర్సా విద్యార్థి అయిన సమీర్ పాషా (9) కనురెప్పలు పూర్తిగా కాలిపోగా ఎడమ కన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి కోరంటికి చెందిన మైసమ్మ (60) ఆటోలో గోల్నాక నుంచి శ్రీరామ్నగర్కు వెళ్తుండగా అదే సమయంలో ఆటోలో రాకెట్ వచ్చి ఆమె కంటిపై పడింది. కనుగుడ్డుకు తీవ్ర గాయమై రక్త స్రావం కావడంతో ఆమెను సరోజిని ఆస్పత్రికి తరలించారు. మైసమ్మ పరిస్థితి విషమంగా ఉందని, కంటి చూపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అంబర్పేట్కు చెందిన 6వ తరగతి విద్యార్థి చరణ్ (11) టపాకాయలు కాలుస్తుండగా అవి పేలి ముఖంపై పడ్డాయి. దీంతో చరణ్ రెండు కళ్లకు గాయాలయ్యాయి. శంషాబాద్కు చెందిన కిరాణ షాపు వ్యాపారి రాజు గౌడ్ (38) తన కిరాణ షాపులో కూర్చుండి రోడ్డుపై దీపావళి వేడుకలను చూస్తున్నాడు. అదే సమయంలో ఓ రాకెట్ వచ్చి అతని ముఖానికి తాకింది. ఈ సంఘటనలో రాజు కళ్లకు గాయాలయ్యాయి. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ (28)రోడ్డుపై నిలబడి పిల్లలు టపాకాయలు కాలుస్తున్న దృశ్యాలను చూస్తుండగా ఓ టపాసు పేలి ఆయన కుడి కన్నుపై పడింది. దీంతో శ్రీనివాస్ కంటికి, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతంమెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటిఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
కన్నుల్లో నీ వ్యక్తిత్వమే..
మెల్బోర్న్: ప్రేమ, ద్వేషం, కోపం, ఈర్ష్య, సిగ్గు ఇలా మన కళ్లు అనేక భావాలను అందంగా పలికించగలవు. అందుకేనేమో.. గుండెల్లో ఏముం దో కళ్లలో తెలుస్తుంది.. అంటాడు ఓ సినీ గేయ కవి. నయనాలు.. నవరసాలను మాత్రమే కాదు మనిషి వ్యక్తిత్వాన్ని కూడా తెలుపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కళ్లను చదివి.. ఓ మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే కొత్త తరహా కృత్రిమ మేధస్సును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నూతన సాంకేతిక కళ్ల కదలికలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుందని అంటున్నారు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ స్టుట్గార్ట్, ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ వర్సిటీకి చెందిన పరిశోధకులు స్టేట్ ఆఫ్ ఆర్ట్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ను ఉపయో గించి కళ్ల కదలికలు, వ్యక్తిత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు ఈ అధ్యయనా న్ని చేపట్టారు. దీనిలో భాగంగా 42 మంది వ్యక్తు లను ఎంపిక చేసుకుని నిర్దిష్టమైన ప్రశ్నలతో పాటు రోజువారీ పనుల్లో వారి కళ్ల కదలికలను నమోదు చేసుకున్నారు. ముఖ్యమైన 5 వ్యక్తిత్వ లక్షణాల్లో 4 లక్షణాలను కచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ గుర్తించిందని తెలిపారు. -
నీటి కాసులకు కర్కుమిన్ చికిత్స!
కళ్లకు వచ్చే జబ్బు నీటి కాసులకు సరికొత్త, మెరుగైన చికిత్సను అందుబాటులోకి తెచ్చారు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు. పసుపులోని కర్కుమిన్ రసాయనాన్ని ద్రవ రూపంలో అందిస్తే నీటి కాసులకు మెరుగైన చికిత్స చేయవచ్చునని వీరు అంటున్నారు. ఇప్పటివరకూ కర్కుమిన్ను మాత్రల రూపంలో నోటి ద్వారా తీసుకుంటున్నారు. అయితే కర్కుమిన్ అంత సులువుగా రక్తంలో కలిసిపోదని.. దీంతో చాలా ఎక్కువ మోతాదులో మాత్రలు మింగవలసి వస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. ఈ నేపథ్యం లో తాము 24 కర్కుమిన్ మాత్రల స్థానంలో కంటిలోకి కొన్ని కర్కుమిన్తో కూడిన చుక్కలు వేయడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చునని నిరూపించామని ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కా కోర్డిరో తెలిపారు. పెద్ద ఎత్తున మాత్రలు మింగడం వల్ల వచ్చే జీర్ణసంబంధిత సమస్యలను కూడా రాకుండా చేసుకోవచ్చునని చెప్పారు. ద్రవరూప కర్కుమిన్, మాత్రల కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రభావవంతమైందని, ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా తాము ఈ విషయాన్ని రూఢి చేసుకున్నామని అన్నారు. ద్రవరూప కర్కుమిన్ కళ్లలోకి వేసిన ఎలుకల్లో కణాల నష్టం గణనీయంగా తక్కువ ఉందని, పైగా దుష్ప్రభావాలు కూడా ఏమీ కనిపించలేదని వివరించారు. -
ముస్లింలు కళ్లకు ‘సుర్మా’ ఎందుకు పెడతారు?
సాక్షి, సిటీబ్యూరో : రంజాన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా సుర్మా వాడతారు. కాటుకలా కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో నల్లగా ఉంటుంది. ఇది కళ్లకు కొత్త అందాన్ని తీసుకొస్తుంది. కంటికి తేజస్సును ఇవ్వడంతో పాటు చలువదనాన్ని అందజేస్తుంది. అందుకే ఈ మాసంలో ఎక్కువగా సుర్మాను వినియోగిస్తారు. ప్రవక్త మూసా తొలిసారి దీనిని వాడారు. అరబ్ దేశంలోని మరాఖిష్ ప్రాంతంలోని కోహితూర్ పర్వతం భస్మం కావడంతో భూమి నల్లగా మారిందని, అక్కడికెళ్లిన ప్రవక్త మూసా ఆ నల్లటి పౌడర్ను కళ్లకు పెట్టుకున్నారని మత పెద్దలు చెబుతారు. తర్వాత మహ్మద్ ప్రవక్త కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. రంజాన్ మాసంలో ప్రతిరోజు రెండు కళ్లకు సుర్మా పెట్టుకుంటారు. ఇలా తయారీ... నల్లని రాళ్లను పగులగొట్టి, పౌడర్గా మారుస్తారు. దీనికి గులాబీ నీరు కలిపి సుర్మా తయారు చేస్తారు. పాతబస్తీకి చెందిన సయ్యది సుర్మాకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అతికొద్ది మంది మాత్రమే ఇప్పుడీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాతముత్తాతల కాలం నుంచి తాము ఈ వ్యాపారం కొనసాగిస్తున్నామని చెప్పారు పత్తర్గట్టీలోని సయ్యది సుర్మా వ్యాపారి సయ్యద్ జహీరుద్దీన్ ఖాద్రీ. -
డబ్బు కట్టలేదని అవయవాల దోపిడీ
టీ.నగర్ (చెన్నై): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతని చికిత్సకైన ఖర్చును కుటుంబ సభ్యులు చెల్లించలేక పోవడంతో సదరు ఆసుపత్రి ఆ యువకుడి శరీరం నుంచి అవయవాలను కాజేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం పట్టణంలో చోటుచేసుకుంది. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని మీనాక్షిపురం అనే గ్రామం తమిళనాడు సరిహద్దుల్లో, పొల్లాచ్చికి సమీపంలో ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన మణికంఠన్ అనే యువకుడు (24) రోడ్డు ప్రమాదంలో ఇటీవల తీవ్రంగా గాయపడగా సేలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చనిపోయే సమయానికి మణికంఠన్ చికిత్సకు రూ. 3 లక్షలు ఖర్చవ్వగా, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్సుకు మరో రూ. 25 వేలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం మణికంఠన్ కుటుంబీకులను కోరింది. ఆ డబ్బును తాము కట్టలేమని వారు చెప్పడంతో కుటుంబ సభ్యులను మోసం చేసి కొన్ని పత్రాలపై ఆసుపత్రి యాజమాన్యం సంతకాలు చేయించుకుంది. అనంతరం మణికంఠన్ మృతదేహం నుంచి మూత్రపిండాలు, కళ్లు తదితర అవయవాలను తీసుకుంది. `ఈ విషయాన్ని ఇంటికెళ్లాక గుర్తించిన మణికంఠన్ కుటుంబీకులు వెంటనే పాలక్కాడ్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విషయం సీఎం పినరయి విజయన్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తమిళనాడు సీఎం పళనిస్వామికి లేఖ రాస్తూ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అధికారులు విచారణ జరిపి నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించారు. కాగా, ఇదే ప్రమాదంలో గాయపడి, బ్రెయిన్డెడ్ అయిన మణికంఠన్ అనే మరో యువకుడి నుంచి కూడా ఇదే ఆసుపత్రి వైద్యులు అవయవాలు కాజేసేందుకు ప్రయత్నించారని సమాచారం. -
షాకింగ్; దేవత కోసం కళ్లు పీకేసుకున్న బాలిక
పట్నా: దుర్గామాత భక్తురాలైన ఓ బాలిక తన రెండు కళ్లను పెకిలిచి దేవతకు అర్పించింది. అందరినీ షాక్కు గురిచేసిన ఈ ఘటన బిహార్లోని దర్భాంగ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దర్భాంగ జిల్లా బహేరీ బ్లాక్ సిరువా గ్రామంలోని దుర్గామాత ఆలయంలో చైత్ర నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కోమల్ కుమారి అనే బాలిక ప్రతిరోజూ గుడికి వచ్చి పూజలు చేసేది. ఏడోరోజైన ఆదివారం అమ్మవారికి పూజలు జరుగున్న సమయంలో.. కుమారి తన రెండు కళ్లను బలవంతంగా పెకిలించుకుని దేవతకు అర్పించేయత్నం చేసింది. కళ్లవెంట ధారలా కారుతోన్న నెత్తురు చూసి అర్చకుడు సహా అందరూ స్థాణువైపోయారు. వెంటనే తేరుకుని సమీపంలోని ఆస్పత్రికి ఆమెను తరలించారు. అత్యవసర చికిత్స నిమిత్తం అక్కడి నుంచి దర్భాంగ జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. దుర్గామాత చెప్పిందనే..: పదో తరగతి పరీక్షల్లో ఫెయిలై, ఇంటివద్దే ఉంటోన్న కోమల్ కుమారి.. గత కొద్ది రోజులుగా విచిత్రంగా మాట్లాడినట్లు తెలిసింది. దుర్గామాత కలలోకి వచ్చేదని, ఏదో ఒక అవయవాన్ని అర్పించమనేదని కుమారి తన స్నేహితురాళ్లతో చెప్పుకునేది. ‘‘ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స అందిస్తున్నాం. బాలిక ఆరోగ్యంపై ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం’’అని దర్భాంగ జిల్లా వైద్యాధికారి సంతోశ మిశ్రా అన్నారు. ఇది మూర్ఖత్వం.. మానసిక రుగ్మత: తాను పనిచేసే ఆలయంలో ఊహించని సంఘటనపై అర్చకుడు భవ్నాథ్ ఝా స్పందించారు. ‘నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఇవాళ కంటి ఆకారంలో ఉండే బెల్ పండ్ల గింజలను సమర్పిస్తాం. కానీ ఈ అమ్మాయి(కోమల్) నిజం కళ్లనే పెకిలించుకోవడం ముమ్మాటికీ మూర్ఖత్వమే. ఏ దేవతా భక్తులను కళ్లు, ఇతర అవయవాలు ఇవ్వమని కోరదు’ అని ఝా అన్నారు. ‘‘బాలిక తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతోంది. మూఢనమ్మకాలకు సంబంధించి ఇది తీవ్రమైన కేసు’’ అని పట్నాకు చెందిన మానసిక వైద్యుడొకరు తెలిపారు. -
ముందు‘చూపు’తో రక్షించుకుందాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. తెలిసోతెలియకో కొంతమంది కంటి వ్యాధుల బారిన పడటంతో జీవితం అంధకారమయం అవుతోంది. ఈ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా గ్లకోమాను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటికాసులు, నల్లముత్యంగా వ్యవహరించే ఈ వ్యాధి తెలియకుండానే కళ్లపై దాడి చేస్తోంది. కంటి చూపును శాశ్వతంగా దూరం చేసి చీకటిమయం చేసేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల మంది, భారతదేశంలో 1.2కోట్ల మంది కంటే ఎక్కువగా గ్లకోమా కారణంగా చూపును కోల్పోతున్నారు. అంటే జనాభాలో ఒక శాతం దీని బారిన పడుతున్నారంటే ఈ వ్యాధి ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలోనే ముందుచూపుతో వ్యవహరించి దీనిని గుర్తిస్తే నివారించడం సాధ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని తేలింది. గ్లకోమాపై ప్రజల్లో అవగాహన కల్పించి ఆదిలోనే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా మార్చి 11 నుంచి 17 వరకు ‘ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కంటి పరీక్షలు, వ్యాధి నివారణకు సూచనలు, మందులు అందజేస్తారు. అవరసమైతే శస్త్ర చికిత్సలు చేస్తారు. గ్లకోమా అంటే.. అంధత్వానికి కారణమయ్యే వ్యాధుల్లో గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) ప్రమాదకరమైంది. కంటి ముందు భాగం అక్వయిస్ హ్యూమర్ అనే ఒక ద్రవంతో నిండి ఉంటుం ది. అది నిత్యం ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో కొత్త ద్రవం ఉత్పత్తి అయిన కొద్దీ పాత ద్రవం బయటకు వెళుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ ద్రవం బయటకు వెళ్లే మార్గంలో అడ్డుంకులు ఏర్పడతాయి. అప్పు డు కంటిలో ఒత్తిడి పెరిగి ప్రధాన నాడి దెబ్బతింటుంది. పక్కచూపు నుంచి మొదలై క్రమంగా చూపు మందగిస్తుంది. దీని ఫలితంగా పూర్తిగా చూపుపోయే ప్రమాదం కలుగుతుంది. లక్షణాలు ♦ ప్రారంభ దశలో ఎటువంటి లక్షాలు కనిపించవు. గ్లకోమా బారిన పడిన వారిలో 50 శాతానికి పైగా తమకు వ్యాధి వచ్చినట్టు తెలియదు. ఈ దశలో గుర్తించగలిగితే సరైన చికిత్సతో చూపు కాపాడవచ్చు. ఎలా గుర్తిస్తారు ♦ కంటిలోని నీటి ఒత్తిడిని టోనోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. గోనియోస్కోపి(నీటి సరఫరా మార్గం పరీక్ష) ద్వారా తెలుసుకుంటారు. ఇందులో కంటి ప్రధాన నాడిని పరీక్షిస్తారు. దృష్టి లోపాలను గుర్తించేందుకు విజువల్ ఫీల్డ్ టెస్ట్ చేస్తారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించేందుకు ఓసీటీ, జీడీఎక్స్ అనే అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గ్లకోమాను కనుగొనడానికి కంటి వైద్యులచే పూర్తి పరీక్ష చేయించుకోవడం ఒక ఉత్తమ మార్గం. సంపూర్ణ కంటి పరీక్షలో ఐఓపీ కొలత, కంటి డ్రైనేజీ యాంగిల్ ఆప్టిక్ నరాన్ని పరిశీలిస్తారు. అదనంగా విజువల్ ఫీల్డ్ పరీక్షల ద్వారా కంటి చూపు ఫెరిఫెరీని పరిశీలిస్తారు. ఎన్ని రకాలు ♦ ప్రైమరీ, సెకండరీ (కంటి గాయల వలన, ఇతర మందుల వాడకం వల్ల), కంజెనిటర్ గ్లకోమా (పుట్టుకతో సంక్రమించేది) అనే రకాలు ఉన్నాయి. పరీక్ష ఎవరు చేయించుకోవాలి ♦ 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ, దీర్ఘకాలం నుంచి ఏదో ఒక రూపంలో స్టెరాయిడ్ మందులు వాడినవారు, మధుమేహ వ్యాధి గ్రస్తులు, కంటికి గాయాలైనవారు, కుటుంబంలో పెద్దలు ఎవరికైనా గ్లకోమా ఉంటే వారి పిల్లలు, అతిమూత్ర (మధుమేహ) వ్యాధి ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలి. చిక్సిత విధానాలు గ్లకోమాను పూర్తిగా నయం చేయలేం. పోయిన చూపును తీసుకురావడం సాధ్యపడదు. కానీ సరైన చికిత్స తీసుకో వడం వల్ల మిగిలి ఉన్న చూపు దెబ్బతినకుండా కాపాడవ చ్చు. కంటి చుక్కల మందులు వేయడం వల్ల ద్రవఉత్పత్తి నియంత్రించవచ్చు. ఇవి జీవితాంతం వాడాలి. కొన్ని రకా ల గ్లకోమాలకు లేజర్ ఉపయోగపడుతుంది. మందులు గానీ, లేజర్ గానీ గ్లకోమాను నియంత్రించలేకపోతే శస్త్ర చికిత్స చేయించుకోవాలి. ఆధునిక చికిత్సలైన ట్రేబెక్యులేక్టమీ, స్టంట్ సర్జరీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నేత్రాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో ఉన్న భాగాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవి, వీటిని సురక్షితంగా కాపాడుకోవాలి. జిల్లాలో ఏడు విజన్ సెంటర్లలో రణస్థలం, రాజాం, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస, నరసన్నపేటలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సీఎం ఈఐ స్టెంట్లు పేరిట గ్లకోమాపై పరీక్షలు చేస్తున్నాం. రిమ్స్లో వైద్యం అందుబాటులో ఉంది. నేత్రాలకు సంబంధించి సమస్య చిన్నదైనా, పెద్దదైనా కంటి వైద్య నిపుణులను సంప్రదించాలి. శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగానే చేస్తున్నారు. – డాక్టర్ ఎస్ తిరుపతిరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, శ్రీకాకుళం -
అడిగితే చాలదా!
ఇంటిని ఆఫీస్కి తెచ్చేయడంపై మగవాళ్లకేవో అభ్యంతరాలు ఉంటాయి. ఆఫీస్ గాంభీర్యం తగ్గుతుందని, ఆడపిల్లల సన్నటి గొంతులు విని కుర్చీలు, బల్లలు మాట వినకుండా నెత్తికెక్కి కూర్చుంటాయని! ఇది కరెక్ట్ కాదు. ఆడవాళ్లు అంతటా ఉండాలి. ప్రతి అనుకూలతలో, ప్రతి ప్రతికూలతలో... మగవాళ్లు ఉన్నట్లే ఆడవాళ్లూ ఉండాలి. ఉత్సాహంగా మేం చేస్తాం అని ముందుకు వచ్చినప్పుడు ‘మీరా! ఇక్కడా!!’ అంటూ నిరుత్సాహపరచడంలో బైటపడేది మహిళల బలహీనతకాదు, ఆధిక్య భావనలలోని దౌర్బల్యం. ఉమన్ రిపోర్టర్ల ప్రెస్ కాన్ఫరెన్సులు అమెరికా అధ్యక్ష భవనానికి కొత్త! ‘‘ఇక్కడ ఇంతవరకు ఇలాంటివి జరగలేదు మిసెస్ రూజ్వెల్ట్’’ అన్నారు వైట్హౌస్ ప్రతినిధులు. ‘‘కానీ నాకు వాళ్లతో తరచు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది’’ అన్నాను. న్యూయార్క్ వార్తాపత్రికల్లో పనిచేస్తున్న ఉమన్ రిపోర్టర్లకు ఆహ్వానాలు వెళ్లాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైంది. ఎంత కాంతి ఈ అమ్మాయిల కళ్లలో! ఎంత కాన్ఫిడెన్స్! ఎన్ని ఆలోచనలు! చెప్పింది రాసుకోవడంలో వాళ్లకెలాంటి ఆసక్తీ లేదు. ఉన్నచోట ఉండిపోవడంలో వాళ్లకెలాంటి సంతృప్తీ లేదు. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. వైట్హౌస్ అంతా కలియతిరుగుతున్నారు. స్త్రీల సంరక్షణ బాధ్యతల్లో ఒక అగ్రరాజ్యం ప్రపంచ దేశాలకు ఎలా ఆదర్శప్రాయంగా ఉండాలనే విషయమై వారందరికీ స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ‘‘వైట్ హౌస్లో మా ఫస్ట్ కాన్ఫరెన్స్ ఇంత హోమ్లీగా ఉంటుందనుకోలేదు’’ అందొక అమ్మాయి. ‘‘మేమ్, నాకైతే వెళ్లాలని లేదు. కానీ మా న్యూయార్క్ ఆఫీస్లో మీ ప్రెస్ కాన్ఫరెన్స్ విశేషాలను వెంటనే రిపోర్ట్ చెయ్యాలి. వైట్ హౌస్ పైన ఉన్న గదుల్ని చూడాలని ఉంది నాకు’’ అంది. నవ్వొచ్చింది నాకు. ‘‘రేపు మీరంతా ఇక్కడికి లంచ్కి వస్తున్నారు. తక్కిన న్యూస్పేపర్ గాళ్స్ని కూడా మీ వెంట తీసుకురండి. అందరం కలిసే పైన ఉన్న గదులన్నీ చూద్దాం’’ అన్నాను. ‘‘కానీ మిసెస్ రూజ్వెల్ట్... అక్కడికెవ్వరినీ అధ్యక్ష భవనం అనుమతించదు’’ అన్నారు మల్వీనా «థామ్సన్. ఆవిడ నా కార్యదర్శి. ‘‘ఇది నా ఇల్లు కాదు మల్వీనా. ప్రజాభవనం. వారి భవనాన్ని వారు సందర్శించాలనుకుంటున్నారు. వారికా హక్కు ఉంది’’ అన్నాను. అసలు హక్కుల వరకూ ఎందుకు? ఆడపిల్లలు నోరు తెరిచి అడిగినప్పుడు ఏ అనుమతి విధానాల ఉల్లంఘనైనా చట్టబద్ధం కాకుండా పోతుందా?! (అమెరికా 32వ అధ్యక్షుడు రూజ్వెల్ట్ సతీమణి ఎలినార్ రూజ్వెల్ట్ çస్వగతాలలోంచి చిన్న భాగం) -
కంప్యూటర్ చూస్తుంటే కళ్లు పొడిగా అవుతున్నాయి...
నా వయసు 39 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఎప్పుడూ కంప్యూటర్పై వర్క్ చేస్తుంటాను. ఈమధ్య కళ్లు విపరీతంగా పొడిగా అనిపిస్తున్నాయి. అప్పుడు నీళ్లతో కళ్లు కడుక్కుంటున్నాను. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – సంపత్కుమార్, హైదరాబాద్ కంప్యూటర్పై ఎప్పుడూ కనురెప్పలను ఆర్పకుండా ఏకాగ్రతతో చూసేవారికి కన్నుపొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం, కంటికి వచ్చే మెబోమియన్ ఇన్ఫెక్షన్ వంటివి కారణాలు కావచ్చు. వైద్యపరిభాషలో మీ సమస్యను ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’ అంటారు. ఇందులో కంటిలోని కార్నియా, కంజంక్టివా పొరలు పొడిబారిపోతాయి. దీన్నే ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఈ సమస్య నివారణ కోసం చేయాల్సినవి... ►కంటి రెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా చూస్తూ ఉండకూడదు ∙కంప్యూటర్పై పనిచేస్తున్న గదిలో తగినంత తేమ (హ్యుమిడిటీ) ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇందుకోసం రూమ్లో హ్యుమిడిఫైయర్ ఉంచుకోవాలి ∙మీ పనిలో మధ్యమధ్య కంటికి కాస్త విశ్రాంతినివ్వండి మీరు కంప్యూటర్ మీద చదువుతున్నప్పుడు స్క్రీన్ మీకు నేరుగా ఉండాలి. స్క్రీన్ను వాలుగా ఉంచి చదవవద్దు. మీరు స్క్రీన్పై చూడాల్సి ఉన్నప్పుడు స్క్రీన్కూ, దాని బ్యాక్డ్రాప్కూ ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా చూసుకోండి మీరు టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. ఎప్పుడూ చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్నే తదేకంగా చూడవద్దు. మధ్యమధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ స్వాభావికమైన సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏసీ ఇంటెన్సిటీని మరీ ఎక్కువగా పెంచుకోవద్దు. ఇది కళ్లు మరీ పొడిబారడానికి దారితీస్తుంది. డాక్టర్ను సంప్రదించి ఆర్టిఫిషియల్ టియర్స్ వాడాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ కొంతవరకు మీకు ఉపయోగపడతాయి ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడును కాసేపు తీయండి ∙ఒత్తిడిని తగ్గించుకోండి. యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ను అవలంబించండి ∙కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్లు తుడుచుకోవద్దు ∙మీ కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడుక్కోడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్ లేకుండా చూసుకోండి ∙పొగతాగే అలవాటు తక్షణం మానివేయండి. కార్నియా చుట్టూ తెల్ల అంచు ఏమిటిది? నా వయస్సు 18 ఏళ్లు. రెండేళ్ల కిందట నాకు రెండు కళ్లలోనూ కార్నియా (నల్లగుడ్డు) చుట్టూ అంచున తెల్ల చారలా కనిపిస్తోంది. కళ్ల డాక్టర్గారికి చూపించాను. ‘డస్ట్ అలర్జీ’ అని ఐ డ్రాప్స్ రాసి ఇచ్చారు. అవి వేసుకున్న కొన్ని నెలలకు తగ్గినట్లే తగ్గి వుళ్లీ ఎప్పటిలాగే వస్తోంది. ఎన్నోచోట్ల చూపించాను. కానీ ఇది వూత్రం తగ్గడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. – నవీన, గూడూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే ఇది ‘వీకేసీ’ (వెర్నల్ కెరటో కంజంక్టివైటిస్) అనే అలర్జీతో వచ్చిన సవుస్య అని తెలుస్తోంది. బయటి కాలుష్యానికీ, పుప్పొడికీ, దువు్మూ ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ‘హైపర్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లకు ఇలాంటి సవుస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే కాలుష్యాలకు దూరంగా ఉండాలి. ప్లెయిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడితే చాలావుటుకు కళ్లకు రక్షణ ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల వుందు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఇందులో స్టెరాయిడల్, నాన్ స్టెరాయిడల్ (స్టెరాయిడ్ లేనివి) అనే రెండు మందులు ఉంటాయి. స్టెరాయిడ్ మాత్రం దీర్ఘకాలం వాడకూడదు. దీనితో చాలా దుష్పరిణామాలు ఉంటాయి. నాన్స్టెరాయిడ్ (స్టెరాయిడ్ లేనివి) మాత్రం చాలా కాలం వరకు వాడవచ్చు. దీనితో తప్పకుండా అలర్జీ నియంత్రణలోకి వస్తుంది. ఈ సవుస్యను దీర్ఘకాలం ఇలాగే వదిలేస్తే చూపు వుందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సవుస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా డాక్టర్కు చూపించుకొని, వుందులు వాడండి. ఇప్పుడు ఈ సమస్యకు వుంచి వుందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ సవుస్య గురించి మీరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు. కళ్లకూ వ్యాయామాలు ఉన్నాయా? దేహంలో అన్ని అవయవాలకు బలం చేకూర్చడానికి ప్రత్యేకమైన వ్యాయామాలు ఉన్నట్లే కళ్లకూ ఉంటాయా? – సుధీర్, గుంటూరు ఆరోగ్యంగా ఉండటం కోసం సాధారణంగా అందరూ చేసే వ్యాయామాలే కంటికి కూడా మేలు చేస్తాయి. అయితే మీకు ఏవైనా కంటి సమస్యలు అంటే ఉదాహరణకు మెల్లకన్ను గానీ, లేదా లేజీఐ అంటే ఒక కంటిలో చూపు మందగించడం వంటి సమస్య ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి. అవి ఈ సమస్యలు ఉన్నవారి చూపు మెరుగుదలకు చాలా తోడ్పడతాయి. అయితే అందరూ చేసుకోడానికి మాత్రం కంటి ఉపశమనం కోసం తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడే కొన్ని వ్యాయామాలూ ఉంటాయి. అవి... కంటిపై ఉన్న భారాన్ని తాత్కాలికంగా తొలగించి, కొద్దిపాటి ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. వీటి ద్వారా అప్పటికప్పుడు కనిపించే ప్రయోజనమే తప్ప దీర్ఘకాలిక లాభం ఉండదు. అవి... ∙తదేకంగా చూడకుండా కంటిని తరచూ అటు ఇటు కదలిస్తూ ఉండటం ∙రెండుకళ్లనూ అరచేతులతో మూసుకొని కళ్లకు తాత్కాలిక విశ్రాంతి ఇచ్చి, కొంతసేపు ఉపశమనం కలిగించడం (దీన్ని పామింగ్ అంటారు) ∙బ్లింకింగ్ (రెండు రెప్పలనూ ఠక్కున కొడుతూ ఉండటం, ఈ ప్రక్రియలో కారు అద్దాలపై నీరు చిమ్మి వైపర్స్తో శుభ్రం చేసినట్లుగానే, కంటిలోని నీటి (లాక్రిమల్ సెక్రిషన్స్) సహాయం వల్ల బ్లింకింగ్ చేసినప్పుడల్లా కన్ను శుభ్రమవుతుంది ∙యానింగ్ (ఆవలించడం – మనం ఆవలించినప్పుడు ఒక్కోసారి కంటిలో కొద్దిగా నీళ్లు రావడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ కన్నీరు (లాక్రిమల్ సెక్రిషన్) కంటిలోని పొడిదనాన్ని తొలగించి, కన్నును తేమగా ఉండేలా చేస్తుంది. కళ్లు అలసిపోయి భారంగా ఉన్నప్పుడు ఈ వ్యాయామాలు చేసి, తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు. డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
అందమైన ఆరోగ్యమైన కళ్ల కోసం...
ఎండకు అలసిన కళ్లకు సాంత్వన కలగాలంటే. టొమాటోరసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని కంటి చుట్టూ పట్టించి అరగంట తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. కళ్ల చుట్టూ నల్లని వలయాలుంటే కోడిగుడ్డులోని తెల్లసొన పట్టించి అరగంట తర్వాత కడగాలి. కొబ్బరి నూనెతో మృదువుగా మర్దన చేసినా కూడా... కళ్ల చుట్టూ నలుపు వదులుతుంది. -
కొంచెం చూస్కోండి!
కన్ను ఎప్పుడూ కాలుష్యాన్ని నేరుగా తాకుతూ ఉంటుంది. వాయు కాలుష్య సముద్రంలో ఈదుతూ ఉంటుంది. మిగతా నాలుగు జ్ఞానేంద్రియాలను చూడండి. చెవి ఎక్కడో పుర్రె లోపల సురక్షితంగా ఉంటుంది. చెవి తమ్మె (ఎక్స్టర్నల్ ఇయర్ పిన్నా) మాత్రమే బయట ఉంటుంది. అలాగే ముక్కులోని వాసన చూసే యంత్రాంగమూ లోపలెక్కడో ఉంటుంది. ఇక నాలుక నోటిలోపల సురక్షితంగా ఉంటుంది. చర్మం విషయానికి వస్తే... అది నేరుగా కాలుష్యంతో అంటుకునే ఉన్నా, స్పర్శజ్ఞానాన్ని మినహాయిస్తే... లోపలి అవయవాలన్నింటికీ రక్షణ కల్పించడమే దాని ప్రధాన బాధ్యత. కంటికి రక్షణగా కనురెప్పలు ఉన్నప్పటికీ వాటిని దాటుకొని కాలుష్యం కంటికి చేరుతుంటుంది. తన చూసే బాధ్యతలను నెరవేర్చడానికి కన్ను అనుక్షణం వాతావరణంలోని కాలుష్యానికి గురవుతూనే ఉంటుంది. ఇలా నేరుగా కాలుష్యం తాకుతూ ఉండటం వల్ల కన్నుకు జరిగే నష్టాలు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం. మన కళ్లకు చాలా కనిపించవు. అవి దాక్కుని దాక్కుని కళ్లపై దాడి చేస్తాయి. మిట్టమధ్యాహ్నం కూడా మసక ఘాతాలు కురిపిస్తాయి. చెవులు చేతులతో మూసుకుపోగలవు – ముక్కులు.. చేతుల్ని అడ్డుపెట్టుకోగలవు. గొంతులు కేకలు పెట్టగలవు. కానీ పాపం కళ్లే... కంటిపాపలకు కూడా తెలియకుండా పొగ, ధూళి, దుమ్ము, మెరుపుకాంతీ... ఇవన్నీ బల్లేలై కళ్లను గుచ్చేవే! కొంచెం చూస్కోండి... కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకోండి. గాలిలోని కాలుష్యాలకు కారణమయ్యేవివే... గాలి కనబడదు... దానిలోని కాలుష్యాలూ కనబడవు. మన కన్ను నేరుగా గాలిలోకి తెరచుకొని ఉన్నప్పుడు దాన్ని నిత్యం తాకుతూ ఉండే కాలుష్యభూతాలేమిటో కూడా మనకుతెలియదు. అయినా వాటిని తట్టుకుంటూ కన్ను తన పని తాను చేస్తూ ఉంటుంది. కన్నును ఆవరించి ఉండే ఆ వాయుకాలుష్య సముద్రానికి కారణాలు చాలా ఎక్కువే. పట్టణ (అర్బన్)ప్రాంతాల్లో పరిశ్రమలు ఉండటం, వాహనాలు ఎక్కువగా తిరుగుతుండటం, ఎయిర్ కండిషన్స్ పనిచేస్తుండటం, ఇతరత్రా ఎలక్ట్రిక్ ఉపకరణాల నుంచి వచ్చే కాలుష్యాలూ గాలిలోకి చేరడంతో అవన్నీ కంటికి నేరుగా తాకుతుంటాయి. పట్టణ ప్రాంతపు వాయు కాలుష్యాలివి... వాయుకాలుష్యంలో అన్నింటికంటే చాలా ప్రమాదకరమైనది కార్బన్ మోనాక్సైడ్. ఇది వాహనాల ఇంధనం మండటం వల్ల వెలువడే కాలుష్యం. ఇది కంటిని తాకినప్పుడు కళ్లు మండుతుంటాయి. వాహనాల నుంచే కాదు... ఎయిర్కండిషన్లు, హీటర్ల నుంచి కూడా ఈ వాయువు వెలువడుతుంది. కాకపోతే పైన పేర్కొన్న వాటి నుంచి వెలువడే శాతం వాహనాల నుంచి వెలువడే శాతం కంటే తక్కువ. గాలిలో కంటికి ప్రమాదకరంగా పరిణమించే వాటిలో నైట్రోజన్ ఆక్సైడ్ మరో ముఖ్యమైన వాయువు. ఇది ఫ్యాక్టరీల నుంచి వెలువడుతుంది. ఇది గాలిలోని నీటి అణువులతో కూడినప్పుడు యాసిడ్గా మారుతుంది. అందువల్ల అలర్జిక్ రియాక్షన్కు కారణమై ఒక్కోసారి కళ్లకలక (కంజంక్టవైటిస్)కు దారితీయవచ్చు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యాలలో మరో ముఖ్యమైనది సల్ఫర్ డయాక్సైడ్. ఇది కళ్లను మంట పుట్టించడంతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా మంట కలిగిస్తుంది. ఇవిగాక... ఏరోసాల్స్, ఆర్సినిక్, బెంజీన్, లెడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు (ఇవి ఫ్రిజ్లనుంచి వెలువడుతుంటాయి), పెట్రోల్ మండించినప్పుడు వెలువడే కార్బన్ వ్యర్థాలు, చెట్ల నుంచి గాలిలోకి వెలువడే కంటికి కనపడనంత సూక్ష్మంగా ఉండే పుప్పొడి రేణువులు, మనం పొగతాగి వదిలినప్పుడు వెలువడే పొగాకు కాలుష్యాలు, గాలిలో వేలాడుతూ ఉండే ధూళి కణాలు (సస్పెండెడ్ ఎయిర్ పార్టికిల్స్)... వీటన్నింటినీ మనకు తెలియకుండానే కన్ను భరిస్తూ ఉంటుంది. బయట సరే... ఇంట్లోనూ! నీటిఆవిరి : ఇంట్లో ఉన్నప్పుడు మన శ్వాసతో పాటు, మన వంటావార్పూ, నీరు వెచ్చబెట్టుకునే చాలా ప్రక్రియల్లో ఇది వెలువడుతుంది. ఏరోసాల్స్ : మన ఇంట్లోని ఉపకరణాలపై వేసిన రంగులు, గోడలకు వేసిన వార్నిష్, పెయింట్స్ వంటి వాటి నుంచి వెలువడుతుంది. అలర్జెన్స్ : మనం తల ఆనించే తలగడ (పిల్లో)లోనూ డస్ట్ మైట్స్ అనే సూక్ష్మ క్రిములు కోట్లలో ఉంటాయి. ఇక... ఇంట్లోకి వచ్చే గాలితో పాటు ప్రవేశించే పుప్పొడి, స్పోరులు కంటిని తాకుతుంటాయి. అమోనియా : ఇంట్లోని కొన్ని ఉత్పాదనల్లో ఇది ఉంటుంది. ప్రత్యేకంగా ఇంటిని శుభ్రపరిచే చాలా రసాయనాల్లో అమోనియా ఉండటం వల్ల ఒక్కోసారి శుభ్రపరిచే సువాసన అలా వెలువడి ముక్కును తాకుతుండగానే... మరో పక్క ఈ రసాయనం కారణంగా కళ్లూ మండుతుంటాయి. ఫార్మాల్డిహైడ్ : మన ఆఫీస్లలో ఉండే పార్టికిల్ బోర్డ్స్, కరెంట్ వైర్ల నుంచి వచ్చే వాసనల నుంచి, పొగాకు వాసనల నుంచి ఇది వెలువడుతుంటుంది. మెర్క్యూరీ (పాదరసం) : ఫ్యాక్టరీల నుంచి, మన వాహనాల నుంచి వెలువడే పొగనుంచి. పెయింట్స్ : ఇంట్లో పెయింట్ వేసిన కొత్తలో కళ్లు మండుతుండటాన్ని మనం గమనించవచ్చు. దీనికి కారణం వాటిల్లో ఉండే లెడ్. స్ప్రేలు / సుగంధ ద్రవ్యాలు/కాస్మెటిక్స్ : ఇంట్లో సెంట్ స్ప్రే చేసుకున్నప్పుడు కళ్లు కాస్త మండటాన్ని చాలాసార్లు గమనించవచ్చు. ఇక కొన్ని సౌందర్యసాధనాలు (కాస్మెటిక్స్) సైతం కంటికి హాని చేస్తాయి. పల్లెల్లోని వాయు–కాలుష్యాలివి... పౌడర్ రూపంలోని మందులు : పురుగు మందులు, తెగుళ్ల నివారణకు వాడే మందుల నుంచి వెలువడే దుర్వాసనల ద్వారా వాటి ఉనికి తెలుసుకోవచ్చు. ఇవీ కంటికి హానికరమే. పుప్పొడి వల్ల కళ్లకు హాని కలగడం పట్టణాల్లో కంటే పల్లెల్లో ఎక్కువ. పార్థీనియం అనే మొక్కతో ఈ ప్రమాదం మరీ ఎక్కువ.బొగ్గులు, కిరోసిన్, పిడకలు, కట్టెల వంటివి కాల్చినప్పుడు వెలువడే పొగలు కూడా కళ్లకు హాని చేస్తాయి. మిగతా కారణాలు... పైన పేర్కొన్న ప్రధానమైన వాయు కాలుష్యకారకాలే కాకుండా ఇటుక బట్టీలు, ముడి ఖనిజాలను (ఓర్స్)ను శుభ్రం చేయడం, అణు ఇంధన ఆధారిత సంస్థలు/రసాయన పరిశ్రమలు, బాంబు పేలుళ్లు, దీపావళి మొదలుకొని ఇతరత్రా కొన్ని వేడుకల్లో బాణాసంచాలు కాల్చడం వంటి అంశాలన్నీ అరుదుగా లేదా అప్పుడప్పుడు కంటికి ప్రమాదాలను తెచ్చిపెడతాయి. కాలుష్యాలతో కళ్లపై ప్రభావాలిలా... అనేక రకాల కాలుష్యాల బారిన పడగానే కన్ను వాటి దుష్ప్రభావాలను ఈ కింద పేర్కొన్న లక్షణాల ద్వారా మనకు తెలియపరుస్తుంది. అవి... ►కళ్లు మంటగా ఉండటం ∙ఎర్రబారడం ►వెలుగును చూడలేకపోవడం (ఫొటోఫోబియా) ►కళ్ల నుంచి నీళ్లు కారడం ∙కళ్ల నుంచి పూసి (రోపీ డిశ్చార్జ్) ►కళ్లు పొడిబారడం ►కళ్లు మసకబారడం (ఇది అనేక రకాలుగా జరగవచ్చు. ►కాలుష్యం దట్టంగా ఉన్నప్పుడూ ఎదుటి దృశ్యాలను కన్ను చూడలేకపోవచ్చు లేదా కంట్లోని నీటి పొర వల్ల కన్ను మసకగానూ మారవచ్చు. ► అదేపనిగా ధూళికి గురి కావడం వల్ల వచ్చిన క్యాటరాక్ట్ కారణంగా కూడా కన్ను మసకబారవచ్చు) ►కంట్లో దురదలు ► అలర్జిక్ కంజంక్టవైటిస్ (ఇన్ఫెక్టివ్ కంజంక్టవైటిస్) లేదా కళ్లకలక వంటి లక్షణాలు. కంటి సంరక్షణ కోసం కాలుష్య నివారణ ఇలా... ఫ్యాక్టరీలు మొదలుకొని ఇంటి లోని పొయ్యి వరకు వీలైనంత తక్కువగా గాల్లోకి కాలుష్యాలు వెలువడేలా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాక్టరీల యాజమాన్యాలు తమ నిర్దేశిత జాగ్రత్తలను తప్పక నిర్వహించేలా నియంత్రణ సంస్థలు చూడాలి. సాధ్యమైనంత వరకు పారిశ్రామిక సంస్థలు నివాస ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలి. వాహనాల విషయంలో వీలైనంత తక్కువ కాలుష్యాలను వెలువడే ఇంధనాలు వాడాలి. ఉదాహరణకు డీజిల్, పెట్రోలుకు బదులు పూర్తిగా మండిపోయి (కంబష్చన్ అయిపోయి) ఎలాంటి కాలుష్యాలను వెలువరించని గ్యాస్లు లేదా బ్యాటరీ ఆధారిత వాహనాలను ఉపయోగించాలి. పట్టణ ప్రాంతాల వారు తక్కువ దూరాలకు మోటార్ సైకిళ్లకు బదులు సైకిళ్లు వాడటం అటు కళ్లకు, ఇటు మిగతా ఒంటి ఆరోగ్యానికీ మంచిదే. తమ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాల పాళ్లను తరచూ చెక్ చేయించుకుంటూ ఉండాలి. అది మోతాదుకు మించకుండా జాగ్రత్త వహించడంతో పాటు.. ఒకవేళ అలా కాలుష్యాలు వెలువడుతుంటే వెంటనే రిపేర్ చేయించుకోవాలి. ఇది వాతావరణాన్ని రక్షించడంతో పాటు మీ వాహనం పనిచేసే కాలాన్ని, దాని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఖనిజాలను వెలికి తీసే ప్రాంతాల్లోనూ / వాటిని ప్రాసెస్ చేసే ప్రాంతాల్లోనూ తగిన రక్షణాత్మకమైన జాగ్రత్తలు పాటించాలి. కాలుష్య నియంత్రణ మండలి వంటి సంస్థలు నిరంతరం వాతావరణంలోని కాలుష్య కారకాల పాళ్లను (అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సస్పెండ్ పార్టికల్స్ వంటివి) నిత్యం లెక్కిస్తూ సైన్ బోర్డ్స్ వంటి ఉపకరణాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తుండాలి. అలా వాతావరణ కాలుష్యాల కారణంగా ఆరోగ్యంతో పాటు కళ్లకు జరిగే నష్టంపైన కూడా అవగాహన కలిగించాలి. కాలుష్యాలతో కళ్లకు జరిగే హాని గురించి అవగాహన కల్పించడం ఇప్పటివరకూ పెద్దగా జరగడం లేదు. కాలుష్యంతో వచ్చే కంటిజబ్బుల్లో కొన్ని... వాయుకాలుష్యాలకు కన్ను మితిమీరి గురి కావడం వల్ల వచ్చే ప్రధాన సమస్యల్లో కొన్ని... క్యాటరాక్ట్ (తెల్ల ముత్యాలు) : కంటికి ఉండే లెన్స్ వయసు పెరుగుతున్న కొద్దీ తన పారదర్శకతను కోల్పోవడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే కాలుష్యం వల్ల ఈ పరిణామం చాలా ముందుగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. దాంతో చాలా తొందరగా క్యాటరాక్ట్ సమస్య వస్తుంది. కంటి క్యాన్సర్ / కనురెప్ప క్యాన్సర్ : చాలా అరుదుగా వచ్చే తీవ్ర సమస్యలివి. భరించలేనంత కాంతి వల్ల లేదా తీవ్రమైన సూర్య కాంతిలో ఉండే అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల టెరీజియం (కంటి మూలలో ఉండే పొర పెరగడం), కార్నియా పైపొర దెబ్బతినడం, క్యాటరాక్ట్, ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ (ఏఆర్ఎమ్డీ), వంటి జబ్బులు రావచ్చు. వేడిమి వల్ల : వేడి వాతావరణంలో ఉండే వేడిమి కూడా కంటిని దెబ్బతీస్తుంది. ఇది ఫ్యాక్టరీల వంటివి ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల కన్నుపొడిబారే జబ్బు (డ్రై–ఐ లేదా గ్జీరాఫ్తాల్మియా) వస్తుంది. వాతావరణంలోని పొగమంచుకు అదేపనిగా చాలాకాలం ఎక్స్పోజ్ కావడం వల్ల స్నో బ్లైండ్నెస్, టెరీజియమ్ వంటి వ్యాధులు రావచ్చు. ∙ఇవేగాక వాతావరణంలో నేరుగా కన్ను తెరచుకొని ఉండటం వల్ల – మరీ కాంతిమంతమైన ట్రాఫిక్ లైట్లు, ఎలక్ట్రానిక్ తెరలు, వర్షంలో మెరుపులు వంటివి కూడా కంటికి హాని చేస్తాయి. కంటికి హాని జరిగిన లక్షణాలు కనిపిస్తే చేయాల్సింది... అనేక కారణాల వల్ల వాయు కాలుష్యంతో కంటికి హాని చేసే లక్షణాలు కనిపించినప్పుడు పాటించాల్సిన సూచనలివి... మనసును ప్రశాంతంగా ఉంచుకొని కంటిని మూసి ఉంచాలి. వీలైతే పరిశుభ్రమైన నీటితో కంటిని కడగాలి. కేవలం కంటిని కడగడానికి గది ఉష్ణోగ్రత (రూమ్ టెంపరేచర్) తో ఉన్న నీటినే వాడాలి తప్ప వేడి నీటినీ, చల్లటి ఫ్రిజ్ నీటిని ఉపయోగించకూడదు. బయటకు వచ్చినప్పుడల్లా ఎలాంటి పవర్ లేని సాధారణ కళ్లజోడు (ప్లెయిన్ గ్లాసెస్) ధరించాలి. ఇది స్టైల్ కోసం అనుకోకూడదు. కాళ్లకు పాదరక్షల్లాగే కళ్లకు కళ్లజోడు రక్షణ కల్పిస్తుంది. చేయకూడనివివీ... అన్నింటికంటే ముందుగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినదేమిటంటే కళ్లను ఎప్పుడూ రుద్దుకోకూడదు. ఎంతగా దురదపెట్టినట్లు అనిపించినా, మంట పుట్టినా ఈ పని చేయకూడదు. అలారుద్దుకోవడం కంటికి మరింత హాని చేస్తుంది కాబట్టే ఈ ముఖ్య సూచన. కళ్లలో ఎలాంటి చుక్కల మందులను డాక్టర్ సలహాలు, సూచనలు, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉపయోగించకూడదు.మందుల షాపులో అడిగి తీసుకునే (ఓవర్ ద కౌంటర్) మెడిసిన్స్ కంటి విషయంలో అస్సలు తీసుకోకూడదు. కాంటాక్ట్ లెన్స్లు వాడేవారు, ఐ మేకప్ ఉన్నవారు వాటిని తొలగించాలి. ఈ చేయాల్సిన / చేయకూడని సూచనలు పాటించాక వీలైనంత త్వరగా కంటి వైద్య నిపుణులను కలవాలి. డా. రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు మెడివిజన్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ -
అమెజాన్ చేతికి బిగ్ బాస్కెట్?
ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారత్లో మరింత విస్తరణ పథకాలను అమలు చేయనుంది. ముఖ్యంగా ఇండియాలో ఆన్ లైన్ మార్కెటింగ్ మరింతగా పెంచుకోవాలని యోచిస్తున్న అమెజాన్ ఆన్లైన్ కిరాణా వెబ్సైట్ బిగ్బాస్కెట్.కామ్ను చేజిక్కించుకోవాలని యోచిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఈ కొనుగోలుకు సంబంధించిన చర్చలు చాలా ప్రాథమిక స్థాయిలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వ్యక్తులను ఉటంకిస్తూ మీడియాలో కథనలు వెలువడుతున్నాయి. అమెజాన్ తన మార్కెట్ వాటాను ఏకీకృతం చేసే కృషిలో భాగంగా బిగ్ బాస్కెట్పై కన్నేసినట్టు తెలుస్తోంది. అమెజాన్ ఆన్లైన్ లో ఆహారాన్ని, కిరాణా అమ్మకాలపై యోచిస్తోంది. ఈ మేరకు దాని ఉత్పత్తిలో ఆఫర్లను పెంచుతుంది. ఈ రిటైల్ ట్రేడింగ్ లైసెన్స్ కోసం భారత ప్రభుత్వాన్ని కోరింది. దాదాపు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ పథకాన్ని త్వరలో మంజూరు చేయనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్లో పేర్కొంది. అయితే అమెజాన్ ఆసక్తి చూపినప్పటికీ, బిగ్బాస్కెట్ విక్రయానికి అంగీకరించకపోవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్కెట్ ఇప్పటికే గత ఏడాది $ 150 మిలియన్ డాలర్లను నిధులను పొందింది. దీంతోపాటు ఈ ఏడాది మార్చ్ నెలలో వారు తిరిగి రూ. వడ్డీ రుణంలో 45 కోట్ల డెలివరీ నెట్వర్క్ను పటిష్టం చేసుంది. ఈక్రమంలో కొత్త గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్కెట్ ప్రతినిధి ఈ పుకార్లు నిజం కాదని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ వార్తలపై అమెజాన్ ప్రతినిధి నిరాకరించడం విశేషం. -
కన్నుల భాషలు
-
జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ మరో ఎత్తుగడ
న్యూడిల్లీ: దేశీయ అతి పెద్ద టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ఒక పక్క జియో ఎంట్రీతో ఒక మాదిరి సంస్థలు కుదేలవుతోంటే.. ఎయిర్ టెల్ తన మార్కెట్ ను నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తమ మార్కెట్ విస్తరణలో భాగంగా సంస్థ తాజాగా మరో కీలక అడుగు వేయనుంది. నార్వే ఆధారిత టెలికం సంస్థ టెలినార్ కు చెందిన భారత వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సుమారు 350 మిలియన్ డాలర్ల టెలినార్ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం టెలినార్తో చర్చలు కూడా జరుపుతోంది. సంస్థలోని సగం వాటాను ప్రస్తుతం కొనుగోలు అనంతరం మిగిలిన సగభాగాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. జనవరి చివరికి నాటికి ఇరు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నివేదికలు తెలుపున్నాయి. టెలినార్కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయినా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి భారత ప్రభుత్వానికి టెలినార్ రూ.1900 కోట్లు, రుణాల రూపంలో బ్యాంకులకు మరో రూ.1800 కోట్లు బకాయి పడింది. దీంతో ఈ రుణ భారంలో సగం చెల్లించడం ద్వారా దానిని సొంతం చేసుకోవాలని ఎయిర్టెల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రత్యర్థుల నుంచి తీవ్రంగా ఎదురవుతున్న పోటీ, డేటా స్పెక్ట్రం ఎక్కువగా లేకపోవడం, భారీ నష్టాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి వైదొలగాలని భావిస్తోంది. ఈ మేరకు గతనెలలో టెలినార్ ఇండియా ఐడియాతో చర్చలు జరిపింది. అలాగే 7 సర్కిల్స్ లో 4 జీ సేవలు అందిస్తుండగా ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర 6 సర్కిల్స్ లో 2 జీ సేవలు అందిస్తోంది. అసోం ఇంకా తన సేవల్ని ప్రారంభించాల్సి ఉంది. -
కళ్లు పొడిబారుతున్నాయా?
ఐ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఎప్పుడూ కంప్యూటర్పై వర్క్ చేస్తుంటాను. కళ్లు విపరీతంగా పొడిగా అనిపిస్తున్నాయి. అప్పుడు వెళ్లి నీళ్లతో కళ్లు కడుక్కొని వస్తున్నాను. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. – నసీర్ బాషా, హైదరాబాద్ రెప్ప ఆర్పకుండా ఎప్పుడూ తదేకంగా ఏకాగ్రతతో కంప్యూటర్ తెరను చూసేవారికి కన్ను పొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’ అంటారు. ఇందులో కంటిలోని కార్నియా, కంజంక్టివా పొరలు పొడిబారిపోతాయి. దీన్నే ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యకు నివారణ కోసం చేయాల్సినవి... l కనురెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా కంప్యూటర్ చూస్తూ ఉండకూడదు. l మనం చదువుతున్నప్పుడు తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. l చదువుతున్నప్పుడు మధ్య మధ్య కాసేపు కంటికి విశ్రాంతినివ్వండి. చిన్న అక్షరాలను చాలాసేపు చదవద్దు. అలా చదవాల్సి వస్తే మధ్యమధ్యన కాసేపు దూరంగా కూడా చూపును ప్రసరిస్తూ ఉండండి. మనం చదవాల్సినదెప్పుడూ కంటి కంటే కిందనే ఉండాలి. పై వైపు చూస్తూ చదవాల్సి వస్తే అది కేవలం కాసేపే తప్ప... ఎప్పుడూ అలా ఉండే అక్షరాలను చదువుతూ ఉండవద్దు. l మీరు చదవాల్సినప్పుడూ నేరుగా ఉండాలి. స్క్రీన్ను వాలుగా ఉంచి చదవవద్దు. మీరు స్క్రీన్పై చూడాల్సి ఉన్నప్పుడు ఎక్కువ చూడాల్సిన స్క్రీన్కూ, దాని బ్యాక్డ్రాప్కూ ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా చూసుకోండి. l టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్నే తదేకంగా చూడవద్దు. మధ్యమధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి. l తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ స్వాభావికమైన సూర్యకాంతిలోని వెలుతురుకూ ఎక్స్పోజ్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏసీ ఇంటెన్సిటీని మరీ ఎక్కువగా పెంచుకోవద్దు. ఇది కళ్లు మరీ పొడిబారడానికి దారితీస్తుంది. రూమ్లో హ్యుమిడిఫయర్స్ ఉంచుకోవాలి. డాక్టర్ను సంప్రదించి, ఆర్టిఫిషియల్ టియర్స్ వాడాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ కొంతవరకు మీకు ఉపయోగపడతాయి. l శరీరం నుంచి నీటి పాళ్లు తగ్గకుండా ఉండటం కోసం తరచూ ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహారం గానీ లేదా కాప్సూ్యల్ గానీ తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అంటే... అన్నిరకాల విటమిన్లు (ఏ,బీ,సీ), ఖనిజాలు... ముఖ్యంగా జింక్ ఉండేలా చూసుకోండి. l ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడు కాసేపు తీయండి. l ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ను అవలంబించాలి. l కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్లు తుడుచుకోవద్దు. l మీ కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడుక్కోడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్ లేకుండా చూసుకోండి. l పొగతాగే అలవాటు, ఆల్కహాల్ తాగే అలవాట్లను తక్షణం మానివేయండి. డాక్టర్రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
చిన్నారి కళ్లలో నుంచి రాళ్లు
-
విద్యార్థిని కంటి నుంచి రాళ్ళు
రాళ్ళు వస్తున్న సమయంలో కంటి నొప్పితో అవస్థ నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థిని మహబూబాబాద్ : 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కుడి కంటి నుంచి నాలుగు రోజులుగా చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి. దీంతో ఆ విద్యార్థిని ఆ నొప్పితో అవస్థలు పడుతున్నది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణ శివారు లెనిన్నగర్ కాలనీకి చెందిన కాగితపు రాంమూర్తి, విజయ దంపతుల పెద్ద కుమార్తె స్పందన కుడి కన్ను నుంచి నాలుగు రోజులుగా చిన్న రాళ్ళు వస్తున్నాయి. కంటి నుంచి నీరు కారడంతో పాటు రాళ్ళు రావడంతో తీవ్ర నొప్పితో బాధపడుతోంది. ప్రతిరోజు సుమారు 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్ళు బయటకు వస్తున్నాయి. కంటి నుంచి వచ్చే నీరుతో ఆ చిన్న రాయి రెప్ప దగ్గరికి చేరుకుంటుంది. దాన్ని బయటకు తీసిన తర్వాత నొప్పి తగ్గుతుంది. మానుకోటలోని ఓ ప్రయివేట్ కంటి వైద్యశాలకు తీసుకెళ్ళగా వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్సను అందించారు. అయినప్పటికీ కంటి నుంచి రాళ్ళు వస్తూనే ఉన్నాయి. పెద్దాసుపత్రులలో చూపిస్తే వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు కారణాన్ని తెలియపరుస్తారని స్థానిక వైద్యులు తెలిపారు. తన కూతురికి మెరుగైన వైద్యాన్ని అందించే స్థాయిలో లేనని, దాతలు ఆదుకుని తన కూతురుకు ఆ బాధ నుంచి విముక్తి కల్పించాలని రాంమూర్తి వేడుకుంటున్నాడు. -
కళాశాలలో నిఘా నేత్రాలు..
l సీసీ కెమెరాలు, బయోమెట్రిక్మిషన్ల ఏర్పాటు l విద్యార్థులు, అధ్యాపకుల సమయపాలనకు దోహదం l సత్ఫలితాలిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కరీమాబాద్ : ఇటు విద్యార్థులు..అటు అధ్యాపకులు సమయానికి కళాశాలకు వచ్చేందుకు బయోమెట్రిక్ మిషన్లు, ఏ తరగతి గదిలో ఏం జరుగుతుందో ప్రిన్సిపాల్ గది నుంచే తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా మధ్యాహ్న భోజనానికి వచ్చేవారి సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. దీంతో క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు ద్వారా జిల్లాలోని 44 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలతోపాటు విద్యార్థులు, అధ్యాపకులకు వేర్వేరుగా బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేసింది. రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, బయోమెట్రిక్ మిషన్లు తాజాగా ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ కె.శోభాదేవి తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లు సత్ఫలితాలనిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు., 4 సీసీ కెమెరాలు, 2 బయోమెట్రిక్ మిషన్లు.. రంగశాయిపేట జూనియర్ కళాశాలలో నాలు గు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రిన్సిపాల్ గదిల–1, వరండా–1, స్టాఫ్ రూం–1, గేట్ కనిపించేలా–1 సీసీ కెమెరా ఏ ర్పాటు చేశారు. అలాగే అధ్యాపకుల కోసం ప్రిన్సిపాల్ గదిలో ఒక బయోమెట్రిక్ మిషన్, విద్యార్థుల కోసం లైబ్రరీలో మరో బయోమెట్రి క్ మిషన్ ఏర్పాటు చేశారు. అధ్యాపకుల బయోమెట్రిక్ మిషన్ ఉదయం 9.30 గంటల నుంచి 9.45 గంటల వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల వరకు అధ్యాపకులు ఎవరు వచ్చినా హాఫ్డే ఆబ్సెంట్ కిందే లెక్క ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 4.30 గం టలలోపు కళాశాల ముగిసిన తర్వాత మరోసారి అధ్యాపకులు బయోమెట్రిక్ మిషన్ వాడాల్సిందే. అలాగే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి న బయోమెట్రిక్ మిషన్ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉపయోగంలో ఉంటుంది. ఆ మధ్య సమయంలో బయోమెట్రిక్ మిషన్ను ఉపయోగించాలి. లేదంటే ఆబ్సెంట్ పడుతుంది. సమయపాలనకు దోహదం నూతనంగా జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉంది. సీసీ కెమెరాల వల్ల కళాశాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. బయోమెట్రిక్ మిషన్ల వల్ల అధ్యాపకులు, సిబ్బంది సమయానికి రావడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. కళాశాలలో 230 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల గతంలో కంటే 70 నుంచి 80 శాతం విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు. వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా కృషి చేస్తున్నాం. – కె.శోభాదేవి, ప్రిన్సిపాల్, రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల -
కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే..
బ్యూటిప్స్ * నీటిని మరిగించి అందులో గుప్పెడు తులసి, క్యాబేజీ ఆకులు వేసి మూతపెట్టి ఇరవైనిమిషాల సేపు అలాగే ఉంచాలి. చల్లారిన తర్వాత వడపోసి ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. ఈ మిశ్రమం యాక్నె, పింపుల్స్కు బాగా పని చేస్తుంది. * కీరదోస కాయను చక్రాలుగా కోసి కళ్ల మీద పెట్టుకుని అరగంట సేపు ఉంచుకుంటే క్రమంగా వలయాలు పోతాయి. * ఒక కప్పులో నీరు పోసి అందులో వాడిన టీ బ్యాగ్లను ఉంచి ఫ్రిజ్లో పెట్టుకుని, రాత్రి పడుకునే ముందు కాని, బయటకు వెళ్లి వచ్చిన తరువాత కాని పదిహేను నిమిషాల సేపు కళ్ల మీద పెట్టుకుంటుంటే వలయాలు పోతాయి. * శరీరానికి అవసరమైనంత నీటిని తాగాలి. కనీసం రెండు లీటర్లకు తగ్గకుండా తాగినప్పుడే శరీరంలోని మలినాలు సులభంగా బయటకు పోతాయి. అవసరమైనంత నిద్ర కూడా తప్పని సరి. ఎంత సమయం అనేది కచ్చితంగా ఉండకపోయినప్పటికీ శారీరక, మానసిక అలసటను బట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. * తగినంత విశ్రాంతి పొందినప్పుడు శరీరం రుగ్మతలతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. చర్మం వార్ధక్యానికి దూరంగా నిత్య యవ్వనంతో ఉంటుంది. విశ్రాంతి సమయంలో రక్తంలోని తెల్లరక్త కణాలు ఉత్తేజితమవుతాయి. -
తల్లి కళ్లు దానమిచ్చిన జడ్జి
సాక్షి, హైదరాబాద్: అంధుల కోసం కఠినమైన చట్టాలను బ్రెయిలీ(తెలుగు) లిపిలోకి అనువదించడంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ న్యాయసేవా సాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎ.వెంకటేశ్వర్రెడ్డి...తన మాతృమూర్తి కళ్లను దానం చేశారు. ఆయన తల్లి అనసూయమ్మ(82) ఇటీవల మహబూబ్నగర్లో మృతి చెందారు. మరణానంతరం కళ్లను దానం చేయడానికి బతికుండగా ఆమె అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో...కళ్లను తీసుకెళ్లాల్సిందిగా ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య సంస్థకు సమాచారం ఇవ్వడంతో వారు కళ్లను తీసుకెళ్లారు. -
ఫేస్ ద ప్రాబ్లమ్స్
సమస్యల్ని ఫేస్ చేయడం కష్టమే సమస్య వచ్చాక ఫేస్ చేయడం ఇంకా కష్టం ఫేస్లో ఉన్న... కళ్లు, ముక్కు, చెవులు, నోరు ప్రాబ్లమ్స్ను ఎలా ఫేస్ చేయాలో చూద్దాం అంతకంటే ముందు వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం! చెవి చెవి ఇన్ఫెక్షన్ అందరిలోనూ చెవుల నుంచి గొంతులోకి ఒక యూస్టేషియన్ ట్యూబ్ అనే నాళం ఉంటుంది. అలర్జీలు లేదా జలుబు వంటి ఇన్ఫెక్షన్ల వల్ల యూస్టేషియన్ ట్యూబ్లోకి క్రిములు చేరుతాయి. అవి మధ్యచెవికి చేరినప్పుడు పిల్లల్లో తీవ్రమైన చెవి నొప్పి వస్తుంది. ఈ కారణం వల్లనే కొందరు పిల్లల్లో జలుబు చేసిన తర్వాత చెవి నొప్పి వస్తుంది. నిర్ధారణ : ఓటోస్కోప్ ఉపయోగించి ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు. చికిత్స : యాంటీబయాటిక్స్, యాంటీ అలర్జీ మందులతో ఈ సమస్యకు చికిత్స చేస్తారు. ఇది దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా మారినప్పుడు పిల్లల వినికిడిని తెలుసుకునే ఆడియోగ్రామ్ పరీక్ష, చెవిలోని పొర ఇయర్ డ్రమ్ సాధారణంగా కదులుతుందో లేదో తెలుసుకునే టింపనోగ్రామ్ పరీక్షలు అవసరం కావచ్చు. నివారణ: జబులు చేసిన వ్యక్తుల నుంచి పిల్లలను దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా కడగడం, మురికి చేతులను ముక్కుకు, కళ్లకు అంటకుండా చూడటం వంటి జాగ్రత్తలతో పిల్లలను చెవి ఇన్ఫెక్షన్ల నుంచి నివారించవచ్చు. ముక్కు సైనసైటిస్ ముక్కుకు ఇరువైపులా ముఖంలో గాలి ఉండే కొన్ని ఖాళీ స్థలాలు ఉంటాయి. ఈ ఖాళీ స్థలాలలో వచ్చే ఇన్ఫెక్షన్ను సైనసైటిస్ అంటారు. సాధారణంగా పిల్లల్లో జలుబు లేదా అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ తర్వాత ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇది వచ్చిన వారిలో ముక్కు కారడం, తలనొప్పి, నోటిదుర్వాసన (బ్యాడ్ బ్రెత్), దగ్గు, జ్వరం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. నిర్ధారణ : ఎక్స్రే, సీటీ స్కాన్, సైనస్ స్రావాల కల్చర్ పరీక్షలతో ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు. చికిత్స : యాంటీబయాటిక్స్, అసిటమైనోఫెన్, ఛాతీ పట్టేసినట్లు ఉండటాన్ని తగ్గించే డీ కంజెస్టెంట్స్తో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అవసరం కావచ్చు. అలర్జిక్ రైనైటిస్ ఏదైనా సరిపడని పదార్థం ముక్కులోకి వెళ్లి, అది తీవ్ర ఇబ్బంది కలిగించడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇది కుటుంబ చరిత్రలో ఉండే రుగ్మత. సాధారణంగా పుప్పొడి, దుమ్ములో ఉండే డస్ట్మైట్స్, బొద్దింకలు వాటి విసర్జకాలు, జంతువుల ఒంటి నుంచి వెలువడే వాసనలు, పొగాకు పొగ వంటివి అలర్జిక్ రైనైటిస్కు కారణమవుతాయి. లక్షణాలు : ఈ సమస్య ఉన్నవారిలో తుమ్ములు, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, ముక్కులో దురద, ముక్కు కారుతూ ఉండటం వంటివి కనిపిస్తాయి. నిర్ధారణ : కుటుంబ వైద్య చరిత్రతో పాటు బయటకు కనిపించే లక్షణాల ఆధారంగా ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు. నివారణ / చికిత్స: ఈ సమస్యను ప్రేరేపించే అంశాల నుంచి దూరంగా ఉండటం ద్వారా నివారించవచ్చు. పుప్పొడి వ్యాపించే సీజన్లో ఎయిర్కండిషన్లో ఉండటం, దుమ్ము ధూలికి ఎక్స్పోజ్ కాకపోవడం, బూజు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం కూడా నివారణకు మంచి మార్గం. ఇక యాంటీహిస్టమైన్స్, కార్టికోస్టెరాయిడ్స్, ముక్కులో వాడే స్ప్రేలు, యాంటీట్యూకోట్రైన్స్ వంటి మందులు వాడుతుంటారు. కళ్లు కళ్ల సమస్యలు కళ్ల సమస్యలు: పిల్లల్లో కళ్లకు సంబంధించిన సమస్యలు ఈ కింది కారణాల వల్ల రావచ్చు. అవి... కళ్లను అదేపనిగా రుద్దుతూ ఉండటం కాంతికి తీవ్రంగా ప్రతిస్పందించే గుణం ఒకేచోట దృష్టినిలపడంలో ఇబ్బందులు ఏదైనా వస్తువును చూడటంలో సమస్యలు ఆర్నెల్ల వయసు తర్వాత రెండు కనుగుడ్లు ఒకేవైపునకు, ఒకేలా కదలకపోవడం (అబ్నార్మల్ అలైన్మెంట్) దీర్ఘకాలికంగా కళ్లు ఎర్రగా ఉండటం కళ్లలో నల్లగుడ్డు ఉండాల్సిన చోట తెల్లటి మచ్చ ఉండటం. నిర్ధారణ: సాధారణంగా కళ్ల సమస్యలు ఆసిటీ చార్ట్ వంటి కొన్ని స్క్రీనింగ్ పరీక్షలతో స్కూల్కు వెళ్లే ముందుగానే తెలిసిపోతుంటాయి. ఇక కాంతి కిరణాలు అవసరమైన చోట కేంద్రీకృతం కాకపోవడం వంటి సమస్యలను రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అంటారు. ఇందులో దగ్గరి దృష్టిలో కేవలం దగ్గరి వస్తువులు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యను మయోపియా అంటారు. ఇక కొందరు పిల్లల్లో దూరంగా ఉన్నవి కనిపిస్తూ దగ్గరగా ఉన్నవి స్పష్టంగా కనిపించవు. ఈ సమస్యను హైపరోపియా అంటారు. ఇక కన్ను ముందువైపున ఉండే వంపు సరిగా లేకపోవడం వల్ల చూసే ప్రక్రియ ఇబ్బంది ఉంటుంది. దీన్ని ఆస్టిగ్మాటిజమ్ అంటారు. ఈ మూడు సమస్యలను కళ్లజోడు ఉపయోగించడం ద్వారా సరిచేయవచ్చు. నోరు నోటిలో పుండ్లు (ఓరల్ అల్సర్స్) ఇవి పిల్లలో చెంపలు, పెదవుల లోపలి వైపున, చిగుర్లపైన కనిపిస్తాయి. కొందరిలో నాలుకపైన కూడా కనిపిస్తుంటాయి. కారణాలు : ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12, ఐరన్ వంటి లోపాల వల్ల ఇవి వస్తుంటాయి. కొందరిలో నోటిలో అయ్యే గాయాల వల్ల, తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలర్జీల వల్ల కూడా కనిపిస్తుంటాయి. చికిత్స/ నివారణ : సాధారణంగా ఈ సమస్య రెండు వారాల్లో తగ్గిపోతుంది. ఇలా పిల్లలో నోటిలో పుండ్లు వస్తున్నప్పుడు పోషకాహార లోపాలు లేక వ్యాధి నిరోధకతలోపాలు ఏవైనా ఉన్నాయా అని చూడాలి. కొన్ని ఆహారాలు సరిపడకపోవడం (ఫుడ్ అలర్జీ) కూడా ఉందేమో అని తెలుసుకోవాలి. డాక్టర్ శివనారాయణరెడ్డి వెన్నపూస కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ - ఇన్టెన్సివిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్,విక్రమ్పురి, సికింద్రాబాద్ -
కౌగిలింతతో కనుచూపు!
వాటికన్ సిటీ: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పోప్ ఫ్రాన్సిస్ కౌగిలించుకోవడంతో చూపు మందగించిన బాలికకు మామూలు చూపు వచ్చింది. ఓహియోకి చెందిన ఐదేళ్ల బాలిక లిజ్జీ మైయర్స్ జెనెటిక్ సమస్యతో కారణంగా క్రమంగా తన కంటి చూపును కోల్పోతోంది. దీంతో లిజ్జీ కుటుంబ సభ్యులు ఆమెను పోప్ వద్దకు తీసుకుని వచ్చారు. పోప్ స్వయంగా పాపను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్న తర్వాత చేతులతో ఆమె కళ్లను తడిమారు. అంతే ఆ చిన్నారి ఇప్పుడు మామూలుగా చూడగలుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించారు. అంతేకాదు తాను ఉషెర్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలియని లిజ్జీ పోప్కు ఒక బొమ్మను కూడా బహుమతిగా ఇచ్చింది. ఒక్క సారిగా మామూలు దృష్టి రావడంతో లిజ్జీ ఆశ్చర్యానికి గురైందట. ఆమె దూరం నుంచి వస్తువులను చూపించి గుర్తుపడుతుండటంతో కూతురుకు చూపు వచ్చినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
అందరి చూపూ కొత్త ఐఫోన్ మీదే!
వాషింగ్టన్: ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు అందరి చూపూ.. యాపిల్ సంస్థ కొత్తగా లాంచ్ చేయనున్న ఐఫోన్ మీదే ఉంది. కొన్ని నెలలుగా యాపిల్ అమ్మకాలు ఆశించిన మేర వృద్ధి సాధించకపోవడంతో ఈ కొత్త ఐఫోన్ యాపిల్ అమ్మకాలకు పునరుత్తేజాన్నిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొంత కాలంగా యాపిల్ ఐఫోన్ అమ్మకాలు క్రమంగా క్షీణిస్తున్న ఈ నేపథ్యంలో యాపిల్ స్టాక్స్ విలువ ఐబీఎమ్కు దగ్గరగా రావడం వాల్స్ట్రీట్ మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. అయితే గత రెండు వారాలుగా యాపిల్ యాపిల్ షేర్ల విలువ 5 శాతం మేర పెరిగింది. యాపిల్ ఈ నెలలో లాంచ్ చేయనున్న కొత్త ఐఫోన్ను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మార్కెట్ను ఆకర్షించేలా తక్కువ కాస్ట్కు అందించనుందన్న వార్తలు ఈ షేర్ల విలువ పెరగటానికి దోహదం చేశాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రజల అంచనాలకు అందనంత ఉత్తమమైన ఉత్పత్తులను యాపిల్ సంస్థ తీసుకొచ్చిన సందర్భాలున్నాయని, ఈ సారి కూడా అలాంటి ఆశ్చర్యం తప్పదని ఆపిల్ సంస్థలో 1 మిలియన్కు పైగా షేర్లు ఉన్న సైనోవాస్ ట్రస్ట్ కంపెనీ సీనియర్ పోర్ట్ ఫోలియో మేనేజర్ డేనియల్ మోర్గాన్ అన్నారు. మరి మార్కెట్ వర్గాల అంచనాలను యాపిల్ తన కొత్త ఐఫోన్తో అందుకుంటుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. -
చిన్నారి నేత్రాల్లో వెంట్రుకలు
ఓర్వకల్లు: పదకొండేళ్ల చిన్నారి నేత్రాల నుంచి వెంట్రుకలు వస్తున్న వింత స్థితి ఉప్పలపాడు గ్రామంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నాయిని వెంకటలక్ష్మమ్మ, నారాయణ దంపతుల కుమార్తె రూప స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. బాలిక వారం రోజులుగా కళ్ల మంటలతో బాధపడుతోంది. ఈ క్రమంలో కళ్ల నుంచి తరుచుగా నీరు కారుతుండేది. బుధవారం రాత్రి నుంచి కళ్లలో వెంట్రుకలు వస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. శుక్రవారం వైద్యులను సంప్రదిస్తామని వారు తెలిపారు. -
ఆచిన్నారి కళ్లు పోవడానికి కారణం వైద్యులే