Fund raising
-
‘బ్యాంకింగ్’కు బూస్ట్ ఇస్తారా?
దేశ బ్యాంకింగ్ రంగం.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. రుణాల్లో వృద్ధి బలహీనపడింది. డిపాజిట్లకు కస్టమర్లు మొహం చాటేస్తున్నారు. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగ్గడంతో, అధిక రేట్లపై డిపాజిట్లను ఆకర్షించాల్సిన పరిస్థితి. ఫలితంగా బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిపోయాయి. వీటికి పరిష్కార చర్యలు బడ్జెట్లో ఉంటాయన్న ఆశలు బ్యాంకింగ్ వర్గాల్లో నెలకొన్నాయి. ముఖ్యంగా లిక్విడిటీ పెంపు, రుణాల వృద్ధికి ఉద్దీపన చర్యలను ఈ రంగం ఆశిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.4 శాతానికి సెపె్టంబర్ త్రైమాసికంలో (2024–25) పడిపోవడం తెలిసిందే. ఈ ప్రభావం బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అన్ సెక్యూర్డ్ రుణాల్లో స్థూల, నికర నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. వీటికి గణనీయమైన కేటాయింపులతో బ్యాంకుల లాభాలు తరిగిపోతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో రానున్న బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిపాజిట్లకు ప్రోత్సాహకాలు → ఇన్వెస్టర్లు అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీ తదితర సాధనాల వైపు మళ్లిపోతుండడంతో, తిరిగి సంప్రదాయ బ్యాంక్ డిపాజిట్ల వైపు వారిని ఆకర్షించేందుకు చర్యలు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. గృహ ఆర్థిక ఆస్తుల్లో బ్యాంకుల డిపాజిట్లు 2019–20 నాటికి 56.4 శాతంగా ఉంటే, 2024 మార్చి నాటికి 45.2 శాతానికి పడిపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ డిపాజిట్లపై తక్కువ పన్ను రేటును ప్రవేశపెట్టాలని ఈ రంగం కోరుతోంది. పన్ను ఆదా ఎఫ్డీపై ఐదేళ్ల లాకిన్ పీరియడ్ను తగ్గించినట్టయితే ఆకర్షణీయంగా మారుతుందని బ్యాంకర్లు అంటున్నారు. → ఆదాయపన్ను ఉపశమనంతో ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుంది. ఇది డిపాజిట్లు, రుణాలకు డిమాండ్ను పెంచుతుందున్న అంచనాలున్నాయి.→ హోల్సేల్ రుణాలు, బ్యాంకింగ్ రంగం నుంచి నిరర్థక రుణ ఆస్తులను సొంతం చేసుకోవడంపైనా పన్ను రాయితీలు కల్పించాలని నిపుణులు కోరుతున్నారు.→ సూక్ష్మ రుణాల విభాగంలో రుణ ఎగవేతలు ఇటీవల ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రుణ, నిర్వహణ వ్యయాల భారం ఎగసింది. ఈ పరిస్థితుల్లో అందు బాటు రేట్లపై ప్రత్యేక నిధుల విండోను ప్రకటించొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ అనలిస్టులు భావిస్తున్నారు. → అంతేకాదు మౌలికరంగ వసతుల కల్పన ప్రాజెక్టులకు కేంద్రం గణనీయమైన ప్రాధాన్యం ఇస్తోంది. రోడ్లు, రైల్వేలు, పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం చేసే మూలధన వ్యయాలతో.. అన్ని రంగాల్లోనూ కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని, ఇది బ్యాంకుల రుణ డిమాండ్ను పెంచుతుందని భావిస్తున్నారు. రానున్న బడ్జెట్లో 14 శాతం అధికంగా 11.3 లక్షల కోట్లను మూలధన వ్యయాల కింద కేటాయించొచ్చని ఎలారా క్యాపిటల్ పేర్కొంది.రిటైల్ కస్టమర్ల నుంచి డిపాజిట్ల సమీకరణ విషయంలో బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రోత్సాహకాలు కల్పించినట్టయితే బ్యాంక్లు తమ రుణ అవసరాలకు అనుగుణంగా తక్కువ వ్యయాలపై నిధులు సమీకరించగలుగుతాయి. ముఖ్యంగా లిక్విడిటీ కవరేజీ రేషియోలో ప్రతిపాదిత మార్పుల నేపథ్యంలో ఇది ఎంతో అవసరం.– సచిన్ సచ్దేవ, ఇక్రా ఫైనాన్షియల్ రంగం రేటింగ్స్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రిలయన్స్ ఇన్ఫ్రాకు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: మౌలికసదుపాయాల కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారులు అనుమతించారు. షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు సెపె్టంబర్ 19న గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా 98 శాతం మంది వాటాదారుల నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. నిధుల్లో షేర్ల ప్రిఫరెన్సియల్ కేటాయింపుల ద్వారా రూ. 3,000 కోట్లు, మారి్పడికి వీలయ్యే వారంట్ల జారీ(క్విప్) ద్వారా మరో రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మారి్పడికి వీలయ్యే వారంట్లను ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ చేయనుంది. తద్వారా రూ. 3,014 కోట్లు అందుకోనుంది. వీటిలో 4.6 కోట్ల షేర్ల(రూ. 1,104 కోట్ల విలువ)లో ప్రమోటర్ సంస్థ రైజీ ఇనిఫినిటీ ప్రయివేట్ ఇన్వెస్ట్ చేయనుంది. -
ఒక్క డీల్తో దూసుకెళ్లిన ఫిజిక్స్వాలా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్వాలా తాజాగా రూ.1,753 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్–బి రౌండ్లో హార్న్బిల్ క్యాపిటల్, లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, జీఎస్వీ, వెస్ట్బ్రిడ్జ్ ఈ మొత్తాన్ని అందించాయి. ఈ డీల్తో కంపెనీ విలువ ఏడాదిలో రెండున్నర రెట్లు దూసుకెళ్లి రూ.23,380 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?పెద్ద సంస్థల వాల్యుయేషన్లో గణనీయమైన తగ్గుదల కారణంగా భారతీయ ఎడ్టెక్ రంగంలో పెద్ద ఎత్తున నిధుల కొరత చాలా కాలంగా ఉంది. ‘ఎడ్టెక్ రంగానికి సవాలుగా ఉన్న ప్రస్తుత సమయంలో తాజా ఫండింగ్ రౌండ్ ఆశావాదానికి దారితీసింది. కంపెనీ అభివృద్ధి, దేశం అంతటా విద్యను ప్రజాస్వామ్యం చేయాలనే లక్ష్యంపై ఇప్పటికే ఉన్న, కొత్త పెట్టుబడిదారుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం’ అని ఫిజిక్స్వాలా తెలిపింది. -
Hyderabad: ‘అకాన్ ఆహ్వానం’! సిటీలో వినూత్నంగా ఫండ్ రైజింగ్ ఫీస్ట్..
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా ’అకాన్ ఆహ్వానం’ పేరుతో వినూత్నంగా ఫండ్ రైజింగ్ ఫీస్ట్ను గురువారం నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాల్లో నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల సంరక్షణ, సహకారం అందించడం కోసం ఈ ఫీస్ట్ నిర్వహించడం విశేషం. దుర్గంచెరువు దగ్గరలోని అకాన్ రెస్టారెంట్ వేదికగా ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్స్ట్రామైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఫీస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ చెఫ్లు తయారు చేసిన పసందైన ఆహార పదార్థాలను, సితార్ ప్రదర్శనను ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. లంచ్ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. లంచ్ అనంతరం చెల్లించే ప్రతిపైసా పేద కుటుంబాల్లోని ప్రీ మెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యాలతో జన్మించిన శిశువులకు విరాళంగా అందిస్తారు. సామాజిక బాధ్యతగా ఈ వినూత్నమైన ఆహారానికి, ఆతిథ్యానికి ఎంతైనా చెల్లించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.ఒక్కో శిశువుకు రూ.10 లక్షల వరకు..నెలలు నిండని శిశు జననాల సంఖ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బతుకు గడవడమే కష్టంగా మారిన పేద కుటుంబాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి శిశువులకు, వారి కుటుంబాల చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎక్స్ట్రామైల్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ’అకాన్ ఆహ్వానం’ ఫండ్ రైజింగ్ ఫీస్ట్లో పోగైన ప్రతి పైసా ప్రీమెచ్యూర్డ్ చిన్నారులకు, అనారోగ్యంతో జన్మించిన శిశువులకు చేరుతుంది. మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి హాస్పిటల్లో ఉండే ఎన్ఐసీయూ యూనిట్ల ద్వారా సహాయం అవసరమైన శిశువులకు సహకారం అందిస్తున్నాం. ఇప్పటి వరకు 197 మంది చిన్నారులకు సహకారం అందించాం. 400 గ్రాముల బరువుతో జన్మించిన చిన్నారులను రక్షించాలంటే రూ.10–15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర సమస్యలతో జన్మించినా కనీసం రూ.3, 4 లక్షలు అవసరం. ఒక్క లంచ్ ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. లంచ్ రిజర్వేషన్ల కోసం ఫోన్: 96496 52222 – డా.నిటాషా, ఎక్స్ట్రామైల్ ఫౌండేషన్ -
జనరేటివ్ ఏఐ స్టార్టప్లకు ఏడబ్ల్యూఎస్ సాయం!
జెనరేటివ్ ఏఐ స్టార్టప్లకు అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్) సహకారం అందించనున్నట్లు తెలిపింది. జెనరేటివ్ ఏఐ విభాగంలో సేవలందించే స్టార్టప్ కంపెనీలకు ఏకంగా 230 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సాయం చేయాలని నిర్ణయించుకుంది.ఏడబ్ల్యూఎస్ అంతర్జాతీయంగా జెనరేటివ్ ఏఐ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రంగంలో సేవలందించే అంకురాలకు ఆర్థికసాయం చేయలని నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి 10 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 80 వ్యవస్థాపకులు, అంకుర సంస్థలకు సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ఆసియా పసిఫిక్, జపాన్ ప్రాంతం నుంచే 20 వరకు ఉండనున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థల వృద్ధిని పెంచడమే ఈ నిధుల సహకారం ప్రధానం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఎంపికైన ఒక్కో జెన్ఏఐ స్టార్టప్కు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8.3 కోట్లు) మేర ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు. దాంతోపాటు ఏడబ్ల్యూఎస్ తరఫున ఆయా కంపెనీలకు నైపుణ్యాభివృద్ధి సెషన్లు, వ్యాపారం, సాంకేతికత అంశాలపై సలహాలు, నెట్వర్కింగ్ అవకాశాలు తదితర సహకారాన్ని అందిస్తామని ఏడబ్ల్యూఎస్ పేర్కొంది. -
సౌదీ జైల్లో భారతీయుడు.. విడుదలకు రూ.34 కోట్ల నిధుల సేకరణ
కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు. కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్టేకర్గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది. బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది. విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
లక్షల కోట్ల అప్పులు.. వొడాఫోన్ ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియా భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టనుంది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీలు, ఇతర రుణ మార్గాల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు తాజాగా ఆమోదముద్ర వేసింది. రూ. 2.1 లక్ష కోట్ల భారీ రుణ భారంతో కుదేలైన కంపెనీ మనుగడ కోసం పలు సమస్యలను ఎదుర్కొంటోంది. త్రైమాసికవారీగా నష్టాలు ప్రకటించడంతోపాటు.. వినియోగదారులను కోల్పోతోంది. ఏప్రిల్లో బోర్డ్ భేటీ... నిధుల సమీకరణ నిర్వహణ కోసం బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు యాజమాన్యానికి అధికారాలనిస్తూ బోర్డు తీర్మానించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 24న వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనుంది. వాటాదారుల అనుమతి తదుపరి త్రైమాసికంలో ఈక్విటీ నిధుల సమీకరణను పూర్తి చేయనున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. -
ఎస్బీఐ కొత్త ఫండ్కు కోట్లలో నిధులు
ముంబై: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఓ నూతన పథకం ద్వారా భారీగా నిధులు సమీకరించింది. ఎస్బీఐ ఎనర్జీ అపార్చునిటీస్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపించారు. రూ.5,000 కోట్ల సమీకరణను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంచనా వేయగా, దీన్ని అధిగమించి రూ.6,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అన్ని రకాల పంపిణీ ఛానళ్ల ద్వారా విస్తృతమైన స్పందన వచ్చిందని, దరఖాస్తులు 5 లక్షలు దాటాయని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. పెద్ద సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)లో పాల్గొనడం చూస్తుంటే అది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని పేర్కొంది. ఎనర్జీ ధీమ్ (ఇంధన రంగం) పట్ల ఇన్వెస్టర్లు నమ్మకానికి నిదర్శనమని తెలిపింది. ఇంధనం, దాని అనుబంధ రంగాల్లో పనిచేసే కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ, డెరివేటివ్స్, డెట్ సెక్యూరిటీలలోనూ పెట్టుబడులు పెడుతుంది. రాజ్ గాం«దీ, ప్రదీప్ కేశవాన్ ఫండ్ మేనేజర్లుగా పనిచేయనున్నారు. -
మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల వెల్లువ
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) గతేడాది నూతన పథకాల రూపంలో ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సమీకరించాయి. మొత్తం 212 న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)లు 2023లో మార్కెట్లోకి వచ్చాయి. ఇవి సంయుక్తంగా రూ.63,854 కోట్లను సమీకరించాయి. అంతకుముందు ఏడాది (2022) కూడా 228 ఎన్ఎఫ్వోలు రూ.62,817 కోట్లు సమీకరించడం గమనార్హం. ఇక 2021లో రూ.99,704 కోట్లు, 2020లో రూ.53,703 కోట్ల చొప్పున కొత్త పథకాల ద్వారా సమీకరించాయి. ఈ వివరాలను ఫైయర్స్ రీసెర్చ్ విడుదల చేసింది. ‘‘వినియోగం విషయంలో మారుతున్న ధోరణి, అధిక ప్రమాణాలతో కూడిన జీవన అవసరాల నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడాన్ని గుర్తిస్తున్నారు. అత్యవసర సమయాలను గట్టేక్కేందుకు తగినంత నిధి, ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని కరోనా మహమ్మారి తెలియజేసింది’’అని ఫైయర్స్ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది. బలమైన ఆర్థిక కార్యకలాపాలు, స్థిరమైన జీఎస్టీ వసూళ్లు, ప్రభుత్వ సంస్కరణలతో సూచీలు గతేడాది మంచి పనితీరు చూపించినప్పటికీ, 2024లోనూ అదే మాదిరి పనితీరు ఆశించరాదని పేర్కొంది. మార్కెట్ విలువలు ఖరీదుగా మారిన తరుణంలో అప్రమత్తత అవసరమని ఇన్వెస్టర్లకు సూచించింది. పెరిగిన రిస్క్ ధోరణి.. 2023 జనవరి–మార్చి కాలంలో అత్యధికంగా 57 ఎన్ఎఫ్వోలు మార్కెట్లోకి వచ్చాయి. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో అత్యధికంగా రూ.22,049 కోట్లను ఎన్ఎఫ్వోలు సమీకరించాయి. 2023లో 29 థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్ (ఎన్ఎఫ్వోలు) రూ.17,946 కోట్లను ఆకర్షించాయి. ఈక్విటీల విషయంలో ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరగడంతో వారు థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్ను ఎంపిక చేసుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్ ర్యాలీ సమయంలో ఎన్ఎఫ్వోలు ఎక్కువగా వస్తుంటాయి. సానుకూల సెంటిమెంట్ నేపథ్యంలో అధిక పెట్టుబడులను సులభంగా సమీకరించొచ్చని అలా చేస్తుంటాయి. స్టాక్ మార్కెట్ మెరుగైన పనితీరుకు తోడు, ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ గతేడాది భారీగా ఎన్ఎఫ్వోలు నిధులు సమీకరించడానికి తోడ్పడినట్టు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023లో నిఫ్టీ–50 సూచీ 20 శాతం రాబడులను ఇచి్చంది. ఇక నిఫ్టీ మిడ్క్యాప్ అయితే 47 శాతం, స్మాల్క్యాప్ 56 శాతం చొప్పున ర్యాలీ చేయడం గమనార్హం. గతేడాది దేశీయ ఇనిస్టిట్యూషన్స్ రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈక్విటీల ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించాయి. గతేడాది మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2022లో వచి్చన రూ.71,000 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. -
ఏడాదిలోనే 90 శాతం విలువ తగ్గిన కంపెనీ..
ఒక్క ఏడాది వ్యవధిలోనే ప్రముఖ ఎడ్టెక్ సంస్థ 90 శాతం తన విలువను కోల్పోయింది. బైజూస్ బ్రాండ్పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన విలువను భారీగా నష్టపోయింది. ఈమేరకు ‘టెక్క్రంచ్’ వెబ్సైట్ కథనం ప్రచురించింది. ఈ సంస్థ విలువ రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోయినట్లు అందులో పేర్కొంది. ఫిబ్రవరిలో షేర్లను జారీ చేసి ప్రస్తుత పెట్టుబడిదార్ల నుంచి 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.830 కోట్ల)ను సమీకరించాలని బైజూస్ భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో 2022 చివర్లో జరిగిన నిధుల సమీకరణ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,82,600 కోట్లు)గా లెక్కగట్టగా.. తాజాగా 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,600 కోట్లు)గానే లెక్కించి ఇన్వెస్టర్లకు షాక్ఇచ్చింది. అంటే సంస్థ విలువ 90 శాతానికి పైగా తగ్గింది. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ, కొత్తగా సమీకరించే నిధులతో అప్పు ఇచ్చినవారికి చెల్లింపులు చేయనుందని తెలిసింది. బైజూస్ అనుబంధ సంస్థలు వైట్ హాట్ జూనియర్, ఒస్మోల్లో నష్టాల కారణంగా 2021-22లో సంస్థ నిర్వహణ వ్యయం రూ.6,679 కోట్లకు పెరిగినట్లు సమాచారం. ఈ రెండు సంస్థల నష్టాలే 45 శాతం (రూ.3,800 కోట్లు) ఉన్నాయి. 2020-21లో సంస్థ నష్టం రూ.4,143 కోట్లతో పోలిస్తే 2021-22 నష్టం మరింత పెరిగినట్లయింది. ఆదాయాలు కూడా రూ.2428.39 కోట్ల నుంచి రూ.5,298.43 కోట్లకు పెరిగాయి. బైజూస్ ఇతర అనుబంధ సంస్థలైన ఆకాశ్, గ్రేట్ లెర్నింగ్ ఆదాయాలు పెరిగాయి. ఆకాశ్ ఆదాయం 40% పెరిగి రూ.1491 కోట్లకు, గ్రేట్లెర్నింగ్ ఆదాయం 80% వృద్ధితో రూ.628 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు! బైజూస్ తన వాల్యుయేషన్ను తగ్గించడానికి సుముఖత చూపడంపై స్టార్టప్ కంపెనీలు భిన్నంగా స్పందిస్తున్నట్లు తెలిసింది. 2021-22లో 2.5 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిన ఈ స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా అర డజనుకు పైగా సంస్థలను కొనుగోలు చేసింది. ఒకానొక సందర్భంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు సంస్థకు 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్ను ఇచ్చినట్లు టెక్ క్రంచ్ గతంలో నివేదించింది. -
హైదరాబాద్ ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో నిధుల సమీకరణ
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో లిమిటెడ్ భారీ నిధుల సమీకరణ ప్రణాళిక చేపట్టింది. ప్రాధాన్యతా షేర్ల కేటాయింపు ద్వారా రూ.62 కోట్ల నిధుల సమీకరణ ప్రణాళికకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తాజాగా ప్రకటించింది. సేకరించిన నిధులను కంపెనీ అభివృద్ధి, నాయకత్వ విస్తరణ, జాతీయ, అంతర్జాతీయ విస్తరణ కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. టెక్నాలజీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఉన్న తమ అనుబంధ, జాయింట్ వెంచర్లలో భవిష్యత్తు పెట్టుబడి అవసరాలను తీర్చడం రామ్ ఇన్ఫో లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. "కంపెనీ ఆదాయం, స్థిరమైన వృద్ధిని మెరుగుపరచడానికి, సర్వీస్ పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి, భౌగోళిక పరిధిని విస్తరించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఉద్దేశించినది" అని రామ్ ఇన్ఫో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. బలమైన ఆర్డర్లను, సర్వీస్ గ్రోత్ను పెంపొందించుకునేందుకు, తమ షేర్హోల్డర్లకు విలువను సృష్టించడానికి నిధుల సమీకరణ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలను ఆవిష్కరించండి
న్యూఢిల్లీ: నిధుల సమీకరణకు బ్యాంకులు ఆకర్షణీయమైన, వినూత్న డిపాజిట్ పథకాలను ఆవిష్కరించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించారు. తద్వారా బ్యాంకులు తమ రుణ వృద్ధిని కూడా సాధించగలుగుతాయని అన్నారు. ప్రభుత్వ బ్యాంకుల ఎండీ, సీఈఓల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మోసం, ఉద్దేశపూర్వక డిఫాల్ట్లకు సహకరించే అధికారులపై కఠిన పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. బ్యాంకింగ్ డిపాజిట్ వృద్ధి గత కొన్ని నెలలుగా క్రెడిట్ వృద్ధికి అనుగుణంగా లేదు. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినప్పటికీ క్రెడిట్– డిపాజిట్ వృద్ధి మధ్య అంతరం ఇప్పటికీ 3 నుంచి 4 శాతంగా ఉంది. ఇటీవల ఎస్బీఐ (అరశాతం), బ్యాంక్ ఆఫ్ బరోడా (125 బేసిస్ పాయిట్ల వరకూ) తమ డిపాజిట్ రేట్లను పెంచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మెరుగైన పనితీరు పట్ల ఆర్థికమంత్రి ఈ సమావేశంలో సంతృప్తిని వ్యక్తం చేశారు. బ్యాంకు మోసాలు వ్యక్తిగత ఖాతాదారులకు ఆర్థిక సంస్థల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని, ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందనీ ఆమె హెచ్చరించారు. అందువల్ల ఆయా పరిణామాలు తలెత్తకుండా బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు రూ. 68,500 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. వాణిజ్య బ్యాంకుల స్ధూల మొండిబకాయిల నిష్పత్తి 2023 మార్చి నాటికి 3.9 శాతం ఉంటే, సెపె్టంబర్ నాటికి 3.2 శాతానికి తగ్గాయి. ఈ సమావేశంలో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఎఆర్సిఎల్) ఖాతాల సేకరణ పురోగతిపై కూడా చర్చ జరిగింది. -
ఐపీవోలకు కంపెనీల క్యూ..
ఇటీవల సెకండరీ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. పెట్టుబడుల ప్రోత్సాహంతో ప్రైమరీ మార్కెట్ సైతం కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో కొత్త ఏడాది (2024)లోనూ పలు కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కట్టనున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పబ్లిక్ ఇష్యూల వెల్లువ కొనసాగనున్నట్లు అంచనా వేశారు. న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది (2023)లో ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 52,000 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రధాన ఎక్సే్చంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ ద్వారా దేశీ కార్పొరేట్లు సమీకరించిన నిధులివి. నిజానికి ఓవైపు వడ్డీ రేట్లు, మరోపక్క భౌగోళిక, రాజకీయ రిసు్కలు పెరిగినప్పటికీ.. ఐపీవోలు దూకుడు చూపుతున్నాయి. పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కోసం వెల్లువలా సెబీ తలుపు తడుతున్నాయి. దీంతో వచ్చే ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ బుల్లిష్ ధోరణిలోనే కొనసాగనున్నట్లు పలువురు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది (2022)లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మినహాయిస్తే పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 20,557 కోట్లు సమీకరించాయి. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పెట్టుబడులు అందుకున్నాయి. ప్రధానంగా మధ్య, చిన్న తరహా కంపెనీలు హవా చూపాయి. మార్కెట్ సెంటిమెంటు బలంగా ఉండటం ఇందుకు దోహదపడుతోంది. అయితే ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఏడాది మొదట్లో మార్కెట్లు డీలా పడిన సంగతి తెలిసిందే. కారణాలున్నాయ్.. ప్రైమరీ మార్కెట్లు జోరందుకోవడానికి లిస్టింగ్ లాభాలు, అందుబాటు ధరల్లో డీల్స్ కారణమవుతున్నట్లు పంటోమత్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఎండీ మహావీర్ లూనావత్ పేర్కొన్నారు. ఆయా రంగాల్లోని లిస్టెడ్ కంపెనీలు అధిక విలువల్లో ట్రేడవుతుండటం ఇందుకు జత కలసినట్లు అభిప్రాయపడ్డారు. పటిష్ట నియంత్రణా వ్యవస్థలు సైతం ఇందుకు అండగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 2023లో కనిపిస్తున్న ప్రోత్సాహకర పరిస్థితులు 2024లోనూ కొనసాగనున్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈసీఎం వి.ప్రశాంత్ రావు అంచనా వేశారు. ఇది బంగారు కాలంగా నిలిచే వీలున్నట్లు పేర్కొన్నారు. తరలివస్తున్న దేశ, విదేశీ పెట్టుబడులు, దేశీ మార్కెట్ల వృద్ధికిగల భారీ అవకాశాల కారణంగా వచ్చే ఏడాదిలోనూ ఐపీవో మార్కెట్ మరింత జోరు చూపనున్నట్లు జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల పూర్తి తదితర అనిశి్చతులు తొలగితే మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని పేర్కొన్నారు. మరో రూ. 26,000 కోట్లు నిధుల సమీకరణకు ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 24 కంపెనీలు అనుమతులు పొందాయి. ఇవి ఐపీవోలు చేపట్టడం ద్వారా రూ. 26,000 కోట్లు సమీకరించేందుకు వీలుంది. ఈ బాటలో మరో 32 కంపెనీలు లిస్టింగ్కు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. వీటి నిధుల సమీకరణ అంచనా రూ. 35,000 కోట్లుగా ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 2023లో ఐపీవోల ద్వారా 58 కంపెనీలు రూ. 52,637 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో రూ. 3,200 కోట్లు అందుకున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్ ఉంది. గతేడాది ఎల్ఐసీ (రూ. 20,557 కోట్లు) సహా.. 40 కంపెనీలు ఉమ్మడిగా రూ. 59,302 కోట్లు సమీకరించాయి. అయితే అంతకుముందు 2021లో 63 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా ఏకంగా రూ. 1.2 లక్షల కోట్లను అందుకున్నాయి. వెరసి రెండు దశాబ్దాలలోనే అత్యధిక నిధుల సమీకరణగా 2021 నిలిచింది! అధిక లిక్విడిటీ, ఇన్వెస్టర్ల ఆసక్తి, మార్కెట్ల జోరు నేపథ్యంలో గత మూడేళ్లలో 150 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. -
ఉడాన్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బీటూబీ ఈకామర్స్ సంస్థ(ప్లాట్ఫామ్) ఉడాన్ తాజాగా 34 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,822 కోట్లు) సమీకరించింది. సిరీస్–ఈ ఫండింగ్లో భాగంగా ఎంఅండ్జీ పీఎల్సీ అధ్యక్షతన పలు పీఈ సంస్థలు పెట్టుబడులను సమకూర్చాయి. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్ సైతం నిధులు సమకూర్చాయి. బిజినెస్ నిర్వహణకు అవసరమైన పూర్తిస్థాయి పెట్టుబడులను సమకూర్చుకోవడంతో రానున్న 12–18 నెలల్లో లాభాల్లోకి ప్రవేశించే లక్ష్యంతో సాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉడాన్ తెలియజేసింది. ప్రస్తుత రుణాలను ఈక్విటీగా మార్పు చేయడంతోపాటు.. తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించింది. వెరసి బ్యాలన్స్షీట్ పటిష్టంకానున్నట్లు పేర్కొంది. కస్టమర్ సేవలు, మార్కెట్ విస్తరణ, వెండార్ భాగస్వామ్యాలు, సరఫరా చైన్, క్రెడిట్ తదితరాలపై నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. -
నిధుల కొరత, వ్యూహాత్మక భాగస్వాముల వేటలో ‘కూ’
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ కూ తదుపరి దశ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిధులు సమీకరించడం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడుల రాక మందగించిన నేపథ్యంలో ’కూ’ ప్లాట్ఫామ్ విస్తృతంగా వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించగలిగే భాగస్వామితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. (మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్డే గిఫ్ట్: ఫాక్స్కాన్ పోస్ట్ వైరల్) స్టార్టప్ వ్యవస్థకు 2023 అత్యంత కష్టతరమైన సంవత్సరాల్లో ఒకటని మయాంక్ చెప్పారు. నిధుల ప్రవాహం ఒక్కసారిగా నిల్చిపోయిందని, దాదాపు బ్రేక్ఈవెన్కి దగ్గర్లో ఉన్నవి లేదా ప్రారంభ దశలోని స్టార్టప్లకు మాత్రమే నిధులు లభించాయని తెలిపారు. మరో ఆరు నెలలు సమయం లభించి ఉంటే తాము దేశీయంగా ట్విటర్ను (ప్రస్తుతం ఎక్స్) అధిగమించి ఉండేవారమని, కానీ పరిస్థితుల వల్ల ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) -
చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
మంచి పని కోసం క్రీడలను నిర్వహించడం.. ఇదీ రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తలపెట్టిన కార్యక్రమం. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తొలిసారిగా ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ ఛాంపియన్షిప్ 2023 ను నిర్వహించింది. దీని ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సిద్దిపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్లోని కస్టమ్-బిల్ట్ రేస్ ట్రాక్లో ఈ మోటార్ ఫెస్ట్ నిర్వహించింది. ఈ రేసులో ఎంతో మంది టాప్ రేసర్లు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని శ్రీ సత్య సాయి ఆస్పత్రిలో ఈనిర్మాణం చేపడతారు. దీనికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్ విజయవంతం చేసింది రోటరీ క్లబ్. -
అదానీ నిధుల సమీకరణ బాట రూ. 21,000 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ నిధుల సమీకరణపై కన్నేసింది. గ్రూప్లోని రెండు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా 2.5 బిలియన్ డాలర్లు(రూ. 21,000 కోట్లు) సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. గ్రూప్లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ. 8,500 కోట్లు చొప్పున సమీకరించ నున్నట్లు స్టాక్ ఎక్స్ఛేజీలకు సమాచారమిచ్చాయి. ఈ బాటలో అదానీ గ్రీన్ ఎనర్జీ సైతం శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహించ తలపెట్టినప్పటికీ ఈ నెల 24కు వాయిదా పడింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయాన్ని చేపట్టనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మధ్యప్రాచ్యం, యూరప్ నుంచి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక వెలువరించడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ చేపట్టిన రూ. 20,000 కోట్ల ఎఫ్పీవోను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినప్పటికీ కంపెనీ ఇన్వెస్టర్లకు సొమ్మును వాపసు చేసింది. ఇది జరిగిన మూడు నెలల తదుపరి తిరిగి గ్రూప్ కంపెనీలు వాటా విక్రయం ద్వారా నిధుల సమీకరణకు తెరతీయడం గమనార్హం! (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) -
ఫోన్పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ
వాల్మార్ట్ యాజమాన్యంలోని భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే (PhonePe) దూకుడు పెంచింది. వ్యాపార విస్తరణ కోసం నిధుల సమీకరణ చేపట్టిన ఫిన్టెక్ కంపెనీ అందులో భాగంగా తాజాగా మరో 100 మిలియన్ డాలర్లను (సుమారు రూ.820 కోట్లు) సమీకరించింది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) 12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న ఫోన్పే వ్యాపార విస్తరణలో భాగంగా 1 బిలియన్ డాలర్లను విడతలవారీగా సమీకరించినట్లు గత జనవరిలో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఫిన్టెక్ కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లు, వాల్మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్లు సమీకరించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) భారతదేశంలో తమ చెల్లింపులు, బీమా వ్యాపారాలను విస్తరించడంతో పాటు బ్యాంకింగ్, స్టాక్బ్రోకింగ్, ఓఎన్డీసీ ( ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఆధారిత షాపింగ్ వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సమీకరించిన నిధులను వినియోగించనున్నట్లు ఫోన్పే గత ప్రకటనల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే ‘పిన్కోడ్’ అనే ఓఎన్డీసీ ఆధారిత ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
యాక్సిస్ కొత్త ఈటీఎఫ్ ఫండ్... రూ. 50 కోట్లు సమీకరణకు టార్గెట్
ముంబై: దేశీయంగా ఏడో పెద్ద ఫండ్ హౌస్ యాక్సిస్ ఎంఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్వో)కు తెరతీస్తోంది. ఈ నెల 22న ఫండ్ ప్రారంభమైన ఫండ్, ఏప్రిల్ 5న ముగియనుంది. ఈ ఎన్ఎఫ్వో(ఓపెన్ ఎండెడ్ ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్) ద్వారా కనీసం రూ. 50 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్లైన్ ముగియకముందే మేల్కొండి! ఈ నిధులను ఎస్అండ్పీ 500 ఇండెక్స్ను ప్రతిబింబించే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు)లో ఇన్వెస్ట్ చేయనుంది. ఫండ్ను వినాయక్ జయంత్ నిర్వహించనున్నారు. అలాట్మెంట్ తేదీ నుంచి 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే 0.25 శాతం ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... అలాట్మెంట్ అయ్యాక 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అమలుకాదని ఫండ్ హౌస్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాఘవ్ అయ్యంగర్ పేర్కొన్నారు. వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడులు చేపట్టే ఇతర రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మాదిరికాకుండా ఈ ఫండ్ సొంత పథకాలు లేదా ఇతర ఫండ్ హౌస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫ్షోర్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదీ చదవండి: పీఎఫ్ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? -
రుణ రేట్లను పెంచిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. రెండు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు– కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన ఆయా బ్యాంకుల వ్యక్తిగత, గృహ, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటు (మే నుంచి 1.9 శాతం పెంపుతో 5.9 శాతానికి అప్) పెంపు బాట పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ, కోటక్, ఫెడరల్ బ్యాంక్ రేట్ల పెంపు వివరాలు ఇలా.. ► ఎస్బీఐ బెంచ్మార్క్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 7.95 శాతానికి చేరింది. ఈ రేటు అక్టోబర్ 15 నుంచీ అమల్లోకి వస్తుంది. మెజారీటీ కస్టమర్ల రుణ రేటు ఏడాది రేటుకే అనుసంధానమై ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితుల ఎంసీఎల్ఆర్ పావుశాతం చొప్పున పెరిగి వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి ఎగసింది. ఓవర్నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.60–7.90 శాతం శ్రేణిలో ఉన్నాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ వివిధ కాలపరిమితులపై 7.70–8.95 శ్రేణిలో ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75 శాతం. అక్టోబర్ 16 నుంచి తాజా నిర్ణయం అమలవుతుంది. ► ఫెడరల్ బ్యాంక్ ఏడాది రుణ రేటు అక్టోబర్ 16 నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ రేటు కోత కాగా, ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 2.70 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. రూ.10 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తాజా రేటు అమలవుతుంది. కాగా, రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్స్పై వడ్డీరేటును 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. నిధుల భారీ సమీకరణ లక్ష్యంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చేసిన ఈ సర్దుబాట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై బీఓబీ రేట్ల పెంపు కాగా, ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వడ్డీరేట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, మెచ్యూరిటీ కాలపరిమితులపై 135 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేటు పెరిగినట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుంచి నవంబర్ 15 వరకూ తాజా రేట్లు అమలవుతాయని కూడా వివరించింది. -
యూనికార్న్ హోదాకు సర్విఫై!
ముంబై: వివిధ స్మార్ట్ఫోన్ వెండార్ ప్రొడక్టుల(డివైస్లు) లైఫ్సైకిల్ను నిర్వహించే సర్విఫై తాజాగా 6.5 కోట్ల డాలర్లు(రూ. 520 కోట్లు) సమీకరించింది. సింగులారిటీ గ్రోత్ అపార్చునిటీ ఫండ్ అధ్యక్షతన పలు సంస్థలు నిధులు అందించినట్లు సర్విఫై వెల్లడించింది. తాజా పెట్టుబడులతో కంపెనీ విలువ దాదాపు బిలియన్ డాలర్లకు చేరినట్లు సర్విఫై వ్యవస్థాపకుడు శ్రీవాస్తవ ప్రభాకర్ పేర్కొన్నారు. శామ్సంగ్, ఆపిల్ తదితర గ్లోబల్ బ్రాండ్లకు సర్వీసులందించే సంస్థ రానున్న 18-24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే లక్ష్యంతో ఉన్నట్లు శ్రీవాస్తవ తెలియజేశారు. ఐరన్ పిల్లర్, బీనెక్ట్స్, బ్లూమ్ వెంచర్స్, డీఎంఐ స్పార్కిల్ ఫండ్ తదితరాలు పెట్టుబడులు సమకూర్చినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మరోసారి 7 కోట్ల డాలర్లవరకూ నిధులను సమీకరించే వీలున్నట్లు తెలియజేశారు. -
నా బంగారాన్ని బతికించండి!
కేన్సర్ను, దాని చికిత్సను తట్టుకోవడం పెద్దవాళ్లకే చాలా కష్టం. అలాంటిది నాలుగేళ్ల వయసులోనే ప్రాణాంతక కేన్సర్బారిన పడితే ఊహించడమే కష్టం. థెరపీలు, ఇంజక్షన్లతో చిన్నారుల బాధను చూడలేక తల్లిదండ్రులు నరకం అనుభవిస్తారు. దీనికి తోడు వైద్య ఖర్చులు కలలో కూడా ఊహించనంతభారంగా మారితే...అటు డబ్బు సమకూర్చుకోలేక, ఇటు రోజు రోజుకూ మృత్యువుకు చేరువవుతున్న బిడ్డను చూడలేక వారి బాధ వర్ణించలేం. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనే తపన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సరిగ్గా మనస్వి తల్లిదండ్రులు కూడా ఇదే మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. నాలుగేళ్ల పాప మనస్వికి న్యూరోబ్లాస్టోమా కేన్సర్ సోకింది. ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమాతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు మనస్వి తల్లిదండ్రులు. సెలూన్లో పనిచేసే పాప తండ్రి సంపాదన రోజుకు కేవలం 400 మాత్రమే. దీంతో వైద్యానికి అవసరమైన మొత్తాన్ని సమకూర్చు కోవడం కష్టంగా మారింది. అయినా చేయాల్సిందంతా చేశారు. ఇప్పటికే పాప వైద్య కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు. స్తోమతకు మించి ఆస్తులు అమ్మి, అప్పులు చేసి,ప్రతీ చివరి పైసా చికిత్సకు ఖర్చు చేశారు. మరోవైపు మనస్వికి సోకిన కేన్సర్ ముదురుతోంది. తక్షణమే మెరుగైన వైద్యం అందించకపోతే పాప ప్రాణాలకే ముప్పు అందుకే దయచేసి విరాళాలందించమని వేడుకుంటున్నారు. మనస్వికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ. 20 లక్షలు ($ 25769.54)గా అంచనా వేశారు. ‘‘మా తొలిచూలు బిడ్డ మనస్వి . పాపే మా ప్రపంచం.పాపే మాకు ప్రాణం. ముద్దుల మూటగట్టే ఆమె చిరునవ్వులు చూసి మురిసిపోయాం. కానీ విధి ఇంత క్రూరంగా ఉంటుందని ఊహించలేదు. గుండెలు బద్దలయ్యే వార్త తెలిసింది. నాలుగేళ్ల పసిప్రాయంలోనే మనస్వికి ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమా సోకింది. చికిత్సకు తట్టుకోలేక చిరునవ్వుకు దూరమై, పాప కష్టాన్ని చూడలేకపోతున్నాం. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి’’ అని మనస్వి తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు మీ మద్దతే మాకు రక్ష. దయచేసి విరాళం అందించండి! ఈ కష్టం నుంచి మా కుటుంబాన్ని గట్టెక్కించండి!! అని ప్రార్థిస్తున్నారు.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డను కాపాడండి: దాతలూ ఆదుకోండి ప్లీజ్!
రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. అందులోనూ కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగితే వారి జీవితం అంధకారంలోకి కూరుకు పోతుంది. తన ప్రాణానికి ప్రాణం, కుటుంబానికి పెద్దదిక్కైన 28 ఏళ్ల కొడుకు రాహుల్ పనినుంచి తిరిగి వస్తాడని ఎదురుచూస్తూన్న తల్లికి అతనికి ప్రమాదం జరిగిందని తెలిస్తే గుండె పగిలి పోదూ! సరిగ్గా నిర్మల జీవితంలోనూ ఇదే జరిగింది. కొడుకు వస్తాడనే సంబురంతో రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా కుమారుడి స్నేహితుడి ఫోన్కాల్ పిడుగులా మారింది. రాహుల్ బైక్ను లారీ ఢీకొట్టిందనీ, తీవ్రంగా గాయపడిన రాహుల్ని ఆసుపత్రికి తరలించారని అతని స్నేహితుడు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ వార్త వినేసరికి కుప్పకూలిపోయింది నిర్మల. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తింది. అక్కడ రాహుల్ జాడ కనిపించలేదు. దీంతో బిడ్డ ఏమై పోయాడో అన్న భయంతో గుండె వేగం మరింత పెరిగింది. అయితే దెబ్బలు బాగా తగలడంతో మరో ఆసుపత్రికి తరలించినట్లు నర్సు చెప్పడంతో కాస్త ఊరట పడింది. దెబ్బలు తగిలినా పరవాలేదు. బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు ఎలాగైనా కాపాడుకుంటా అంటూ ఆ తల్లి మనసు ఆరాట పడింది. ఆందోళనతో ఆ ఆసుపత్రి కెళ్లేసరికి అత్యవసర శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు తీసుకెళ్లారని తెలిసింది. దీంతో సాయం చేసిన వారందరికీ కన్నీళ్లతోనే ధన్యవాదాలు తెలుపుకొని, నా బిడ్డను ఎలాగైనా కాపాడు తండ్రీ అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకుంది. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రాహుల్ని కళ్లారా చూసేందుకు ఆరాటపడుతూ థియేటర్ బయట కూర్చొని ఎదురు చూస్తోంది. రాహుల్ చిన్నతనంలోనే తండ్రి కంటి చూపుకోల్పోయాడు. అప్పటినుంచి అన్నీ తానే అయ్యా కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నాడు. పగలూ రాత్రి కష్టపడి కూలిపని చేస్తూ, తల్లి దండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు జ్ఞాపకాల్లో మునిగిపోయింది నిర్మల. ఇంతలో థియేటర్ నుంచి బైటికి వచ్చి వైద్యులు చెప్పిన మాట విని నిర్మలమ్మ కాళ్ల కింద భూమి కంపించిపోయింది. ‘‘రాహుల్కి అన్నిపరీక్షలు చేశాం అతని మెదడులో తీవ్రమైన ఇంటర్నల్ బ్లీడింగ్ను గుర్తించాం. మెదడులోని రక్తస్రావాన్ని ఆపి, అతడి ప్రాణాల్ని రక్షించేందుకు అత్యవసరంగా అతనికి పుర్రెలో ఒక భాగానికి శస్త్రచికిత్స చేశాం. కానీ శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అయినా ఈ గండంనుంచి రాహుల్ గట్టెక్కాలంటే మరిన్ని ఆపరేషన్లు చేయాలి. సుమారు 10-15 రోజుల ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ చికిత్సకు మొత్తం ఖర్చు రూ. 7 లక్షలు ($ 8878.46) అవుతుంది’’ ఇదీ డాక్టర్లు చెప్పిన మాట. చెట్టంత ఎదిగిన కొడుకు అచేతనంగా పడిపోవడంతో, బిడ్డను బతికించుకోవడానికి అవసరమైన డబ్బు లేక ఆ నిరుపేద కుటుంబం అల్లాడిపోతోంది. మరోవైపు ప్రమాదానికి ముందు, తరువాత సంగతులు కొడుకు మర్చిపోతాడేమోననే భయం నిర్మలను ఆవరించాయి. అయినా తన కొడుకును దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దయగల దాతలు స్పందించి దయచేసి నా బిడ్డను రక్షించండి! అని నిర్మల దీనంగా వేడుకుంటోంది. సరిగ్గా కదలలేక, తిండిలేక, నిద్రలేక అల్లాడిపోతున్న కొడుకును ఈ స్థితిలో చూడలేపోతున్నాను. మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం అంటూ రాహుల్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు ఆ నిర్మలమ్మ దంపతులు. రాహుల్ ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి! దానం చేయండి!! (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
కెనరా బ్యాంక్ వడ్డీరేటు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీరేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. గురువారం నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి పెరిగింది. ఓవర్నైట్ నుంచి ఆరు నెలల కాలాలకు సంబంధించి కొత్త రేట్లు 6.75 శాతం నుంచి 7.45 శాతం శ్రేణిలో ఉన్నాయి. రెపో ఆధారిత రుణ రేటును 7.30 శాతం నుంచి 7.80 శాతానికి పెంచుతున్నట్లు కూడా బ్యాంక్ ప్రకటించింది. -
నా కొడుకు ప్రాణాలు దక్కాలంటే..
పిల్లాడికి పాలు పట్టడం కష్టంగా మారుతోంది సంగీతకు. ఎందుకుంటే ఆమె పొత్తిళ్లలో ఉన్న నాలుగు నెలల రిహాన్కు పుట్టుకతోనే గ్రహనమొర్రి ఉంది. దీంతో చనుబాలు తాగడం కష్టమయ్యేది. ఆకలితో గుక్కపట్టి ఏడ్చేవాడు. కానీ ఇటీవల మరో సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి రిహాన్ ఆరోగ్యం మరింతగా చెడిపోవడం మొదలైంది. పొట్ట ఉబ్బిపోయింది. కళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. వెంటనే ఆలస్యం చేయకుండా రిహాన్ను ఆస్పత్రికి తీసుకుళ్లారు సంగీతా, సుబ్రదీప్లు. రిహాన్కు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ప్రొగ్రసివ్ ఫ్యామిలియల్ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిట్ (లివర్ వ్యాధి) ఉన్నట్టుగా తేల్చారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో ఆ పసివాడి లివర్ పూర్తిగా చెడిపోయిందని చెప్పారు. అర్జంటుగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుంటే పసివాడి ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. దీని కోసం అదనపు పరీక్షలు చేయగా సంగీత లివర్ మ్యాచ్ అయ్యింది. అయితే ఆపరేషన్కు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. రిహాన్ తల్లిదండ్రులైన సంగీత, సబ్రదీప్ ఇద్దరు వికలాంగులే. సుబ్రదీప్కు వినికిడి సమస్య ఉండగా సంగీతకు రెండు కాళ్లు సమానంగా లేవు. దీంతో అను నిత్యం వాళ్లు అనేక ఇబ్బందుల మధ్య జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. వారి జీవితాల్లో ఉన్న ఏకైక ఆశా కిరణం, వారి ముద్దుల బిడ్డ రిహాన్. కానీ ఇప్పుడు రిహాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రోజులు గడిచే కొద్ది రిహాన్ మృత్యువుకు చేరువ అవుతున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు దాతగా లివర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆపరేషన్కి అవసరమైన సొమ్ము సమకూర్చుకోవడం ఆ దంపతులకు అసాధ్యంగా మారింది. దీంతో తమ కొడుక్కి జరిగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు. ఆ పిల్లాడి ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
గాలిలో దీపాలు.. నా కవల పిల్లల ప్రాణాలు..
పెళ్లైన చాన్నాళ్లకు తల్లిని కాబోతున్నానే వార్త తెలియగానే గాలిలో తేలినట్టుగా అనిపించింది. శుభవార్త తెలిసన మరుక్షణం నుంచి క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లూ పరీక్షలు చేయించుకునే దాన్ని. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ పిల్లలను అపురూపంగా చూసుకోవాలని నా భర్త కలలు కనేవాడు. ఒక్కరోజు పని మానేసేట్టుగా మా ఆర్థిక పరిస్థితి లేకపోయినా.. నా కోసం, రాబోయే పసివాళ్ల కోసం పనులు మానుకుని ఇంటి దగ్గర ఉన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నా బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని కలలు కంటూ ఎదురు చూస్తున్న సమయంలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. క్షణాల్లోనే నిభాయించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కంగారు పడిన నా భర్త వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నా చుట్టూతా డాక్టర్లు, నర్సులు వచ్చి చేరారు. క్రమంగా కళ్లు మూతలు పడుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియడం లేదు. కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రి బెడ్పై ఉన్నాను. కవలలు పుట్టారని చెప్పారు. కానీ... నెలలు నిండకుండానే కవలలు జన్మించడంతో ఇద్దరి ఆరోగ్యం క్రిటికల్గా ఉందని డాక్టర్లు తెలిపారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన చిన్నారులను ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. శ్వాస తీసుకోవడం మొదలు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. వారి ఆరోగ్యం సాధారణ స్థితికి రావాలంటే నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స అందివ్వాలని చెప్పారు. దీని కోసం రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది. పిల్లల ఆస్పత్రి ఖర్చులకు సరిపడా డబ్బులు సమకూర్చుకోవడం మా వల్ల కాని పని. మరోవైపు వైద్య చికిత్స అందకపోతే కవలల ప్రాణాలకే ప్రమాదం. ఆలస్యం జరిగే కొద్ది వాళ్లు మృత్యు ఒడికి దగ్గరవుతున్నారనే ఆలోచనలతో నా తల్లిమనసు తల్లడిల్లుతోంది. దయచేసి నా పిల్లల ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. నా బిడ్డలకు మరుజన్మ ప్రసాదించండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో దుర్గా.. పదిహేనేళ్లకే నీకు ఇన్ని కష్టాలా?
నా భర్త వికలాంగుడు, నాకు ఇద్దరు పిల్లలు. నేను పని చేస్తేనే మేం నలుగురం బతికేది. ఆస్తులు లేకపోయినా, మంచి ఉద్యోగాలు లేకపోయినా ఉన్నదాంట్లో మేము బాగానే ఉండేవాళ్లం. కానీ మూడేళ్ల వయసు నుంచే నా కూతురు దుర్గా భవానికి తరచు జ్వరం వస్తుండేది. ఆస్పత్రికి తీసుకెళ్తే కొద్ది రోజుల్లో తగ్గిపోయేది. కానీ పెరిగి పెద్దవుతున్నా మిగిలిన పిల్లలా పనులు చేయలేపోయేది. చిన్నచిన్న పనులకే త్వరగా అలసిపోయేది. పెరుగుతున్న కొద్ది తరచుగా జ్వరం రావడం, అలిసిపోతుండటంతో బిడ్డ ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. దుర్గ భవాని తరుచు అనారోగ్యం బారిన ఎందుకు పడుతుందో తెలియక పోయేది. ఎందరు డాక్టర్ల దగ్గరికి తిప్పినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. మరోపక్క ఇంట్లో పాప ఏడుపు ఆగడం లేదు. చివరకు తనకు పదిహేనేళ్లు వచ్చాక.. ఓ ఆస్పత్రిలో డాక్టరు అనేక రకాల పరీక్షలు చేసి.. చివరకు దుర్గకి కాంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని చెప్పారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించాడు. డాక్టర్లు చెప్పినట్టుగా దుర్గ భవానికి గుండె ఆపరేషన్ చేయించాలంటే రూ.4,50,000 లక్షలు అవసరం. ఏ ఆధారం లేని నేను అంత డబ్బును కలలో కూడా ఊహించలేదు. కానీ ఆలస్యం అవుతున్న కొద్ది నా బిడ్డ చావుకు దగ్గరవుతోంది. ఓవైపు వికలాంగుడైన భర్త, ఇద్దరు పిల్లలు, ఇంటి పని చూసుకుంటున్నాను. కుటుంబం గడవడం కోసం ఇంట్లో పని చేసేది నేను ఒక్కదాన్నే. ఎప్పుడైనా రూపాయో అర్థనో మిగిలితే అవి కూడా దుర్గ ఆస్పత్రి ఖర్చులకే సరిపోయేవి కావు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా నిస్సహాయస్థితి వల్ల నా కూతురు చావుకు దగ్గరవుతోంది. ఆమె ఆపరేషన్కు అవసరమైన నాలుగున్నర లక్షల రూపాయలు సర్థుబాటు చేసే పరిస్థితి నాకు లేదు. దయచేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ సహాయం కావాలి. ఆపరేషన్ జరిగేందుకు సాయం చేయండి. దుర్గకు మరో జన్మ ఇవ్వండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
గ్లోబల్ కంపెనీగా శ్రేయాస్ మీడియా
హైదరాబాద్: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ లో దేశంలో అగ్ర శ్రేణి కంపెనీ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదారులు ఈ నిధులను సమకూరుస్తున్నారు. 2011లో ప్రారంభమైన హైదరాబాద్కు చెందిన ఈ కంపెనీ ఇప్పటికే దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్ను విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉండడం విశేషం. ఇటీవలే కంపెనీ దుబాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను విస్తరించింది. విస్తరణ బాటలో మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్ తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు ఈ నిధులను వినియోగిస్తామని శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ప్రజలకు సులువుగా చేరువ కావడానికి దక్షిణాది సినిమాలతో కలిసి పనిచేసేందుకు దేశ, విదేశీ బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయి. స్పాన్సర్స్ కు సినిమాలతో పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చేలా ఈవెంట్స్ చేస్తున్నాం. నిర్మాతలకు సినిమా ప్రమోషన్ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. కార్యక్రమాల్లో సినీ తారలు ఉండడంతో బ్రాండ్స్ సులువుగా వీక్షకులకు చేరువ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇది విభిన్న కాన్సెప్ట్. సినిమా తారలు, నటులు, దర్శకులు, నిర్మాతలకు సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కో కార్యక్రమం గరిష్టంగా 10 కోట్ల మందికిపైగా ప్రజలు వీక్షిస్తున్నారు. సినిమాతో ముడిపడి ఏ కార్యక్రమం చేసినా స్పాన్సర్ బ్రాండ్స్ కోట్లాది మందికి చేరువ అవుతున్నాయి. అందుకే పెద్ద బ్రాండ్స్ సైతం స్పాన్సర్షిప్కు ముందుకు వస్తున్నాయి. దక్షిణాది సినిమాల గురించి దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇది మాకు, బ్రాండ్స్కు గొప్ప వ్యాపార అవకాశం. మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్ రంగంలో ఏక ఛత్రాధిపత్యం సాగిస్తున్నాం" అని వివరించారు. సినిమా చుట్టూ బ్రాండ్స్.. తెలుగుతోపాటు భారతీయ సినిమాలకు గ్లోబల్ అటెన్షన్ వచ్చింది. సినిమాను ఆసరాగా చేసుకుని కొత్త విభాగాల్లో ప్రవేశిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. ‘ఇందులో భాగంగా శ్రేయాస్ఈటీ ఓటీటీని పునర్నిర్మిస్తాం. కొత్త టెక్నాలజీతో ఇంటెరాక్టివ్ మూవీస్, మినీ, స్నాక్ మూవీస్ తోపాటు తొలిసారిగా 8డీ మూవీస్ పరిచయం చేస్తాం. రెట్రో మూవీస్ను పొందుపరుస్తాం. శ్రేయాస్కు చెందిన కంటెంట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సౌత్ ప్లస్తో 100కుపైగా బ్రాండ్స్, 600లకు పైచిలుకు ఆర్టిస్టులు, ఇన్ఫ్లూయెన్సర్లు చేతులు కలిపారు’ అని ఆయన వివరించారు. వచ్చే మూడేళ్లలో కస్టమర్లకు ఓటీటీ యాప్స్ ఉచితంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రకటనల ఆదాయం ఇందుకు కారణమని చెప్పారు. ఐదేళ్లలో రూ. 700 కోట్లు కంపెనీ 2027 నాటికి ఏటా 650 మూవీ ఈవెంట్స్, 120 మూవీ ప్రమోషన్స్ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది. గ్రూప్ టర్నోవర్ రూ.700 కోట్లు ఆశిస్తోంది. ఇందులో మూవీ ఈవెంట్స్ వాటా రూ.285 కోట్లు ఉంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.20 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇక లైవ్ ఈవెంట్స్ మార్కెట్ దేశంలో 2019లో రూ.8,300 కోట్లు నమోదు చేసిందని శ్రేయాస్ గ్రూప్ తెలిపింది. ‘మహమ్మారి కారణంగా మార్కెట్ తగ్గినప్పటికీ మూడేళ్లలో ఈ విభాగం కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకోనుంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ 2030 నాటికి రూ.5.3 లక్షల కోట్లకు చేరుకోనుంది’ అని వివరించింది. చదవండి: కంపెనీల ఐపీవోకి సెబీ గ్రీన్ సిగ్నల్, టార్గెట్ రూ.7వేల కోట్లు! -
IPO: రెయిన్బో టార్గెట్ రూ.2,000 కోట్లు
న్యూఢిల్లీ: మల్టీ స్పెషాలిటీ పిల్లల హాస్పిటల్ చెయిన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. 29న ముగుస్తుంది. దీని ద్వారా సంస్థ రూ. 2,000 కోట్లు సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. ఇష్యూలో భాగంగా రూ. 280 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రస్తుత వాటాదారులు 2.4 కోట్ల వరకు షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటర్లు రమేష్ కంచర్ల, దినేష్ కుమార్ చీర్ల, ఆదర్శ్ కంచర్ల.. ప్రమోటర్ గ్రూప్నకు చెందిన పద్మ కంచర్ల, అలాగే ఇన్వెస్టర్లయిన బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (గతంలో సీడీసీ గ్రూప్), సీడీసీ ఇండియా.. ఓఎఫ్ఎస్లో వాటాలు విక్రయించనున్నారు. అర్హత కలిగిన ఉద్యోగుల కోసం 3 లక్షల షేర్లను కేటాయించనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను .. గతంలో జారీ చేసిన నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లకు ముందస్తుగా చెల్లించడం, కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయడం, వైద్య పరికరాలను కొనుగోలు చేయడం తదితర అవసరాల కోసం సంస్థ వినియోగించుకోనుంది. చదవండి: ఐపీవో బాటలో క్యాంపస్ షూస్, గోదావరీ బయో..! -
ఇప్పటికే ఓ బిడ్డను పోగొట్టుకున్నా.. మళ్లీ ఆ బాధ తట్టుకోలేను..
కన్మణి నర్సుగా పని చేస్తోంది. తన చేతుల మీదుగా ఎన్నో కాన్పులు చేసింది. ఎంతో మంది చిన్నారులను ఈ లోకంలోకి తీసుకు వచ్చింది. కానీ విధి వక్రించి 2019 ఆమెకు పుట్టిన బిడ్డ నిమిషాల్లోనే చనిపోయాడు. ఆ బాధతో కన్మణి నర్సు ఉద్యోగం మానేసి నిరంతరం బాధతోనే ఉండిపోయేది. ఐవీఎఫ్ పద్దతులు పాటిస్తూ మరోసారి గర్భవతి అయ్యింది కన్మణి. 2022 ఫిబ్రవరిలో ఆరు నెలలు నిండగానే ఎప్పుడెప్పుడు బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని ఎదురు చూడసాగింది. ఇంతలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. లోపల బిడ్డకు ఏం జరుగుతుందో అనే కంగారులో వెంటనే ఆస్పత్రికి వెళ్లారా దంపతులు. వెంటనే కాన్పు చేయకపోతే తల్లిబిడ్డలను ప్రమాదమని చెప్పారు డాక్టర్లు. నెలలు నిండకుండానే పుట్టడంతో బాబు ఆరోగ్యం విషమంగా మారింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు నెలలుగా ఎన్ఐసీయూలోనే ఉన్నాడు. ఒక్కసారిగా కూడా తనివితీరా తమ చేతులతో బిడ్డను తాకింది లేదు, పట్టుకున్నది లేదు. సరైన వైద్యం అందివ్వకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ఎన్ఐసీయూలో ఉంచి బాబుకు వైద్య చికిత్స అందించేందుకు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కన్మణీ ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదు. ఆమె భర్త ప్రవీణ్ ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతంతో బతుకుతున్న ఈ దంపతులకు రూ. 20 లక్షల డబ్బును సమకూర్చడం కష్టమైన పని. తొలికాన్పులో బిడ్డను కోల్పోయి జీవచ్ఛవంలా బతుకుతున్న కన్మణి, ఆమె బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డ బతకడానికి ఒక అవకాశం ఇవ్వండి !
అమ్మా.. నొప్పిగా ఉందమ్మా.. ఇంజెక్షన్లు వేయోద్దని చెప్పమ్మా.. అంటూ నా కొడుకు బాధతో అడుగుతుంటే నా గుండెలు తరుక్కు పోతున్నాయి. వాడి బాధ చూడలేక పోతున్నాను. ఎందుకమ్మా ఇన్ని ఇంజెక్షన్లు ఇస్తున్నారు? ఎప్పుడు ఇంటికి వెళ్దామని ప్రశ్నిస్తుంటే.. దగ్గర సమాధానం లేదు. మూడేళ్లుగా నేను, నా భర్త ఇద్దరం, సయాన్ చుట్టే మా ప్రపంచం నిర్మించుకున్నాం. వాడు పుట్టినప్పటి నుంచి వాడు చేసే ప్రతీ అల్లరి పని మాకు ఎంతో ముచ్చటగొలిపేది. ఒక రోజు వాడికి స్నానం చేపిస్తుంటే కిడ్నీల దగ్గర ఏదో తేడాగా అనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు సయాన్కి అరుదైన కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధి (విల్మ్స్ ట్యూమర్) ఉందని తేల్చారు. డాక్టర్లు చెప్పిన మాట వినగానే మేమిద్దరం కుప్పకూలిపోయాం. చిన్నారి సయాన్కి అంత భయంకరమైన వ్యాధి ఎందుకు వచ్చిందా అని తల్లడిల్లిపోయాం. మమ్మల్ని ఓదార్చిన డాక్టర్లు సయాన్ వ్యాధి నయం చేసే అవకాశం ఉందన్నారు. కొన్ని సర్జరీలు చేసి మందులు వాడితే తిరిగి ఆరోగ్యవంతుడు అవుతారని భరోసా ఇచ్చారు. అయితే వాటి కోసం రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా భర్త కాయకష్టం చేసుకుని బతికే మనిషి. ఒక్కసారి అంత డబ్బు ఎలా సర్దుబాటు చేసే అవకాశం మాకు లేదు. మరోవైపు కళ్లముందే కొడుకు రోజురోజుకి మృత్యువుకి దగ్గరవుతున్నాడు. వాడికేమైనా జరగరానిది జరిగితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. ఈ క్షణంలో చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా బిడ్డ బతికేందుకు మీ వంతు సాయం అందించండి. వాడికి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా జీవితంలో పొందలేనివి నా బిడ్డకి అందివ్వాలనుకున్నా.. కానీ ఇప్పుడు?
నా జీవితంలో నేను సాధించలేనివి, పొందలేకపోయినవాటిని నా కూతురి అందివ్వాలనుకున్నాను. తాను బాగా చదువుకుని పెద్ద స్థాయికి చేరుకుంటుందని కలలు కన్నాను. అయితే మధ్యలోనే నా ఆశలు, నా కూతురి భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయాయి. అమ్మా... నాకు తలనొప్పిగా ఉందంటూ రోజుల తరబడి చెబుతుండటంతో పదకొండేళ్ల కార్తీకను విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. తలనొప్పే కదా మాత్రలతో తగ్గిపోతుందని భావించాం. కానీ కార్తీకను పరీక్షించాకా ఆ వయస్సు పిల్లల్లో వచ్చే అరుదైన మెడుల్లాబ్లాస్టోమా అనే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. తల నొప్పితో విలవిలాడుతున్న పాప బాధను చూడలేక ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి వైద్యం చేయించాం. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్కి వచ్చాం. ఇక్కడ పాప సమస్య పూర్తిగా నయం కావాలంటే సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. దాని కోసం ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందన్నారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మేశాం, అప్పులు కూడా చేశాం. కరోనా వల్ల ఉన్న ఆటోరిక్షా కూడా పోయి ప్రస్తుతం లారీ మెకానిక్గా నా భర్త పని చేస్తూ కష్టంగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాల్సిన నా బిడ్డ ఆస్పత్రి మంచంపై నొప్పికి విలవిలాడుతూ నిస్సత్తువగా మారిపోయింది. మరోవైపు చిన్న కూతురు నిహారిక విజయవాడలో బంధువుల ఇళ్లలో వదిలేసి వచ్చాం. ఫోన్ చేసినప్పుడల్లా.. అమ్మా, నాన్నా అక్కను ఎప్పుడు తీసుకు వస్తారని నిహారిక అడుగుతోంది. సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి మా ఆర్థిక పరిస్థితి బిడ్డకు శాపంగా మారినందుకు బాధపడని రోజంటూ లేదు. మా పాపకు పునర్జన్మను ఇచ్చి ఆమె బంగారు భవిష్యత్తును అందించేందుకు మీ సాయాన్ని వేడుకుంటున్నాను. మా బిడ్డను బాధను తొలగించేందుకు ఆపరేషన్కి అవసరమైన రూ.6 లక్షలు సాయం చేయాలని కోరుతున్నాను సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మా..! నేను మళ్లీ ఆడుకోగలనా? వాడికి ఆ భయంకర నిజం ఎలా చెప్పను?
‘అమ్మా.. నేనింకా ఎన్నాళ్లు ఈ హాస్పిటల్లో ఉండాలి. ఇంటికెప్పుడు వెళ్దాం ? నా ఫ్రెండ్స్తో ఎప్పుడు ఆడుకోవాలి’ అంటూ నా కొడుకు అడుగుతుంటే జవాబు చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. పక్కకు తిరిగి వాడికి కనిపించకుండా కన్నీళ్లు రాల్చడం తప్ప మరో దారి కనిపించడం లేదు. సరైన సహాయం అందకుంటే నా కొడుకు మళ్లీ ఇంటికి వెళ్లడం అనేది జరగదు. ఎందుకంటే వాడి ఒంట్లో ప్రాణాలు తోడేసే భయంకరమైన వ్యాధి ఉంది. ఎనిమిది నెలల క్రితం జ్వరంగా ఉందనడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. మందులు వాడిన ఆరోగ్యం బాగు కాలేదు సరికదా.. రోజురోజుకి వాడి పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ పరీక్షించిన డాక్టర్లు సివియర్ ఎప్లాస్టిక్ అనీమియా అనే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టుగా చెప్పారు. బిడ్డను కాపాడుకునేందుకు మా ఎమ్మెల్యే దగ్గరికి పోయాం, ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టాం, తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేశాం. అంతా కలిపి ఇప్పటి వరకు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశాం. బిడ్డ ఆరోగ్యం బాగు కావాలంటే ఇంకా కొన్ని థెరపీలు చేయాలని దానికి రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త కూలి పని చేస్తే నెలకు వచ్చే సంపాదన రూ.7000. ఆ డబ్బులు మా తిండికే సరిపోతాయి. ఇప్పుడు బిడ్డ ఆస్పత్రి ఖర్చుల కోసం పదిహేను లక్షల రూపాయలు తెచ్చే దారి మాకు కనిపించడం లేదు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి మరోవైపు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్న నా కొడుకు, ఇంటికెప్పుడు వెళ్దామంటూ అడిగినప్పుడల్లా.. బదులు చెప్పలేక నేను, నా భర్త రోదిస్తూనే ఉన్నాం. మా నిస్సహాయ స్థితి వల్ల నా బిడ్డ రోజురోజుకు చావుకు దగ్గరవుతున్నాడు. ఇప్పుడు వాడిని కాపాడేందుకు మానవతామూర్తులు సాయం కావాలి. నా కొడుకు భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయండి. చావుకు దగ్గరవుతున్న నా బిడ్డ ప్రాణాలకు కాపాడేందుకు అండగా నిలవండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లైన పదేళ్లకు పుట్టిన బిడ్డ.. పాలు తాగలేదు.. ఊపిరి తీసుకోలేదు
పెళ్లై పదేళ్లు గడిచినా మాకు పిల్లలు కలగలేదు. మా నిరీక్షణ ఫలించి మేము తల్లిదండ్రులయ్యాం. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పాలు తాగేందుకు పాప ఇబ్బంది పడుతుండటంతో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు, అన్నవాహికలో వ్రణం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాప తీసుకునే ఫీడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నట్టుగా చెప్పారు. లేకలేక పుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఆపరేషన్ చేయించాం. ఇక బిడ్డ ఆరోగ్యానికి ఢోకా లేదనే నమ్మకంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నాం. అవే మా జీవితంలో ఆనందంగా ఉన్న గడియలు. ఇలా ఇంటికి వచ్చామో లేదో సమస్య మళ్లీ మొదలైంది. ఊపిరి తీసుకోవడం పాపకు కష్టంగా మారింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. అక్కడి నుంచి ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూఎంతో మంది డాక్టర్లను కలిశాం. చివరకు పాప ఆరోగ్యం కుదుటపడాలంటే మరో ఆపరేషన్ చేయక తప్పదని డాక్టర్లు తేల్చి చెప్పారు. పాప ఆపరేషన్కి 20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారను. మొదటి ఆపరేషన్ చేయించేందుకే ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టేశాం. తెలిసివారందరి దగ్గరా అప్పులు చేశాం. ఆర్నెళ్లుగా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉండటంతో ఆయన ఉద్యోగం కూడా చేయడం లేదు. ఇప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి పాలు తాగడానికి, ఊపిరి తీసుకోవడానికి నా పసి పాపాయి ప్రతీ క్షణం ఇబ్బంది పడుతోంది. ఆమె ఒళ్లంతా సూదులు గుచ్చే ఉన్నాయి. ట్రీట్మెంట్ ఆగిపోయినా.. త్వరగా ఆపరేషన్ జరగకపోయినా పాప మాకు దక్కదు. అందుకే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టోను సంప్రదించాం. పదేళ్ల తర్వాత పుట్టిన నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయగలరు. ఆమె ఆపరేషన్ అయ్యే ఖర్చుకు మీవంతు సహయం చేయగలరు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
బతకడానికి పాప పోరాడుతోంది.. మీరు సాయం చేస్తారా ?
ఎందరో దేవుళ్లను మొక్కగా ఎన్నో పూజలు చేయగా.. చాన్నాళ్లకు పండండి పాపకి జన్మనిచ్చాను. ముద్దుగా మేఘ పిలుచుకున్నాను. కానీ వారం రోజులకే నా సంతోషం ఆవిరైంది. పాప పొట్ట ఉబ్బిపోయి శరీరం రంగులో మార్పు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు పాప శరీరంలో గాల్బ్లాడర్ పూర్తిగా వృద్ధి చెందలేదని చెప్పారు. మాకున్న కొద్ది ఆస్తులు, బంధువుల సాయంతో వెంటనే పాపని తమిళనాడు నుంచి ఢిల్లికి షిఫ్ట్ చేశాం. ఆపరేషన్ పూర్తయ్యింది. కానీ మాకు కొత్త కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. పాప బతకాలంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్లు తేల్చి చెప్పారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కు రూ. 22 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. నా భర్త ఓ ప్రైవేటు కంపెని ఉద్యోగి. నెలకు రూ. 7,000లకు మించి జీతం రాదు. ఇప్పటికే ఆస్తులు, బంగారం అమ్మేశాం. బంధువులు చేతనైనంత సాయం చేశారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఆపరేషన్ని ఆలస్యం అవుతున్న కొద్ది నా ముద్దుల చిన్నారి మేఘ ప్రాణాలకు ప్రమాదమని తెలుసు. కానీ నా కూతురు ప్రాణాలు దక్కించుకునేందుకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అందుకే నా పాప ప్రాణాలు కాపాడేందుకు మీ సాయం కోరుతున్నాను. మేఘ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి మీ వంతు సాయం చేయండి. పాపకి కొత్త జీవితాన్ని అందించండి.(అడ్వెటోరియల్) సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో కార్తీక్ ! చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష
చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు కార్తీక్. అవమానకరమైన ఆ శిక్షను తప్పించుకోవడానికి చిన్నప్పుడే బడి మానేశాడు, పెద్దయ్యాక పనికి వెళ్లడం కష్టంగా మారింది. చివరకు అతని జీవితమే ప్రమాదంలో పడింది. జన్యుపరమైన ఇబ్బందులతో పుట్టాడు కార్తీక్, చిన్నప్పటి నుంచే అతని ముఖంపై ట్యూమర్లు రావడం ప్రారంభమైంది. కూలి పని చేసుకునే తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సర్జరీల కోసం తమ శక్తికి మించి ఖర్చు చేశారు. అయినా ట్యూమర్లు రావడం ఆగలేదు. చివరకు డబ్బుల్లేక ఆ ట్యూమర్లను అలానే వదిలేయాల్సిన దుస్థితి ఎదురైంది కార్తీక్కి అతని కుటుంబానికి ముఖంపై పెరిగిన ట్యూమర్లతో స్కూలుకి వెళ్లిన కార్తీక్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదుర్కొలేక బడి మానేశాడు. ఆ తర్వాత అతనికి పని ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. చివరకు ఆ ట్యూమర్లు పెరిగి పెద్దవిగా మారి అతని చూపుకు ప్రమాదం తెచ్చాయి. ఎడమ కంటి నుంచి ధారాగా నీరు కారుతోంది. స్థానిక డాక్టర్లు అతన్ని పట్టించుకోవడం మానేశారు. నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు కార్తీక్ సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ముప్పై నాలుగేళ్లుగా చూస్తున్న దుర్భర జీవితం నుంచి కార్తీక్కి విముక్తి కలగాలంటే పలు సర్జరీలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆపరేషన్లకు రూ. 40 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అంత డబ్బు సర్థుబాటు చేసే స్థితిలో కార్తీక్ కుటుంబం లేదు. నిత్యం అవమానాలు, చీత్కరింపులు, అనారోగ్య సమస్యలతో క్షణక్షణం నరకం చూస్తున్న కార్తీక్కి ఇప్పుడీ ఆపరేషన్ ఒక్కటే దిక్కు. దీంతోనే అతను భవిష్యత్తులో అందరిలా సాధారణ జీవితం గడపగలడు. కార్తీక్కి చక్కని భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయగలరు. (అడ్వెటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
హైదరాబాద్ బేస్డ్ బ్లాక్ చెయిన్ స్టార్టప్.. ఇన్వెస్ట్ చేసిన అమెరికా కంపెనీ
బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేస్తున్న హైదరాబాద్ బేస్డ్ కంపెతీ త్రయంభూలో ఇన్వెస్ట్ చేసేందుకు అమెరికాకు చెందని వెంచర్ క్యాపిటలిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఫండ్ రైజింగ్లో మొదటి విడతగా రూ.4.20 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆక్టేవ్ వెంచర్స్ అంగీకరించింది. ప్రబిర్ మిశ్ర, సురజ్ తేజా, పురు మొండానీలు త్రయంభూ స్టార్టప్ని 2020లో హైదరారబాద్లో ప్రారంభించారు. ఈ సంస్థ వాతవరణ మార్పులు, కార్బన్ పాయింట్స్ వంటి అంశాలపై బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై వర్క్ చేస్తుంది. వివిధ సంస్థలకు ఇచ్చే కార్బన్ పాయింట్లను ఎన్ఎఫ్టీ టోకెన్లుగా మార్చి బ్లాక్ చెయిన్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహిస్తోంది. భవిష్యత్తులో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అడుగు పెట్టని చోటు ఉండదంటున్నా నిపుణులు. భారత ప్రభుత్వం సైతం డిజిటల్ కరెన్సీకి తెస్తామంటూ ప్రకటించింది. దీంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లు పెరుగుతున్నాయి. ఈ తరహా స్టార్టప్లు హైదరాబాద్లో నెలకొనడం శుభపరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. -
పెళ్లైన 20 ఏళ్లకు కాన్పు.. ప్రమాదంలో పసిబిడ్డ ప్రాణాలు
పెళ్లైన ఇరవై ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్నాననే వార్త విని మేమిద్దరం ఎంతగానో సంతోషించాం. ఎప్పుడెప్పుడు మా ఇంట బోసినవ్వులు వినిపిస్తాయా అని ఎదురు చూస్తుండగానే కాన్పు జరిగింది. పుట్టిన బిడ్డ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దగ్గు, జలుబు చేయడం ఒళ్లంతా నీలి రంగులోకి మారిపోతుండటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. నా చిన్నారికి అనేక పరీక్షలు చేశారు. చివరకు మా గుండెలు బద్దలయ్యే వార్త చెప్పారు డాక్టర్లు. కెనోటిక్ హార్ట్ డిఫెక్ట్, ఇంటర్వెంట్రిక్యూలమ్ సెప్టమ్ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. బాబుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుంటే ప్రాణాలకు ప్రమాదమంటూ వివరించారు. ఈ ఆపరేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు డాక్టర్లు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి నా భర్త ట్రాక్టర్ డ్రైవరుగా పని చేస్తాడు. అతను తెచ్చే సంపాదనే మాకు ఆధారం. కరోనాతో గత రెండేళ్లుగా ఆయనకు పెద్దగా పని లేదు. పైగా పిల్లల కోసం ఐవీఎఫ్కి చాలా ఖర్చు అయ్యింది. ఉన్న నగలన్నీ అమ్మేశాను. అధిక వడ్డీలకు అప్పు తెచ్చాం. ఇప్పుడు మా బిడ్డ ఆపరేషన్కు డబ్బులు సర్థుబాటు చేయలేని స్థితిలో ఉన్నాం. పెళ్లైన 20 ఏళ్లకు మా కలలు నెరవేరి మా ఇంట సంతాన భాగ్యం కలిగింది. కానీ ఆ సంతోషం లేకుండానే గుండె జబ్బు నా బాబు ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. నా కొడుకు గుండె ఆపరేషన్కి మీ వంతు సాయం అందించండి. వాడి ప్రాణాలకు కాపాడండి. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
సాయం చేయాలంటూ డైరెక్టర్ రాజమౌళి ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్
Director SS Rajamouli Humble Request To Donate Funds For Devika: ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా సహాయం కోరారు. తనతో పాటు కలిసి పనిచేసిన ఆర్టిస్ట్కు సహాయం చేయాలంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. 'బాహుబులి సినిమా సమయంలో దేవికతో కలిసి పనిచేశాను. ఆమె అనేక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కో ఆర్డినేటర్గా పనిచేసింది. ఆమె అభిరుచి, అంకిత భావం సాటిలేనివి. కానీ దురదృష్టవశాత్తూ ఆమె బ్లడ్ క్యాన్స్ర్తో పోరాడుతుంది. నేను ఇక్కడ షేర్ చేస్తున్న కెటో(KETO)ఫండ్ రైజింగ్కి మీ వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను' అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు దేవిక ఫోటోలను సైతం షేర్ చేశారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. సుమారు రూ.30-40కోట్లు తీసుకునే మీకు 3కోట్లు ఓ లెక్కనా? ఆమె ఆపరేషన్కు కావాల్సిన 3కోట్ల రూపాయలను నేరుగా మీరెందుకు సహాయం చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. Worked with Devika during Baahubali. She was the coordinator for many post production works. Her passion and dedication is unmatched. Unfortunately, she is battling a blood cancer. I humbly request to donate funds to the Ketto Campaign shared below. https://t.co/83umbPnI4M — rajamouli ss (@ssrajamouli) January 29, 2022 -
అయ్యో కరీమా! నీకెన్ని కష్టాలమ్మా..
గత ఇరవై ఏళ్లలో నా కూతురు బాధను చూడని రోజు లేదు. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతోంది నా కూతురు కరీమా తబ్రేజ్ సుయివాలా. 2001లో జన్మించింది. ఆమెకు రెండేళ్లు వయస్సున్నప్పుడు భయంకరమైన చర్మవ్యాధి లక్షణాలు కన్పించాయి. ఆ వెంటనే వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయింది. వినికిడి అండ్ స్పీచ్ థెరపీలు నాలుగేళ్లపాటు సాగాయి. ఆ సమయంలో ఆర్థిక పరిస్ధితి బాగలేకపోవడంతో ఏం చేయలేకపోయాం. దాంతో ఆమె వినికిడి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయింది. అప్పటికే సమస్యలతో ఉన్న కరీమాకు 2012లో మరోసారి కరీమాకు సైనస్ సమస్య వచ్చి పడింది. వైద్యులు దాని కోసం సినోనాసల్ పాలిపోసిస్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికీ నయం కాకపోవడంతో రెండు సంవత్సరాల తర్వాత ఫంగల్ సైనసిటిస్ కోసం ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ రెండు సార్లు చేయించుకుంది కరీమా. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. కరీమా ఆరోగ్యం బాగు పడేందుకు ఇప్పటికే ఇంట్లోని బంగారు ఆభరణాలను పూర్తిగా అమ్మేశౠం. ఇప్పుడు కొత్తగా కరీమాకు హైపర్ IgE సిండ్రోమ్ (HIES) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. నా కూతురు చాలా అరుదైన ఇమ్యునో డిఫిషియెన్సీ వ్యాధి బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా కరీమా ఊపిరితిత్తులు పూర్గిగా దెబ్బ తిన్నాయి. ఇప్పటికే ఒక దాంట్లో 3వ వంతు ఊపిరితిత్తిని తొలగించారు. ఇప్పుడు భయంకర వ్యాధి మరో ఊపిరితిత్తికి సంక్రమిస్తోంది. ఈ వ్యాధి నుంచి బయటపడలాంటే రెండు సంవత్సరాల పాటు మా అమ్మాయికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ (IVIG) చేయాలని వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో పాటుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ను కూడా చేయించాలని సూచించారు. కరీమా చికిత్స నిమిత్తం ఒక్కో ఇంజెక్షన్కు రూ. 25,000 ఖర్చవుతుంది. ఇలాంటివి ప్రతి నెలా 8 అవసరం. ఈ చికిత్స కోసం సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు వెల్లడించారు. ఎలాగైనా నా కూతురిని ఈ వ్యాధి నుంచి కాపాడేందుకు మేము శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజులు కరీమాకు అత్యంత కీలకమైనవి డాక్లర్లు వెల్లడించారు. కరీమా కోసం ఇల్లు, ఆభరణాలు అన్ని అమ్మేసి, వీలైన దగ్గర అప్పులను కూడా చేశాం. మేము ఇప్పటి వరకు మా కుమార్తె చికిత్స కోసం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేశాం. నా భర్త, తబ్రేజ్ ఒక సేల్స్మెన్గా పనిచేస్తాడు. అతని జీతం మొత్తం పూర్తిగా ఇంటి ఖర్చులకే అవుతోంది. మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిద్దరూ కరీమా కంటే చిన్నవారు. ఎలాగైనా మా కూతురిని కాపాడేందుకు మీ వంతు సహయం చేయగలరు. (అడ్వటోరియల్) -
కళ్లెదుటే ఓ కొడుకు చనిపోయాడు.. ఇప్పుడు ప్రమాదంలో మరో బిడ్డ ప్రాణాలు
మాది వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్ది పాటి భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. పెళ్లైన చాలా ఏళ్లకు ఓ బిడ్డ కలిగాడు. వాడు ఎదిగి బడికి పోతున్నప్పుడు చూస్తుంటే ముచ్చటేసేది. బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనే నమ్మకం కలిగేది. ఎప్పటిలాగే స్కూల్కి వెళ్లిన నా కొడుకు మళ్లీ ఇంటికి రాలేదు. బడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నా పదమూడేళ్ల బిడ్డ చనిపోయాడు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఎదిగొస్తున్న కొడుకు కళ్ల ముందే చనిపోతే పడే బాధ మాటల్లో వర్ణించలేం. ఎటు చూసినా, ఏం చేసినా నా కొడుకే కళ్ల ముందు కదలాడేవాడు. వాడి జ్ఞాపకాలు మరిచిపోవడం కష్టమైంది మా ఇద్దరికి. అలా నిరాశలోనే గడిచిపోతున్న మా జీవితంలో.. మరోసారి నేను తల్లి కాబోతున్నాను అనే వార్త వినగానే వెలుగు నిండింది. నెలలు ఎప్పుడు నిండుతాయా? మరోసారి మా ఇంట్లో బోసి నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయా ? అని గంపెడాశతో ఎదురు చూస్తుండగా, ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. మాకు మరోసారి మగ బిడ్డ పుట్టాడని డాక్టర్లు చెప్పినప్పుడు కొండంత సంతోషం కలిగింది. కానీ అది ఎక్కువ సేపు నిలవలేదు. నెలలు నిండకుండానే పుట్టడంతో బిడ్డ ఆరోగ్యం బాగాలేదని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఎన్ఐసీయూ వార్డుకి తరలించారు. సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డలు 2.5 కేజీల నుంచి 4.5 కేజీలు ఉంటే నా బిడ్డ కేవలం 1.1 కేజీనే ఉన్నాడు. ఊపిరి తీసుకోవడానికే కష్టపడుతున్నాడు. వాణ్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎన్ఐసీయూలో ఉన్న నా కొడుకును చూడటానికి వెళ్లినప్పుడు నా కళ్ల వెంబడి నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి. కొడుకు ఒంటి నిండా సూదులు గుచ్చి ఉన్నాయి. పైపులు అమర్చి ఉన్నాయి. వాడి కంటి కొనల నుంచి నీరు కారుతోంది. ఎంత యాతన అనుభవిస్తున్నాడో బిడ్డ అనిపించింది. నా బిడ్డ ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఎన్ఐసీయూలో ఉంచి వైద్యం చేయాలని డాక్టర్లు చెప్పారు. మొత్తంగా రూ. 8 లక్షల ఖర్చు వస్తుందన్నారు. ఏ ఆస్తులు లేని మాకు డాక్టర్లు చెప్పిన రూ.8 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదు. అప్పటికే బిడ్డ ఆస్పత్రికి ఖర్చులకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాం. పదమూడేళ్ల కొడుకు కళ్ల ముందే చనిపోతే వచ్చే కష్టం ఏంటో నాకు తెలుసు.. ఇప్పుడు రెండో బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నా కొడుకు కాపాడే దిక్కెవరని ఏడుస్తుంటే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. ఓ బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్నాను. నా చిన్నారి తండ్రి ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. ఆపదలో మీరు చేసే సాయం నా బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది. వాడికి భవిష్యత్తును అందిస్తుంది. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
‘బిడ్డ బాధ చూస్తే గుండె తరుక్కుపోతుంది.. కాపాడండి’
పొద్దున అనగా తినకుండా ఆయన బయటకు వెళ్లాడు. ఎర్రటి ఎండలో వాడిపోయిన ముఖంతో ఇంట్లో అడుగు పెట్టాడయన. నీళ్లేమైనా తాగుతావా అంటూ ఎదురెళ్లా ? నా ప్రశ్నకు బదులివ్వకుండా .. ఇంట్లో విలువైన వస్తువులేమి ఉన్నాయంటూ అడిగాడు. నా మెడలో తాళి బొట్టు తప్ప ఏం లేవని బదులిచ్చా. అది కాకుండా ఏమీ లేవా అంటూ మరోసారి అడిగాడు. లేవంటూనే చెప్పాను... చివరకు కనీసం నీళ్లయినా తాగకుండా మెడలో తాళి బొట్టు తీసుకుని బటయకు వెళ్లాడాయన.. ఈ ఒక్క రోజే కాదు ఆ విషయం తెలిసన మరుక్షణం నుంచి మా ఇంట్లో నుంచి సంతోషం బటయకు వెళ్లింది. బాధ, ఏడుపు, నిరాశలే ఇక్కడ గూడు కట్టుకున్నాయి. హేమంత్ మా కలల పంట. వాడు పుట్టినప్పటి నుంచి మా ఇళ్లు చీకు చింతా లేకుండా గడిచిపోతుంది. కరోనా కావడంతో స్కూల్ కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు. వాడి అల్లరి పనులతో ఇల్లంతా సందడిగా ఉండేది. కానీ రెండు నెలల క్రితం బిడ్డకి జ్వరం వచ్చింది. ఒళ్లంతా కాలిపోతుంది. ఒంట్లో ఎముకలన్నీ మెలి పెడుతున్న బాధతో విలవిలాడిపోతున్నాడు కొడుకు. వెంటనే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాం. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి మా ఊరిలో హేమంత్ని పరిశీలించిన డాక్టర్లు జ్వరానికి మాత్రలు ఇచ్చారు. కానీ బాబుకు వచ్చిన సమస్య ఏంటో తమకు అర్థం కావట్లేదన్నారు. చెన్నై వెళ్లి పెద్దాసుపత్రిలో చూపించాలన్నారు. మరునాడే చెన్నై బస్సెక్కాం. ఉదయం నుంచి పరీక్ష వెనుక పరీక్షలు చేస్తున్నారు ఆస్పత్రిలో. సూదులతో గుచ్చి రక్తం శాంపిల్స్ తీసుకుంటున్నారు. బిడ్డ బాధ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఏ దారుణమైన నిజం వినాల్సి వస్తుందో అని క్షణక్షణం ఆందోళనలతో నిండిపోయింది మనసు. కాళ్లు వణుకుతుండగానే డాక్టరు గదిలోకి వెళ్లాం. హేమంత్ రిపోర్టులు చేతిలో పట్టుకున్న డాక్టరు మా వైపు తిరిగాడు.. ‘మీ బాబుకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. వైద్య పరిభాషలో మెడుల్లోబ్లాస్టోమా అంటారు. అతనికి ఈ క్షణం నుంచే రేడియేషన్ చికిత్స అందివ్వాలి, రక్తమార్పిడి చేయాలి వీటికి తగ్గట్టు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం’ అని చెప్పారు. ఆయన ఒక్కో మాటకు మా ఇద్దరి గుండెలు ముక్కలయ్యాయి. దేవుడా నా కొడుక్కి ఎందుకింత కష్టం ఇచ్చావ్ అనుకుంటూ ఇంటికి వచ్చాం. హేమంత్ తిరిగి ఆరోగ్యవంతుడు అవ్వాలంటే డాక్టరు చెప్పినట్టుగా చికిత్స అందివ్వాలి. దానికి రూ.10 లక్షల ఖర్చు వస్తుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ అమ్మి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఆఖరికి మెడలో మంగళ సూత్రం కూడా అమ్మేశాను. నా భర్త ఆటో డ్రైవరుగా పని చేస్తాడు. ఆయన సంపద మూడు పూటలా తిండికే సరిపోతుంది. పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేది ? బ్రెయిన్ ట్యూమర్ పెడుతున్న ఇబ్బందులో బిడ్డ పడే యాతన చూస్తూంటే కన్నీళ్లు ఆగడం లేదు. పది లక్షల రూపాయలు సమకూర్చలేని మా అసమర్థత వల్ల చిన్నారి హేమంత్ ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఈ తరుణంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మా హేమంత్ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సహకారం అందివ్వండి. మీరు చేసే సాయం ఓ నిండు ప్రాణాలను కాపాడుతుంది. (అడ్వెటోరియల్) -
రూ. 8.56 లక్షల కోట్లు.. 2,220 లావాదేవీలు..
ముంబై: గత కేలండర్ ఏడాది(2021) డీల్స్పరంగా అత్యుత్తమమని కన్సల్టింగ్, అడ్వయిజరీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం 2,224 లావాదేవీలు నమోదుకాగా.. 2020లో జరిగిన లావాదేవీలతో పోలిస్తే 867 అధికమని తెలియజేసింది. ఇక వీటి విలువ సైతం 37 బిలియన్ డాలర్లు అధికంగా 115 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలియజేసింది. వెరసి అటు డీల్స్, ఇటు విలువపరంగా రికార్డ్ నమోదైనట్లు నివేదిక తెలియజేసింది. వీటిలో 42.9 బిలియన్ డాలర్ల విలువైన 499 లావాదేవీలు విలీనాలు, కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడించింది. ఈకామర్స్ స్పీడ్ గతేడాది 48.2 బిలియన్ డాలర్ల విలువైన 1,624 ప్రయివేట్ ఈక్విటీ డీల్స్ జరిగాయి. 101 ఐపీవోలు, క్విప్ల ద్వారా 23.9 బిలియన్ డాలర్ల లావాదేవీలు నమోదుకాగా.. వీటిలో 65 పబ్లిక్ ఇష్యూల వాటా 17.7 బిలియన్ డాలర్లు. ఇది కూడా రికార్డే! ఐపీవోలలో స్టార్టప్లు, ఈకామర్స్, ఐటీ కంపెనీల హవా కనిపించింది. ఏకంగా 33 యూనికార్న్లు ఊపిరిపోసుకున్నాయి. ఇక భారీ డీల్స్లోనూ 2021 రికార్డులు సాధించింది. బిలియన్ డాలర్ల విలువలో 14 డీల్స్ జరిగాయి. 99.9–50 కోట్ల డాలర్ల మధ్య మరో 15 లావాదేవీలు నమోదయ్యాయి. ఈ బాటలో 49.9–10 కోట్ల డాలర్ల పరిధిలోనూ 135 డీల్స్కు గతేడాది తెరతీసింది. డీల్స్ సంఖ్యలో ఇవి 8 శాతమే అయినప్పటికీ విలువలో 80 శాతంకావడం గమనార్హం! భారీ డీల్స్ గతేడాది జరిగిన లావాదేవీలలో 76 శాతం దేశీయంగా నమోదయ్యాయి. మిగిలినవి విదేశీ డీల్స్. ఇదేవిధంగా 1,624 డీల్స్ ద్వారా 48.2 బిలియన్ డాలర్లతో పీఈ పెట్టుబడులు కొత్త రికార్డులు నెలకొల్పాయి. వీటిలో 10 కోట్ల డాలర్లకు మించినవి 112 కాగా.. 66 శాతం నిధులు స్టార్టప్లలోకి ప్రవేశించడం ప్రస్తావించదగ్గ అంశం! వీటిలోనూ మళ్లీ 32 శాతం ఈకామర్స్ సంస్థలలోకి మళ్లాయి. రిటైల్, కన్జూమర్, ఎడ్యుకేషన్, ఫార్మా రంగ సంస్థలు పెట్టుబడులను బాగా ఆకట్టుకున్నాయి. పీఈ లావాదేవీల్లో 10 శాతాన్ని ఆక్రమించాయి. మరోపక్క 36 కంపెనీలు 2021లో క్విప్ల ద్వారా 6.2 బిలియన్ డాలర్లు సమీకరించాయి. వెరసి 2011 తదుపరి క్విప్ మార్గంలో అత్యధిక నిధుల సమీకరణ నమోదైంది. దివాలా చర్యలకు లోనైన దివాన్ హౌసింగ్(డీహెచ్ఎఫ్ఎల్)ను 5.1 బిలియన్ డాలర్లకు పిరమల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి:స్టాక్ మార్కెట్ ర్యాలీ.. 4 రోజుల్లో రూ.9.30 లక్షల కోట్ల సంపద -
ఆర్ఐఎల్కు భారీ నిధులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 30,000 కోట్లు) సమీకరించింది. తద్వారా గరిష్టస్థాయిలో ఫారెక్స్ బాండ్లను జారీ చేసిన తొలి దేశీ కార్పొరేట్గా నిలిచింది. మూడు దశలలో జారీ చేసిన ఈ బాండ్ల ద్వారా సమకూర్చుకున్న నిధులను రుణ చెల్లింపులకు వినియోగించే ప్రణాళికల్లో ఉంది. ఫిబ్రవరిలో గడువు తీరనున్న 1.5 బిలియన్ డాలర్ల రుణం దీనిలో కలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఫారెక్స్ బాండ్ల ఇష్యూకి దాదాపు 3 రెట్లు అధిక రెస్పాన్స్ లభించినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. వెరసి 11.5 బిలియన్ డాలర్లమేర డిమాండ్ కనిపించినట్లు వెల్లడించింది. అతిపెద్ద ఇష్యూగా రికార్డు... ఆర్ఐఎల్ తాజా నిధుల సమీకరణ దేశంలోనే అతిపెద్ద విదేశీ కరెన్సీ బాండ్ లావాదేవీగా నమోదైంది. గతంలో పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ 2014లో చేపట్టిన 2.2 బిలియన్ డాలర్ల ఫారెక్స్ బాండ్ల ఇష్యూ ఇప్పటివరకూ రికార్డుగా నమోదైంది. ఆర్ఐఎల్ 2.875 శాతం కూపన్ రేటుతో 10 ఏళ్ల కాలపరిమితి బాండ్ల జారీ ద్వారా 1.5 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ బాటలో 3.625 శాతం రేటుతో 30ఏళ్ల కాలావధిగల బాండ్ల జారీ ద్వారా 1.75 బిలియన్ డాలర్లను అందుకుంది. ఇదేవిధంగా 3.75 శాతం రేటుతో 40 ఏళ్ల బాండ్ల జారీ ద్వారా 0.75 బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. జపాన్ వెలుపల బీబీబీ రేటింగ్ కలిగిన ఒక ఆసియా కంపెనీ 40 ఏళ్ల కాలపరిమితిగల డాలర్ బాండ్లను జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం! మూడు కాలావధులుగల ఈ బాండ్ల గడువు 2032–2062 మధ్య కాలంలో ముగియనుంది. యూఎస్ ట్రెజరీలతో వీటి కూపన్(వడ్డీ) రేట్లు అనుసంధానమై ఉన్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. తద్వారా వీటి కూపన్ రేట్లను ట్రెజరీలకంటే 1.2 శాతం, 1.6 శాతం, 1.7 శాతం చొప్పున అధికంగా నిర్ణయించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా అతితక్కువ కూపన్ రేటుతో వీటిని జారీ చేసినట్లు తెలియజేసింది. డన్జోలో రిలయన్స్ రిటైల్కు వాటాలు 25.8 శాతం కొనుగోలు డీల్ విలువ రూ. 1,488 కోట్లు దేశీ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్.. ఆన్లైన్ నిత్యావసర సరుకుల డెలివరీ విభాగంలో కార్యకలాపాలు విస్తరించడంపై మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా క్విక్ కామర్స్ సంస్థ డన్జోలో 25.8 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,488 కోట్లు). ప్రస్తుత ఇన్వెస్టర్లు లైట్బాక్స్, లైట్రాక్, 3ఎల్ క్యాపిటల్, అల్టీరియా క్యాపిటల్ కూడా ఈ విడతలో మరికొంత పెట్టుబడులు పెట్టాయి. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహించే రిటైల్ స్టోర్లకు అవసరమయ్యే హైపర్లోకల్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా డన్జో అందిస్తుంది. అలాగే జియోమార్ట్ వ్యాపారుల నెట్వర్క్కు డెలివరీల సదుపాయాలు కూడా కల్పిస్తుంది. -
ఇంటికి పెద్ద దిక్కు అంటివి.. అయ్యో ! నీకే ఎందుకిలా జరిగింది బిడ్డా..
ఇంటి చుట్టూ పొగమంచు వీడనే లేదు. చలికి ఒళ్లంతా గజగజ వణుకుతోంది. అంతటి చలిలోనే అమ్మా వెళ్లొస్తా.. అంటూ వర్క్షాప్కి బయల్దేరుతున్న నా కొడుకు సన్బర్ఖాన్ని చూస్తేందే మనసంతా బాధతో నిండిపోయింది. ఇంత చలిలో బయటకు వద్దు.. ఇంట్లోనే ఉండిపో అని చెప్పాలని నోటి దాకా వచ్చిన మాటలను బయటకు రానీయలేదు. ఎందుకంటే వాడు పనికి వెళ్లక తప్పని పరిస్థితి మా కుటుంబానిది. ఫర్జానా పుట్టినప్పుడు మా ఇంట్లో ఆనందానికి అవధుల్లేవ్. కొంత కాలానికే సన్బర్ఖాన్, ఆ తర్వాత రెహాన్ పుట్టారు. అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో వాళ్ల నాన్న మాకు దూరమయ్యాడు. ఆయన చనిపోయినప్పటి నుంచి కుటుంబ బాధ్యతంతా నా మీదే పడింది. కుట్టు పని చేస్తే వచ్చే రూ.2000లే మా కుటుంబానికి ఆధారం. అక్కా పెళ్లికి తమ్ముడి చదువుకి అండగా ఉండేందుకు పదేళ్ల వయసులోనే బడి మానేసి వర్క్షాప్కి వెళ్తున్నాడు సన్బర్ఖాన్. చలిలో వణుకుతూ బయటకు పోయిన బిడ్డ ఎలా ఉన్నాడో అనే ఆలోచన తొలిచేస్తుండగా... తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేశాను. వర్క్షాప్కి వెళ్లిన సన్బర్ఖాన్కి యాక్సిడెంట్ అయ్యిందని, అతన్ని ఆస్పత్రి చేర్చారని డాక్టర్లు చెప్పారు. ఏం జరిగిందో ఏమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆస్పత్రికి వెళ్లాను. అప్పటికే సన్బర్ఖాన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. ప్రమాదం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని.. సన్బర్ఖాన్ కిడ్నీలు, జీర్ణవ్యవస్థకి బలమైన గాయాలు అయినట్టు డాక్టర్లు చెప్పారు. అయితే సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాలకు ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయ్యాం. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు.. నొప్పి భరించలేక మంచంలోనే పడి ఏడుస్తున్న సన్బర్ కనిపించాడు. ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు చెప్పారు. మరో 25 రోజులు పాటు ఆస్పత్రిలోనే ఉంచి ఖరీదైన వైద్యం చేయాలన్నారు. అందు కోసం రూ. 12 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. వైద్య చికిత్స అందకపోతే ప్రాణాలు దక్కవన్నారు. బిడ్డలను చదివించే ఆర్థిక స్థోమత లేక పన్నెండేళ్ల పిల్లాడు పనికి పోతున్నా ఆపలేని దుస్థితి నాది. మూడు పూటల ఇంటిల్లిపాది తిండి తినడమే కష్టం మాకు. ఐనప్పటికీ సన్బర్ ఆపరేషన్ కోసం అమ్మాయి పెళ్లి కోసం దాచిన కొన్ని నగలు కూడా అమ్మేశాను. ఇప్పుడు ఊపిరి తప్ప మా కుటుంబం దగ్గర ఇంకేం లేదు. మరీ సన్బర్ఖాన్ కాపాడుకునేది ఎలా? ఇన్ఫెక్షన్తో ప్రతీ రోజు నా కొడుకు పడుతున్న బాధ చూస్తూ తల్లిగా తట్టుకోలేకపోతున్నా. నా నిస్సహాయత వల్ల నా పిల్లలకు వచ్చిన పరిస్థితి తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు. వెక్కివెక్కి ఏడుస్తున్న నాకు, మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టో సంస్థ గురించి తెలిసింది. వెంటనే వారిని సంప్రదించాను. నా కొడుకు సన్బర్ ఖాన్ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. నా కొడుక్కి కొత్త జీవితాన్ని అందించండి. (అడ్వెటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
బెంగళూరు, ఢిల్లీ బాటలో హైదరాబాద్.. స్టార్టప్లకు మంచి రోజులు
నూతన ఆవిష్కరణలకు, స్టార్టప్లకు హబ్లుగా విరాజిల్లుతున్నాయి బెంగళూరు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఢిల్లీ)లు. దేశంలో సక్సెస్ బాట పడుతున్న స్టార్టప్లలో సగం ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఈ రెండు నగరాల బాటలోనే హైదరాబాద్ కూడ పయణిస్తోంది. 515 మిలియన్ డాలర్లు ట్రాక్సన్స్ సంస్థ తాజాగా జారీ చేసిన నివేదిక ప్రకారం 2016 నుంచి 2019 వరకు హైదరాబాద్ నగరం కేంద్రంగా ఉన్న 933 స్టార్టప్ కంపెనీలు 515 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించాయి. అంతకు ముందు 2016 నుంచి 2018 వరకు 1438 స్టార్టప్లు 274 మిలియన డాలర్ల పెట్టుబడిని ఆకర్షించినట్టు తెలిపింది. బెంగళూరు ఫస్ట్ హురున్ ఇండియా ఇటీవల ప్రకటించిన స్టార్టప్ల జాబితాలో బెంగళూరు నగరం మరోసారి ఫస్ట్ ప్లేస్ని దక్కించుకుంది. బెంగళూరు నగరంలో ఉన్న స్టార్టప్ కంపెనీలు రికార్డు స్థాయిలో 12, 360 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించాయి. ఆ తర్వాత స్థానంలో ఎన్సీఆర్ దాదాపు 11,100ల మిలియన్ డాలర్ల పెట్టుబడిని సాధించాయి. ఆ తర్వాత ముంబై నగరం 4,810 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ సైతం స్టార్టప్ల ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీ హబ్, వీ హబ్ల పేరుతో ఇప్పటికే ఇంక్యుబేషన్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ వెంటనే కరోనా సంక్షోభం తలెత్తడంతో స్థానిక స్టార్టప్లకు ఇబ్బందులు ఎదురైనా క్రమంగా ఇక్కడ కూడా పరిస్థితులు చక్కబడుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో బెంగళూరు, న్యూఢిల్లీలకు ధీటుగా హైదరాబాద్ స్టార్టప్లు కూడా ఫండ్ రైజ్ చేయగలవని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: స్టార్టప్లకు శుభవార్త! పెట్టుబడులకు వీరు సిద్ధమట? -
ఈ ఏడాది తొలి యూనికార్న్గా హోనాసా
న్యూఢిల్లీ: మామాఎర్త్ తదితర బ్రాండ్స్ పేరిట వ్యక్తిగత సౌందర్య సంరక్షణ సాధనాలు విక్రయించే ఈ–కామర్స్ సంస్థ హోనాసా కన్జూమర్ తాజాగా 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో 52 మిలియన్ డాలర్లు సమీకరించింది. తద్వారా ఈ ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థగా నిల్చింది. సెకోయా, సోఫినా వెంచర్స్, ఎవాల్వెన్స్ క్యాపిటల్ తదితర సంస్థలు ఈ విడత ఇన్వెస్ట్ చేశాయి. సంస్థ ఇప్పటికే ఫైర్సైడ్ వెంచర్స్, స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్ మొదలైన వాటి నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంది. కొత్తగా సమీకరించిన నిధులను వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్లు, నవకల్పనలు, పంపిణీ.. మార్కెటింగ్ వ్యవస్థలను మరింతగా విస్తరించేందుకు ఉపయోగించుకోనున్నట్లు హోనాసా సహ వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్ అలగ్ తెలిపారు. మామాఎర్త్, ది డెర్మా కంపెనీతో పాటు కొత్తగా ఆక్వాలాజికా బ్రాండ్ పేరిట స్కిన్కేర్ విభాగంలోకి కూడా ప్రవేశించినట్లు ఆయన వివరించారు. మామాఎర్త్ బ్రాండ్ కింద శిరోజాలు, చర్మ సంరక్షణ, కాస్మెటిక్స్ మొదలైన ఉత్పత్తులను, ది డెర్మా కంపెనీ బ్రాండ్ కింద 40 పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు హోనాసా మరో సహ వ్యవస్థాపకుడు, సీఈవో గజల్ అలగ్ తెలిపారు. అయిదేళ్ల క్రితం ఏర్పాటైన హోనాసా దేశీయంగా 1,000 పైచిలుకు నగరాల్లో ఉత్పత్తులు అందిస్తోంది. -
హైదరాబాద్ మెట్రో రికార్డ్! ఒక్క రోజులో రూ.13,119 కోట్లు సమీకరణ..
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రో భారీగా నిధులు సమీకరించింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ , కమర్షియల్ పేపర్ల ద్వారా రూ.13,119 కోట్లు సమీకరించింది. ఒక్కరోజుల్లో ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించడంలో ఇదో రికార్డుగా నిలిచింది. ఒక్కరోజులో నిధుల సమీకరణలో భాగంగా 2021 డిసెంబరు 29 బుధవారం మూడు రకాలైన బాండ్ పేపర్లను ఎల్ అండ్ టీ జారీ చేసింది. వీటిలో ఒక్కో బాండ్ ద్వారా రూ. 2,872 కోట్లు సమీకరించింది.. ఇలా బాండ్ పేపర్ల ద్వారా 8,616 కోట్లు సమీకరించింది. ఈ బాండ్ పేపర్లకు సంబంధించి వడ్డీ రేంజ్ 6.38 శాతం నుంచి 6.68 వరకు ఉంది. ఇక బాండ్ పేపర్ల మెచ్యూరిటీ విషయానికి వస్తే మూడేళ్ల నాలుగు నెలలు, నాలుగేళ్ల నాలుగు నెలలు, ఐదేళ్ల నాలుగు నెలలుగా ఉంది. మిగిలిన సొమ్మును కమర్షియల్ పేపర్ల ద్వారా సమీకరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ నిధుల సమీకరణలో భాగస్వామిగా వ్యవహరించింది. మిగిలిన నిధులు కమర్షియల్ పేపర్ల ద్వారా సమీకరించింది. ప్రత్యామ్నాయం కరోనా సంక్షోభం కారణంగా నష్టాలు పెరిగిపోవడంతో సాఫ్ట్లోన్ రూపంలో సాయం అందించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో నిర్వహిస్తోన్న ఎల్ అండ్ టీ ప్రభుత్వాలను కోరింది. ప్రభుత్వం దగ్గర సాఫ్ట్లోన్ అంశంలో పెండింగ్లో ఉండగానే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయాలను ఎల్ అండ్ టీ ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో మార్కెట్ ద్వారా నిధులు సమీకరణ ఎల్ అండ్ టీకి సులువైంది. చదవండి: కరోనా కష్టాలు.. వరుస నష్టాలు.. బయటపడేందుకు ఎల్ అండ్ టీ కొత్త ప్లాన్ -
సత్యశరణ్.. చిన్ని వయస్సులోనే నీకెన్ని కష్టాలు కన్నా..!
మూడు నెలల నుంచి నా ప్రపంచమంతా నా పిల్లాడి చూట్టే తిరుగుతుంది. వాడు ఈ లోకంలోకి వచ్చాక మా జీవితమే మారిపోయింది. వాడి బోసి నవ్వులు చూస్తూ మురిసిపోవడం మాకు రోజువారీ పనిగా మారింది. కానీ గత కొన్ని రోజులుగా వాడు పాలు తాగడం లేదు, నిద్ర పోవడం లేదు, శ్వాస భారంగా తీసుకుంటున్నాడు. బోసి నవ్వులు వాడి పసి మోము నుంచి ఎందుకు దూరమవుతున్నాయి? నా భర్త కూలిగా పని చేస్తుంటే నేను ఇంటి పనులకే పరిమితమయ్యాను. మాకు లేకలేక కలిగిన కొడుక్కి సత్యశరణ్గా పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. మాకు పెద్దగా సిరి సంపదలు లేకపోయినా సత్య రాకతో సంతోషానికి లోటు లేకుండా గడుపుతున్నాం. ఉన్నట్టుండి సత్య బరువు తగ్గడం మొదలైంది. ఆ వయస్సు పిల్లలతో పోల్చితే బలహీనంగా కనిపిస్తున్నాడు. పాలు కూడా తాగడం తగ్గించాడు. నిద్ర పోవడం లేదు. ఏ కాసేపో పడుకున్నా.. అంతలోనే ఉలిక్కపడుతున్నాడు. శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నాడు. బిడ్డకు ఏదో కష్టం వచ్చిందనిపించి ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఆస్పత్రిలో రకరకాల టెస్టులు చేసిన డాక్టర్లు నా బిడ్డకు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తేల్చారు. లార్జ్ పీడీఏ విత్ ఫీచర్స్ ఆఫ్ కంజెస్టివ్ ఫెయిల్యూర్ అనే సమస్య ఉందన్నారు. ఆపరేషన్ చేసి ఈ సమస్యను తొలగించవ్చని చెప్పారు. అందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. మాకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు. నా భర్త కూలి. లోన్లు, అప్పులు కూడా తెచ్చే పరిస్థితి లేదు. ఉన్నదాంట్లోనే విలువైన వస్తులు అమ్మగా వచ్చిన డబ్బులు ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. బిడ్డ ఆపరేషన్ చేయాలంటే రూ. 5 లక్షలు కావాలి. ఆలస్యమయ్యే ప్రతీ రోజు నా కొడుకు ప్రమాదానికి మరింత చేరువ అవుతున్నట్టే. అది తలచుకుంటే గుండె తరుక్కు పోతుంది. గుండె సమస్యతో సత్య పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే కంట నీరు ఆగడం లేదు. ఇదే సమయంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మా చిన్నారి సత్య శరణ్ ఆపరేషన్కి అవసరమైన సాయం చేయండి. వాడి ప్రాణాలను కాపాడండి. (అడ్వటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఐపీవోల హవా.. ఈ ఏడాది రూ.1.35 లక్షల కోట్లు.. వచ్చే ఏడాది?
ముంబై:వచ్చే ఏడాది(2022)లో పబ్లిక్ ఇష్యూలు వెల్తువెత్తనున్నట్లు బ్రోకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటికే 65 కంపెనీలు రూ. 1.35 లక్షల కోట్ల(15.3 బిలియన్ డాలర్లు)ను సమీకరించడం ద్వారా సరికొత్త రికార్డుకు తెరతీసిన నేపథ్యంలో నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ బాటలో వచ్చే ఏడాది సైతం ప్రైమరీ మార్కెట్ మరింత కళకళలాడనున్నట్లు నివేదిక తెలియజేసింది. వెరసి ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. 2 లక్షల కోట్ల(26 బిలియన్ డాలర్లు)వరకూ సమకూర్చుకునే వీలున్నట్లు వెల్లడించింది. ఇక గతేడాది(2020)లో పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు కేవలం 4.2 బిలియన్ డాలర్లు సమీకరించాయి. ఈ బాటలో గత మూడేళ్ల కాలాన్ని కలిపి చూసినప్పటికీ నిధుల సమీకరణ, లిస్టింగ్స్రీత్యా 2021 అత్యధికంకావడం విశేషం! కొత్త తరం కంపెనీలు నివేదిక ప్రకారం వచ్చే ఏడాదిలో కొత్త తరం టెక్నాలజీ, హెల్త్కేర్, కన్జూమర్, రియల్టీ, స్పెషాలిటీ కెమికల్స్ రంగాలకు చెందిన కంపెనీలు ప్రైమరీ మార్కెట్లో పాగా వేయనున్నాయి. ఇప్పటికే 15 బిలియన్ డాలర్ల సమీకరణకు అనుమతించమంటూ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. ఇకపై మరో 11 బిలియన్ డాలర్ల విలువైన ఇష్యూలు సెబీకి క్యూ కట్టే అవకాశముంది. వీటిలో పలు లార్జ్క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీలుండటం గమనార్హం! చదవండి: ఇష్యూ ధర సహేతుకంగా ఉండాలి.. లేదంటే ? -
ఆర్థిక ఇబ్బందుల్లో హైదరాబాద్ మెట్రో.. గట్టెక్కెందుకు కొత్త ప్లాన్
మెట్రో రైలు ప్రాజెక్టుకు అడ్డంకిగా మారిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ నడుం బిగించింది. మార్కెట్ నుంచి భారీ ఎత్తున నిధుల సేకరణ రెడీ అయ్యింది. వరుస నష్టాలు ఎల్ అండ్ టీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి హైదరాబాద్ మెట్రో రైలు గాడిన పడే సమయంలో కరోనా సంక్షోభం ఎదురైంది. ఏడాదిన్నరగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు కమర్షియల్ స్పేస్ నుంచి ఆశించిన ఆదాయం రావడం లేదు. రోజురోజుకు నష్టాల భారం పెరిగి పోయి చివరకు నిర్వహాణ భారంగా మారే పరిస్థితి వచ్చింది. దెబ్బ మీద దెబ్బ హైదరాబాద్ మెట్రోని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలంటూ ఇప్పటే పలు మార్లు ప్రభుత్వాలను కోరింది ఎల్ అండ్ టీ. మరోవైపు బ్యాంకుల నుంచి సాఫ్ట్లోన్ కోసం కూడా ప్రయత్నాలు చేసింది. అక్కడ జాప్యం అవుతుండటం మరోవైపు కోవిడ్ నిబంధనలు, వర్క్ ఫ్రం హోం, ఓమిక్రాన్ వేరియంట్ ఇలా అనేక అంశాల కారణంగా ఆశించిన స్థాయిలో మెట్రో ఆదాయం పెరగడం లేదు. దీంతో ఆర్థిక పరిపుష్టి కోసం ఎల్ అండ్ టీ సంస్థ మార్కెట్కు వెళ్లాలని నిర్ణయించింది. రూ. 13,600 కోట్లు మార్కెట్లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ చేయడం ద్వారా రూ. 8,600 కోట్లు కమర్షియల్ పేపర్ల ద్వారా మరో రూ.5,000 కోట్లు మొత్తంగా రూ. 13,600 కోట్ల నిధులు సమీకరించాలని ఎల్ అండ్ టీ మెట్రో నిర్ణయించినట్టు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు కమర్షియల్ పేపర్ ద్వారా సేకరించే నిధులకు వన్ ఇయర్ మెచ్యూరిగా టైంగా ఉండగా వడ్డీ 5 నుంచి 5.30 శాతం వరకు ఉండవచ్చని అంచనా. ఇక నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ విషయంలో మెచ్యూరిటీ సమయం ఐదేళ్లు ఉండగా వడ్డీ రేటు 6.30 శాతం నుంచి 6.60 శాతం వరకు ఉండవచ్చని అంచనా. క్రిసిల్ రేటింగ్.. ఎస్బీఐ క్యాపిటల్ ప్రముఖ రేటింగ్ సంస్థ అంచనాల ప్రకారం హైదరాబాద్ మెట్రో సంస్థకి ట్రిపుల్ ఏ (సీఈ) ఉంది. కాబట్టి మార్కెట్ నుంచి కన్వర్టబుల్ డిబెంచర్స్, కమర్షియల్ పేపర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ సులువుగానే జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్ ద్వారా డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు జారీ కానున్నట్టు సమాచారం. నష్టం రూ.1,767 కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్)ని డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్దతిన ఎల్ అండ్ టీ నిర్మించింది. 35 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు సర్వ హక్కులు ప్రభుత్వానికి దాఖలు పడతాయి. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మేర హెచ్ఎంఆర్ విస్తరించి ఉంది. ప్రస్తుతం మెట్రో రైలుకి రూ.1.767 కోట్ల నష్టాల్లో ఉంది. ఇందులో రూ.382 కోట్ల నష్ట గతేడాది కాలంలో వచ్చింది. చదవండి: ఒమిక్రాన్ భయం.. మెట్రోకు దూరం దూరం! -
‘మాటలు రాకపోయినా.. వాడి బాధ ఏంటో నాకు తెలుసు’
పొద్దున అనగా బటయకు వెళ్లిన మనిషి ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నాను. పాలేమైనా పట్టాలేమో అని ఊయల్లో ఉన్న పిల్లాడి వైపు చూస్తూ కడుపుపై నిమిరాను. అలా నా చేతి వేలు శరీరాన్ని తాకిందో లేదో ఆరు నెలల వయసున్న నా కొడుకు తన చిట్టి చేతులతో నా వేలుని గట్టిగా పట్టుకున్నాడు. వాడికి మాటలు రావు, కానీ నా వేలిని వాడలా గట్టిగా పట్టుకోవడానికి గల కారణం నాకు తెలుసు. ‘అమ్మా... నొప్పి భరించ లేక పోతున్నా.. ఏదైనా చేయమ్మా’ అంటున్నాడు నా బిడ్డ. మాయదారి జబ్బు వల్ల ఆ పసిప్రాణం నొప్పితో విలవిలాడుతోంది. నేను బినీషా, నా భర్త పేరు లిబిష్. మారి కేరళలోని కోజికోడ్. మాకిద్దరు పిల్లలు. కూలి పని చేస్తూ నెలకు రూ.5000 సంపాదిస్తూ నా భర్త కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. డబ్బులు లేకపోయినా పిల్లలే మా ఆస్తిగా భావించాం. మూడో బిడ్డగా విహాన్ మా కుటుంబంలో ఓ భాగమయ్యాడు. అయితే వాడికి రెండు నెలలు వయసప్పుడు ఆగకుండా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కడుబు దగ్గర వాపు కూడా కనిపిచింది. అంతే వెంటనే వాడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. వివిధ పరీక్షలు చేసిన డాక్టర్లు విహాన్కి డీకాంపన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నట్టుగా నిర్థారించారు. బైలరీ ఆర్టేసియా అనే అరుదైన ఈ వ్యాధి కారణంగా పేగుల్లోకి చేరాల్సిన బైల్ కాలేయంలోనే ఉండిపోతుంది. దీని వల్ల కాలేయం వాచి.. చివరకు మరణం సంభవించవచ్చని వివరించారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం మంచిదని, దానికి రూ. 19 లక్షల ఖర్చు వస్తుందని చెప్పారు. అంత డబ్బు మా దగ్గర లేదు కాబట్టి మరో మార్గం చూడమని డాక్టర్లకు కోరాం. మా పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్లు విహాన్కి కసాయ్ ప్రొసీడర్లో వైద్యం అందించారు. కాలేయంలో పేరుకు పోయిన బైల్ని వైద్య పరంగా బయటకు పోయేలా వైద్యం అందివ్వడం మొదలు పెట్టారు డాక్టర్లు. విహాన్ ఆరోగ్యం కొద్దిగా మెరుగవుతున్నట్టే అనిపించింది. వైద్యం కోసం ఇంట్లో నగలను, ఉన్న కొద్దీ ఆస్తులను ఆమ్మేసి రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశాం. ఇక పరిస్థితి చక్కబడుతుందనే నమ్మకం కలగడం మొదలైంది. కానీ మాకు నిరాశే ఎదురైంది. మళ్లీ సమస్య మొదటి కొచ్చింది. మరోసారి విహాన్ను పరీక్షించిన వైద్యలు లివర్ ట్రాన్ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు. నా లివర్ విహాన్కు మ్యాచ్ అవుతుంది డాక్టర్లు నిర్థారించారు. అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి రూ.19 లక్షలు కావాలి. లివర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆపరేషన్కి అయ్యే ఖర్చు భరించే స్థోమత మాకు లేదు. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. రోజులు గడిచే కొద్ది విహాన్ మృత్యువుకి చేరువ అవుతున్నాడు. విహాన్కి ఆపరేషన్ జరిగేందుకు మీ వంతు సాయం అందించండి. వాడికి నొప్పితో విలవిలాడుతున్న ఆ ప్రాణాలకు ఓ భవిష్యత్తును ఇవ్వండి.(అడ్వటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఐపీవోకి జెసన్స్ ఇండస్ట్రీస్ రూ. 900 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: స్పెషాలిటీ కోటింగ్ ఎమల్షన్స్ తయారీ సంస్థ జెసన్స్ ఇండస్ట్రీస్ .. పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. ఐపీవో ద్వారా సుమారు రూ. 800–900 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది.. ఇందుకు సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐపీవోలో భాగంగా రూ. 120 కోట్ల విలువ చేసే షేర్లు కొత్తగా జారీ చేయనుండగా .. 1.21 కోట్ల షేర్లను ప్రమోటర్ ధీరేష్ శశికాంత్ గొసాలియా ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. ప్రస్తుతం గొసాలియాకు కంపెనీలో 86.53 శాతం వాటాలు ఉన్నాయి. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో దాదాపు రూ. 90 కోట్లు.. రుణాల తిరిగి చెల్లింపునకు ఉపయోగించనుంది. జేసన్స్ పెయింట్స్, ప్యాకేజింగ్, కెమికల్స్ తదితర రంగాలకు అవసరమైన స్పెషాలిటీ కోటింగ్ ఎమల్షన్స్ (ఎస్సీఈ), నీటి ఆధారిత ప్రెజర్ సెన్సిటివ్ అడ్హెసివ్స్ (పీఎస్ఏ) మొదలైన ఉత్పత్తులను జెసన్స్ ఇండస్ట్రీస్ తయారు చేస్తోంది. ఆసియా–పసిఫిక్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా తదితర మార్కెట్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 901 కోట్ల ఆదాయంపై రూ. 30 కోట్ల లాభం ఆర్జించింది. 2021లో ఆదాయం 20 శాతం పెరిగి రూ. 1,086 కోట్లకు, లాభం 213 శాతం ఎగిసి రూ. 93 కోట్లకు చేరింది. చదవండి: మెడ్ప్లస్ హెల్త్, రేట్గెయిన్ ఐపీవోలకు ఆమోదం -
లేకలేక పుట్టిన బిడ్డకి ఎంత కష్టం వచ్చింది
రమ్య, ప్రశాంత్లది చూడచక్కని జంట. పెళ్లై చాన్నాళ్లయినా పెద్దగా గొడవలు లేవు. భార్య మనసెరిగి ప్రవర్తించే భర్త. అతని సంపాదనకు తగ్గట్టుగా ఇంటిని గుట్టుగా నడిపించే ఆమె. అయితే వారికి తీరని లోటు సంతానలేమి. గతంలో రమ్యకి రెండు సార్లు గర్భస్రావం కూడా జరగడంతో ఇక పిల్లలు పుట్టరనే నిరాశ వారిని ఆవహించింది. ఆ సమయంలో వాళ్లిద్దరికి ఓ శుభవార్త తెలిసింది. మూడోసారి నెల తప్పింది మొదలు రమ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ప్రశాంత్. అడినవి, అడగనివి అన్ని ఆమె చెంతకే తీసుకొస్తున్నాడు. పుట్టబోయే బిడ్డను తలచుకుని ప్రతీ క్షణం కలలు కంటున్నారు ఆ జంట. రమ్యకి ఆరో నెల ఉండగానే పొత్తి కడుపులో నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడే మగ కవలలకి జన్మనిచ్చింది రమ్య. నెలలు నిండకుండానే పుట్టడంతో ఇద్దరి పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా రెండో కవల పిల్లాడు కిలో కంటే తక్కువ బరువుతో పుట్టాడు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఆ బిడ్డను వెంటాడుతూనే ఉన్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి, ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రతీక్షణం అవస్థలు పడుతూనే ఉన్నాడు. రమ్య రెండో మగ బిడ్డకి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వైరల్ నిమోనియా సోకినట్టుగా గుర్తించారు. అంతేకాదు అప్పర్ లోబ్ కోలాప్స్ అయినట్టు కూడా వైద్య పరీక్షల్లో తేలింది. బాబు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందివ్వాలన్నారు. వైద్య చికిత్సకు రూ.25 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు డాక్టర్లు. ప్రశాంత్ నెలంతా కష్టపడి పని చేస్తే వచ్చే ఆదాయం రూ.10,000లు మించదు. అలాంటిది బిడ్డల వైద్య చికిత్స నిమిత్తం రూ. 25,00,000 నగదు తేవడం వారికి సాధ్యం కాని పని. ఈ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టోని సంప్రదించారు. ప్రశాంతి,రమ్యల బాబు ప్రాణాలు నిలిపేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
డెట్రాయిట్లో గవర్నర్ ఫండ్ రైజింగ్
డెట్రాయిట్:ఇండియన్ అమెరికన్ కూటమి ఆధ్వర్యంలో డెట్రాయిట్లో జరిగిన గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఫండ్ రైజర్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500ల మందికి పైగా అమెరికా, భారత సంతతికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అథితిగా గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్తో పాటూ, కాంగ్రెస్ ఉమన్ హ్యాలీ స్టీవెన్స్ , బ్రెండా లారెన్స్, మిచిగాన్ సెక్రటరీ అఫ్ స్టేట్ జోసెలిన్ బెన్సన్లు ఈ కార్యక్రమానికి అథితులుగా విచ్చేసారు. గవర్నర్ ఫండ్ కోసం జరిగిన విరాళాల సేకరణలో మిచిగన్ బిజినెస్ కమ్యూనిటీ రికార్డు స్థాయిలో 238 వేల డాలర్లు సేకరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ రెప్ పద్మ కుప్ప మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విట్మర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఈ విధమైన సభలు ప్రవాస భారతీయుల ఉనికిని భవిష్యత్తు ప్రణాళికల్ని పటిష్టం చేస్తాయన్నారు. యూఎస్ రాజకీయాలలో ఎన్నారై ఇండియన్ల పాత్రను పటిష్టం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ధవల్ వైష్ణవ్, అశోక్ బడ్డి, మురహరి దేవబత్తిని తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్పిరా ఐపీవోకు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: ఐటీ సొల్యూషన్లు అందించే ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా ఇన్స్పిరా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రకాష్ జైన్ రూ. 131 కోట్లు, ప్రకాష్ జైన్ కుటుంబ ట్రస్ట్ రూ. 277 కోట్లు, మంజులా జైన్ కుటుంబ ట్రస్ట్ రూ. 92 కోట్లు విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనున్నాయి. కంపెనీ ఆగస్టులో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 75 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తాజా ఈక్విటీ నిధులను వర్కింగ్ క్యాపిటల్తోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలు, రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో ఇన్స్పిరా పేర్కొంది. -
ఈ వారం ఐపీవోల టార్గెట్ రూ.21,000 కోట్లు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ మూడు ఐపీఓలతో పాటు రెండు లిస్టింగ్లు ఈ వారం సందడి చేయనున్నాయి. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ సేవలందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్తో పాటు.. కేఎఫ్సీ, పిజ్జా హట్ ఔట్లెట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్, ఐటీ సర్వీసుల సంస్థ లేటెంట్ వ్యూ అనలిటిక్స్ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.21,000 కోట్లను సమీకరించనున్నాయి. ఈ వారంలో రెండు లిస్టింగ్లు... గత వారంలో ఐపీఓను పూర్తి చేసుకున్న ఒమ్ని చానెల్ బ్యూటీ ప్రొడక్ట్ రిటైలర్ నైకా, ఫినో పేమెంట్స్ బ్యాంక్ షేర్లు గురు, శుక్రవారాల్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి. నైకా ఒక్కో షేరుకు రూ.1,085–రూ.1,125 మధ్య ధర శ్రేణిని నిర్ణయించి రూ.5,352 కోట్లను సమీకరించింది. ఇష్యూ 81.78 రెట్ల సబ్స్క్రిబ్షన్ను సాధించింది. గ్రే మార్కెట్లో ఇష్యూ గరిష్ట ధర(రూ.1,125)తో పోలిస్తే రూ.650 అధికంగా ట్రేడ్ అవుతున్నందుగా ప్రీమియం ధరతో లిస్ట్ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఫినో పేమెంట్స్ ఒక్కో షేరును రూ.560 – రూ.577 ప్రైస్బ్యాండ్తో జారీ చేసి రూ. 1,200 కోట్లను సమీకరించింది. ఈ పబ్లిక్ ఇష్యూ 2.03 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఈవారం మార్కెట్లో ఐపీవోల వివరాలు ఇష్యూ పేరు ప్రారంభం ముగింపు ఇష్యూ సైజు పేటీఎమ్ సోమవారం బుధవారం రూ.18,300 కోట్లు సఫైర్ ఫుడ్స్ మంగళవారం గురువారం రూ. 2,073 కోట్లు లేటెంట్ వ్యూ బుధవారం శుక్రవారం రూ. 600 కోట్లు చదవండి: 4 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా లీక్: సైబర్ఎక్స్9 -
ఐఏఎస్ కావడమే ఆమె లక్ష్యం.. కానీ ఇంతలోనే..
మా అమ్మాయి అనుప్రియకి పుస్తకాలే ప్రపంచం. చిన్నప్పటి నుంచి తను అంతే స్కూలు, కాలేజీ, హోంవర్క్, బుక్స్ ఇదే తన ప్రపంచం. ‘మీకేంటి అనుప్రియ ఉంది. పెద్దయ్యాక గొప్ప ఆఫీసరు అవుతుంది’ అంటూ చుట్టు పక్కల వారు అంటుంటూ ఆనందంతో కడుపు నిండిపోయేది. తిండితిప్పలు పక్కన పెట్టి పుస్తకాలతో కుస్తీ ఏందమ్మా అని ఎప్పుడైనా అడిగితే ‘నేను ఐఏఎస్ కావాలమ్మా.. ఈ దేశానికి సేవ చేయాలమ్మా’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతుండేది. చుట్టు పక్కల ఇళ్లలోనే కాదు బంధువుల్లోనే అనుప్రియ అందరికీ ఆదర్శం. అమ్మాయి బాగా చదువుకోవాలని, ఆమె చదువుకు ఏలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలని నేను, నా భర్త చర్చించుకోని రోజులేదు. ఎప్పటిలాగే పనిలో ఉండగా అనుప్రియ గదిలోంచి పెద్ద శబ్ధం వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే అచేతనంగా నేలపై పడిపోయి ఉంది. వెంటనే దగ్గరల్లోని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాం.. ఆయన కొద్ది సేపే పరీక్షించి పెద్దాసుపత్రికి అర్జంటుగా తీసుకెళ్లమంటూ సూచించాడు. అందినకాడికి అప్పులు చేసి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ నర్సులు, డాక్టర్లు అనుప్రియ చుట్టూ చేరి శాంపిల్స్ తీసుకున్నారు, టెస్టులు చేశారు. చాలా సేపటి తర్వాత మమ్మల్ని డాక్టరు పిలిచారంటూ కబురు వచ్చింది. డాక్టరు గదిలోకి వెళ్లిన తర్వాత ఆయన చెప్పిన మాటలు వింటుంటూ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. గుండె ఆగినంత పనైంది. ‘మీ అమ్మాయికి ఇలా జరిగిందని చెప్పడానికే బాధగా ఉంది. అక్యూట్ థ్రోంబోసిస్, బై ఫ్రంటల్ హేమరేజ్ ’ అంటూ డాక్టర్లు చెప్పారు.ఆ మాటలు ఆర్థం కాకపోయినా ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని అర్థమయ్యింది. అంతలోనే మరోసారి డాక్టర్లు మాట్లాడుతూ..తలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని, సర్జరీ చేయాలంటూ మొత్తం విషయం అర్థం అయ్యేలా చెప్పారు. సర్జరీ, మెడిసిన్స్, టెస్టులు, బెడ్ ఛార్జెస్ ఇలా అన్నింటికీ కలిపి రూ.15,58,200 ఖర్చు వస్తుందన్నారు. ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అనుప్రియ అంత త్వరగా కోలుకుంటుదన్నారు. నా భర్త నెలంత కష్టపడితేనే పది వేలు వస్తాయి. అవి మా కుటుంబ అవసరాలకే సరిపోతాయి. పైగా పాప ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పటికే చాలా అప్పులు చేశాం. ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలగన్న నా బిడ్డ ఉలుకుపలుకు లేకుండా ఆస్పత్రి మంచంపై ఉండటం చూసి కన్నీరు ఇంకేలా ఏడుస్తూనే ఉన్నాం. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెటో గురించి తెలిసింది. మా అనుప్రియ ప్రాణాలను కాపాడటానికి మీవంతు సాయం అందించండి. తన కల నెరవేర్చుకునే అవకాశం కల్పించండి. సహాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
భూలక్ష్మీ, దుర్గ.. అయ్యో! వీళ్లకు ఎంత కష్టం వచ్చి పడింది
నా పేరు దుర్గ. చిన్న వయస్సులోనే పెళ్లి అయ్యింది. నా మొగుడు పచ్చి తాగుబోతు. ఏ పని చేయకుండా ఇంట్లో ఉండటమే కాదు, నేను పని చేస్తే వచ్చిన కొద్ది డబ్బులు కూడా తాగుడుకే తగలేసేవాడు. ఇంట్లో రోజు గొడవలే. పెళ్లి జరిగినప్పటి నుంచి ఇళ్లో నరకంలా మారింది. కానీ ఇన్ని కష్టాల్లో నాకు ఏ కొంత సంతోషమైనా ఉందంటే అది నా కూతురు భూలక్ష్మిని చూస్తే కలిగేది. తనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంత కష్టమైనా సరే భరించాలి అనిపించేంది. భూలక్ష్మీ చదువు కోసం పక్కన పెట్టిన డబ్బులు కూడా తాగడానికి వాడుకోవడంతో నా భర్తను గట్టిగా నిలదీశాను. మళ్లీ గొడవైంది. ‘నువ్వు వద్దు, నీ కూతురు వద్దూ’ అంటూ నా భర్త నన్ను వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి పాపే లోకంగా బతుకుతున్నాను. తను కూడా అంతే ఈ అమ్మ కష్టాలను అర్థం చేసుకుని మెలిగేది. తనని చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చేది. కొండంత కష్టాల మధ్య ఓదార్పు లభించేది. ఓ రోజు పని ముగించుకుని ఇంటికి వచ్చే సరికి ఇంట్లో స్పృహ లేకుండా భూలక్ష్మీ పడిపోయి ఉంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇరుగుపొరుగు సాయంతో వెంటనే దగ్గర్లోని క్లినిక్కి తీసుకుపోయాను. వాళ్లు పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారు. భూలక్ష్మీ చదువు కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు చేశాను.. చివరకు అప్లాస్టిక్ ఎనిమీయా అనే ప్రాణాంతక క్యాన్సర్గా తేల్చారు. ఈ భయంకరమైన క్యాన్సర్ వల్ల భూలక్ష్మీకి ఎప్పటికప్పుడు రక్తం మార్పిడి చేయాల్సి వస్తోంది. ఏడాదిగా ఖర్చు గురించి ఆలోచించకుండా రక్తమార్పిడి చేయిస్తున్నాను, అయితే ఈ ఖర్చుల కోసం ఉన్న ఇంటిని, కొద్దొగొప్పొ ఉన్న పొలం అమ్మేశాను. అవి అమ్మగా వచ్చిన రూ.16 లక్షలు ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. ఇప్పటికీ నా కూతురు ఆరోగ్యం మెరుగుపడలేదు అప్లాస్టిక్ ఏనిమీయా క్యాన్సర్ చికిత్సకు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ ఖర్చు రూ. 30 లక్షలు అవుతుందన్నారు. బాధ్యత లేని భర్తతో ఎన్నో కష్టాలు పడ్డాను. ఒకప్పుడు ఆసరాగా ఉన్న ఇళ్లు, పొలం కూడా ఇప్పుడు నా దగ్గర లేవు. భూలక్ష్మీ ఆస్పత్రిలో ఉంటే నేను బయట వరండాలో ఉంటున్నాను. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలని, ఆపరేషన్ చేయించాలని తెలిసినవారందరినీ ప్రాథేయపడ్డాను. చివరకు మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. నా భూలక్ష్మీ ప్రాణాలు కాపాడేందుకు మీ సాయం కోరుతున్నాను. నా చిట్టి తల్లిని బతికించండి. సాయం చేయాలనుకునే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి -
గెలుపు బాటలో మరో స్టార్టప్.. ఓఫోర్ఎస్లోకి పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: బిజినెస్కి సంబంధించి సప్లై చైయిన్ వ్యవస్థలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా సేవలు అందిస్తోన్న ఓఫోర్ఎస్ (O4S) సంస్థ ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా దేశాలకు తమ సేవలను విస్తరించనుంది. ఇటీవల ఓఫోర్ఎస్లో పెట్టుబడులు పెట్టేందుకు థింక్ ఇన్వెస్ట్మెంట్స్, వెంచర్హైవే వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. మొత్తంగా 6 మిలియన్ డాలర్లను (రూ. 45 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. అంతకు ముందు జరిగిన చర్చల్లో రూ. 25 కోట్ల పెట్టుబడులు ఈ సంస్థలోకి వచ్చాయి. భారీ మొత్తంలో నిధులు రావడంతో విస్తరణ బాటలో ఉంది ఓఫోర్ఎస్ సంస్థ. దివయ్ కుమార్, శ్రేయస్ సిపానీలు ఓఫోర్ఎస్ని 2017లో స్టార్టప్గా ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం గురుగ్రామ్లో ఉండగా బెంగళూరు, హైదరాబాద్లలో రీజనల్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ సంస్థకు కష్లమర్లుగా ఐటీసీ, కోకకోల, హనీవెల్, ఆక్జోనోబెల్, మెండల్లెజ్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సప్లై చెయిన్కి సంబంధించి 500లకు పైగా సంస్థలు ఓఫోర్ఎస్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లతో పాటు ఎస్ఏఏఎస్ (SaaS) సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ఏషియన్ అండర్ 30 ఎంట్రప్యూనర్స్ జాబితాలో దివయ్ కుమార్, శ్రేయస్ సిపానీలు చోటు దక్కించుకున్నారు. -
యమున కన్నీరు ఆగేనా? బోసి నవ్వులు విరిసేనా?
యమునా, మోహన్లది అన్యోన్య దాంపత్యం. ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా ఆ జంట సంతోషంగానే జీవిస్తున్నారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక్క లోటు సంతానం. గతంలో యమునా ఓసారి ప్రసవించినా.. ఈ బిడ్డకు నూరేళ్లు నిండకుండానే దేవుడు తీసుకెళ్లిపోయారు. చాన్నాళ్ల తర్వాత యమున మరోసారి నెల తప్పింది. మరి వాళ్లింట్లో బోసి నవ్వులు వినిపించాయా ? పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో యుమనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. భరించలేని నొప్పిని పంటి బిగువన భరిస్తూనే ఉంది యమున. కాసేపటికి నర్సుల వచ్చి ‘నీకు డబుల్ కంగ్రాట్స్’ అని చెప్పారు. కవలలు పుట్టారని, వాళ్లలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి అంటూ తీపి కబురు అందించారు. పిల్లలు లేరంటూ ఇన్నాళ్లు పడుతున్న వేదనంతా ఒక్కసారిగా దూదిపింజంలా ఎగిరిపోయినట్టు అనిపించింది యమనకి. గంటల గడుస్తున్న డాక్టర్లు పసి బిడ్డలను నాకు చూపించడం లేదు. ఏమైందంటూ నర్సులను అడిగితే ‘ నెలలలు నిండకుండానే ప్రసవం జరగం వల్ల ఇద్దరి ఆరోగ్యం బాగా లేదని, ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని చెప్పారు. కానీ నెల రోజుల తర్వాత యమున గుండె బద్దలయ్యే వార్త డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడక పోడంతో మగ శిశువు మరణించాడని తెలిపారు. అంతేకాదు ఆడ శిశువు సైతం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతోందంటూ చెప్పారు. నెల రోజుల వయస్సున్న చిన్నారి శరరీం నిండా వైద్య పరికరాలే అమర్చి ఉన్నాయి. ఊపిరి తీసుకునేందుకు బిడ్డ అవస్థలు పడుతోంది. 12 వారాల పాటు చికిత్స అందిస్తే బిడ్డ ప్రాణాలు నిలబడతాయని డాక్టర్లు చెప్పారు. దాని కోసం రూ. 6 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. కానీ అప్పటికే రెండు నెలలుగా ఆస్పత్రికి అయిన ఖర్చులతో మోహన్, యమునల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోయాయి. దీంతో కన్నీరు కార్చడం తప్ప యమునకు మరో దారి లేని స్థితిలో ఉండిపోయింది. వైద్యానికి చేతిలో చిల్లగవ్వ లేని పరిస్థితుల్లో కొండంత వేదనలో యుమన, మోహన్లు ఉండగా వారికి మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. యమున మోహన్ల బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వగలరు. సాయం చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి -
నాకు చావాలని లేదు, పోరాడాలని ఉంది.. కానీ
నా పేరు యశ్వంత్. మాది విజయవాడ. పదేళ్ల పిల్లలాగే స్నేహితులతో ఆడుకోవడమంటే ఇష్టం. అయితే గత మేలో జ్వరం వచ్చింది,. అప్పటి నుంచి స్నేహితులతో ఆడుకోవడానికి నాకు వీలుపడటం లేదు. ఇక ముందు కూడా నేను ఆడుకోలేను కావొచ్చు. ఈ ఏడాది వేసవిలో వరుసగా పదిహేను రోజుల పాటు జ్వరం వచ్చింది. ఆ తర్వాత వాంతులు కూడా మొదలయ్యాయి. ఏదీ తిన్నా క్షణాల్లో బయటకి వచ్చేది. దీంత అమ్మానాన్నా భయపడ్డారు. నన్ను పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు రకరకాల పరీక్షలు చేశారు. సిరంజీలతో రక్తం తీసుకున్నారు. ల్యాబ్లకు పంపించారు. చివరకు నాకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ ఉందంటూ అమ్మానాన్నలకు డాక్టర్లు చెప్పారు. అదేం రోగమో నాతో పాటు అమ్మాన్నాలకు ముందుగా అర్థం కాలేదు. చివరకు అదో రకరమైన బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ఎలాగైనా నన్ను బతికించుకోవాలని మా అమ్మానాన్న ఆరాటపడ్డారు. రకరకాల పరీక్షలు చేయించారు. మెడిసిన్స్ ఇప్పించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నా శరీరం ఇంకా బలహీనమైపోయింది. ఒంట్లో శక్తి లేకుండా పోయింది. నడవలేని స్థితికి చేరుకున్నాను. చివరకు మందులతో లాభం లేదని డాక్టర్లు తేల్చారు. నా ఆరోగ్యం మెరుగుపడాలంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గమంటూ డాక్టర్లు తేల్చి చెప్పారు. అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయి, బతుకుపై ఆశ వదిలేసుకున్న నాకు, అమ్మానాన్నలకు ఆ మాట వరంలా అనిపించింది. కానీ ట్రాన్స్ప్లాంటేషన్కి దాదాపు రూ.20 లక్షల ఖర్చు అవుతుంది. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి మానాన్న రోజువారి కూలీ. నెలంతా కష్టపడితే రూ.6000లకు మించి రాదు. ఇప్పటికే నా ఆస్పత్రి ఖర్చుల కోసమని వాళ్లిద్దరు ఉన్నదంతా అమ్మేశారు. అయినకాడికి అప్పులు తెచ్చారు. నన్ను బతికించుకునేందుకు వాళ్లు చేయాల్సిందంతా చేశారు. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి ఇప్పుడీ ట్రాన్స్ప్లాంటేషన్కి అవసరమైన డబ్బులను నా తల్లిదండ్రులు సర్థుబాటు చేసే పరిస్థితి లేదు. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మీరు సాయం చేస్తే ఆపరేషన్కి అవసరమైన డబ్బు సర్థుబాటు అవుతుంది. నా ప్రాణాలు నిలబడతాయి. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి మాయదారి క్యాన్సర్తో రోజురోజుకి నా ఆరోణ్యం క్షీణిస్తోంది. ఒంట్లో శక్తి లేకుండా తగ్గిపోతుంది. కానీ నాకు బతకాలని ఉంది. స్నేహితులతో ఆడుకోవాలని ఉంది. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, మా అమ్మానాన్నలని మంచిగా చూసుకోవాలని ఉంది. అది జరగాలంటే మీ సహకారం అవసరం. నా ఆపరేషన్కి మీవంతు సాయం చేయండి. నా ప్రాణాలు కాపాడండి. (అడ్వర్టోరియల్) సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి -
అల్లూర్ ఇన్ఫ్రాకు అసెట్స్ అండ్ మోర్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (తక్కువ మొత్తంలో భాగస్వామ్య హక్కు) అనే వినూత్న కాన్సెప్్టను తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసిన ప్రాప్ టెక్ కంపెనీ అసెట్స్ అండ్ మోర్ ఖాతాలో మరో గ్రూప్ చేరింది. అల్లూర్ ఇన్ఫ్రా బెంగళూరు వద్ద ఏర్పాటు చేసే వాణిజ్య సముదాయాలకు నిధుల సమీకరణ, అమ్మకాలు, నిర్వహణ బాధ్యతలు కంపెనీ చేతికొచ్చాయి. రియలీ్టలో పెట్టుబడిని వ్యవస్థీకృతంగా మారుస్తూ ఇన్వెస్టర్లకు అద్దె రూపంలో ఖచి్చతమైన ఆదాయాన్ని అందించే విధంగా అసెట్స్ అండ్ మోర్ సేవలందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ గచి్చ»ౌలిలోని స్కై సిటీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టుకై 1.5 లక్షల చదరపు అడుగుల ప్రాపర్టీ నిర్వాహణ కోసం వాసవీ, శాంతా శ్రీరాం గ్రూప్తో ఒప్పందం చేసుకుంది. జహీరాబాద్ నిమ్జ్ సమీపంలో నిర్మించే స్పేస్ సిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కంపె నీ నిర్వహిస్తోంది. అసెట్స్ అండ్ మోర్ మాతృ సంస్థ పైసా ఎక్స్ పైసా మూడేళ్లుగా రూ.250 కోట్ల లోన్ పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తోంది. -
‘నా బిడ్డకు ఇప్పుడెలా ఉందో’.. ఆ తల్లి గోడు వినేదెవరు?
గణేశన్, లోగేశ్వరిలది అన్యోన్య జీవితం. భర్త కూలి పని చేసి తెచ్చిన దాంట్లోనే గుట్టుగా సంసారాన్ని నెట్టకొచ్చేది లోగేశ్వరి. ఇద్దరి మధ్య ఎటువంటి కలతలు, కలహాలు లేవు. కానీ వారికి ఉన్న ఏకైక లోటు సంతానం. గతంలో ఓ సారి లోగేశ్వరి ఓ బిడ్డకు జన్మనిచ్చినా.. ఆ పాపకు పుట్టిన రోజే నూరేళ్లు నిండిపోయాయి. భరించలేని నొప్పి రెండోసారి గర్భవతి అయ్యింది లోగేశ్వరి. భార్యని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు గణేశన్. ఈసారైనా తమ ఇంట ముద్దులొలికే చిన్నారి కాలు మోపుతుందనే నమ్మకంతో ఉన్నారు ఆ దంపతులు. ఇంతలో లోగేశ్వరికి 25 వారాలు నిండాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా పొత్తికడుపులో నొప్పులు మొదలయ్యాయి. భర్తను కంగారు పెట్టొద్దని ఆ నొప్పిని పంటి బిగువున భరించింది. కానీ నొప్పి అంతకంతకు పెరగడంతో భర్తను పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. ఏదో ఒకటి చేయమని. బిడ్డ ఎలా ఉందో నొప్పి భరించలేక కళ్లు మూసుకునే ఉంది లోగేశ్వరి. తనకు అంతా తెలుస్తూనే ఉంది. కష్టపడి భర్త ఆస్పత్రికి తీసుకెళ్లడం, చుట్టూ నర్సులు, డాక్టర్లు గుమిగూడి పరీక్షించడం అంతా లీలగా తెలుస్తూనే ఉంది. కానీ ఆమె మనసంతా తన నొప్పిపై కాకుండా లోపల బిడ్డ ఎలా ఉన్నాడో అనే ఆలోచనలతోనే నిండిపోయింది. గుండె ముక్కలైంది లోగేశ్వరి కళ్లు తెరిచి చూసే సరికి ఆమెను నర్సు నవ్వుతూ పలకరించింది. ‘నువ్వు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చావ్’ అని చెప్పింది. అప్పటి వరకు ఉన్న నొప్పులు, బాధలన్నీ ఆ క్షణంలో లోగేశ్వరి నుంచి మటుమాయం అయ్యాయి. ‘నా బిడ్డ ఎక్కడ చూడాలి అంటూ ఆతృతగా నర్సుని అడిగింది’ లోగేశ్వరి. అయితే ఆమె చెప్పిన మాట వినగానే ఆ తల్లి గుండె మళ్లీ ముక్కలైంది. ఎన్ఐసీయూలో నెలలు నిండకుండానే బిడ్డ పుట్టినందు వల్ల శిశువు ఆరోగ్యం బాగా లేదని. ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని నర్సు చెప్పింది. ఇదే మాట మొదటి సారి డెలివరీ అయినప్పుడు కూడా లోగేశ్వరికి ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. చివరకు ఆ బిడ్డ దక్కకుండా పోయింది. చేయూత కావాలి లోగేశ్వరి, గణేశన్ల చిన్నారి కూతురు అనారోగ్య సమస్యలతో ఎన్ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం కుదుటపడాలంటే చాలా రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందివ్వాలి. ఆస్పత్రి ఖర్చులకే రూ.10 లక్షలు మించి ఖర్చు అవుతుందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అంత ఖర్చు భరించే స్థోమత ఆ పేద తల్లిదండ్రులకు లేదు. అలాగని రెండోసారి పుట్టిన బిడ్డను చూస్తూ చూస్తూ వదులుకోలేరు. అప్పుడే ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోని సంప్రదించారు. లోగేశ్వరి, గణేశన్ల బిడ్డను బతికించాలంటే మన వంతు సాయం అవసరం. సాయం చేయాలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేయండి. -
చిన్నారి శ్రీయాన్కి ఎంత కష్టమో !
మా ఆయన పేరు రాజు. వ్యవసాయం చేసే వాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నంతలో బాగానే బతికే చింత లేని చిన్న కుటుంబం మాది. మా సంతోషాన్ని రెట్టింపు చేయడానికా అన్నట్టుగా వచ్చాడు శ్రీయాన్. ముద్దులొలికే శ్రీయాన్ మా ముద్దుల కొడుకు శ్రీయాన్. వాడి బోసినవ్వులతో మా ఇంట ఆనందాలు వెల్లివిరిసేవి. శ్రీయాన్ ఆలనాపాలన చూడటంతోనే నాకు రోజు గడిచిపోయేది. అయితే ఉన్నట్టుండి శ్రీయాన్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం గమనించాను. శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడే వాడు. నెలల పసిబిడ్డకు ఎందుకిలా జరుగుతుందా అనుకునే లోపే ఒక్కసారిగా బిడ్డ నీరసించిపోవడం మొదలైంది. నా గుండెలో దడ మొదలైంది. నేను నా భర్త రాజు బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. గుండె పగిలింది ఆ యేడు వ్యవసాయంలో వచ్చిన సొమ్ములతో హైదరాబాద్ చేరుకున్నాం. పెద్ద డాక్టర్లను కలిశాం. మా బిడ్డకు అంతా మంచి జరుగుతుందనే అనుకున్నాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ఏడాది కూడా నిండని నా బిడ్డకు లార్జ్ మస్కులర్ వెంట్రిక్యూలర్ సెప్టికల్ డిఫెక్ట్ అని చెప్పారు. అర్థం కాలేదు సార్ అడిగితే నీ బిడ్డ గుండెకు రంధ్రం ఉందంటూ చెప్పారు. ఓపెన్ హర్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. ఆ ఆపరేషన్కి రూ,.6,00,000 ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఆపరేషన్ చేయకుంటే బతుకు గండమే అన్నారు. మొదటి పుట్టిన రోజు జరుపుకోవడం కూడా కష్టమే అన్నారు. సాయం చేయండి ఉన్న కొద్ది పొలంలో వ్యవసాయం చేసుకుంటే గడిచే ఇళ్లు మాది. శ్రీయానే ఇప్పుడు మా ప్రపంచం కానీ. వాడి ఆరోగ్యం బాగాలేదు. వాడు లేకపోతే మాకు బతుకు లేదు. కానీ వాడి ఆపరేషన్కి అవసరమైన డబ్బులు మా దగ్గర లేదు. అప్పుడే మెడికల్ ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోను సంప్రదించాం. మా బిడ్డ ఆపరేషన్కు అవసరమైన డబ్బు సమకూరాలని ఆ దేవుళ్లని మొక్కుకుంటున్నాను. మీరు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి -
టారిఫ్లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ
న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్వర్క్లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్లు పెంచాల్సి వస్తే ఎయిర్టెల్ వెనక్కి తగ్గబోదు. (చౌక టారిఫ్ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్ చెప్పారు. -
పుట్టిన మూడు రోజులకే, ఒళ్లంతా గాయాలు..
కడుపులో బిడ్డం అడ్డం తిరగడంతో బాధ భరించలేకపోతోంది పుష్ప. ఆమెను వెంటనే ఆస్పతత్రికి తీసుకెళ్తున్నాడు ఆమె భర్త శరవణన్. ఆ దంపతులకు ఇంతకు ముందే ఓ బిడ్డ ఉన్నా పుట్టుకతోనే ఒకే కిడ్నీకి కలిగి ఉంది. దీంతో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండి దినదిన గండంగా ఆ బిడ్డ బతుకుతుంది. ఇప్పుడో రెండో బిడ్డ భూమి మీదకు రాకుండానే తల్లి కడుపులో ఆపసోపాలు పడుతోంది. మరోవైపు పుట్టబోయే బిడ్డకు ఏమీ కావొద్దని దేవుళ్లను మొక్కుకుంటున్నాడు శరవణన్. ఇంతలో ఆస్పత్రి వచ్చేసింది. పుష్సను పరిశీలించిన డాక్టర్లకు పరిస్థితి అర్థమైంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా తల్లిబిడ్డల ప్రాణాలకు ప్రమాదమని గ్రహించారు. వెంటనే సీ సెక్షన్ చేసి పుష్పకు పురుడు పోశారు. పుష్ప, శరవణన్ దంపతులకు మలి కాన్పులో ఆడపిల్ల కలిగింది. అయితే వారికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆ పసిపాప శరీరం పెలుసుగా మారుతూ నీలి రంగులోకి మారడం మొదలైంది, కంగారు పడిన తల్లిదండడ్రులు డాక్టర్లను పిలిచారు. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి నెలలు నిండకుండానే పుట్టినందు వల్ల పుష్ప కూతురికి అరుదైన పెరినాటల్ ఆస్ఫైక్సియా అనే వ్యాధి వచ్చినట్టు డాక్టర్లు తేల్చారు. దీంతో పాప శరీరం వెనువెంటనే పెలుసుగా మారిపోతుంది. ఒళ్లంతా గాయాలు అయినట్టుగా నొప్పి పెడుతోంది. ఆ బాధ భరించలేక చిన్నారి గుక్క పట్టి ఏడవని క్షణం లేదు. ఆ బిడ్డను కష్టాన్ని చూసి పుష్ప, శరవణన్లకు కన్నీరే మిగిలింది. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి పాపాను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్యం బాగయ్యే వరకు చికిత్స అందివ్వాలంటే ఎనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శరవణన్ ఆ డబ్బు సర్థుబాటు చేయలేనని తెలుసు. మరోవైపు కన్న కూతురి బాధను చూసి ఉండలేకపోతున్నారు శవరణన్, పుష్పలు. దీంతో పాప ఆరోగ్య ఖర్చుల కొరకు ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోను సంప్రదించారు. పుష్ప, శరవణన్ల చిన్నారి పాప తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే మీ వంతు సాయాన్ని కెట్టో ద్వారా అందివ్వగలరు. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి -
ఏయూ స్మాల్ బ్యాంక్ భారీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భారీ స్థాయిలో నిధుల సమీకరణకు రెడీ అవుతోంది. ఇందుకు తాజా ఏజీఎంలో వాటాదారుల అనుమతి పొందినట్లు వెల్లడించింది. వెరసి రుణాలు, ఈక్విటీ ద్వారా రూ. 14,500 కోట్లను సమీకరించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. నిధులను బిజినెస్ వృద్ధి అవకాశాలపై వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. దేశీ, విదేశీ రుణాల ద్వారా రూ.12,000 కోట్లు, ఈక్విటీ పెట్టుబడుల ద్వారా మరో రూ.2,500 కోట్లు సమకూర్చు కునే ప్రణాళికలు వేసినట్లు వివరించింది. -
తల్లిపాలే.. విషం! ఈ బిడ్డ బాధ వర్ణనాతీతం(స్పాన్సర్డ్)
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలే అమృతం... కానీ ఈ బిడ్డ విషయంలో తల్లిపాలు విషంలా మారుతున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డలకు సంక్రమించే అరుదైన వ్యాధి కారణంగా తల్లి పాలకు బిడ్డ దూరమవగా... బిడ్డకు పాలివ్వలేని దుస్థితిలో ఆ తల్లి చిక్కుకుంది. ప్రసవం జరిగినప్పటి నుంచి తన బిడ్డను కాపాడమంటూ తల్లి ఎలిజబెత్ నిత్యం దేవున్ని ప్రార్థిస్తూనే ఉంది. తమిళనాడులోని ఈరోడ్కి చెందిన ఎలిజబెత్ , శివకుమార్ దంపతులు ఈ ఏడాది మార్చిలో మూడో సంతానం కలిగింది. అయితే ఎలిజబెత్కి కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నెలలు నిండకుండానే బిడ్డను ప్రసవించింది ఎలిజబెత్. దీంతో పసిబిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో పాటు మూత్ర పిండాల వైఫల్యం సమస్యలు తల్తెత్తాయి. ఎన్ఐసీయూ వార్డులో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. బాబుకి తల్లిపాలు పడటం లేదు. దీంతో ఐవీల ద్వారానే అవసరమైన మందులు అందిస్తున్నారు. బాబు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షలు రెడీ చేసుకోవాల్సందిగా వైద్యులు సూచించారు. కూలీ చేసుకునే శివకుమార్ నెల ఆదాయమే రూ. 5,500. అలాంటిది ఒక్కసారిగా పది లక్షల రూపాయలు సర్థుబాటు చేయాలంటూ వైద్యులు చెప్పేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. మరోవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకు. దీంతో ఆన్లైన్లో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టోను సంప్రదించారు. ఎలిజబెత్, శివకుమార్ల బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి. (అడ్వర్టోరియల్) -
స్విగ్గీ న్యూ డెసిషన్... ఇవి కూడా డెలివరీ చేస్తుందట
హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ సిగ్గీ మరిన్ని సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీలో తన మార్క్ చూపించిన ఈ సంస్థ ప్రజలకు మరింతగా చేరువ అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు తగ్గట్టే ఇటీవల భారీగా నిధుల సమీకరణ కూడా చేసింది. గ్రోసరీస్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్కి సంబంధించి స్విగ్గీ మంచి పట్టు సాధించింది. జిల్లా కేంద్రాల నుంచి కాస్మాపాలిటన్ సిటీస్ వరకు డెలివరీ సర్వీసెస్లో దూసుకుపోతుంది. అయితే స్విగ్గీ వచ్చే ఆర్డర్లలో ఎక్కువ శాతం లంచ్, డిన్నర్కి సంబంధించినవే ఉంటున్నాయి. బ్రేక్ఫాస్ట్ టైంలో అంతగా డెలివరీ ట్రాఫిక్ ఉండటం లేదు. దీంతో ఉదయం సమయంలో కూడా సేవలు అందించేలా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. కిరణా, పాలు, కూరగాయలు తదితర ఉదయాన్నే ఉపయోగించే సరుకులను కూడా డెలివరీ చేసేలా ప్లాన్ వేసింది. త్వరలోనే ఇన్స్టామార్ట్ పేరుతో గ్రోసరీస్ సేవలు అందివ్వనున్నట్టు స్విగ్గీ కో ఫౌండర్ శ్రీహర్ష తెలిపారు. దూకుడుగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఇటీవల స్విగ్గీ ఇన్వెస్టర్ల నుంచి 1.25 బిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. వీటి సాయంతో మార్కెట్లో దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. మరోవైపు జోమాటో సైతం భారీగా నిధులు సేకరించి తమ సేవలను మరింతగా విస్తరించే పనిలో ఉంది. -
చిట్టి చేతుల గట్టి సాయం
కరోనాతో చాలామంది జీవితాలు రోడ్డున పడ్డాయి. వారి సాధక బాధలు చూసి చలించిపోయిన ఎంతోమంది దాతలు తమకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ఇలా సాయం చేసిన చేతుల్లో స్కూలు పిల్లల చిట్టి చేతులు కూడా ఉండడం విశేషం. నిరుపేదల కష్టాలు చూసి చలించిన గీతికా జైన్, మిహికా బాగ్లా, శివేకా జైన్లు కూడా సాయం చేయాలనుకున్నారు. కానీ ఈ ముగ్గురు స్కూలు పిల్లలు. ఆదాయం వచ్చే అవకాశం లేదు. అమ్మానాన్నలని అడిగినా కూడా అంత సాయం చేసే స్థోమత వారికుండాలి కదా... ఇవన్నీ ఆలోచించిన ఈ అమ్మాయిలు తామే స్వయంగా సంపాదించి కోవిడ్ బాధితులకు విరాళంగా అందించారు. ఢిల్లీకి చెందిన గీతికా జైన్, మిహిక బాగ్లాలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కోవిడ్ సమయంలో... అవసరంలో ఉన్నవారికి తమ తల్లిదండ్రులు చేస్తోన్న సాయాన్ని గమనించిన ఈ ఇద్దరు స్నేహితులు.. తాము కూడా సాయం చేయాలని నిర్ణయించుకుని క్రాఫ్ట్స్ తయారీ, కుకింగ్ వర్క్షాపులు నిర్వహించడం ద్వారా వచ్చిన 50 వేల రూపాయల నగదును విరాళంగా ఇచ్చారు. ముంబైకి చెందిన శివేక జైన్ పదో తరగతి చదువుతోంది. శివేక కూడా నిరుపేదలకు సాయపడేందుకు.. యూట్యూబ్లో ఫ్లూయిడ్ పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుని దాదాపు వంద పెయింటింగ్లను వేసి వాటిని విక్రయించగా వచ్చిన 2.5 లక్షల రూపాయలను కోవిడ్ బాధితులకు విరాళంగా ఇచ్చింది. ఈ ముగ్గురు అమ్మాయిలు తల్లిదండ్రులను సంప్రదించి ఐదు నుంచి పదేళ్లలోపు పిల్లలకు ఆర్ట్, క్రాఫ్ట్, కుకింగ్పై వర్క్ షాపులు నిర్వహించారు. గీతిక, మిహికలు కలిసి మే, జూన్ నెలల్లో తరగతులు నిర్వహించి ఒక్కో క్లాస్కు రూ.300 ఫీజును వసూలు చేశారు. ఈ విధంగా వాళ్లు మొత్తం 50 వేల రూపాయలను జమచేశారు. ఈ మొత్తాన్ని శక్తి ఫౌండేషన్ ఇండియాకు విరాళంగా ఇచ్చారు. ‘‘లాక్డౌన్ సమయంలో చాలామంది రకరకాల ఇబ్బందులకు గురవడం, వాళ్లకు మా తల్లిదండ్రులు సాయం చేయడం చూశాము. అలా మేము కూడా చేయాలనుకున్నాము. ఈ క్రమంలోనే నాకు ఎంతో ఇష్టమైన‡ క్రాఫ్ట్స్ తయారీని జూమ్ యాప్ ద్వారా సెషన్లు నిర్వహించి చిన్న పిల్లలకు నేర్పించేదాన్ని’’ అని గీతిక చెప్పింది.‘‘నాకు కుకింగ్, బొమ్మలు తయారు చేయడం అంటే ఎంతో ఇష్టం. వాటినే వేసవికాలం సెలవుల్లో పిల్లలకు నేర్పించడం ద్వారా నిధులు సమకూర్చాము’’ అని మిహిక చెప్పింది. కష్టపడి సంపాదించి ఆ డబ్బులను విరాళంగా ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ మొత్తం కార్యక్రమంలో తమ తల్లిదండ్రులు కూడా ఎంతో సాయపడ్డారని మిహిక, గీతికలు చెప్పారు. పదిహేనేళ్ల శివేక జైన్ కూడా వేసవి కాలం సెలవుల్లో తనకు తెలియని ఫ్లూయిడ్ పెయింటింగ్ను వేయడం నేర్చుకుని.. ఆ పెయింటింగ్స్ వేసి వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన 2.5 లక్షల రూపాయలను ముంబైకి చెందిన ఎన్జీవోకు విరాళంగా ఇచ్చి తన పెద్దమనసు చాటుకుంది. ‘‘పెయింటర్, ఆర్ట్ కన్సల్టంట్ అయిన మా అమ్మ తృప్తి ని ప్రేరణగా తీసుకుని ఆమెలాగా నేను సాయం చేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే యూట్యూబ్లో ఫ్లూయిడ్ పెయింటింగ్ ఎలా వేయాలో చూసి శ్రద్ధగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తరువాత దాదాపు 100 పెయింటింగ్లను వేసాను. ఒక్కొక్కటì 2,500 రూపాయలకు విక్రయించి రెండున్నర లక్షల రూపాయలు సంపాదించాను. వాటిని విరాళంగా ఇచ్చాను’’ అని శివేక చెప్పింది. ‘‘కరోనా కారణంగా ఎంతోమంది చనిపోవడం చూసిన శివేకకు చాలా బాధగా అనిపించేది. దీంతో తను రోజుకి నాలుగు గంటలు శ్రమించి పెయింటింగ్స్ వేసేది. వాటిని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ల్లో ప్రచారం చేసేవాళ్లం. అలా వంద పెయింటింగులు విక్రయించి డబ్బులు సంపాదించాము. తన ఆసక్తిని మేము ప్రోత్సహించాము’’ అని శివేక తల్లి చెప్పారు. ఇవేగాక ఎన్జీవోలతో కలిసి మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని తల్లీ కూతుళ్లు చెబుతున్నారు. -
పేటీఎమ్ భారీ ఐపీవో..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్ భారీ ఐపీవోకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 16,600 కోట్లు సమకూర్చుకునేందుకు వీలుగా వాటాదారుల అనుమతి కోరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా కంపెనీ విలువ రూ. 1.78 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. పేటీఎమ్ ఈ నెల 12న అసాధారణ వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదిస్తోంది. దీనికి అదనంగా కంపెనీలో ఇన్వెస్ట్చేసిన సంస్థలు వాటాలు విక్రయించడం ద్వారా రూ. 4,600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి రూ. 16,600 కోట్ల ఐపీవోకు వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా కంపెనీ విలువ రూ. 1.78–2.2 లక్షల కోట్లస్థాయికి చేరవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. తద్వారా దేశీయంగా లిస్టయిన ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీలలో మార్కెట్ విలువరీత్యా టాప్–10లో ఒకటిగా నిలవనుంది. పేటీఎమ్ ప్రధాన వాటాదారుల్లో చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్(29.71% వాటా), సైఫ్ పార్టనర్స్(18.56 శాతం), విజయ్ శేఖర్ శర్మ(14.67 శాతం)తోపాటు.. ఏజీహెచ్ హోల్డింగ్, టీ రోవే ప్రైస్, డిస్కవరీ క్యాపిటల్ బెర్కషైర్ హాథవే ఉన్నాయి. -
హ్యాట్సాఫ్ .. మనోజ్ఞ
నెవార్క్ (న్యూజెర్సీ) : ఏదేశమేగిన ఎందుకాలిడినా పొగడరా నీ తల్లిభూమి భారతిని అన్నట్టుగా అమెరికా వెళ్లినా.. ఇండియా కోసం పరితపిస్తోంది వైద్య విద్యార్థి మనోజ్ఞ రూత్ ప్రసాద్. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం చూసి చలించిపోయారు డాక్టర్ మనోజ్ఞ. దీంతో అమెరికాలో ఉంటూనే ఇండియాలో ఉన్న డాక్టర్లకు సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నారు. దీంతో పాటు కోవిడ్ పట్ల అవగాహన పెంచేందుకు అమెరికాలో పలు కార్యక్రమాలు మనోజ్ఞ చేపడుతున్నారు. కోవిడ్ సాయం న్యూ జెర్సీలోని నెవార్క్లో ఉన్న సెయింట్ మైఖేల్ మెడికల్ సెంటర్లో మనోజ్ఞ మెడికల్ రెసిడెంట్గా పని చేస్తోంది. ఇక్కడ ఉంటూనే ఇండియాలో ఉంటున్న వారి కోసం నిధుల సమీకరణ, అమెరికా ప్రజల్లో పట్ల కోవిడ్ అవగాహన పెంచే పనులు చేపడుతున్నారు. దీని కోసం గోఫండ్మీ ఫేజ్ను క్రియేట్ చేశారు. కాలేజీలో తనతో పాటు పని చేస్తున్న డాక్టర్లు , విద్యార్థులు, అధ్యాపకులను ఒప్పించారు. అంతా కలిసి మంగళవారం నెవార్క్లో ర్యాలీ నిర్వహించారు. హాస్పటిల్ నుంచి జేమ్స్ స్ట్రీట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ గోఫర్మీ ద్వారా ఇప్పటి వరకు 2,500 డాలర్ల నిధులు సేకరించగలిగారు. గోఫండ్మీ ‘గోఫండ్మీ పేజ్ ద్వారా మేము నిర్వహించిన ర్యాలీ వల్ల కోవిడ్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయ పడేందుకు ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది’ అని డాక్టర్ మనోజ్ఞ రూత్ ప్రభు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇండియాకు సాయం ఎంతో అవసరమని ఆమె అన్నారు. మెడికల్ లెర్నింగ్ ప్రాసెస్లో సోషల్ యాక్టివిజమ్ ఓ భాగమని ఇంటర్నల్ మెడిసిన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ థియోడర్ డికోస్టా అభిప్రాయపడ్డారు. చదవండి : రాష్ట్రాభివృద్ధికి ఎన్నారైల బాసట -
ఐపీవోల సందడే సందడి
ఓ వైపు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్నప్పటికీ మరోపక్క యూఎస్సహా దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. తాజాగా సెన్సెక్స్, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి కూడా. ఈ నేపథ్యంలో 2020లో ప్రైమరీ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకోగా.. ఈ ఏడాదిలోనూ పలు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ముంబై: వారాంతానికల్లా ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 52,600 పాయింట్లను అధిగమించగా, నిఫ్టీ 15,800ను దాటేసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా.. ఈ జోష్ ప్రైమరీ మార్కెట్లకూ పాకింది. దీంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. పేమెంట్స్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్సహా ఫైనాన్షియల్ సర్వీసుల రంగానికి చెందిన 12 కంపెనీలు ఐపీవోలకు సిద్ధపడుతున్నాయి. తద్వారా సంయుక్తంగా రూ. 55,000 కోట్లవరకూ సమీకరించే సన్నాహాల్లో ఉన్నాయి. వీటిలో ఫిన్టెక్ కంపెనీలు సైతం ఉన్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సంస్థలు పేర్కొన్నాయి. అతిపెద్ద ఇష్యూ బీమా, ఆస్తుల నిర్వహణ, వాణిజ్య బ్యాంకింగ్, మైక్రోఫైనాన్స్, నాన్బ్యాంకింగ్, హౌసింగ్ ఫైనాన్స్ రంగాల నుంచి సుమారు 12 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. ఇందుకు వీలుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నాయి. ఈ బాటలో రూ. 22,000 కోట్ల ఇష్యూకిగాను పేమెంట్స్ బ్యాంక్ పేటీఎమ్కు గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. పేటీఎమ్ ఐపీవో పూర్తయితే అతిపెద్ద ఇష్యూగా రికార్డు సృష్టించనుంది. ఇంతక్రితం 2010 అక్టోబర్లో రూ. 15,000 కోట్ల సమీకరణ ద్వారా పీఎస్యూ కోల్ ఇండియా రికార్డ్ నెలకొల్పింది. కాగా.. ఇటీవల ఐపీవోకు దరఖాస్తు చేసిన కంపెనీలలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్(రూ. 7,500 కోట్లు), పాలసీ బజార్(రూ. 4,000 కోట్లు), ఆప్టస్ హౌసింగ్ ఫైనాన్స్(రూ. 3,000 కోట్లు), స్టార్ హెల్త్(రూ. 2,000 కోట్లు), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ(రూ. 1,500–2,000 కోట్లు), ఆరోహణ్ ఫైనాన్షియల్(రూ. 1,800 కోట్లు), ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్(రూ. 1,700 కోట్లు), ఫిన్కేర్ స్మాల్(రూ. 1,330 కోట్లు) తదితరాలున్నాయి. టాప్–5లో ఒకటి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లవరకూ సమకూర్చుకునే యోచనలో ఉంది. రూ. 2.7 లక్షల కోట్ల నిర్వహణలోని ఆస్తుల విలువ రీత్యా కంపెనీ దేశంలోని టాప్–5 ఏఎంసీలలో ఒకటిగా నిలుస్తోంది. ఇక బీమా రంగం నుంచి వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేష్ ఝున్ఝున్వాలాకు పెట్టుబడులున్న స్టార్ హెల్త్ అల్లీడ్ ఇన్సూరెన్స్, మెడి అసిస్ట్లు పబ్లిక్ ఇష్యూలు చేపట్టనున్నాయి. ఇదేవిధంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ దన్నుగల ఆధార్ , ఆప్టస్ సైతం ఐపీవో బాట పట్టాయి. మైక్రోఫైనాన్స్ విభాగంలో ఆరోహణ్, ఫ్యూజన్ ఐపీవోలకు రానుండగా.. బ్యాంకింగ్ నుంచి తమిళనాడు మెర్కంటైల్ రెడీ అవుతోంది. కాగా.. ఈ ఏడాది 17 సంస్థలు ఐపీవోల ద్వారా ఇప్పటికే రూ. 17,503 కోట్లు సమకూర్చుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అంతేకాకుండా ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, రోలెక్స్ రింగ్స్, సెవెన్ లాండ్స్ షిప్పింగ్ సెబీ నుంచి అనుమతులను పొందినట్లు పేర్కొన్నారు. మరో 26 కంపెనీలు అనుమతుల కోసం చూస్తున్నట్లు తెలియజేశారు. ప్రైమరీ మార్కెట్ల కళకళ రెండు నెలల తదుపరి ఈ వారం మళ్లీ పబ్లిక్ ఇష్యూలు సందడి చేయనున్నాయి. నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 9,123 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి. ఇంతక్రితం ఏప్రిల్ 7–9న మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీవోకి వచ్చింది. కాగా.. సోమవారం(14) నుంచి శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ, సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్(సోనా క్యామ్స్టార్) పబ్లిక్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. ఇక కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దొడ్ల డైరీ ఐపీవోలు బుధవారం(16న) ఓపెన్ కానున్నాయి. ఈ బాటలో వచ్చే నెల(జూలై) మొదట్లో ఐపీవో ద్వారా క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైమరీ మార్కెట్లను పలకరించనుంది. రూ. 1,500 కోట్లు సమీకరించే లక్ష్యంతో క్లీన్సైన్స్ వస్తోంది. ఇదే సమయంలో ఇండియా పెస్టిసైడ్స్ కూడా పబ్లిక్ ఇష్యూ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. భారీ లిక్విడిటీ ప్రభావంతో సెకండరీ మార్కెట్లతోపాటు.. ప్రైమరీ మార్కెట్లు సైతం బుల్ దూకుడు చూపుతున్నట్లు పలు బ్రోకింగ్ సంస్థలు ఈ సందర్భంగా పేర్కొంటున్నాయి. టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఇష్యూ.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఐపీవోకు వస్తోంది. ఇష్యూ జూన్ 16న ప్రారంభమై 22న ముగియనుంది. ఐపీవో ద్వారా రూ.4.05 కోట్లను సమీకరిస్తారు. రూ.10 ముఖ విలువతో ఒక్కో షేరు ఇష్యూ ధరను రూ.61గా నిర్ణయించారు. మహిళలే నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఇటీవలే శానిటరీ న్యాప్కిన్స్, డైపర్స్ తయారీలోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్ బజార్ బ్రాండ్ పేరుతో ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభించిన 2012లో రూ.10 లక్షల టర్నోవర్ నమోదు చేసింది. 2019–20లో రూ.20 కోట్ల టర్నోవర్ ఆర్జించింది. మూలధన అవసరాలు, ఉత్పత్తుల విస్తరణకు ఐపీవో నిధులను వెచ్చించనున్నారు. కంపెనీ బోర్డు సభ్యులుగా దిన్నె లక్ష్మి జుమాల్, జయశ్రీ గద్దె, రంగినేని వినిత, ప్రియాంక వంగల, ఎస్.దుర్గ ఉన్నారు. -
చిన్నారి మందుల కోసం 16 కోట్లు సేకరించిన కోహ్లి దంపతులు ..
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఓ రెండేళ్ల చిన్నారి వైద్యానికి అవసరమయ్యే రూ.16 కోట్లు విలువ చేసే ఖరీదైన మందు కోసం నిధులు సమకూర్చారు. ఇప్పటికే కరోనా బాధితుల కోసం రూ. 2 కోట్ల విరాళం ప్రకటించిన విరుష్క దంపతులు.. తాజాగా ఆయాన్ష్ గుప్తా అనే ఓ చిన్నారికి పరోక్షంగా ప్రాణదాతలుగా నిలిచి మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఆయాన్ష్ గుప్తా.. వెన్నెముక కండరాలకు సంబంధించిన అరుదైన జెనెటిక్ వ్యాధితో బాధపడుతున్నాడు. WE DID IT!!! Never thought that this arduous journey we set on to #saveayaanshgupta would culminate this beautifully. Happy to announce tht we have reachd ₹16 Cr. needed to get #Zolgensma for #Ayaansh. A big thank you to every person who supported us. This is your victory.✌️✌️ pic.twitter.com/n0mVl1BvGv — AyaanshFightsSMA (@FightsSma) May 23, 2021 ఈ వ్యాధి నుంచి కోలుకునేందుకు అతనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్గెన్స్మా అనే మందు అవసరమైంది. ఇంత ఖరీదైన మందును కొనే స్తోమత లేని చిన్నారి తల్లిదండ్రులు నిధుల కోసం ట్విటర్ వేదికగా ‘AyaanshFightsSMA'పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు కోహ్లి దంపతులు తమ వంతు సహాయం చేయడంతో పాటు తమ అభిమానులను కూడా ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాగా, ఆ చిన్నారి వైద్యానికి అవసరమయ్యే రూ.16 కోట్లు సోమవారం(మే 23) నాటికి సమకూరాయని చిన్నారి తల్లిదండ్రులు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు విరాళాలు అందించిన వారితో పాటు కోహ్లి దంపతులకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అయాన్ష్ కోసం కోహ్లి దంపతులు తాము ఊహించనిదాని కంటే ఎక్కువ చేశారని, ఇన్ని రోజులు వారిని అభిమానించే వాళ్లమని, కానీ ఇప్పటి నుంచి ఆ గొప్ప దంపతులను ఆరాధిస్తామని ఆకాశానికెత్తారు. మా జీవితంలోనే కఠినమైన మ్యాచ్లో కోహ్లీ మమ్మల్ని సిక్స్తో గెలిపించారని కొనియాడారు. అయితే కోహ్లి దంపతులు ఎంత సాయం చేశారన్నది మాత్రం చిన్నారి తల్లిదండ్రులు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే, కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. ఈ పర్యటనలో భారత్.. న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. చదవండి: నేటి తరంలో అతనే బెస్ట్ అల్ రౌండర్.. -
కరోనాపై పోరు: కోహ్లి దంపతులు రూ. 2కోట్ల విరాళం
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో భారతదేశం అల్లాడిపోతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరగడంతో బాధితులకు బెడ్లు , ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాటు పెద్ద సమస్యగా మారుతోంది. ఈ కారణంగా చాలా మంది పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు సెలబ్రిటీలే గాక సామాన్య ప్రజలు సైతం తమకు తోచిన విధంగా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విరాట్, అనుష్క శర్మ దంపతులు ఇప్పటికే కరోనా బాధితుల సహాయార్థం రూ. 2 కోట్లు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించగా, ఇప్పుడు ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. తాజాగా అనుష్క, విరాట్ కోహ్లీలు తమ ట్విటర్ లో ఈ కార్యక్రమంపై వీడియోను కూడా షేర్ చేశారు. అందులో కరోనాపై పోరాటానికి తమ వంతుగా విరాళాలు సేకరించాలని అనుకుంటున్నాం అని స్పష్టం చేశారు. కరోనా కట్టడికి కలిసి పోరాడుదాం ఈ మహమ్మారిపై దేశం మొత్తం పోరాటం చేస్తోంది. ఈ పరిస్థితులలో ప్రజలు వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అందుకే అనుష్క శర్మ , నేను.. ‘కెటో వెబ్సైట్ ద్వారా విరాళాలు సమీకరిస్తున్నాం. కోవిడ్పై వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ విశ్రాంతి లేకుండా పోరాడుతున్నారు. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిది. దేశ ప్రజలకు మీ మద్దతు ఇచ్చేందుకు ముందడుగు వేయాలి. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అందరం సహాయ పడుదాం, కలిసి ఈ మహమ్మారిని అంతం చేద్దాం’.. అంటూ విరాట్ మాట్లాడిన వీడియోను విడుదల చేశాడు. విరాళాల రూపంలో సేకరించగా వచ్చిన డబ్బును మహమ్మారి సమయంలో ఆక్సిజన్, వైద్యపరమైన అంశాలు, టీకా అవగాహన, టెలిమెడిసిన్ సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు. ( చదవండి: IPL 2021: మంచిగా ఆడుతున్నం అనుకుంటే.. ఇదేందిరా! ) Anushka and I have started a campaign on @ketto, to raise funds for Covid-19 relief, and we would be grateful for your support. Let’s all come together and help those around us in need of our support. I urge you all to join our movement. Link in Bio! 🙏#InThisTogether pic.twitter.com/RjpbOP2i4G — Virat Kohli (@imVkohli) May 7, 2021 -
ఏపీలో ఎన్హెచ్ అభివృద్ధి నిధుల పెంపు
సాక్షి, అమరావతి: జాతీయ రహదారుల (ఎన్హెచ్) అభివృద్ధి కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను పెంచుతూ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. వార్షిక ప్రణాళిక కేటాయింపు కింద ఇస్తున్న రూ.1,408 కోట్ల నుంచి రూ.2,707.92 కోట్లకు పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఏపీలో ఎన్హెచ్ల అభివృద్ధి పరుగులు తీయనుంది. రాష్ట్ర రోడ్డులుగా ఉన్న పలు రోడ్లను హైవేలుగా మార్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే 3 రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల నెంబర్లను కేటాయించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ, ఏపీలను కలిపే విధంగా మహబూబ్నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఎన్హెచ్–67 జంక్షన్ వద్ద నాగర్ కర్నూల్, కోలాపూర్, రామాపూర్, మండుగల, శివాపురం, కరివెన, నంద్యాల వరకు (ఎన్హెచ్–40 సమీపంలో) ఉన్న 94 కి.మీ. రోడ్డును ‘ఎన్హెచ్–167కే’ గుర్తించింది. అనంతపురం జిల్లా పరిధిలోని ఎన్హెచ్–44పై కోడూరు నుంచి ముదిగుబ్బ (ఎన్హెచ్–42) వయా పుట్టపర్తి మీదుగా వెళ్లే 79 కి.మీ. రాష్ట్ర రహదారికి ఎన్హెచ్–342 కేటాయించారు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోనూ రాయచోటి–వేంపల్లె–యర్రగుంట్ల–ప్రొద్దుటూరు–చాగలమర్రి వరకు ఉన్న 130.50 కి.మీ. రోడ్డును తాజాగా ఎన్హెచ్గా గుర్తించారు. దీనికి ఎన్హెచ్–440 నంబరు కేటాయించారు. గతం కంటే ఎక్కువగా నిధులు మంజూరు రోడ్ల అభివృద్ధికి గతం కంటే ఈ ఏడాది కేంద్ర రోడ్డు నిధి కింద కేటాయింపులు పెరిగాయి. ఈ ఆర్ధిక ఏడాదిలో 616.36 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు 43 పనులకు గాను రూ.880.70 కోట్ల్లను కేటాయించారు. మరో 289.94 కి.మీ. రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాదిలోనే రూ.441.90 కోట్లతో అదనపు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 2017–18లో 50.52 కి.మీ. రోడ్ల అభివృద్ధికి రూ.72.90 కోట్లే కేటాయించగా ఇప్పుడు రూ.880.70 కోట్లను కేటాయించడం గమనార్హం. -
ఆ ఆటో డ్రైవర్కు నెటిజన్లు ఫిదా : భారీ విరాళాలు
సాక్షి, ముంబై : మనవరాలి విద్య కోసం ఇల్లు అమ్మేసి ఆటోలో కాలం గడుపుతున్న ముంబై ఆటో డ్రైవర్ కథనంపై అనూహ్య స్పందన లభించింది. ప్రంపచం నలుమూలలనుంచి దాతలు స్పందించడంతో ఏకంగా రూ. 24 లక్షలు అతని ఖాతాలో చేరాయి. దీంతో ఆటో డ్రైవర్ దేశ్రాజ్ సంతోషాన్ని ప్రకటించారు. ప్రతిఫలం ఆశించకుండా మంచి మనసుతో మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ పోతే.. తగిన ఫలితం ఎప్పటికైనా లభిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వైనంపై నెటిజన్లు కూడా సంతోషం ప్రకటిస్తుండటం విశేషం. (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర) ఒంటి చేత్తో కుటుంబాన్ని నెట్టుకొస్తూ, కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. మనవరాలిని చదివించడంకోసం ఇల్లు అమ్మేసి మరీ ఆటోలో జీవిస్తున్న దేశ్రాజ్ (74) హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి కథనం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన ఇద్దరు కుమారులు మరణించిన తరువాత, వారి కుటుంబాలను (ఇద్దరు కోడళ్లు, నలుగురు పిల్లల్ని) చూసుకునే బాధ్యత వృద్ధుడైన దేశ్రాజ్పై పడింది. దీంతో జీవనాధారమైన ఆటో రిక్షా ద్వారానే రాత్రింబవళ్లూ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో మనవరాలికి చదువుకు తాహతుకుమించి ఫీజలు కట్టాల్సి వచ్చింది. అయినా వెరవలేదు.. ఇల్లు అమ్మేసి మరీ ఫీజును చెల్లించి ఆమెను చదవించేందుకు ఆ పెద్దాయన తీసుకున్న నిర్ణయం ప్రశంలందుకుంది. ఆయన సంకల్పం నెటిజన్ల హృదయాలను ఆకట్టుకుంది. ఫలితంగా అనేకమంది ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఒక ఫేస్బుక్ యూజర్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సమీకరించేందుకు ఉపక్రమించారు. దీంతో 24 లక్షల రూపాయలపైనే సమకూరాయని హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి వెల్లడించింది. వాస్తవానికి రూ .20 లక్షలు వసూలు చేయాలనేది లక్ష్యం కాగా, దాతల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపింది. దీనికి సంబంధించి తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి దేశ్రాజ్ ధన్యవాదాలు తెలుపుతున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తనకు 24 లక్షల రూపాయల చెక్కు అందిందని ధృవీకరించిన దేశ్ రాజ్, తనపై చూపిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. -
అయోధ్య: ఊహించని వ్యక్తి నుంచి విరాళం
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు విరాళం అందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఓ నాయకుడు రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష 11 వేల 111 విరాళం ఇవ్వడం గమనార్హం. ఆయనే డిగ్గీ రాజాగా పేరొందిన దిగ్విజయ్ సింగ్. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో మత కలహాలకు వ్యతిరేకం కానీ.. ఆలయ నిర్మాణానికి కాదని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ ఆపాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ హిందూవుల పార్టీ అని విమర్శించిన డిగ్గీ రాజా ఇప్పుడు రామ మందిర నిర్మాణానికి విరాళం ప్రకటించడం విశేషం. గతంలో ఆయన ఆలయ నిర్మాణంపై విమర్శలు కూడా చేశారు. అలాంటి వ్యక్తి నుంచి విరాళం రావడం ఆశ్చర్యమేస్తోంది. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ 44 రోజుల పాటు విరాళాల సేకరణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. -
వొడాఫోన్ ఐడియాకు భారీ నిధులు!
ముంబై: దేశీ మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో భారీ పెట్టుబడులకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓక్ట్రీ క్యాపిటల్ అధ్యక్షతన ఏర్పడిన కన్సార్షియం 2-2.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే వీలున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. తద్వారా వొడాఫోన్ ఐడియాలో కొంత వాటాను సొంతం చేసుకునే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో వొడాఫోన్ ఐడియా 3.4 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 25,000 కోట్లు)ను సమీకరించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. షేర్ల విక్రయం, రుణ సమీకరణ ద్వారా నిధులను సమకూర్చుకునే ప్రణాళికలు వేసినట్లు తెలియజేసింది. దీంతో ఓక్ట్రీ క్యాపిటల్ పెట్టుబడుల వార్తలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు టెలికం రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్) పోటీ తీవ్రం.. కొంతకాలంగా దిగ్గజ కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ భారీస్థాయిలో కస్టమర్లను పొందుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు కంపెనీలూ వొడాఫోన్ ఐడియా కస్టమర్లను సైతం ఆకట్టుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దేశీ మొబైల్ టెలికం రంగంలో పెరిగిన తీవ్ర పోటీ, నిధుల ఆవశ్యకత నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పెట్టుబడుల సమీకరణ సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశాయి. తద్వారా తిరిగి మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టి సారించనున్నట్లు అభిప్రాయపడ్డాయి. అంతేకాకుండా లాభదాయకతను సైతం పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశాయి. ఈ బాటలో డిసెంబర్ చివరికల్లా 20 శాతంవరకూ టారిఫ్లను పెంచే ప్రణాళికలు వేసినట్లు వివరించాయి.