-
పాక్లో ఎన్నికల కౌంటింగ్.. ఈసీ కీలక నిర్ణయం
పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోన్న వేళ పలు పోలింగ్ బూత్ల్లో రిగ్గింగ్ ఆరోపణలు తీవ్రమయ్యాయి. దీంతోపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 40 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ప్రకటించింది. ఈ నెల15వ తేదీన 40 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. దేశ 12వ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతన్న నేపథ్యంలో ఈసీ రీపోలింగ్ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు సుమారు 93 స్థానాల్లో విజయం సాధించగా ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి చేతులు కలిపాయి. ఇప్పటి వరకు 256 స్థానాల్లో ఈసీ ఫలితాలను విడుదల చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పార్టీల్లో సీట్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: పాక్లో సంకీర్ణం..! -
పాక్లో సంకీర్ణం..!
ఇస్లామాబాద్/లాహోర్: పాకిస్తాన్లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ జైలుపాలవడమే గాక పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ ఎన్నికల గుర్తూ రద్దవడంతో స్వతంత్రులుగా బరిలో దిగిన ఆయన మద్దతుదారులు 100 స్థానాల్లో నెగ్గి ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. అయితే 73 సీట్లు సాధించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్), 54 సీట్లొచ్చిన బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరోసారి చేతులు కలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా ఆ రెండింటికి కలిపి 127 స్థానాలున్నాయి. శుక్రవారం రాత్రే పలు దఫాలుగా చర్చోపచర్చలు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు చేతులు కలిపేందుకు పీఎంఎల్, పీపీపీ అంగీకారానికి వచ్చాయి. మెజారిటీ సాధనకు 28 స్థానాల్లో నెగ్గిన చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం శనివారమంతా జోరుగా మంతనాలు సాగాయి. నవాజ్ ప్రయత్నాలు ఫలిస్తే రికార్డు స్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. అయితే ప్రధానిగా బిలావల్కే అవకాశమివ్వాలని పలువురు పీపీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తుండటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది! కాకపోతే సైన్యం దన్ను నవాజ్కు కలిసొస్తుందంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన ఇచ్చిన పిలుపుకు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా మద్దతు పలకడం విశేషం. ‘‘రాజకీయ సుస్థిరత పాక్కు తక్షణావసరం. అందుకు ప్రజాస్వామిక శక్తులన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి’’ అని శనివారం ఒక ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు! నవాజ్ పేరుకు పీపీపీ ఒప్పుకోని పక్షంలో బిలావల్కు అవకాశమిచ్చేందుకు పీఎంఎల్ కూడా అంగీకరించే ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు. మధ్యేమార్గంగా మరోసారి నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించవచ్చని చెబుతున్నారు. దీనికి సైన్యం నుంచి కూడా అభ్యంతరం ఉండకవపోచ్చన్నది రాజకీయ వర్గాల మాట. యథేచ్ఛగా అక్రమాలు! మొత్తం 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి రెండు రోజులు దాటినా 10 చోట్ల ఇంకా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల వెల్లడి విపరీతంగా ఆలస్యమవుతుండటంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి తమకే మెజారిటీ సమకూరిందని ఇమ్రాన్ఖాన్ ప్రకటించారు. కానీ అక్రమంగా ఫలితాలను పీఎంఎల్కు అనుకూలంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఫలితాల వెల్లడిలో జాప్యం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. -
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్భవన్కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్సభ ఎన్నికల్లో బిహార్లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్లోనూ ఆప్ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
Karnataka assembly election 2023: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...!
పాత మైసూరు. కర్ణాటకలో అధికార పీఠానికి రాచమార్గంగా భావించే ప్రాంతం. మెజారిటీ కావాలంటే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుపొందాల్సిందేనని పార్టీలన్నింటికీ బాగా తెలుసు. ఈ ప్రాంతంలో ఒక్కలిగ సామాజికవర్గం ప్రభావం అధికం. వారిని ప్రసన్నం చేసుకోగలిగే పార్టీదే పాత మైసూరు. అందుకోసమే పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి... సాక్షి బెంగళూరు: కర్ణాటక జనాభాలో ఒక్కలిగ సామాజికవర్గం 15 శాతం ఉంటుందని అంచనా. లింగాయత్ (17 శాతం)ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం వీరే. ఉత్తర కర్ణాటక లింగాయత్ బెల్ట్ కాగా పాత మైసూరు ఒక్కలిగల కంచుకోట. ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో ఈ వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. వీరు కొన్ని దశాబ్దాలుగా ఒక్కలిగలు జేడీ(ఎస్)నే ఆదరిస్తూ వస్తున్నారు. ఈసారి వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏడుగురు సీఎంలను ఇచ్చిన ప్రాంతం ► రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో పాత మైసూరు ప్రాంతంలో 51 సీట్లున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో, బీజేపీ 9 చోట్ల గెలిచాయి. ► కావేరి వివాదం, రైతు ఆత్మహత్యల వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. మేజిక్ నంబర్ సాధించడంలో ఈ ప్రాంతం కీలకం. ► గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన 17 మందిలో ఏకంగా ఏడుగురు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే! ఈ సామాజికవర్గానికి చెందిన హెచ్.డి.దేవెగౌడ ప్రధాని పదవి దాకా ఎదిగారు. ► ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి జేడీ(ఎస్) చాలా బలంగా ఉంది. ► మండ్య, హసన్, రామనగర, మైసూరు, చామరాజనగర, కోలార్, తుమకూరు, కొడగు జిల్లాలో ఒక్కలిగలు అధికంగా ఉంటారు. ► ఒక్కలిగల ఓట్లను ఒడిసిపట్టేందుకు అధికార బీజేపీ తాజాగా వారి రిజర్వేషన్లను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. ► ఇక కాంగ్రెస్ ఒక్కలిగలకు ఎక్కువగా టికెట్లిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ► జేడీ(ఎస్) మాత్రం తన సంప్రదాయ ఓటుబ్యాంకు మళ్లీ చెక్కుచెదరబోదని ధీమాగా ఉంది. కాంగ్రెస్.. గత వైభవమే పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ ఒకప్పుడు తిరుగులేని పార్టీ. దేవెగౌడ రూపంలో బలమైన ఒక్కలిగ నేత రాకతో ఇక్కడ దాని ప్రభ మసకబారింది. ఈ ప్రాంతానికే చెందిన ముఖ్య ఒక్కలిగ నేత పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్పైనే ఈసారి కాంగ్రెస్ ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీ... ఇక బీజేపీది భిన్నమైన పరిస్థితి! పాత మైసూరులో పార్టీకి ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన ఒక్కలిగ నాయకుడు లేడు. దాంతో ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీ(ఎస్)ల తర్వాతి స్థానానికే పరిమితమవుతూ వస్తోంది. అయితే 2018 ఎన్నికల్లో కాస్తా పుంజుకున్న నేపథ్యంలో ఈసారీ భారీగానే ఆశలు పెట్టుకుంది. గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ బలమైన స్థానిక నేతలను చేర్చుకుని టికెట్లిచ్చింది. ఇంటిపోరు జేడీ(ఎస్)ను ముంచేనా...? దేవెగౌడ కుటుంబంలో వారసత్వ రగడ మొదలైంది. ఆయన కుమారుల్లో జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి రామనగర, మైసూరు, మండ్య జిల్లాల్లో గట్టి నాయకుడు కాగా సోదరుడు హెచ్.డి.రేవణ్ణ హాసన్ జిల్లాలో తిరుగులేని నేత. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. హాసన్ టికెట్ విషయంలో ఇవి రచ్చకెక్కాయి. అక్కడ రేవణ్ణ భార్య భవానీని కాదని అతి సామాన్య కార్యకర్తకు కుమారస్వామి టికెటిచ్చారు. ఈ గొడవ కొంప ముంచుతుందేమోనని జేడీ(ఎస్) వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
షిల్లాంగ్: మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) చీఫ్, తాజా మాజీ సీఎం కాన్రాడ్ సంగ్మా రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ను కోరారు. రాష్ట్ర అసెంబ్లీలోని 60 మంది సభ్యులకు గాను 32 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని తెలిపారు. వీరి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేశామన్నారు. శుక్రవారం ఆయన రాజ్భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు నాకుంది. మద్దతిస్తామని బీజేపీ ఇప్పటికే తెలిపింది. హిల్ స్టేట్ డెమోక్రటిక్ పార్టీ, స్వతంత్రులు కూడా మా వెంట ఉన్నారు’అని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఈ నెల 7న ప్రమాణం చేయనుందని, ప్రధాని మోదీ కూడా ఈ కార్యక్రమానికి వస్తారని తెలిపారు. కాగా, ఎన్పీపీ యేతర, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ అంతకుముందు టీఎంసీ, కాంగ్రెస్, యూడీపీ, పీడీఎఫ్లు హడావుడి చేశాయి. ఫిబ్రవరి 27వ తేదీన 59 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్పీపీ సొంతంగా 26, మిత్రపక్షం యూడీపీ 11 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, టీఎంసీలు చెరో ఐదు స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ రెండు సీట్లను దక్కించుకుంది. -
తాలిబన్ల తలపట్లు
ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది మొసళ్ల పండుగ... ఇలాంటి సామెతలన్నీ తాలిబన్లకు వర్తించేలా పరిస్థితులు మారుతున్నాయి. అఫ్గాన్ను స్వా«దీనం చేసుకున్న ఆనందం ఆవిరవడానికి తాలిబన్లకు ఎక్కువ సమయం పట్టడం లేదు. తాత్కాలిక ప్రభుత్వంలో వివిధవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేతల మధ్య సయోధ్య కరువవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అఫ్గాన్ను అమెరికా సైన్యాలు వదిలిపోవడంతో అలవోకగా స్వాదీనం చేసుకున్న తాలిబన్లు.. అది తమ ఘనవిజయంగా భావించారు. కానీ దేశానికి ఆధిపత్యం వహించే విషయంలో అగ్రనేతల మధ్య ఆరంభమైన కుమ్ములాటలు అఫ్గాన్ స్వాధీన విజయాన్ని ఆవిరి చేస్తున్నాయి. నిజానికి బయటనుంచి చూసేవారికి తాలిబన్లంతా ఒకటేనని, వారి సిద్ధాంతాల్లో తేడాలుండవని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అన్ని పారీ్టల్లాగానే తాలిబన్లలో కూడా వర్గాలు, గ్రూపులు, అభిప్రాయభేదాలు, కుమ్ములాటలు బోలెడున్నాయని తాలిబన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు అజ్ఞాతంలో బతుకుతూ అమెరికాతో యుద్దం చేయాల్సిరావడం వల్ల ఈ వర్గాలు, భేదాభిప్రాయాలు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే దేశం స్వాదీనమై పాలనా పగ్గాలు చేతికి వచ్చాయో వీరిలో విభేదాలు ముదురుతున్నాయి. ఉమ్మడి శత్రువు మొఖం చాటేయగానే తాలిబన్లలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ మంటలు ముదిరి సోమవారం రెండువర్గాల మధ్య అధ్యక్ష భవనంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తాలిబన్ అగ్రనేత, సహవ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించాడని పుకార్లు షికారు చేశాయి. కానీ తాను బతికే ఉన్నానని బరాదర్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అయినా సరే తన పరిస్థితిపై అయోమయం నెలకొంది. (చదవండి: ప్రభుత్వ ఏర్పాటుతో వేర్పాటు బీజాలు అఫ్గాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగానే బరాదర్ నాయకుడిగా ఉంటారని ఎక్కువమంది భావించారు. అమెరికాతో చర్చలు జరిపి, వారి సేనలు వెనక్కుమరలిపోయేలా చేయడంలో బరాదర్ కీలకపాత్ర పోషించాడు. దీనికితోడు అతను ముల్లాఒమర్కు సన్నిహితుడు. ఖతార్తో తనకు సత్సంబంధాలున్నాయి. అందుకే సహజంగా బరాదరే ప్రధాని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని అఫ్గాన్ పరిణామాల విశ్లేషకుడు నైమతుల్లా ఇబ్రహిమి అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వంలో కాందహార్కు చెందిన పాతతరం తాలిబన్లతో పాటు అల్కాయిదా, పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలున్న హక్కానీలకు పెద్దపీట దక్కింది. ఇరాన్ అండ ఉన్న పశ్చిమ తాలిబన్ గ్రూపునకు అసలు ప్రాధాన్యమే దక్కలేదు. గతంలో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాందహార్ గ్రూపుదే ప్రభుత్వంలో ఆధిపత్యం ఉండేది. కానీ తాజా ప్రభుత్వంలో హక్కానీలకు ప్రాధాన్యత పెరిగింది. ఐఎస్ఐ అండదండలే హక్కానీల బలం పెరిగేందుకు కారణమయ్యాయని నైమతుల్లా చెప్పారు. హక్కానీల నేత సిరాజుద్దీన్ తలపై అమెరికా కోటి డాలర్ల బహుమతి ప్రకటించింది. కానీ ప్రస్తుతం సిరాజుద్దీన్ అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకమంత్రి అయ్యారు. ఇది పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని అంశం. (చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్బాల్ జట్టు) ఉమ్మడి ప్రభుత్వమే శరణ్యం? హక్కానీల ప్రాధాన్యత పెరగడం వల్లనే అఫ్గాన్ ప్రభుత్వాన్ని యూఎస్, మిత్రపక్షాలు గుర్తించడంలో జాప్యం చేయడం, అమెరికాలోని అఫ్గాన్ బ్యాంకు నిధులు విడుదల చేయకుండా తొక్కిపట్టడం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీన్ని బరాదర్ వైఫల్యంగా హక్కానీలు ఎత్తిచూపుతున్నారు. అయితే ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చినందుకు ఈ విషయంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని బరాదర్ వర్గం భావిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం గుర్తించకపోతే అఫ్గాన్కు ఆర్థిక సాయం అందదు. దీంతో దేశం తీవ్ర సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉంది. దీన్ని పట్టించుకోకుండా తాలిబన్– హక్కానీలు సిగపట్లు పడుతున్నారు. ఇది కేవలం అఫ్గాన్కే కాకుండా పొరుగుదేశాలకు కూడా ప్రమాదం తెస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్లోని పలు వర్గాలను ప్రభుత్వంలో చేర్చుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని, దీనివల్ల తిరిగి దేశంలో అంతర్యుద్ధం ఆరంభం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధమే ఆరంభమైతే మరలా రష్యా, ఇరాన్, ఇతర దేశాలు తమ అనుకూల గ్రూపులకు సాయం చేయడం మొదలుపెడతాయి. దీంతో మరోమారు అఫ్గాన్లో హింసాత్మక పోరు పెచ్చరిల్లుతుందని నైమతుల్లా అభిప్రాయపడ్డారు. మరి ఇప్పటికైనా తాలిబన్లు, హక్కానీలు భేదాభిప్రాయాలు మరిచి ఇతర గ్రూపులకు కూడా ప్రభుత్వంలో స్థానం కల్పిస్తాయా? లేక గ్రూపు రాజకీయాలను పెంచుతాయా? అని అన్ని దేశాలు ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
Afghanistan: అఫ్గాన్లో ఆపద్ధర్మ ప్రభుత్వం
కాబూల్: అఫ్గానిస్తాన్ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మంగళవారం విలేకరులకు తెలిపారు. రెండుదశాబ్దాల పాటు అమెరికాతో పోరాడిన అగ్రనేతలు తాజా ప్రభుత్వంలో ప్రాధాన్యమైన పదవులు పొందారు. అమెరికాతో చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్తో పాటు మౌల్వీ హనాఫీలు అఖుంద్కు డిప్యూటీలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఏర్పాటైంది తాత్కాలిక ప్రభుత్వమేనని, శాశ్వత ప్రభుత్వం కాదని జబీహుల్లా చెప్పారు. దేశంలో ఇతర ప్రాంతాలవారిని కూడా ప్రభుత్వంలో కలుపుకునేందుకు యత్నిస్తామన్నారు. అయితే ఎంతకాలం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వంలో మార్పులు ఎలా వస్తాయో వెల్లడించలేదు. ప్రభుత్వంలో ప్రతి మంత్రికి ఇద్దరు డిప్యూటీలుంటారని తెలిపారు. ప్రభుత్వంలో తాలిబనేతర వర్గాలకు స్థానం దక్కినట్లు కనిపించలేదు. అఫ్గాన్లో స్థిరత్వం కోసం దేశంలోని అన్ని తెగలను, వర్గాలను కలుపుకొని సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావాలని అంతర్జా తీయ సమాజం ఆశిస్తోంది. ప్రభుత్వ కూర్పు, అధికార పంపిణీల విషయంలో తాలిబన్లు, హకాన్నీ నెట్వర్క్కు మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా ఉండటాన్ని హక్కానీ నెట్వర్క్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో పాక్ ఐఎస్ఐ చీఫ్ మధ్యవ ర్తిత్వానికి వచ్చారు. చర్చల అనంతరం అందరికీ ఆమోదయోగ్యుడైన హసన్ అఖుంద్కు తాత్కాలికంగా పాలనాపగ్గాలు అప్పగించినట్లు కనపడుతోంది. మంత్రివర్గంలో అందరూ ఊహించినట్లే మహిళలకు స్థానం కల్పించలేదు. ఖారీ ఫసిహుద్దీన్ బంద్క్షనిని ఆర్మీ చీఫ్గా నియమించారు. తాలిబన్ అధినేత హెబతుల్లా అఖుంద్జాదా సుప్రీం లీడర్గా ఇరాన్ నమూనా ప్రభుత్వం ఏర్పడుతుందని చాలామంది భావించారు. కానీ తాజా ప్రభుత్వంలో హెబతుల్లా ఎలాంటి పాత్ర పోషించేది స్పష్టం కాలేదు. ఇరాన్లో అధ్యక్షుడి కన్నా ఉన్నతస్థానంలో సుప్రీంలీడర్ ఉంటాడు. అంతిమాధికారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయి. ఇతర ప్రముఖులు డిప్యూటీగా నియమితులైన ముల్లా బరాదర్, తాలిబన్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2001లో తాలిబన్ల ప్రభుత్వం పడిపోయిన తర్వాత అప్పటి అఫ్గాన్ అధినేత హమీద్ కర్జాయ్తో సహకరిస్తామని సంప్రదింపులు జరిపినట్లు వార్తలున్నాయి. 2010లో పాక్లో అరెస్టయి అమెరికా ఒత్తిడితో 2018లో విడుదలయ్యారు. అప్పటినుంచి ఖతార్లో ఉంటున్నారు. యూఎస్ దళాల ఉపసంహరణ ఒప్పందంలో కీలకపాత్ర పోషించారు. తాలిబన్లు కాబూల్ను ఆక్రమించాక దేశంలోకి అడుగుపెట్టారు. హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలకమైన హక్కానీ నెట్వర్క్ అధిపతి. సూసైడ్ బాంబర్ల వినియోగం హుక్కానీ నెట్వర్క్ ప్రాముఖ్యత. తాలిబన్ల మిలటరీ ప్రధానబలం. తాలిబన్లతో అంతగా ఈ నెట్వర్క్కు పొసగదని, పాక్ కారణంగా కలిసి ఉంటున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్, తాలిబన్ స్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు. తాలిబన్ల ఫీల్డ్ కమాండర్లను పర్యవేక్షించే మిలటరీ కమిషన్కు అధిపతిగా వ్యవహరించారు. ఎవరీ అఖుంద్? ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్(65), తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు. గత తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, కాందహార్ గవర్నర్గా పనిచేశారు. అనంతరం ఐరాస ఆంక్షల జాబితాకెక్కారు. తాలిబన్ కమాండర్లలో అత్యంత ప్రభావశాలి అని ఐరాస పేర్కొంది. అఖుంద్ పేరును స్వయంగా తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లా అఖుంద్జాదా ప్రతిపాదిం చారని పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరవైఏళ్లుగా తాలిబన్ల నాయకత్వ మండలి ‘రెహబరి షురా’కు అఖుంద్ అధిపతిగా ఉన్నారు. ఈ కూటమి అగ్రనేత అఖుంద్జాదా ఆదేశాల మేరకు అన్ని రకాల మిలీషియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. కీలక మంత్రులు– శాఖలు ► అమీర్ ఖాన్ ముత్తఖీ: విదేశాంగ మంత్రి ►షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్: విదేశాంగ సహాయ మంత్రి ► సిరాజ్ హక్కానీ: హోంశాఖ మంత్రి ► ముల్లా యాకూబ్: రక్షణ మంత్రి ► అబ్దుల్లా హకీం షరే: న్యాయ మంత్రి ► హిదాయతుల్లా బద్రి: ఆర్థిక మంత్రి ► షేక్ మవ్లావీ నూరుల్లా: విద్యా మంత్రి ► నూర్ మొహ్మద్ సాకిబ్: మత వ్యవహారాలు (చదవండి: తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!) చదవండి: క్రికెట్ మ్యాచ్లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..? -
అఫ్గాన్లో ప్రభుత్వ ఏర్పాటు మళ్లీ వాయిదా
కాబూల్: అఫ్గానిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్న తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటును వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ ముఠా అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా శనివారమే అఫ్గాన్లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల మద్దతు లభించేలా ప్రభుత్వాన్ని కూర్చే పనిలో ఉండడం వల్లే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోందని తాలిబన్ చర్చల కమిటీ సభ్యుడు ఖలీల్ హక్కానీ చెప్పారు. తాలిబన్లకి ఇప్పటికే మద్దతు ప్రకటించిన జమైత్ ఏ ఇస్లామీ అఫ్గానిస్తాన్ చీఫ్, దేశ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సోదరుడైన గుల్బుద్దీన్ హెక్మత్యార్కు ప్రభుత్వంలో చోటు లభించనుంది. పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం అఫ్గానిస్తాన్లో పంజ్ïÙర్ లోయ ఇంకా తాలిబన్ల వశం కాలేదు. శనివారం మళ్లీ ఇరు వర్గాల మధ్య పోరాటం మొదలైంది. ఇప్పటివరకు తాలిబన్ల కన్ను పడని పంజ్ïÙర్ను ఆక్రమించుకున్నట్టుగా శుక్రవారం వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం వదంతులేనని తేలింది. పంజ్ïÙర్ తమ స్వాధీనంలోకి వచి్చందని ఇప్పటివరకు తాలిబన్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోవియెట్ యూనియన్ ఆక్రమణలో ఉన్నప్పుడు, తాలిబన్ల పరిపాలనలోనూ పంజ్ïÙర్ స్వతంత్రంగానే వ్యవహరించింది. 1996–2001 మధ్య కాలంలో తాలిబన్లు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే ఆ ప్రాంతాన్ని కూడా తమ వశం చేసుకోవాలని తాలిబన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలే, తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకించే అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ల అ«దీనంలో పంజ్షీర్ లోయ ఉంటుంది. గాల్లోకి కాల్పులు.. 17 మంది మృతి! పంజ్ïÙర్ తాలిబన్ల పరమైందని వదంతులు వ్యాపించడంతో రాజధాని కాబూల్లో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కాల్పుల్లో 17 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. అయితే వారు అలా సంబరాలు చేసుకోవడాన్ని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తప్పు పట్టారు. ఆయుధాలనేవి ప్రభుత్వ ఆస్తి అని, వాటిని గాల్లోకి పేలుస్తూ వృథా చేయరాదని హితవు చెప్పారు. మహిళా కార్యకర్త తలకి గాయాలు మహిళలు తమ హక్కుల్ని కాపాడాలంటూ చేస్తున్న ఉద్యమాన్ని తాలిబన్లు అణగదొక్కేస్తున్నారు. మహిళలు తమ రాజకీయ హక్కుల్ని కాపాడా లంటూ అధ్యక్ష భవనం వరకు తీసిన ర్యాలీని తాలిబన్లు అడ్డుకొని బాష్పవాయువు ప్రయోగిం చారు. మహిళల్ని విచక్షణారహితంగా కొట్టినట్టుగా టోలో న్యూస్ వెల్లడించింది. ఉద్యమకారిణి నర్గీస్ సద్దాత్ను చితకబాదారు. తలకి బలమైన గాయంతో ముఖమంతా నెత్తురోడుతూ ఆమె ఆ నిరసన ప్రదర్శనలో కనిపించారు. అందరినీ కలుపుకొని పోవాలి: అమెరికా తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనారీ్టల హ క్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు. మరోవైపు అఫ్గాన్లో మానవ సంక్షోభం, ఆరి్థక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది. కాబూల్కు ఐఎస్ఐ చీఫ్ ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు, మరోవైపు పంజ్ïÙర్లో కొనసాగుతున్న పోరాటం నేపథ్యంలో పాకిస్తాన్లో అత్యంత శక్తిమంతమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ కాబూల్కు చేరుకున్నారు. ఆయన వెంట పాక్ అధికారుల బృందం కూడా వచి్చంది. తాలిబన్ల ఆహా్వనం మేరకే హమీద్ అఫ్గాన్ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్ఐ చీఫ్ను ఆహా్వనించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి. తాలిబన్ అగ్ర నేతలు, కమాండర్లతో ఐఎస్ఐ చీఫ్ çచర్చలు జరపనున్నారు. -
తాలిబన్లతో కర్జాయ్ చర్చలు
కాబూల్: తాలిబన్ల నేతృత్వంలో అఫ్గానిస్తాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు వేగం పుంజుకున్నాయి. తాలిబన్ సీనియర్ నాయకుడు, హక్కాని నెట్వర్క్కు చెందిన అనాస్ హక్కానీ బుధవారం అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్తో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో కీలకభూమిక పోషించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ భేటీకి హాజరయ్యారు. శాంతియుతంగా అధికార బదిలీ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాలనే ఉద్దేశంతో కర్జాయ్ సంప్రదింపులకు నేతృత్వం వహిస్తున్నారు. అనాస్తో భేటీ ప్రాథమిక చర్చల్లో భాగమని కర్జాయ్ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్ల రాజకీయ విభాగం సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్తో తదుపరి కీలకచర్చలకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. అన్ని పక్షాలను కలుపుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యూఏఈలో అష్రాఫ్ ఘనీ తాలిబన్లు కాబూల్లోకి ప్రవేశించడంతో ఆదివారం దేశం వదిలి పారిపోయిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించా మని యూఏఈ విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. అయితే యూఏఈలో ఎక్కడ తలదాచుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. తొలుత ఆయన తజకిస్తాన్కు పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
తాలిబన్లకు నిరసనల సెగ
కాబూల్: అఫ్గానిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సన్నాహాలు చేస్తుంటే వారికి నిరసనల స్వాగతాలు ఎదురవుతున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా మహిళలు కూడా రోడ్డెక్కి గట్టిగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అఫ్గానిస్తాన్ స్వాతంత్య్ర దినం (ఆగస్టు 19)కి ఒక్కరోజు ముందు ప్రభుత్వ కార్యాలయాలపై అఫ్గాన్ పతాకం ఎగరాలని డిమాండ్లు మిన్నంటాయి. తాలిబన్లపై ప్రజలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో వారు అత్యంత కఠినంగా నిరసనల్ని అణగదొక్కేస్తున్నారు. జలాలాబాద్లో నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాకు బదులుగా తిరిగి అఫ్గాన్ పతాకాన్ని ఎగురవేయాలన్న డిమాండ్తో బుధవారం నిరసన ప్రదర్శనలకు దిగారు. అఫ్గాన్ జెండా పట్టుకొని వందలాది మంది నిరసనకారులు నడిచి వెళుతూ ఉంటే, వారిని చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నిరసనని కవర్ చెయ్యడానికి వచ్చిన జర్నలిస్టుల్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలో కాల్పుల శబ్దాలు కూడా స్పష్టంగా వినిపించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని, డజన్ల మంది గాయపడ్డారని అల్జజీరా ఛానెల్ వెల్లడించింది. మహిళల నుంచే తొలి నిరసనలు కాబూల్లో మహిళల రూపంలో తొలిసారిగా తాలిబన్లకు నిరసనల సెగ తగిలింది. సమాన హక్కుల్ని డిమాండ్ చేస్తూ మహిళలు ప్ల కార్డులు పట్టుకొని కాబూల్ వీధుల్లో నిరసనకి దిగారు. వీరి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పక్కనే తాలిబన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా వారు బెదిరిపోలేదు. తమ హక్కుల్ని కాపాడాలని నినాదాలు చేశారు. హిజాబ్ లేదని మహిళని కాల్చి చంపారు! పేరుకే శాంతి మంత్రాన్ని వల్లిస్తున్న తాలిబన్లు ఆచరణలో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. టఖార్ ప్రావిన్స్లో ఒక మహిళ హిజాబ్ (తల కనిపించకుండా వస్త్రంతో చుట్టుకోవడం) లేకుండా బయటకు రావడంతో తాలిబన్లు మంగళవారం ఆమెని కాల్చి చంపినట్టుగా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. దేశం విడిచి పారిపోవాలని కాబూల్ విమానాశ్రయానికి వస్తున్న వారిపై పదునైన ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. ఎయిర్పోర్టులో జనాల్ని నియంత్రించడానికి గాల్లోకి కాల్పులు జరపడం, మహిళలు, పిల్లలని చూడకుండా కర్రలతో కొట్టడం వంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. -
‘ఆ ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే’
సాక్షి, కాకినాడ: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. ప్రజాప్రతినిధులుగా తాము ఎంతో గర్వ పడుతున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయనతో పాటు ఎంపీ వంగా గీత, పార్టీ నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ వెంకటలక్ష్మీ కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మేనిఫెస్టోను పవిత్రంగా భావించి.. మంచి మనస్సుతో సిఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హమీలను ఏడాది కాలంలోనే అమలు చేశారని పేర్కొన్నారు. (టీడీపీ కుట్రలు ఫలించవు: మల్లాది) చారిత్రాత్మక విజయం అందించిన రోజు: వంగా గీత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 52 శాతం ఓట్లతో ప్రజలు వైఎస్సార్సీపీకి గొప్ప విజయం అందించిన రోజు అని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా తన పరిపాలనపై ప్రజలకు నమ్మకం కలిగించారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా, కరోనా కష్టాలు వచ్చిన కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలోనే సీఎం అమలు చేశారని కొనియాడారు. సీఎం జగన్కు భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల దీవెనలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు ('ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం') -
సుదీర్ఘ పాదయాత్రకు ఫలితం.. మే 23: ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘ పాదయాత్రకు ఫలితం.. గత ఏడాది మే 23 తేది అని ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్సీ వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇది కోట్లాది ప్రజల విజయమన్నారు. పేద ప్రజల కడుపు కొట్టి కార్పొరేట్ వర్గాలకు రాష్ట్ర సంపదను దోచిపెట్టడం నుంచి విముక్తి పొందిన రోజు అన్నారు. రాష్ట్రం అనేక వర్గాల్లో వెనుకబడిన నేపథ్యంలో ఆర్థిక స్వావలంబన తీసుకొస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆశలు వమ్ము కాకుండా పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. (దేశ చరిత్రలో ఇది మరచిపోలేని రోజు: అవంతి) ఎన్నికల మెనిఫేస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా 40 కొత్త పథకాలు ఏడాది పాలనలో ప్రవేశ పెట్టిన ఘటన సీఎం జగన్కు దక్కుతుందన్నారు. చంద్రబాబు అధికారంకలో ఉన్నప్పుడూ.. లేనప్పుడూ కూడా ఆయన ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా ప్రజల్ని బాధ పెట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఏడాది పాలన విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రజలకు అబ్ధి చేకురే విధంగా సాగిందని వ్యాఖ్యానించారు. ఎన్నో కష్టాలు పడ్డా, న్యాయస్థానాల ద్వారా వచ్చే చిక్కులు ఎదురైనప్పటికీ ఆయనకు ప్రజల దీవెనలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (కేసీఆర్ దొంగలకు దోచి పెడుతున్నారు: బండి) -
'ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం'
సాక్షి, కాకినాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా మే 30వ తేదీన 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక ఓట్ల షేర్ పొంది తిరుగులేని జననేతగా సీఎం జగన్ ప్రజల ఆశీర్వాదం పొంది నేటితో ఏడాది పూర్తయిందన్నారు. ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ది బెస్ట్ సీఎంగా దేశం మొత్తం కొనియాడుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ' నేను ఉన్నాను.. నేను విన్నాను' అని జగన్ ప్రజలకు మాట ఇస్తే .. ఆయన ఏం చేయగలడంటూ టీడీపీ విమర్శలకు దిగిందన్నారు. కానీ కరోనా వంటి కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా అమలు చేయడం జగన్కే చెల్లిందన్నారు. ఏడాది కాలంలో ప్రజలకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కన్నబాబు పేర్కొన్నారు.(మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు) అమ్మ ఒడి.. రైతు భరోసా వంటి పథకాల విషయంలో జగన్ తన ధర్మాన్ని తూ.చ తప్పకుండా అమలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పరంగా రికార్డు సృష్టిస్తున్నామన్నారు. తొలిసారిగా టమాట, పెండ్లం,మిర్చి ఇలా పలు పంటలను మార్కెటింగ్ శాఖ ద్వార కొనుగోలు చేసి బజార్లకు పంపించినట్లు వెల్లడించారు. 17 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాట ధర కల్పించామన్నారు. వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తొలి సారిగా గ్రామ స్ధాయిలో విత్తన పంపిణీని ప్రారంభించిన ఘనత సీఎం వైఎస్ జగన్ కి దక్కుతుందని కన్నబాబు స్పష్టం చేశారు. (ఏపీ చరిత్రలో చిరస్మరణీయైన రోజు: విజయసాయిరెడ్డి) -
మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూపురంలో పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిగి బస్టాండ్లోని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ..' మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఇక్బాల్ పేర్కొన్నారు. ఏడాదిలోనే మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి'. ఇలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రాల్లో లేరని ఇతర రాష్ట్రాల ప్రజలు మాట్లాడటంతోనే ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని తేలిపోయిందని పేర్కొన్నారు. జననేత సుపరిపాలన చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ' ప్రతిపక్ష పార్టీలను పాతాళానికి తొక్కి వైఎస్సార్ పార్టీ తారాజువ్వాలగా ఎగిరిన రోజు మే 23 . కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ సంక్షేమాలు ఆపలేదని, నవరత్నాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయలేని పనిని, ఇచ్చిన మాటను,ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్న ఓకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన వాగ్దానాలు ఎప్పటికి అమలు చేయలేడని ప్రతిపక్షాల చేసిన వాఖ్యలను తిప్పికొడుతూ ఏడాదిలోనే చేసి చూపించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎల్లపుడు ఇలాగే ఉండాలని ప్రతిపక్ష పార్టీలు,నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించాలంటూ' తెలిపారు. ప్రజారంజక నేతగా మారారు సాక్షి, చిత్తూరు : వైఎస్సార్పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మట్లాడుతూ.. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలు ప్రజలు విశ్వసించడంతో భారీ ఎత్తున విజయాన్ని ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్ 90 శాతం మేరకు హామీలను నెరవేర్చి ప్రజారంజక నేతగా మారారని తెలిపారు. కరోనా కష్టకాలం కావడంతో ప్రజా ప్రయోగ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ.. ' సాధారణ వ్యక్తి అయినా నన్ను వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో.. ముఖ్యమంత్రి అయ్యాక వాటికే ప్రాధాన్యత ఇచ్చి 90 శాతం మేరకు పూర్తి చేసిన ఘనత జగన్కే చెల్లింది. కరోనాను అరికట్టడానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఆమోదయోగ్యంగా ఉన్నాయి'. -
ప్రమాణ స్వీకారానికి రండి
న్యూఢిల్లీ: జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ నెల 29వ తేదీన జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. అనంతరం ఆయన రాహుల్ గాంధీతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోనూ సమావేశమై, వారినీ ఆహ్వానించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఆర్పీఎన్ సింగ్ కూడా ఉన్నారు. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ అని సోనియాతో సమావేశానికి ముందు హేమంత్ సోరెన్ మీడియాతో అన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపేందుకే వచ్చానన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వం సుస్థిరంగా ఐదేళ్లూ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, గవర్నర్ ద్రౌపది ముర్ము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ను ఆహ్వానించారని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) బుధవారం తెలిపింది. మంగళవారం హేమంత్, ఇతర కూటమి నేతలతో గవర్నర్తో సమావేశమై తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖ అందజేశారన్నారు. -
29న సీఎంగా హేమంత్ ప్రమాణం
రాంచీ/న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్(44) ఈ నెల 29వ తేదీన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం హేమంత్ సోరెన్, సంకీర్ణంలోని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) తదితర పార్టీల నేతలతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ ద్రౌపది ముర్మును కలిశారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా గవర్నర్ అంగీకరించారని, ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అనంతరం హేమంత్ సోరెన్ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ..ఈ చట్టం కారణంగా తమ రాష్ట్రంలోని ఏ ఒక్కరికి నష్టం జరిగే అవకాశమున్నా అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకుముందు జేఎంఎం ఎమ్మెల్యేలు సమావేశమై పార్టీ వర్కింగ్గా ఉన్న ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతోపాటు కూటమికి మద్దతు ప్రకటించిన జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్) చీఫ్ బాబూలాల్ మరాండీతో కూడా సమావేశం అయ్యారు. ఎన్నికలకు ముందే ఏర్పాటైన జేఎంఎం– కాంగ్రెస్– ఆర్జేడీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరెన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో శాసనసభలోని 81 స్థానాలకు గాను సంకీర్ణానికి 47 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. బీజేపీ క్షీణతకు నిదర్శనం జార్ఖండ్:పవార్ ముంబై: దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాభవం తగ్గుతోందని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం నేత, జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు శరద్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై హేమంత్ ట్విట్టర్లో స్పందిస్తూ..మహారాష్ట్రలో పవార్ సాగించిన పోరాటం తమకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. -
సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థికం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. కీలక హోం మంత్రిత్వ శాఖను శివసేన తన వద్ద అంటిపెట్టుకుంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేకు హోంతో పాటు పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖలు, మరో శివసేన మంత్రి సుభాష్ దేశాయ్కి పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, యువజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఎన్సీపీ మంత్రి జయంత్ పాటిల్కు ఆర్థిక శాఖను, గృహనిర్మాణం, మరికొన్ని శాఖల బాధ్యతలు అప్పగించారు. మరో ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్భల్కు నీటి పారుదల, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. కాంగ్రెస్ మంత్రి బాలాసాహెబ్ తోరట్కు రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలు ఇచ్చారు. మరో కాంగ్రెస్ మంత్రి నితిన్ రౌత్కు పీడబ్ల్యూడీ, గిరిజనాభివృద్ధి శాఖలు అప్పగించారు. కాగా. గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 79వ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆయన నివాసంలో పూలగుచ్ఛం అందజేశారు. -
'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే ఉత్తమం'
ముంబై: మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. 'ఆటోరిక్షా కూడా మూడు చక్రాలపై నడుస్తుంది. అయితే.. మూడు చక్రాలు కూడా ఒకే దిశలో కాకుండా తలో దిశలో వెళ్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి నెలకొంటుందని' వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 'రెండు చక్రాల కన్నా మూడు చక్రాలే ఉత్తమం' అని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఉమ్మడి కార్యాచరణ విషయంపై చవాన్ను విలేకరులు ప్రశ్నించగా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ రికార్డుల కెక్కారు. గతంలో 1963లో ముఖ్యమంత్రి మారోతరావ్ కన్నంవార్ మరణానంతరం 1963 నవంబరు 25వ తేదీ సావంత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కాగా సావంత్ కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మరోసారి నవంబర్ నెలలోనే 23వ తేదీన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ అత్యల్పంగా కేవలం మూడున్నర రోజులలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. -
ఉద్దవ్ ఠాక్రేకే పీఠం..
ముంబై: మహారాష్ట్ర రాజకీయ డ్రామా క్లైమాక్స్కు చేరుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మార్గం సుగమమైంది. ఠాక్రే కుటుంబ తొలి సీఎంగా నవంబర్ 28న శివాజీ పార్క్లో ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు నెల రోజులుగా అనూహ్య, ఉత్కంఠ భరిత మలుపులతో సాగుతున్న ‘మహా’నాటకంలో మంగళవారం మరిన్ని కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రారంభమైన కీలక ఎపిసోడ్.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహారాష్ట్ర వికాస్ అఘాడి’సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను తమ నేతగా, తదుపరి సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ముగిసింది. ఆ తరువాత ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీకి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఈ మధ్యలో పలు ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కాసేపటికి డిప్యూటీ సీఎం పదవికి ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతుందని అజిత్ పవార్ చెప్పడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అయితే, అజిత్ రాజీనామా చేయడంతో మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం తమవద్ద లేకపోయిందని, అందువల్ల రాజీనామా చేస్తున్నానని బీజేపీ నేత ఫడ్నవీస్ వివరించారు. అనంతరం, రాజ్భవన్కు వెళ్లి, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి రాజీనామా లేఖను అందించారు. ఈ లోపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే కాళీదాస్ కొలాంబ్కర్ను గవర్నర్ ప్రొటెం స్పీకర్గా నియమించారు. కాళీదాస్ కొత్తగా ఎన్నికైన 288 ఎమ్మెల్యేలతో బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఫడ్నవీస్ రాజీనామా అనంతరం, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ముంబై శివార్లలోని ట్రైడెంట్ హోటల్కు చేరుకున్నారు. అక్కడ సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఆయా పార్టీల శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడ జరిగిన కార్యక్రమంలో మూడు పార్టీల కూటమి ‘మహా వికాస్ అఘాడి’నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. దాంతో, మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఆయనే కానున్నారు. ఉద్ధవ్ తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హయాం నుంచి ఠాక్రే కుటుంబం దశాబ్దాలుగా మహారాష్ట్రలో చక్రం తిప్పుతున్నా.. ప్రభుత్వ పదవిని ఠాక్రే కుటుంబం చేపట్టడం ఇదే ప్రథమం కానుంది. ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ తోరట్ ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యే అవకాశముందని ఆయా పార్టీల అంతర్గత సమాచారం. ఉద్ధవ్ ఠాక్రే సీఎం కానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముంబైలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు కూడా సేన శ్రేణులు బాణాసంచా కాల్చి, ఠాక్రే అనుకూల నినాదాలతో హోరెత్తించారు. కాగా, మూడు పార్టీలు ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించే కనీస ఉమ్మడ ప్రణాళిక(కామన్ మినిమమ్ ప్రొగ్రామ్)పై కూడా ఒక అంగీకారానికి వచ్చారని సేన వర్గాలు తెలిపాయి. కూటమి పేరును ‘మహారాష్ట్ర వికాస్ అఘాడీ’గా నిర్ణయించారని పేర్కొన్నాయి. కక్ష సాధింపు ఉండదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఢిల్లీ వెళ్లి పెద్దన్నయ్యను కలుసుకుంటానని, ప్రధాని నరేంద్రమోదీ పేరును నేరుగా ప్రస్తావించకుండా, ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రేను తన చిన్న తమ్ముడిగా మోదీ అభివర్ణించిన విషయం తెలిసిందే. అలాగే, తమ ప్రభుత్వానికి ఎవరిపైనా పగ, ప్రతీకారం లేవని ఎవరిపై కక్షసాధింపు చేపట్టబోమని స్పష్టం చేశారు. ట్రైడెంట్ హోటల్లో జరిగిన కూటమి ఎమ్మెల్యేల భేటీలో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి ఉద్ధవ్ ఠాక్రే కృతజ్ఞతలు తెలిపారు. ‘వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలు నేడు కలిశాయి. 30 ఏళ్లు స్నేహితులుగా ఉన్నవారు మమ్మల్ని నమ్మలేదు. ఎవరికి వ్యతిరేకంగా 30 ఏళ్లు పోరాడామో వారు మమ్మల్ని విశ్వసించారు. ఈ ప్రభుత్వం మాదని ప్రతీ సామాన్యుడు అనుకునేలా పాలన సాగిస్తాం’అన్నారు. ఈ సందర్భంగా శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేను శరద్ పవార్ గుర్తు చేశారు. ‘రాజకీయంగా ప్రత్యర్థులమైనా.. వ్యక్తిగతంగా మేమిద్దరం మంచి స్నేహితులం’అన్నారు. నవంబర్ 28న శివాజీ పార్క్లో కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్న అనంతరం కూటమి నేతలు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలుసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని పేర్కొంటూ, కూటమి పార్టీలతో పాటు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు పత్రాలను అందించారు. మెజారిటీ నిరూపించుకునేందుకు అవసరమైన లేఖలను సమర్పించేందుకు గవర్నర్ ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3వ తేదీ వరకు సమయమిచ్చారు. గవర్నర్ను కలిసిన వారిలో శివసేన నేత ఎక్నాథ్ షిండే, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ తోరట్, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, ఎస్పీ నేత అబూ అజం తదితరులున్నారు. అనంతరం, ఈ నెల 28న శివాజీ పార్క్ గ్రౌండ్లో ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేస్తారని శివసేన నేత ఒకరు వెల్లడించారు. మిగతా కేబినెట్ ప్రమాణ స్వీకారం త్వరలో ఉంటుందన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం నవంబర్ 28వ తేదీన ఉంటుందని కాంగ్రెస్ నేత బాలా సాహెబ్ తోరట్ సైతం స్పష్టం చేశారు. అయితే, అంతకుముందు, కూటమి భేటీలో.. ప్రమాణ స్వీకారం డిసెంబర్ 1న ఉంటుందని శరద్ పవార్ ప్రకటించారు. కానీ గవర్నర్ను కలిసిన అనంతరం ప్రమాణ స్వీకార తేదీలో మార్పు చోటు చేసుకుంది. కుటుంబ సెంటిమెంట్ అజిత్పవార్ను మళ్లీ ఎన్సీపీలోకి తీసుకువచ్చేందుకు పవార్ కుటుంబం తీవ్రంగా కృషి చేసిందని, అజిత్ తిరిగి ఎన్సీపీలోకి వచ్చేందుకు వీలుగానే శరద్ పవార్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 23న బీజేపీతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అజిత్ పవార్ను మళ్లీ వెనక్కు తీసుకువచ్చేందుకు ఎన్సీపీ నేతలు, పవార్ కుటుంబం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అజిత్ను వెనక్కు రావాల్సిందిగా ట్వీటర్ వేదికగా పవార్ కుటుంబ సభ్యులు విజ్ఙప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రజలు మాకే అధికారం ఇచ్చారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమకే అధికారం అప్పగించారని, అయితే, కలిసి పోటీ చేసిన శివసేన అధికారం కోసం తమకు దూరమైందని రాజీనామా ప్రకటన సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. ఇకపై బాధ్యతాయుత ప్రతిపక్షంగా, అసెంబ్లీలో ప్రజా వాణిని వినిపిస్తామని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే స్థాయికి దిగజారలేమని వ్యాఖ్యానించారు. ‘అజిత్ పవార్ మీకు మద్దతివ్వడం శరద్ పవార్ వ్యూహంలో భాగమనుకుంటున్నారా?’అని ప్రశ్నించగా, ‘ఆ ప్రశ్న శరద్ పవార్ను అడగండి. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని అజిత్ పవార్ నాతో చెప్పారు’అని స్పందించారు. ఈ సందర్భంగా శివసేనపై ఫడ్నవీస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఎన్నికల ఫలితాలు బీజేపీ–శివసేన కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తామని సేన నేతలు వ్యాఖ్యానించారు. ఆ తరువాత మాతో అబద్దాలు చెబుతూ.. వేరే పార్టీలతో చర్చలు ప్రారంభించారు. హిందూత్వ సిద్ధాంతాలు చెప్పే శివసేన ఈ రోజు సోనియాగాంధీ ముందు మోకరిల్లింది. ఆమె పేరుతో ప్రతిజ్ఞలు కూడా చేశారు’అని విమర్శించారు. ఎన్నికల ఫలితాలను, పోటీ చేసిన స్థానాలను, గెలిచిన సీట్లను విశ్లేషిస్తే.. బీజేపీనే మళ్లీ అధికారంలోకి రావాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఐదేళ్లు ఉద్ధవ్ ఠాక్రేనే ఫడ్నవీస్ రాజీనామా అనంతరం శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే సీఎం కాబోతున్నారని, వచ్చే ఐదేళ్లు ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మళ్లీ తమవైపే వచ్చారన్నారు. టైడెంట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కూటమి నేతగా, తదుపరి సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే పేరును ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్ మద్దతు పలికారు. ఈ కార్యక్రమానికి శరద్పవార్తో పాటు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్, సమాజ్వాదీ పార్టీ నేత అబూ అజం, స్వాభిమాని షేట్కారీ సంఘటన చీఫ్ రాజు షెట్టి తదితరులు హాజరయ్యారు. కానీ, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్పవార్ మాత్రం హాజరుకాలేదు. అసెంబ్లీ ప్రత్యేక భేటీ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రంలోగా ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే కాళీదాస్ కొలాంబ్కర్ను గవర్నర్ ప్రొటెం స్పీకర్గా నియమించారు. ఆయన బుధవారం ఉదయం కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. శరద్ పవార్ ఇంటికి అజిత్ కాగా, తిరుగుబాటు చేసి బీజేపీ క్యాంప్తో చేతులు కలిపిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. శరద్ పవార్ ఇంటికి అజిత్ మంగళవారం రాత్రి వచ్చారు. ఆ తరువాత ఛగన్ భుజ్బల్, ప్రఫుల్ పటేల్ కూడా శరద్ పవార్ నివాసానికి వచ్చారు. -
పార్లమెంటులో ‘మహా’ సెగలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై సోమవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలనను ఎత్తేసీ ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు లోక్సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. మహారాష్ట్ర పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విపక్షాలు సభను హోరెత్తించాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యం ఖూనీని నివారించండి అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని ఎంపీలు వెల్లోకి దూసుకుపోయి నినాదాలు చేశారు. వెల్లోకి వచ్చిన కాంగ్రెస్ సభ్యులు, హిబి ఈడెన్, ప్రతాపన్లను వెనక్కి వెళ్లాలంటూ స్పీకర్ చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో సభ నుంచి బయటకు పంపేయాల్సిందిగా స్పీకర్ ఆదేశాలు జారీ చేయడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. మార్షల్స్కి, సభ్యులకి మధ్య తోపులాట జరిగింది. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారు: మహిళా ఎంపీల ఫిర్యాదు మహారాష్ట్ర విషయంలో సభలో గందరగోళం నెలకొన్నప్పుడు భద్రతా సిబ్బంది తమపై చేయి చేసుకున్నారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు . తమపై భద్రతా సిబ్బంది చేయి చేసుకున్నారంటూ కాంగ్రెస్ ఎంపీలు జోతిమణి, రమ్య హరిదాస్లు ఆరోపించారు. మహారాష్ట్రలో అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. ఆమె వెంట పార్టీ నేతలు అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, అధీర్ రంజన్ చౌధరి, శశిథరూర్లు కూడా నిరసన కార్యక్రమంలో నినాదాలు చేశారు. రాజ్యసభలోనూ అదే సీన్ రాజ్యసభ మహారాష్ట్ర అంశంపై దద్దరిల్లింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, డీఎంకేలు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తివేశారని, దానిపై చర్చించాలంటూ పట్టు పట్టారు. చైర్మన్ వెంకయ్య రాష్ట్రపతి పాలన విధించడానికి ముందు, లేదంటే ఎత్తివేయడానికి ముందు సభ చర్చించాలని, ఎత్తివేశాక దానిపై చర్చ జరపలేమన్నారు. అయినా, సభలో గందరగోళం ఆగలేదు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేస్తున్నారంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. మధ్యాహ్నం తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో డిప్యూట్ చైర్మన్æ మంగళవారానికి సభను వాయిదా వేశారు. పార్లమెంటులో నేడు రాజ్యాంగ దినోత్సవం భారతదేశ రాజ్యాంగ సభ తనదైన సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగాన్ని ఆమోదించుకుని సరిగ్గా ఏడు దశాబ్దాలు. 1949 నవంబర్ 26న మన దేశ రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది. ఆ తరువాత రెండు నెలల అనంతరం 1950 జనవరి 26న ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1947 ఆగస్టు నెలలో వలస పాలన నుంచి విముక్తిపొందిన భారతదేశం.. రెండేళ్ళ అనంతరం తనదైన రాజ్యాంగాన్ని రూపొందించుకుని నవంబర్ 26న ఆమోదింపజేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏటా రాజ్యాంగ దినోత్సవం– ‘సంవిధాన్ దివస్’ జరుపుకుంటున్నాం. 70ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో మంగళవారం ఉభయసభల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. -
గవర్నర్లు.. కింగ్మేకర్లు!
సాక్షి, ముంబై: దేశంలో గత మూడేళ్లలో అయిదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లు పోషించిన పాత్ర వివాదాస్పదం అయింది. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ కోసం గేమ్ చేంజర్లుగా మారారు. 2017లో... గోవాలో 2017 ఎన్నికల్లో అసెంబ్లీలోని 40 స్థానాలకు 18 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, గవర్నరు మృదులా సిన్హా ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకే అవకాశమిచ్చారు. ఈ విషయంపై కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో గవర్నర్ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోపాటు, 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో 28 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ 21 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ, గవర్నర్ కాంగ్రెస్ను కాదని, బీజేపీకి చాన్సివ్వడంతో కమలదళం ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 2018లో... కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం గవర్నర్ వజూభాయ్ వాలా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. అయితే, బలపరీక్షలో బీజేపీ ఓడిపోయింది. సీఎం యడియూరప్పరాజీనామా చేయడంతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాల్లో అధికార కూటమిలోని 17 మంది ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆపై మళ్లీ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్– జేడీఎస్ వాదనలను గవర్నర్ వినిపించుకోలేదన్న ఆరోపణలున్నాయి. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను 21 స్థానాలతో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. గవర్నర్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీని, దాని మిత్రపక్షం 19 సభ్యులున్న ఎన్పీపీని ఆహ్వానించడం వివాదాస్పదమైంది. -
‘శరద్కు కేంద్ర పదవులు’
పట్నా: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఎన్డీయేలో చేరితే కేంద్రప్రభుత్వంలో కీలక పదవి లభించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ను కూడా శరద్ కలుపుకుపోవాలని అన్నారు. శివసేన–బీజేపీ సంక్షోభం గురించి మాట్లాడుతూ.. రెండు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే, సమస్యలున్నా సర్దుకుపోయి ఉండేవన్నారు. కానీ పరిస్థితి చేజారిందన్నారు. ‘అభినవ చాణక్య’ అమిత్షా వేగాన్ని ఆయా పార్టీలు అందుకోలేకపోయాయన్నారు. ఎన్సీపీని తమతో చేర్చుకున్న బీజేపీ.. కాంగ్రెస్, శివసేనలకు షాకిచ్చిందని చెప్పారు. మరోవైపు బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ బీజేపీ–ఎన్సీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజును విజయ్ దివాస్గా జరుపుకుంటామన్నారు. -
‘మహా’ సీఎం ఉద్ధవ్!
న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్ వీడింది. శివసేన నేతృత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్ల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందన్న స్పష్టత వచ్చినప్పటికీ.. శివసేన తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే విషయంలో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేనా? లేక ఆయన కుమారుడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే సీఎం అవుతారా? అనే విషయంలో శుక్రవారం వరకు సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మధ్య ముంబైలో శుక్రవారం జరిగిన చర్చల అనంతరం ఆ సందిగ్ధతకు ఎన్సీపీ అధినేత శరద్పవార్ తెర దించారు. సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రేనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని వెల్లడించారు. ‘సంకీర్ణ ప్రభుత్వ నేత ఎవరనే విషయం పెండింగ్లో లేదు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై ఏకాభిప్రాయం ఉంది’ అన్నారు. ఈ మూడు పార్టీల మధ్య చర్చలు నేడు(శనివారం) కూడా కొనసాగనున్నాయి. చర్చల ప్రక్రియ శుక్రవారం ముగుస్తుందని, ఆ తరువాత సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ మూడు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేస్తాయని తొలుత అంతా భావించారు. కానీ చర్చించాల్సిన విషయాలు కొన్ని ఉన్నందున, మూడు పార్టీల నేతల భేటీ శనివారం కూడా కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తెలిపారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, అనేక విషయాల్లో ఒక అంగీకారానికి వచ్చామని చర్చల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ పేర్కొన్నారు. ముంబైలోని నెహ్రూ సెంటర్లో జరిగిన ఈ చర్చల్లో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో పాటు.. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, సంజయ్ రౌత్, సుభాష్ దేశాయి, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్, మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండే, బాలాసాహెబ్ తోరట్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్, అజిత్ పవార్ పాల్గొన్నారు. చర్చలు సంతృప్తికరంగా జరిగాయని, త్వరలో వివరాలు మీడియాకు వివరిస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేనే సీఎం అవుతారని శరద్ పవార్ చెప్పారని శివసేన నేత ఏక్నాథ్ షిండేతో విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆ విషయం ఈ రోజు చర్చల్లో ప్రస్తావనకు రాలేదు’ అని తెలిపారు. శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే ఎన్నికయిన విషయం తెలిసిందే. కాగా, ఉద్ధవ్ ఠాక్రేనే సీఎం కావాలని పవార్ పట్టుబడుతున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఉద్ధవ్ ఠాక్రేనే అన్నారు. చర్చల అనంతరం సంజయ్ రౌత్, సుభాష్ దేశాయి, ఆదిత్య ఠాక్రేలతో శివాజీ పార్క్లోని మేయర్స్ బంగళాలో ఉద్ధవ్ సమావేశమయ్యారు. మిత్రపక్షాలతో కాంగ్రెస్– ఎన్సీపీ భేటీ శివసేనతో చర్చలకు ముందు.. మిత్రపక్షాల నేతలతో కాంగ్రెస్– ఎన్సీపీ నాయకులు చర్చలు జరిపారు. సమాజ్వాదీ పార్టీ, సీపీఎం, స్వాభిమాన్ ప„Š , పీజంట్స్ వర్కర్స్ పార్టీ, జనతాదళ్ తదితర పార్టీల ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ‘శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మా మిత్రపక్షాలు ఆమోదం తెలిపాయి’ అని ఆ తరువాత ఎన్సీపీ నేత జయంత్పాటిల్ తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ) ముసాయిదాను రూపొందించా యని, దీనిపై పార్టీల అగ్ర నేతలు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ వెల్లడించారు. ‘మా మద్దతు కావాలంటే శివసేన కొన్ని విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. మతవాదాన్ని నిర్మూలించేందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. దళితులు, మైనారిటీలు, రైతులకు అనుకూలంగా ప్రభుత్వం ఉండాలి’ అని ఎస్పీ నేత అబూ అజ్మీ స్పష్టం చేశారు. ఇంద్ర పదవి ఇస్తామన్నా.. బీజేపీతో మళ్లీ పొత్తుకు అవకాశాలు లేవని శివసేన నేత సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. ‘ఇంద్రుడి సింహాసనం ఇస్తామన్నా బీజేపీకి మద్దతివ్వం’ అని స్పష్టం చేశారు. శివసేనతో పొత్తుకు బీజేపీ మళ్లీ ప్రయత్నిస్తోందన్న వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు. అవకాశవాద పొత్తు: బీజేపీ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల పొత్తు అవకాశవాద రాజకీయమని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ విమర్శించారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకే సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ.. ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. వారి ప్రభుత్వం ఆర్నెల్లు మించి సాగదన్నారు. -
ఆగని ‘మహా’ వ్యథ
సాక్షి ముంబై: అతివృష్టి లేదంటే అనావృష్టి.. ఆదుకునే నాథుడు లేడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రపతి పాలన పెట్టడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక మహారాష్ట్రలో అన్నదాతలు కుంగిపోతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడిన రైతాంగం ఈ ఏడాది కురిసిన వర్షాలకు ఆనందం చెందారు. తమ పంట పండిందని సంబరాలు చేసుకున్నారు. అయితే అక్టోబర్లో రుతుపవనాల తిరుగు ప్రయాణ సమయంలో భారీగా వర్షాలు కురవడంతో చేతికందిన పంట నీళ్లపాలైంది. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. కేవలం మరాఠ్వాడా ప్రాంతంలో 41 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, కందితో పాటు ఇతర పండ్ల తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లడంతో రైతన్నలు తట్టుకోలేకపోయారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో 68 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జనవరి నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో 746 మంది బలవన్మరణం పొందారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై తమను ఆదుకుంటుందేమోనని రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలోనే రాష్ట్రపతి పాలన పెట్టడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అయితే రాష్ట్ర గవర్నర్ పంట నష్టపోయిన వారికి ప్రతీ హెక్టార్కు రూ.8 వేలు, పండ్ల తోటలకు ప్రతీ హెక్టార్కు రూ.18 వేలు ప్రకటించడం కాస్త ఊరటనిచ్చినా కష్టాల ఊబి నుంచి రైతుల్ని బయటపడవేయలేకపోయాయి. ప్రభుత్వ లెక్కలన్నీ తప్పులే ‘సాక్షి’తో పి. సాయినాథ్ రైతు కష్టాల్లో మహారాష్ట్ర అత్యంత దయనీయ స్థితిలో ఉందని సీనియర్ జర్నలిస్టు, ది హిందూ పత్రిక గ్రామీణ వ్యవహారాల మాజీ ఎడిటర్ పి. సాయినాథ్ అన్నారు. రైతుల ఆత్మహత్య వివరాల్లో ప్రభుత్వ గణాంకాలన్నీ తప్పుడువేనని చెప్పారు. ఈ విషయమై ఆయన సాక్షితో మాట్లాడుతూ 1995 నుంచి 2015 వరకు 20 ఏళ్లలో మహారాష్ట్రలో 65 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెబుతున్నారు కానీ, ఇది సరైనది కాదని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలను సేకరించే పద్ధతిలో లోపాలున్నాయని అన్నారు. వారు సరిగ్గా లెక్కలు వేసి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న డేటా కూడా మూడేళ్ల నాటిదని సాయినాథ్ వ్యాఖ్యానించారు. రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలోనే కనీసం ప్రభుత్వం కూడా లేకపోవడం పులి మీద పుట్రవంటిదేనని వ్యాఖ్యానించారు. -
నేడు శివసేనతో భేటీ
న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కొత్త కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. త్వరలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడనుంది. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధమయ్యాయి. శివసేనతో పొత్తుకు సంబంధించి కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు గురువారం విజయవంతంగా ముగిశాయి. ఈ చర్చల్లో అన్ని అంశాల్లో ‘పూర్తి ఏకాభిప్రాయం’ సాధించినట్లు చర్చల అనంతరం రెండు పార్టీలు ప్రకటించాయి. కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, పొత్తుకు తుదిరూపమిచ్చేందుకు శుక్రవారం శివసేనతో భేటీకానున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసిన సమాజ్వాదీ, సీపీఎం, స్వాభిమాని ప„Š , పీజంట్స్ వర్కర్స్ పార్టీలతో శుక్రవారం చర్చించి, ఆ తరువాత శివసేనతో కూటమి కూర్పుపై, కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్– సీఎంపీ)పై యోచిస్తామని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించాయి. తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై ముంబైలో అధికారికంగా తుది ప్రకటన ఉంటుందన్నాయి. ఆ తర్వాత మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ గవర్నర్ భగత్సింగ్ కోష్యారీకి లేఖ ఇస్తాయి. నవంబర్ 26న ప్రమాణ స్వీకారం ఉండొచ్చని శివసేన వర్గాలు తెలిపాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీ కూటములు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన విషయం తెలిసిందే. ఉద్ధవ్నా? ఆదిత్యనా? శివసేన తరఫున ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. సేన యువనేత, పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేకు ఆ స్థానం అప్పగించే ఆలోచన ఉందని శివసేన వర్గాలు తెలిపాయి. కానీ, ఉద్ధవ్ ఠాక్రే సీఎం కావాలని ఎన్సీపీ, కాంగ్రెస్ పట్టుబడుతున్నాయని, తొలిసారి ఎమ్మెల్యే అయిన, రాజకీయ అనుభవం పెద్దగా లేని ఆదిత్యకు పెద్ద బాధ్యత అప్పగించడం సరికాదని భావిస్తున్నాయని పేర్కొన్నాయి. మరోవైపు, సీఎంగా ఉద్ధవ్, ఆదిత్య కాకుండా.. శివసేన సీనియర్నేతలు సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయిల పేర్లూ శివసేన వర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ, ఠాక్రేలు కాకుండా, వేరే ఎవరు సీఎం అయినా, పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. సీడబ్ల్యూసీ ఆమోదం ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ నివాసంలో గురువారం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగాయి. ‘అన్ని అంశాలపై కూలంకషంగా చర్చలు జరిపాం. రెండు పార్టీల మధ్య పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం కుదిరింది’ అని చర్చల అనంతరం కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ ప్రకటించారు. సీఎంపీ ప్రకటన సందర్భంగా కొత్త ప్రభుత్వ వివరాలను వెల్లడిస్తామన్నారు. సీఎం పదవిని పంచుకోవడంపై వస్తున్న వార్తలను మీడియా ప్రస్తావించగా.. ‘అవన్నీ ఊహాగానాలే’ అని కొట్టివేశారు. ఎన్సీపీతో చర్చల వివరాలను కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత వేదిక సీడబ్ల్యూసీకి నేతలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన భేటీలో శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపిందని ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, ఉద్ధవ్ భేటీ ఉండదు సోనియాగాంధీతో ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యే అవకాశాలు లేవని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘ఒకటి, రెండు రోజుల్లో మూడు (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయి. ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి స్పష్టత వస్తుంది’ అని గురువారం మీడియాతో చెప్పారు. పవార్, ఠాక్రే భేటీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో గురువారం రాత్రి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే సమావేశమయ్యారు. దక్షిణ ముంబైలోని శరద్ పవార్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అయితే, వారు ఏం చర్చించారనే విషయం వెల్లడి కాలేదు. ఎన్సీపీ, కాంగ్రెస్లకు ‘డిప్యూటీ’ ప్రభుత్వ కూర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై ముంబైలో మరికొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఐదేళ్ల పాటు శివసేన నేతనే ఉంటారని, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు లభిస్తాయని, కీలక మంత్రి పదవులు మాత్రం మూడు పార్టీలకు సమానంగా లభిస్తాయని, స్పీకర్ పదవి కాంగ్రెస్కేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరఫున బాలాసాహెబ్ తోరట్ ఉంటారని తెలుస్తోంది. పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు పార్టీలకు మంత్రిపదవులు లభించనున్నాయనే వార్తలొచ్చాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement