govt schools
-
సుద్ద పూస.. పరమ పవిత్రుడు.. ఇంగితం ఉందా బాబు ?
-
ఇంగ్లిష్ మాకే..! పేదవాళ్లు పేదవాళ్లలా ఉండండి
-
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు (Sankranti holidays) ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024–25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఆలిండియా సైనిక్ స్కూల్ (Sanik School) ప్రవేశ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు జనవరి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతిలో ప్రవేశానికి మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి పాస్ అయి, 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారు 9వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://exams.nta.ac.in/AISSEE/చూడొచ్చు.స్టీల్ప్లాంట్లో అప్రెంటీస్కు దరఖాస్తుల ఆహ్వానంవిశాఖపట్నం స్టీల్ప్లాంట్లో (Vizag Steelplant) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (గాట్), టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ (టాట్)కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గాట్కు రూ.9 వేలు, టాట్కు రూ.8 వేలు స్టైఫండ్ చెల్లించనున్నారు. 2022 తర్వాత గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులు నాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. గూగుల్ ఫారం నింపేందుకు జనవరి 9 వరకు గడువు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.చదవండి: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశంచైల్డ్ కేర్ లీవ్ షరతులతో ఇబ్బందులున్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి డిమాండ్సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్లను 10 విడతల్లోనే వినియోగించుకోవాలన్న షరతుతో వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ షరతును రద్దు చేసి ఉద్యోగినులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ డిమాండ్ చేశారు. షరతులతో సెలవు లక్ష్యం దుర్వినియోగమవుతోందన్నారు. అవసరం మేరకు మాత్రమే సెలవు ఉపయోగించుకునేలా, అపరిమిత విడతలతో చైల్డ్ కేర్ లీవ్ పొందేలా 199,36 జీవోలను సవరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం
-
సమీకృత గురుకు భవనాలకు నేడు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/కొందుర్గు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ భవనాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గులో సమీకృత గురుకుల పాఠశాల భవన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు.అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం సచివాలయం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొందుర్గులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారని సీఎస్ చెప్పారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించారు.ఇప్పటికే సంబంధిత అధికారులు శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని పరిశీలించినట్లు కలెక్టర్లు సీఎస్కు వివరించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన నిర్వహిస్తున్నామని, రెండో దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్ చెప్పారు.మొదటి విడత కింద ఎంపిక చేసినవి..కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలున్నాయి.కొందుర్గులో సీఎం సభరంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో రూ.125 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడ నున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని 109 సర్వే నంబర్లో 20 ఎకరాలను కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు. -
సర్కార్ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాల విద్యకి ఎసరు
-
విద్యార్థుల కష్టాలు.. అన్నం తినలేకపోతున్నాం..
-
విద్యార్థుల కష్టాలు.. అన్నం తినలేకపోతున్నాం..
-
విద్యార్థుల కష్టాలు.. అన్నం తినలేకపోతున్నాం..
-
టీడీపీ కోట్లు స్కీం.. చంద్రన్న పాచి ముద్ద..
-
పేద విద్యార్థులకు సారీ.. ఉచిత వైద్యం హరీ
-
టీచర్లకు పాలాభిషేకం
-
తండ్రి లాంటి గురువు కోసం తల్లడిల్లిన పిల్లలు
-
10 రోజులుగా పేదపిల్లల కడుపు కాలుస్తున్నారు.. ఇలాగే దేవాన్ష్ కడుపు కాల్చి చూడండి
-
పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది. దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి.కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్తో కూడిన విద్యా కానుక కిట్లు అందజేసింది. ఇలా వరుసగా నాలుగేళ్లు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం కానుంది. పుస్తకాలు మండల కేంద్రాలకు చేరినా నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు సగం మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కిట్లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతులకు నోట్బుక్స్ ఉన్నాయి. మొదటి సెమిస్టర్కు 3.12 కోట్ల పుస్తకాలు ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. కాగా, మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు దాదాపు మండల స్టాక్ పాయింట్లకు చేరాయి. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది. అలాగే, 3–10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు.పదో తరగతి సాంఘికశా్రస్తాన్ని సీబీఎస్ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచి్చంది. ఈ బోధనకు అనుగుణంగా మొత్తం 4.30 లక్షల పుస్తకాలు సైతం ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇంగ్లీష్ పదిలం..ఏపీలో ఇంగ్లీష్ మీడియంకు పెరిగిన విద్యార్థులు
-
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలపై ఐబీ సంస్థ ప్రతినిధుల ప్రశంసలు
-
మా బడి బ్రహ్మాండం
-
టోఫెల్ శిక్షణతో సత్ఫలితాలు..ఎల్లో మీడియా వక్రరాతలు
-
కార్పొరేట్ స్కూలుకు ధీటుగా విశాఖ మధురానగర్ ప్రభుత్వ పాఠశాల
-
పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్
-
విద్యా విప్లవం: బైజూస్ కంటెంట్ ఎంతో బాగుందంటున్న విద్యార్థులు
-
విజయవాడలో ఫ్యూచర్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం
-
గతంలో స్కూల్స్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థిని
-
ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, మార్పులు
-
పేదింట చదువుల వెలుగులపై ఎల్లో బ్యాచ్ అక్కసు
-
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు
-
విశాఖ జిల్లాలో 132 ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్ ల పంపిణీ
-
నేటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ
-
విద్యార్థులకు గుడ్ న్యూస్...విద్య శాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
-
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టోఫెల్ శిక్షణ
-
విద్యార్థులకు టోఫెల్ శిక్షణ
-
విద్యారంగంలో ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది: అంబటి రాయుడు
-
కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీ ప్రభుత్వ బడులు అద్భుతం: అంబటి రాయుడు
సాక్షి, తెనాలి : కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు. తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడిలోని రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ పాఠశాలను రాయుడు పరిశీలించారు. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఉన్నారని తెలిపారు. ‘ఏపీలో స్కూళ్లలో ఉన్న సదుపాయాలు దేశంలో ఎక్కడా లేవు. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే ఆహారం రుచికరంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వైద్య ఆరోగ్య రంగంలో ఏ రాష్ట్రం మన రాష్ట్రంతో సరితూగలేదు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు ఆనందంగా ఉన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు’ అని రాయుడు అన్నారు. ఇదీచదవండి... ఎమ్మెల్యే డోల శ్రీబాలవీరాంజనేయస్వామికి ఝలక్ -
పేద పిల్లల విద్యకు మహర్దశ
-
ప్రభుత్వ బడుల్లో క్రీడలకు ప్రాధాన్యం
-
నిర్మాణంలో ఉన్న బడులను ఫోటోలు తీసి తప్పుడు వార్తలతో దొరికిపోయిన ఈనాడు
-
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలు
-
తూర్పుగోదావరి జిల్లాలోని పాఠశాలల్లో నాడు నేడు
-
ఏపీలో చకచకా డిజిటలైజేషన్
-
విద్యా సంస్కరణలు భేష్
-
విద్యార్థులకు రోజుకు గంట పాటు టోఫెల్ శిక్షణ
-
ఏపీ విద్యావ్యవస్థకు అరుదైన గుర్తింపు
-
ఏపీలో పెరిగిన విద్యా సామర్థ్యాలు, నైపుణ్యాలు
-
సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం..88,342 మంది విద్యార్థులు తిరిగి బడికి
-
సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్..మెనూ ఇదే..
-
అమెరికా వైట్ హౌస్ లో ఏపీ విద్యార్థుల సందడి
-
ఖండాంతరాలు దాటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు (ఫొటోలు)
-
హ్యాట్సాఫ్ చిల్డ్రన్, వి ఆర్ ప్రౌడ్ యూ.. మీరు మరిన్ని అంతర్జాతీయ విజయాలను సాధించాలని ఆశిస్తున్నాం.!
-
ఏపీ సంక్షేమ పథకాలపై ‘ఐరాస’లో చర్చ
సాక్షి, అమరావతి: అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సదస్సులో పాల్గొన్నారు. 27 దేశాలకు చెందిన గ్లోబల్ పార్టనర్లు, ప్రపంచ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు, పౌర సమాజ సభ్యులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు న్యూయార్క్లో నిర్వహించిన హైబ్రిడ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్ఫరెన్స్–2023లో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ప్రసంగించారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అటు ప్రజలకు, ఇటు విద్యార్థుల ప్రగతికి ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో వివరించారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్ తీసుకువచ్చిన దిశ చట్టం గురించి తెలియజేశారు. కాగా, ప్రపంచ శాంతి, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధిపై జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 150 మంది ఉన్నత స్థాయి స్పీకర్లను ఒక్కచోటకు చేర్చి ఇంటర్ డిసిప్లినరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సదస్సులో జర్నలిస్ట్స్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ సభ్యులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్లారియేట్ సిలబస్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర.... ఇంకా ఇతర అప్డేట్స్
-
అమెరికా వెళ్లిన ఏపీ విద్యార్థులు
-
విద్యా శాఖపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్
-
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఏకంగా ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం
-
99శాతం బాగున్నాయి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో అందించిన ట్యాబ్ల్లో 99 శాతం బాగున్నాయని అధికారులు గుర్తించారు. కేవలంఒక్క శాతం ట్యాబ్ల్లో మాత్రమే రిపేర్లున్నాయని చెబుతున్నారు. పది రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న పాఠశాల విద్యాశాఖ ఐటీ విభాగం, జిల్లా నోడల్ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ట్యాబ్లను పరిశీలించి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇస్తున్నారు. స్క్రీన్లు పగిలిపోయినవి అత్యధికంగా ఉండగా, కొన్ని టాబ్స్లో ఎస్డీ కార్డులు తొలగించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. మొత్తం ట్యాబ్ల్లో ఇలాంటివి 4,800 వరకు ఉన్నట్టు తేలింది. స్క్రీన్లు పగిలిపోయిన వాటికి ప్రభుత్వమే కొత్తవి అమర్చి విద్యార్థులకు ఇవ్వనుంది. తల్లిదండ్రులపై భారం పడకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు గత డిసెంబర్లో 5,18,740 ట్యాబ్స్ను బైజూస్ కంటెంట్తో ప్రభుత్వం పంపిణీ చేసింది. భౌతిక నష్టం (ఫిజికల్ డ్యామేజీ) మినహా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎలాంటి ఖర్చు లేకుండా సరిచేసి ఇచ్చేలా మూడేళ్ల వారంటీతో వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. స్క్రీన్లు పగిలిపోయిన 3వేల పైచిలుకు ట్యాబ్లకు కొత్తవి అమర్చాలంటే కనీసం రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. ఇంత భారం విద్యార్థుల తల్లిదండ్రులపై పడకూడదనే ఉద్దేశంతో ఆ ఖర్చును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. ఎస్డీ కార్డు మార్చినవి కొన్నే.. కొందరు విద్యార్థులు తెలిసీ తెలియక ట్యాబ్స్లోని ఎస్డీ కార్డును తొలగించడంతో అవి పనిచేయడం లేదు. ఇలాంటివి సుమారు 1,500 నుంచి 1,800 వరకు ఉన్నట్టు గుర్తించారు. ట్యాబ్స్ కొనుగోలు చేసినప్పుడే ప్రతి విద్యార్థికి ఎస్డీ కార్డు తొలగించవద్దని సూచించినా కొందరు దీన్ని పాటించకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని సైతం సరిచేసి అందిస్తున్నారు. ఇకపై విద్యార్థులు ఎస్డీ కార్డు తొలగిస్తే వెంటనే గుర్తించేలా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని ట్యాబ్స్లో అందుబాటులోకి తెస్తున్నారు. ట్యాబ్లో ఇచ్చిన కంటెంట్ మినహా ఇంటర్నెట్ కంటెంట్ అప్లోడ్, డౌన్లోడ్ చేసేందుకు అవకాశం లేకుండా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. దీంతోపాటు గూగుల్ అథెంటికేటర్ను కూడా ఇన్స్టాల్ చేసి ట్యాబ్స్కు పటిష్ట రక్షణ కల్పించారు. ఇకపై ట్యాబ్ను ట్యాంపరింగ్ చేస్తే వెంటనే సంబంధిత జిల్లా నోడల్ అధికారులకు ఓటీపీ మెస్సేజ్ వెళ్లడంతో పాటు ఆయా ట్యాబ్ సేవలు నిలిచిపోతాయి. ట్యాంపర్ చేశారా..? లేక ఎస్డీ కార్డు మార్చారా? అనేది కూడా అధికారులకు తెలిసిపోతుంది. ఏ విద్యార్థి ట్యాబ్లో మార్పులు చేసేందుకు యత్నించారో జిల్లా నోడల్ అధికారుల నుంచి సంబంధిత స్కూలు హెచ్ఎంకు మెస్సేజ్ వెళుతుంది. అధికారులకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే తిరిగి ట్యాబ్ పనిచేస్తుంది. సక్రమంగా వినియోగించాలి.. విద్యార్థులు విజ్ఞానవంతులుగా ఎదగాలని, వారికి ఉత్తమ భవిష్యత్ అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ట్యాబ్స్ను అందించింది. వాటిని సక్రమంగా వాడుకోవాలి. ప్రస్తుతం స్క్రీన్ పాడైన వాటికి ఉచితంగానే కొత్తవి అమర్చాలని ఆదేశించాం. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించే యంత్రాంగం కూడా ఉంది. సాఫ్ట్వేర్ ఇబ్బందులుంటే స్థానిక సచివాలయం డిజిటల్ అసిస్టెంట్కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా వారికోసం మాన్యువల్గా రశీదు కూడా ఇస్తారు. ట్యాబ్స్ సర్విస్ కోసం రాష్ట్రంలో 145 శామ్సంగ్ సరీ్వస్ సెంటర్లున్నాయి. గరిష్టంగా 3 రోజుల్లో రిపేరు చేసి తిరిగి విద్యార్థికి అందిస్తారు. – కాటమనేని భాస్కర్, పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ -
ఒడిశా ప్రాంత విద్యార్థులకు ఆంధ్ర స్కూల్స్ ఒక గొప్ప వరం
-
ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
-
ట్యాబ్ లపై 'ఈనాడు' ఏడుపు
-
విజయవంతంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
-
పాఠశాల విద్యలో ఏఐ టెక్నాలజీతో పక్కాగా వివరాలు
-
ప్రభుత్వ బడుల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
-
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్స్ మీటింగ్
-
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్న జగనన్న
-
44 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పక్కాగా అమలు
-
పేద పిల్లల విద్యపై ఈనాడు ఏడుపు..
-
జగనన్న పాలనలో మా పాఠశాల ప్రైవేట్ స్కూలును మించి ఉంది
-
60 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు: మంత్రి బొత్స
సాక్షి, కృష్ణా: "ఎండల కారణంగా వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లతో బోధన ఉంటుంది, 6వ తరగతి నుంచి పైస్థాయి వరకు ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం, విద్యా బోధనపై టీచర్లకు ఆన్లైన్, ఆఫ్ లైన్లో శిక్షణ ఇస్తాం", అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల కారణంగా సీఎం ఆదేశానుసారం వారం పాటు ఒంటిపూట బడులు పొడిగించామని తెలిపారు. అంతేకాకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేశామన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైయ్యామని వారి సహకారంతో విద్యా వ్యవస్థని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. 1.75 లక్షల మంది ఉపాద్యాయులలో 82 వేల మంది బదిలీకి ధరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో 52 వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని తెలిపారు. సీనియర్ హెడ్ మాస్టర్లని సెకండ్ ఎంఈఓలగా నియమించామని.. కొత్తగా 679 మంది సెకండ్ ఎంఈఓ పోస్టులని భర్తీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 355 ఎంఈఓ వన్ పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని కూడా సీనియర్ హెడ్ మాస్టర్లతో భర్తీ చేయిస్తామని పేర్కొన్నారు. నాడు–నేడు పనులు జరుగుతున్న స్కూళ్లకు వాచ్మెన్ పోస్టులు ఇచ్చామని చెప్పారు. కంప్యూటర్ పోస్టుల ఫైల్ కూడా మూవ్ అవుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లతో బోధన విధానాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి సబ్జెట్కు టీచర్ ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. అంతేకాకుండా ఇంటరాక్ట్ ఫ్యానల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఎంపిక చేశామన్నారు. ఇద్దరు, ముగ్గురు ప్రొఫెసర్లను మాస్టర్ ట్రైనింగ్ కూడా ఇప్పించామన్నారు. వారి ద్వారా టీచర్లకు ఆఫ్ లైన్, ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తామన్నారు. డిసెంబర్ 21వ తేదీ నాటికి ఆరో తరగతి పైనున్న అన్ని క్లాస్లకు ఇంటరాక్ట్ ఫ్యానల్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. 60 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు సుమారు 60 వేల క్లాస్ రూమ్స్లో ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూళ్లకు ఒక్కో స్కూల్కు ఒక్కో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 10 టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. మిగతా స్కూళ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులతో సమావేశమై ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. చదవండి: స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే.. -
AP: ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించాను
-
వస్తున్నారు టాపర్లు! మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి నాలుగేళ్లలోఎంత తేడా! నాడు విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నేడు ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్కు పెట్టుబడి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు. ఆ తర్వాత కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్గా అప్గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. -
ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్ మన్లు..
-
చంద్రబాబు హయాంలో 5 వేల స్కూళ్లు మూసేశారు : బొత్స
-
చతికిల‘బడి’.. కూలిపోయే పైకప్పులు.. వేలాడే విద్యుత్ తీగలు!
సాక్షి, హైదరాబాద్: కూలిపోయేలా ఉన్న పై కప్పులు.. రాలిపోతున్న గోడల పైపెచ్చులు.. వేలాడుతున్న కరెంట్ తీగలు.. విరిగిపోతున్న బల్లలు, కుర్చీలు.. కొత్త గదుల నిర్మాణం దేవుడెరుగు, ఉన్న భవనాలు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. వంటగదుల సంగంతి చెప్పనక్కర్లేదు. వానొస్తే బురద.. గాలొస్తే తంటా. పేద, మధ్యతరగతి పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కన్పిస్తున్న దృశ్యాలు. ఈ దుస్థితిని మార్చేస్తామని, కార్పొరేట్కు ధీటుగా సర్కార్ బడిని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెప్పింది. 12 రకాల పనులతో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమంది. ఈ కార్యక్రమానికి ‘మన ఊరు–మనబడి’ అనే పేరు పెట్టింది. దశలవారీగా అమలు చేసే ఈ కార్యక్రమంలో తొలిదశను ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. కొన్నిచోట్ల పనులు అసలు ప్రారంభమే కాలేదు. పనులు మొదలైన చోట్లా సవాలక్ష అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. మోకాలెత్తు పునాదులు.. మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. నిధుల ప్రకటనలతోనే సరి.. మన ఊరు– మనబడి కార్యక్రమాన్ని 2021 మార్చి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ళల్లో రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్టు తెలిపింది. కానీ 2021–22లో నిధులు కేటాయించలేదు. 2022 మార్చి బడ్జెట్లో రూ.7,289 కోట్లు మూడు విడతలుగా పాఠశాలల్లో మౌలిక వసతులకు కేటాయిస్తామని ప్రకటించింది. అదే నెలలో సీఎం కేసీఆర్ వనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూళ్ళు తెరిచే నాటికే పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. కానీ స్కూళ్ళకు మళ్ళీ సెలవులొస్తున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. తొలిదశ స్కూళ్లకే.. రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ స్కూళ్ళల్లో తొలివిడతగా ఈ సంవత్సరం 9,123 స్కూళ్ళను ఈ పథకం కింద ఎంపిక చేశారు. తొలి దశలో చేపట్టే పనులను రూ.3,497 కోట్లతో పూర్తి చేయాలని భావించారు. నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు, రంగులు వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్ బోర్డులు, ప్రహరీ గోడలు కట్టడం, వంటగది ఏర్పాటు, మరమ్మతులు, శిధిల భవనాల స్థానంలో కొత్త గదుల నిర్మాణం, డిజిటల్ సౌకర్యాల వంటి 12 రకాల పనులు ఈ నిధులతో చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ పూర్తిస్థాయిలో ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇప్పటివరకు 8,833 బడులకు పరిపాలన అనుమతులు రాగా 7,211 బడుల్లో పనులు మొదలయ్యాయి. ఇప్పటివరకు 1,200 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. ముందుకురాని కాంట్రాక్టర్లు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొన్ని స్కూళ్లకైనా మరమ్మతులు చేసి, మెరుగ్గా చూపించాలని ప్రభుత్వం ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో భావించింది. ఈ దిశగా వివిధ శాఖల అధికారులతో విద్యాశాఖ మంత్రి సమీక్ష జరిపారు. కానీ ప్రతిచోట ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. రూ.30 లక్షల లోపు పనులన్నీ స్థానిక విద్యా కమిటీ నేతృత్వంలో చేయించే అవకాశం ఉంది. అంతకు మించితే టెండర్లు పిలవాలి. ఇలాంటి పనులు 2 వేల వరకు ఉన్నాయి. విద్యా కమిటీ నేతృత్వంలో ఎక్కువగా చిన్నా చితక పనులే చేపడుతున్నారు. కరెంట్ వైర్లు సరి చేయడం, గోడలకు రంగులేయడం, పెచ్చులూడితే ప్లాస్టింగ్ చేయడం వంటివే ఉంటున్నాయి. నిర్మాణాలు, శౌచాలయాల (మరుగుదొడ్లు) ఏర్పాటు వంటి పనులు ఎక్కడా మొదలవ్వలేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు మొదలైనా నిధులు అందక ఆగిపోతున్నాయి. దీంతో చాలాచోట్ల టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల నాలుగు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించ లేదు. సకాలంలో బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేదంటూ వాళ్ళు వెనక్కు తగ్గుతున్నారు. ఎక్కడైనా ఇదే పరిస్థితి... ►ఆదిలాబాద్ జిల్లా మావల–1 మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మాణానికి మన ఊరు–మన బడి పథకం కింద టెండర్లు పిలిచారు. కానీ ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. మావల–2 మండల కేంద్రంలోని మరో ప్రైమరీ స్కూల్ నిర్మాణం పనులు మొదలైనా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పని ఆపేశాడు. బజార్ హత్నూర్ మండలం కోల్హారిలో రూ.12 లక్షలతో ప్రతిపాదించిన స్కూల్ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తవ్వలేదు. ►హనుమకొండ సుబేదారిలోని హైస్కూల్లో తరగతి గదుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్ పనుల మాత్రమే మొదలు పెట్టారు. పగిలిపోయిన ఫ్లోరింగ్ గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రమాదకరంగా మారిందని మన ఊరు–మనబడి సమీక్షల్లో చెప్పినా స్పందన కరువైందని స్థానికులు తెలిపారు. సుబేదారి ప్రైమరీ స్కూల్లో శౌచాలయాల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ►మంచిర్యాల జిల్లా జన్నారంలో పనులు నత్త నడకను తలపిస్తున్నాయి. పొన్నెకల్ ప్రాథమిక స్కూల్ భవన నిర్మాణం పిల్లర్ల దశలో ఉంది. ధర్మారంలోని స్కూల్ బిల్డింగ్ ఇంకా రూఫ్ లెవల్లోనే ఉంది. కలమడుగు గ్రామంలోని స్కూల్లో శౌచాలయాల నిర్మాణం పునాదుల దశలోనే పురిటినొప్పులు పడుతోంది. ►నిర్మల్ జిల్లా కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చోవాల్సిన పరిస్థితి. అదే గదిలో విద్యార్థులకు వంట చేయడం జరుగుతోంది. పాడుబడ్డ మరుగుదొడ్ల కారణంగా ఆరుబయలే దిక్కవుతోంది. ►జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నత పాఠశాల గదులన్నీ శిథిలావస్థకు చేరాయి. గదుల నిర్మాణం కోసం ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. -
21 న పిల్లలకు సీఎం జగన్ బర్త్ డే గిఫ్ట్
-
ఏపీ సర్కారీ స్కూళ్లలోనూ సీబీఎస్ఈ.. 1000 పాఠశాలలు ఇవే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రవేశానికి అడుగులు ముందుకు పడ్డాయి. మొదటి దశలో 1,000 ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ బోర్డు అనుమతులిచ్చింది. దీంతో ఈ స్కూళ్లన్నిటిలో రాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతి విద్యార్థులంతా సీబీఎస్ఈ విధానంలో చదువుతారు. అత్యున్నత మూల్యాంకన, బోధనా విధానాలున్న సీబీఎస్ఈ విధానాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లన్నిటిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాల పిల్లలే. వీరంతా ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. అన్ని రాష్ట్రాలకన్నా ముందుగా ఫౌండేషనల్ విద్యావిధానానికి బాటలు వేసింది. మరోవైపు సీబీఎస్ఈ విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తే విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు అందుకోగలుగుతారని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పాఠశాలలను ముందుగా గుర్తించింది. మొదటి దశలో మొత్తం 1,308 ప్రభుత్వ స్కూళ్లకు అనుమతుల కోసం సీబీఎస్ఈ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఈ స్కూళ్లలో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వీటిలో జిల్లా పరిషత్ స్కూళ్లు 417, మునిసిపల్ స్కూళ్లు 71, ఏపీ గురుకుల విద్యా సంస్థలు 39, ఏపీ మోడల్ స్కూళ్లు 164, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 352, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు 179, బీసీ గురుకుల సంక్షేమ విద్యా సంస్థలు 26, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు 45, ఆశ్రమ్ స్కూళ్లు 15 ఉన్నాయి. వీటికి సీబీఎస్ఈ అనుమతుల కోసం రూ.5.88 కోట్లను విద్యా శాఖ సీబీఎస్ఈ బోర్డుకు చెల్లించింది. గుర్తింపునకు అవసరమైన పత్రాలను కూడా ఆన్లైన్లో సమర్పించింది. ఈ స్కూళ్లలో 1,229 స్కూళ్లకు అఫ్లియేషన్ నంబర్ వచ్చినా చివరకు 1,000 ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ బోర్డు అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ స్కూళ్లల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను కూడా పంపిణీ చేసింది. వీటిని తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లో ఉండేలా మిర్రర్ ఇమేజ్లు రూపొందించి అందించింది. మిగతా స్కూళ్లకు చర్యలు వేగవంతం.. కాగా రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ స్కూళ్లలోనూ సీబీఎస్ఈ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, పాఠశాల విద్య కమిషనర్ సురేష్కుమార్ తదితరులు చర్యలు వేగవంతం చేశారు. శుక్రవారం సీబీఎస్ఈ బోర్డు అధికారులతో వెబ్ఎక్స్ సమావేశంలో వీటిపై చర్చించారు. సీబీఎస్ఈ విధానానికి అనుగుణంగా సిద్ధం చేసేందుకు ఇప్పటికే రాష్ట్రంలో 83,466 మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. సీబీఎస్ఈ విధానంతో విద్యార్థులకు ప్రయోజనాలు ఇవే.. సీబీఎస్ఈ విధానం అమలుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. – సీబీఎస్ఈ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ. అత్యున్నత విద్యా విధానాలు అమలు చేస్తున్న సీబీఎస్ఈకి అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. – ఈ విద్యా విధానంలో చదివిన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మంచి గుర్తింపు లభిస్తోంది. – దేశంలో ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఎయిమ్స్, జిప్మర్, సీఎంసీ వంటి సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ, నీట్ వంటివి సీబీఎస్ఈ సిలబస్తోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల దశ నుంచే సీబీఎస్ఈ విధానంలో చదివినవారు జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకులు కొల్లగొడుతున్నారు. – సీబీఎస్ఈ విధానం విద్యార్థుల్లో బలమైన పునాదులు వేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో విద్యార్థి తన ఆసక్తిని అనుసరించి చదువులు కొనసాగించే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంటున్నారు. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉండదని వివరిస్తున్నారు. – దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థులు ఏ రాష్ట్రానికి వెళ్లినా ఇబ్బంది లేకుండా చదువులు కొనసాగించవచ్చు. – సీబీఎస్ఈ విద్యావిషయక అంశాల్లోనే కాకుండా విద్యార్థి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా సమస్యను తనంతట తాను పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే విద్యార్థులు తమంతట తాముగా చదువుకోగలిగే నైపుణ్యాలను కూడా అందిస్తుందని పేర్కొంటున్నారు. జిల్లా సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల సంఖ్య శ్రీకాకుళం 64 విజయనగరం 64 పార్వతీపురం మన్యం 40 విశాఖపట్నం 19 అనకాపల్లి 41 అల్లూరి సీతారామరాజు 35 కాకినాడ 33 కోనసీమ 12 తూర్పు గోదావరి 15 పశ్చిమ గోదావరి 16 ఏలూరు 34 కృష్ణా 9 ఎన్టీఆర్ 27 గుంటూరు 11 బాపట్ల 21 పల్నాడు 66 ప్రకాశం 63 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 40 చిత్తూరు 22 తిరుపతి 30 వైఎస్సార్ 30 అన్నమయ్య 49 కర్నూలు 90 నంద్యాల 69 అనంతపురం 51 శ్రీసత్యసాయి 49. -
బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ.. మనీశ్ సిసోడియా ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని మండిపడ్డారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు కొన్ని ప్రైవేటు స్కూళ్ల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. బీజేపీ దేశంలో నిరక్షరాస్యతనే కోరుకుంటోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి సంబంధించి ఓ నివేదికపై చర్యలు తీసుకునేందుకు రెండేళ్లకుపైగా ఆలస్యం ఎందుకు చేశారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. చీఫ్ సెక్రెటరీని వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సిసోడియా. తనపై తప్పుడు అభియోగాలు మోపిన ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిశాక ప్రభుత్వ పాఠశాల వ్యవహారాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. 'వాళ్లు నాలుగేళ్ల క్రితం ఢిల్లీ సీఎం కార్యాలయం, నా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 40 మంది ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పుడు ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐని నా ఇంటికి పంపారు. కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు. దీంతో ఈసారి కొత్తగా ప్రయతిస్తున్నారు. మేం నిర్మించిన స్కూళ్లపై పడ్డారు.' అని సిసోడియా బీజేపీపై ధ్వజమెత్తారు. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్లో ఎవరికీ లేదు -
AP: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్ ఇంగ్లిష్’ క్లాసులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడేలా విద్యాశాఖ మరో ముందడుగు వేసింది. 26 జిల్లాల్లో తొలి దశలో భాగంగా జిల్లాకు 5 హైస్కూళ్లను ఎంపిక చేసి ప్రత్యేక ‘స్పోకెన్ ఇంగ్లిష్’ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. దశల వారీగా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయనుంది. సాధారణ తరగతులతో పాటే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ‘స్పోకెన్ ఇంగ్లిష్’ నేర్పిస్తారు. బెండపూడి.. నిడమానూరులో సక్సెస్ తూర్పుగోదావరి జిల్లాలోని బెండపూడి, గన్నవరం సమీపంలోని నిడమానూరు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇచ్చిన స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణతో అద్భుత ఫలితాలొచ్చాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు బోధించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. (క్లిక్: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?) -
ఏది నిజం?: తడబాటు కాదు... అధికారపు ఎడబాటు
ఒక వ్యవస్థను చక్కదిద్దాలంటే ఒక్క రోజులో సాధ్యమా? పునాదుల నుంచే చెదలు పట్టేసి... నారాయణలు, చైతన్యలు ఆక్రమించేసి... ప్రభుత్వ స్కూళ్లంటేనే భయపడుతూ... చచ్చో చెడో నిరుపేదలు సైతం ప్రయివేటు స్కూళ్లకే పిల్లలను పంపిస్తున్న వ్యవస్థ ఇది. అలాంటి వ్యవస్థను మార్చడానికి నిబద్ధతతో అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ అడుగుల్ని సైతం సరిగా పడనీయకుండా సవాలక్ష అడ్డంకులు. రాష్ట్రంలో సర్కారీ విద్యను సర్వనాశనం చేసేసిన చంద్రబాబు నాయుడు... ఆ బాబుతోనే తమ మనుగడ అని భావించే ముగ్గురు మీడియాధిపతులు!!. రాష్ట్రం సర్వనాశనమైపోయినా సరే... తామే ఏలాలనుకునే ఈ చతుష్టయం ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాష్ట్రంలో విద్యారంగంలో జరుగుతున్న మేలుకు ప్రజలంతా ఆకర్షితులవుతున్నా... వీళ్లు మాత్రం లేనిపోని రాతలతో విషం కక్కడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘తడబడిన విలీనం’ అంటూ సోమవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం ఇలాంటిదే. అసలిందులో నిజం ఏ కోశానైనా ఉందా? అంగన్వాడీల నుంచి మొదలుపెడితే చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థను చూసినంత హీనంగా ఏ వ్యవస్థనూ చూడలేదనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన దృష్టంతా కార్పొరేట్ స్కూళ్లపైనే. ఏకంగా కార్పొరేట్ డాన్ నారాయణను తెచ్చి కేబినెట్లోనే పెట్టుకున్న చరిత్ర బాబుది. అంగన్వాడీల్లో ప్రత్యేక కిచెన్ గానీ, ప్లేగ్రౌండ్ గానీ ఉండేవి కాదు. సిబ్బందే సరిగా లేని దుస్థితి. ఇక 1 నుంచి 5 వరకు నడిచే స్కూళ్లకు ఒకరిద్దరు ఎస్జీటీలే దిక్కు. విద్యార్థులకు సదుపాయాలు దేవుడెరుగు. తరగతి గదులూ కొరతే. 18 సబ్జెక్టుల్ని ఆ ఒకరిద్దరు టీచర్లే బోధించేవారు. అప్పర్ ప్రయిమరీ స్కూళ్లు, హైస్కూళ్లదీ అదే గతి. అనేక యాజమాన్యాల పరిధిలో ఉండటంతో హై స్కూళ్ల నడుమ సంబంధాలూ ఉండేవి కాదు. ఈ చదువుల దెబ్బకు పిల్లలు తమ తరగతి పుస్తకాల సంగతి అటుంచి... కింది తరగతుల పుస్తకాలనూ చదవలేని దుస్థితికి జారిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే నేషనల్ అకడమిక్ సర్వే (న్యాస్), ప్రథమ్ సంస్థ చేసిన ‘అసర్’ సర్వే... అన్నీ తేల్చింది ఇదే. విచిత్రమేంటంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా... మేకప్ వేసి, తమ కార్పొరేట్ స్కూళ్ల కడుపు నింపడానికే ప్రయత్నించారు చంద్రబాబు. కార్పొరేట్ కాలేజీల్లోకి విద్యార్దుల చేరికలను పెంచడానికి టార్గెట్లు పెట్టి... కాపీయింగ్ను ప్రోత్సహించి మరీ టెన్త్లో కృత్రిమ ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ కాలేజీల్లో చేరి... ఆ తరవాత సరైన నైపుణ్యాలు లేక... జీవితాలనే కోల్పోయిన ఎంతో మంది ... బాబు బ్రెయిన్ చైల్డ్లే!. కాకపోతే ఇంతటి ఘోరమైన పరిస్థితుల్ని ‘ఈనాడు’ ఏనాడూ ప్రశ్నించలేదు. రామోజీ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇపుడు మాత్రం పునాదుల నుంచి జరుగుతున్న మార్పును తట్టుకోలేకపోతుండటమే అన్నిటికన్నా దారుణం. మొత్తం వ్యవస్థకే చికిత్స...! ఇదేదో ఒక రోడ్డో, ఒక వంతెన సమస్యో కాదు. విద్యా వ్యవస్థ. పునాదుల నుంచీ కుళ్లిపోయింది. అందుకే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కాయకల్ప చికిత్స మొదలెట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చూపించనంత శ్రద్ధతో నెలకు రెండు సార్లు సమీక్షిస్తూ... ఫౌండేషన్ విద్య నుంచే శ్రీకారం చుట్టారు. దాదాపు 56వేల స్కూళ్లను ‘నాడు–నేడు’ పథకంతో సమూలంగా మార్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 15,715 స్కూళ్లను సమగ్ర మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. మిగిలిన స్కూళ్లలోనూ 2వ, 3వ విడతల్లో ఈ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ మూడేళ్లలో 70కి పైగా సమీక్షలు విద్యారంగంపైనే నిర్వహించారంటే సీఎం చిత్తశుద్ధి చెప్పకనే తెలుస్తుంది. మంచిని ఏమాత్రం గుర్తించని చతుష్టయం... నిజానికి పాఠశాల విద్యలో కనీవినీ ఎరుగని సంస్కరణలు మొదలయ్యాయి. దీనికి పొరుగు రాష్ట్రాలే కాదు... కేంద్ర సంస్థలూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. కానీ చంద్రబాబుతో కూడిన చతుష్టయం... తమ రాతల్లో ఏనాడూ ఒక్క మంచి పనిని ప్రస్తావిస్తే ఒట్టు. దేనిపైనయినా బురద చల్లటమే. నాడు–నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చటంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని జగనన్న గోరుముద్దగా అందిస్తూ... పిల్లల్ని స్కూళ్లకు పంపించే తల్లులకు బాసటగా ‘అమ్మ ఒడి’ పేరిట నగదు జమచేస్తున్న ప్రభుత్వం... జగనన్న విద్యాకానుకగా పుస్తకాలు, యూనిఫామ్, షూస్, డిక్షనరీ తదితర వస్తువుల్ని స్కూళ్లు మొదలుకాకముందే ఉచితంగా అందిస్తోంది. గతంలో స్కూళ్లు ఆరంభమై 6 నెలలు గడిచినా పుస్తకాలే చూడని విద్యార్థులకు ఆరంభం కాకముందే అన్నీ ఉచితంగా అందించటమనేది ఈ దుష్ట చతుష్టయానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. తమ పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదవాలన్న ఉద్దేశంతో చివరికి కోర్టులకు కూడా వెళ్లి ఆంగ్ల విద్యను రకరకాల మార్గాల్లో వ్యతిరేకించిన తీరు వీళ్లది.. రెండు భాషల్లో ప్రచురించిన పుస్తకాలు... ఏకంగా ఎన్సీఈఆర్టీ ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఇక పెద్దపెద్ద కార్పొరేట్ స్కూళ్లకే సాధ్యమైన ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ ఆన్లైన్ పాఠాలను రాష్ట్ర సర్కారీ స్కూళ్ల 8వ తరగతి విద్యార్థుల ట్యాబ్లెట్లలోకి తెచ్చిన ఘనత కూడా సీఎం జగన్దే. దశల వారీగా అన్ని ప్రభుత్వ స్కూళ్లనూ సీబీఎస్ఈకి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) అనుసంధానిస్తున్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధతో... విద్యార్థులకిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను స్వయంగా చూస్తున్నారు సీఎం. గోరుముద్దను ఆయనే రుచిచూస్తున్నారు. పిల్లల పొట్టలు నిండితేనే అక్షరాలు బుర్రకెక్కుతాయని గట్టిగా విశ్వసిస్తూ రుచికరమైన మెనూను తనే రూపొందిస్తున్నారు. ఇదిగో... వీటన్నిటి ఫలితమే... పొరుగు రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలల్లో పిల్లలు తగ్గి... ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయి. సాక్షాత్తూ కేంద్రమే పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిక్కూడా పచ్చ రంగు పులుముతూ... ప్రజల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి కనక ప్రయివేటు స్కూళ్లు వదిలి ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్నారని వక్రభాష్యాలు చెబుతున్న చరిత్ర రామోజీరావుది. ఏం! పక్క రాష్ట్రాల్లో కరోనా రాలేదా? అక్కడ జనం ఆర్థిక పరిస్థితులు దెబ్బతినలేదా? వాళ్లెందుకు ప్రభుత్వ స్కూళ్లలోకి మారలేదు? ప్రయివేటు స్కూళ్లలో అడ్మిషన్లెందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ సర్కారీ స్కూళ్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నందుకే కదా... జనం వాటికి మారుతున్నారు? ఆ మాత్రం తెలుసుకోలేరా రామోజీరావు గారూ..? అసలు 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను తేవాలన్న ఆలోచన మీకు గానీ, మీ బాబుకు గానీ ఏనాడైనా వచ్చిందా? ఇలాంటి ప్రయత్నాల్ని అభినందించటం మీకిష్టం లేకపోతే కనీసం వ్యతిరేకించకుండా అయినా ఉండాలి కదా? మీరొక పత్రికాధిపతి అని, మీ పత్రికను చదివేది తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే కాదని ఇంకెప్పుడు తెలుసుకుంటారు? మీ పాఠకులను గౌరవించటం ఎప్పుడు నేర్చుకుంటారు? ఇదీ... స్కూళ్ల మ్యాపింగ్ తీరు ► వీలున్న చోట అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలకు అనుసంధానించి వారికి స్కూలు వాతావరణాన్ని అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ► 8 ఏళ్లలోపు పిల్లల్లోనే బ్రెయిన్ అభివృద్ధి ఎక్కువ కనక... ప్రాథమిక పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాల్ని అనుసంధానించి ఫౌండేషన్ స్కూళ్లుగా మారుస్తున్నారు. ► తరగతులను ఇతర స్కూళ్లకు అనుసంధానం చేసేటప్పుడు విద్యార్ధులకు ఇబ్బందిలేకుండా ఉండేలా 250 మీటర్ల నుంచి 1 కి.మీ. పరిధిలో ఉండే వాటిని మాత్రమే విలీనం చేసేలా విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. నెలల తరబడి కసరత్తు.. క్షేత్రస్థాయి పరిశీలన చేశాకే చర్యలు చేపట్టారు. – దశల వారీగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో.. 820 వరకు స్కూళ్లకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి రాగా... వాటిపై జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి... వాటికి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు పట్టవు. విలీనంపై గాలి వార్తలు రాయటం ద్వారా తల్లిదండ్రుల్లో లేనిపోని అనుమానాలు సృష్టించి... ఏదో ఒకరకంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది ఆయన దింపుడుకళ్లం ఆశ. మిగిలిన స్కూళ్లు సైతం... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీహైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూళ్లు ప్లస్గా వర్గీకరించి... అన్నిటా విద్యార్ధులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అవసరమైన చోట నాడునేడు రెండో విడతలో ప్రత్యేకంగా అదనపు తరగతి గదుల నిర్మాణాన్నీ చేపట్టారు. కాకపోతే ఈ నిర్మాణాలన్నీ ఒక్కరాత్రిలో పూర్తయ్యేవి కావు. వేల కోట్ల నిధులతో పాటు పక్కా ప్రణాళిక, పర్యవేక్షణ అవసరం. వేగంగా అడుగులేస్తూ ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళుతున్న జగన్ ప్రభుత్వానికి... అసలు ఈ దిశగా జీవితంలో ఎన్నడూ ఆలోచించని చతుష్టయం నుంచి వ్యతిరేకత రావటమే ఘోరాతిఘోరం. ► ఇక మ్యాపింగ్ పూర్తయిన స్కూళ్లలోని విద్యార్ధులకు సబ్జెక్టు టీచర్ల ద్వారా బోధనకు వీలుగా అదనపు స్కూల్ అసిస్టెంటు టీచర్లను విద్యాశాఖ ఏర్పాటు చేయిస్తోంది. ఇందుకోసం 8,233 మంది ఎస్జీటీ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడానికి ఏర్పాట్లు చేసింది. కొన్ని చోట్ల పలు పోస్టులను స్కూల్ అసిస్టెంటు స్థాయికి అప్గ్రేడ్ చేపట్టింది. ఆ ఫోటోల వెనక ఎన్నో అర్థసత్యాలు... సోమవారంనాడు ప్రచురించిన ఫోటోల్లో ‘ఈనాడు’ చెప్పని నిజాలివీ... ► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పంచాయతీ పెద్దపేట స్కూల్కు వెళ్లాలంటే 35 ఎకరాల చెరువు దాటి వెళ్లాల్సి వస్తోందనేది ‘ఈనాడు’ కథనం సారాంశం. స్కూలు వెనుక భాగాన చెరువు ఉంది. దాన్ని దాటే పనిలేదు. ఆ స్కూలుకు రెండు వైపులా రోడ్లున్నాయి. కేవలం అరకిలోమీటర్ పరిధిలోని స్కూలులోని పిల్లలను ఈ స్కూలుకు మ్యాపింగ్ చేయడంతో తల్లిదండ్రులు కూడా దీన్ని ఆహ్వానించారు. ► ఏలూరు జిల్లా ఉంగుటూరులోని మ్యాపింగ్ అయిన స్కూల్లో విద్యార్దులకు సరిపడే ఫర్నీచరు వేసి విద్యార్థులు ఉపాధ్యాయులు కూర్చోబెట్టారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నాడు– నేడు పనులు చేస్తున్న కారణంగా రెండు రోజులుగా గదులు సర్దుబాటు చేసున్నారు. తాత్కాలికంగా కూర్చోబెట్టిన ఫోటోను తీసి... శాశ్వతంగా వసతులు లేవన్నట్లు రాయటమే ‘ఈనాడు’ పైత్యానికి పరాకాష్ట. ► రాచూరు హైస్కూల్లో 3,4,5 తరగతుల విధ్యార్దులను కలిపి కూర్చొబెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా అబద్ధమే. నాడు నేడు పనులు జరుగుతున్న కారణంగా తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేశారు తప్ప గదులుపూర్తవ్వగానే ఆయా గదుల్లోకి తరగతులను మారుస్తారు. ఇక్కడ ఒక్కోగదికి 12 లక్షలు చొప్పన రెండు అదనపు గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది. -
Ongole: ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు ఫుల్ డిమాండ్!
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిన నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు మించి సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు జగనన్న విద్యా కానుక కిట్లు, మధ్యాహ్న భోజనం, తదితర కార్యక్రమాల అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. గతంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారు కాదు. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులే ప్రభుత్వ పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల మొదటి వారంలో పాఠశాలలు తెరవగా, రెండు వారాలు గడవకముందే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రస్తుతం పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు క్లోజవడంతో వెనుదిరుగుతున్నారు. క్లిక్: మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు