govt schools
-
సుద్ద పూస.. పరమ పవిత్రుడు.. ఇంగితం ఉందా బాబు ?
-
ఇంగ్లిష్ మాకే..! పేదవాళ్లు పేదవాళ్లలా ఉండండి
-
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు (Sankranti holidays) ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024–25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఆలిండియా సైనిక్ స్కూల్ (Sanik School) ప్రవేశ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు జనవరి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతిలో ప్రవేశానికి మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి పాస్ అయి, 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారు 9వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://exams.nta.ac.in/AISSEE/చూడొచ్చు.స్టీల్ప్లాంట్లో అప్రెంటీస్కు దరఖాస్తుల ఆహ్వానంవిశాఖపట్నం స్టీల్ప్లాంట్లో (Vizag Steelplant) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (గాట్), టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ (టాట్)కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గాట్కు రూ.9 వేలు, టాట్కు రూ.8 వేలు స్టైఫండ్ చెల్లించనున్నారు. 2022 తర్వాత గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులు నాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. గూగుల్ ఫారం నింపేందుకు జనవరి 9 వరకు గడువు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.చదవండి: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశంచైల్డ్ కేర్ లీవ్ షరతులతో ఇబ్బందులున్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి డిమాండ్సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్లను 10 విడతల్లోనే వినియోగించుకోవాలన్న షరతుతో వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ షరతును రద్దు చేసి ఉద్యోగినులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ డిమాండ్ చేశారు. షరతులతో సెలవు లక్ష్యం దుర్వినియోగమవుతోందన్నారు. అవసరం మేరకు మాత్రమే సెలవు ఉపయోగించుకునేలా, అపరిమిత విడతలతో చైల్డ్ కేర్ లీవ్ పొందేలా 199,36 జీవోలను సవరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం
-
సమీకృత గురుకు భవనాలకు నేడు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/కొందుర్గు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ భవనాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గులో సమీకృత గురుకుల పాఠశాల భవన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు.అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం సచివాలయం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొందుర్గులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారని సీఎస్ చెప్పారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించారు.ఇప్పటికే సంబంధిత అధికారులు శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని పరిశీలించినట్లు కలెక్టర్లు సీఎస్కు వివరించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన నిర్వహిస్తున్నామని, రెండో దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్ చెప్పారు.మొదటి విడత కింద ఎంపిక చేసినవి..కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలున్నాయి.కొందుర్గులో సీఎం సభరంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో రూ.125 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడ నున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని 109 సర్వే నంబర్లో 20 ఎకరాలను కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు. -
సర్కార్ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాల విద్యకి ఎసరు
-
విద్యార్థుల కష్టాలు.. అన్నం తినలేకపోతున్నాం..
-
విద్యార్థుల కష్టాలు.. అన్నం తినలేకపోతున్నాం..
-
విద్యార్థుల కష్టాలు.. అన్నం తినలేకపోతున్నాం..
-
టీడీపీ కోట్లు స్కీం.. చంద్రన్న పాచి ముద్ద..
-
పేద విద్యార్థులకు సారీ.. ఉచిత వైద్యం హరీ
-
టీచర్లకు పాలాభిషేకం
-
తండ్రి లాంటి గురువు కోసం తల్లడిల్లిన పిల్లలు
-
10 రోజులుగా పేదపిల్లల కడుపు కాలుస్తున్నారు.. ఇలాగే దేవాన్ష్ కడుపు కాల్చి చూడండి
-
పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది. దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి.కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్తో కూడిన విద్యా కానుక కిట్లు అందజేసింది. ఇలా వరుసగా నాలుగేళ్లు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం కానుంది. పుస్తకాలు మండల కేంద్రాలకు చేరినా నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు సగం మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కిట్లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతులకు నోట్బుక్స్ ఉన్నాయి. మొదటి సెమిస్టర్కు 3.12 కోట్ల పుస్తకాలు ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. కాగా, మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు దాదాపు మండల స్టాక్ పాయింట్లకు చేరాయి. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది. అలాగే, 3–10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు.పదో తరగతి సాంఘికశా్రస్తాన్ని సీబీఎస్ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచి్చంది. ఈ బోధనకు అనుగుణంగా మొత్తం 4.30 లక్షల పుస్తకాలు సైతం ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇంగ్లీష్ పదిలం..ఏపీలో ఇంగ్లీష్ మీడియంకు పెరిగిన విద్యార్థులు
-
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలపై ఐబీ సంస్థ ప్రతినిధుల ప్రశంసలు
-
మా బడి బ్రహ్మాండం
-
టోఫెల్ శిక్షణతో సత్ఫలితాలు..ఎల్లో మీడియా వక్రరాతలు
-
కార్పొరేట్ స్కూలుకు ధీటుగా విశాఖ మధురానగర్ ప్రభుత్వ పాఠశాల
-
పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్
-
విద్యా విప్లవం: బైజూస్ కంటెంట్ ఎంతో బాగుందంటున్న విద్యార్థులు
-
విజయవాడలో ఫ్యూచర్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం
-
గతంలో స్కూల్స్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థిని
-
ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, మార్పులు