H1B Visa
-
ట్రంప్ సంచలన నిర్ణయం.. హెచ్-1బీ వీసాలో మార్పులు
వాషింగ్టన్: అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా హెచ్-1బీ వీసా అమలులో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పాత దరఖాస్తులను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే(ఫ్లాగ్) డిలీజ్ చేస్తోంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం మరో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారి విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు దేశాల వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ సైతం విధించారు. ఇక, తాజాగా అమెరికా హెచ్1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది.ఇందులో భాగంగానే అమెరికా హెచ్-1బీ వీసా అమలులో మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే పాత దరఖాస్తులను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే(ఫ్లాగ్) డిలీట్ చేస్తోంది. త్వరలోనే వీసాల జారీ కోసం యూఎస్ ఇమిగ్రేషన్ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కారు వెల్లడించింది. అందుకే, పాత రికార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం కొత్త వ్యవస్థను యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రవేశపెట్టనుంది.తాజా ఆదేశాల ప్రకారం.. మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. అంటే.. ఉదాహరణకు ఓ దరఖాస్తుకు సంబంధించిన 2020 మార్చి 22న తుది నిర్ణయం వెలువడి ఉంటే.. ఈ ఏడాది మార్చి 22న దాని రికార్డులను తొలగిస్తారు. హెచ్-1బీ సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అఫ్లికేషన్లపై ఈ తొలగింపు ప్రభావం పడనుందని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది.ఇక, ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే(ఫ్లాగ్) అనేది అమెరికాలో కార్మికులకు సహాయపడే పోర్టల్. ఇదిలా అమెరికా, విదేశీ కార్మికులకు రక్షణ కల్పిస్తుంది. ఈ పోర్టల్లో H-1B, H-1B1, H-2A, H-2B, E-3 వీసాలు, శాశ్వత కార్మిక ధృవీకరణ దరఖాస్తులు సేవ్ చేసి ఉంటాయి. ఇక, ట్రంప్ నిర్ణయంతో గత ఐదేళ్లకు ముందుగా సేవ్ చేయబడిన దరఖాస్తులను ఈరోజు రాత్రి నుంచి తొలగించనున్నట్టు కార్మిక శాఖ ఉపాధి మరియు శిక్షణ పరిపాలన, విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం (OFLC) తెలిపింది. ఉద్యోగులకు సంబంధించి ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంది.H-1B Chaos: America’s Visa Purge BeginsThe U.S. Department of Labor is wiping H-1B visa applications from its system, a bombshell for global tech talent. It’s a policy shift that screams isolationism—thousands of skilled workers now face uncertainty. Advocates say it’s about… pic.twitter.com/pBy8YJROrL— Brain Snacks-Learn with laughter!!! (@NgChinSiang2) March 19, 2025 -
హెచ్ 1 బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు
-
ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసాలు (H1B visas) ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారయ్యింది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్1బీ వీసాలు పొందడంలో మల్టీ నేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి హెచ్1బీ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతాయన్న అంచనాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది.కంపెనీలపై తీవ్ర ప్రభావంప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్నవారిలో 20 శాతంకు మించి హెచ్1బీ వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్భంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకు వస్తున్నాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది.ఇతర వీసాల జారీ సులభంహెచ్1బీ వీసాకంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకులు కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతానికి ఇమిగ్రేషన్ అధికారుల ఆమోదముద్ర పడింది. అమెరికాలో హెచ్1బీ వీసాలు కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలపైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతీ భారతీయుడు హెచ్1బీ వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండికొట్టిందని ఎంఎన్సీ కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
హెచ్-1బీ వీసాదారులకు అలర్ట్!
వాషింగ్టన్ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 7 నుంచి ప్రారంభమై మార్చి 24న ముగియనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం అధికారికంగా ప్రకటించింది.భారత్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే హెచ్-1బీ వీసా ఉద్యోగులకు ఆయా కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. అందుకు అయ్యే ఈ-రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంది. ఉద్యోగికి ఏదైనా సంస్థ హెచ్-1బీ వీసా ఇచ్చేందుకు ఈ-రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపెనీలు పది డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీలే ఏకంగా ఏడాదికి 125 డాలర్ల రుసుము చెల్లించాల్సి వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. The initial registration period for the fiscal year 2026 H-1B cap will run from noon ET on March 7 to noon ET on March 24. Prospective petitioners & representatives must use a USCIS online account to register each beneficiary ... (1/3)— USCIS (@USCIS) February 5, 2025హెచ్-1బీ రిజిస్ట్రేషన్ గతేడా జోబైడెన్ ప్రభుత్వం బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్ను ప్రారంభించింది. ఆ విధానం ఈ ఏడాది కొనసాగుతుంది. ఈ విధానంలో ప్రతి దరఖాస్తుదారుడి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా ఒక్కసారి మాత్రమే అతడి పేరు లాటరీలో నమోదవుతుంది. -
వర్క్ పర్మిట్లపై బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలి
వాషింగ్టన్: అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) గడువు 180 రోజుల నుంచి అటోమేటిక్గా 540 రోజులకు పెరిగేలా వెసులుబాటు కల్పిస్తూ జో బైడెన్ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. దీనివల్ల హెచ్–1బీ వీసాదార్ల జీవిత భాగస్వాములకు ప్రయోజనం చేకూరుతోంది. జో బైడెన్ ప్రభుత్వం పాలనలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరి 13న డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఫైనలైజ్ చేసింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వలసదార్ల విషయంలో నూతన అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. వర్క్ పర్మిట్ల రెన్యూవల్ గడువును 180 నుంచి 540 రోజులకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు జాన్ కెన్నెడీ, రిక్ స్కాట్ గురువారం కాంగ్రెస్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. ఈఏడీ గడువు పెంచడాన్ని రద్దు చేయకపోతే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నవారిని గుర్తించడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు. -
ట్రంప్.. విద్యార్థుల జంప్!
సాక్షి, అమరావతి: అమెరికాలోని డల్లాస్లో చదువుకుంటున్న సురేష్ది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ఏటా రూ.40 లక్షలు ఖర్చవుతుండగా కొంత అప్పు చేసి, పార్ట్ టైం ఉద్యోగం (Part time job) చేస్తూ ఫీజులు కడుతున్నాడు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన నిబంధనలు సురేష్ కు పిడుగుపాటులా మారాయి. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు (Visa Cancel) చేస్తామని హెచ్చరించడంతో హతాశుడయ్యాడు. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులెలా సమకూర్చుకోవాలో తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నాడు.కరిగిపోతున్న కల..అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడమనేది మన విద్యార్థుల కల. తమ పిల్లలను అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. సంపన్న కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత మన విద్యార్ధులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికా చదువులు, ఉద్యోగాలు దూరం నుంచి చూసేవారికి అందంగానూ, గొప్పగానూ కనిపిస్తుంటాయి. ట్రంప్ రాకతో వాస్తవాలు బయటకు వస్తున్నాయి.ఇంటి అద్దెకూ చాలవు..ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు (Indian Students) ఉండగా వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. చైనాను కూడా ఈ విషయంలో మనవాళ్లు వెనక్కు నెట్టేశారు. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్టైమ్ జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేస్తున్న విద్యార్ధి వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 1,700 డాలర్లు అంటే దాదాపు రూ.1.46 లక్షలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్ధి నెలంతా పార్ట్టైమ్ జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాకండిగా చెబుతుండటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.బతుకు భారం.. పోనీ ఎలాగోలా ఇంటి దగ్గర్నుంచి అప్పులు చేసి డబ్బు తెప్పించి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా వచ్చే జీతంలో ప్రతి రూ.100కి ప్రభుత్వానికి రూ.30 పన్ను కింద చెల్లించాలి. ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులూ భరించాలి. అలా అయినా ఎలాగోలా గడుపుదామంటే గ్రీన్ కార్డ్ రావడం పెద్ద ప్రహసనం. మన దేశానికి ఏటా 7 వేల గ్రీన్ కార్డులు (అమెరికా పౌరసత్వం) మాత్రమే ఇస్తుండగా పోటీపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు.2012లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి రావాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకూ అదనపు ట్యాక్స్లు కడుతూ.. హెచ్1 వీసాపై బిక్కుబిక్కుమంటూ జీవించాలి. చదవండి: అన్నంత పనీ చేసిన డొనాల్డ్ ట్రంప్!ఇంత కష్టం ఉన్నప్పటికీ అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వెళుతున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) షాక్ ఇస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 18 వేల మందికి పైగా పార్ట్టైమ్ జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ‘ఐస్’ టీమ్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారతీయ విద్యార్ధులు అమెరికాలో పార్ట్టైమ్ జాబ్స్ను వదులుకుంటున్నారు. దండిగా డబ్బులుంటేనే రండి.. అమెరికాలో చదువుకోవాలనుకుంటే ముందుగా అంత ఆర్థ్ధిక స్తోమత ఉందో లేదో చూసుకోవాలి. ఏదో అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని ఇక్కడికి రావడం సరైన విధానం కాదు. అమెరికాలో ప్రస్తుతం పార్ట్టైమ్ జాబ్స్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.కాబట్టి చదువుకుంటూ సంపాదించడం ఇక కుదరకపోవచ్చు. జాబ్ వచ్చినా ఇక్కడ ఖర్చులతో పోల్చితే సంపాదించేది ఏమాత్రం సరిపోదు. అమెరికాకు రావాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ – మణితేజ, డాలస్, అమెరికా -
అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా వర్కర్లంటే అమెరికా ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమించే చౌక కార్మికులని, అక్కడి వేతనాల స్థాయిని కుదించేస్తారనేది అపోహ మాత్రమేనని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా ఎకానమీ వృద్ధిలో భారతదేశం, భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ వృద్ధిపై నిస్పృహకు లోను కావాల్సిన అవసరమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన, 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో పరిణామాలేమీ భారత ఐటీ పరిశ్రమ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్–1బీ వీసాలనేవి నాన్–ఇమిగ్రెంట్ వీసాలే కావడం వల్ల వివాదాస్పద వలసల సమస్యకు, వాటికి సంబంధమేమీ లేదని పేర్కొన్నారు. హెచ్–1బీ వీసాల్లో 70 శాతం వీసాలు భారతీయులకే లభిస్తుండటమనేది మన నైపుణ్యాలకు నెలకొన్న డిమాండ్కి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం వృద్ధి సాధనపై దృష్టి పెట్టడమనేది ఇరు దేశాలు కలిసి పని చేసేందుకు మరింతగా అవకాశాలను కల్పించగలదని సింగ్ చెప్పారు. భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడివారికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేశాయని సింగ్ చెప్పారు. -
H1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:అత్యుత్తమమైన నైపుణ్యమున్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. మంగళవారం(జనవరి21) వైట్హౌజ్లో ట్రంప్ ఈ విషయమై ఒరాకిల్,ఓపెన్ఏఐ,సాఫ్ట్బ్యాంక్ సీఈవోలతో కలిసి మీడియాతో మాట్లాడారు.‘హెచ్1బీ వీసాలపై విభిన్నమైన వాదనలున్నాయి. రెండు వాదనలకు నేను మద్దతిస్తున్నాను. నేను కేవలం ఇంజినీర్ల గురించే మాట్లాడడం లేదు. అన్ని స్థాయిల్లో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. హెచ్1బీ వీసాలపై నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవవనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒరాకిల్,సాఫ్ట్బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజినీర్ల అవసరం ఉంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఇలాన్మస్క్ హెచ్1బీ వీసాలకు మద్దతిస్తున్నారు.హెచ్1బీ వీసాల జారీని నేను ఆపడం లేదు’అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా, హెచ్1బీ వీసాలపై ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపించాయి. కొందరు హెచ్1బీ వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే అమెరికాలో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ మాత్రం హెచ్1బీ వీసాల జారీని సమర్థించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందన్నారు. #WATCH | Washington DC | On H1B visas, US President Donald Trump says, "... I like both sides of the argument but I also like very competent people coming to our country, even if that involves them training and helping others that may not have the qualifications... About HB1, I… pic.twitter.com/ALFRoHUWgD— ANI (@ANI) January 22, 2025 ఇదీ చదవండి: ట్రంప్ 2.0..భారత్కు దక్కిన అరుదైన గౌరవం -
హెచ్-1బీ వీసా కొత్త రూల్స్ : వాళ్లకి నష్టం, భారతీయులకు ఇష్టం!
హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కొత్త నియమాలు ఈ రోజు (జనవరి 17, 2025) అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కీలకమైన, మంచి వేతనాలను అందుకునే ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వారి ఉద్యోగ స్థితి ఆధారంగా అమెరికాలో ఉండటానికి అనుమతి లభిస్తుంది.పదవీ విరమణ అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో తుది వలస విధాన సంస్కరణలలో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. వీసా ప్రోగ్రామ్ను ఆధునీకీకరించడమే కాకుండా సమర్థవంతమైన విదేశీ ఉద్యోగులకు మాత్రమే మరిన్ని అవకాశాలందించే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు సమాచారం. దీని వల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ H-1B ఫైనల్ రూల్ , H-2 ఫైనల్ రూల్ ప్రకారం, H-1B నాన్-ఇమ్మిగ్రెంట్ , H-2 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ల నిబంధనలు మారతాయి. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించిన H-1B వీసా ప్రోగ్రామ్ మార్పులు భారతీయులకే ఎక్కువ.2023లో H-1B వీసా హోల్డర్లలో 70 శాతం కంటే ఎక్కువ భారతీయ నిపుణులు ఉన్నందున, ఈ మార్పులు వారికే ఎక్కువప్రయోజనం చేకూరుస్తాయి.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) "H-1B తుది నియమం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా, ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడానికి మెరుగైన యజమానులను అనుమతించేందుకు H-1B ప్రోగ్రామ్ను ఆధునీకరిస్తుందని వెబ్సైట్లో అని పేర్కొంది. హెచ్-1బీ వీసా కీలక మార్పులు హెచ్-1బీ వీసా ప్రక్రియ మరింత సులభతరం అయ్యింది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను 'స్పెషాలిటీ ఆక్యుపేషన్' కింద నియమించుకోవడం కంపెనీలకు ఇక సులభతరం. కంపెనీలు వారి నిర్దిష్ట శ్రామిక శక్తి అవసరాల ఆధారంగా H-1B కార్మికులను నియమించుకోవచ్చు, F-1 విద్యార్థి వీసాల నుంచి హెచ్-1బీ వీసాలకు మారడం ఈజీ. ప్రాసెసింగ్ జాప్యం కూడా తగ్గుతుంది. యూఎస్లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.జనవరి 17, 2025 నుండి కొత్త రూల్ ప్రకారం ఫారం I-129 తప్పనిసరి అవుతుంది. హెచ్-1బీ వీసా ప్రక్రియను సరళీకృతం చేసే దిశగానే దీన్ని తీసుకొచ్చింది. అయితే మంచి వేతనాలను అందుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించేందుకే ఈ మార్పులని విమర్శలు వినబడుతున్నాయి. హెచ్-1బీ వీసా మార్పులు అమెరికా ఉద్యోగులకు నష్టమని, అమెరికన్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపించారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయని విమర్శించారు. మరోవైపు రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్పులను ఎంతవరకు అంగీకరిస్తారు? తిరిగి ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
ఒకే ఒరలో రెండు కత్తులు!
అమెరికా రిపబ్లికన్ పార్టీలో టెక్ మితవాదులు, జాతీయ మితవాదులు వేర్వేరు వర్గాలు. ఇరువురూ ఒక్కటై డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్ విజయం తర్వాత మొదటిసారి ఈ రెండు వర్గాలూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. అమెరికా జనాభాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతేతరులతో భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది జాతీయవాద మితవాదుల ఆరోపణ. అందివచ్చే ఎలాంటి అవకాశాలైనా సరే వాడుకుని అమెరికా యావత్ ప్రపంచాన్ని జయించాలని టెక్ రైటిస్టులు అనుకుంటారు. అయితే ట్రంప్ దగ్గర టెక్ రైటిస్టులకే ప్రాధాన్యత లభిస్తోంది. కలసికట్టుగా ఎన్నికలు గెలిచినా, ఇప్పుడు ఒక వర్గం ఓడిపోబోతోంది.మొన్న క్రిస్మస్ రోజు అమెరికా సోషల్ మీడియా భగ్గుమంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కేంద్రబిందువుగా సంస్కృతి పరమైన విష పోరాటం మొదలైంది. విమర్శకులు ఆయనపై విద్వేషంతో బుసలు కోట్టారు. అసభ్య వ్యాఖ్యలతో దాడి చేశారు. మస్క్ కూడా వారితో ఢీ అంటే ఢీ అన్నాడు. అసలేమిటి ఈ వివాదం? వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్ను డోనాల్డ్ ట్రంప్ తన ఏఐ–పాలసీ సీనియర్ సలహాదారుగా నియమించుకోడంతో అమెరికాలో అగ్గి రాజుకుంది. ‘మాగా’ (ఎంఏజీఏ– మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వాదానికి గట్టి మద్దతుదారు, ఇంటర్నెట్ ట్రోలింగ్ సుప్రసిద్ధుడు అయిన లారా లూమర్ పెట్టిన పోస్టు తీవ్ర మితవాదులను అట్టుడికించింది. ‘అమెరికా ఫస్ట్’ ఉద్యమానికి ట్రంప్ వెన్నుపోటు పొడిచాడంటూ రగిలిపోయారు. కృష్ణన్ భారతీయ వలసదారు. అమెరికా పౌరుడు. ఆయన భారతీయ మూలాలను ‘మాగా’ మితవాద శిబిరం సహించలేక పోయింది. హెచ్–1బి వీసా విధానంపై మండిపడింది. అమెరికన్ కంపెనీలు నిపుణులైన వలసదారులను నియమించుకోడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఇలా వచ్చి పనిచేస్తున్న వారిలో మూడొంతుల మంది ఇండియన్లే. ఈ నేపథ్యంలో శ్రీరామ్ కృష్ణన్ నియామకానికి స్పందనగా ఇంటర్నెట్లో జాత్యహంకారం జడలు విప్పింది. జాతీయ వాదులు భారతీయ టెక్ వర్కర్లపై విద్వేషపూరితమైన మీమ్స్తో సోషల్ మీడియాను ముంచెత్తారు. వారిని ‘మూడో ప్రపంచ ఆక్రమణ దారులు’గా లూమర్ అభివర్ణించాడు. అంతేకాదు, అతడో సిద్ధాంతం లేవనెత్తాడు. దాని పేరు ‘గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ’. అమెరికా జనా భాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతే తరులతో భర్తీ చేయడా నికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది లూమర్ సిద్ధాంతం. హెచ్–1బి వీసా విధానానికి మస్క్ మద్దతునిజానికి శ్వేత ఆధిక్యానికి మస్క్ వ్వతిరేకం ఏమీ కాదు. తన సొంతమైన ‘ఎక్స్’ వేదిక మీద దాన్ని సమర్థించినట్లే కనిపించేవాడు. అయినా, తనకు విశేషమైన అవకాశాలు అందించిన, అపార సంపద కట్టబెట్టిన ప్రభుత్వ విధానం (హెచ్–1బి) మీద ఇప్పుడు జరుగు తున్న దాడిని సహించలేక పోయాడు. అమెరికా పౌరుడిగా మారక ముందు మస్క్ కూడా వలస వచ్చినవాడే. దక్షిణాఫ్రికా నుంచి హెచ్–1బి వీసా మీద వచ్చి స్థిరపడ్డాడు. ఆయన కూడా తన కంపెనీల్లో అలాంటి వారిని నియమించుకున్నాడు. ఈ హెచ్–1బి వీసా విధానానికి మద్దతు ఇస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికా గొప్ప ప్రతిభావంతులను సమకూర్చుకుంది అని అతడి వాదన. ఐటీ కేంద్రమైన సిలికాన్ వ్యాలీకి ఈ దృక్పథం ఇబ్బందికరమైంది కానప్పటికీ, రిపబ్లికన్ పార్టీలోని తిరోగమన, జాతీయ వాద వర్గాలకు మస్క్ అభిప్రాయం అసంతృప్తి కలిగించింది ‘అమెరికా ప్రజలు ఎప్పటికీ అమెరికాను ఒక స్పోర్ట్స్ టీమ్ లేదా కంపెనీ అనుకోరు’ అంటూ జాక్ పొసొబిక్ బదులిచ్చాడు. వీటన్నిటికీ బదు లిస్తూ, ‘ఈ అంశం మీద నేను యుద్ధానికి సిద్ధం, దాని పర్యవ సానాలు మీ ఊహక్కూడా అందవు’ అంటూ మస్క్ తన విమర్శకు లను హెచ్చరించాడు. దీంతో ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ రంగంలోకి దిగాడు. హెచ్–1బి వీసాలు పెద్ద స్కామ్ అనీ, వాటిని సమర్థించి మస్క్ తన ‘నిజ స్వరూపం’ బయట పెట్టుకున్నాడని ప్రతి దాడికి దిగాడు.నిజానికి హెచ్–1బి వీసాలను వ్యతిరేకించడం ‘మాగా’ పంథా కాదు. ఈ విధానంలో లోపాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ శాండర్స్ గతంలో మాట్లా డిన ప్రకారం, వ్యాపారవేత్తలు అత్యంత నిపుణులైన వలస ఉద్యోగులను నియమించుకుని సిబ్బంది వ్యయాలు గణనీయంగా తగ్గించు కోడానికి హెచ్–1బి పదునైన ఆయుధంలా ఉపకరిస్తుంది. మస్క్ సమ్మిళిత వలసవాదంగా పేర్కొంటూ అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. అయితే, ఎక్స్ వేదిక మీద జాతివివక్ష అంశంలో దొంగాటలు ఆడాడు. నియో నాజీలతో సంబంధాలు నెరిపే జర్మన్ తీవ్ర మితవాద పార్టీకి గట్టి మద్దతు ఇచ్చాడు. సయోధ్య కుదిరేనా?రిపబ్లికన్ పార్టీలోని ఈ రెండు మితవాద వర్గాల ఐక్యత ప్రశ్నా ర్థకంగా మారింది. ఏమైనా ఇవి తమ విభేదాలు పరిష్కరించుకున్నా యని ఒక దశలో అనిపించింది. జాతీయ మితవాదులకు, టెక్ మిత వాదులకు మధ్య సయోధ్యకు కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ఒక ఉదాహరణ. పీటర్ థియల్ అనే మితవాద టెక్ బిలియనీర్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీలో వాన్స్ పనిచేశాడు. అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛావిపణులను ఈ కాబోయే ఉపాధ్యక్షుడు విమర్శించాడు. తద్వారా మంచి పలుకుబడి ఉన్న జాతీయ మితవాద నేతలను ఆకట్టుకున్నాడు. హెచ్–1బి వీసా ఉద్యోగులను నియమించుకునే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నప్పటికీ వాన్స్ హెచ్–1బి వీసాలను వ్యతిరేకించాడు. పార్టీని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా సమైక్యం చేయడం ఆయన బాధ్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అయితే ఎన్నికల తరువాత దాన్ని పక్కన పెట్టారు.ట్రంప్ పదవి చేపట్టిన తర్వాత టెక్ రైట్–నేషనలిస్ట్ రైట్ మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి తాజా ఘర్షణ ఒక ప్రివ్యూ లాంటిది. జాతీయవాదులు వారు కోరుకున్నది చాలావరకు సాధించుకుంటారు. మూకుమ్మడి దేశ బహిష్కరణలు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. ఇది వారికి ఆనందం కలిగించి తీరు తుంది. సిలికాన్ వ్యాలీతో వారి పోరు విషయాన్ని ప్రస్తుతానికి ఆయన పట్టించుకోడు. ట్రంప్ గత హయాంలోనూ ఇదే జరిగింది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు పక్కన పెట్టి సామాన్యులకు మేలు చేసే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని 2016లో చేసిన వాగ్దానాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు. ఇది జాతీయ మితవాదులు కోరుకున్నదానికి విరుద్ధం. భారీ వ్యాపార సంస్థలకు, ధనికులకు ట్రంప్ అప్పట్లో పన్నులు తగ్గించాడు. మరోవంక, ‘ముస్లిం బ్యాన్’, అక్రమ వలస దారుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం వంటి కఠిన చర్యలను టెక్ అధిపతులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్ రైట్కే ప్రాధాన్యం?ఈసారి టెక్ మితవాద వర్గానికి పాలనలో ప్రాధాన్యం లభిస్తోంది. మస్క్, టెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కొత్తగా ఏర్పా టైన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్–డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న మెంట్ ఎఫిషియన్సీ) నిర్వహించబోతున్నారు. బిలియనీర్ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఈ విభాగం సిబ్బంది నియామకంలో తోడ్పడతాడు. ఇక శ్రీరామ్ కృష్ణన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన రూపకల్పనలో అధ్యక్షుడికి సలహాలు ఇస్తాడు. ట్రంప్ ఇతర నియా మకాల్లో సైతం ధనికవర్గాలకు, శక్తిమంతులకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక జాతీయ మితవాదుల్లోని కొద్దిమంది ముఖ్యులకూ ట్రంప్ క్యాబినెట్లో చోటు లభించనుంది.ట్రంప్ ‘న్యూయార్క్ పోస్ట్’తో మాట్లాడుతూ, ‘నేనెప్పుడూ వీసా లను ఇష్టపడ్డాను. వీసాలకు నేను ఎప్పుడూ అనుకూలమే. అందుకే వాటిని అమలు చేశాను’’ అన్నాడు. ఈ ప్రకటన ద్వారా మస్క్కు ఆయన పూర్తి మద్దతు పలికాడు. చిట్టచివరిగా ఇంకో విషయం ప్రస్తా వించాలి. సంపన్నుల చేతిలో ముఖ్యంగా క్రితంసారి కంటే ఈసారి మరింత ఎక్కువ అధికారం ఉంటుంది. అలీ బ్రెలాండ్ వ్యాసకర్త సీనియర్ పత్రికా రచయిత(‘ది అట్లాంటిక్’ సౌజన్యంతో) -
భారత్కు తిరిగిరాకుండానే హెచ్1బీ రెన్యూవల్!
వాషింగ్టన్: ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో స్వదేశానికి రాకుండానే అమెరికా గడ్డ మీదనే హెచ్–1బీ వీసా రెన్యూవల్ కోరుకునే వేలాది మంది భారతీయుల కల త్వరలో నెరవేరే అవకాశాలు మెరుగయ్యాయి. అమెరికన్ సంస్థల్లో పనిచేస్తూ హెచ్–1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగులు తమ వీసా రెన్యూవల్ కోసం ఖచ్చితంగా తమ తమ స్వదేశాలకు స్వయంగా వెళ్లి స్టాంపింగ్ పూర్తి చేయించుకుని తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చేది. చాన్నాళ్ల నుంచి ఇదే నిబంధన అమల్లో ఉంది. అయితే ఇకపై ఏ దేశానికి చెందిన హెచ్–1బీ వీసాదారులైనాసరే స్వదేశానికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే రెన్యూవల్కు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగమైన దాదాపు 20,000 మంది హెచ్–1వీ వీసాదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలను విజయవంతంగా సమర్పించడంతో అందరికీ వీసా రెన్యువల్ సుసాధ్యమైంది. ఇలా పైలట్ ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విజయవంతంగా పూర్తికావడంతో ఇకపై హెచ్–1బీ వీసాదారులు అందరికీ తమ దేశంలోనే రెన్యూవల్ చేయాలని అమెరికా యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అత్యధికంగా లబ్దిపొందేది భారతీయులే. ఎందుకంటే ఏటా హెచ్–1బీ వీసాదారుల్లో భారతీయులే గణనీయమైన స్థాయిలో ఉన్నారు. 2023లో మొత్తం 3,86,000 హెచ్–1బీ వీసాలు మంజూరైతే అందులో 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి. 2022 ఏడాదిలో ఏకంగా 77 శాతం వీసాలను మనవాళ్లే ఒడిసిపట్టారు. వీసా రెన్యూవల్ స్టాంపింగ్ కోసం లక్షల రూపాయల ఖర్చుపెట్టి విమాన టికెట్లు కొనుగోలు చేసి భారత్కు తిరిగి రావడం, వీసా అపాయిమెంట్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ సమస్యలు, దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు చాలా రోజులు వేచి ఉండటం, తిరిగి మళ్లీ లక్షలు ఖర్చుపెట్టి అమెరికాకు తిరిగిరావడం ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన వ్యవహారం. స్వదేశంలో రెన్యూవల్ అమలైతే ఈ బాధలన్నీ తీరతాయని అక్కడి హెచ్–1వీ వీసాలున్న భారతీయులు ఆశిస్తున్నారు. ఈ అవకాశం ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచనప్రాయంగా తెలిపింది. కాబోయే అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాలకు పూర్తి మద్దతు తెలిపిన తరుణంలో అమెరికా గడ్డ మీదనే వీసా రెన్యూవల్ సదుపాయం త్వరలో అమల్లోకి వస్తుండటం గమనార్హం. హెచ్–1బీతోపాటు విద్యార్థి వీసా కోటాలోనూ భారతీయులే అత్యధికంగా ఉండటం విశేషం. గత ఏడాది అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏకంగా 3,31,000 మంది భారతీయులు విద్యార్థి వీసాలు పొందారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్తుల్లో భారతీయుల సంఖ్యే అధికం. 2008/09 విద్యాసంవత్సరం నుంచి చూస్తే ఇంతమంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం ఇదే తొలిసారి. -
డాలర్ డ్రీమ్స్పై మరో పిడుగు!
హెచ్–1బీ వివాదంతో సతమతమవుతున్న భారత విద్యార్థుల డాలర్ కలలపై మరో పిడుగు పడబోతుందా? విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని అమెరికాలో స్థానిక విద్యార్థులు గొంతెత్తుతుండటం ఈ అనుమానానికి తావిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతేడాది లక్ష మంది విద్యార్థులుఅంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా ఎఫ్ –1 వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రామ్ను ఎంచుకుంటున్నారు. తొలుత తాత్కాలిక నైపుణ్యాభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్ను రూపొందించారు. ఈ కార్యక్రమం ఎఫ్–1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. అమెరికా లో అత్యధి కంగా అంతర్జాతీయ విద్యార్థులైన భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు, చివరికి హెచ్–1బీ వీసాల కోసం ఈ కార్యక్రమంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ను ఉపయోగిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో సుమారు 97,556 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు. కోర్టు చెప్పినా... విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రామ్ను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వలసకు ఉపయోగపడుతోందని అమెరికన్లు వాదిస్తున్నారు. అమెరికన్ల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమేనని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ (వాష్టెక్) కోర్టుకెళ్లింది. అయితే, కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. కార్యక్రమానికి ఆమోదం తెలిపే దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. మరోసారి చర్చలు.. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో నైపుణ్యం కలిగిన కార్మికుల వలసలపై ఈ చర్చలు తీవ్రమయ్యాయి. ‘‘ఓపీటీ ప్రోగ్రామ్ విదేశీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ తరహాలో గెస్ట్ వర్కర్ స్కీమ్. విశ్వవిద్యా లయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్లను విక్రయిస్తు న్నాయి. డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్) తరహాలో చట్టవి రుద్ధం. ఈ పోటీ నుంచి అమెరికన్ కాలేజీ గ్రాడ్యు యేట్లను రక్షించడానికి ఈ ఓపీటీని రద్దు చేయాలి’’ అని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్.. ఎక్స్లో పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సాగుతున్న ఈ కార్యక్రమం.. యూఎస్ జాబ్ మార్కెట్లలోకి దొడ్డిదారి ప్రవేశమని విమర్శించింది. ప్రశ్నార్థకంగా భవిష్యత్...అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతు దారులు సైతం.. హెచ్–1బీ వీసాలపై మండిపడుతున్నారు. హెచ్–1బీ వీసా హోల్డర్లు, ప్రధానంగా భారతీయులు అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని, పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్ల కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభా వంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్తోపాటు.. ఎలన్ మస్క్, వివేక్ రామ స్వామి వంటి ప్రముఖులు చెబుతు న్నారు. ఈ ఓపీటీ కార్యక్రమాలను వారు సమ ర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీటీ కార్య క్రమం భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నా ర్థకంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్మార్ట్ పీపుల్ కావాలి
వాషింగ్టన్: స్థానిక అమెరికన్లకే అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రిపబ్లికన్ల ఎన్నికల హామీకి విరుద్ధంగా విదేశీయులకు హెచ్–1బీ వీసాల జారీని ప్రపంచ కుబేరుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ సహ సారథి వివేక్ రామస్వామి సమర్థిస్తున్న వేళ కాబోయే అమెరికా అధ్యక్షుడు మరోసారి హెచ్–1బీ వీసాలను సమర్థించారు. అమెరికాకు ఎల్లప్పుడూ కేవలం సమర్థవంతులైన వ్యక్తులే అవసరమని ట్రంప్ నొక్కి చెప్పారు. ‘‘ అమెరికాకు ఎల్లప్పుడూ సమర్థవంతులైన వ్యక్తులే కావాలని నేను ఆశిస్తా. స్మార్ట్ జనం మాత్రమే అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలి. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ఉద్యోగ కల్పన జరగ బోతోంది. దేశానికి నైపుణ్యవంతమైన కార్మికుల అవసరం చాలా ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం అమెరికాలోని మార్–ఏ–లాగో రిసార్ట్లో ట్రంప్ను స్థానిక మీడియా పలకరించింది. ‘‘హెచ్–1బీ వీసాలపై నా అభిప్రాయం ఎన్నటికీ మారదు. నిఫుణులే అమెరికాకు కావాలి’’ అని స్పష్టంచేశారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీ వీసాల జారీని సమర్థిస్తూ వ్యాఖ్యానించడం, వారికి ఇప్పటికే ట్రంప్ మద్దతు పలకడం తెల్సిందే. అయితే అమెరికన్లకే తొలి ప్రాధాన్యం అంటూ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చారని అమెరికన్ మీడియా చేస్తున్న వాదనలను ట్రంప్ తోసిపుచ్చారు. మొదట్నుంచీ తాను హెచ్–1బీకి అనుకూలమేనని పునరుద్ఘాటించారు. కేవలం అత్యంత నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకే ఉపాధి కల్పిస్తూ స్థానిక సాధారణ, తక్కువ నైపుణ్యమున్న అమెరికన్లకు సరైన ఉద్యోగాలు దక్కకపోతే ఆగ్రహావేశాలు భవిష్యత్తులో పెరిగే ప్రమాదముందని రాజకీయ పండితుడు క్రేగ్ ఆగ్రనోఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఐటీ రంగంలో ముఖ్యమైన ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే తన్నుకు పోతే స్థానిక ఐటీ ఉద్యోగార్థుల పరిస్థితి ఏంటి?’ అనే ప్రశ్నకు ఇంతకాలం ఏ నేతా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని క్రేగ్ వ్యాఖ్యానించారు. స్థానిక అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకే ఎక్కువ నైపుణ్యాలున్న విదేశీయులు లభిస్తుండటంతో అమెరికన్ కంపెనీలు హెచ్–1బీ వీసా విధానం ద్వారా విదేశీయులకే అధిక ప్రాధాన్యతనిచ్చి అమెరికాకు రప్పిస్తుండటం తెల్సిందే. -
హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!
హెచ్–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటికి అనుకూలంగా మాట్లాడడం.. ఆయన మద్దతుదారుల్ని షాక్కు గురి చేసింది. అదే సమయంలో.. టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్(Elon Musk) కాస్త మెత్తబడ్డారు. హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు స్వరం మార్చారు. ఈ పాలసీలో భారీ సంస్కరణలు అవసరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించేవే హెచ్–1బీ(H1B) వీసాలు. అయితే.. ఈ వీసా వ్యవస్థ సజావుగా నడవడం లేదని.. దానికి భారీ సంస్కరణలు అవసరమని తాజాగా ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు ఆయన బదులిచ్చారు.Easily fixed by raising the minimum salary significantly and adding a yearly cost for maintaining the H1B, making it materially more expensive to hire from overseas than domestically. I’ve been very clear that the program is broken and needs major reform.— Elon Musk (@elonmusk) December 29, 2024హెచ్–1బీ వీసా మీద సౌతాఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు ఇలాన్ మస్క్. అయితే ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులుగా ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ని నియమించారు. అయితే.. అమెరికా ఫస్ట్ అమలుకు ట్రంప్ ఏరికోరి నియమించిన ఈ ఇద్దరే బీ1 వీసా విధానానికి మద్దతు ప్రకటించడం.. ట్రంప్ మద్దతుదారులకు ఏమాత్రం సహించడం లేదు. దీనికి తోడు.. 👉తాజాగా.. వైట్హౌస్ ఏఐ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్ను ట్రంప్ ఇటీవల నియమించారు. అయితే నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది.👉మరోవైపు నెట్టింట జోరుగా చర్చ నడిచింది. అయితే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు ఇలాన్ మస్క్ సూచిస్తూ వస్తున్నారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా.👉ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. కౌంటర్గా కొందరు వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఒకానొక టైంలో సహనం నటించిన మస్క్.. బూతు పదజాలం ప్రయోగించిన సందేశం ఉంచారు.👉ఇక.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే.. విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని.. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా తయారు చేస్తానని(Make America Great Again) తన ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు అప్పుడు సంకేతాలిచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇటు డెమోక్రాట్లలో.. అటు రిపబ్లికన్లలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. -
హెచ్–1బీ వీసాలకు ట్రంప్ దన్ను
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ కార్మికులకు అమెరికా సంస్థల్లో ఉపాధికి ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. హెచ్–1బీ వీసాల జారీని అమెరికాలో పలువురు వ్యతిరేకిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పని చేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాలను వ్యతిరేకించేవారు తమ అభిప్రాయం మార్చుకోవాలని మస్క్ సూచించడం తెల్సిందే. కేవలం నైపుణ్యత మీదనే మనగలిగే స్పేస్ఎక్స్, టెస్లా వంటి సృజనాత్మక సంస్థలకు హెచ్–1బీ వీసాదారుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులు కానున్న మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీకి మద్దతు తెలుపుతున్నారు. దీన్ని రిపబ్లికన్ పారీ్ట సీనియర్లు తప్పుబడుతున్నారు. స్థానిక అమెరికన్లకే అధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఇది విరుద్ధమంటున్నారు. వాళ్ల వైఖరిని మస్క్ తప్పుబట్టారు. హెచ్–1బీ వీసాల కోసం ఎంతకైనా తెగిస్తానని శనివారం ప్రకటించారు. -
ఇలాన్ మస్క్ బూతు ప్రయోగం
హెచ్-1బీ వీసా, ఇమ్మిగ్రేషన్ సంస్కరణల విషయంలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్'(Elon Musk) మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్-1బీ వీసాలను వ్యతిరేకిస్తున్న వారిపై బూతు ప్రయోగం కూడా చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.స్పేస్ ఎక్స్ఎం, టెస్లా వంటి కంపెనీలను స్థాపించడానికి మాత్రమే కాకుండా.. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం హెచ్-1బీ వీసా (H-1B Visa) అని మస్క్ స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసాల కారణంగానే దేశం బలమైన దేశంగా అవతరించింది. కాబట్టి వీసాలను వ్యతిరేకిస్తున్నవారు ఓ అడుగు వెనక్కి వేయండి అని టెస్లా బాస్ అన్నారు.నిజానికి హెచ్-1బీ వీసాలను జారీ చేయడం వల్ల అమెరికాలోని ఉద్యోగాలను బయటి వ్యక్తులు సొంతం చేసుకుంటారు. కాబట్టి అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయనంటే ఈ వీసాల జారీ చేయకూడదని కరడుగట్టిన రిపబ్లికన్లు చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.The reason I’m in America along with so many critical people who built SpaceX, Tesla and hundreds of other companies that made America strong is because of H1B.Take a big step back and FUCK YOURSELF in the face. I will go to war on this issue the likes of which you cannot…— Elon Musk (@elonmusk) December 28, 2024త్వరలో ప్రారంభం కానున్న ట్రంప్ క్యాబినెట్లోని.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) కో-హెడ్స్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసాల ద్వారా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ అమలు చేయనున్నారు. దీనిపై కూడా కొన్ని వ్యతిరేఖ నినాదాలు వినిపిస్తున్నాయి.10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలుఇదిలా ఉండగా భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది. ఇందులో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం. -
హెచ్1బీ వీసాల రక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమే
వాషింగ్టన్: టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్–1బీ వీసాల విషయంలో ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మద్దతిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎలాన్ మస్క్ శనివారం స్పందించారు. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు సూచించారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా. ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నా డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్క అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా గొంతు విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృత్రిమ మేధపై వైట్హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్ను ట్రంప్ ఇటీవల నియమించారు. నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది. -
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు
లారా లూమర్.. సోషల్ మీడియాలో ఈవిడ చేస్తున్న క్యాంపెయిన్ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం. అమెరికా ఉద్యోగాల్లో సొంత మేధోసంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్ఫ్లుయెన్సర్.. భారతీయులపై మాత్రం తీవ్ర అక్కసు వెల్లగక్కుతోంది. ఈ క్రమంలో చీప్ లేబర్ అంటూ భారతీయులను, ఇక్కడి పరిస్థితులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ను కృత్రిమ మేధ (ఏఐ) రంగ సలహాదారుగా నియమించారు. అయితే ఈ నియామకాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారతీయులను ఉద్దేశించి లారా లూమర్ వివాదాస్పద పోస్టులు చేశారు. అమెరికా ఫస్ట్ నినాదానికి శ్రీరామ్ కృష్ణన్ ద్రోహం చేస్తున్నాడని, గ్రీన్కార్డుల విషయంలో అతని వైఖరి భారత్లాంటి దేశాలకు మేలు చేసేలా ఉంటుందని.. తద్వారా అమెరికాలోని STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) గ్రాడ్యుయేట్స్కు గడ్డు పరిస్థితులు తప్పవని చెబుతోందామె. అదే టైంలో..హెచ్1బీ వీసాల విషయంలోభారతీయులపై వివక్షాపూరితంగా ఆమె చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, ఉషా వాన్స్లాంటి వాళ్లు అమెరికా ఫస్ట్ నినాదానికి కట్టుబడి ఉండాలని ఆమె కోరుతున్నారు. ‘‘నేను ఓటేసింది అమెరికాను మరోసారి గొప్పగా తయారు చేస్తారని. అందుకోసం హెచ్1బీ వీసాలను తగ్గిస్తారని.అంతేగానీ పెంచుకుంటూ పోతారని కాదు. భారత్లో అంత మేధోసంపత్తి ఉంటే అక్కడే ఉండిపోవచ్చు కదా.అమెరికాకు వలస రావడం దేనికి?. అంత హైస్కిల్ సొసైటీ అయితే.. ఇలా చెత్తకుప్పలా ఎందుకు తగలడుతుంది?( తాను పోస్ట్ చేసిన ఓ ఫొటోను ఉద్దేశిస్తూ..)..@VivekGRamaswamy knows that the Great Replacement is real. So does @JDVance. It’s not racist against Indians to want the original MAGA policies I voted for. I voted for a reduction in H1B visas. Not an extension. And I would happily say it to their face because there’s nothing… https://t.co/vO2e33USE1 pic.twitter.com/EH4hpJxiNH— Laura Loomer (@LauraLoomer) December 24, 2024మీకు భారతీయుల్లాంటి చీప్ లేబర్ కావాలనే కదా వీసా పాలసీలను మార్చేయాలనుకుంటున్నారు. ఆ విషయం మీరు ఒప్పుకుంటే.. నేనూ రేసిస్ట్ అనే విషయాన్ని అంగీకరిస్తా. మీలాంటి ఆక్రమణదారులు నిజమైన ట్రంప్ అనుచరుల నోళ్లు మూయించాలనుకుంటారు. కానీ, ఏం జరిగినా నేను ప్రశ్నించడం ఆపను. అసలు మీకు అమెరికాను మరోసారి గొప్పగా నిలబెట్టాలనే(Make America Great Again) ఉద్దేశమూ లేదు. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు’’ అని తీవ్ర స్థాయిలో సందేశాలు ఉంచారు. ఇంతకు ముందు.. భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేసినప్పుడు కూడా లారా లూమర్ ఈ తరహాలోనే జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ను లక్ష్యంగా చేసుకుని..టెక్ బిలియనీర్లు మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో ఎక్కువసేపు గడుపుతూ.. తమ చెక్ బుక్లను విసిరేస్తున్నారు. అలాంటివాళ్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీలను తిరగరాయాలనుకుంటున్నారు. తద్వారా.. భారత్, చైనా లాంటి దేశాల నుంచి అపరిమితంగా బానిస కూలీలు రప్పించుకోవచ్చనేది వాళ్ల ఆలోచన అయి ఉండొచ్చు అంటూ ఆ పోస్టులోనే ఆమె ప్రస్తావించారు.Quite the change of tune. Wonder if he got “the call”. pic.twitter.com/o1Gp8dNYyo— Laura Loomer (@LauraLoomer) December 28, 2024కాంట్రవర్సీలకు జేజేమ్మ!31ఏళ్ల వయసున్న లారా ఎలిజబెత్ లూమర్.. పోలిటికల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జర్నలిస్ట్ కూడా. మొదటి నుంచి ఈమె శైలి వివాదాస్పదమే. గతంలో అక్కడి ప్రత్యక్ష ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసి ఓడారామె. ఆపై కొన్ని క్యాంపెయిన్లను ముందుండి నడిపించారు. తాను ఇస్లాం వ్యతిరేకినంటూ బహిరంగంగా ప్రకటించి.. ఆ మతంపై చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలూ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు.. తన ద్వేషపూరితమైన పోస్టుల కారణంగా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫామ్లు, పేమెంట్స్ యాప్స్, ఆఖరికి ఫుడ్ డెలివరీ యాప్లు కూడా ఆమెపై కొంతకాలం నిషేధం విధించాయి.కిందటి ఏడాది ఏప్రిల్లో ఆమెను ఎన్నికల ప్రచారకర్తగా నియమించుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే.. రిపబ్లికన్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. అధ్యక్ష రేసు బైడెన్ తప్పుకున్న తర్వాత అదే రిపబ్లికన్లు ట్రంప్ను ప్రొత్సహించి లూమర్ను ప్రచారకర్తగా నియమించారు. ఆ టైంలో ట్రంప్తో ఆమెకు అఫైర్ ఉన్నట్లు కథనాలు రాగా.. ఆమె వాటిని ఖండించారు. ఒకరకంగా చూసుకుంటే.. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఈమెకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వొచ్చు. అలాంటి లూమర్ ఇప్పుడు.. ట్రంప్ పాలనలో కీలకంగా మారబోతున్న ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను తీవ్రంగా విమర్శిస్తోంది. మస్క్ సొంత ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగానే ఆమె తీవ్ర పదజాలంతో సందేశాలు పోస్ట్ చేస్తుండడం గమనార్హం. ‘‘ఎలాన్ మస్క్కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషీయెన్సీ(DOGE) బాధ్యతలు అప్పగించడం సుద్ధ దండగ. అతనొక స్వార్థపరుడు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్(MAGA) పేరుతో ఇమ్మిగ్రేషన్ పాలసీలలో తలదూర్చాలనుకుంటున్నాడు. తద్వారా అమెరికన్ వర్కర్లకు హాని చేయాలనుకుంటున్నాడు. వివేక్ రామస్వామి చేస్తున్న క్యాంపెయిన్ ఎందుకూ పనికి రానిది. రిపబ్లికన్లు అతిత్వరలో వీళ్లను తరిమికొట్టడం ఖాయం. మస్క్, రామస్వామిలు ట్రంప్కు దూరం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు’’ అని విమర్శించిందామె. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ ఆమెపై వెటకారంగా ఓ పోస్ట్ చేసి వదిలేశాడు..@VivekGRamaswamyThe technocratic state is more dangerous than the administrative state.Your silence on the censorship of those who wanted to put a limit on the power of big tech is deafening.DOGE can’t be allowed to be utilized as a vanity project to enrich Silicon Valley. https://t.co/81EYNTLkqx— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే.. మస్క్ తేలికగా తీసుకుంటున్నా లూమర్ మాత్రం తన విమర్శల దాడిని ఆపడం లేదు. మస్క్ పచ్చి స్వార్థపరుడని, చైనా చేతిలో పావు అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో మస్క్ ఎక్కువసేపు గడుపుతున్నాడని.. తనకు లాభం వచ్చే పనులు ట్రంప్తో చేయించుకునేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాడని, తన స్నేహితుడు జీ జిన్పింగ్(చైనా అధ్యక్షుడు) కోసమే ఆరాటపడుతున్నాడంటూ తిట్టిపోసింది.ఎగిరిపోయిన బ్లూ టిక్.. మరో చర్చతప్పుడు సమాచారం, విద్వేషపూరిత సందేశాలు పోస్ట్ చేస్తోందన్న కారణాలతో.. గతంలో లారా లూమర్(Laura Loomer) ట్విటర్ అకౌంట్పైనా నిషేధం విధించారు. అయితే ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలుచేసిన కొన్నాళ్లకే..ఫ్రీ స్పీచ్ పేరిట చాలా మంది అకౌంట్లు పునరుద్ధరణ అయ్యాయి. అందులో ట్రంప్ అకౌంట్ కూడా ఉందన్నది తెలిసిందే. I mean right after @elonmusk called me a troll today, my account verification was taken away, my subscriptions were deactivated and I was banned from being able to buy premium even though I was already paying for premium.Clearly retaliation. https://t.co/fVskKH9Trg— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే తాజాగా లారా ఎలిజబెత్ లూమర్ హెచ్1బీ వీసాల వ్యవహారంతో ఎలాన్ మస్క్నే టార్గెట్ చేయడంపై.. ఆమెపై ఎక్స్(పూర్వపు ట్విటర్) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అకౌంట్ నుంచి బ్లూ టిక్ ఎగిరిపోవడంతో పాటు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరో పోస్ట్ చేశారు. ట్విటర్(ఇప్పుడు ఎక్స్) కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్.. ఇప్పుడు తోక ముడిచారా? అని ఆమె ప్రశ్నించారు. -
భారతీయులకు 10 లక్షలకు పైగా అమెరికా వీసాలు
భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది.గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో చదువుకోవడానికి వెల్లవారు మాత్రమే కాకుండా, సందర్శనార్ధం వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఇటీవల జారీ చేసిన 10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలలో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం.హెచ్-1బీ (H-1B) వీసాల రెన్యువల్కు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అమలు చేసింది. దీని వల్ల ఎంతోమంది భారతీయులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాగా.. గత నాలుగు సంవత్సరాలలో భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే సందర్శకుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. 2024 మొదటి 11 నెలల్లో 20 లక్షల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ యుఎస్ వెళ్లారు. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 26 శాతం ఎక్కువ.ఇప్పటికే 50 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు యుఎస్ని సందర్శించడానికి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వీసాలను ప్రతిరోజూ జారీ చేస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.చదువుకోవడానికి ఇండియా నుంచి అమెరికా (America) వెళ్లే విద్యార్థులకు కూడా వీసాలను జారీ చేస్తున్నారు. ఈ వీసాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అంటే అక్కడ ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు స్పష్టమవుతోంది. 2008 - 2009 విద్యాసంవత్సరంలో అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన దేశంగా 'భారత్' రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 3,31,000 మంది భారతీయులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ఛేంజ్ విజిటల్ వీసాలు పొందిన భారతీయులు కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉండగలుగుతున్నారు. USలో వారి ప్రోగ్రామ్లను పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉండవచ్చు. కాబట్టి ఇది వారి కెరీర్, విద్యను కొనసాగించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్స్ఛేంజ్ విజిటర్స్ స్కిల్స్ లిస్ట్ నుంచి ఇండియాను తొలగించడం వల్ల భారతీయ J-1 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లకు ఎక్కువ సౌలభ్యం లభించింది. మొత్తం మీద భారతదేశం నుంచి అమెరికాకు వివిధ కారణాల వల్ల వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..
చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మార్పులు వీసా ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవతం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అపాయింట్మెంట్ని ఒకసారి రీషెడ్యూల్ చేయవచ్చు. అయితే మీరు రెండోసారి రీషెడ్యూల్ చేసినా లేదా అపాయింట్మెంట్ని మిస్ చేసినా.. మీకు మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ అవసరం. దీనికోసం మీరు మళ్ళీ సుమారు రూ. 15,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.రెండోసారి రీషెడ్యూల్ చేసిన సమయానికి వెళ్తే మళ్ళీ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ రోజున మీరు తప్పకుండా సమయానికి చేరుకోవాలి. అప్పుడే వీసా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని యూఎస్ ఎంబసీ తెలిపింది.హెచ్-1బీ వీసా నిబంధనలలో మార్పులుయూఎస్ హెచ్-1బీ వీసాను చాలామంది దుర్వినియోగం చేస్తున్న కారణంగా.. దీనిని నిరోధించడానికి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందవచ్చు.2025 జనవరి 17 నుంచి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించుకోవాలి. ఈ నిబంధన ప్రకారం.. ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు హెచ్-1బీ వీసా పొందడం కష్టం.సింపుల్గా చెప్పాలంటే, ఐటీ ఫీల్డ్ ఉద్యోగాల కోసం.. మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్లో డిగ్రీని కలిగి ఉంటే మాత్రమే మీకు హెచ్-1బీ వీసా లభిస్తుంది. అంతే కాకుండా.. ఇప్పుడు హెచ్-1బీ వీసా పొడిగింపు ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మునుపటి ఆమోదాల ఆధారంగా పొడిగింపు అభ్యర్థనను ప్రాసెస్ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గడం మాత్రమే కాకుండా.. నిర్ణయాలు త్వరగా వచ్చేస్తాయి. కంపెనీలు కూడా హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది.ఇంటర్వ్యూ మినహాయింపులో మార్పులుఇంటర్వ్యూ మినహాయింపులో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో యూఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఇకపై ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి పాత రికార్డులు ఉపయోగించనున్నారు. ఈ రూల్ తరచుగా యూఎస్ వెళ్లాలనుకునే వారికి ప్రయోజనం చేకూర్చుతుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలుమార్పులు ఎందుకంటే?హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్లో చేసిన ఈ మార్పులు.. టెక్ పరిశ్రమతో సహా కీలక పరిశ్రమల అవసరాలను తీర్చడానికి యూఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చూపిస్తుంది. సిలికాన్ వ్యాలీ.. ఇతర యూఎస్ టెక్ హబ్లకు నైపుణ్యం కలిగిన కార్మికులకు భారతదేశం ప్రధాన వనరు. కాబట్టి.. ఈ మార్పులు బ్యాక్లాగ్ను తగ్గించడానికి మాత్రమే కాకుండా, ఐటీ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతాయి. -
భారతీయులకు బైడెన్ గుడ్న్యూస్.. ఇకపై హెచ్1బీ వీసా ఈజీ!
-
హెచ్–1బీ వీసా సులభతరం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసా కార్యక్రమం కింద వేగంగా ఉపాధి పొందాలనుకునే భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. వేగంగా ఉపాధి కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్–1బీ వీసా నిబంధనల్లో కీలకమార్పులు చేసింది. దీంతో హెచ్–1బీ వీసా పొందడం మునపటితో పోలిస్తే అత్యంత సులభంకానుంది. అమెరికా కంపెనీలు తమ ఉద్యోగాల కోసం విదేశీయులను ఎంపికచేసుకునే ప్రక్రియను సులభతరంచేయడం ఇందుకు మరో కారణం. నైపుణ్య ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీ, అనుమతి ప్రక్రియలను వేగవంతం చేయడం, నిబంధనల సడలింపు ప్రక్రియ వంటి నిర్ణయాలు 2025 జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎఫ్–1 విద్యార్థి వీసాలతో అమెరికాలోకి అడుగుపెట్టిన భారతీయులు ఇకపై సులువుగా తమ వీసాను హెచ్–1బీ వీసాగా మార్చుకోవచ్చు. దీంతో వీరికి అక్కడి కంపెనీలు వేగంగా ఉద్యోగాలు కల్పించేందుకు వీలవుతుంది. థిరిటికల్, టెక్నికల్ నిపుణులుగా వీరికి ఉద్యోగాచ్చేందుకు అక్కడి సంస్థలకు అవకాశం చిక్కుతుంది. అంతర్జాతీయ మార్కెట్లకు తగ్గట్లుగా, ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా అమెరికన్ సంస్థలను తీర్చిదిద్దే లక్ష్యంతో వీసా నిబంధనలను సడలిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మంగళవారం ప్రకటించింది. అమెరికా సంస్థలు కార్మిక కొరత సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 20వ తేదీన నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిరోజుల ముందు బైడెన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వేగ వంతం చేయనుంది. ‘‘హెచ్–1బీ వీసా విధానం ద్వారా అమెరికా సంస్థలు అత్యంత నైపుణ్యమైన ఉద్యోగులకు నియమించుకునే అవకాశాలను విస్తృతంచేశాం. దీంతో అంతర్జాతీయ మేధతో అన్ని రంగాల్లో అమెరికా ఎంతో ప్రయోజనం పొందనుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మంత్రి అలెజాండ్రో ఎన్.మయోర్కాస్ చెప్పారు. ‘‘1990లో హెచ్–1బీ విధానం మొదలెట్టాక అమెరికా దేశ ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా ఈ పద్దతిని నవీకరించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు’’అని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం.జడ్డూ హెచ్–1బీ విధానాన్ని మెచ్చుకున్నారు.భారతీయులకు ఏ రకంగా ఉపయోగం?యూఎస్సీఐఎస్ ద్వారా హోంల్యాండ్ సెక్యూ రిటీ విభాగం ఏటా లాటరీ విధానం ద్వారా కేవలం 65,000 వరకు హెచ్–1బీ వీసాలనే జారీచేసేది. అడ్వాన్స్డ్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉన్న సందర్భాల్లో మరో 20వేల హెచ్– 1బీ వీసాలనే ఇచ్చేది. ఈ కోటా పరిమితి అనేది ఇన్నాళ్లూ లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు లేదు. దీంతో ఈ నిబంధనలోని లొసుగును దుర్వినియోగం చేస్తూ చాలా మంది ‘రీసెర్చ్’మాటున వీసాలు సాధించారని, దీంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్య అభ్యర్థులకు లాటరీ ద్వారా వీసా పొందే అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపణలు ఉండేవి. దీంతో వీటికి చెక్ పెడుతూ ఇకపై లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు తొలిసారిగా కోటా పరిమితిని విధి స్తూ, కోటాను నిర్వచిస్తూ నిబంధనల్లో మా ర్పులు తెచ్చారు. దీంతో నాన్ప్రాఫిట్, గవర్న మెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి పోటీ తగ్గి ఆ మేరకు భారతీయులకు లాటరీలో అధిక ప్రా ధాన్యత, లబ్ధిచేకూరుతుందని భావిస్తున్నా రు. ప్రతి ఏటా హెచ్–1బీ వీసా పొందుతున్న వారిలో భారత్, చైనా దేశస్థులే అధికంగా ఉంటున్నారు. -
హెచ్-1బీ వీసా : భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత ఆమెరికాలో ఉండే భారతీయులు, అక్కడ చదువుకునే భారతీయ విద్యార్థుల భవితపై అనే సందేహాలు నెలకొన్ని నేపథ్యంలో యూఎస్ ప్రకటన లక్షలాది మంది భారతీయ టెకీల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను సడలించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసా ప్రోగ్రామ్ను ఆధునీకరించే నిర్ణయాన్ని ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ చెప్పారు.హెచ్ 1 బీ వీసా : కీలకమైన అప్డేట్స్F-1 విద్యార్థి వీసాదారులు, ఉద్యోగాలు, H-1B స్థితికి మారడం, తద్వారా అమెరికాలో కొనసాగడం వంటి మార్పులు ఉండనున్నాయి.దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫారంను ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించాలి. దీంతో వీసాల జారీలో దుర్వినియోగాన్ని తగ్గించాలనేది లక్ష్యం.అంతేకాదు హెచ్1 బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసా (VISA) లను రద్దు చేసే అధికారం మరింత ఉంటుంది. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ ను మరింత సరళతరం చేయ నున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని విస్తరించవచ్చు, పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు.గతంలో H-1B వీసాకు అనుమతి లభించినవారి ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. కొన్ని షరతులతో పిటిషన్ సంస్థపై నియంత్రణ ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు అర్హతను పొడిగిస్తుంది.కాగా ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతీ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు H-1B వీసాలపై ఆధారపడతాయి. హెచ్-1బీ వీసా హోల్డర్లలో సింహభాగం భారతదేశానికి చెందినవారే. 2023లో, జారీ చేసిన వీసాల్లో భారతీయులు 72.3శాతంఉన్నారు.H-1B వీసా దరఖాస్తులు తరచుగా వార్షిక పరిమితిని మించిపోవడంతో వీసాలు లాటరీ విధానంద్వారా కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది నష్టపోతున్న సంగతి తెలిసిందే. -
అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..
గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా.. 2023–24లో ఈ సంఖ్య 3,31,602కి చేరింది. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. – రెబెకా డ్రామ్ ఏయూ క్యాంపస్: గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కార్యాలయం కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాన్సులేట్ నుంచి రోజుకి సగటున 1,600 వరకు వీసాలు ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాన్సులేట్లో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.వచ్చే ఏడాది సిబ్బందిని మూడు రెట్లు పెంచి రోజుకు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అమెరికా–భారత్ సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా రెబెకా డ్రామ్ ఇంకా ఏమన్నారంటే..అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు..అమెరికా నుంచి భారత్కు వచ్చిన విద్యార్థుల్లో 303.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 336 మంది రాగా ఈ సంవత్సరం 1,355 మంది వచ్చారు. ప్రస్తుతం 8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్లో ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13 శాతం వృద్ధితో 3,31,602కి చేరింది. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులకు అత్యధిక శాతం మంది విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ గతేడాది 35 వేలు, ఈ ఏడాది 47 వేల స్టూడెంట్ వీసా ఇంటర్వూ్యలు నిర్వహించింది.బీ1, బీ2 వీసాలకు గరిష్టంగా ఏడాది కాలం.. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. గతేడాది భారత్లో 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశాం. పైలట్ ప్రోగ్రామ్గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.స్టెమ్ కోర్సులనే ఎక్కువగా చదువుతున్నారు.. అమెరికా కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి అలెక్స్ మెక్లీన్ మాట్లాడుతూ.. తమ దేశానికి వస్తున్న విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెడిసిన్ (స్టెమ్) కోర్సులను ఎక్కువగా చదువుతున్నారని తెలిపారు. యూఎస్లో ఉన్నత విద్యకు విద్యార్థులను పంపే దేశాల జాబితాలో ఈ ఏడాది భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ భాగస్వామ్యం అమెరికాను ఎంతో బలోపేతం చేస్తుందన్నారు. అమెరికాకు వస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని చెప్పారు.మహిళలను సైతం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్పై స్పందిస్తూ ఈ కేంద్రం ఎంతో బాగా పనిచేస్తోందని తెలిపారు. తరచూ ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది అమెరికన్ నావికా సిబ్బంది ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఎన్సీసీ విద్యార్థినులతో మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రెండు దేశాల సంస్కృతుల మధ్య కొంత వైవిధ్యం ఉంటుందని.. వీటిని అలవాటు చేసుకోవడం, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి తాము పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు. -
హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం తిప్పలు!
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అంటే అందరికీ కాదులెండి కొంత మందికి మాత్రమే. అమెరికా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వీసా. ఇది లేకపోతే అక్కడికి వెళ్లడం కుదరని అందరికీ తెలుసు. యూఎస్ వీసా రావాలంటే ఎంత కష్టపడాలో తెలుకోవాలంటే.. అది దక్కించుకున్న వారిని అడిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. యూఎస్ వీసా దక్కించుకోవడానికే కాదు.. రెన్యువల్ కూడా కష్టపడాల్సి వస్తోందట. ఈ విషయాన్ని ఓ ఎన్నారై సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీసా రెన్యువల్ కష్టాలను పీడకలగా పేర్కొంటూ ‘రెడిట్’లో తన వ్యథను వ్యక్తపరిచాడు.హెచ్1బీ వీసా రెన్యువల్ (H1B visa renewal) కోసం ముప్పు తిప్పలు పడుతున్నట్టు అమెరికాలోని భారత పౌరుడొకరు వాపోయాడు. తనలాగే ఎవరైనా ఉంటే బాధలు పంచుకోవాలని కోరాడు. ‘నెల రోజుల నుంచి హెచ్1బీ డ్రాప్బాక్స్ వీసా స్లాట్ల కోసం వెతుకుతున్నాను. నవంబర్లోపు స్టాంప్ వేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాలి. కానీ డ్రాప్బాక్స్ వీసా స్లాట్ దొరికేట్టు కనబడడం లేదు. ఈ పరిస్థితి నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రెన్యువల్ స్లాట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. నాలాగే ఎవరైనా ఉన్నారా? మనం ఇప్పుడు ఏం చేయాల’ని తన గోడు వెళ్లబోసుకున్నాడు.తాము కూడా వీసా రెన్యువల్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నామంటూ పలువురు ఎన్నారైలు స్పందించారు. ‘నేను కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను. నవంబర్ లేదా డిసెంబర్ స్లాట్ల కోసం వెతుకుతున్నా.. కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. నేను ఎలాగైనా ఇండియా వెళ్లాలి. డ్రాప్బాక్స్ వీసా స్లాట్స్ త్వరలో విడుదలవుతాయని ఆశిస్తున్నాన’ని ఒకరు తెలిపారు. ‘వీసా రెన్యువల్ కోసం వేలాది మంది ఆగస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు. నవంబర్, డిసెంబర్ స్లాట్లను జూలైలో తెరిచారు. మరికొన్ని స్లాట్ కూడా త్వరలో విడుదలవుతాయి. కానీ స్లాట్లు దొరకడం కష్టమ’ని మరొకరు పేర్కొన్నారు. డ్రాప్బాక్స్ వీసా స్లాట్స్ గ్యారంటీ లేకపోవడంతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేకపోతున్నామని ఇంకొరు వాపోయారు.డ్రాప్బాక్స్ స్కీమ్ అంటే?డ్రాప్బాక్స్ స్కీమ్ ప్రకారం దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరుకాకుండా వీసా పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. భారత పౌరులు సమర్పించిన పత్రాలను చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ ప్రాసెస్ చేస్తుంది. రెన్యువల్ కోసం దరఖాస్తుదారులు తమ పత్రాలను భారతదేశంలోని వీసా కేంద్రాలలో ఎక్కడైనా సమర్పించేందుకు వీలుంది. అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసా వినియోగదారులు తమ డ్రాప్బాక్స్ అపాయింట్మెంట్ల కోసం ఇండియాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ కేవలం 2 రోజుల ముందు స్లాట్లు విడుదల చేస్తోంది. దీంతో అమెరికా నుంచి ఇండియా రావడానికి హెచ్1బీ వీసా వినియోగదారులు కష్టపడాల్సి వస్తోంది. H1B Dropbox Visa Slots for India are a Nightmare!byu/AccomplishedPolicy94 inusvisaschedulingచదవండి: హిట్లర్ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్కు బిగ్ బూస్ట్ -
తెలుగు విద్యార్థుల డెస్టినేషన్గా యూఎస్
సాక్షి హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ డెస్టినేషన్గా అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్ చదువుల కోసం బ్యాగ్లు సర్దిపెట్టుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ఆధారంగా 2016తో పోల్చితే 2024 నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, డల్లాస్, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, వర్జీనియా, అట్లాంటా, ఫ్లోరిడా, జార్జియా, నాష్విల్లే తదితర సిటీల్లో తెలుగు వారి ప్రాబల్యం వేగంగా పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంతలా ఉందంటే యూఎస్లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు 350 ఉండగా అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.ఐటీ, ఫైనాన్స్ రంగాలపై ఆసక్తి.. అమెరికా వెళుతున్న వారిలో దాదాపు 75 శాతం పైగా ఇక్కడ ఇక్కడే స్థిరపడుతున్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగు వారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. అయితే 80 శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫైనాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. 3.2 లక్షల నుంచి 12.3 లక్షల వరకు.. యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2016 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షల మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 12.3 లక్షలకు చేరింది. గతంలో వెళ్లి స్థిరపడిన నాలుగు తరాలకు చెందిన తెలుగు వారు, ఇటీవల కొత్తగా వెళ్లిన వారు సైతం అంతా అమెరికాను తమ సొంత ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోరి్నయాలో 2 లక్షల మంది ఉండగా, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్ 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.హిందీ, గుజరాతీ, తరువాతి స్థానంలో తెలుగు.. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 విదేశీ భాషలు వాడుకలో ఉండగా అందులో తెలుగు భాష 11 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్యా ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారని ఉత్తర అమెరికా తెలుగు భాషా సంఘం మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. -
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
అమెరికా హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భారత్లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్ ఫీజులను పెంచింది అమెరికా.రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజు తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను రూ.3లక్షల నుంచి (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు ( 11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.వీసా దారుడిపై అదనపు భారంఫలితంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులపై కోర్టులో వాదనలుదీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. భారత్ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్ ఒకరు. ఇది అమెరికాకే నష్టంఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. భిన్నాభిప్రాయలు వ్యక్తం ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు. -
హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే–ఆఫ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్ సిటిజెన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. హెచ్–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్–ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్గా మారొచ్చు. అంటే హెచ్–4, ఎల్–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్ ఆథరైజేషన్) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్(ఎఫ్–1), విటిటర్ (బి–1/బి–2) స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్ పిరియడ్లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ సూచించింది. -
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
అగ్రరాజ్యం అమెరికా హెచ్-1 బీ వీసాలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే అంచనాలు,పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభం, ప్రాజెక్ట్ల కొరత, చాపకింద నీరులా ఏఐ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా చోటోమోటా స్టార్టప్స్ నుంచి బడబడా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికాలో ఉంటూ లేఆఫ్స్కు గురైన హె-1బీ వీసా దారుల కోసం యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్)కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.ఫలితంగా లేఆఫ్స్ గురైన విదేశీయులు 60 రోజుల గ్రేస్ పిరయడ్ కంటే ఎక్కువ రోజులు అమెరికాలో నివసించేందుకు అవకాశం కలగనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రేస్ పిరయడ్లో నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్చుకునేందుకు అప్లయ్ చేసుకోవచ్చు.స్టేటస్ అప్లికేషన్ను అడ్జెస్ట్మెంట్ చేయాలని కోరుతూ ఫైల్ చేయొచ్చు. ఉద్యోగులు ఏడాది పాటు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)అర్హత పొందేలా ధరఖాస్తు ఫైల్ చేసుకోవచ్చు. దీంతో పలు హెచ్1-బీ వీసాలో కొత్త మార్పులు చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. -
అమెరికా వెళ్లేవారికి అలర్ట్: కొత్త ఫీజులు రేపటి నుంచే..
అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది. 8 ఏళ్ల తర్వాత పెంపు అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫీజుల పెంపుదల జరుగుతోంది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. వీసాల పెంపుదల తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. వీసా కొత్త ఫీజులు ఇలా.. కొత్త హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, దీని కోసం ఫారమ్ I-129 ఉంటుంది. దీని రుసుము 460 డాలర్లు నుండి 780 డాలర్లకు పెరగనుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,000 నుంచి రూ.64,000కు పైగా పెరుగుతుంది. ఇది కాకుండా హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లు(రూ. 829) నుంచి 215 డాలర్లు (సుమారు రూ. 17,000) పెరుగుతుంది. ఇక ఎల్-1 వీసా రుసుము ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ. 38,000) ఉంది. ఇది ఏప్రిల్ 1 నుండి 1385 డాలర్లకు (రూ. 1,10,000) పెరుగుతుందని అంచనా. ఎల్-1 అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కింద వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు. అలాగే ఈబీ-5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం 3675 డాలర్లు (దాదాపు రూ. 3 లక్షలు) ఉండగా 11160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగవచ్చని అంచనా. ఈబీ-5 వీసాను 1990లో యూఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాలలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా ఈ వ్యాపారం ఉండాలి. -
గుడ్న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు
వాషింగ్టన్: 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువును యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పొడిగించింది. మార్చి 22వ తేదీతో ఈ గడువు ముగియనుండగా మరో మూడు రోజులు అంటే మార్చి 25 వరకూ పొడిగించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గడువును యూఎస్సీఐఎస్ పొడిగించింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్-1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్–1బీ రిజిస్ట్రేషన్కు ఆఖరు తేదీ మార్చి 22
వాషింగ్టన్: 2025వ సంవత్సరానికి గాను హెచ్–1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువు మార్చి 22వ తేదీతో ముగియనుందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. అదేవిధంగా, హెచ్–1బీ క్యాప్ పిటిషన్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. నాన్ క్యాప్ దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉండే తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్–1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్-1బీ వీసా ప్రక్రియ ఇక మరింత సులభతరం!
హెచ్-1బీ వీసా కోసం అప్లయ్ చేశారా? ప్రాజెక్ట్ నిమిత్తం అమెరికాకు వెళ్లే యోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. హెచ్1- బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను సులభతరం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ఫిబ్రవరి 28,2024న యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ విభాగం (యూఎస్సీఐఎస్) మైయూఎస్సీఐఎస్ పేరుతో కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పద్దతిలో హెచ్-1బీ వీసా ప్రాసెస్ మరింత సులభ తరం అయ్యేలా ఆర్గనైజేషనల్ అకౌంట్ను వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది. హెచ్-1బీ వీసా ప్రాసెస్ వేగవంతం ప్రపంచ వ్యాపంగా ఆయా కంపెనీలు తమ ప్రాజెక్ట్ల నిమిత్తం ఉద్యోగుల్ని అమెరికాకు పంపిస్తుంటాయి. ఇందుకోసం ఉద్యోగులు హెచ్-1బీ వీసా తప్పని సరిగా ఉండాలి. ఇప్పుడు ఆ హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేగవంతం జరిగేలా చర్యలు తీసుకుంది జోబైడెన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా మైయూఎస్సీఐఎస్లోని ఆర్గనైజేషనల్ అకౌంట్లో సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు, లీగల్ అడ్వైజర్లు హెచ్1-బీ వీసా రిజిస్ట్రేషన్, హెచ్-1బీ పిటిషిన్ ప్రాసెస్ చేయొచ్చు. కొత్త పద్దతి హెచ్-1బీ వీసా పిటిషనర్లకు వరం జోబైడెన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మైయూఎస్సీఐఎస్ ఈ కొత్త వీసా పద్దతి హెచ్-1బీ వీసా పిటిషనర్లకు వరంగా మారుతుందని వీసా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వీసా ప్రాసెస్లో సంస్థలే హెచ్-1బీ ప్రాసెస్ చేసుకోవచ్చు.హెచ్-1బీ రిజిస్ట్రేషన్, పిటిషన్స్తో పాటు ఫారమ్ ఐ-907కి సంబంధించిన కార్యకలాపాల్ని చక్కబెట్టుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు అంతేకాదు మైయూఎస్సీఐఎస్ ఉన్న డేటా ఆధారంగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అధికారులు వలసదారుల (noncitizens) అర్హతని బట్టి ఇచ్చే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు కల్పించాలా? వద్దా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని యూఎస్సీఐఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దశ చాలా అవసరం మార్చి 2024 నుండి సంస్థలు హెచ్-1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో పాల్గొనడానికి కొత్త ఆర్గనైజేషనల్ అకౌంట్ను క్రియేట్ చేయాలి. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ పిటిషన్లను ఫైల్ చేయాలనుకుంటున్న వారికి ఈ దశ చాలా అవసరం. ఫారమ్ ఐ-907 అంటే? ఇందులో కొత్త మొత్తాన్ని చెల్లించి వీసా ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులు పొందవచ్చు. ఉదాహరణకు పిటిషన్స్, అప్లికేషన్లు. హెచ్-1బీ రిజిస్ట్రేషన్, హెచ్-1బీ పిటిషన్స్ అంటే? ఉదాహరణకు భారతీయులు అమెరికాలో ఏదైనా సంస్థలో పనిచేయాలనే వారికి హెచ్-1బీ వర్క్ పర్మిట్ తప్పని సరి. ఈ హెచ్-1బీ వీసా అప్లయ్ చేయడాన్ని హెచ్-1బీ రిజిస్ట్రేషన్ అంటారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎంపికైనా అభ్యర్ధులకు తర్వాత జరిగే ప్రాసెస్ను హెచ్-1బీ పిటిషన్ అని అంటారు. -
జోబైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హెచ్-4 వీసా దారులకు భారీ ఊరట!
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-4 వీసా దారులకు ‘ఆటోమేటిక్గా వర్క్ ఆథరైజేషన్’ విధానాన్ని అమలు చేయనుంది. తద్వారా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. హెచ్1- బీ వీసా దారులైన భార్య భర్తలు వారి 21ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా హెచ్-4 వీసాను జారీ చేస్తుంటారు. ఈ వీసా ఉంటే సరిపోదు ఉద్యోగం చేసేందుకు వీలుగా తప్పని సరిగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ధరఖాస్తు అనంతరం అధికారులు ఆథరైజేషన్ చేస్తారు. కానీ ఇక్కడే హెచ్-4 వీసా దారులకు ఆథరైజేషన్ సమయం ఎక్కువ కావడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఈ నేపథ్యంలో వారికి లబ్ధి చేకూరేలో జోబైడెన్ ప్రభుత్వం హెచ్-4 వీసా దారులు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ధరఖాస్తు ప్రక్రియను మరింత సులభ తరం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా, అమెరికన్ సెనెట్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో ‘జాతీయ భద్రతా ఒప్పందానికి’ ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్-4 వీసాదారులకు ఆటోమేటిక్గా వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు వైట్హౌట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా హెచ్-4 వీసా దారులకు లబ్ధి చేకూరుతుందని జోబైడెన్ తెలిపారు. -
వీసా ఫీజులు పెంచిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1, ఈబీ–5 తదితర నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు ప్రకారం..భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్–1బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెరిగింది. హెచ్–1బీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 10 అమెరికన్ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. అదే విధంగా, ఎల్–1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతమున్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం బుధవారం ఒక నోటిఫికేషన్లో వివరించింది. 2016 తర్వాత మొదటిసారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. -
‘హెచ్-1బీ వీసా’.. ఆన్లైన్ ఫైలింగ్పై కీలక అప్డేట్!
అగ్రరాజ్యం అమెరికా వీసాల పునరుద్దరణ, జారీ వంటి అంశాలపై వరుస ప్రకటనలు చేస్తోంది. కొద్ది రోజుల స్వల్ప వ్యవధిలో భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు ఎన్ని వీసాలు జారీ చేసిందో తెలిపింది. ఆ తర్వాత హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే తాజాగా, ఈ ఏడాది 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1 బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులు చేసింది. కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. అవేంటనేది ఒక్కసారి పరిశీలిస్తే ♦2025 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ రిజిస్ట్రేషన్ వ్యవధి 2024 మార్చి 6 నుంచి ప్రారంభమై మార్చి 21 వరకు ఉంటుంది. దీనిని వీసా ఇన్షియల్ రిజిస్ట్రేషన్ పిరియడ్ అంటారు. ఈ స్వల్ప వ్యవధిలో సంస్థలు హెచ్ -1 బీ వీసా స్పాన్సర్ చేయాలనుకునే తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను సమర్పించాలి. ♦ప్రతి ఏటా కేవలం 65 వేల హెచ్-1బీ వీసాలను మాత్రమే యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యంసించిన 20 వేల మంది విదేశీ విద్యార్ధులకు ఈ వీసాలను అందజేస్తుంది. ♦ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం 2025లో సైతం నిబంధనలకు లోబడి 65 వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తామని తెలిపింది. యూఎస్సీఐఎస్ విభాగం హెచ్-1 బీ వీసాల ధరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1న (ఆర్ధిక సంవత్సరం) నుంచి చేపట్టనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ♦అక్టోబర్ నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తూ, మోసాలను తగ్గించేలా వీసా జారీలపై కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ♦ఇక ఈ వీసాల కోసం ధరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పుడు ధృవీకరణ పత్రాలు లేదంటే లేదా చెల్లని డాక్యుమెంట్లను జత చేస్తే హెచ్-1బీ ధరఖాస్తులను తిరస్కరించడం లేదా రద్దు చేయడం జరుగుతుందని యూఎస్సీఐఎస్ అధికారులు సూచిస్తున్నారు. ♦ఈ ఏడాది ప్రత్యేకం హెచ్-1 బీ వీసా అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అందులో మోసాలకు చెక్పెట్టేలా ఆర్గనైజేషనల్ అకౌంట్స్ విధానాన్ని ప్రారంభించనుంది. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థలోని ఉద్యోగులకు హెచ్-1 బీ వీసా అప్లికేషన్ను రూపొందించే ప్రక్రియలో ఆయా వ్యాపార సంస్థలు, న్యాయ సలహాదారులు ఈ అకౌంట్స్ ద్వారా సమన్వయం చేసుకునే వీలు లభిస్తుంది. ఈ అకౌంట్ ద్వారా, నాన్ ఇమిగ్రంట్ వర్కర్ కోసం సమర్పించే ఫామ్ ఐ 129 (I-129), ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్కు అవకాశం కల్పించే ఫామ్ ఐ 907 (I-907) లను సులభంగా అప్లై చేయవచ్చు. ♦ఈ విధానం ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని, ఇది హెచ్ 1 బీ వీసా ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో ఒక ముందడుగు గా భావిస్తున్నామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. ♦ఐ -129, హెచ్ -1 బి పిటిషన్ల ఆన్ లైన్ ఫైలింగ్ను ప్రారంభించిన తర్వాత, మొత్తం హెచ్ -1 బీ అప్లికేషన్ విధానం పూర్తిగా ఎలక్ట్రానిక్ అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నుంచి, అప్లికేషన్ పై తీసుకున్న తుది నిర్ణయాన్ని విదేశాంగ శాఖకు తెలియజేసే వరకు అంతా ఆన్ లైన్ అవుతుందని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. చదవండి👉 ‘హెచ్-1బీ వీసా’.. జోబైడెన్ ప్రభుత్వం కీలక ప్రకటన! -
‘హెచ్-1బీ వీసా’.. జోబైడెన్ ప్రభుత్వం కీలక ప్రకటన!
హెచ్ -1బీ వీసా రెన్యువల్పై అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు ఉద్యోగ ప్రయోజనాల కోసం దేశంలో తాత్కాలికంగా ఉండేందుకు వీలు కల్పించే హెచ్-1బీ వీసాను ఇక్కడే (అమెరికాలో) ఉండి తమ వీసాల పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవాలని కోరింది. పాస్ పోర్ట్, వీసా మంజూరు, రెన్యువల్ చేసే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కార్యాలయం ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ డ్రైవ్లో ప్రారంభ దశలో 20,000 మంది దరఖాస్తుదారులు వీసా రెన్యువల్కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం, పైలట్ డ్రైవ్ కింద వీసా రెన్వువల్ చేసుకునేలా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో వెసులు బాటు ఉంది. కానీ వీసా రెన్యువల్ కోసం దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల ప్రారంభంలో స్టేట్ డిపార్ట్మెంట్ షేర్ చేసిన నిబంధనల ప్రకారం 20,000 మంది దరఖాస్తుదారులు ప్రస్తుతం యుఎస్లో ఉండాలి. పునరుద్ధరణ ప్రక్రియ సమయంలో దేశం విడిచి వెళ్లకూడదు. హెచ్-1బీ వీసా కోసం దేశం వదిలి ప్రస్తుతం అమెరికన్ టెక్ సెక్టార్లో ఎక్కువ మంది భారతీయ నిపుణులే ఉన్నారు. వారికి అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా అందిస్తుంది. ఈ వీసా వ్యవధి ఆరేళ్లు మాత్రమే. ఆరేళ్ల తర్వాత రెన్యువల్ కోసం మన దేశానికి వచ్చి చేసుకోవాల్సి ఉంటుంది. వీసా రెన్యువల్ కోసం తప్పని తిప్పలు అయితే, వీసాల పునరుద్ధరణ సమయంలో భారతీయులకు అనేక ఇబ్బందులు తలెత్తుతుండేవి. ఒక్కసారి హెచ్-1బీ వీసా రెన్యువల్ కాకపోతే భార్య, పిల్లలతో కలిసి అమెరికాను వదిలి సొంత దేశమైన భారత్కు రావాల్సి వచ్చేది. దీంతో ప్రతి ఏడాది అమెరికాలో నివసిస్తున్న లక్షల మంది భారతీయులు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. మోదీ పర్యటన.. రూల్స్ పక్కన పెట్టిన అమెరికా ప్రధాని మోదీ గత ఏడాది అమెరికా పర్యటించారు. పర్యటన అనంతరం జోబైడెన్ ప్రభుత్వ దాదాపూ 20 ఏళ్లగా అమలు చేస్తున్న నియమనిబంధనలు పక్కన పెట్టేసింది. వీసా రెన్యువల్ కోసం అమెరికాను వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే ఉండి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హెచ్-1బీ వీసా పునరుద్ధరణ కోసం పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. 2022లో మొత్తం 3.2 లక్షల హెచ్-1బీ వీసాలు ఇక మోదీ ఎఫెక్ట్తో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు హెచ్-1బీ వీసా రెన్యువల్తో పాటు, వీసాల జారీ విషయంలో ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్షిప్ సర్వీసెస్ (USCIS) ప్రకారం జారీ 2022లో అగ్రరాజ్యం వలసదారులకు 4.41 లక్షల హెచ్-1బీ వీసాలను జారీ చేయగా.. అందులో భారతీయులు 3.2 లక్షల మంది పొందారు. -
భారతీయులకు మరో శుభవార్త.. యూఎస్ వీసాల జారీలో సరికొత్త రికార్డులు!
భారత్లో యూఎస్ వీసాల జారీలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో వీసాల మంజూరు 60 శాతం పెరిగాయి. బీ1, బీ2 విజిటింగ్ వీసాల కింద దాదాపు 7లక్షల వీసాలు జారీ చేయగా.. లక్షా 40 వేల స్టూడెంట్ వీసాలు జారీ చేసింది అమెరికన్ ఎంబసీ. ఫలితంగా విజిటర్ వీసా అపాయింట్మెంట్ కోసం నిరీక్షించే సమయం 75 శాతం తగ్గింది. గత ఏడాది ఏకంగా 1.4 మిలియన్ యూఎస్ వీసాల్ని అందించింది. ఈ ఏడాది హెచ్1బీ వీసాల మంజూరును పరిశీలిస్తామని యూఎస్ ఎంబసీ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రతి 10 వీసాల్లో ఒకరిది భారతీయులదేనని తెలిపింది. నిరీక్షణ సమయం తగ్గింది ప్రాసెస్ మెరుగుదల,పెట్టుబడుల కారణంగా విజిటింగ్ వీసాల కోసం అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని సగటున 1,000 రోజుల నుండి 250 రోజులకు తగ్గించాయి. దీంతో విజిటింగ్ వీసాలు (B1/B2) యూఎస్ ఎంబసీ చరిత్రలో రెండవ సారి 7లక్షల కంటే అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. విదేశీ విద్యార్ధుల్లో భారతీయులే అధికం భారత్లోని యుఎస్ కాన్సులర్ బృందం 2023లో 1,40,000 స్టూడెంట్ వీసాలను జారీ చేసింది. ఈ మంజూరు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారీ మొత్తంలో భారతీయులకు మంజూరు చేసి వరుసగా మూడవ సంవత్సరం రికార్డు సృష్టించింది.తద్వారా అమెరికాలోని అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే ఎక్కువమంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్లో చదువుతున్న ఒక మిలియన్ విదేశీ విద్యార్థులలో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. హెచ్1బీ వీసా దారలు సైతం 2023లో భారతీయులు, వారి కుటుంబ సభ్యుల కోసం 3,80,000 ఉద్యోగ వీసాలకు ప్రాసెసింగ్ చేయాల్సి వచ్చింది. యూఎస్ మిషన్కు కనీస అపాయింట్మెంట్ వెయిట్ టైమ్ని తగ్గించేందుకు వీలుగా కాన్సులర్ బృందం భారత్లోని చెన్నై, హైదరాబాద్లలో పిటిషన్ ఆధారిత వీసా ప్రాసెసింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది. మరోవైపు ఈ సంవత్సరం పైలట్ ప్రోగ్రామ్ అర్హతగల హెచ్1 బీ హోల్డర్లను యునైటెడ్ స్టేట్స్లో వారి వీసాలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది. భారతీయులకు శుభవార్త మహమ్మారి కారణంగా ఆలస్యం అయిన 31,000 ఇమ్మిగ్రెంట్ వీసా క్యూను యూఎస్ ముంబై కాన్సులేట్ జనరల్ తగ్గించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్ను కలిగి ఉన్నవారు, షెడ్యూలింగ్ కోసం సిద్ధంగా ఉన్న అభ్యర్ధులు ఇప్పుడు స్టాండర్డ్, ప్రీ-పాండమిక్ అపాయింట్మెంట్ విండోలో అపాయింట్మెంట్ పొందవచ్చని ఈ సందర్భంగా వీసా కోసం ఎదురు చూస్తున్నవారికి ఎంబసీ శుభవార్త చెప్పింది. -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన!
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా ధరఖాస్తుల కోసం ఆన్లైన్ ఫైలింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని తెలిపింది. దీంతో పాటు హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ల సమర్పణను ప్రారంభించే ఆర్గనైజేషనల్ అకౌంట్స్ను ప్రారంభించనుంది. వీటిని సంస్థాగత ఖాతాలు అని పిలుస్తారు. సంస్థాగత ఖాతాల్లో ఒక సంస్థ లేదా ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వారి కోసం సంస్థ తరుపున పనిచేసే న్యాయపరమైన వ్యవహారాలు చూసుకునే ప్రతినిధులను హెచ్ -1బీ రిజిస్ట్రేషన్లు, ఫారమ్ ఐ-129, వలసేతర వర్కర్ కోసం ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తుదారుల కోసం ఫారమ్-ఐ 907ను అనుమతి ఇస్తుంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) విభాగాల్లో కీలక మార్పులు చేటుచేసుకున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఫీచర్లు: హెచ్-1బీ రిజిస్ట్రెంట్ ఖాతాలతో చట్టపరమైన ప్రతినిధులు, సంస్థల కోసం సంస్థాగత ఖాతాలు మెరుగైన డిజైన్ కేస్ మేనేజ్మెంట్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఫైలింగ్ ఆప్షన్స్ : హెచ్-1బీ పిటిషనర్లు తమ సంస్థ ఖాతాల ద్వారా ఫారమ్లు ఐ-129, అనుబంధిత ఫారమ్ ఐ-907 ప్రీమియం ప్రాసెసింగ్ అభ్యర్థనలను ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు. ఆన్లైన్ ఫైలింగ్ కోసం చట్టపరమైన ప్రతినిధి ద్వారా చేసుకోవచ్చు. లేదంటే పేపర్ ఆధారిత ఫైలింగ్ని ఎంచుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ : హెచ్-1బీ వీసా నమోదు ప్రక్రియ ప్రత్యేకంగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. యూజర్ ఫీడ్ బ్యాక్ : యూఎస్సీఐఎస్ వివిధ స్టేక్ హోల్డర్స్తో కలిసి యుజబిలిటి టెస్టింగ్ను నిర్వహించనుంది. ఫలితంగా ఆర్గనైజేషనల్ అకౌంట్ పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కంటిన్యూడ్ ఫీడ్బ్యాక్ : యూఎస్ సీఐఎస్ వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించి, యూజర్ ఎక్స్పీరీయన్స్ను అందించే ప్రయత్నాలు చేయనుంది. నేషనల్ ఎంగేజ్మెంట్: యూఎస్సీఐఎస్ జనవరి 23, జనవరి 24న నేషనల్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రక్రియ ద్వారా సంస్థలు, చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశం చేసేందుకు సంస్థాగత ఖాతాల సమాచారాన్ని అందిస్తుంది. ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ : హెచ్-1బీ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తులను సమాచార సెషన్లకు హాజరు కావడానికి యూఎస్సీఐఎస్ ప్రోత్సహిస్తుంది. సంస్థాగత ఖాతాలు, ఆన్లైన్ ఫైలింగ్ వివరాలు హెచ్ -1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజీలో అందుబాటులో ఉంటాయి. -
అమెరికన్ వీసా మంజూరులో మార్పులు.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
డాలర్ డ్రీమ్ను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి పౌరుడి కలల్ని నిజం చేసేలా అమెరికా ప్రభుత్వం వీసాల మంజూరులో తగు మార్పులు చేస్తూ వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో 2023 వీసాల జారీ అంశంలో జోబైడెన్ ప్రభుత్వం ఏయే మార్పులు చేసిందో తెలుసుకుందాం. హెచ్-1బీ, ఈబీ-5, స్టూడెంట్ వీసాలు (ఎఫ్, ఎం, జే) సహా వివిధ కేటగిరీలను ప్రభావితం చేసేలా 2023లో గణనీయమైన మార్పులు చేసింది. వాటిల్లో హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే టెక్నాలజీ రంగాల్లో ప్రతిభావంతులైన నిపుణులకు హెచ్-1 బీ వీసా తప్పని సరి. ఇప్పుడీ వీసాల పునరుద్ధరణ కోసం ఈ ఏడాది పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. జనవరిలో అమెరికా విదేశాంగ శాఖ హెచ్-1బీ డొమెస్టిక్ వీసా రెన్యువల్ పైలట్ను పరిమితంగా ప్రవేశపెట్టి 20,000 మందిని తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు వీసా రెన్యూవల్ కోసం వారి దేశానికి వెళ్లే పనిలేకుండా తమ దేశంలోనే రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే వారి జీవిత భాగస్వాములు ఈ ప్రక్రియకు అనర్హులుగా గుర్తించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లలో అధిక ప్రాతినిధ్యాన్ని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం 2023లో కఠిన చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. అయితే ఇప్పుడు యజమానులు ప్రతి నమోదుదారుకు పాస్ పోర్ట్ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నో పేపర్.. ఇకపై అంతా అన్లైన్ 2023లో అమెరికా ప్రభుత్వం వీసా ధరఖాస్తును ఆన్లైన్లోనే చేసుకునే వెసలు బాటు కల్పించింది. పేపర్ వర్క్ వల్ల చిన్న చిన్న పొరపాట్లు తలెత్తి వీసా రిజెక్ట్లు అవుతున్న సందర్భాలు అనేకం. దీని వల్ల అభ్యర్ధులు అమెరికాకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించేలా పేపర్పై ధరఖాస్తు చేసుకోవడాన్ని తగ్గించింది. ఆన్లైన్లో వీసా ప్రాసెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈబీ-5 వీసా దరఖాస్తుదారులకు అక్టోబర్ 2023 లో, యూఎస్ఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) ఈబీ -5 వీసా విధానంలో మార్పులు చేసింది. ఎవరైతే ఈబీ-5 వీసా పొంది దాన్ని రీఎంబర్స్మెంట్ చేయించుకున్న రెండేళ్ల తర్వాత గ్రీన్ కార్డ్కు అర్హులుగా గుర్తిస్తుంది. ఈ ఏడాది ఈబీ-5 వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగాన్ని కూడా యూఎస్ సీఐఎస్ గణనీయంగా పెంచింది. ఈబీ–5 వీసా అంటే.. అమెరికాలో గ్రీన్కార్డ్కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో యూఎస్సీఐఎస్ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది. స్టూడెంట్ వీసా పాలసీల అప్ డేట్ అమెరికన్ కాన్సులర్ అధికారులు చేసే వీసా ప్రాసెసింగ్కు సంబంధించిన ఖర్చులకు అనుగుణంగా ఎఫ్, ఎం, జే వీసాల ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు జోబైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక, కాన్సులర్ అధికారులు ఇప్పుడు విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలిస్తారని తెలిపింది. -
అమెరికాలోనే హెచ్–1బీ వీసాల రెన్యూవల్
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు అమెరికా స్టేట్ ఫర్ వీసా సరీ్వసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జూలీ స్టఫ్ట్ శుభవార్త చెప్పారు. హెచ్–1బీ వీసాల రెన్యూవల్ (స్టాంపింగ్) కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, అమెరికాలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని కేటగిరీల్లో హెచ్–1బీ వీసాలకు డొమెస్టిక్ రెన్యూవల్ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారత ఐటీ నిపుణులు హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజా నిర్ణయంతో వీరికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యయ ప్రయాసలు తప్పుతాయి. అయితే, తొలి దశలో 20,000 మందికే ఈ వెసులుబాటు కలి్పంచనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత దశల వారీగా మరికొంతమందికి అవకాశం కలి్పస్తారు. డిసెంబర్ నుంచి మూడు నెలల్లోగా హెచ్–1బీ వీసా గడువు ముగిసేవారు వీసా రెన్యూవల్ (స్టాంపింగ్)ను అమెరికాలోనే చేసుకోవచ్చు. అమెరికా వీసాలకు భారత్లో భారీ డిమాండ్ ఉందని జూలీ స్టఫ్ట్ గుర్తుచేశారు. వీసా కోసం కొన్ని సందర్భాల్లో ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తోందని చెప్పారు. భారతీయులకు సాధ్యమైనంత త్వరగా వీసా అపాయింట్మెంట్లు ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. ఇందులో ఒక మార్గంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దీనివల్ల భారతీయ టెకీలకు లబ్ధి కలుగుతుందన్నారు మనవారికి 1.4 లక్షల వీసాలు 2022లో భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.4 లక్షలకుపైగా వీసాలు జారీ చేసినట్లు స్టఫ్ట్ వెల్లడించారు. అమెరికా వర్సిటీల్లో తరగతుల ప్రారంభానికి ముందే భారత్లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేయడానికి సిబ్బంది కొన్నిసార్లు వారమంతా పనిచేస్తున్నారని తెలిపారు. -
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!
అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. హెచ్-1బీ వీసా రెన్యూవల్ కోసం దేశం వచ్చే అవసరం లేకుండా అక్కడే ఉండి వీసా రెన్యూవల్ చేసుకునే అవకాశాన్ని బైడెన్ ప్రభుత్వం కల్పించనుంది. కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాలను దేశీయంగానే (అమెరికాలో ఉండి) రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్ను డిసెంబర్ నెలలో ప్రారంభించనుంది. తద్వారా అమెరికాలో ఉంటున్న ఎక్కువ మంది భారత ఐటీ నిపుణులకు లబ్ధి చేకూరనున్నట్లు యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ మాట్లాడుతూ.. ‘‘భారత్లో యూఎస్ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అమెరికా వీసా కావాలంటే సుమారు ఆరు నెలల లేదంటే ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇకపై అలా ఎదురు చూసే అవసరం లేకుండా ప్రణాళికల్ని సిద్ధం చేశాం. ఇందులో భాగంగా అమెరికాలో ఉంటూ యూఎస్ వీసా రెన్యూవల్ కోసం ఎదురు చూస్తున్న విదేశీయుల (అందులో భారతీయులు కూడా ఉన్నారు) కోసం ప్రత్యేకంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్ను త్వరలో ప్రారంభించనున్నాం. డిసెంబర్లో ప్రారంభించబోయే వీసా రెన్యూవల్ పైలెట్ ప్రోగ్రామ్లో సుమారు 20వేల వీసాల్ని రెన్యూవల్ చేసే అవకాశం కల్పించనున్నాం. ఈ ప్రాజెక్ట్తో అమెరికాలో నివసిస్తున్న ఎక్కువ మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. దశల వారీగా వీసా రెన్యూవల్ సంఖ్యను మరింత పెంచుతాం’’ అని జూలీ స్టఫ్ అన్నారు. 20 ఏళ్ల క్రితం అమెరికాలో నివసిస్తున్న నిపుణుల్లో భారతీయులే ఎక్కువ. అయితే ఈ నిపుణులకు స్థానిక కంపెనీలు హెచ్-బీ వీసాను అందిస్తుంటాయి.రెన్యూవల్ సైతం అక్కడే ఉండి చేసుకోవచ్చు. ఈ వీసా రెన్యూవల్ ప్రాసెస్ 2004 వరకు ఉండేది. అయితే క్రమంగా వీసా నిబంధనలు మారాయి. అలా అమెరికాలో ఉంటున్న భారతీయులు వీసా రెన్యూవల్ కోసం భారత్ వచ్చి వీసా రెన్యూవల్ చేయించుకుని తిరిగి వెళ్లే వారు. కానీ భారత ప్రధాని మోదీ ఈ ఏడాది జూన్ 21 నుంచి 24 వరకు చేసిన అమెరికా పర్యటనతో వీసా జారీలలో అనేక మార్పులు చేస్తూ వచ్చింది. తాజాగా 20 ఏళ్ల తర్వాత అమెరికాలోనే ఉండి హెచ్-1 బీ వీసాలను అక్కడే ఉండి రెన్యూవల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయం తీసుకున్నారు. -
హెచ్–1బీ ప్రోగ్రాంలో మార్పులు
వాషింగ్టన్: ఐటీ తదితర కీలక రంగాలకు చెందిన విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పని చేసెందుకు వీలు కలి్పంచే కీలకమైన హెచ్–1బీ వీసా ప్రోగ్రాంలో మార్పుచేర్పులను బైడెన్ సర్కారు ప్రతిపాదించింది. అర్హత ప్రమాణాలు తదితరాలను మరింత క్రమబద్ధం చేయడం, తద్వారా వీసా ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడం, ఎఫ్–1 స్టూడెంట్లకు, పారిశ్రామికవేత్తలకు, నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లకు మెరుగైన పరిస్థితులు కలి్పంచేందుకు ఈ మార్పులు దోహదపడతాయని చెబుతోంది. సదరు నిబంధనలను సోమవారం విడుదల చేయనున్నారు... ► ప్రస్తుత ప్రక్రియలో ఒక దరఖాస్తుదారు తరఫున ఎన్ని ఎక్కువ రిజి్రస్టేషన్లు నమోదయితే లాటరీలో ఎంపికయ్యే అవకాశాలు అంత పెరుగుతాయి. ► ప్రతిపాదిత విధానంలో ఒకరి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదైనా ఎంపిక ప్రక్రియలో ఒక ఎంట్రీగానే పరిగణిస్తారు. ► తద్వారా కొందరికే ఎక్కువ అడ్వాంటేజీకి బదులు అర్హులందరికీ సమానావకాశం దక్కుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. ► ఈ ప్రతిపాదనలపై అందరూ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు వెల్లడించవచ్చని డీహెచ్ఎస్ పేర్కొంది. ► అమెరికా ఏటా విడుదల చేసే 60 వేల హెచ్–1బీ వీసా కోటాలో మార్పుండదు. -
సాక్షి ఇమ్మిగ్రేషన్ లైవ్ టాక్ షో
-
ఆయన గెలిస్తే భారతీయ టెక్కీల అమెరికా ఆశలు గల్లంతే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు. అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు 2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు. (దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..) కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. -
అమెరికాలో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్న భారతీయులు.. కారణం అదేనా?
అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారనుందా? ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు లేఆఫ్స్తో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా అక్కడ నెలకొన్న పరిస్థితులు. అగ్రరాజ్యంలో శాశ్వత నివాస హోదా పొందాలంటే ‘గ్రీన్ కార్డ్’ తప్పని సరి. ఇప్పుడీ గ్రీన్ కార్డ్ పొందే విషయంలో లక్షల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లక్ష మందికిపైగా పిల్లలు వారి తల్లిదండ్రుల్ని వదిలి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. 18లక్షలు దాటిన సంఖ్య అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అయితే, ఇప్పుడా హెచ్1బీ వీసా దారులు అమెరికాలో శాస్వత నివాసం ఉండేందుకు గ్రీన్ కార్డ్ కావాలి. వారి సంఖ్య 18 లక్షలు దాటింది. 134ఏళ్లు ఎదురు చూడాలా? ప్రతి ఏడాది ఆయా దేశాల బట్టి అగ్రరాజ్యం గ్రీన్ కార్డ్లను మంజూరు చేస్తుంది. అలా భారత్కు ప్రతి ఏడాది 7 శాతం అంటే 65,000 గ్రీన్ కార్డ్లను అందిస్తుంది. అయితే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న 18 లక్షల మందికి వాటి (గ్రీన్ కార్డ్) ప్రాసెసింగ్కు పడుతున్న సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎదురు చూడాల్సి సమయం అక్షరాల 134 ఏళ్లు. తల్లిదండ్రుల నుంచి విడిపోవడం తప్పదా? ఉద్యోగం చేస్తూ చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్థులకు పర్మినెంట్ రెసిడెన్సీ హోదాను గ్రీన్ కార్డ్ కల్పిస్తుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో హెచ్-1బీ వంటి వీసాలు ఉంటాయి. చాలా మంది ఉద్యోగం చేస్తూనే అక్కడ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీరి పిల్లలు.. 21ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు తల్లిదండ్రుల వద్ద ఉండొచ్చని హెచ్-4 వీసా నిబంధనలు చెబుతున్నాయి. ఈలోపు తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ వస్తే మంచిదే! లేకపోతే.. పిల్లలు, సొంత దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? అమెరికాలో గ్రీన్కార్డ్, సిటిజన్ షిప్ కావాలంటే హెచ్1బీ అనే వర్క్ పర్మిట్ మీద అక్కడికి వెళ్లాలి. ఆ వర్క్ పర్మిట్ రావాలంటే అమెరికాలో ఉన్న కంపెనీ మన దేశంలో ఉన్న మనకి ఈ హెచ్1బీ వీసా ఇస్తుంది. హెచ్1 బీ వీసా వచ్చింది. అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ కనీసం 6 ఏళ్ల పని చేయాల్సి ఉంటుంది. అనంతరం గ్రీన్ కార్డ్ కోసం అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల నిర్ణీత సమయంలో ఆ గ్రీన్ కార్డ్ను పొందలేకపోతే తిరిగి స్వదేశానికి వెళ్లాలి. ఒక ఏడాది పాటు అక్కడే ఉండి హెచ్1బీ వీసా మీద అమెరికాకు వచ్చి గ్రీన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. గ్రీన్ కార్డ్ వచ్చిన 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరులుగా (american citizenship) గుర్తింపు పొందుతాం. గ్రీన్ కార్డ్కి, సిటిజన్ షిప్కి తేడా హెచ్1 బీ వీసాతో అమెరికాకు వెళ్లి ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం పొందాలంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదే గ్రీన్ కార్డ్, లేదంటే అమెరికా సిటిజన్ షిప్ ఉంటే ఉద్యోగాలు త్వరగా వస్తాయి. జీతాలు సైతం భారీగా ఉంటాయి. భారత్లో ఉంటే కష్టమే భారత్లో ఉండి హెచ్1బీ వీసా తెచ్చుకోవడం కొంచెం కష్టమే. కాబట్టే భారతీయ విద్యార్ధులు చదువు కోసం అమెరికా వెళతారు. ఎడ్యుకేషన్ వీసాతో అమెరికా వెళ్లి 2ఏళ్ల పాటు చదివితే హెచ్1 బీ వీసా లేకపోయినా మరో 3ఏళ్లు అక్కడ ఉండే అవకాశం కలుగుతుంది. రెండేళ్లు చదువు పూర్తి చేసుకున్న అనంతరం జాబ్ చేస్తాం కాబట్టి హెచ్1 బీ వీసా వెంటనే పొందవచ్చు. మోదీ పర్యటనతో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముందు బైడెన్ సర్కార్ అమెరికాలోని భారతీయులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిమెంట్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడి) కోసం కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డ్ అర్హతలను సరళతరం చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హతలకు సంబంధించి కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వారి కలను సాకారం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహద పడుతుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లి అక్కడే శాస్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ గ్రీన్ కార్డ్ లను జారీ చేస్తారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతి ఏటా లక్షా 40 వేల గ్రీన్ కార్డ్లను జారీ చేస్తారు. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్యలో మాత్రమే గ్రీన్ కార్డ్ కార్డ్లను జారీ చేస్తారు. ప్రస్తుతం, మొత్తం ధరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ ఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే గ్రీన్ కార్డ్లను జారీ చేస్తున్నారు. తాజాగా, ఈఏడీ నిబంధనల్ని సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలగనుంది.గ్రీన్ కార్డ్ కోసం కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ నూతన మార్గదర్శకాలు వర్తింప చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. చదవండి👉మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం -
హెచ్-1బీ: భారతీయ టెక్ నిపుణులకు శుభవార్త
US-Canada H-1B visa holders: అమెరికా హెచ్-1 బి వీసాదారులకు కెనడా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బీ వీసాదారులు ఇకపై కెనడాలో కూడా పనిచేయవచ్చని తాజాగా ప్రకటించింది. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించేందుకు యూఎస్ హెచ్-1 వీసా హోల్డర్లకు ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది. దీని ద్వారా అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1బీ వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది. (హిండెన్బర్గ్ రిపోర్ట్పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అదానీ) ఈ కొత్త పథకం ద్వారా కెనడా ప్రభుత్వం10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ వీసా హోల్డర్లు కెనడాలో మూడు సంవత్సరాల పాటు పని చేయడానికి అనుమతిస్తుంది. ఈ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యుల చదువుకోవచ్చు లేదా దేశంలో పని చేసుకోవచ్చు. ఇందుకు తాత్కాలిక నివాస వీసా, వర్క్ లేదా స్టడీ పర్మిట్ లభిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా యూఎస్లో పని చేసే హెచ్-1 బీ హోల్డర్లు స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాను ఉపయోగించేవారు. కాగా 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్లు, వారితో పాటు కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడా ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెక్ కంపెనీలు ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల ఉద్యోగులను నియమించు కుంటాయి. (అత్యధిక ట్యాక్స్ కట్టే బీటౌన్ భామ ఎవరో తెలుసా? నెటవర్త్ తెలిస్తే షాకవుతారు) -
ఎన్ఆర్ఐలకు గుడ్న్యూస్.. హెచ్–1బీ వీసా రెన్యువల్ ఇక అక్కడే!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాలో ఉపాధి పొందిన భారతీయులకు శుభవార్త!. వర్క్ వీసాల రెన్యువల్ కోసం ఆయా వీసాదారులు ఇకపై స్వదేశం(భారత్)కు వెళ్లిరావాల్సిన పనిలేకుండా వారికి అమెరికాలోనే పునరుద్ధరణ సేవలు పొందే సదావకాశం కల్పించాలని అమెరికా సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది భారతీయులకు ఎంతో సమయం, విమాన ఖర్చులు ఆదా అవుతాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారతీయులకు అగ్రరాజ్యం అందిస్తున్న కానుకగా ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు అభివర్ణించారు. నైపుణ్య ఉద్యోగాల్లో నియామకాల కోసం అమెరికా కంపెనీలు విదేశీయులకు హెచ్–1బీ వీసాలిచ్చి అమెరికాకు రప్పించడం తెల్సిందే. ఇలా హెచ్–1బీ వీసాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం విశేషం. ‘వీసా రెన్యువల్ కోసం సొంత దేశానికి వెళ్లకుండానే అమెరికాలోనే ఆ పని పూర్తయ్యేలా మొదట పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలుచేస్తాం. త్వరలోనే ఇది మొదలుపెడతాం. హెచ్–1, ఎల్ వీసా దారులకు ఇది ఎంతో ఉపయోగకరం’ అని ఆ అధికారి వెల్లడించారు. 2004 ఏడాదికి ముందువరకు నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల్లో కొన్ని విభాగాల వీసాలకు అమెరికాలోనే రెన్యువల్/స్టాంపింగ్ ఉండేది. తర్వాత పద్దతి మార్చారు. హెచ్–1బీ వంటి వీసాదారులు ఖచ్చితంగా సొంత దేశం వెళ్లి వీసా పొడిగింపు సంబంధ స్టాంపింగ్ను పాస్పోర్ట్పై వేయించుకోవాలి. ఈ ప్రయాస తగ్గించాలనే అమెరికా భావిస్తోంది. కాగా, గత కొద్దినెలలుగా వీసాల జారీ ప్రక్రియను అమెరికా ప్రభుత్వం మరింత సరళతరం, వేగవంతం చేయడం విదితమే. చదవండి: దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం ! -
ప్రతినిధుల సభలో అమెరికా పౌరసత్వ చట్టం
వాషింగ్టన్: గ్రీన్కార్డుల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేయడంతోపాటు హెచ్–1బీ వీసాల జారీలో మార్పుల కోసం ఉద్దేశించిన అమెరికా పౌరసత్వ చట్టం–2023ను అధికార డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం 1 కోటి మందికిపైగా అమెరికా పౌరసత్వం కల్పించేందుకు రోడ్మ్యాప్ రూపొందిస్తారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, ధ్రువ పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారికి పౌరసత్వం లభించనుంది. గ్రీన్కార్డ్ జారీ సులభం కానుంది. దేశాలవారీ కోటా రద్దు చేస్తారు. తక్కువ వేతనం ఇచ్చే పరిశ్రమల్లో పనిచేసేవారు కూడా గ్రీన్కార్డులు సులువుగా పొందవచ్చు. హెచ్1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. -
భారతీయులకు ఈసారి 10 లక్షలకుపైగా వీసాలు..!
వాషింగ్టన్: భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నవేళ భారతీయుల వీసా ప్రక్రియను వేగిరం చేసి ఈ ఏడాది 10 లక్షలకుపైగా వీసాలు జారీచేస్తామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేందుకు బైడెన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని అమెరికా సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా విభాగం) డొనాల్డ్ లూ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. ‘ వీసా ప్రాసెసింగ్ ప్రక్రియలో హెచ్–1బీ, ఎల్–వీసాలకూ తగిన ప్రాధాన్యత కల్పిస్తాం. విద్యార్థి వీసాలు, ఇమిగ్రెంట్ వీసాలుసహా మొత్తంగా ఈ ఏడాది ఏకంగా 10 లక్షలకుపైగా వీసాలను మంజూరుచేస్తాం. ఈసారి సమ్మర్ సీజన్లో అమెరికాలో విద్యనభ్యసించనున్న భారతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ను పూర్తిచేస్తాం’ అని చెప్పారు. బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) కేటగిరీలుసహా తొలిసారిగా వీసా కోసం దరఖాస్తుచేసుకున్న వారి అప్లికేషన్ల వెరిఫికేషన్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉన్న విషయం విదితమే. అమెరికాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ రెండోస్థానంలో ఉంది. కొన్ని చోట్ల 60 రోజుల్లోపే.. ‘హెచ్–1బీ, ఎల్ వీసాల జారీపైనా దృష్టిపెట్టాం. భారత్లోని కొన్ని కాన్సులేట్లలో ఈ వీసాల కోసం వేచిఉండే కాలం 60 రోజుల్లోపే. అమెరికా, భారత్ ఇరుదేశాల ఆర్థికవ్యవస్థకు ఈ వర్కింగ్ వీసాలు కీలకం. అందుకే వీటి సంగతీ చూస్తున్నాం’ అని వెల్లడించారు. ‘ పిటిషన్ ఆధారిత నాన్ఇమిగ్రెంట్ విభాగాల కింద దరఖాస్తుచేసిన వీసాదారులు తమ వీసా రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశానికి వెళ్లిరావాల్సిన పనిలేకుండా అమెరికాలోనే పని పూర్తిచేసుకునేలా ఏర్పాటుచేయదలిచాం. ఇక ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి 60 రోజుల్లోపు అమెరికాను వీడాల్సిన ప్రమాదం ఎదుర్కొంటున్న హెచ్–1బీ వీసాదారులకు.. అవకాశమున్న మరికొన్ని ‘వెసులుబాట్ల’ను వివరిస్తూ అదనపు సమాచారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఇచ్చింది’ అని వివరించారు. -
H-1B వీసాదారులకు శుభవార్త..
-
వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు
వాషింగ్టన్: ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్ కంపెనీలు హెచ్–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికా న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ హెచ్–1బీ వీసాలతో భారత్వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్న విషయం విదితమే. అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వాషింగ్టన్లోని జిల్లా కోర్టులో దావా వేసింది. హెచ్–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్ కార్డ్ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది. ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్ విచారించారు. ‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని సంస్థ తెలిపింది. అభినందనీయం ‘ఉద్యోగాలు పోయి కష్టాల్లో ఉన్న హెచ్–1బీ హోల్డర్ల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వలసదారుల హక్కుల సమానత్వ వ్యవస్థ సాధనకు ఇది ముందడుగు’ అని వలసదారుల హక్కులపై పోరాడే భారతీయ మూలాలున్న అమెరికా న్యాయవాది అజయ్ భుటోరియా వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్సహా అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొనడం తెల్సిందే. ఇలా ఉద్యోగాలు పోయిన వారిలో 30–40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే కావడం విషాదం. -
ఇండియన్ టెక్కీలకు ఊరట.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు
అమెరికాలోని ఇండియన్ టెక్కీలకు ఊరట నిస్తూ హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. యూఎస్ టెక్ సెక్టార్లోని విదేశీ ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయవచ్చని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కొన్ని వర్గాల హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను ఇచ్చే ఒబామా కాలం నాటి నిబంధనలను కొట్టివేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!) సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అమెజాన్ , యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. హెచ్-1బీ వర్కర్ల జీవిత భాగస్వాములకు యూఎస్ ఇప్పటివరకు దాదాపు లక్ష వర్క్ ఆథరైజేషన్ కార్డులు జారీ చేసింది, వీరిలో గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేలా కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, వలసదారుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది అజయ్ భూటోరియా హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ తెలిపింది. (గంగూలీ ముద్దుల తనయ.. అప్పుడే ఉద్యోగం చేస్తోంది.. జీతమెంతో తెలుసా?) -
పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు: అమెరికా
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి. 60 రోజుల్లోపు వీసా స్టేటస్ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా! -
అమెరికాలో మన టెకీల మెడపై... ‘గడువు’ కత్తి!
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్–1బీ ప్రొఫెషనల్స్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘సదరు కుటుంబాలకు ఇది పెను సంక్షోభం. వారికి చూస్తుండగానే సమయం మించిపోతోంది. అమెరికాలో పుట్టిన తమ పిల్లలను వెంటపెట్టుకుని వారి త్వరలో దేశం వీడాల్సిన పరిస్థితులు దాపురించాయి’’ అంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా మరో ఉద్యోగం గానీ, ఉపాధి గానీ చూసుకోని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. జాబ్ మార్కెట్ అత్యంత ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కోవడం చాలామందికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. దొరికినా అత్యంత సంక్లిష్టంగా ఉన్న హెచ్–1బీ మార్పు తదితర నిబంధనల ప్రక్రియను గ్రేస్ పీరియడ్లోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో దాన్ని కనీసం 180 రోజులకు పెంచాలంటూ ఆసియా అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షుని సలహా కమిటీ ఇటీవలే సిఫార్సు చేయడం తెలిసిందే. ‘‘దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నా అవి ఆమోదం పొంది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. ఈలోపు 60 రోజుల గ్రేస్ పీరియడ్ పూర్తయ్యే వారికి నిస్సహాయంగా దేశం వీడటం మినహా మరో మార్గం లేదు’’ అంటూ ఎఫ్ఐఐడీఎస్ ఆవేదన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ పెంపు సిఫార్సును పరిశీలించి నిర్ణయం తీసుకునే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. భారీగా ఉద్వాసనలు...: గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలుకుని పలు దిగ్గజ కంపెనీలు కొన్నాళ్లుగా భారీగా ఉద్యోగుల తొలగింపు బాట పట్టడం తెలిసిందే. దాంతో గత నవంబర్ నుంచి అమెరికాలో కనీసం 2.5 లక్షల మందికి పైగా ఐటీ తదితర ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ‘‘వీరిలో దాదాపు లక్ష మంది దాకా భారతీయులేనని అంచనా. ఆదాయ పన్ను చెల్లించే హెచ్–1బి ఇమిగ్రెంట్లయిన వీరు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కుని సదరు కంపెనీ ద్వారా హెచ్–1బికి దరఖాస్తు చేసుకోలేని పక్షంలో దేశం వీడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు’’ అని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. -
గ్రేస్ పీరియడ్: హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట!
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్-1బి ఉద్యోగులకు ఊరట. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా! గ్రీన్కార్డు దరఖాస్తుదారులకు ఊరట! మరోవైపు, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో ఆమోదిత ఐ-140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్కార్డు దరఖాస్తు పెండింగ్లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు. -
ఉద్యోగం ఒక్కటే కాదు.. అమెరికాలో అసలుకే మోసం
గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉద్యోగాలు పోగోట్టుకున్న వారికి ఎలాంటి ఊరట లేదని యూఎస్సీఐఎస్(USCIS), మరియు అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ( US Department of Homeland Security) తేల్చిచెప్పింది. హెచ్1బీ(H1B) వీసా మీద అమెరికాకు వచ్చి ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఎవరైనా లేఆఫ్ కింద ఉద్యోగం పోతే కేవలం 60 రోజులు మాత్రమే వారు ఆ దేశంలో ఉండవచ్చు. ఒక వేళ 60 రోజుల్లో మరో ఉద్యోగం రాకపోతే.. తక్షణం అమెరికా వీడాల్సి ఉంటుంది. ఒక వేళ అమెరికా వదలి వెళ్లకపోతే వాళ్లు చట్ట విరుద్ధంగా ఉన్నారన్నముద్ర పడుతుంది. ఈ మేరకు యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ (US House of Representatives) కు సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తరపున ఆ సంస్థ డైరెక్టర్ జడ్డో ఒక లేఖ రాశారు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ను యూఎస్సీఐఎస్ అమెరికా ప్రభుత్వం పెంచవచ్చన్న ఊహాగానాలకు ఇప్పుడు తెరపడినట్టయింది. -
హెచ్–1బీ, ఎల్1 రెన్యువల్ ఇక అమెరికాలోనే
వాషింగ్టన్: ‘డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్’ ప్రక్రియను పునఃప్రారంభించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ప్రధానంగా భారతీయులకు ఎక్కువ మేలు జరుగనుంది. హెచ్–1బీ, ఎల్1 వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిస్తే స్వదేశానికి తిరిగి వెళ్లి, రెన్యువల్ చేసుకోవాల్సిన పని ఉండదు. అమెరికాలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 2004 వరకూ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల రెన్యువల్, ఎక్సటెన్షన్ స్టాంపింగ్ను అమెరికాలోనే చేసేవారు. తర్వాత ఈ విధానాన్ని రద్దుచేశారు. ఇప్పుడు పునరుద్ధరించబోతున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి రాబోతోంది. -
అమెరికాలో నివసిస్తున్న ఇండియన్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త!
ఆర్ధిక మాంద్యం దెబ్బకు చేస్తున్న ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. దీంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘దేశీయ వీసా రీవాలిడేషన్’ పేరుతో హెచ్-1బీ, ఎల్1 వీసాలను అమెరికాలోనే పునరుద్దరించే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం అమెరికాలో లేఆఫ్స్కు గురై.. కొత్త జాబ్ కోసం అన్వేషిస్తున్న వారికి భారీ ఊరట కలగనుంది. 2004 కి ముందు వీసా పునరుద్ధరణ లేదా స్టాంపింగ్ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, మార్పులు చేయడంతో హెచ్-1బీ వీసా దారులు రెన్యువల్ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపులతో ఈ సమస్యను పరిష్కరించాలని జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వీసా ఉంటేనే ఎంట్రీ లేఆఫ్స్ గురైన ఉద్యోగులు వీసా పునరుద్దరించేందుకు సమయం పడుతుంది. ఆ లోగా వీసా గడువు దాటితే దేశం వదిలి వెళ్లి పోవాలి. లేదంటే కొత్త ఉద్యోగం వెతుక్కొని వీసా రెన్యూవల్ చేయించుకోవాలి. అక్కడే వీసా లబ్ధి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వీసా రెన్యూవల్, ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం దొరుకుతుందా? లేదా? అన్న సందిగ్ధంతో ఆందోళన చెందుతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి ఈ ఆందోళనలపై అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీసాల రెన్యూవల్ విషయంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో వీసాల విషయంలో జోబైడెన్ ప్రభుత్వం విధించిన నిబంధనల్ని సడలించింది. వీసా రెన్యూవల్ కోసం కొత్త కొత్త పథకాల్ని అందుబాటులోకి తెస్తుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం వీసా రెన్యూవల్ను చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. విదేశీ ఉద్యోగులు వీసా రెన్యూవల్లో ఇబ్బందులు పడకుండా వీసాల పునరుద్దరణ (రెన్యూవల్), స్టాంపింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇబ్బందుల్ని తొలగించాలనే సాధారణంగా ఆయా రంగాల్లో నిపుణులైన భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారికి హెచ్-1బీ వీసా తప్పని సరి. ఆ వీసాలను అమెరికన్ కంపెనీలు అభ్యర్ధులు అందిస్తాయి. అందుకే ఆ వీసాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది ఆ వీసాలు పొందిన చైనా, భారతీయులు వేలల్లో అమెరికాకు వెళుతుంటారు. అక్కడి వెళ్లిన వారు వీసా గడువు ముగిసి.. రెన్యూవల్ చేయించుకునే సమయంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఆ సమస్యల్ని అధిగమించేందుకు జోబైడెన్ ప్రభుత్వం నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (ఎన్ఐవీ) కేటగిరీల వీసా సేవల్ని పునఃప్రారంభించే ప్రణాళికలపై తీవ్రంగా కృషి చేస్తుంది.ఈ ఏడాది చివర్లో పైలట్ను ప్రాజెక్ట్ను ప్రారంభిస్తాం. వీసాలను పునరుద్ధరించడానికి దరఖాస్తుదారులు విదేశాలకు వెళ్లే అవసరాన్ని తగ్గిస్తుంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఎన్ని వీసాలో చెప్పలేం వీసాలను ఎన్ని పునరుద్దరిస్తారని విషయంపై యూఎస్ కాన్సులేట్ అధికారులు మాట్లాడుతూ.. వీసా రెన్యూవల్ ప్రాజెక్ట్ ప్రారంభంలో ఎంత మంది వీసా హోల్డర్లు అర్హులు అవుతారనే దానిపై స్పష్టత ఇవ్వలేం. తక్కువ సంఖ్యలో ప్రారంభించింది. దశల వారీ వీసాల జారీని పెంచుకుంటూ వెళతామని అన్నారు. -
మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త. 2023–24 సంవత్సరానికి గాను మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్1బీ వీసాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఆదివారం తెలిపింది. మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుందని, మార్చి 31కల్లా వీసా హోల్డర్ల పేర్లను ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేసే విదేశీ సాంకేతిక నిపుణులకు ఇచ్చే నాన్–ఇమిగ్రాంట్ వీసా హెచ్1బీ. ఏడాదికి 85 వేల వరకు హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తుంటారు. ఇందులో అత్యధికంగా లాభపడేది భారత్, చైనా దేశస్తులే. టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి రంగాలకు చెందిన ఈ వీసా దారులు ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండి పని చేసుకునేందుకు వీలుంటుంది. ఆరేళ్ల తర్వాత శాశ్వత నివాసం లేదా గ్రీన్కార్డుకు అర్హులవుతారు. -
హెచ్1బీ వీసా ఫీజుల బాదుడు !
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా దరఖాస్తు సహా అన్ని ఇమిగ్రేషన్ ఫీజుల మోత మోగించేందుకు అమెరికా సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ప్రచురించింది. 460 డాలర్లుగా ఉన్న హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను ఏకంగా 780 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. వలసేతర వీసాల్లో భారతీయులు అధికంగా పొందే హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను భారీగా పెంచడంపై విమర్శలొస్తున్నాయి. మిగతా ఫీజులూ దాదాపు ఇలాగే భారీగా ఉన్నాయి. ఓ–1 దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచనున్నారు. అంటే ఒక్కసారిగా 229 శాతం పెంపు అన్నమాట. ఎల్–1 ధరను 460 డాలర్ల నుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచేయనున్నారు. అంటే ఏకంగా 332 శాతం పెరుగుదల. హెచ్–2బీ దరఖాస్తుల ధర 460 డాలర్ల నుంచి ఒకేసారి 1,080 డాలర్లకు చేరుకోనుంది. అయితే, ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని మార్చి ఏడో తేదీలోపు వచ్చే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ధరలు మారుస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. ఒకవేళ ఈ ఫీజులు అమలైతే అదనంగా తీసుకునే బయోమెట్రిక్ సేవల ఫీజును రద్దుచేస్తామని ప్రతిపాదించింది. 2016 ఏడాది నుంచి ఇప్పటివరకు ఫీజులు పెంచలేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. వీసా ఎదురుచూపులు తగ్గించేందుకు కృషి భారత్లో వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామన్నారు. వీసా దరఖాస్తుల పరిశీలనను చకచకా పూర్తి చేసేందుకుగాను విదేశాంగ శాఖ సిబ్బంది పెంచామన్నారు. -
Surbhi Gupta: ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’
అమెరికాతో పాటు అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. అమెరికా టెక్ సంస్థలు ఉద్యోగులతో పాటు వలసేతర హెచ్1బి వీసా హోల్డర్లని విధుల నుంచి తొలగిస్తున్నాయి. వారిలో మెటాలో ప్రొడక్ట్ మేనేజర్ పనిచేస్తున్న సురభిగుప్తా ఒకరు. తాజాగా మెటాలో ఉద్యోగం కోల్పోవడంపై జర్నలిస్ట్ సవితా పటేల్తో మాట్లాడారు. మెటాలో ఉద్యోగం, లేఫ్స్పై హెచ్ 1 బీ వీసాపై ఆమె మనోగతం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఆ రోజు మా అమ్మ పుట్టిన రోజు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మెటా ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించింది. లేఆఫ్స్పై నాతో పాటు నా సహచర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటల (స్థానిక కాలమానం) మెటా నుంచి మెయిల్. ఉద్యోగం నుంచి నన్ను తొలగించారని. ఈ ఏడాది ప్రారంభంలో మెటాలో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాను. నా విధుల్ని నేను చక్కగా నిర్వర్తిస్తా. నా ఉద్యోగం పోయిందని తెలిసి నా టీమ్ సభ్యులు షాక్గురయ్యారు. ఉద్యోగం కోల్పోయారు కదా మీకెలా అనిపించింది నా స్కూల్ డేస్లో ఓ టీచర్ ఎప్పుడూ ఒక మాట చెప్పే వారు. వర్క్ ఈజ్ వర్షిప్. అదే మోటోతో పనిచేస్తున్నాను. కానీ నా ఉద్యోగం పోయిందని తెలిసి టైటానిక్ షిప్లా మునిపోతున్నట్లు అనిపించింది. మెయిల్, ఆ తర్వాత ల్యాప్టాప్ యాక్సెస్ కోల్పోయాను. అందుకు విరుద్ధంగా లింక్డ్ ఇన్లో చాలా మంది సహోద్యోగులు, మాజీ సహోద్యోగులు, స్నేహితులు ఇలా చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు. నాకు అప్పుడే అనిపించింది నా అనేవాళ్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారని. మార్చి వరకే డెడ్లైన్ ఇక మెటాలో నా లాస్ట్ వర్క్ డే జనవరి వరకు ఉంది. నాకు హెచ్1 -బీ వీసా (అమెజరికాలోని సంస్థలు ఆరు సంవత్సరాల వరకు విదేశీయులను నియమించుకోవడానికి అనుమతించే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా) తో మరో 60 రోజులు యూఎస్లో ఉండొచ్చు. కాబట్టి మార్చి ప్రారంభం వరకు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు సమయం ఉంది. ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే డిసెంబరులో సెలవుల కారణంగా ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే. కానీ మరో ఉద్యోగంలో చేరే విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాను. అనుకున్నది సాధిస్తా. ‘ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా’ జీవితంతో ఎప్పుడు రాజీ పడకూడదు. అనుకున్నది సాధించేలా సంక్షోభంలోనూ అవకాశాల్ని ఎలా చేజిక్కించుకోవాలి నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. అంతేకాదు ఇప్పుడు మనం ఒకటి కోల్పోయామంటే భవిష్యత్లో ('ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా') ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందని చెప్పేవారు. మెటా నన్ను ఫైర్ చేసిన తర్వాత మరో జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించా. హెచ్1-బీ వీసాపై ఆధారపడి ఉంది కానీ అమెరికాలో పని చేయడం, ఇక్కడ ఉండే హక్కు నా హెచ్1-బీ వీసాపై ఆధారపడి ఉంటుంది. నేను 2009లో యుఎస్కి వచ్చా. ఎవరి ప్రోత్సాహాం లేకుండా స్వశక్తి, తెలివి తేటలతో నా కెరియర్ను నిలబెట్టుకున్నాను. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాను. టెస్లా, ఇన్ట్యూట్ (Intuit) వంటి కంపెనీల్లో పనిచేశా. మంచి మంచి ప్రొడక్ట్లను తయారు చేశా. టాప్ రేటింగ్లో పనిచేశా. పన్నులు చెల్లించా. ఇక్కడి (యూఎస్) ఆర్థిక వ్యవస్థకు 15 సంవత్సరాలకు పైగా సహకరించాను. ఇక్కడే పర్మినెంట్ నివసించే హక్కు పొందాను. నేను మిస్ భారత్ కాలిఫోర్నియా అందాల పోటీల్లో నా ఆరాధ్య, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ చేతుల మీదిగా కిరీటం పొందాను. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్పై నడిచాను. టెక్ కంపెనీల ఉద్యోగాల తొలగింపుపై అమెరికా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు భారతీయుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయినా సరే మెటా, అమెజాన్, ట్విట్టర్ లే ఆఫ్లు భారతీయులు అమెరికాకు రావాలని, ఇక్కడే స్థిరపడాలన్న కలల్ని నాశనం చేయవు’ అంటూ సురభిగుప్తా తన మనోగతాన్ని వివరించారు. చదవండి👉 ప్చ్, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది! -
రూ.13 వేలు కడితే అమెరికా హెజ్1బీ వీసా..! ఇలాంటి స్కామర్లతో జర భద్రం..
ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలతో మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ లింక్డ్ఇన్ యూజర్ స్కామర్లు వీసాలు ఇప్పిస్తామని రూ.లక్షలు కాజేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. అమెరికా హెచ్1బీ వీసా ఇప్పిస్తామని 160 డాలర్లు(రూ.13వేలు) కడితే దరఖాస్తు ప్రక్రియ మొదలు పెడుతామని సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నాడు. ఓ టాప్ సోడా కంపెనీల పేరుతో ఈ ఆఫర్ లెటర్ పంపుతున్నారని చెప్పాడు. మొదట రూ.13వేలే అని చెప్పినా ఆ తర్వాత ఆశావాహుల నుంచి లక్షలు కాజేస్తున్నారని వివరించాడు. ఈ స్కామర్లు పంపే ఈ-మెయిళ్లు ప్రపంచంలోని టాప్ 500 కంపెనీల పేరుతో కూడా ఉంటాయని సదరు వ్యక్తి వివరించాడు. మీకు నమ్మకం కల్పించేందుకు వాళ్లు డమ్మీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నాడు. ఇలాంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. నిజంగా జాబ్ ఆఫర్ ఇచ్చే ఏ సంస్థ అయినా డబ్బులు వసూలు చేయదు. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని లింక్డ్ఇన్ యూజర్ సూచించాడు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
హెచ్ - 1బీ వీసా: భారతీయులకు భారీ ఉపశమనం
అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న భారతీయులకు భారీ ఉపశమనం కలగనుంది. వచ్చే ఏడాది జూన్ లేదా జులై తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ తెలిపారు. ఇక వీసాల అనుమతులు,స్లాట్ల గురించి వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం. ♦ రాయబార కార్యాలయంలో లక్ష హెచ్ - 1బీ వీసాలకు డ్రాప్బాక్స్ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 26 వేల స్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ♦ హెచ్-1బీ, బీ1/ బీ2 డ్రాప్ బాక్స్ కోసం వేచి ఉండే సమయాన్ని 9 నెలలకు తగ్గించగలిగాం. ♦ ఎంబసీ ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులు వీసాల అనుమతి కోసం సంబంధిత అధికారులకు అప్లికేషన్లను నిర్విరామంగా పంపిస్తున్నారు. ♦ వచ్చే ఏడాది మే నెల నుంచి హెచ్-1బీ వీసా డ్రాప్ బాక్స్కోసం వేచి చూసే సమయం 9 నెలల నుంచి 4 లేదా 5 నెలలకు తగ్గుతుందని, దశల వారిగా 3 నెలలు ఇలా సమయం తగ్గించే ప్రయత్నం చేస్తామని మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ వివరించారు. #CNBCTV18Exclusive | #DropBox cases in categories of #student visas, H-1B & L visa & B1/B2 visas are a priority. 1,28,000 H-1B applicants in the queue for H-1B Drop Box applications, says Don Heflin, Minister Counselor for Consular Affairs pic.twitter.com/WapB7vPdtV — CNBC-TV18 (@CNBCTV18Live) November 22, 2022 -
మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. టెక్ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మెటా మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 13 శాతం. ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘కోవిడ్ మహమ్మారి తర్వాత కూడా భారీ వృద్ధి ఉంటుందనే అంచనాతో పెద్ద యెత్తున ఉద్యోగులను తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఊహించిన విధంగా జరగలేదు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) ఆన్లైన్ కామర్స్ మళ్లీ పాత స్థాయికి వచ్చేసింది. స్థూల ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గడం వంటి కారణాలతో ఆదాయాలు నేను ఊహించిన దానికన్నా తగ్గాయి. నేను పరిస్థితిని తప్పుగా అంచనా వేశాను. దీనికి బాధ్యుణ్ని నేనే‘ అని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కూడా కోతల పర్వం నడుస్తున్న నేపథ్యంలో మెటాలోనూ ఉద్వాసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలైనవి మెటాలో భాగంగా ఉన్నాయి. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్స్ వస్తాయని, వారికి కంపెనీ సిస్టమ్స్ ఇక అందుబాటులో ఉండవని జుకర్బర్గ్ తెలిపారు. మాజీ ఉద్యోగులకు 16 వారాల బేసిక్ పేతో పాటు కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికిగాను 2 వారాల జీతం లభిస్తుంది. 6 నెలల పాటు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకూ హెల్త్ ఇన్సూరెన్స్ పని చేస్తుంది. ఇదీ చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! టెక్ సంస్థలకు సవాళ్లు.. కోవిడ్ సమయంలో లాక్డౌన్ల వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో ప్రజలు సోషల్ మీడియాను గణనీయంగా ఉపయోగించారు. దీంతో ఆయా కంపెనీలకూ భారీగా ఆదాయాలు వచ్చాయి. అయితే, లాక్డౌన్లు ముగిసి, ప్రజలు తిరిగి దైనందిన జీవితాల్లో పడిపోయిన తర్వాత వాటి ఆదాయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యేకంగా మెటా విషయానికొస్తే.. డిజిటల్ యూనివర్స్ ’మెటావర్స్’ పై భారీగా పెట్టుబడులు పెడుతుండటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. అటు టెక్ దిగ్గజం యాపిల్ ప్రైవసీ టూల్స్ సైతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సమస్యగా మారుతున్నాయి. వీటి వల్ల యూజర్ల అనుమతి లేకుండా వారిని ట్రాక్ చేయడం, ప్రత్యేకంగా టార్గెట్ చేసే ప్రకటనలు చూపడం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ లాంటి సంస్థలకు కష్టతరమవుతోంది. అలాగే యువత ఎక్కువగా టిక్టాక్ వైపు మళ్లుతుండటం ఇన్స్టాగ్రామ్పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్లోని ఉద్యోగుల్లో కలవరం.. ఏయే దేశాల్లో ఏ మేరకు కోతలు ఉంటాయనేది తెలియకపోవడంతో భారత్లోని మెటా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్లకు సంబంధించి మెటాకు భారత్లో 300–400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో 60 మంది సిబ్బంది గల వాట్సాప్ బృందమే చిన్నది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ ఇటీవలే రాజీనామా చేసి పోటీ సంస్థ స్నాప్లో చేరారు. హెచ్1బీ వీసా హోల్డర్లకు సహకారం ఉద్వాసనకు గురైన వారిలో హెచ్1బీ వీసాహోల్డర్లు ఉంటే ఇమ్మిగ్రేషన్ పరంగా వారికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను కంపెనీ అందిస్తుందని జుకర్బర్గ్ తెలిపారు. తమ దేశంలో పని చేసేందుకు విదేశీయులకు అమెరికా ఈ వీసాలు జారీ చేస్తుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, తమ వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో ఉద్యోగాన్ని 60 రోజుల్లోగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీసా గడువు ముగిసిపోతుంది. పలు అమెరికన్ కంపెనీల్లో భారత్, చైనా నుంచి చాలా మటుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రధానంగా ఫేస్బుక్లో వీరి సంఖ్య 15శాతం పైనే. ఉద్యోగాల్లో కోతల వల్ల ఇలాంటి హెచ్1బీ వీసాహోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. -
ట్విటర్ తొలగింపులు, మాజీ ఉద్యోగులకు కొత్త చిక్కులు
ఎలన్ మస్క్ తొలగించిన ట్విటర్ ఉద్యోగులకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది. వీలైనంత త్వరగా మరో సంస్థలో ఉద్యోగం పొందితే సురక్షితంగా ఉండొచ్చని, లేదంటే దేశ వదిలి వెళ్లాల్సి ఉంటుందని అమెరికన్ చట్టాలు చెబుతున్నాయి. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో ఉద్యోగం కోల్పోవడంతో పాటు..చట్టాల ప్రకారం అమెరికాలో నివసించేందుకు అనర్హులుగా పరిణగణలోకి తీసుకునే అవకాశం ఉంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) డేటా ప్రకారం.. అమెరికన్ వర్క్ వీసాలైన హెచ్-1బీ, ఎల్-1లతో ఉద్యోగులు ట్విటర్లో పనిచేస్తున్నారు. ఎలన్ మస్క్ తొలగించిన ఉద్యోగుల్లో పైన పేర్కొన్న వీసా లబ్ధిదారులైతే మరిన్ని ఇబ్బందులు పడనున్నారు. వాటి నుంచి సురక్షితంగా ఉండేందుకు సదరు ఉద్యోగులు 60 రోజుల్లో మరో కొత్త జాబ్, లేదంటే అమెరికన్ సంస్థల నుంచి స్పాన్సర్ షిప్ పొందాల్సి ఉంది. ఆ రెండు అంశాల్లో విఫలమైతే..తమ దేశంలో నివసించేందుకు అమెరికా ప్రభుత్వం ఒప్పుకోదు. కాగా, ట్విటర్ మొత్తం ఉద్యోగుల్లో 8శాతం (625 నుంచి 670) మంది హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్లు హెచ్-1బీ వీసాదారులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, ఎల్-1, ఓ-1 వీసాలపై పనిచేసే కార్మికులకు ఇది చాలా కష్టం. అరుదైన పరిస్థితుల్లో తప్ప, వారు ఉద్యోగం కోల్పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని లాక్వెస్ట్ మేనేజింగ్ పార్టనర్ పూర్వీ ఛోతాని తెలిపారు. సాధారణంగా ఒక హెచ్-1బి ఉద్యోగిని తొలగిస్తే.. మరో సంస్థలో ఉద్యోగం పొందందేకు సుమారు 60రోజుల గ్రేస్ పిరియడ్ ఉంటుంది. ఖచ్చితమైన గ్రేస్ పీరియడ్ సదరు కార్డు హోల్డర్లను ఎంపిక చేసుకునే సంస్థపై ఆధారపడి ఉంటుంది. ఇక మస్క్ తొలగించిన ఉద్యోగులు హెచ్-1 బీ వీసా వచ్చే ఏడాది సెప్టెంబర్ 30,2023 వరకు సమయం ఉంది. 60 రోజుల్లో మరో జాబ్ పొందడం పెద్ద కష్టమేమి కాదని ఛోతాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత ఆరేళ్లలో హెచ్-1బీ క్యాప్ లాటరీలో ఎంపికైన హెచ్-1బీ వర్కర్లు వచ్చే లాటరీ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ లో మరో స్పాన్సర్ను పొందలేకపోతే వారు తమ సొంత దేశం నుంచి అమెరికాలో జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. ఎల్-1 వీసా హోల్డర్ల ఎన్-1ఏ వీసా అటే అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు విదేశీ డైరెక్టర్లు లేదా మేనేజర్లను యూఎస్లో ఉన్న వారి కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ తరహా వీసాను జారీ చేస్తుంది. ఈ తరహా వీసాపై ఉద్యోగం చేసేవారు..జాబు కోల్పోతే వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మరి ట్విటర్ తొలగించిన ఎల్-1ఏ వీసా ఉద్యోగులకు భవిష్యత్ ఎలా ఉంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా!
వాషింగ్టన్: భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్ప్రారంభమైన తరుణంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించింది. అయితే డిసెంబర్ 31వరకు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్,ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే విసాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెనివల్ చేయించుకునే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కానీ గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉండనుంది. కరోనా సమయంలో కలిగిన ఇబ్బందులే ఇందుకు కారణమని అమెరికా చెప్పింది. ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది. కరోనా సమయంలో పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని 2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించనున్నట్లు తెలిపింది. చదవండి: పరాన్నజీవులూ, వెళ్లిపొండి -
వర్క్పర్మిట్లపై యూఎస్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: గ్రీన్కార్డు దరఖాస్తుదారులు, హెచ్1బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్ కేటగిరీలకు చెందినవారి వర్క్ పర్మిట్ కాలపరిమితిని 18నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో యూఎస్లో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కాలపరిమితి ముగిసిన వర్క్పర్మిట్లకు 18నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు ఈనెల 4నుంచి అమలవుతుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న వీరి వర్క్పర్మిట్ కాలపరిమితి ఆటోమేటిగ్గా 180 నుంచి 540 రోజులకు పెరుగుతుందని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. పెండింగ్లో ఉన్న ఈఏడీ దరఖాస్తులతో పనిభారం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ (అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ) డైరెక్టర్ జడోయ్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం యూఎస్ పౌరులు కానివారు వర్క్పర్మిట్ కాలపరిమితి ముగిశాక మరో 180 రోజుల పొడిగింపు ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ గడువులో వాళ్లు పర్మిట్ రెన్యువల్కు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిర్ణయం దాదాపు 87వేల మంది ఇమ్మిగ్రెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ఇండో అమెరికన్ సంఘాలు స్వాగతించాయి. -
2022కు హెచ్1బీ వీసా కోటా పూర్తి
వాషింగ్టన్: ఈ సంవత్సరానికి హెచ్1బీ వీసా పరిమితి 65,000కు సరిపడా దరఖాస్తులు అందాయని అమెరికా మంగళవారం ప్రకటించింది. విదేశీ ఉద్యోగస్తులు అమెరికాలో పనిచేసేందుకు ఈ వీసాను కేటాయిస్తారు. టెక్ కంపెనీలకు ఈ వీసా చాలా అవసరం. అమెరికా చట్ట సభలు విధించిన ప్రకారం ఏటా 65వేల వరకు గరిష్టంగా ఈ వీసాలను కేటాయిస్తారు. మరో 20వేల వీసాలను యూఎస్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఎగ్జెంషన్ కింద కేటాయిస్తారు. ఈ రెండు కేటగిరీలకు సరిపడా దరఖాస్తులు తమకు ఇప్పటికే అందాయని యూఎస్ పౌర, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) తెలిపింది. ఈ వీసా దరఖాస్తుల పరిశీలన, ఆమోదం తదితర ప్రక్రియలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. -
మార్చి 1 నుంచి హెచ్1–బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
వాషింగ్టన్: భారత టెకీలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే హెచ్1–బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు ఈ వీసాల కింద ఉద్యోగాల్లో నియమించుకుంటాయి. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి మార్చి 18 వరకు జరుగుతుందని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఒక ప్రకటనలో వెల్లడించింది. హెచ్1–బీ వీసాలను ఆశించే వారు, కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్కు 10 డాలర్ల రుసుము (రూ.750) చెల్లించాలి. ఆ తర్వాత లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి మార్చి 31లోగా వీసా వచ్చిన వారికి తెలియజేస్తామని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని హెచ్1–బీ వీసా ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం ప్రతీ ఏడాది యూఎస్సీఐఎస్ 65 వేల హెచ్1–బీ వీసాలను మంజూరు చేస్తుంది. అవే కాకుండా అమెరికా యూనివర్సిటీ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ సబ్జెక్టుల్లో) అంశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల హెచ్1–బీ వీసాలను ఏటా మంజూరు చేస్తుంది. ఈ వీసాల్లో అగ్రభాగం భారతీయ టెక్కీలకే దక్కుతుంటాయి. -
హెచ్-1బి వీసా దరఖాస్తు దారులకు శుభవార్త..!
2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బి వీసాల ప్రాథమిక రిజిస్ట్రేషన్లు మార్చి 1 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ మధ్య కాలంలో దరఖాస్తుదారులు, ప్రతినిధులు(పిటిషనర్ తరఫున వీసాకోసం అప్లయ్ చేసే వారు) ఆన్లైన్ ద్వారా హెచ్-1బీ వీసాకోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి హెచ్-1బీ క్యాప్ కోసం ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ నంబర్ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ను ట్రాక్ చేయొచ్చని పేర్కొంది. దరఖాస్తు స్టేటస్ను మాత్రం ఈ నంబర్ ద్వారా ట్రాక్ చేయలేరని స్పష్టం చేసింది.అమెరికాలో పని చేయాలంటే విదేశీయులకు హెచ్-1బీ విసా తప్పనిసరి. పరిమితకాలంతో ఈ వీసాను అమెరికా ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని టెక్ నిపుణులు హెచ్-1బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. వారిలో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ఈ వీసా కార్యక్రమం ద్వారా యుఎస్ కంపెనీలు భారతీయులను నియమించుకోవచ్చు. అమెరికాలో అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 65,000 హెచ్-1బి వీసాలు జారీ చేయగా, 20,000 వీసాలు యుఎస్ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ల కోసం రిజర్వ్ చేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బి వీసాలను అందుకున్న వారిలో అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. హెచ్-1బీ వీసా కోసం పిటిషనర్లు, వారి తరఫు ప్రతినిధులు మైయూఎస్సీఐఎస్ ఆన్లైన్ అకౌంట్ను వినియోగించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో అభ్యర్థి 10 డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. స్వియ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు.. ఫిబ్రవరి 21 నంచి మైయూఎస్సీఐఎస్ ఆకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చని వివరించింది. మార్చి 31 నాటికి ఎంపిక దరఖాస్తుకు ఎంపికైన వారి వివరాలు.. మైయూఎస్సీఐఎస్ అకౌంట్కు అందుతాయని పేర్కొంది. దరఖాస్తు యాదృచ్ఛికంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల హెచ్-1బి వీసా దరఖాస్తుదారులకు నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూను అమెరికా రద్దు చేసింది. (చదవండి: 5 నిమిషాల్లో పాన్కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!) -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ..హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాలకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా నిర్ణయంతో.. వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు కాన్సులేట్కు వెళ్లి భౌతికంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెచ్-2 వీసా, ఎఫ్-ఎమ్ వీసా, ఎకాడమిక్ జే వీసాలపై ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధనను.. 2022 డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ కాన్సులర్ అధికారులకు విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఆదేశాలు జారీ చేశార. అయితే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులేట్ అధికారులు ఇన్పర్సన్ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశముంది. అందువల్ల సంబంధిత వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విదేశాంగశాఖ సూచించింది. చదవండి: విషాదం: నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 32 మంది సజీవ దహనం -
హెచ్1–బి వీసాలకు మళ్లీ ‘లాటరీ’యే
వాషింగ్టన్: వృత్తి నిపుణులకు మంజూరు చేసే హెచ్1–బి వీసాల కేటాయింపును పాత పద్దతిలో ‘లాటరీ’ విధానంలోనే కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్1– బి వీసాలను (నిర్ణీత కోటా 65 వేలు,, అమెరికా వర్శిటీల్లో పీజీ.. ఆపై కోర్సులు చేసిన వారికి అదనంగా 20 వేల హెచ్1–బి వీసాలు) జారీ చేస్తోంది. టెక్ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటాకు మించి హెచ్1–బి వీసా దరఖాస్తులు సమర్పిస్తే... లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలను కేటాయించేవారు. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందిన విషయం గమనార్హం. అత్యంత ప్రతిభావంతులనైన వృత్తి నిపుణులనే అమెరికాలోకి అనుమతించాలనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లాటరీ పద్దతికి స్వస్తి పలికి ఈ ఏడాది జనవరి 8న కొత్త విధానాన్ని తెచ్చింది. వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అత్యధిక వేతనాలు పొందుతున్న వారికే ప్రాధాన్యత క్రమంలో మొదట వీసాలు దక్కుతాయి. ఈ ఏడాది మార్చి 9 నుంచి దీన్ని అమలు చేయాలని భావించినా... అది ఆలస్యమైంది. మరోవైపు సెప్టెంబరులో వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ సర్కారు నిర్ణయించింది. అత్యధిక వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీచేస్తే ఇతర దేశస్తుల కంటే భారత టెకీలకు అధిక ప్రయోజనం చేకూరేది. -
భారీగా తగ్గిన హెచ్1–బీ వీసాలు
వాషింగ్టన్: అమెరికా కలల ప్రయాణానికి కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డు పడుతోంది. భారతీయ టెక్కీల్లో అత్యధిక డిమాండ్ ఉండే హెచ్1–బీ వీసాల సంఖ్య గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకి కొరత లేదు. జాబ్ ఓపెనింగ్స్ భారీ సంఖ్యలో ఉన్నాయి. కానీ హెచ్1–బీ ఉద్యోగస్తుల సంఖ్య పడిపోయింది. కోవిడ్ నేపథ్యంలో అమెరికా ప్రయాణాలపై, వీసాలపై ఆంక్షలు విధించడంతో ఈ వలసేతర వీసాలు తగ్గాయి. రెండేళ్లలో 19 శాతం తగ్గిపోయిన ఉద్యోగులు అమెరికా కార్మిక శాఖ వెల్లడించిన గణాంకాలను బ్లూమ్బర్గ్ న్యూస్ విశ్లేషించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే సెప్టెంబర్ 2021 నాటికి హెచ్–1బీ కేటగిరి కింద విదేశీ ఇంజనీరింగ్, మ్యాథ్మేటిక్స్ ఉద్యోగస్తులు 12.6% తగ్గిపోయారు. కరోనా ముందు అంటే 2019లో పోల్చి చూస్తే ఇదే కేటగిరిలో 19% హెచ్1–బీ వీసాలు తగ్గిపోయాయి. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడం, వీసాల జారీ ప్రక్రియ మందగించడం, కోవిడ్ ముప్పుతో అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతోనే హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘2020 మార్చి నుంచి కొత్త వీసాల జారీ ప్రక్రియ బాగా నెమ్మదించింది. లాక్డౌన్ ఆంక్షలతో ఒకానొక దశలో కొన్నాళ్ల పాటు దాదాపు నిలిచింది. స్టెమ్ (సైన్స్, సాంకేతికం, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కేటగిరీలో ఉద్యోగులు తగ్గిపోయాయి. కొన్ని కంపెనీలు విదేశాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతినివ్వడంతో హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయింది’ అని కాలిఫోర్నియా యూనిర్సిటీ ప్రొఫెసర్ పేరి గోవణ్ణ చెప్పారు. ప్రతీ ఏడాది కొత్తగా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటారు. స్టెమ్లో గత ఏడాది మార్చి, ఏప్రిల్లో కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి. కానీ త్వరగానే ఆయా రంగాలు కోలుకోవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా అమెరికా కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,97,000 ఉద్యోగాలు ఉన్నాయని 2020 నుంచి పోల్చి చూస్తే 9% తగ్గిందని, 2019తో పోల్చి చూస్తే 17% తగ్గిందని బ్లూమ్బర్గ్ న్యూస్ వెల్లడించింది. -
హెచ్1బీ భాగస్వాములకు భారీ లబ్ధి
వాషింగ్టన్ : భారత్ నుంచి వచ్చే వారితో సహా వలసదారులకి ప్రయోజనం చేకూరేలా అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు (భర్త/భార్య) ఆటోమేటిక్గా వర్క్ ఆథరైజేషన్ కల్పించడానికి అంగీకరించింది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ నిపుణుల భార్యలకి ఈ నిర్ణయంతో ఎంతో ఊరట లభించింది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) హెచ్–1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు (భార/భర్త, 21 ఏళ్ల వయసులోపు పిల్లలు)కి హెచ్–4 వీసా జారీ చేస్తుంది. ఈ వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కలిగి ఉండాలి. దీనిని ఎప్పటికప్పుడు వారు పొడిగించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇకపై అలాంటి బాధ లేకుండా ఉద్యోగం చేయడానికి వీలుగా ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్తో కూడిన హెచ్–4 వీసాను మంజూరు చేయడానికి బైడెన్ సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఈ నిర్ణయంతో భారత్ నుంచి వెళ్లే మహిళలకే అత్యధికంగా లబ్ధి చేకూరనుంది. ఈఏడీని పొడిగించుకోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్–4 వీసాదారుల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) కోర్టులో పిటిషన్ వేసింది. ‘హెచ్–4 వీసాదారులు తరచూ రెగ్యులేటరీ పరీక్ష ఎదుర్కోవాలి. అయితే గతంలో హోంల్యాండ్ ఏజెన్సీ వారికి ఉద్యోగం రాకుండా నిషేధం విధించింది. దీంతో రీ ఆథరైజేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా వారు అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది’అని ఏఐఎల్ఏ లాయర్ జాన్ వాస్డెన్ చెప్పారు. దీనిపై బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం 90 వేలమందికి పైగా హెచ్–4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్ ఉంది. -
ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ నెత్తిన మరోపిడుగు పడింది. ఉద్యోగుల విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో భారీ పెనాల్టీ విధించింది అమెరికా న్యాయ విభాగం. 14.5 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు 107 కోట్ల రూపాయల దాకా) పెనాల్టీకి ఆదేశించింది. ఈ మేరకు ఫేస్బుక్ ఒక మెట్టు కిందకు దిగి.. ఒప్పందానికి రావడంతో వాదప్రతివాదనలకు ఆస్కారం లేకుండా వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ను ఉల్లంఘించిందనే ఆరోపణల ఆధారంగా ఫేస్బుక్ మీద అమెరికా న్యాయ విభాగం గత డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు బదులు తాత్కాలిక ఉద్యోగులకు(విదేశీ ఉద్యోగులు, హెచ్ 1-బీ వీసాదారులు తదితరులు) ప్రాధాన్యత ఇవ్వడంలాంటి చర్యలకు పాల్పడింది ఫేస్బుక్. ఇది ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ నిబంధనలకు విరుద్దమేనని లేబర్ విభాగం సైతం వాదించింది. ఈ తరుణంలో సెటిల్మెంట్కు ముందుకొచ్చిన ఫేస్బుక్.. భారీ పెనాల్టీ చెల్లింపునకు అంగీకరించింది. ఇక ఫేస్బుక్తో జరిగిన ఈ సెటిల్మెంట్ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు అమెరికా అటార్నీ జనరల్(సహాయక) క్రిస్టన్ క్లార్క్ . 35 ఏళ్లలో ఇదే అతిపెద్ద సివిల్ రైట్స్ విభాగపు సెటిల్మెంట్గా పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యోగులకు బదులు.. తాత్కాలిక వీసాదారులకు పీఈఆర్ఎం కింద (permanent labor certification program) ఫేస్బుక్ ఉద్యోగాలు ఇవ్వడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సివిల్ పెనాల్టీ కింద 4.75 మిలియన్ డాలర్లు, ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపించినందుకు మరో 9.5 మిలియన్ డాలర్లు పెనాల్టీ చెల్లించాలని ఒప్పందం చేసుకుంది ఫేస్బుక్. చదవండి: మాజీ ఉద్యోగి చిచ్చు..వందల కోట్లు ఖర్చుకు సిద్ధమైన జుకర్బెర్గ్ ఇదీ చదవండి: జుకర్బర్గ్ కలత.. రాజీనామా? -
H-1B Visa: లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు
వాషింగ్టన్: భారతీయులకు భారీగా ఊరట కలిగేలా అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతి ద్వారా హెచ్–1బీ వీసాల మంజూరుకు బదులుగా వేతనాల ఆధారంగా వీసాలు ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ప్రతిపాదనల్ని అమెరికా ఫెడరల్ జడ్జి కొట్టేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన అధికారాలన్నీ ఉపయోగించుకొని వలస విధానంలో ఎన్నో మార్పుల్ని తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో విదేశాల నుంచి వలసలకు అడ్డుకట్ట వేయడానికి వేతనాల అధారంగా హెచ్–1బీ వీసాలను జారీ చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ఈ ప్రతిపాదనల్ని కాలిఫోరి్నయాలోని జిల్లా కోర్టుకు చెందిన ఫెడరల్ న్యాయమూర్తి జడ్జి జెఫ్రీ ఎస్ వైట్ కొట్టేశారు. అప్పట్లో తాత్కాలిక అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిగా చాద్ వుల్ఫ్ నియామకం చట్టబద్ధంగా జరగలేదని, అందుకే ఆయన ఆధ్వర్యంలో చేసిన ఈ సవరణల్ని కొట్టేస్తున్నట్టుగా న్యాయమూర్తి స్పష్టం చేశారు. వేతనాల ఆధారంగా హెచ్–1బీ వీసాలు మంజూరు చేస్తే విదేశాల నుంచి తక్కువ వేతనాలకు వచ్చే వారి సంఖ్య తగ్గి పోతుందని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని పేర్కొంటూ అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి దానిని కొట్టేయడంతో భారతీయులకు భారీగా ఊరట లభించింది. ఐటీ కంపెనీలు హెచ్–1బీ వీసా మీద భారత్, చైనా నుంచి భారీ సంఖ్యలో టెక్కీలకు ఉద్యోగాలు ఇస్తుంటాయి. ట్రంప్ తీసుకువచ్చిన సవరణల ప్రకారం వేతనాల ఆధారంగా వీసాలు ఇస్తే కనుక అత్యంత నైపుణ్యం కలిగిన, భారీ వేతనాలు అందుకొనే వారికి మాత్రమే అమెరికా వెళ్లే అవకాశం లభిస్తుంది. తక్కువ వేతనానికి ఉద్యోగుల్ని నియమించుకోవడానికి వీలు కాదు. అందుకే టెక్ కంపెనీలన్నీ ఈ ప్రతిపాదనల్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతీ ఏడాది 65 వేల హెచ్–1బీ వీసాలను మంజూరు చేస్తారు. దానికి అదనంగా మరో 20 వేల వీసాలు అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వారికి ఇస్తారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట అన్నవిధానంతో పాటు లాటరీ విధానం ద్వారా ఈ వీసాలను మంజూరు చేస్తారు. -
గ్రీన్కార్డుకు ఇక సూపర్ ఫీ!
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయులకు ఊరట లభించనుంది. అమెరికన్ కాంగ్రెస్లో ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషియరీ కమిటీ రూపొందించిన రీకన్సిలియోషన్ బిల్లులో వివరాల ప్రకారం... గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సూపర్ ఫీ చెల్లించడానికి ముందుకు వస్తే గ్రీన్కార్డుని అప్పటికప్పుడే పొందవచ్చు. అదే విధంగా లీగల్ డ్రీమర్స్ (తల్లిదండ్రుల హెచ్–1బీ వీసాతో చిన్నారులుగా దేశానికి వచ్చి 21 ఏళ్లు నిండిన వారు) ఈ సప్లిమెంటరీ ఫీజు కడితే వారికి శాశ్వత నివాసం, పౌరసత్వం లభిస్తుంది. త్వరలోనే ఈ బిల్లు కాంగ్రెస్ ముందుకు రానుంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డుల్ని ప్రతీ ఏడాది అమెరికా 1.40 లక్షలు మంజూరు చేస్తుంది. దీంట్లో ఏ ఒక్క దేశానికీ 7 శాతానికి మించి గ్రీన్కార్డులు మంజూరు చేయకూడదనే పరిమితి ఉంది. భారతీయులు అధిక సంఖ్యలో గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేస్తూ ఉండడంతో ఈ కోటా వల్ల దరఖాస్తుదారులు ఎక్కువగా పెరిగిపోతున్నారు. కాటో ఇనిస్టిట్యూట్కు చెందిన వలస విధాన నిపుణుడు డేవిడ్ బెయిర్ అధ్యయనం ప్రకారం ఉద్యోగ ఆధారిత గ్రీన్కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయుల సంఖ్య ఏప్రిల్ 2020 నాటికి 7.41 లక్షలుగా ఉంది. వీరందరికీ కార్డు రావాలంటే 84 ఏళ్లు వేచి చూడాలని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫీ చెల్లిస్తే గ్రీన్కార్డు రావడం అన్నది సువర్ణావకాశమని బెయిర్ అన్నారు. 5 వేల డాలర్లు చెల్లించే వారందరికీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తే అంతకు మించినది ఏముంటుందని పేర్కొన్నారు. ఇక అత్యవసర రంగాలైన ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయంతో పాటుగా రవాణా, ఐటీకి చెందిన కంపెనీల్లో పని చేసేవారికి వారి యాజమాన్యం స్పాన్సర్ చేయకపోయినా.. 5 వేల డాలర్లు చెల్లించి గ్రీన్కార్డు పొందే అవకాశం ఉంటుంది. ఒక రకంగా బైడెన్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ఈ పని చేస్తూ ఉందని న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ వ్యవస్థాపకుడు సైరస్ డి మెహతా అన్నారు. బడ్జెట్ రీ కన్సిలేషన్ బిల్లులో భాగంగా దీనిని చేర్చడంతో కాంగ్రెస్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని మెహతా ధీమాగా చెప్పారు. బిల్లులో ఏముందంటే.. ► ఉద్యోగ ఆధారిత వలసదారులు గ్రీన్కార్డు ప్రయార్టీ తేదీ కంటే ఇంకా రెండేళ్లు ఎక్కువ గా నిరీక్షించాల్సి వచి్చనప్పుడు 5 వేలడాలర్ల సూపర్ ఫీ చెల్లిస్తే అప్పటికప్పుడు వారికి గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు. ► కుటుంబ ఆధారిత వలసదారులు, అమెరికా పౌరులెవరైనా స్పాన్సర్ చేస్తే గ్రీన్కార్డు రావాల్సిన సమయంలో కంటే రెండేళ్లు ఎక్కువ నిరీక్షించిన తర్వాత సప్లిమెంట్ ఫీజు కింద 2,500 డాలర్లు చెల్లించాలి. ► వలస విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దేశాల పరిమితి కోటా ఎత్తేయడం, హెచ్–1బీ వీసా వార్షిక కోటా పెంచడం వంటి వాటికి ఈ బిల్లులో చోటు దక్కలేదు. -
డ్రీమర్ల కల తీర్చనున్న అమెరికా
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న చట్టబద్ధ వలసదారుల పిల్లల ‘పౌరసత్వం’ కల నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ ప్రకటించింది. అమెరికాలో హెచ్–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు. ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు. అప్పుడు వారివారి స్వదేశాలకు అమెరికా సాగనంపుతుంది. ఈ ప్రమాదం నుంచి వీరందరినీ బయటపడేసేందుకు బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని వైట్హౌస్ ప్రకటించింది. భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా అమెరికా శాశ్వత నివాస ధ్రువీకరణ ‘గ్రీన్ కార్డు’ కోసం ఎదురుచూస్తున్నారు. వీరు గ్రీన్కార్డుల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుండటంతో వారి పిల్లల వయసు 21 దాటుతోంది. అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రీమర్లు 21ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు. 21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్ హోదా పోతుంది. అమెరికా పౌరసత్వ కల వీరందరికీ అలాగే ఉండిపోయింది. ‘ఇంప్రూవ్ ది డ్రీమ్’ గణాంకాల ప్రకారం రెండు లక్షల మంది డ్రీమర్లు ఉన్నారని, అందులో అధికశాతం మంది భారతీయులేనని సమాచారం. వీరి పౌరసత్వ కల నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా వలస విధానంలో సంస్కరణలు తేవాల్సిన తరుణం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు సెనేట్కు పంపారు. పాత చట్టానికి సవరణలు, వాడని వీసాలను స్వాధీనం చేసుకోవడం, చాన్నాళ్లు వేచి ఉండే పద్ధతికి స్వస్తి పలకడం, ‘ఒక్కో దేశానికి గరిష్ట పరిమితిలోనే అనుమతులు’.. ఇలా అనేక కుటుంబ ఆధారిత వలస విధానంలో సంస్కరణలు ఆ బిల్లులో ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. డ్రీమర్లు అమెరికాలో పనిచేసుకునేందుకు, చట్టం అనుమతించిన వయసు పరిమితిని దాటినా వారికి రక్షణ కల్పించే అంశాలూ ఈ బిల్లులో ఉన్నాయని వైట్హౌస్ అధికార ప్రతినిధి కూడా అయిన జెన్సాకీ చెప్పారు. -
హెచ్–1బీ వీసాల జారీకి రెండోసారి లాటరీ
వాషింగ్టన్: హెచ్–1బీ వర్క్ వీసా కోసం ఎదురు చూస్తున్న భారత ఐటీ నిపుణులకు శుభవార్త. ఈ వీసాల జారీకి రెండోసారి లాటరీ నిర్వహించాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నిర్ణయించింది. మొదటి దశలో వీసాలు పొందలేని వారికి ఈ విధంగా మరో అవకాశం లభించనట్లే. హెచ్–1బీ వీసాల జారీకి ఈ ఏడాది ప్రారంభంలో కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించారు. అయితే, అర్హులైన వారు చాలామంది వీసాలు పొందలేకపోయారు. అందుకే రెండోసారి లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ గురువారం ప్రకటించింది. ఏటా కేవలం 65వేల హెచ్–1బీ వీసాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. హెచ్–1బీ అనేది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. దీనితో అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను స్వదేశంలో ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. రెండోసారి లాటరీ విషయంలో పిటిషన్ ఫైలింగ్ ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. -
H-1B Visa: భారత టెక్కీలకు మరో ఛాన్స్!
H-1B Visa Second Lottery: భారత టెక్కీలకు ఊరట ఇచ్చే వార్త ప్రకటించింది యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ. రెండో రౌండ్ లాటరీ పద్ధతిలో హెచ్-1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున.. జులై 28న మరికొందరిని ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగష్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనన్నుట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది. ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లలో (ఏప్రిల్ 1 నుంచి 30 దాకా నమోదు చేసుకున్నవాళ్ల) మొదటి లాటరీలో ఎంపిక చేసింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయామని, కాబట్టే, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహిస్తున్నట్లు USCIS వెల్లడించింది. తద్వారా అదనంగా వందల మంది ఆశావాహ టెక్కీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఇది స్టెమ్-ఓపీటీ స్టూడెంట్స్కు భారీ ఊరట ఇవ్వనుంది. కాగా, హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంటుంది. తద్వారా చైనీయులకు-భారతీయులకు ఆయా దేశాల ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. -
హెచ్–1బీ వీసాలను రెట్టింపు చేయండి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత నానాటికీ తీవ్రమవుతోందని యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ప్రొఫెషనల్ వర్క్ఫోర్స్ అవసరం భారీగా పెరుగుతోందని గుర్తుచేసింది. కొరతను అధిగమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జో బైడెన్ ప్రభుత్వానికి, కాంగ్రెస్కు(పార్లమెంట్) విజ్ఞప్తి చేసింది. విదేశీ నిపుణులను రప్పించడానికి వీలుగా హెచ్–1బీ వీసాల సంఖ్యను రెట్టింపు చేయాలని సూచించింది. గ్రీన్కార్డుల జారీ విషయంలో అమల్లో ఉన్న దేశాలవారీ కోటా వ్యవస్థను ఎత్తివేయాలని పేర్కొంది. తగినంత మంది వృత్తి నిపుణులు అందుబాటులో లేకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుజానే క్లార్క్ చెప్పారు. ఈ పరిణామం నూతన ఉద్యోగాల సృష్టికి అడ్డంకిగా మారుతుందని అన్నా రు. ఎంప్లాయ్మెంట్ ఆధారిత వీసాలను ప్రతిఏ టా కేవలం 1,40,000 మాత్రమే ఇస్తున్నారని, వీటిని 2,80,000 పెంచాలని విజ్ఞప్తి చేశారు. -
H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట
వాషింగ్టన్: ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసాలను అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే ట్రంప్ పాలనా కాలపు విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. ఈ నిబంధన తొలగింపుతో లీగల్ ఇమ్మిగ్రేషన్కు ఉన్న అడ్డంకులు మరింతగా తగ్గనున్నాయి. జోబైడెన్-హారిస్ నేతృత్వంలో తీసుకున్న విధాన చర్యలు దేశ చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు అనవసరమైన అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడుతుందని యుఎస్సీఐఎస్ డైరెక్టర్ ట్రేసీ రెనాడ్ చెప్పారు. అలాగే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు సంబంధించి వలసదారులపై భారాన్ని తగ్గించాలన్న లక్ష్యానికనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రంప్ 2018లో తెచ్చిన ఈ నిబంధన హెచ్1బీతో సహా ఎల్1, హెచ్2బీ, జే1, జే2, ఎఫ్, ఓ తదితర వీసా అప్లికేషన్లపై పడింది. తాజాగా ఆర్ఈఎఫ్, ఎన్ఓఐడీ నిబంధనలను మారుస్తున్నట్లు, కొన్ని రకాల ఎంప్లాయ్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ల కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2013లో తీసుకువచ్చిన నిబంధనలనే తిరిగి అమలు చేస్తామని, 2018లోతెచ్చిన నిబంధనను తొలగిస్తామని తెలిపింది. తాజా నిర్ణయంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునే వీలు వీసా దరఖాస్తుదారులకు కలగనుంది. 2018 నిబంధన ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వీసాలు తిరస్కరించేందుకు ఏజెన్సీ అధికారులకుఅవకాశం ఉండేది. దీని ప్రభావం పలు ఐటీ కంపెనీల ఉద్యోగులపై పడింది. చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ సజావుగా కొనసాగేందుకు తాము తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని హోమ్లాండ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో తెలిపారు. చదవండి : Petrol Price: రూ.102 దాటేసింది! -
మోసపూరితంగా ‘హెచ్1బీ’.. వెలుగులోకి భారీ స్కాం..!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో పని చేయాలను కొనే భారతీయ వృత్తి నిపుణులకు హెచ్1–బీ వీసాలను అక్రమ మార్గాల్లో మంజూరు చేయిస్తూ క్లౌడ్జెన్ ఎల్ఎల్సీ అనే టెక్నాలజీ కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ‘బెంచ్ అండ్ స్విచ్’ పద్ధతిలో ఈ సంస్థ సాగించిన కుంభకోణం అమెరికా టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరంలో వెలుగుచూసింది. ప్రస్తు తం అక్కడి ఫెడరల్ కోర్టులో ‘క్లౌడ్జెన్’పై వీసాల దుర్వినియోగం అభియోగాల కేసు నడుస్తోంది. మే 28న జరిగిన వాదనల్లో ‘క్లౌడ్జెన్’ వైస్ ప్రెసిడెంట్ జొమాన్ చొక్కలక్కల్ తాము మోసపూరితంగా పలువురికి హెచ్1–బీ వీసాలు ఇప్పించినట్లు న్యాయస్థానంలో అంగీకరించారు. ఈ కేసులో సెప్టెంబర్ 16న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సంస్థకు సుమారు 10 లక్షల డాలర్ల జరిమానా, ఐదేళ్లపాటు అవకాశం ఉంది. ఈ వ్యవహారం అక్కడి ఎన్ఆర్ఐలలో పెద్ద దుమారమే రేపుతోంది. రొమేనియా, కెనడా కేంద్రంగా నడుస్తున్న క్లౌడ్జెన్ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఒక శాఖ హైదరాబాద్లోని గచ్చిబౌలిలోనూ ఉంది. ప్రస్తుతానికి ఈ సంస్థ మూతబడింది. కుంభకోణం జరిగింది ఇలా.. అమెరికా కేంద్రంగా నడిచే పలు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1–బీ వీసాలు మంజూరు చేస్తారు. నిబంధనల ప్రకారం ముందుగా అక్కడ ఉన్న కంపెనీలతో ‘క్లౌడ్జెన్’ ఒప్పందం చేసుకొని నిపుణులను సరఫరా చేయాలి. ఏదైనా కంపెనీ ఫలానా వృత్తి నిపుణుడు కావాలని కోరినప్పుడు మాత్రమే అందుకు అర్హుడిని గుర్తించాలి. ఆపై వీసా ప్రాసెసింగ్ పూర్తి చేసి వారిని అమెరికా తీసుకువెళ్లాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. కానీ ‘క్లౌడ్జెన్’ మాత్రం నకిలీ కాంట్రాక్టులను లేబర్ డిపార్ట్మెంట్, హోంల్యాండ్ సెక్యూరిటీకి సమర్పించి అనుమతులు పొందేది. ఈ అనుమతులతో హెచ్1బీ వీసాలు దరఖాస్తు చేసేది. ఇలా వీసాలు లభించగానే భారతీయ నిపుణులను అమెరికా పంపేది. కానీ నిజంగా చేసేందుకు ఉద్యోగాలు లేకపోవడంతో వారికి అవసరమైన ఉద్యోగాలను వెతికిపెట్టే పని కూడా ‘క్లౌడ్జెన్’ చేసేది. విదేశీ వృత్తి నిపుణులు అందుబాటులో ఉండటంతో (బెంచ్) ఆ తర్వాత కాలంలో అమెరికా కంపెనీలకు అవసరమైన నిపుణులను వెంటనే అందించేది. ఇలా అక్కడి మార్కెట్లో అయాచిత లబ్ధి పొందేది. అప్పుడు ఆయా సంస్థలు భారతీయ వృత్తి నిపుణుల తరఫున ఇమ్మిగ్రేషన్ పత్రాలను (స్విచ్) సమర్పించేవి. ఉద్యోగాలు పొందిన భారతీయ వృత్తి నిపుణుల నుంచి ‘క్లౌడ్జెన్’ కమిషన్ తీసుకొనేది. ఇలా 2013 మార్చి నుంచి 2020 డిసెంబర్ వరకు సుమారు 5 లక్షల డాలర్లను క్లౌడ్జెన్ సంపాదించింది. ఈ కంపెనీకి శశి పల్లెంపాటి ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా జొమాన్ చొక్కలక్కల్, సుదీప్ చందక్ వ్యవహరిస్తున్నారని సంస్థ వెబ్సైట్ పేర్కొంది. -
అమెరికాలో వెలుగుచూసిన ఘరానా మోసం
న్యూయార్క్, హైదరాబాద్ : అమెరికాలో ఓ ఘరానా మోసం వెలుగుచూసింది. హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బీ వీసా స్కామ్ బయటపడింది. క్లౌడ్జెన్ అనే ఓ టెక్ కంపెనీ 'బెంచ్ అండ్ స్విచ్' తరహా మోసానికి పాల్పడింది. థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు ఇచ్చింది. కాంట్రాక్టుల ఆధారంగా హెచ్1బీ వీసాలు జారీ చేసింది. అమెరికా చేరుకున్న తర్వాత ఉద్యోగులకు పని వెతికి.. అడిగిన కంపెనీకి హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులను సరఫరా చేసింది. సాధారణంగా హెచ్1బీ ప్రాసెస్ ద్వారా ఉద్యోగులను పొందడానికి సుదీర్ఘ ప్రయాస పడాల్సి ఉంటుంది. అయితే, వీసాతో రెడీగా ఉన్న ఉద్యోగులను కలిగి ఉండడం క్లౌడ్జెన్కు మార్కెట్లో అడ్వాంటేజ్గా మారింది. ఉద్యోగుల నుంచి కమీషన్ల రూపంలో.. 2013 నుంచి 2020 మధ్య 5 లక్షల డాలర్ల మేర వసూళ్లు చేసింది. రికార్డుల ప్రకారం పల్లెంపాటి శశి క్లౌడ్జెన్ సంస్థకు ప్రెసిడెంట్గా ఉన్నారు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం మానస్పాస్, హైదరాబాద్ గచ్చిబౌలి.. కెనడా, రొమేనియా దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. కాగా, క్లౌడ్జెన్ కంపెనీ ప్రతినిధులు టెక్సాస్లోని హూస్టన్ కోర్టులో తమ నేరాన్ని అంగీకరించారు. చదవండి : పెళ్లైన 2 రోజులకే భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం -
H-1B Visa: భాగస్వాముల వీసాలకు గూగుల్ మద్దతు
వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం కలిగిన వలసదారులైన హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్ వీసాలు అందించేందుకు గూగుల్ సంస్థ మద్దతు ప్రకటించింది. ఈ విషయంపై ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ సైతం ఈ జాబితాలో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్ మద్దతుగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో సుందర్పిచాయ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్4ఈఏడీ(ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆవిష్కరణలు పెరిగి ఉద్యోగ సృష్టి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. Google is proud to support our nation’s immigrants. We joined 30 other companies to protect the H-4 EAD program which spurs innovation, creates jobs and opportunities, and helps families. https://t.co/AvmEbLve3C — Sundar Pichai (@sundarpichai) May 14, 2021 హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీ తత్వం దెబ్బతింటోందని అక్కడి కోర్టులో దాఖలైన కేసులో గూగుల్ మరో 30 సంస్థల తరపున అఫిడవిట్ సమర్పించింది. హెచ్1బీ వీసాదారు కుటుంబసభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను కోరుకుంటున్నామని పేర్కొంది. దాని ద్వారా సుమారు 90వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆ సంస్థ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలుకేథరిన్ లఖవేరా తెలిపారు. హెచ్1బీ వీసా కలిగిన వారు తమ భాగస్వామితో పాటు పిల్లలు కూడా అమెరికాలో ఉండేందుకు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అనుమతి ఇస్తుంది. ‘వలసదారులకు మద్దతుగా నిలిచేందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరో 30 సంస్థలతో కలిసి హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాం. దీని వల్ల ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలుపెరుగుతాయి. ఈ కార్యక్రమం వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని పిచాయ్ ట్వీట్ చేశారు. అడోబ్, అమెజాన్, యాపిల్, ఈబే, ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపాల్, ట్విటర్ సహా ఇతర కంపెనీలు హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అనేక ఆంక్షలు విధించారు. ఇక జోబైడెన్ అధ్యక్షుడుఅయిన తర్వాత ట్రంప్ విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను ఉపసంహరించిన విషయం తెలిసిందే. చదవండి: భారతీయ టెక్కీలకు భారీ ఊరట -
టెకీల జీవిత భాగస్వాముల కలలు ఆవిరి!
అమెరికాలోని భారతీయ టెకీల జీవిత భాగస్వాముల కలలు ఆవిరవుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) వారికి చుక్కలు చూపుతోంది. హెచ్4(డిపెండెంట్) వీసాలు కలిగి ఉండే హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ చట్టబద్ధంగా ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్–ఈఏడీ (అంటే వర్క్ పర్మిట్ అన్నమాట) జారీలో తీవ్ర జాప్యం చేస్తోంది. కరోనా పేరు చెప్పి నెలల తరబడి వారి ఈఏడీ రెన్యూవల్ దరఖాస్తులను పక్కన పెట్టేసింది. ఫలితంగా మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. దేశంకాని దేశంలో అహోరాత్రులు కష్టపడి చేస్తున్న ఉద్యోగం హఠాత్తుగా ఊడిపోవడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఈఏడీ రెన్యూవల్కు 14 నుంచి 16 నెలలు పడుతోందని, ఈ పరిణామం తమ జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందని వాపోతున్నారు. తమ గోడును పట్టించుకునే వారు లేక విలవిల్లాడుతున్నారు. హెచ్4 వీసాలు కలిగిన జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకొనే హక్కు కల్పించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ అంశంపై స్పందించాలంటూ నిత్యం వందలాది మంది ఆయనకు మెయిల్స్ పంపుతున్నారు. అమెరికా నుంచి కంచర్ల యాదగిరిరెడ్డి హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభించడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఈలోగా జీవిత భాగస్వామి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంటే విద్యార్హతలు ఉన్నా అమెరికాలో పని చేయడానికి గతంలో ఆ అవకాశం ఉండేది కాదు. ఇది ఆయా కుటుంబాలకు ఇబ్బందిగా ఉందని గ్రహించిన నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లో కొత్త ప్రతిపాదన తెచ్చారు. హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్కార్డు కోసం వేచి చూస్తున్న వారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా హెచ్4 ఈఏడీ బిల్లును ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో 2016 నుంచి హెచ్1బీ జీవిత భాగస్వాములకు ఈఏడీ లభిస్తోంది. దీనివల్ల 1.34 లక్షల మంది భారతీయ మహిళలు యూఎస్సీఐఎస్ నుంచి ఈఏడీ పొంది ఉద్యోగాల్లో చేరారు. జీవిత భాగస్వామి హెచ్1బీ గడువుకు అనుగుణంగా హెచ్4 వీసా రెన్యూవల్ చేస్తారు. కానీ ఏడాదిన్నరగా యూఎస్సీఐఎస్ ఈఏడీ రెన్యూవల్ చేయట్లేదు. చాలా మంది 15 నుంచి 20 నెలలుగా రెన్యూవల్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కరోనా కేసులతోపాటు మరికొన్ని కారణాలను చూపుతూ యూఎస్సీఐఎస్ ఈఏడీల పునరుద్ధరణలో జాప్యం చేస్తోందని, 90 వేల మందికిపైగా భారతీయ గృహిణులు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ సంస్థకు చీమకుట్టినట్లు కూడా లేదని భారతీయ, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ నిపుణుడు ఇందర్జిత్ అహ్లూవాలియా మండిపడ్డారు. మునుపెన్నడూ తాను ఇలాంటి దురుసుతనాన్ని చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. హెచ్4 ఈఏడీకి మరికొన్ని సంగతులు... ► హెచ్1బీ వీసా మూడేళ్లు ఉంటే అంతే కాలానికి హెచ్4 ఈఏడీ జారీ చేస్తారు. మామూలుగా ఆరేళ్లుగా రెన్యూవల్కు ముందే హెచ్1బీతోపాటే హెచ్4 జారీ చేసేవారు. ఇప్పుడు హెచ్1బీ జారీ అయి ఏడాది దాటినా హెచ్4 ఈఏడీ ఇవ్వడం లేదు. ► హెచ్ 4 ఈఏడీ కలిగి ఉన్న జీవిత భాగస్వాములు అమెరికాలో ఏ ఉద్యోగమైన చేసుకునేందుకు అర్హులు. వీరికి హెచ్1బీ మాదిరి ఆంక్షలు ఉండవు. కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలే చేయాలన్న నిబంధనేమీ లేదు. కానీ భారతీయుల్లో 95 శాతం మంది టెకీ ఉద్యోగాలే చేస్తున్నారు. న్యాయస్థానాల్లో డజన్లకొద్దీ కేసులు... తమ ఈఏడీలను రెన్యూవల్ చేయడంలో యూఎస్సీఐఎస్ కావాలని తాత్సరం చేస్తోందంటూ బాధితులు అమెరికాలోని వివిధ రాష్ట్రాల కోర్టుల్లో రోజూ డజన్లకొద్దీ పిటిషన్లు వేస్తున్నారు. ‘‘న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప మాకు గత్యంతరం లేదు. మేము పడుతున్న ఇబ్బందులను కోర్టులైనా అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాం’’ అని కంభాలపాటి అనూష అన్నారు. ఆమె టెక్సాస్లోని డాలస్ కోర్టులో తనకు న్యాయం చేయాలంటూ మరో 250 మందితో కలసి పిటిషన్ వేసింది. అమెరికన్ ఎకానమీలో భారతీయ వలసదారులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారంటూ ప్రశంసించడమే తప్ప అవసరమైన సందర్భాలలో ఆదుకోవడానికి అమెరికా కాంగ్రెస్ సభ్యులు ముందుకు రావట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఏడీ కార్డు రెన్యూవల్ చేయలేదు హెచ్4 వీసాపై సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న నాకు 10 నెలల నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఉద్యోగ ఆధారిత కార్డు (ఈఏడీ) రెన్యూవల్ చేయకపోవడంతో మా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దానికి తోడు నా రెండేళ్ల కుమారుడు ఆటిజం వ్యాధి చికిత్సకు నెలకు అవసరమైన 2,500 డాలర్లు సమకూర్చలేక నరకయాతన అనుభవిస్తున్నా. – ప్రియాంక జొన్నలగడ్డ 11 నెలలుగా ఉద్యోగం లేదు కేన్సర్ బారిన పడిన నేను 11 నెలలుగా ఉద్యోగం లేక అల్లాడుతున్నా. నా భర్త జీతం కుటుంబ అవసరాలకూ సరిపోవట్లేదు. నా వ్యాధికి చికిత్స తీసుకునేందుకు వీలుగా తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఈఏడీ మంజూరు చేయాలని యూఎస్సీఐఎస్ను వేడుకున్నా. కానీ కేన్సర్ బారినపడిన మీరు ఇంకా పనిచేయగల పరిస్థితిలో ఉన్నారా అంటూ యూఎస్సీఐఎస్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఇంకెందుకు బతికున్నానా అనిపించింది’’ – గీతా సుశీల్కర్ అసలే కరోనా.. ఆపై అసలే కరోనా హమమ్మారి, దీనికితోడు కుటుంబంలో ఒకరి ఉద్యోగం పోగొట్టుకున్న 90 వేల మందికిపైగా భారతీయ కుటుంబాలు అప్పటివరకు వస్తున్న ఆదాయానికి గండిపడటంతో సంసారం గడవడం గగనమై చితికి పోయాయి. కెరీర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయ యువతీయువకులు ఇప్పుడు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. – జాన్ మేయర్ ,హాఫ్ మన్ లా గ్రూపు నిపుణుడు -
భారతీయ టెక్కీలకు భారీ ఊరట
వాషింగ్టన్: డాలర్ డ్రీమ్స్ కలలుకంటున్న భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. హెచ్1బీ సహా విదేశీ వర్కర్స్ వీసాలపై నిషేధం విధిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల గడువు మార్చి 31తో ముగిసింది. అధ్యక్షుడు అధ్యక్షుడు బైడెన్ ఆ నిషేధాన్ని మళ్లీ పొడిగిస్తూ ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయకపోవడంతో అమెరికాకు వెళ్లాలనుకునే వివిధ దేశాలకు చెందిన టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది కరోనా సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొని ప్రపంచ మార్కెట్లు మూతపడిన సమయంలో ట్రంప్ హెచ్–1బీ సహా వలసేతర వీసాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించారు. తొలుత డిసెంబర్ 31వరకు నిషేధం విధించారు. ఆ తర్వాత ఆ నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. తాను అధికారంలోకి వస్తే వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. అమెరికాలో దీనిపై పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించాయి. హెచ్1బీపై నిషేధం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని, నిపుణులైన పనివారు దొరకరని కొందరు వాదిస్తే, తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులు దొరకడం వల్ల స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. వీసాలపై నిషేధాన్ని కొనసాగించాలంటూ కొందరు రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు బైడెన్కు లేఖలు కూడా రాశారు. కరోనా సంక్షోభంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, దాదాపుగా కోటి మంది అమెరికన్లు ఉద్యోగాల్లేకుండా ఉన్నారని అందుకే హెచ్–1బీలపై నిషేధం పొడిగించాల్సిందేనంటూ మిసౌరీ సెనేటర్ జోష్ హాలీ ఆ లేఖలో పేర్కొన్నారు. -
H1B Visa: హెచ్1బీ వీసాలపై గుడ్న్యూస్
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు తెచ్చిన హెచ్1బీ వీసా నిషేధాన్ని కొనసాగించకూడదని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తెచ్చిన నిషేధ కాలవ్యవధి బుధవారం ముగుస్తుండగా, దీన్ని పొడిగించకూడదని బైడెన్ భావించినట్లు తెలిసింది. ఈ నిషేధం కారణంగా పలు టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా నిషేధం తొలగిపోవడం, నిషేధాన్ని బైడెన్ వద్దనుకోవడం.. టెక్ కంపెనీలకు మంచిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా వైట్హౌస్ అధికారిక ప్రకటన చేయలేదు. కొందరు అధికారులు మాత్రం నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తే అమెరికా కంపెనీలకు మంచిది కాదని, అందువల్ల నెమ్మదిగా తొలగించాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా కొత్త గ్రీన్ కార్డులు జారీ చేయకూడదన్న ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ రద్దుచేయడం తెల్సిందే. ఈ నిర్ణయాలు అమెరికాకు, ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమని బైడెన్ వ్యాఖ్యానించారు. వీసాపై నిషేధాన్ని అమెరికాలో లేబర్ యూనియన్లు స్వాగతించాయి. హెచ్1బీ ప్రాథమిక ఈ–రిజిస్ట్రేషన్ ఎంపిక పూర్తి రాబోయే ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ విదేశీ వర్కర్ వీసాల పరిమితి పూర్తయినట్లు అమెరికా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రాథమిక రిజిస్ట్రేషన్ íపీరియడ్లో సరిపడ్డా ఈ– అప్లికేషన్లు వచ్చాయని, 2022 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాలకు సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపింది. అమెరికాలో ఉద్యోగానికి వెళ్లే భారతీయ ఐటీ నిపుణులకు ఈ వీసాలు ఎంతో కీలకం. ఈ వీసాల కోసం సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తామని అమెరికా పౌరసత్వం మరియు వలసదారుల సేవా కేంద్రం (యూఎస్సీఐఎస్) పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేయాలంటే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసాలు తప్పనిసరి. వీటికి కేవలం భారత్ నుంచే కాక పలు దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. -
హెచ్1బీ వీసా సమస్యలు పరిష్కరిస్తాం
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ టెక్కీలు అత్యధికంగా వినియోగించే హెచ్–1బీ తదితర వీసాలపై గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన త్రీ పాలసీ మెమొస్ విధానం కారణంగా ఏర్పడిన ప్రతికూలతను పరిష్కరిస్తామని జో బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేసినప్పటికీ దాని వల్ల ఏర్పడిన వ్యతిరేక ప్రభావాల్ని సవరించే అంశాలను పునఃపరిశీలిస్తామని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం ప్రకటించింది. జో బైడెన్ ప్రభుత్వ నిర్ణయంతో భారత్ సహా విదేశీ టెక్కీలకు భారీగా ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో విధిం చిన ఆంక్షలతో భారతీయ వృత్తి నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసా చెల్లుబాటు కాలం, యాజమాన్యానికి, ఉద్యోగులకి మధ్య ఉన్న సంబంధాలు, విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఆంక్షలు విధించింది. విదేశీయులకు కనీస వేతనం అమలు వాయిదా హెచ్1–బీ వీసా వినియోగదారులకు కూడా అమెరికన్లతో సమానంగా అధిక వేతనాన్ని చెల్లించాలంటూ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయం అమలును బైడెన్ సర్కార్ మే 14వరకు వాయిదా వేసింది. తక్కువ వేతనానికి భారతీయులు సహా ఇతర విదేశీయుల్ని పనిలోకి తీసుకోవడం వల్ల అమెరికన్లకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయన్న ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. అయితే బైడెన్ నిర్ణయం అమలును వాయిదా వేయడంతో భారతీయ టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. -
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ : బైడెన్ తాజా నిర్ణయం
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో తీపి కబురు అందించారు. హెచ్-1బీ వీసాల వేతనాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు. హెచ్-1బీ వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్ సర్కారు గతంలో తెచ్చిన నిబంధన అమలును మరింత ఆలస్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కార్మిక శాఖ శుక్రవారం ప్రచురించిన ఫెడరల్ నోటిఫికేషన్లో, మే 14 వరకూ దీని అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తమ నిర్ణయం అమెరికాలోని కొంతమంది విదేశీయుల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల వేతన ప్రయోజనాలను కాపాడనుందని తెలిపింది. ఫలితంగా భారతీయ ఐటీ నిపుణులకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కాలపరిమితిని మరింత ఆలస్యం చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఇది మే 14 నుండి అమలులోకి రానుందని తెలిపింది. దీన్ని పొడిగించేముందు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా అమెరికా సంస్థలపై విదేశీ ఉద్యోగుల వేతన భారం తగ్గడంతోపాటు, విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తప్పనిసరి కనీస వేతననిబంధనను తీసుకొచ్చారు. దీనిపై ఇరువైపులా నిరసన భారీగానే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే బైడెన్ తాజా నిర్ణయాన్ని ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్(ఫెయిర్) సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా ఉద్యోగులు, సంస్థల భద్రత నిమిత్తం మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలు నిలుపుదలతో కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వారి పరిస్థితి మరింత క్షీణిస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం -
గుడ్న్యూస్ : హెచ్-1బీ రిజిస్ట్రేషన్ షురూ
వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి(మార్చి10)నుంచి ప్రారంభమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది.లాటరీ ద్వారానే హెచ్-1బీ వీసాలు అందజేస్తామని, కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఏప్రిల్ 1 నుండి దరఖాస్తులను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దరఖాస్తుదారుడు యూఎస్సీఐఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు(రూ.729)ప్రతి దరఖాస్తుదారుడు చెల్లించాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు వర్కర్కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందించాలి. ఎంపికైన దరఖాస్తుదారులు మాత్రమే హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేయడానికి అర్హులు. కాగా హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంది. తద్వారా భారతీయులకు ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. గత ఏడాది యూఎస్సీఐఎస్కు సుమారు 2.67 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఇందులో 60 శాతానికి పైగా భారత్కు చెందినవారు. ఈ ఏడాది కూడా దాదాపు 70 శాతం అంటే సుమారు 60వేల వీసాలు భారతీయులకి దక్కనున్నాయని అంచనా. -
హెచ్–1బీపై ఎటూ తేల్చని బైడెన్ ప్రభుత్వం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాల నిషేధాన్ని ఎత్తివేయడంపై బైడెన్ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. వలస విధానాన్ని సమూలంగా సంస్కరిస్తామని చెబుతూ వస్తున్న బైడెన్ ప్రభుత్వం హెచ్–1బీ వీసాలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తి వేస్తుందో లేదో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి అలెజాంద్రో మయోర్కస్ సూచన ప్రాయంగా వెల్లడించారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన టెక్కీలను ఈ వీసాల ద్వారానే టెక్నాలజీ కంపెనీలు వేలాది మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. భారత్కి చెందిన టెక్కీలు హెచ్–బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఈ వీసాలపై నిషేధం ఎత్తేస్తారో లేదో తేల్చుకోకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన టెక్ కంపెనీల్లో నెలకొంది. కరోనా సంక్షోభం సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగా ఈ నెల 31 వరకు హెచ్–బీ వీసాలపై నిషేధం విధించారు. అమెరికాలో నిరుద్యోగం అత్యధికంగా ఉండడంతో విదేశీ వర్కర్లకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేమన్న వాదనతో ట్రంప్ ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. పూర్తి చికిత్స అవసరం బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్రంప్ వలస విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంస్కరణలు మొదలు పెట్టింది. ముస్లింలపై వీసా ఆంక్షల్ని, కొత్త గ్రీన్కార్డుల జారీపై నిషేధాన్ని ఎత్తివేసింది. కానీ హెచ్–1బీలపై ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చెయ్యకపోతే మార్చి 31న నిషేధం దానంతట అదే రద్దయిపోతుంది. వైట్హౌస్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో గడువు కంటే ముందే నిషేధాన్ని ఎత్తివేస్తారా అని అడిగిన ప్రశ్నకు మయోర్కస్ స్పందిస్తూ ‘‘ఇలాంటి ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. వలస విధానాన్ని సంస్కరించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. దీనికి సమయం పడుతుంది’’అని చెప్పారు. మరోవైపు హెచ్–బీ వీసాల దరఖాస్తు స్వీకరణను ఇమిగ్రేషన్ విభాగం ప్రారంభించింది. కాగా, ఐటీ నిపుణులు కావాలంటే హెచ్–బీ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని, వీసాల సంఖ్యను పెంచాలని ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్బర్గ్, గూగుల్ సంస్థకి చెందిన సుందర్ పిచాయ్ డిమాండ్ చేస్తున్నారు. -
గ్రీన్కార్డు దరఖాస్తుదారులకు ఊరట..
వాషింగ్టన్: ట్రంప్ అమెరికా అధినేతగా ఉన్నప్పు డు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను తిరగతోడుతున్న అధ్యక్షు డు బైడెన్ గ్రీన్ కార్డు దరఖాస్తుదా రులకి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో దేశంలోకి అడుగుపెట్ట కుండా వీసాలపై ట్రంప్ హయాంలో విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకు న్నారు. ఈ మేరకు బుధవారం అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్కార్డుల దరఖాస్తుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. కరోనా సమయంలో ఏర్పడిన నిరుద్యోగాన్ని గాడిలో పెట్టాలంటే వీసాలపై నిషేధమే సరైనదంటూ అప్పట్లో ట్రంప్ నిర్ణయిం చారు. అయితే బైడెన్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వీసాలపై నిషే«ధం ఉండడం వల్ల ఎందరో ఉద్యోగులు కుటుంబాలకు దూరమై మానసిక వేదన అనుభవిస్తారని, దాని ప్రభావం అమెరికా వాణిజ్యంపైనే పడుతుందని అన్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఎన్నో పరిశ్రమలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావం తుల సేవల్ని వినియోగించు కోకుండా నిరోధిస్తుంది. ఇక అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందిన వారు రానివ్వకుండా చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఉద్యోగుల్ని వారి కుటుంబ సభ్యులు కలవనివ్వకుండా చేస్తోంది. అందుకే వీసాపై నిషేధాన్ని ఎత్తేస్తున్నాను’’ అని బైడెన్ చెప్పారు. బైడెన్ నిర్ణయంతో హెచ్–1బీ వీసాపైన అమెరికాలో ఉన్న ఎందరో భారతీయ టెక్కీలు ఊపిరి పీల్చుకున్నారు. -
హెచ్–1బీ వీసాలకు దరఖాస్తుల వెల్లువ
వాషింగ్టన్: హెచ్–1బీ.. విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే ఈ వీసాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, హెచ్–1బీ వీసాలకు పరిమితి ఉంటుంది. ప్రతిఏటా కేవలం 65 వేల హెచ్–1బీ వీసాలను మాత్రమే యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన 20 వేల మంది విదేశీ విద్యార్థులకు ఈ వీసాలను అందజేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను వీసా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, ఇప్పటికే లెక్కలు మిక్కిలి దరఖాస్తులు వచ్చాయని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. త్వరలో కంప్యూటర్ ఆధారిత డ్రా ద్వారా హెచ్–1బీ వీసాలు జారీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు అమెరికా పౌరసత్వ చట్టం–2021ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టం కింద గ్రీన్ కార్డుల జారీపై ప్రస్తుతం ఉన్న పరిమితిని రద్దు చేయనున్నారు. దీంతో ఇండియన్ ఐటీ నిపుణులు భారీగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే అమెరికాలో వేలాది మంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం పెట్టుకున్న పిటిషన్లు గత పదేళ్లుగా పెండింగ్లోనే పడి ఉన్నాయి. -
మార్చి నుంచి హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్లు
వాషింగ్టన్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1–2022 సెప్టెంబర్ 30) హెచ్–1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 1న ప్రారంభం కానుందని అమెరికా సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు అందజేస్తామని వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. హెచ్–1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. -
లాటరీ విధానంలోనే హెచ్1బీ వీసా
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి భారతీయులు సహా విదేశీయులకు వీలు కల్పించే హెచ్–1బీ వీసాల మంజూరు ప్రక్రియలో ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన మార్పుల్ని బైడెన్ సర్కార్ వాయిదా వేసింది. ఈ ఏడాది కూడా సంప్రదాయ లాటరీ విధానం ద్వారా వీసాలు జారీ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31వరకు లాటరీ విధానమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త వీసా విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు చేర్పుల కోసం అధికారులకు మరింత సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. హెచ్–1బీ వీసా కింద అమెరికాలో పలు టెక్ కంపెనీలు భారత్, చైనా ఇతర దేశాల నుంచి వేలాది మందిని ఉద్యోగాల్లో తీసుకుంటూ ఉంటారు. ట్రంప్ అధికారంలో ఉండగా ఈ వీసాల జారీ ప్రక్రియలో çకంప్యూటరైజ్డ్ లాటరీకి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత విధానం తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం మార్చి 9 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీని అమలుకు అవసరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులకు మరింత సమయాన్ని ఇస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ కొత్త విధానం అమలును మార్చి 9 నుంచి డిసెంబర్ 31కి వాయిదా వేసినట్టుగా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వివరించింది. ప్రతిభ ఆధారిత వీసాలు..! వలసేతర వీసా అయిన హెచ్–1బీ కింద అమెరికా ఏటా 65 వేల వీసాలను మంజూరు చేస్తుంది. వర్సిటీల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో ఉన్నత స్థాయి విద్యనభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. ఈ వీసాలున్న విదేశీయులకు తక్కువవేతనం చెల్లిస్తూ పలు కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటూ ఉండడంతో అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న భావన నెలకొంది. -
భారతీయ మహిళలకే అధిక ప్రయోజనం!
వాషింగ్టన్: అమెరికాలో హెచ్4 వీసాలు ఉన్నవారికి పని అనుమతిని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఉపసంహరించారు. ఈ నిర్ణయంలో భారతీయ మహిళలే అధికంగా ప్రయోజనం పొందుతారన్న అంచనాలు వెలువడుతున్నాయి. హెచ్–1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములకు(భార్య లేదా భర్త), వారి పిల్లలకు (21 ఏళ్లలోపు వయసు) హెచ్4 వీసాలను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేస్తోంది. అమెరికాలో హెచ్–1బీ వీసా కింద పనిచేస్తున్నవారిలో అత్యధిక శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే. ఈ వీసాలతో అమెరికా కంపెనీలు విదేశీ సాంకేతిక నిపుణులను స్వదేశంలోనే నియమించుకోవచ్చు. ఇండియా, చైనా నుంచి ప్రతిఏటా వేలాది మంది హెచ్–1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో హెచ్–1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములు అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగ అనుమతి కార్డులు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ మహిళలే కావడం విశేషం. డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక వలసలపై కఠినంగా వ్యవహరించారు. హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అనుమతిని రద్దు చేస్తున్నట్లు 2017లో ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాలను తిరగదోడుతామని ఎన్నికల ప్రచారంలో జో బైడెన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే.. గడువు ముగిసిన హెచ్4 వీసాదారుల ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) చెల్లుబాటును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
హెచ్ 1బీ వీసా లాటరీ విధానానికి చెల్లు చీటీ
వాషింగ్టన్: హెచ్1 బీ వీసా ఎంపికకు ఇప్పటివరకు వాడుతున్న లాటరీ విధానాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అధిక వేతనాలు, అత్యున్నత నైపుణ్యాల ఆధారంగా ఇక హెచ్ 1 బీ వీసాలను జారీ చేయనున్నట్లు మంగళవారం అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ (డీఓఎల్) ప్రకటించింది. తాజా మార్పులతో హెచ్ 1 బీ వీసాతో, ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్తో యూఎస్లో ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది. విదేశాల నుంచి చవకగా లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్ ఉద్యోగులు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు. తాజా నిబంధనలు ఈ సంవత్సరం మార్చి 9 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయం ప్రధానంగా భారతీయ టెక్కీలపై, అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. తాజా నిబంధనల ప్రకారం.. సంబంధిత రంగంలో ఉద్యోగికి లభిస్తున్న సగటు వేతనం కన్నా ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధమైన కంపెనీల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా ఏటా జారీ చేసే 85 వేల హెచ్1బీ వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆక్యుపేషనల్ ఎంప్లాయిమెంట్ స్టాటిస్టిక్స్ (ఓఈఎస్) డేటా ఆధారంగా వివిధ ఉద్యోగ విభాగాల్లో వేతనాలను, నాలుగు స్థాయిలుగా (4 లెవెల్స్) విభజించి, డీఓఎల్ నియంత్రిస్తుంది. తాజా మార్పుల ప్రకారం.. ఈ స్థాయుల్లో కనీస వేతన స్థాయి భారీగా పెరగనుంది. అలాగే, భారత్ సహా విదేశీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్1బీ వీసా పొందేందుకు భారీగా వేతనాలను ఇవ్వాల్సి ఉంటుంది. రెండేళ్ల అనుభవం ఉన్నవారిపైనా ప్రభావం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థులపై, అలాగే, కాలేజీ అనంతరం ఒకటి, రెండేళ్ల అనుభవం ఉన్నవారిపై కూడా ఈ మార్పులు భారీగా ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాలను జారీ చేసే విధానంలో.. అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, సీనియర్లకు ప్రాధాన్యత లభించడం వల్ల విద్యార్థులు, తక్కువ అనుభవం ఉన్నవారు ఆ మేరకు నష్టపోనున్నారు. విదేశీ విద్యార్థులు ప్రధానంగా లెవెల్ 1 పరిధిలోకి వస్తారు. అయితే, తాజా నిబంధనలు విద్యార్థులపై ప్రభావం చూపబోవని యూఎస్సీఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) పేర్కొంది. వారి ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) సమయాన్ని అధిక వేతనం పొందగల స్థాయికి వెళ్లేలా అనుభవం పొందేందుకు వినియోగించుకునే అవకాశముందని వివరించింది. అయితే, కేవలం ‘స్టెమ్’ విద్యార్థులకు మాత్రమే మూడేళ్ల ఓపీటీ ఉంటుంది. మిగతా విభాగాల విదేశీ విద్యార్థులు కేవలం ఒక సంవత్సరం ఓపీటీకే అర్హులు. మరోవైపు, మాస్టర్స్ డిగ్రీ ఉన్న, ఓపీటీ ద్వారా కొంత అనుభవం పొందిన విద్యార్థులు లెవెల్ 2 ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. కానీ, ఈ లెవెల్ హెచ్1బీ వీసా దరఖాస్తుల్లో పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో వారికి వీసా లభించడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 50% పైగా దరఖాస్తులు ఈ లెవెల్ నుంచే వస్తాయన్నారు. ఈ ప్రతిపాదనలపై గతంలో జరిపిన అభిప్రాయ సేకరణలో పలు విశ్వవిద్యాలయాలు ఈ మార్పులపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగం లభించే విషయంలో నెలకొనే అనిశ్చితి వల్ల విదేశీ విద్యార్థులు అమెరికాను ఉన్నత విద్యకు ఎంపిక చేసుకోకపోవచ్చని పేర్కొన్నాయి. -
హెచ్1బీ లాటరీకి చెల్లుచీటి
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానానికి స్వస్తి పలికింది. హెచ్–1బీ వీసాల మంజూరు విషయంలో మంచి వేతనాలు, నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ను శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. నూతన ఎంపిక ప్రక్రియ 60 రోజుల్లో అమల్లోకి రానుంది. హెచ్–1బీ వీసాకు భారీ డిమాండ్ ఉంది. ఇది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసాతో అమెరికా కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను అమెరికాలోనే నియమించుకోవచ్చు. అమెరికా ఐటీ కంపెనీలు ప్రతిఏటా భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులను ఈ వీసా ద్వారానే రప్పించుకుంటున్నాయి. తదుపరి హెచ్–1బీ వీసా ఫైలింగ్ సీజన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో సవరణలు చేయడం ప్రాధాన్యం సంతరిచుకుంది. అమెరికాలోకి వలసలను నిరోధించే దిశగా ఇది మరో ప్రయత్నమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో భారతదేశ ఐటీ నిపుణులు, ఐటీ సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పునఃసమీక్షించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ట్రంప్ యంత్రాంగం నోటిఫికేషన్పై ఐటీ వర్గాలు స్పందించాల్సి ఉంది. -
హెచ్1 బీ వీసాలకు నేడు తీపి కబురు
వాషింగ్టన్: తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసే హెచ్-1బీ వీసాల ఎంపిక విధానంలో కొత్త సవరణలకు నేడు తెరతీయనున్నట్లు యూఎస్ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. తద్వారా నాన్ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ జారీకి ఇప్పటివరకూ అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఇకపై వీటి జారీలో వేతనాలు, నైపుణ్యాలకు పెద్దపీట వేయనున్నట్లు వివరించింది. కొత్త సవరణలను నేడు(8న) ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించనున్నట్లు తెలియజేసింది. వెరసి 60 రోజుల్లోగా తాజా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 60,000 వీసాలు ఈ ఏడాది(2021) హెచ్-1బీ వీసాల ప్రక్రియ ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. నాన్ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీలను అమెరికాలో కార్యకలాపాలు కలిగిన కంపెనీలు విదేశీ ఉద్యోగుల నియామకానికి వినియోగించుకునే సంగతి తెలిసిందే. నిబందనల సవరణపై ఇంతక్రితం 2020 నవంబర్ 2న యూఎస్ ప్రభుత్వం ముసాయిదా(నోటీస్) జారీ చేసింది. వీటిపై ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది. నిబంధనల ప్రకారం యూఎస్ ప్రభుత్వం ఏడాదికి గరిష్టంగా 60,000 హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. వీటికి అదనంగా స్థానిక యూనివర్శిటీలలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీంగ్, మ్యాథ్య్(STEM) సబ్జెక్టుల్లో డిగ్రీలు(హైయర్ స్టడీస్) చేసిన విద్యార్ధులకు 20,000 వీసాలను జారీ చేసేందుకు అవకాశముంది. (హెచ్1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్ షాక్) ఉద్యోగ రక్షణకు తాజా నిబంధనల ద్వారా యూఎస్ ఉద్యోగులకు ఆర్థికపరమైన రక్షణ కల్పించేందుకు వీలు చిక్కనున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు లబ్ది చేకూరనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలు ఇండియా, చైనా తదితర దేశాల నుంచి ఐటీ నిపుణులను ఎంపిక చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన సర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. హెచ్-1బీ వీసాల జారీ నిబంధనల్లో చేపడుతున్న తాజా సవరణల ద్వారా అధిక వేతనాలు ఆఫర్ చేసే కంపెనీలకు ప్రోత్సాహం లభించనుంది. అంతేకాకుండా అత్యంత నైపుణ్యమున్న ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం ద్వారా కంపెనీలు అంతర్జాతీయ బిజినెస్లలో మరింత పటిష్టతను సాధించేందుకు వీలుంటుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. హెచ్-1బీ వీసాల ద్వారా కొన్ని కంపెనీలు ప్రాథమిక స్థాయి ఉద్యోగులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా బిజినెస్ వ్యయాలను తగ్గించుకునేందుకు వినియోగించుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు ప్రస్తావించారు. ప్రస్తుత లాటరీ విధానం ద్వారా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ఎంపికలో కంపెనీలు సవాళ్లు ఎదురవుతున్నాయని, అంతేకాకుండా తగిన ప్రయోజనాలను అందుకోలేకపోతున్నాయని వివరించారు. ఫలితంగా తక్కువ వేతనాలతో ముడిపడిన ఉద్యోగులకు అధిక అవకాశాలు లభిస్తున్నట్లు చెప్పారు. ఇది యూఎస్ ఉపాధి మార్కెట్కు విఘాతం కలిగిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. -
భారతీయ టెకీలకు ట్రంప్ మరోసారి షాక్!
వాషింగ్టన్: వైట్హౌస్ వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ టెక్కీలకు మళ్లీ షాక్ ఇచ్చారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్ కార్డు, హెచ్–1బీతో పాటుగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఆధారిత వీసాలపై నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగించారు. అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి వీటిపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యంలో గత ఏడాది జూన్లో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అన్ని రకాల వీసాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లో నిషేధం గడువు ముగుస్తుందనగా గురువారం పొడిగింపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ట్రంప్ వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్–1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ వలసదారుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ టెకీలకు తీవ్ర ఎదురు దెబ్బ తగలనుంది. డాలర్ డ్రీమ్స్ కలల్ని నెరవేర్చుకోవడానికి అమెరికా వెళ్లాలంటే భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన వారు మరో మూడు నెలలవరకు ఎదురు చూడాల్సిందే. అమెరికా కంపెనీలకు 10 వేల కోట్ల నష్టం ! ట్రంప్ వీసా విధానంపై అమెరికాలోనూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం జరుగుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు జూన్లో ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో 500 టెక్ కంపెనీలకు 10వేల కోట్ల డాలర్లు నష్టం కలిగినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సారి నిషేధం పొడిగింపు వల్ల పెద్దగా నష్టం జరగదని, బైడెన్ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశాక వలసదారులకు అనుకూలంగా నిర్ణయాలుంటాయని భావిస్తున్నారు. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో 6.7శాతం ఉన్నందుకే నిషేధాన్ని పొడిగించానంటూ ట్రంప్ సమర్థించుకున్నారు. -
హెచ్1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్ షాక్
వాషింగ్టన్: దేశీ టెక్ నిపుణులు, ఐటీ కంపెనీలకు షాక్నిస్తూ హెచ్1 బీ వీసాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. వీటిపై గతేడాది విధించిన నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీసాల జారీకి మార్చి నెలాఖరువరకూ వీలుకాదని సంబంధితవర్గాలు తెలియజేశాయి. సుమారు 8 నెలలుగా హెచ్1 బీ, తదితర వర్క్ వీసాలపై ఆంక్షలను విధించిన ట్రంప్ తాజాగా మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగల కారణాలపై ట్రంప్ యథాప్రకారం పాత పల్లవినే ఎత్తుకున్నారు. కోవిడ్-19 వల్ల ఉపాధి మార్కెట్తోపాటు.. అమెరికా ప్రజల ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. కరోనా వైరస్ అమెరికన్ల జీవితాలకు విఘాతం కలిగిస్తున్నట్లు చెప్పారు. నవంబర్లో నిరుద్యోగిత 6.7 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్లో నమోదైన గరిష్టంతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ ఇప్పటికీ పలువురు ఉపాధి కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఉపాధి మార్కెట్, ప్రజా ఆరోగ్యాల విషయంలో పరిస్థితులు మెరుగుపడలేదని వివరించారు. చదవండి: (10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు) ఏప్రిల్ నుంచీ హెచ్1 బీ, తదితర వీసాల జారీపై ట్రంప్ 2019 ఏప్రిల్ 22న తొలిసారి నిలుపుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఆపై జూన్ 22న 6 నెలలపాటు నిషేధాన్ని పొడిగించారు. దీంతో డిసెంబర్ 31కల్లా గడువు ముగియనుండటంతో తాజాగా మరో మూడు నెలలు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మార్చి 31వరకూ నిషేధం అమలుకానుంది. ఫలితంగా భారీ సంఖ్యలో భారత ఐటీ నిపుణులు, పలు అమెరికన్, దేశీ సాఫ్ట్వేర్ సేవల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. 2021 ఏడాదికిగాను జారీ అయిన హెచ్1బీ వీసాలకు స్టాంపింగ్కు మార్చి నెలాఖరు వరకూ వేచిచూడవలసి ఉంటుందని విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్లో పనిచేసేందుకు వీలుగా సాఫ్ట్వేర్ సేవల కంపెనీలు హెచ్1బీ వీసాల ద్వారా ఐటీ నిపుణులను ఎంపిక చేసుకునే సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జారీ అయ్యే హెచ్1బీ వీసాలను భారతీయులే అత్యధికంగా పొందుతుంటారు. కాగా.. ట్రంప్ తాజా నిర్ణయంతో ఇప్పటికే గడువు తీరిన హెచ్1బీ వీసాల రెన్యువల్ సైతం పెండింగ్లో పడనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. (కోవిడ్-19లోనూ దిగ్గజాల దూకుడు) -
హెచ్–1బీ వీసాదారులకు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ టెక్కీలకు, ఐటీ కంపెనీలకు భారీ ఊరట లభించింది. హెచ్–1బీ వీసాల్లో ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన ఆంక్షల్లో రెండింటిని అమెరికా కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది చివరి వరకు హెచ్–1బీ వీసాలను రద్దు చేస్తూ అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్1–బీ వీసా విధానంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతాయంటూ అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకెక్కాయి. ఆ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి వీసా విధానంలో మార్పులు తీసుకురావడంలో ట్రంప్ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించలేదని కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రభుత్వం వీసా విధానంలో మార్పులపైన చర్చించడానికి, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి నిర్ణయాలు తీసుకున్నారన్న న్యాయమూర్తి విదేశీ ఉద్యోగులకు అధిక వేతనాలు, ఐటీ కంపెనీలు విదేశీ పనివారి నియామకంలో ఉన్న పరిమితుల్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. డిసెంబర్ 7 నుంచి ఈ నిర్ణయాలేవీ అమలు చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. బైడెన్ ప్రమాణ కమిటీలో ఇండియన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి వేసిన కమిటీలో ప్రవాస భారతీయుడు మజూ వర్ఘీస్కి చోటు లభించింది. ఈ కమిటీలో తనను ఎంపిక చేయడంపై మజూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘జో బైడెన్, కమలా హ్యారిస్ల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటుగా ఆ సంబరాల్లో జరిగే ఇతర కార్యక్రమాల ప్రణాళిక, నిర్వహణ కమిటీలో చోటు లభించడం నాకు గర్వకారణం‘‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బైడెన్, కమలా ఎన్నికల ప్రచారంలో కూడా మజూ కీలక సలహాదారుగా వ్యవహరించారు. -
హెచ్1బీ వీసా : ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన హెచ్1బీ వీసాల ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ తోసిపుచ్చారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పారదర్శక విధానాలను పాటించలేదని ఈ మార్పులు కరోనా మహమ్మారి ఉద్యోగ నష్టాలను పూడ్చడంకోసం అని వాదించడం సరికాదని తెలిపింది. ఎందుకంటే ట్రంప్ సర్కార్కు అందకుముందే ఈ ఆంక్షల ఆలోచన ఉందనీ, కానీ అక్టోబరులో ఆదేశాలు జారీ చేసిందని జెఫ్రీ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో బే ఏరియా కౌన్సిల్, స్టాన్ఫర్డ్ శ్వవిద్యాలయం, ఇతర విద్యా వ్యాపార వర్గం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై చట్టపరమైన విజయం సాధించారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, చెత్త ఆదేశాలపై సాధించిన పెద్ద విజయం" అని బే ఏరియా కౌన్సిల్ సీఈవో జిమ్ వుండెర్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ట్రంప్ ఓటమి, జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించనున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు ట్రంప్ సర్కార్ వీసాలపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ లో ఆదేశాలు జారీ చేసింది. హెచ్ 1బీ వీసాలపై మూడవ పార్టీ సంస్థలలో హెచ్ 1బీ ఉద్యోగాల నియామకాలపై ఏడాది పాటునిషేధం విధించింది. దీనిపై బే ఏరియా కౌన్సిల్, స్టాన్ఫర్డ్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ , ఇతర గ్రూపులు సవాల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రతీ ఏడాదీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో కలిపి దాదాపు 85 వేల వీసాలను ఇస్తుంది. ఇవి మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వీటిని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందిన వారిలో 6 లక్షల మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నారు. కాగా అమెరికా నూతన అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రంప్ ఆంక్షలను రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు. తద్వారా లక్షలాది భారతీయుల వీసా ఇబ్బందులు చెక్పడనుందనే అంచనాలకు మరింత బలం చేకూరింది. బైడెన్ వాగ్దానం ప్రకారం హెచ్1బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీని సైతం సవరించే అవకాశం ఉందని అంచనా. -
ట్రంప్ ఓటమి భారత్కు మంచిదేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడన్ విజయం సాధించడానికి బిహార్ ఎన్నికల ఫలితాలకు ఏమైనా సంబంధం ఉంటుందా ? అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఓ పక్క కొనసాగుతుండగానే బిహార్లో ఆఖరి విడత పోలింగ్ జరిగింది. ఆ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోతుందని, ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలిందంటే అమెరికా ఎన్నికల ప్రభావం ఉన్నట్లేగదా! అని కొంతమంది ట్విటర్లో ప్రశ్నిస్తున్నారు. (టార్గెట్ బైడెన్ వయా చైనా!) బిహార్ ఆఖరి విడత పోలింగ్ రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉందని, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల మధ్య ‘నువ్వా, నేనా’ అన్నట్లుగా హోరాహోరీ పోరు నడుస్తోంది. అలాంటప్పుడు అమెరికా ఎన్నికల ఫలితాలు బిహార్ పోలింగ్పై ఉండే ఆస్కారమే లేదు. కాకపోతే అమెరికాలోని భారతీయుల్లో మోదీ అభిమానులు, విధేయులు ఎక్కువ మంది ఉన్నందున వారి ఓటు బ్యాంక్ను కొల్లగొట్టడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని ఆశించి ట్రంప్ బోల్తా పడ్డారు. (వైట్హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్తో భార్య మెలానియా) అమెరికాలో ‘హౌడీ మోడీ, భారత్లో నమస్తే ట్రంప్’ పేరిట ఇరువు దేశాధినేతలు ప్రజలనుద్దేశించి మాట్లాడడం వెనక ఎన్నికల వ్యూహం ఉందనడంలో సందేహం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందర, నవంబర్ 3వ తేదీన అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రలు అనూహ్యంగా భారత్కు వచ్చి ‘2ప్లస్2’ చర్చల్లో భారత్తో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే. ప్రవాస భారతీయ ఓట్లను ఆకర్షించడం కోసం ట్రంప్ చేసిన ఆఖరి ప్రయత్నంగా దాన్ని పేర్కొనవచ్చు. బైడన్, కమలా హ్యారిస్లకు ఓటేసిన ప్రవాస భారతీయులందరిని భారత వ్యతిరేకులుగా మోదీ విధేయులు సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. వాస్తవానికి మోదీ విధేయులైన భారతీయులు కూడా అమెరికా ఎన్నికల్లో విడిపోయినట్లు, వారిలో ఎక్కువ మంది బైడెన్కు ఓటేయగా, తక్కువ మంది ట్రంప్కు వేసినట్లు అమెరికా ముందస్తు ఎన్నికల సందర్భంగా పలు మీడియా సంస్థలు నిర్వహించిన పోల్ సర్వేల్లో చెప్పారు. వచ్చే తరం ప్రవాస భారతీయులకు హెచ్ 1 బీ వీసాలు రాకపోయినా, వచ్చినా తమకు సంబంధం లేదని, తమకు పన్నులు తగ్గితే చాలనుకున్న మోదీ విధేయుల్లో ఓ వర్గం ట్రంప్కు ఓటేయగా, బైడెన్ అధికారంలోకి వస్తే భారతీయులపై శ్వేత జాతీయులు దాడులు తగ్గుతాయని, పైగా ప్రవాస భారతీయులుకు హెచ్ 1 బీ వీసాలు పెరగుతాయని భావించిన మోదీ విధేయుల్లో మరో వర్గం బైడెన్కు ఓటేశారు. బైడెన్ వస్తే అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ను కాకుండా పాకిస్థాన్కు మద్దతు ఇస్తారంటూ మత విద్వేషకుల్లో ఓ వర్గం చేసిన ప్రచారం కూడా వారి ముందు పనిచేయలేదు. బైడెన్ కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్కు మద్దతిస్తానని చెప్పలేదు. కశ్మీర్ విషయంలో తన వైఖరి ఏమిటో చెప్పాల్సి వచ్చినప్పుడు తాను కశ్మీరీల పక్షమని బైడెన్ తెలిపారు. అంతమాత్రాన అది పాకిస్థాన్కు మద్దతివ్వడం ఎంతమాత్రం కాదు. (‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!) డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం వల్ల భారతీయులుగానీ, ప్రవాస భారతీయులు బాధ పడాల్సిన అవసరం లేదని, ప్రవాస భారతీయులకుగానీ, భారతీయులకుగానీ జో బైడెన్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని, ఆయన ప్రవాస భారతీయులకిచ్చిన హామీలను మరచిపోరాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. అయితే బైడెన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అమెరికాలోని కొన్ని చట్టాలను సవరించాలి. అందుకు అవసరమైన బలం సెనేట్లో బైడెన్కు లేదు. అలాంటప్పుడు అయన తన హామీలను ఎల నెరవేరుస్తారన్నది మరికొందరి విశ్లేషకుల అనుమానం. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. (ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్) -
హెచ్–1బీ వీసాల్లో లాటరీలకు స్వస్తి!
వాషింగ్టన్: వృత్తి నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు ఇచ్చే హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియలో మార్పులు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. కంప్యూటర్ లాటరీ విధానానికి స్వస్తిచెప్పే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఈ విధానానికి ప్రత్యామ్నాయంగా వేతనాల ఆధారంగా హెచ్1బీ వీసాలు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించనున్నారు. వీసాల ప్రక్రియలో ఈ మార్పు చేయడం వల్ల అమెరికన్ ఉద్యోగుల వేతనాలపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా. కొత్త విధానంపై గురువారం ఫెడరల్ రిజస్టర్లో నోటిఫికేషన్ ప్రచురితమైంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యురిటీ (డీహెచ్ఎస్)కు నెల రోజుల్లోపు తెలియజేయవచ్చు. లాటరీ స్థానంలో వేతనాల ఆధారంగా వీసాల జారీని ప్రారంభిస్తే ఆయా రంగాల్లోని ఉద్యోగులకు ఇచ్చే అత్యధిక వేతనాన్ని, అదే రంగంలో పనిచేసేందుకు వచ్చే విదేశీ వృత్తినిపుణుడికి కంపెనీ ప్రతిపాదించిన వేతనాన్ని పోల్చి చూస్తారు. ఈ పద్ధతి వల్ల అటు అమెరికన్ ఉద్యోగులకు, ఇటు హెచ్1బీ వీసాదారులకూ సమన్యాయం జరుగుతుందని డీహెచ్ఎస్ తెలిపింది. కంపెనీలు అధిక వేతనాలు చెల్లించేందుకు లేదా అత్యధిక వృత్తి నైపుణ్యాలు ఉన్న వారి కోసం దరఖాస్తు చేసేందుకు వీలు కల్పిస్తుందని డీహెచ్ఎస్ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ కుచినెల్లీ తెలిపారు. అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఈ మార్పులు ఉన్నట్లు ఆయన చెప్పారు. హెచ్1–బీ వీసా వ్యవస్థ తరచూ దుర్వినియోగమవుతోందని, తక్కువ వేతనాలతో పనిచేయించుకునేందుకు కంపెనీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఆ నేపథ్యంలో ట్రంప్ వీసాల జారీ ప్రక్రియలో పలు మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 22న హెచ్1–బీ, ఎల్–1 వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించారు. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా వీసా వ్యవస్థను సంస్కరిస్తామని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనూ హామీ ఇచ్చారు. 2014 నుంచి యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ హెచ్1–బీ వీసాల నోటిఫికేషన్ జారీ అయిన తొలి ఐదు రోజుల్లోనే ఏడాది కోటాకంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందుకుంటోంది. ఒక ఏడాదికి గరిష్టంగా 65000 హెచ్1–బీ వీసాలు మాత్రమే జారీ చేస్తారన్నది తెలిసిన విషయమే. -
హెచ్ 1బీ వీసా : ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ భారతీయ ఐటి నిపుణులకు మరోసారి షాక్ ఇచ్చింది. హెచ్ 1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్ లాటరీ పద్దతికి గుడ్ బై చెబుతూ మరో కీలక ప్రతిపాదన చేసింది. దీనిస్థానంలో వేతన స్థాయి ఆధారిత వీసాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్పై 30 రోజుల్లోగా స్పందన తెలియజేయవచ్చుని అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(డిహెచ్ఎస్) తెలిపింది. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత అంటూ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ట్రంప్ సర్కార్ తాజాగా లాటరీ పద్దతిన వీసాలు కేటాయించే పద్దతికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై గరిష్ఠ వేతన స్థాయి వీసాల ద్వారా మెరుగైన వేతనాలను అందించేలా ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. భారత్ సహా, వివిధ దేశాలనుంచి ప్రతీ ఏడాది హెచ్ 1బీ వీసా కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉంటాయి. వీటిలో కంప్యూటర్ లాటరీ ద్వారా 65 వేల మందిని ఎంపిక చేసి హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పద్దతిలో విదేశాలకు చెందిన అభ్యర్ధులు చౌకగా దొరుకుతుండడంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందంటూ ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. దీనికి బదులుగా ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్1బీ వీసాను జారీచేసేలా చర్యలు చేపట్టనుంది. -
హెచ్1బీ నైపుణ్య వృత్తులకు బీ1 వీసాలొద్దు!
వాషింగ్టన్: భారతీయ టెక్కీలపై ప్రతికూల ప్రభావం చూపే మరో నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకోనుంది. హెచ్1బీ నైపుణ్య వృత్తుల వారికి తాత్కాలిక బిజినెస్ వీసాలను జారీ చేయకూడదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదించింది. ఈ వీసా కింద కంపెనీలు ఆన్సైట్ జాబ్ విధానంలో పరిమిత కాలానికి టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు సాధించేందుకు పలు ఇతర విధానాలున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలపై పడే దుష్ప్రభావాన్ని ఈ ప్రతిపాదన తొలగిస్తుందని, హెచ్1బీ వీసా నియమాల అమలులో పారదర్శకత లభిస్తుందని స్పష్టం చేసింది. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. పలు భారతీయ టెక్నాలజీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. గతంలో, భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్పై బీ1 వీసాల జారీకి సంబంధించి ఆరోపణలు వచ్చిన విషయాన్ని విదేశాంగ శాఖ ప్రస్తావించింది. సుమారు 500 మంది ఉద్యోగులను వీసా నిబంధనలకు విరుద్ధంగా.. హెచ్1బీపై కాకుండా బీ1 వీసాలపై యూఎస్లో ఉద్యోగాలు కల్పించిందనే ఆరోపణలపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ ఇన్ఫోసిస్కు 8 లక్షల డాలర్ల జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేసింది. కాగా, తమ ఉద్యోగుల వేతన భారాన్ని భరించలేకపోతున్నామని, ఆ భారం నుంచి తమకు రక్షణ కల్పించాలని అమెరికాకు చెందిన ఒక ఆర్కిటెక్చర్ కంపెనీ కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆ కంపెనీ తమ వద్ద ఉన్న అమెరికన్ ఆర్కిటెక్ట్లను తొలగించి.. ఆ స్థానంలో చవకగా విదేశీ ఆర్కిటెక్చర్ సంస్థ నుంచి విదేశీ ఆర్కిటెక్ట్ల సేవలను పొందాలని భావిస్తుందేమో. కానీ, ఆ విదేశీ ఉద్యోగులకు కూడా హెచ్1బీ నిబంధనల ప్రకారం ఇక్కడి ఆర్కిటెక్ట్ సేవలకు ఇచ్చే వేతనాన్నే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, అమెరికన్ల ఉద్యోగాల రక్షణకు కాంగ్రెస్ రూపొందించిన ఇతర నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది’ అని వివరించింది. -
హెచ్1బీ కొత్త విధానంతో అమెరికాకే నష్టం
వాషింగ్టన్: హెచ్1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థకి కీడు చేస్తుందని అక్కడి పలు సంస్థలు అభిప్రాయపడ్డాయి. కొత్త వీసా విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫాక్చర్స్తో సహా 17 వరకు సంస్థలు న్యాయస్థానంలో ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉత్తర కొలంబియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ కొత్త విధానం వల్ల నైపుణ్యం కలిగిన వారు దేశానికి రారని, అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి ఈ వీసా విధానం అవరోధంగా మారుతోందని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని ముందుకు తీసుకువెళుతున్న ట్రంప్ ఈ నెల మొదట్లో హెచ్1బీ వీసా కార్యక్రమంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ వర్కర్లకి అధికంగా ఉద్యోగాలు లభించేలా, అత్యధిక స్కిల్ ఉన్న విదేశీ నిపుణులకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభించేలా ఈ వీసా విధానంలో మార్పులు చేశారు. దీనిని సవాల్ చేసిన వారిలో ఆర్థిక, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. కొత్త వీసా విధానం అమెరికాలోని ప్రతీ రంగంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. -
హెస్1బి వీసాదారుల కనీసం వేతనం పెంపు
-
భారత టెకీల్లో ‘హెచ్1బీ’ గుబులు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ స్థానికులను ప్రసన్నం చేసుకొనేందుకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా నిబంధనల పేరుతో విసిరిన రాజకీయ కార్డు అగ్రరాజ్యంలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. వీసాల రెన్యువల్తోపాటు కొత్త వీసాల దరఖాస్తుకు ప్రస్తుత మున్న నిబంధనలను కఠినతరం చేస్తూ విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ పాలనా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని దాదాపు 2.8 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడి కంపెనీలకు కన్సల్టెన్సీలుగా పనిచేస్తున్న భారతీయ ఐటీ కంపెనీలకు కూడా తాజా ఉత్తర్వుల వల్ల భారీ నష్టం జరగనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారే కాక పలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఉపాధి అవకాశాలకు కూడా ఈ ఉత్తర్వులు గండి కొడతాయని అంటున్నారు. మనోళ్లకు గడ్డుకాలమే... తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కనీస వార్షిక వేతన పరిమితి ఏకంగా 45 శాతం పెంపుతోపాటు కంపెనీ ఉద్యోగులు, కన్సల్టెన్సీ ఉద్యోగుల వీసాల రెన్యువల్ కాలపరిమితిలో మార్పు, రెన్యూవల్ ఫీజు పెంపు, అమెరికాలో ఐటీ సంబంధిత అడ్వాన్స్డ్ డిగ్రీ పూర్తి చేసినవారికే వీసాలివ్వాలనే నిబంధనలు ఉండటం భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేయనున్నాయి. ఇకపై హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు 1.10 లక్షల డాలర్ల కనిష్ట వార్షిక వేతనం ఉంటేనే వీసా పొందడానికి అర్హత పొందుతారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం 65 వేల డాలర్లుంటేనే వీసాకు దరఖాస్తు చేసుకొనే అవకాశముండేది. ఈ నిబంధనల అమలు వల్ల సగం మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం ఎదురుకానుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ సామాజిక అధ్యయనాల సంస్థ సర్వే ప్రకారం హెచ్1బీ వీసాపై అమెరికాలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 56 శాతం మంది... అంటే దాదాపు 3.5 లక్షల మంది ఏటా 67 వేల నుంచి లక్ష డాలర్లలోపు వార్షిక వేతనం పొందుతున్నారు. వారిలో 2.80 లక్షల మంది భారతీయ ఐటీ ఉద్యోగులే ఉన్నారు. తాజా నిబంధనలతో వారంతా ప్రస్తుత వీసా గడువు ముగిశాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారి వార్షిక వేతనం 1.10 లక్షల డాలర్లు ఉండాల్సిందే. వార్షిక వేతనం 1.10 లక్షల డాలర్లు ఉన్న ఉద్యోగుల వీసా కాలపరిమితిలోనూ మార్పులు జరిగాయి. ఇంత మొత్తంలో వేతనం ఉన్నప్పటికీ వారు నేరుగా కంపెనీ ఉద్యోగులు అయితేనే వీసాను మూడేళ్లపాటు రెన్యువల్ చేయనున్నారు. అదే కన్సల్టెన్సీల ద్వారా కంపెనీలకు పనిచేసే వారి వీసాలను మాత్రం కేవలం ఏడాదికే ఇవ్వనున్నారు. ఈ నిబంధనల అమలు అమెరికన్ ఐటీ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను అందించే దాదాపు 65 వేల కన్సల్టెన్సీ సంస్థలకూ నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమవుతుంది? ట్రంప్ తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కోర్టుల్లో సవాల్ చేస్తే న్యాయ సమీక్ష ముందు నిలవదనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన ప్రొఫెసర్ రెజినా డిక్షన్ మాట్లాడుతూ ‘ట్రంప్ పాలనా యంత్రాంగం తెచ్చిన కొత్త ప్రతిపాదనలు న్యాయ సమీక్ష ముందు నిలుస్తాయా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అమెరికాలో స్థానికంగా ఐటీ నిపుణులు దొరకడమన్నది అంత తేలికైన విషయం కాదు. అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా ఉంటే కంపెనీలు ఇతర దేశాలకు తరలే ప్రయత్నాలు తప్పక చేస్తాయి’అని అభిప్రాయపడ్డారు. నెల జీతం వీసా ఖర్చుకే..! తాజా నిబంధనలతో ఏటా వీసాలు రెన్యువల్ చేసుకోవాల్సి రావడం కన్సల్టెన్సీ ఉద్యోగులకు భారం కానుంది. ఒక్కసారి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలంటే వీసా ఫీజు, అటార్నీ ఖర్చులన్నీ కలిపి 7–8 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. అంటే ఏటా దాదాపు ఒక నెల జీతం వీసా ఖర్చుకే సరిపోతుందన్నమాట. ఇక అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకూ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అశనిపాతంగా మారనుంది. గురువారం నుంచి అమల్లోకి వచ్చిన వీసా నిబంధనల ప్రకా రం అమెరికాలో అడ్వాన్స్డ్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ అయినవారికి, అది కూడా ఐటీ చదువులు చదివినవారికే వీసాలు జారీ చేయనున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ చేసినవారిని ఐటీ ఉద్యోగాలకు అనుమతించరు. అమెరికాలో ఏదో ఒక ఎంఎస్ డిగ్రీ చేసి ఐటీ ఉద్యోగం చేయొచ్చనుకొనే వారి ఆశలు గల్లంతైనట్లే. సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయి నవారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఐటీ సబ్జెక్టులు చదవనివారు ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు దొరకబుచ్చుకున్నా వారికి ఇకపై హెచ్1బీ వీసా ఇవ్వడం కుదరదు. ప్రస్తుతం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 3 లక్షల మందిలో సగం మంది ఐటీయేతర గ్రాడ్యుయేట్ కోర్సు ల్లోనే ఉన్నారు. తాజా నిబంధనలతో వారి భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. (చదవండి: ‘హెచ్1బీ’పై మరిన్ని ఆంక్షలు) -
‘హెచ్1బీ’పై మరిన్ని ఆంక్షలు
వాషింగ్టన్: అమెరికా హెచ్ 1బీ వీసా విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో తాజాగా మరికొన్ని ఆంక్షలను చేర్చింది. తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు కోరుకుంటున్న వేలాది భారతీయుల ఆకాంక్షలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)మంగళవారం దీనికి సంబంధించిన తాత్కాలిక తుది ఉత్తర్వులను జారీ చేసింది. హెచ్1బీకి వీలు కల్పించే ‘ప్రత్యేక నైపుణ్య వృత్తి(స్పెషాలిటీ ఆక్యుపేషన్)’ నిర్వచనానికి ఇప్పటివరకు ఉన్న విస్తృతార్థాన్ని ఇప్పుడు కట్టుదిట్టం చేసి, సంక్షిప్తం చేశారు. నిబంధనల్లో ఉన్న లొసుగులను తొలగించి అత్యంత అర్హులైన విదేశీయులకు స్థానిక కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించేలా మార్పులు చేశారు. అమెరికన్లను తొలగించి, ఆ ఉద్యోగాలను చవకగా లభించే విదేశీయులకు ఇచ్చే విధానాన్ని అడ్డుకునేలా నిబంధనలు రూపొందించారు. హెచ్1బీ పిటిషన్ ఆమోదం పొందకముందు, పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో, దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత కూడా వర్క్సైట్ ఇన్స్పెక్షన్ అధికారాన్ని డీహెచ్ఎస్కు కల్పించారు. ఈ నిబంధనలు రెండు నెలల్లో అమల్లోకి వస్తాయని డీహెచ్ఎస్ పేర్కొంది. అమెరికాలోని కంపెనీలు వృత్తి నిపుణులైన విదేశీయులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించినదే హెచ్1బీ వీసా అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏడాదికి 85వేల వీసాలు జారీచేస్తున్నారు. భారత్, చైనా తదితర దేశాల నుంచి ఈ వీసాలతో వేలాదిగా అమెరికాకు వెళ్తుంటారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత ఐటీ నిపుణులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇప్పటికే హెచ్1బీపై అమెరికాలో ఉన్న చాలామంది భారతీయులు కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ 19తో ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ.. హెచ్1బీ ఉద్యోగాల వల్ల మరింత దిగజారకుండా, ముఖ్యంగా అమెరికన్ల ఉద్యోగ భద్రతకు ముప్పు కలగకుండా చూసే లక్ష్యంతో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) పనిచేస్తోందని డీహెచ్ఎస్ పేర్కొంది. తాజా ఆంక్షలను వైట్హౌజ్ సమర్ధించింది. అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ, అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకే ప్రాధాన్యం కల్పిస్తూ.. అమెరికా వర్క్ వీసా విధానాన్ని అధ్యక్షుడు ట్రంప్ మరింత మెరుగుపరుస్తున్నారని పేర్కొంది. ఇన్నాళ్లూ ఈ విధానం దుర్వినియోగమైందని విమర్శించింది. తక్కువ వేతనాలకు లభించే విదేశీ ఉద్యోగుల కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోకుండా ట్రంప్ చూస్తున్నారని వివరించింది. ‘దేశ ఆర్థిక భద్రత హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో భాగంగా మారిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇప్పుడు ఆర్థిక భద్రతే అంతర్గత భద్రత’ అని డీహెచ్ఎస్ సెక్రటరీ చాడ్ వాల్ఫ్ వ్యాఖ్యానించారు. -
హెచ్1 బీ వీసా : టెకీలకు మరో షాక్
వాషింగ్టన్ : ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దృష్టిపెట్టారు. హెచ్1బీ వీసాలను పరిమితం చేసే లక్ష్యంలో భాగంగా ట్రంప్ సరికొత్త ఆదేశాలతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశానికి చట్టబద్దమైన వలసలను అరికట్టడం స్థానికీకరణ, అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసారు. యుఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు చర్యలు తీసుకుంటుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్1బీ వీసా కు సంబంధించి గత 20 ఏళ్లలో చేసిన ముఖ్యమైన సంస్కరణ ఇది అని లేబర్ డిప్యూటీ సెక్రటరీ ప్యాట్రిక్ పిజ్జెల్లా వెల్లడించారు. ఈ ఆంక్షలు త్వరలోనే (గురువారం ఉదయం) అమలులోకి వచ్చే అవకాశం ఉందనీ, ఈ నిర్ణయం హెచ్1 బీ వీసాల పిటీషన్లలో మూడవ వంతు ప్రభావితం చేయనుందని విశ్లేషకుల అంచనా. కొత్త ఆంక్షల్లో మూడు ప్రధాన అంశాలు ఇది స్పెషాల్టీ నిర్వచనాన్ని తగ్గిస్తుంది. అమెరికన్ల స్థానంలో ఇతర ఐటీ నిపుణులు అవసరమని నిరూపించేందుకు, హెచ్1బీ వీసా జారీ చేసేందుకు అదనపు డాక్యుమెంటేషన్ అవసరం.ఐటీ నిపుణుల నియామాలకోసం ఆధారపడే థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ కంపెనీలపై స్క్రూట్నీ మరింత పెంపు హెచ్1బీ వీసా జారీ ముందు, ఆ తరువాత వర్క్సైట్ తనిఖీకి, సమ్మతికి డీహచ్ఎస్ కు ఎక్కువ అధికారాలు అంతేకాదు ఈ తాజా రూల్ ఈ నియమం హెచ్1బీ వీసా ఉద్యోగాలను కనీస వేతన స్థాయిలను కూడా మార్చే అవకాశం ఉంది. ఇది భారతీయ టెక్ నిపుణులను, టెక్ సంస్థలను భారీగా ప్రభావితం చేస్తుందని, హెచ్1బీ వీసా పొందడం మరింత కఠినం చేస్తుందని అంచనా. అయితే తాజా నిబంధనలపై టెక్ సంస్థలనుంచి వ్యాజ్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హెచ్1 బీ వీసాలను పరిమితం చేసే గతంలో ట్రంప్ సర్కార్ ఆంక్షల అమలును నిలిపివేస్తూ ఫెడరల్ కోర్టులు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
హెచ్1బీ వీసా : ట్రంప్కు మరో షాక్
వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ తగిలింది. హెచ్1బీ వీసాలతో సహా వర్కింగ్ వీసాలపైవీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అడ్డుకుంది. ఈ ఏడాది జూన్లో అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన హెచ్1బీ వీసా నిషేధంపై నిలువరిస్తూ ఫెడరల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ట్రంప్ తన రాజ్యాంగ అధికారాన్ని మించిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో హెచ్1 బీ వీసా ఆంక్షలను తక్షణమే అడ్డుకుంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ ప్రతినిధులు తెలిపారు. (ఆమెకు పాజిటివ్ : ట్రంప్కు కరోనా పరీక్ష) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ , టెక్ నెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు. ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధి ఆవిష్కరణలు అవసరమైన సమయంలో తమకు అడ్డంకులు కల్పించారని వాదించాయి. కీలకమైన కష్టసాధ్యమైన ఉద్యోగాలను నిరోధిస్తున్నవీసా పరిమితులపై ఈ తీర్పు ఊరటనిస్తుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు పలు వీసాలను నిలిపివేస్తున్నామని, అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ ట్రంప్ గత జూన్ 22 న ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్1బీ, హెచ్ 4, హెచ్ 2బీ, జే, ఎల్ వీసా సహా ఇతర విదేశీ వీసాలను జారీపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
హెచ్1బీ శిక్షణకు 1,105 కోట్లు
వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై వివిధ రకాల ఉద్యోగాలు చేయడానికి వచ్చే మధ్యస్త, ఉన్నత స్థాయి నైపుణ్యాలు గల వారికి శిక్షణ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం రూ.1,105 కోట్లు ఖర్చు చేయనుంది. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, రవాణా తదితర రంగాల్లో హెచ్–1బీ వీసా హోల్డర్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో నైపుణ్యం పెంచేందుకు తాజా పెట్టుబడులు ఉపయోగపడతాయని కార్మిక శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంతో భారతీయ నిపుణులు ఎక్కువగా లాభం పొందనున్నారు. విద్యార్థులు, పరిశోధకుల వీసాలకు నిర్ణీత గడువు విదేశీ పరిశోధకులు, విద్యార్థులు, జర్నలిస్టులకు ఇచ్చే వీసాలకు నిర్ణీత గడువు విధించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న సులువైన వీసా విధానం దుర్వినియోగం అవుతోందనీ, దీనివల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. పైన పేర్కొన్న మూడు రకాల వీసాలతో చైనీయులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అయితే, నూతన విధానం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదని ప్రభుత్వం అంటోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. నాన్ ఇమిగ్రాంట్ విభాగంలోని ఎఫ్, జే (విద్యార్థులు, పరిశోధకుల) వీసాల కాలపరిమితి నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది. -
ఎన్నికల వేళ అమెరికా భారీ ప్యాకేజీ
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్య రంగాల్లో మిడిల్ టూ హై స్కిల్డ్ హెచ్1బీ వృత్తుల శిక్షణనకు గాను 150 మిలియన్ డాలర్ల(సుమారు 1,100కోట్ల రూపాయలు) ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్ రంగాల్లో ప్రస్తుత శ్రామిక శక్తితో పాటు, భవిష్యత్ శ్రామిక శక్తిని పెంచడానికి గాను కొత్త తరం కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఈ హెచ్1బీ వర్క్ఫోర్స్ గ్రాంట్ ఉపయోగపడుతుందని కార్మిక శాఖ ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి కార్మిక మార్కెట్లలో అంతరాయాలను కలిగించడమే కాక, అనేక విద్య, శిక్షణా సంస్థలు, యజమానులు శిక్షణను ఎలా అందించాలో పునరాలోచించవలసిన పరిస్థితులను తీసుకువచ్చింది అని కార్మిక శాఖ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: అదే ఉద్యోగమైతే అమెరికా రావొచ్చు) ఈ భారీ ప్యాకేజీ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్లో మరింత సమగ్రమైన శ్రామికశక్తి వ్యవస్థను ప్రోత్సహించడానికి.. నిధులు, వనరులను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించబడింది. ఇది దరఖాస్తుదారులకు వినూత్నమైన ట్రైన్రింగ్ ప్రొగ్రాంని అందించడమేకాక, ఆన్లైన్తో సహా విభిన్న రీతుల్లో ట్రైనింగ్ డెలివరీని అందిస్తుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్థానిక పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా ముందుకు తీసుకెళ్తుంది. వీరు ఆయా వర్గాలలోని వ్యక్తులకు కీలకమైన పరిశ్రమ రంగాల్లో మిడిల్ టూ హై స్కిల్డ్ హెచ్1బీ వృత్తులలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి శిక్షణనిస్తారు. ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్లో విస్తృత శ్రేణి తరగతి గది, ఉద్యోగ శిక్షణ, కస్టమైజ్డ్ ట్రైనింగ్, ప్రస్తుత కార్మికుల శిక్షణ, రిజిస్టర్డ్ అప్రెంటిస్షిప్ ప్రొంగ్రాం, పరిశ్రమ-గుర్తింపు పొందిన అప్రెంటిస్షిప్ ప్రొంగ్రాం మాడ్యూల్స్ ఉంటాయి. ఈ పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్షిప్ కార్యక్రమం ద్వారా ఫెడరల్, స్టేట్, లోకల్ ఫండింగ్ స్ట్రీమ్స్ మాత్రమే కాక ప్రైవేట్ సెక్టార్లో ట్రైనింగ్ కార్యక్రమం, ఉపాధి సేవలు, సహాయక సేవలకు సంబంధించి ఉపాధి అవకాశాలను గరిష్టంగా పొందటానికి అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు. -
‘హెచ్1బీ’ కేసులో ట్రంప్కు ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ వీసా నిషేధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. ట్రంప్ జూన్ 22న ప్రకటించిన హెచ్1బీ వీసా ఆంక్షలను సవాల్ చేస్తూ 169 మంది ఎన్ఆర్ఐలు అమెరికా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ని అక్కడి కోర్టు తిరస్కరించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, కోవిడ్ నేపథ్యంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయని ట్రంప్ హెచ్1బీ వీసాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. దీని ప్రకారం ట్రంప్ హెచ్1బీ వీసాలపై విధించిన ఆంక్షలు ఈ యేడాది చివరి వరకు అమల్లో ఉంటాయి. హెచ్1బీ, వీసాల రద్దు నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార, వాణిజ్యాలకు తీవ్రమైన నష్టం చేకూరుస్తుందని, ఇది దిద్దుకోలేని తప్పిదమని అమెరికాలోని సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలు హెచ్చరించాయి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, ఇటీవల భారత్కు వచ్చిన 169 మంది భారతీయులు తిరిగి అమెరికా వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. వీసాలపై నిషేధం ఏకపక్షమని, తక్షణం తమ వీసాలను పునరుద్ధరించాలని భారతీయులు ఆ పిటిషన్లో కోరారు. అయితే వీసాపై ఆంక్షలు వి«ధించకుండా అడ్మినిస్ట్రేషన్ని నియంత్రించలేమని వాషింగ్టన్ జిల్లా జడ్జి అమిత్ మెహతా ట్రంప్కి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పుని పై కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు భారతీయ పౌరుల తరఫు లాయర్ తెలిపారు. -
ఆ రెండు సంస్థలకే హెచ్ 1 బీ వీసాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయులకు హెచ్ 1 బీ వీసాలు అంత ఎక్కువగా దక్కకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని ఆంక్షలు విధిస్తున్నప్పటికీ గూగుల్, ఫేస్బుక్ దిగ్గజ సంస్థల్లో పని చేస్తోన్న భారతీయ టెక్ జనులు మాత్రం ఆ వీసాలను తన్నుకు పోతున్నారు. ఈ రెండు సంస్థలు భారతీయులకు వేతనాలు కూడా ఎక్కువగానే ఇస్తున్నాయి. అంటే ఏడాదికి రెండు మిలియన్ డాలర్లు (దాదాపు 15 కోట్ల రూపాయలు). ఫేస్బుక్, గూగుల్ సంస్థల్లో పని చేస్తోన్న భారతీయుల్లో 15 శాతానికిపైగా హెచ్ వన్ బీ వీసాలు కలిగిన వారే. ఈ రెండు దిగ్గజ సంస్థలు హెచ్ వన్ బీ వీసాలకు చేస్తున్న దరఖాస్తుల్లో 99 శాతం ఆమోద ముద్ర పొందుతున్నాయి. టెక్ నిపుణులైన భారతీయుల సేవలు తమకు అవసరమని, అందుకనే వారికి మంచి వేతనాలు కూడా చెల్లించాల్సి వస్తోందని ఈ సంస్థల యాజమాన్య వర్గాలు తెలియజేస్తున్నాయి. -
డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్కు మేలు
వాషింగ్టన్: తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, భారత్ సరిహద్దుల్లోనూ, ఇతర భూభాగాల్లోనూ, భారత్ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమించడంలో అమెరికా భారత్ పక్షం వహిస్తుందని డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడానికీ, ఇండో అమెరికన్లు పరస్పర సహకారంతో కలిసి జీవించడానికి, ఇరుదేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడానికి కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞచేశారు. అమెరికాలో నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో జో బైడెన్ తలపడుతున్నారు. ‘పదిహేనేళ్ల క్రితం భారత దేశంతో చారిత్రాత్మక అణ్వాయుధ ఒప్పందం కొరకు ప్రయత్నం చేశాను. భారత్, అమెరికాల మధ్య మైత్రీ సంబంధాలు బలపడితే, యావత్ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని ఆనాడే నేను చెప్పాను’’అని భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి, ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రపంచం ఎదుర్కొంటోన్న వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్య రక్షణపై దృష్టిసారిస్తామని బైడెన్ చెప్పారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో, దేశ చరిత్రలోనే అత్యధికంగా భారతీయులను వివిధ పదవుల్లో నియమించినట్లు, ఇప్పుడు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉపాధ్యక్షురాలిగా పోటీలో నిలిపామని ఆయన అన్నారు. భారత దేశానికి చెందిన హిందూ, సిక్కు, ముస్లిం, జైన్, ఇతరులపై జరుగుతోన్న దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు. హెచ్–1బీ వీసా... హెచ్–1బీ వీసాల విధానాన్ని సంస్కరించి, గ్రీన్ కార్డుల కోసం దేశాల వారీగా ఇచ్చే కోటా విధానాన్ని రద్దు చేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో జాతి విద్వేషాలు పెరుగుతున్నాయని, ఇతర దేశాల వారిపై ఆంక్షలు విధిస్తూ, హెచ్–1బీ వీసాలపై హానికరమైన, కఠిన చర్యలకు పూనుకుంటున్నారని బైడెన్ వ్యాఖ్యానించారు. గ్రీన్ కార్డుల సంఖ్యను పెంచుతామని, కుటుంబ సభ్యుల రాకపై ఆంక్షలు తొలగిస్తామని, అమెరికాలో చదివిన విద్యార్థులపై ఆంక్షలు ఎత్తివేస్తామని, ఉపాధి కోసం వచ్చేవారికి ఉద్యోగ వీసాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. అమెరికాలో భారతీయుల రక్షణ కోసం, తొలిసారిగా డెమొక్రాటిక్ పార్టీ ఒక విధానపత్రంతో ముందుకు వచ్చింది. -
అదే ఉద్యోగమైతే అమెరికా రావొచ్చు
వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారత్ టెక్కీలకు కాస్త ఊరట లభించింది. హెచ్–1బీ, ఎల్–1 వీసాలపై ప్రయాణం ఆంక్షల్ని ట్రంప్ సర్కార్ స్వల్పంగా సడలించింది. వీసాల నిషేధానికి ముందు పనిచేసిన యాజమాన్యాల దగ్గరే తిరిగి ఉద్యోగాలు లభిస్తే విదేశీ వర్కర్లని అమెరికా రావడానికి అనుమతినిచ్చినట్టు విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు వీసా ప్రయాణాల ఆంక్షల్ని సవరించింది. అమెరికాలో మళ్లీ పాత ఉద్యోగాలే దొరికితే ఉద్యోగితో పాటు, జీవిత భాగస్వామి, పిల్లలు కూడా అమెరికాకి రావచ్చునని విదేశాంగ విడుదల చేసిన ట్రావెల్ అడ్వయిజరీలో స్పష్టం చేసింది. కోవిడ్–19 సంక్షోభ పరిస్థితుల్లో అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడంతో హెచ్–1బీ, ఎల్–1 ఇతర వీసాదారులు అమెరికాలో అడుగు పెట్టకుండా జూన్ 22న అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కాపాడడానికే ఈ ఆంక్షలు వి«ధించినట్టు అప్పట్లో ట్రంప్ వెల్లడించారు. దీనిని ప్రముఖ టెక్కీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ సడలింపులు చేస్తున్నట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. అదే ఉద్యోగమైతే వీసాల మంజూరు అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ట్రంప్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలతో తిరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. గతంలో ఎవరైనా ఉద్యోగం కోల్పోయి, మళ్లీ ఇప్పుడు అదే సంస్థలో, అదే ఉద్యోగాన్ని పొందితే అమెరికా రావడానికి వీసాలు జారీ చేస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా కరోనా వైరస్పై పోరాటానికి ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారు, ప్రాణాంతక వైరస్లపై పరిశోధనలు చేస్తున్న వారిని కూడా ఆంక్షల నుంచి మినహాయించింది. ఐటీ సంస్థలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా హెచ్–1బీ వీసాలపై పూర్తి స్థాయి ఆంక్షల్ని వ్యతిరేకించడం వల్ల ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. -
హెచ్1 బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
-
హెచ్ 1బీ వీసాదారులకు ఊరట
వాషింగ్టన్ : హెచ్1 బీ వీసా హోల్డర్లకు అమెరికా ప్రభుత్వం ఊరట నిచ్చింది. హెచ్ 1బీ వీసా నిషేధంపై కొన్ని షరతులతో కూడిన మినహాయింపులను తాజాగా ప్రకటించింది. వీసా నిషేధాన్ని ప్రకటించడానికి ముందున్న ఉద్యోగాలకు తిరిగి వెళ్లే హెచ్1 బీ, ఎల్ 1 వీసాదారులకు అనుమతినిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆమోదం తెలిపింది. వీసాదారులు ఇదివరకు పని చేసిన ఉద్యోగాల్లోనే పని చేయడానికి తిరిగి వస్తే వారికి అనుమతి లభిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాలలో చిక్కుకున్న హెచ్ 1బీ వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలకు తిరిగి వస్తే వీసాలు పొందటానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ ట్వీట్ చేశారు. అయితే అది వీసా నిషేధానికి ముందు జరిగినదై ఉండాలన్న షరతు విధించినట్టు తెలిపారు. ప్రాధమిక వీసాదారులతో పాటు డిపెండెంట్లు (జీవిత భాగస్వాములు, పిల్లలు) కూడా అనుమతినిస్తున్నట్టు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ తెలిపింది. గతంలో దేశంలో ఏ కంపెనీకి పని చేశారో.. ఏ స్థాయిలో ఉన్నారో..వారు దేశంలోకి రావచ్చునని పేర్కొది. అలాగే సాంకేతిక నిపుణులు, సీనియర్ స్థాయి మేనేజర్లు ఇలా తమ స్థాయికి తగిన జాబ్స్ చేసినవారికి కూడా మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నామని ట్రంప్ ప్రభుత్వం వివరించింది. కరోనా మహమ్మారి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ట్రంప్ ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. BREAKING - Govt will now allow H-1Bs stuck abroad due to the visa bans to get visas if they are returning to jobs they have held in the US before departing. pic.twitter.com/sQcog9Y4ex — (((Greg Siskind))) (@gsiskind) August 12, 2020 -
అపోహలతోనే ‘హెచ్1బీ’ నిర్ణయం: నాస్కామ్
న్యూఢిల్లీ : అమెరికాలో ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యమివ్వాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధోరణులు భారత ఐటీ సంస్థలకు సమస్యగా మారుతున్నాయి. తాజాగా ఫెడరల్ ఏజెన్సీలు.. విదేశీ ఉద్యోగులను, ముఖ్యంగా హెచ్–1బీ వీసాలపై ఉన్నవారిని తీసుకోకుండా నిరోధించేలా ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇది పూర్తి అపోహలకు, తప్పుడు సమాచారంతో తీసుకున్న నిర్ణయంలాగా కనిపిస్తోందని భారత ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను ఎత్తివేస్తున్న తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా కోలుకోవడానికి ప్రతిభావంతుల లభ్యత చాలా కీలకమని పేర్కొంది. ఇలాంటి వారిపై ఆంక్షలు విధిస్తే అమెరికా ఎకానమీ, ఉద్యోగాలు, నవకల్పనలు, పరిశోధన .. అభివృద్ధి కార్యకలాపాల రికవరీ దశ మందగించే అవకాశం ఉందని నాస్కామ్ పేర్కొంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, లెక్కలు (స్టెమ్) నైపుణ్యాలు గల వారి కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. -
హెచ్1బీ : ఐటీ నిపుణులకు మరో షాక్
వాషింగ్టన్ : భారతీయ ఐటీ నిపుణులకు షాకిచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఏజెన్సీలు విదేశీయులు ప్రధానంగా హెచ్1బీ వీసా హోల్డర్ల నియామకాలను నిరోధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇటీవల హెచ్1బీ సహా ఇతర వర్క్ వీసాల జారీ ప్రక్రియపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించిన సుమారు నెలరోజుల తరువాత కీలకమైన ఎన్నికల సమయంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంలో భాగంగా ట్రంప్ ఈ కీలక అడుగు వేశారు. అమెరికన్లను ఉద్యోగాల్లో నియమించుకునేలా ఈ ఆర్డర్ పై సంతకం చేస్తున్నానని ట్రంప్ వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో ప్రకటించారు. అమెరికన్లకు ఉద్యోగాలు అనేదానికి తాము కట్టుబడి ఉన్నామని, చవకైన విదేశీ ఉద్యోగుల పేరుతో అమెరికన్లకు నష్టం జరుగుతోంటే తమ ప్రభుత్వం సహించదని ట్రంప్ స్పష్టం చేశారు. తాజా నిర్ణయం భారతీయ ఐటీ రంగానికి దెబ్బేనని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకే తమ ప్రాధాన్యత అని హెచ్1బీ రెగ్యులేషన్ను త్వరలోనే ఖరారు చేయనున్నామని ట్రంప్ ప్రకటించారు. నిపుణులైన అమెరికన్ల స్థానంలో ‘చౌక’గా పనిచేసే విదేశీ సిబ్బందిని తాము అనుమతించమని తెలిపారు. హెచ్1బీ వీసాలను అత్యున్నత నైపుణ్యమున్న అమెరికా సిబ్బందికి వర్తింపజేస్తామన్నారు. తద్వారా అమెరికన్ పౌరులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎంపిక చేయడం ముఖ్యంగా మహమ్మారి సంక్షోభ సమయంలో నష్టదాయకమని ఇది ఇప్పటికే మిలియన్ల మంది అమెరికన్లు ఉద్యోగాలను నష్టపోయారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ ఏడాది చివరివరకు హెచ్1బీతోపాటు ఇతర అన్ని రకాల విదేశీ వర్క్ వీసాలను సస్పెండ్ (రద్దు) చేస్తూ గత జూన్ 23న ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
హెచ్1బీ వీసా: వారికి భారీ ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ, ఇతర వర్క్ వీసాలను రద్దుచేసిన అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం, లాక్డౌన్ నిబంధనల కారణంగా భారతదేశంలో చిక్కుకున్న హెచ్1బీ వీసా హోల్డర్ల భార్య లేదా భర్త, ఇతర ఆధారితులు ఇండియా నుంచి తిరిగి అమెరికాకు వచ్చేందుకు అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి వారు వీసా స్టాంపింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. హెచ్1బీ వీసాదారుని జీవిత భాగస్వామి లేదా బిడ్డలు, తల్లిదండ్రులు తిరిగి అమెరికాకు చేరుకోవచ్చని ప్రకటించి వారికి భారీ ఊరట కల్పించింది. (డాలర్ డ్రీమ్స్పై ట్రంప్ పంజా) హెచ్2బీ, హెచ్4తో సహా వివిధవలసేతర వీసాల నిషేధంపై మినహాయింపు ప్రకటించింది. తాజా ఆదేశాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్1బీ, వీసాదారుడి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు (భారతదేశంలో చిక్కుకు పోయిన) తిరిగి అమెరికా వెళ్ళడానికి అనుమతి లభించింది. అర్హులైన వారికి హెచ్4, ఎల్-2 వీసాలను జారీ చేయనుంది. అయితే ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు భారతదేశంలో యూస్ ఎంబసీ, కాన్సులేట్లు తెరిచేవరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే జూన్ 24 నాటికి చెల్లుబాటు అయ్యే వీసా లేని హెచ్1 బీ, హెచ్ 4, జే1, హెచ్2ఏ వీసాదారులకు డిసెంబర్ 31,2020 వరకు అనుమతి ఉండదని మరోసారి స్పష్టం చేసింది. కాగా కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఉపాధి ఆధారిత వీసాలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
‘వీసా ఆంక్షలతో అమెరికాకే తీవ్ర నష్టం’
ముంబై: అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 వీసాలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథ్ తప్పుపట్టారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో యూఎస్కు తీవ్ర నష్టం వాటిల్లనుందని గోపినాథ్ హెచ్చరించారు. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. దేశీయ ఇంజనీర్లు అమెరికా క్లయింట్లకు మెరుగైన సేవలందించారని గుర్తు చేశారు. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో నైపుణ్యం ఉన్న టీసీఎస్ ఉద్యోగులు అమెరికాకు సేవలందించారని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎంతో శ్రమించిన దేశీయ ఐటీ నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. కాగా త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి ఇదొక జిమ్మిక్కు నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. అయితే, అమెరికా ఈ నిర్ణయం తీసుకుంటుందని తాము ఊహించలేదని రాజేశ్ గోపినాథ్ తెలిపారు. (చదవండి: నిషేధంతో మరింత బిజినెస్: నాస్కామ్) -
ఆన్లైన్ క్లాసులా...? మీ దేశాలకు వెళ్లిపోండి!
న్యూయార్క్: ఒకవైపు హెచ్–1బీ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా తాజాగా విద్యార్థులపై తన ఆంక్షల కొరడా ఝళిపించింది. కోవిడ్–19 నేపథ్యంలో అమెరికా విశ్వవిద్యాలయాలు పూర్తిగా ఆన్లైన్ క్లాసులవైపు మొగ్గితే విదేశీ విద్యార్థులు వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని‘ద ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్’(ఐసీఈ)ప్రకటించింది. ఒకవేళ విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లకపోతే బలవంతంగానైనా తరలిస్తామని, వర్సిటీ ఈ సెప్టెంబరులో ప్రారంభమయ్యే తరగతులను ఆన్లైన్ క్లాసుల ద్వారా మాత్రమే నిర్వహిస్తే ఇది తప్పదని స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులతో నడిచే కోర్సులకు ఇకపై వీసాల జారీ కూడా ఉండదని, సరిహద్దు రక్షణ విభాగం కూడా విద్యార్థులను దేశంలోకి అనుమతించరని ఐసీఈ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులు నేరుగా విద్యాబోధన చేసే చోటికి బదిలీ లేదా ఇతర చర్యలు తీసుకోవాలని సూచించింది. దీని ప్రభావం భారతీయ విద్యార్థులపై కూడా పడనుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు కోర్సును బట్టి ఎఫ్–1 లేదా ఎం–1 వీసా అవసరమవుతుంది. 2017–18 విద్యా సంవత్సరానికిగాను భారత్ నుంచి సుమారు 2.51 లక్షల మంది అమెరికాలో చదువుతూండగా చైనా నుంచి 4.78 లక్షల మంది విద్యార్థులు వేర్వేరు కోర్సుల్లో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆన్లైన్తోపాటు ప్రత్యక్ష తరగతులు కూడా నిర్వహించే హైబ్రిడ్ కళాశాలు ఈ విషయాన్ని స్టూడెంట్ అండ్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ప్రోగ్రామ్ అధికారులకు తెలియజేయాలని విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసేందుకు తగినన్ని ఆన్లైన్ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని ఐసీఈ స్పష్టం చేసింది. ఐసీఈ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు వేలాది మంది విద్యార్థు్థల్లో ఆందోళనకు కారణమవుతోంది. కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్లోనే ప్రారంభం కానుండగా అదే సమయంలో ఈ కొత్త తరహా ఆంక్షలు అమల్లోకి రానుండటంతో కోర్సుల్లో చేరడం ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న నేప«థ్యంలో స్వదేశాలకు తిరిగి వెళ్లడమూ కష్టమవుతుందని కొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఇమిగ్రేషన్ విధానాల్లో పలు తీవ్ర మార్పులు చేసిన విషయం తెలిసిందే. గత నెల 22వ తేదీన హెచ్–1బీ, ఎల్–1, హెచ్–2బీ, జే–1 వీసాలపై డిసెంబర్ 31వ తేదీ వరకూ నిషేధం విధించారు. యూఎస్ దృష్టికి భారత్ ఆందోళన ఆన్లైన్ క్లాస్లు మాత్రమే నిర్వహించే విశ్వవిద్యాలయాల్లో చదివే విదేశీ విద్యార్థుల వీసాలను ఉపసంహరిస్తామన్న అమెరికా ప్రకటనపై భారత్ ఆందోళన వెలిబుచ్చింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా మంగళవారం అమెరికా విదేశాంగ రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ డేవిడ్ హేల్తో ఆన్లైన్ భేటీ సందర్భంగా లేవనెత్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నారని, అమెరికాలోని భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం తక్కువగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపాయి. ఈ నిర్ణయానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్పాయని వివరించాయి. -
హెచ్1-బీ వీసా రద్దు ప్రభావం స్వల్పమే: క్రిసెల్
భారత ఐటీ కంపెనీలపై హెచ్1-బీ వీసా రద్దు ప్రభావం స్వల్పంగానే ఉంటుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసెల్ తెలిపింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత ఐటీ రంగానికి రూ.1200 కోట్ల మేర మాత్రమే ప్రభావం పడుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. ఐటీ పరిశ్రమ లాభదాయకత 0.25-0.30శాతం మేర క్షీణించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ పేర్కోంది. గత కొన్నేళ్లుగా భారత ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులకు అధికస్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తోందని, ఫలితంగా వీసా సంబంధిత సమస్యల వల్ల కలిగే నష్టాలు పరిమితమయ్యే అవకాశం ఉందని క్రిసెల్ తన నివేదికలో పేర్కోంది. యూఎస్లో నిరుద్యోగ కట్టడి చర్యలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గతనెలలో హెచ్-1వీసాలను ఏడాదిపాటు రద్దుచేసిన సంగతి తెలిసిందే. టాప్-15 ఐటీ కంపెనీల ప్రదర్శనను పరిగణలోకి తీసుకోన్న క్రిసెల్... కోవిడ్-19 ప్రభావంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐటి సంస్థల లాభాలు 2.50శాతానికిపైగా క్షీణించడంతో పాటు నిర్వహణ లాభదాయకత 23శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఎంట్రీ సిస్టమ్ స్థాయి ఉద్యోగాలను స్థానికుల ద్వారా భర్తీ చేయడంతో హెచ్1-బి, ఎల్ 1 వీసాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం పెద్దగా ప్రభావాన్ని చూపదు. అలాగే వీసాల పునరుద్ధరణ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపదని రేటింగ్ సంస్థ తెలిపింది. -
హెచ్1 బీ వీసాదారులకు బిడెన్ తీపి కబురు
వాషింగ్టన్: అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్(77) భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే హెచ్1 బీ వీసాలపై ట్రంప్ సర్కార్ విధించిన తాత్కాలిక సస్పెన్షన్ను ఎత్తివేస్తానని ప్రకటించారు. అధ్యక్ష పదవిలో మొదటి 100 రోజుల పరిపాలనలో చేపట్టబోయే కీలక చర్యలపై ప్రశ్నించినపుడు బిడెన్ ఈ ప్రకటన చేయడం విశేషం. ఆసియా అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల సమస్యలపై డిజిటల్ టౌన్ హాల్ సమావేశంలో బిడెన్ ఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఈ దేశాన్ని నిర్మించారంటూ హెచ్1 బీ వీసాదారుల సేవలను ఆయన ప్రశంసించారు. ఈ నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే, మొదటి రోజే ఈ దేశానికి ఎంతో సహకారం అందించే 11 మిలియన్ల మంది వలసదారుల పౌరసత్వానికి సంబంధించి కాంగ్రెస్కు ఇమ్మిగ్రేషన్ సంస్కరణల రోడ్మ్యాప్ బిల్లును పంపబోతున్నానన్నారు. తమ ఇమ్మిగ్రేషన్ విధానం వైవిధ్యంగా ఉండబోతోందని వివరించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు అమానవీయమైనవనీ, క్రూరమైనవని ఆయన ఆరోపించారు. కాగా కరోనా వైరస్, దేశంలో ఆర్థిక మాంద్యం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం రేటు కారణాల రీత్యా, హెచ్1 బీ వీసా జారీ ప్రక్రియను ‘సంస్కరించే యత్నం’లో భాగంగా హెచ్ 1 బీ సహా, ఇతర వర్క్ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల 23న ప్రకటించారు. హెచ్1 బీ, హెచ్ 4, హెచ్ 2 బీ వీసా, జె అండ్ ఎల్ వీసాలతో బాటు పలు నాన్-ఇమ్మిగ్రేషన్ వీసాలను ఈ ఏడాది ఆఖరువరకు నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
భారత్కు భారం..డ్రాగన్కు వరం
వాషింగ్టన్ : వీసాల నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల అగ్రరాజ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్1బీ వీసాలపై ఆంక్షలు భారత ప్రొఫెషనల్స్కు ఆటంకం కాగా ఇవి చైనాకు వరంలా మారతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీసాల నిలిపివేత నిర్ణయం అమెరికన్లకు ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఏమాత్రం ఉపయోగపడదని లాస్ఏంజెల్స్ టైమ్స్ హెచ్చరించింది. డ్రాగన్కు సానుకూలం ట్రంప్ నిర్ణయం చైనాకు మాత్రమే ఉపకరిస్తుందని వాల్స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. సింథటిక్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, బయోటెక్ రంగాల్లో చైనా నైపుణ్యాలతో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో వారే పాతుకుపోతారని, అధ్యక్షుడి నిర్ణయంతో హువాయి, బైదు, టెన్సెంట్ వంటి డ్రాగన్ కంపెనీలకు మేలు చేకూరుతుందని వాల్స్ర్టీట్ జర్నల్ పేర్కొంది. ఇక బహుళజాతి సంస్థలు అమెరికాకు విదేశీ మేనేజర్లను రప్పించే వెసులుబాటు లేకుంటే ఈ ఉద్యోగాలను విదేశాలకే తరలిస్తాయని, అమెరికన్లకు అవకాశాలు అందుబాటులో ఉండవని వ్యాఖ్యానించింది. టెకీల్లో అలజడి.. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అత్యంత నైపుణ్యాలతో కూడిన విదేశీ ప్రొఫెషనల్స్ను కలవరపాటుకు గురిచేసింది. తమ భవిష్యత్పై పలువురు ప్రొఫెషనల్స్లో గుబులు మొదలైంది. మరోవైపు హెచ్1బీ వీసాదారులపై ఆధారపడిన వారి భాగస్వాములు అత్యవసరంగా భారత్కు వచ్చిన క్రమంలో తిరిగి అమెరికాలో అడుగుపెట్టేందుకు అనుమతించాలని అమెరికన్ అధికారులను కోరతున్నారు. వీసాల నిలిపివేతపై ట్రంప్ ఉత్తర్వులపై విశ్లేషకుల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి : హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ! -
నిషేధంతో మరింత బిజినెస్: నాస్కామ్
ఐటీ నిపుణులు అత్యధికంగా పొందే H1-Bసహా పలు వీసాలపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించడం ద్వారా దేశీ ఐటీ కంపెనీలకు మేలే జరగనున్నట్లు నాస్కామ్ తాజాగా అంచనా వేసింది. దీంతో ఆఫ్షోర్ సర్వీసులకు డిమాండ్ పెరగనున్నట్లు సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసుల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. కోవిడ్-19 కారణంగా అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగానికి బ్రేక్ వేసే బాటలో ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ డిసెంబర్ వరకూ పలు వీసాలపై నిషేధం విధించిన విషయం విదితమే. అయితే యూఎస్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత కారణంగా పలు గ్లోబల్ దిగ్గజాలు దేశీ కంపెనీల ద్వారా సర్వీసులను పొందేందుకు ఆసక్తి చూపుతాయని నాస్కామ్ పేర్కొంది. ఇది ఐటీ రంగంలో మరిన్ని ఆఫ్షోర్ కాంట్రాక్టులకు దారిచూపుతుందని నాస్కామ్ ఆశిస్తోంది. దిగ్గజాలు రెడీ కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో పలు విదేశీ కంపెనీలు ఆఫ్షోర్ సేవలపట్ల ఆసక్తి చూపుతున్నాయని.. దీంతో ఇటీవల దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్కు బిజినెస్ పెరిగినట్లు నాస్కామ్ పేర్కొంది. ఐటీ రంగంలో కీలక(క్రిటికల్) సర్వీసులకు ఆఫ్షోర్ విధానంపై ఆధారపడటం పెరిగిందని తెలియజేసింది. కోవిడ్ సంక్షోభం నుంచి రికవరీ సాధించే బాటలో ప్రతీ దేశం టెక్నాలజీపై మరింత ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని నాస్కామ్ చైర్మన్, ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో ఇది దేశీ ఐటీ పరిశ్రమకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ట్రంప్ H1-B వీసాలపై నిషేధం విధించడంతో ఆఫ్షోర్ కాంట్రాక్టులు పెరగనున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఐటీ విశ్లేషకులు అమిత్ చంద్ర తెలియజేశారు. క్యాప్టివ్ సెంటర్స్ సొంత అవసరాల కోసం వినియోగించుకునేందుకు దేశీయంగా ఏర్పాటు చేసే క్యాప్టివ్ సెంటర్స్పై విదేశీ దిగ్గజాలు దృష్టి సారించనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు సైతం పెరగనున్నట్లు అంచనా వేస్తున్నాయి. పలు గ్లోబల్ దిగ్గజాలకు దేశీయంగా 1300 క్యాప్టివ్ సెంటర్లున్నట్లు తెలియజేశాయి. వీటి ద్వారా దాదాపు పది లక్షల మంది ఐటీ నిపుణులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. ఈ కేంద్రాల నుంచి సర్వీసులను పెంచుకునేందుకు మరింతమంది ఉద్యోగులను తీసుకునే వీలున్నట్లు ఏఎన్ఎస్ఆర్ కన్సల్టింగ్ సీఈవో లలిత్ ఆహుజా చెబుతున్నారు. కోవిడ్ కారణంగా 10-15 శాతం స్థాయిలో ఉద్యోగ కల్పనకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. అంటే 2021కల్లా మొత్తం లక్షమంది వరకూ నైపుణ్యమున్న సిబ్బందిని పెంచుకోవలసి ఉంటుందని వివరించారు. నిజానికి గత కొంతకాలంగా వీసాలను పొందడంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా కొన్ని కంపెనీలు ఆఫ్షోర్ సేవలకే ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సాధిస్తున్న ఆదాయంలో ఆన్షోర్ వాటాను ఆఫ్షోర్ అధిగమిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. -
హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్న ప్రతిభ ఆధారిత హెచ్1బీ వీసాల విధానం అమల్లోకి వస్తే భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఏటా అమెరికా బాట పడుతున్న భారతీయ నిపుణులు స్థాయిని బట్టి 65 వేల డాలర్ల వార్షిక వేతనానికి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఏటా లక్ష డాలర్లు అంతకంటే తక్కువ మొత్తంలో వేతనాలు ఆర్జిస్తున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 లక్షల మంది దాకా ఉన్నారు. వీరికి కొత్త విధానం గడ్డుకాలమే. మరో 50 వేల మంది వార్షిక వేతనం లక్ష డాలర్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తున్నారు. (అన్నంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్) లాటరీ స్థానంలో ప్రతిభ ఆధారిత వీసా... అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రతిభ ఆధారిత వీసా విధానాన్ని అమలు చేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించారు. అమెరికా అగ్రశ్రేణి కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించడం, అమెరికాలోని భారత ఐటీ కంపెనీలు సైతం అక్కడి కాంగ్రెస్ సభ్యులతో లాబీయింగ్ చేయడంతో ట్రంప్ పాలనలోనూ లాటరీ విధానం ద్వారానే హెచ్1బీ వీసాల ఎంపిక జరిగింది. హెచ్1బీ వీసాల మంజూరులో హోంల్యాండ్ డిపార్టుమెంట్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం మొదలుపెట్టింది. ఈ కారణంగా అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్1బీ వీసాలతోపాటు ఎల్–1 వీసాల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఈ కంపెనీలు అమెరికాలోని వర్సిటీల్లో ప్లేస్మెంట్లు నిర్వహించి అమెరికన్ పౌరులను నియమించుకున్నా నైపుణ్యం లేకపోవడంతో కాలానుగుణంగా వారిని వదిలించుకున్నాయి. (‘తల్లిని కోల్పోయా.. ఇప్పుడు పిల్లలకు దూరంగా..’) వార్షిక వేతనం ఎంత ఉండొచ్చు? ట్రంప్ ప్రతిపాదిస్తున్న ప్రతిభ ఆధారిత వీసా విధానం అమల్లోకి వస్తే కనిష్ట వార్షిక వేతనం ఎంత నిర్ణయించవచ్చన్న దానిపైనే ఇప్పుడు ఐటీ రంగంలో చర్చ మొదలైంది. కనిష్ట వార్షిక వేతనం లక్ష డాలర్లుగా నిర్ణయిస్తే పరవాలేదని, అంతకంటే ఎక్కువగా ఉంటే కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ అలెగ్జాండర్ బయాన్ పేర్కొన్నారు. లాటరీ ద్వారా ఈ ఏడాది 70 వేల మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హెచ్1బీ వీసాకు ఎంపికయ్యారు. వారిలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద వర్క్ పర్మిట్ పొందిన 25 వేల మంది గడువు డిసెంబర్తో ముగియనుంది. కొత్త విధానం అమల్లోకి వచ్చి వార్షిక వేతనం లక్ష డాలర్లు అంతకంటే ఎక్కువగా నిర్ణయిస్తే మరో 50 వేల మంది భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తిరుగుముఖం పట్టాల్చి రావచ్చు. నూతన విధానం అమల్లోకొస్తే హెచ్1బీ రెన్యూవల్కు వచ్చే వీసాదారుల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది. కాగా వర్క్ వీసాల జారీపై తాత్కాలిక రద్దు విషయంలో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి కల్పించుకోవాలని నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈ అంశంపై సీఎం జగన్ చర్చించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రత్నాకర్ తెలిపారు. -
భారత్లో చిక్కుకున్న ఎన్నారైల కష్టాలు!
మహిమ(పేరు మార్చాం).. సాఫ్ట్వేర్ డెవలపర్. తాత్కాలిక వీసా మీద అమెరికాలో ఉండేవారు. భర్త, ఇద్దరు కూతుళ్ల(వీరికి అమెరికా పౌరసత్వం ఉంది)తో కలిసి కాలిఫోర్నియాలో నివసించేవారు. ఈ క్రమంలో మార్చి తొలి వారంలో తన తల్లి అనారోగ్యం పాలయ్యారనే విషయం తెలిసి దాదాపు దశాబ్ద కాలం తర్వాత భారత్కు పయనమయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆమె భర్త, కూతుళ్లు అక్కడే ఉండిపోయారు. ఇదిలా ఉండగా.. తల్లి మరణించిన ఎనిమిది రోజుల తర్వాత మహిమ.. తిరిగి అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వీసా స్టాంపింగ్కై మార్చి 16న ముంబైలోని పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లగా.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కార్యాలయం మూసి ఉండటం గమనించారు. అనంతరం లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో ఇక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం... ముంబై శివార్లలోని బంధువుల ఇంట్లో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. ఇక అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిమ 2020, డిసెంబరు వరకు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం గురించి ఆమె రాయిటర్స్తో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే నేను నా తల్లిని కోల్పోయాను. ఇక ఇప్పుడు మాతృత్వానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు నా మనసంతా దిగులుతో నిండిపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలం పిల్లలకు దూరంగా ఉంటే అది వాళ్ల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ట్రంప్ తాజా నిర్ణయంతో మహిమ ఒక్కరే కాదు ఆమెలాంటి ఎంతో మంది ఎన్నారైలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా, ఇతర పరిస్థితుల నేపథ్యంలో భారత్లో చిక్కుకుపోయిన వారు ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. ఈ విషయం గురించి వినోద్ అల్బూకర్క్ అనే బిజినెస్ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. ‘‘నేను అట్లాంటాలో పనిచేస్తున్నా. ఫిబ్రవరిలో నా తండ్రికి గుండెపోటు రావడంతో.. గర్భవతి అయిన భార్య, ఆరేళ్ల కుమారుడిని అక్కడే వదిలి హుటాహుటిన మంగళూరుకు వచ్చాను. అమెరికాలో ఇలాంటి హెచ్1 బీ వీసా విధానం వస్తుందని ఊహించలేదు. నేను నేటికీ అమెరికాలో పన్నులు చెల్లిస్తూనే ఉన్నాను. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో నా కంట్రిబ్యూషన్ కూడా ఉంది. కానీ ఇలాంటి నిర్ణయాల వల్ల భార్యా, పిల్లలకు దూరం కావాల్సి రావడం దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు.(హెచ్ 1బీ ఆపేశారు.. అమెరికన్ల హర్షం) కాగా గ్రీన్కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేసిన ట్రంప్.. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సోమవారం సంతకం చేశారు. ఇక ఈ ఉత్తర్వులు జూన్ 24 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే అత్యవసరాలైన ఆహారం, వైద్య రంగాలతోపాటు కరోనా పరిశోధనల్లో పని చేసే వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైట్హౌజ్ ప్రకటన అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలకు మేలు చేకూర్చే విధంగా ఉండగా.. అమెరికా పౌరులైన పిల్లల తల్లిదండ్రులకు ఇది ఏవిధంగా ప్రయోజనం కలిగించనుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు... అమెరికాలో ఇప్పటికే వివిధ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదన్న విషయం తెలిసిందే. -
ఐటీ మార్జిన్లు తగ్గుతాయ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆఖరు వరకు హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయం.. భారత ఐటీ సంస్థలను కలవరపరుస్తోంది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇది దేశీ కంపెనీలకు కొంత ప్రతికూలంగా ఉండవచ్చని కొందరు .. హెచ్1బీ వీసాలపై ఆధారపడటం తగ్గుతున్నందున పెద్దగా ప్రభావం ఉండదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. వీసాల రద్దుతో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ ఈక్విటీ రీసెర్చ్ ఒక నివేదికలో వెల్లడించింది. ‘ఈ ఆదేశాలతో భారతీయ ఐటీ రంగంపైన .. ముఖ్యంగా సంస్థల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికాలో స్థానిక ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్న కంపెనీలపై ఇది మరింత ఎక్కువగా ఉంటుంది’ అని పేర్కొంది. హెచ్–1బీ వీసాలపై ఆధారపడటం తగ్గించుకున్నందున వాటిపై తాత్కాలిక సస్పెన్షన్ భారతీయ ఐటీ కంపెనీలపై ఒక మోస్తరు స్థాయిలోనే ప్రతికూల ప్రభావం చూపవచ్చని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ఇప్పటికే ఈ వీసాలపై అమెరికాలో ఉన్నవారిపై ప్రభావం ఉండదని వివరించింది. ‘ప్రస్తుతం హెచ్–1బీ వీసాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది భారతీయ ఐటీ సంస్థలే. 2018 అక్టోబర్–2019 సెప్టెంబర్ మధ్యకాలంలో అమెరికా 3.88 లక్షల హెచ్–1బీ వీసాలు జారీ చేయగా (కొత్తవి, రెన్యువల్స్ కలపి) ఇందులో భారత్ వాటా 71.7 శాతంగా ఉంది’ అని పేర్కొంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాలకు ఊతమిచ్చే దిశగా హెచ్–1బీ సహా విదేశీ వర్క్ వీసాలను ఈ సంవత్సరం ఆఖరు దాకా రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజా అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది జూన్ 24 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్.. అమెరికాలో పనిచేసేందుకు ఎక్కువగా హెచ్–1బీ వీసాలపైనే ఆధారపడుతుంటారు. తాజా నిర్ణయం ఇప్పటికే ఈ వీసాలపై పనిచేస్తున్న భారతీయ ప్రొఫెషనల్స్తో పాటు అక్టోబర్ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గాను కొత్తగా వీసాలు పొందినవారిపైనా ప్రభావం చూపవచ్చని అంచనాలు ఉన్నాయి. ఆర్థిక పనితీరుపై పెద్దగా ప్రభావం ఉండదు.. భారతీయ ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరుపై తాజా పరిణామాల ప్రభావాలు పెద్దగా ఉండకపోవచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ ఐటీ అనలిస్టు మధు బాబు అభిప్రాయపడ్డారు. ‘వర్క్ వీసాలపై భారతీయ ఐటీ కంపెనీలు ఆధారపడటం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక అమెరికాలో ఇప్పటికే హెచ్–1బీ వీసాలపై ఉన్నవారు గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రకంగా చూస్తే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు’ అని మధు బాబు తెలిపారు. దేశీ ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీలు 2017 నుంచి హెచ్–1బీ/ఎల్1 వీసాలపై ఆధారపడటాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నాయని, స్థానికంగా ఉద్యోగులను తీసుకోవడానికి, అమెరికాలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాయని గోల్డ్మన్ శాక్స్ నివేదిక వెల్లడించింది. టాప్ 5 భారతీయ ఐటీ సర్వీస్ కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో ప్రస్తుతం 45–70 శాతం దాకా స్థానికులే ఉన్నారని, తద్వారా హెచ్–1బీ వీసాలపై ఆధారపడటం తగ్గిందని పేర్కొంది. ఉదాహరణకు 2016 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ అమెరికా కార్యాలయాల్లో స్థానిక ఉద్యోగుల సంఖ్య 35 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 63 శాతానికి పెరిగిందని వివరించింది. కరోనా వైరస్ పరిణామాలు భారత ఐటీ కంపెనీల డెలివరీ విధానాల్లో గణనీయంగా మార్పులు తెచ్చాయని, కార్యాలయాలపైనే ఆధారపడకుండా వర్క్ ఫ్రం హోమ్ విధానంలో కూడా సర్వీసులు అందించడం పెరిగిందని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలు మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా ఆఫ్షోరింగ్ను మరింతగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అమెరికా ఎకానమీకి చేటు: నాస్కామ్ హెచ్–1బీ వీసాల రద్దు ఆదేశాలు అపోహలతో తీసుకున్నవని, ఇవి అమెరికా ఎకానమీకి కూడా చేటు తెచ్చిపెడతాయని భారతీయ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. స్థానికంగా తగినంత స్థాయిలో నిపుణులు లేకపోవడంతో ఆఫ్షోరింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ‘అత్యంత నిపుణులైన వలసదారులు అమెరికాలోని ఆస్పత్రులు మొదలుకొని ఫార్మా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, తయారీ తదితర రంగాల సంస్థల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వారి తోడ్పాటు లేకుం డా అమెరికా ఎకానమీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. పరిశ్రమ మందగిస్తుంది. కరోనాకు ఔషధాలను అందుబాటులోకి తేవడంలో మరింత జాప్యం జరుగుతుంది’ అని నాస్కామ్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంక్షల వ్యవధిని 90 రోజులకు కుదించాలని, లేకపోతే కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికన్ కంపెనీలకు ఇవి గుదిబండగా మారతాయని పేర్కొంది. అమెరికన్ టెక్ కంపెనీల అసంతృప్తి.. దేశీ ఐటీ కంపెనీలే కాకుండా అంతర్జాతీయ టెక్ దిగ్గజాలైన గూగుల్ మొదలైనవి కూడా అత్యుత్తమ నైపుణ్యాలున్న భారతీయులను నియమించుకుంటూ ఉంటాయి. హెచ్–1బీ వీసాల రద్దు, భారతీయ ఐటీ రంగ అంశాలు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో టాప్ ట్రెండ్స్లో నిల్చాయి. అమెరికా ప్రభుత్వ ఆదేశాలపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసదారుల పక్షాన తాను నిలుస్తానని, అందరికీ అవకాశాలు లభించాలన్న లక్ష్య సాధన కోసం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక వలసదారుల పక్షాన పోరాడే మానవ హక్కుల సంస్థలతో పాటు పలువురు అమెరికన్ నేతలు కూడా సస్పెన్షన్ ఆదేశాలను ఉపసంహరించాలంటూ ప్రభుత్వాన్ని కోరాయి. -
అన్నంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గ్రీన్కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు జూన్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. వలస విధానంలో సమూల సంస్కరణల్ని తీసుకువచ్చి ఇకపై ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేయాలని అధికార యంత్రాంగానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నిక కావాలని తహతహలాడుతున్న ట్రంప్... తాను తీసుకున్న నిర్ణయం అమెరికన్లకు లాభం చేస్తుందని అంటున్నారు. కరోనా వైరస్ వల్ల అమెరికాలో అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని కట్టడి చేసి, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెంచడానికే వలస విధానంలో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. అత్యవసరాలైన ఆహారం, వైద్య రంగాలతోపాటు కరోనా పరిశోధనల్లో పని చేసే వారికి దీని నుంచి మినహాయింపులున్నాయి. గత ఏప్రిల్లో 60 రోజులపాటు ఈ వీసాలపై నిషేధం విధించిన ట్రంప్ సర్కార్ ఈ ఏడాది చివరి వరకు దీనిని పొడిగించింది. 5.25 లక్షల ఉద్యోగాలు ఖాళీ వీసాల జారీపై ఈ ఏడాది వరకు నిషేధం పొడిగిస్తూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత శ్వేతసౌధం అధికారి మీడియాతో మాట్లాడారు. హెచ్–1బీ, ఎల్1 వీసాలపై తాత్కాలిక నిషేధంతో అమెరికాలో 5.25 లక్షల ఉద్యోగాలు ఖాళీ కానున్నాయని అంచనాలున్నట్టుగా చెప్పారు. ఆ ఉద్యోగాలన్నింటినీ అమెరికన్లతో భర్తీ చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ట్రంప్ దృష్టి సారించినట్టు ఆయన వెల్లడించారు. లాటరీ విధానం రద్దుకు సన్నాహాలు ఇన్నాళ్లూ హెచ్1బీ వీసాలను లాటరీ విధానం ద్వారా ఇచ్చేవారని, ఇకపై ఉద్యోగాల్లో తీసుకునే విదేశీ పనివారి నైపుణ్యం, వారికిచ్చే వేతనం ఆధారంగా వీసాలు జారీ చేస్తారని వైట్హౌస్ అధికారులు వెల్లడించారు. ‘ప్రతీ ఏడాది హెచ్–1బీ వీసాలు 85 వేల వరకు జారీ చేస్తాం. కానీ దరఖాస్తులు 2 నుంచి 3 లక్షలు వస్తాయి. ఇకపై లాటరీ విధానాన్ని రద్దు చేసి ప్రతిభ ఆధారంగా మంజూరు చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు. అంటే అత్యధిక వేతనాలు లభించే 85 వేల మందికి మంజూరు చేస్తాం. దీనివల్ల నైపుణ్యం కలిగిన వారికే పనిచేసే అవకాశం వస్తుంది’అని ఆ అధికారి వివరించారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికన్లలో హర్షం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది. మేరీల్యాండ్లో వాషింగ్టన్ పోస్ట్ యూనివర్సిటీ నిర్వహించిన పోల్లో 65శాతం ట్రంప్కు మద్దతుగా నిలిచారు. కరోనా వైరస్ విసిరిన సవాళ్లతో వలసదారుల నుంచి తమ ఉపాధికి ముప్పు ఉంటుందని 81శాతం అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వేలో వెల్లడైంది. భారతీయులపై ప్రభావం ఎంత ? అమెరికాలో ఇప్పటికే వివిధ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ నిషేధం ఎలాంటి ప్రభావం చూపించదు. అయితే కొత్తగా అమెరికా వెళ్లాలనుకునే వారిపై దీని ప్రభావం చూపిస్తుంది. ప్రతీ ఏడాది మంజూరు చేసే హెచ్–1బీ వీసాలు 85 వేలకు వీసాలకు గాను 70శాతం మంది భారతీయులే. వారందరూ ఇక ఏడాది పాటు వేచి చూడాలి. అయితే కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఇప్పట్లో ఎవరూ విదేశీ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఎన్నో టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్తోనే పనులు జరిపించుకుంటున్నాయి. అందువల్ల అందరూ అనుకునేటంత నష్టం ఉండదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అమెరికా టెక్ కంపెనీల్లో ఆందోళన అమెరికాలో వృత్తి నిపుణులకు భారీగా వేతనాలు చెల్లించాలి. విదేశీయులైతే తక్కువ వేతనాలకు వస్తారన్న కారణంగా ఎన్నో బహుళ జాతీయ కంపెనీలు అమెరికన్లకు బదులుగా విదేశీ వర్కర్లను ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ , అమెజాన్, ఫేస్బుక్ వంటి ఐటీ దిగ్గజాలకు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఎదురు దెబ్బ తగలనుంది. హెచ్–1బీ వీసాలను అత్యధికంగా స్పాన్సర్ చేస్తూ విదేశీ వర్కర్ల సేవల్ని ఎక్కువగా ఈ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. ఇక అమెరికాలో ఉన్న భారతీయ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి కంపెనీలూ కూడా తక్కువ వేతనాలకే భారతీయ టెక్కీలను ఉద్యోగాల్లోకి తీసుకొని లబ్ధి పొందుతున్నాయి. తాజా ఉత్తర్వులతో టెక్ కంపెనీలు విదేశీ వర్కర్లను పనిలోకి తీసుకోలేవు. ఆ పని చేసే సామర్థ్యం అమెరికన్లకు లేకపోవడం, వారు ఆ ఉద్యోగాల్లోకి రావడానికి ఇష్టపడకపోవడం కూడా కంపెనీ యజమానుల్లో ఆందోళన పెంచుతోంది. సుందర్ పిచాయ్ అసంతృప్తి ట్రంప్ నిర్ణయంపై గూగుల్ సీఈవో, ఇండియన్ అమెరికన్ సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వలసదారుల పక్షానే తాను ఉంటానని అవకాశాలు అందరికీ ఇవ్వాలన్నారు. ‘అమెరికా ఆర్థిక విజయాలకు వలస విధానమే ఎంతో తోడ్పడింది. టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా అమెరికాను నిలిపిందంటే, గూగుల్ ఇప్పుడు ఇలా నిలిచిందింటే ఆ విధానమే కారణం’అని పిచాయ్ ట్వీట్ చేశారు. న్యాయస్థానంలో నిలబడుతుందా? ట్రంప్ కొత్త ఉత్తర్వులపై అమెరికన్ కంపెనీల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అమెరికా ఫస్ట్ రికవరీ పేరుతో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలని అధ్యక్షుడు భావిస్తున్నప్పటికీ ఈ వీసాలపై నిషేధం పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని అక్కడ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా వలస విధానాలను వ్యతిరేకంగా ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణుల అభిప్రాయంగా ఉంది. న్యూయార్క్కి చెందిన ఇమ్మిగ్రేషన్ యాక్ట్ సంస్థ వ్యవస్థాపకుడు సైరస్ మెహతా ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఎవరైనా కోర్టుకెక్కే అవకాశం ఉందన్నారు. ‘ట్రంప్ ప్రకటన ఇమ్మిగ్రేషన్, నేషనాలటీ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకం. ఎవరైనా కోర్టుకెళితే దీనిని నిలిపివేస్తారు. ఇలా నిషేధం పొడిగించడం వల్ల అమెరికాలో కొత్త ఉద్యోగాల కల్పన జరగదు. ఈ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారంతా అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఎంతో సాయంగా ఉన్నారు’అని వ్యాఖ్యానించారు. -
డాలర్ డ్రీమ్స్పై ట్రంప్ పంజా
అధ్యక్ష ఎన్నికలు సమీపించినప్పుడల్లా అమెరికాలో వీసాల చుట్టూ ఆంక్షల తీగలు అల్లుకుంటాయి. అధికారంలో రిపబ్లికన్లు వున్నా, డెమొక్రాట్లున్నా ఇది సాగుతూనే వుంటుంది. మునుపటితో పోలిస్తే డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఈ ఆంక్షల జోరు పెరిగింది. ఈసారి కరోనా వైరస్ మహమ్మారి కూడా తోడు కావడంతో అవి మరింత కఠినమయ్యాయి. ఈ ఏడాది ఆఖరు వరకూ అన్ని రకాల వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి వేలాదిమంది విదేశీ వృత్తినిపుణుల జీవితాల్లో తుపాను రేపారు. మంగళవారం అందుకు సంబం ధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడేర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాదిమంది అమెరికన్లను ఆదుకోవడానికే ఈ ఆంక్షలు తీసుకొచ్చినట్టు ట్రంప్ ప్రకటిం చారు. కరోనా మహమ్మారి ప్రతాపం చూపడం మొదలెట్టిన మూడు నెలల తర్వాత తొలిసారి ఓక్లహా మాలో రెండురోజులక్రితం ఆర్భాటంగా ఆయన నిర్వహించిన ర్యాలీకి జనం ముఖం చాటేయడంతో ట్రంప్కు ఆందోళన పెరిగింది. మళ్లీ అధికార యోగం అసాధ్యమన్న భయం పట్టుకుంది. అందుకే ఆదరా బాదరాగా ఆయన ఈ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. త్వరలో మరిన్ని ఆంక్షలు రాబోతున్నా యంటున్నారు. సహజంగానే ఈ ఆంక్షలు అందరికన్నా ఎక్కువగా భారతీయ వృత్తి నిపుణులనే కుంగదీస్తాయి. కరోనా వైరస్ విరుచుకుపడ్డాక అమెరికాలో మునుపెన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నది వాస్తవం. పర్యవసానంగా గత మూడునెలల్లో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మారారు. ట్రంప్ గత అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనే తాను అధికారంలోకొస్తే వలసలపై ఆంక్షలు విధిస్తానని చెప్పారు. అధ్యక్షుడయ్యాక అడపా దడపా అటువంటి ఆంక్షలు విధిస్తూనే వున్నారు. కానీ ఆయన చేసిన వాగ్దానాలతో పోలిస్తే విధించిన ఆంక్షలవల్ల ఒరిగింది చాలా తక్కువ. ఆయన లక్ష్యం భారీయెత్తున వలసలను అడ్డుకోవడం. అది నెరవేరడానికి కరోనా వైరస్ సాకు ఆయనకు పనికొచ్చింది. వలసల్ని అడ్డుకోవద్దని, వాటివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభమే తప్ప నష్టం ఉండదని వ్యాపారవేత్తలు ఆయనకు చెబుతూనేవున్నారు. అయినా ఆయన వినలేదు. ఇప్పటికే శరణార్థులకు ఆశ్రయమిచ్చేందుకు వీలుకల్పించే నిబంధనల అమలు నిలిపివేశారు. అలాగే గ్రీన్ కార్డులపై గత రెండు నెలలుగా నిషేధం సాగుతూనేవుంది. దాన్ని కూడా ఏడాది ఆఖరు వరకూ పొడి గించే అవకాశం కూడా వుంది. ఇప్పటికే చదువులు పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడదామని ఆత్రంగా ఎదురుచూసే వేలాదిమంది ఆశలకు వీసా ఆంక్షలు గండికొడతాయి. ఆర్థికంగా ఎదగాలని ఆశించేవారంతా ఉన్నత విద్య కోసం స్తోమత వున్నా లేకున్నా అప్పులు చేసి మరీ అమెరికా బాటపడతారు. పట్టభద్రులైనవారికి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కింద వర్క్ పర్మిట్ వస్తే వారు ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక నైపుణ్యం పొందిన అలాంటివారంతా కొలువు చేస్తూనే హెచ్–1బీ వీసా కోసం దరఖాస్తు పెట్టుకుంటారు. దానికోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. అది తగిలిందంటే తమ పంట పండిందనుకుం టారు. ప్రపంచీకరణ అనంతరం ఏటా లక్షలాదిమంది ఇలా డాలర్ డ్రీమ్స్తో అక్కడికెళ్లడం రివాజుగా మారింది. ట్రంప్ హవా వచ్చాక విధించిన ఆంక్షలతో ఇలాంటివారి సంఖ్య కొంతమేర తగ్గింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల పర్యవసానంగా ఐటీ పరిశ్రమ ప్రధానంగా ఆధారపడే హెచ్–1 బీ వీసాతోసహా వివిధ రకాల వీసాల కోసం ఎదురుచూసేవారంతా చిక్కుల్లో పడ్డారు. హెచ్–1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములకు జారీచేసే హెచ్–4 వీసాలు కూడా వచ్చే ఆర్నెల్లపాటు నిలిచిపోతాయి. అలాగే వివిధ దేశాల్లోని తమ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నవారిని ఎల్ వీసా కింద రప్పించి పనిచేయించుకుంటున్న బహుళజాతి సంస్థలకు కూడా ఈ నిర్ణయం ఊపిరా డకుండా చేస్తుంది. ఇలాంటి పరిమితులమధ్య లక్ష్యాలు సాధించడం ఎలాగన్నది వాటికి ప్రశ్నార్థ కంగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాలకు జారీ చేసే జే–1 వీసాలు, వ్యవసాయేతర పరిశ్రమల్లో తాత్కాలిక పనికోసం వచ్చేవారికిచ్చే 2–బీ వీసాలు కూడా ఆగిపోతాయి. అయితే ఇప్ప టికే అమెరికాలో వివిధ వీసాలపై వుంటున్న వలసదారులకు, ఆహారోత్పత్తి పరిశ్రమల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. ఇప్పుడేర్పడిన సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఈ ఆంక్షలు అవసరమని ట్రంప్ చెబుతున్నారు. కానీ ప్రత్యేక నైపుణ్యం అవసరమైన రంగాలన్నీ తగిన అనుభవం, ఇతరత్రా అర్హతలు గలవారిని వెదుక్కోవడం కష్టం మాత్రమే కాదు... అసాధ్యం కూడా. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) రంగాలు ఇప్పటికే నిపుణుల కొరతతో అల్లాడుతున్నాయి. ఇక వలసలపై ఆంక్షలు పెడితే చెప్పేదేముంది? అందుకే ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తోసహా అనేకులు అసంతృప్తి వెళ్లగక్కారు. తాజా ఆంక్షల కారణంగా 5,25,000 ఉద్యోగాలు అమెరికన్లకు లభించే అవకాశం వచ్చిందని లెక్కలు చెబుతున్నా... అర్హులెక్కడ? పైగా అమెరికన్ కంపెనీలన్నీ విదేశీయులకు ప్రేమతో కొలువులివ్వడం లేదు. వారైతే అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకు పనిచేస్తారని, బాగా కష్టపడతారని, కొత్తగా వచ్చే సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము మలుచుకుంటారని భావించే ఉద్యోగాలిస్తాయి. పైగా డిస్నీ మొదలుకొని వందలాది సంస్థలు కొత్తగా వచ్చిపడిన సంక్షోభం నుంచి బయటపడటం కోసం అధిక వేతనాలకు పనిచేసే అమెరికన్లను తొలగించి, వారి స్థానంలో తక్కువ వేతనాలకు పనిచేసే వలసదారుల్ని నియమిం చుకున్నాయి. కనుక ట్రంప్ తాజా చర్య వల్ల ఆ సంస్థలు ఎదగడం మాట అటుంచి కుప్పకూలే ప్రమాదం వుంది. అదే జరిగితే తాజా ఉత్తర్వులు ఆయనకే బెడిసికొడతాయి. ట్రంప్కు ఇప్పుడున్న అంతంతమాత్రం మద్దతు కూడా ఆవిరి కావడం ఖాయం. -
ఐటీ షేర్లకు ట్రంప్ షాక్ : రికవరీ
సాక్షి, ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్క్ వీసాలపై సంచలన నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం నాటి మార్కెట్లో ఐటీ షేర్లకు అమ్మకాల సెగ తాకింది. 2020, డిసెంబర్ 31వరకు హెచ్1బీ, హెచ్ 2బీ, తదితర వర్క్ వీసాల జారీని ట్రంప్ సర్కార్ నిలిపివేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. దీంతో టాప్ ఐటీ షేర్లతో పాటు మిగిలిన ఐటీ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ భారీగా నష్టాలను నమోదు చేశాయి. ఇన్ఫోసిస్ షేర్ ధర 1శాతం పైగా కోల్పోయి 692 రూపాయల వద్ద, హెచ్ఎస్ఎల్ దాదాపు 1 శాతం తగ్గి 564 రూపాయలకు చేరుకుంది. టీసీఎస్ షేర్ అంతకుముందు ముగింపు 2028 రూపాయలతో పోలిస్తే 2010 వద్ద ట్రేడ్ అయింది. టెక్ మహీంద్రా షేర్ ధర 0.92 శాతం క్షీణించి 543.50 రూపాయలకు చేరుకుంది. అయితే దీని ప్రభావం తాత్కాలికమేనని, భారతీయ ఐటీ ఉద్యోగులు లేకుండా అమెరికా ఐటీ పరిశ్రమ మనుగడ కష్టమని ఐటీ నిపుణులు భరోసా ఇవ్వడంతో తిరిగి అదే స్థాయిలో రీబౌండ్ అయ్యాయి. దీంతో మిడ్ సెషన్ తరువాత కోలుకుని ప్రస్తుతం లాభాలతో కొనసాగుతుండటం విశేషం. అటు సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 35263 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 10421 వద్ద కొనసాగుతున్నాయి. (ట్రిపుల్ సెంచరీ లాభాలతో సెన్సెక్స్) ఐటీ నిపుణులు, విశ్లేషకులు ఏమన్నారు ట్రంప్ సర్కార్ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీల కంటే అమెరికా కంపెనీలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019లో హెచ్ 1బీ వీసాలు పొందిన మొదటి పది కంపెనీల్లో ఏడు అమెరికా కంపెనీలే ఉన్నాయని ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. అంతేకాదు హెచ్1బీ వీసాలపై ఆధారపడటం ఐటీ పరిశ్రమలో గణనీయంగా తగ్గిందని వెడ్ బుష్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ మోషే కత్రి చెప్పారు. దురదృష్టవశాత్తు అమెరికాలో ఎన్నికల సంవత్సరంలో ఇదొక ఎత్తుగడ అని వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ సవాళ్లకు భారత ఐటీ పరిశ్రమ ఇప్పటికే తనను తాను సిద్ధం చేసుకుందని టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నాని చెప్పారు. ట్రంప్ ప్రకటనపై నిరాశను వ్యక్తం చేసిన గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, అటు అమెరికా ఆర్థిక విజయానికి, టెక్ రంగలో గ్లోబల్ లీడర్గా నిలిచేందుకు, ఇటు గూగుల్ సంస్థకూ వలసదారులు ఎంతో దోహదపడ్డారని పేర్కొన్నారు. అందరికీ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాం, వలసదారులకు అండగా వుంటామని భరోసా ఇస్తూ ట్వీట్ చేశారు. Immigration has contributed immensely to America’s economic success, making it a global leader in tech, and also Google the company it is today. Disappointed by today’s proclamation - we’ll continue to stand with immigrants and work to expand opportunity for all. — Sundar Pichai (@sundarpichai) June 22, 2020 మరోవైపు వరుసగా రెండో రోజూ రూపాయి లాభాలతో ప్రారంభమైంది. డాలర్తో పోలిస్తే 16 పైసలు బలపడి 75.86 వద్ద ట్రేడ్ అయింది. చివరకు 37 పైసలు ఎగిసి 75.66 వద్ద ముగిసింది. నిన్న (సోమవారం) 76.02 వద్ద ముగిసింది. -
ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు
వాషింగ్టన్ః కరోనా వైరస్ ప్రభావం వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇమిగ్రేషన్ వీసాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీలు సహా టెక్ నిపుణులు, రాజకీయవేత్తలు ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘అమెరికా ఆర్థిక ప్రగతికి ఇమిగ్రేషన్ ఇచ్చిన ప్రోద్బలం అమోఘం. అమెరికాతో పాటు గూగుల్ టెక్ లీడర్గా ఎదగడానికి అదే కారణం. ఈ సమయంలో ఇమిగ్రెంట్స్కు మా మద్దతు తెలియజేస్తున్నాం. అందరికీ పని చేసే అవకాశం కల్పించేందుకు కృషి చేస్తాం’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.(వెనక్కి రావాల్సిందేనా?) ట్రంప్ కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ట్విట్టర్ పబ్లిక్ పాలసీ హెడ్ జెస్సికా తెలిపారు. ‘ఇమిగ్రేషన్ అమెరికాకు ఉన్న అతి పెద్ద సంపద. దాన్ని ట్రంప్ తక్కువగా అంచనా వేశారు’ అని వ్యాఖ్యానించారు. శాశ్వత వీసాలపై మరో 60 రోజుల పాటు, తాత్కలిక వీసాలపై ఈ ఏడాది చివరి వరకూ నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం వైట్ హోజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వల్ల దెబ్బతిన్న అమెరికన్లకు ఉపశమనం కలిగించేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. అమెరికా తాత్కాలికంగా నిషేధించిన వాటిలో పాపులర్ వీసాలైన హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, జే, ఎల్ కూడా ఉన్నాయి. ట్రంప్ సంతకం చేసిన కొత్త రూల్స్ రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వాషింగ్టన్ కు చెందిన ఓ థింక్ ట్యాంక్ లెక్కల ప్రకారం 2.19 లక్షల మంది తాత్కాలిక వర్కర్లు కొత్త పాలసీ వల్ల ఉద్యోగాలు కోల్పోతారు. అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఉబర్, పేపాల్ తదితర కంపెనీలు కూడా హై స్కిల్డ్ వర్కర్లను దేశం నుంచి పంపేయడాన్ని వ్యతిరేకించాయి. దీని వల్ల దేశం నష్టపోతుందని తప్ప ఒరిగే లాభమేమీ ఉండదని అభిప్రాయపడ్డాయి.(వర్క్ వీసాల నిలిపివేత) వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధాన్ని ఎత్తేయాలని భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరారు. కరోనా తర్వాతి ఫేజ్ ను ఎదుర్కొనేందుకు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న హై స్కిల్డ్ వర్కర్లు అవసరం ఉందని పేర్కొన్నారు. హెచ్1బీ ప్రొగ్రాం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులు దేశ హెల్త్ కేర్ సిస్టంను కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. హెచ్ 1బీ తో పాటు ఎల్ 1బీ వీసాల జారీని నిలిపేసే బదులు వాటికి కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ట్రంప్ అమెరికా బిజినెస్ ను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఉమన్ డొనా ఈ షలాలా ఆరోపించారు. ఆయన నిర్ణయంతో అమెరికా పేదరికంలోకి జారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ముసుగులో ట్రంప్ ఇమిగ్రెంట్లపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మరో కాంగ్రెస్ మహిళ షెల్లీ పింగ్రీ అన్నారు. -
H1-B వీసాలపై తాత్కాలిక నిషేధం
ఈ నెల 24 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ H1-B వీసాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ ఏడాది డిసెంబర్ 31వరకూ నిషేధం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2021 ఏడాదికి జారీ చేసిన H1-B వీసాలకు బ్రేక్ పడనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కోవిడ్-19 కారణంగా అమెరికాలో గత రెండు నెలలుగా నిరుద్యోగం పెరిగిపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా 2021 ఏడాదిలో యూఎస్ వర్క్ పర్మిట్లు పొందగోరేవారు స్టాంపింగ్ కోసం వచ్చే ఏడాది వరకూ వేచిచూడవలసి ఉంటుందని నిపుణులు వివరించారు. రెన్యూవల్స్ సైతం నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. 85,000 వీసాలు ప్రతీ ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా 85,000 H1-B వీసాలను జారీ చేస్తుంటుంది. దేశీ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఐటీ నిపుణుల కోసం వీటిని అత్యధికంగా పొందుతుంటాయి. తద్వారా తమ నిపుణుల ద్వారా యూఎస్లో ఐటీ సర్వీసులను అందించేందుకు వినియోగిస్తుంటాయి.కాగా.. H1-Bతోపాటు... H2-B, L-1, కొన్ని కేటగిరీల J వీసాలపై సైతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాత్కాలిక నిషేధాన్ని విధించారు. ఇటీవల చెలరేగిన కరోనా వైరస్ కల్లోలం కారణంగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య తాజాగా 4 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇక గ్రీన్కార్డుల విషయంలో అమెరికా వెలుపలి నుంచి దరఖాస్తు చేసుకున్న వారిపై మాత్రమే ఈ తాత్కాలిక నిషేధ ప్రభావం పడనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీ ఐటీ కంపెనీలపై ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది. H1-B వీసాపై నాలుగు లక్షల మంది, L-1 వీసాలపై లక్షమంది నిపుణులు అమెరికాలో దేశీ ఐటీ కంపెనీల తరఫున విధులు నిర్వహిస్తున్నారు. -
వెనక్కి రావాల్సిందేనా?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో పెరిగిన నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు విదేశీ వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్1బీ సహా అన్ని రకాల వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపేయాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వేలాది మంది భారతీయ టెకీల్లో గుబులు రేపుతోంది. అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించిన భారతీ య గ్రాడ్యుయేట్లు సైతం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) వర్క్ పర్మిట్తో ఉద్యో గం చేస్తున్న దాదాపు 25 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈసారి హెచ్1బీ వీసా రానిపక్షంలో స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది. ట్రంప్ తీసుకున్న అసాధారణ నిర్ణయం వారి పాలిట అశనిపాతంగా మారబోతోంది. హెచ్1బీ సహా అన్ని రకాల వర్క్ వీసాల రద్దుపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువరిస్తానని ట్రంప్ ఓ టీవీ ఇంటర్వూ్యలో వెల్లడించడం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడితే ఓపీటీపై పనిచేస్తూ చివరి అవకాశంగా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న దాదాపు 40 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వారిలో ఎల్–1పై అమెరికా వెళ్లిన 15 వేల మంది ఐటీ నిపుణులు కూడా ఉన్నారు. ఎల్–1 గడువు ముగుస్తున్న దశలో ఈ ఏడాది మార్చిలో హెచ్1బీకి దరఖాస్తు చేశారు. వారి దరఖాస్తులు లాటరీలో ఎంపికై పరిశీలన దశలో ఉన్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వారిని చిక్కుల్లో పడేసింది. కొత్తగా వెలువడనున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న ఐటీ నిపుణుల రెన్యువల్ దరఖాస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడే దాకా చెప్పలేమని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్రంప్ ఎంతటి కఠిన నిర్ణయాలనైనా తీసుకొనే ప్రమాదం ఉందని భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది 70 వేలకు పైగా హెచ్1బీ వీసాలు... ఈ ఏడాది మార్చిలో దాదాపు 1.67 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులు హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేయగా వారిలో 70 వేల మంది లాటరీలో ఎంపికయ్యారు. వారికి వీసాలు జారీ చేసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. మామూలుగా అయితే జూన్ నుంచి లాటరీ ద్వారా ఎంపికైన వారికి హెచ్1బీ వీసాలు జారీ చేస్తారు. అయితే ఈసారి కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలోని పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలు మూతపడ్డాయి. అయినా దాదాపు 8 వేల మందికి హెచ్1బీ వీసాలు మంజూరయ్యాయి. మిగిలిన వారి దరఖాస్తులు పరిశీలిస్తున్న సమయంలో కొత్త తంటా వచ్చిపడింది. ‘లాటరీలో ఎంపికైన వారికి సెప్టెంబర్లోగా వీసాలు జారీ చేయడమన్నది మామూలుగా జరుగుతున్న వ్యవహారం. కానీ ఈసారి ట్రంప్ తీసుకురాబోతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏయే నిబంధనలు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అన్ని రకాల వర్క్ వీసాలు రద్దయితే లాటరీలో ఎంపికైన దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా ఓపీటీ గడువు మిగిలి ఉన్న ఇంజనీర్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. గడువు ఈ ఏడాది జూన్ ఆఖరు నుంచి డిసెంబర్తో ముగియబోతున్న వారు మాత్రం తాత్కాలికంగా అయినా అమెరికా వదిలిపెట్టక తప్పదు’అని అట్లాంటా కేంద్రంగా ఐటీ ఔట్సోర్సింగ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న భారతీయ అమెరికన్ ఒకరు చెప్పారు. రెన్యువల్ పరిస్థితి ఏమిటో? అన్ని రకాల వర్క్ వీసాలు రద్దు చేస్తూ వెలువడబోయే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న హెచ్1బీ వీసాదారులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉండాలి. అలా లేని పక్షంలో జూలై నుంచి రెన్యువల్ అయ్యే వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ‘నాకు తెలిసినంత వరకు రెన్యూవల్ ఇంజనీర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. వారికి కూడా వర్క్ వీసా రెన్యువల్ చేయకపోతే వచ్చే ఏడాదిలోపే అమెరికాలోని ఐటీ కంపెనీలన్నీ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లలో భయాందోళనలు తీవ్రంగా ఉన్నాయి’అని శాన్జోస్ కేంద్రంగా పనిచేస్తున్న టీసీఎస్ హెచ్ఆర్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అభిప్రాయపడ్డారు. -
ఈ ఏడాది హెచ్1బీ లేనట్లే
వాషింగ్టన్: అమెరికాలో పని చేసేందుకు విదేశీ వర్కర్లకు అనుమతినిచ్చే హెచ్–1బీ, ఎల్–1 , ఇతర తాత్కాలిక వీసాలపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల రాకపై నియంత్రణ విధిస్తే దేశంలో స్థానికులకు అవకాశాలు వస్తాయన్నారు. ఫాక్స్ న్యూస్ చానెల్కి శనివారం ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ ఒకట్రెండు రోజుల్లో ఈ ఉత్తర్వులపై సంతకం చేస్తానన్నారు. అయితే ఈ ఆంక్షల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.. ‘‘ఈ వీసాల అనుమతుల్లో కచ్చితంగా కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా ఏళ్లుగా అమెరికాలో ఉండి వ్యాపారాలు చేసే సంస్థలకు సంబంధించి ఎంతో కొంత మినహాయింపులు ఉంటాయి. కానీ మొత్తంగా చూస్తే వీసా విధానాన్ని బాగా కఠినతరం చేస్తాం. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో కనీవినీ ఎరుగని స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే, విదేశీయులకు అడ్డుకట్ట తప్పనిసరి’’అని ట్రంప్ చెప్పారు. ఏడాది చివరి వరకు వీసాలపై ఆంక్షలు కొనసాగే అవకాశాలున్నాయి. డాలర్ డ్రీమ్స్తో అమెరికా వెళ్లాలనుకొని హెచ్–1బీ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాదికి వీసా వచ్చే అవకాశాలు ఇక ఉండవు. కోవిడ్–19తో అల్లాడిపోయిన అగ్రరాజ్యంలో నిరుద్యోగం రేటు కనీవినీ ఎరుగని స్థాయిలో 4.1శాతం నుంచి 13.5శాతానికి పెరిగిపోయింది. కంప్యూటర్కు సంబంధించిన రంగాలలో నిరుద్యోగం రేటు 2020 జనవరిలో 3% ఉంటే, మే నాటికి 2.5% తగ్గింది. విదేశాల నుంచి నిపుణులైన పనివారిని తీసుకోకపోతే అమెరికా ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే ఎన్నో టెక్కీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ► ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపించనుంది. ఏటా జారీ చేసే 85 వేల హెచ్–1బీ వీసాల్లో 70శాతం ఇండియన్ టెక్కీలే. ► ట్రంప్ నిర్ణయంతో ఇండియన్ సర్వీసు కంపెనీలకంటే అమెరికా టెక్ సంస్థలపై ప్రభావం అధికంగా చూపించనుంది. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులైన టెక్కీలకు హెచ్–1బీ ద్వారా ఉద్యోగాల్లో తీసుకుంటున్నారు. ఇక ఇండియన్ సంస్థలు స్థానిక అమెరికన్లకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ► ఇప్పటికే అమెరికాలో హెచ్–1బీతో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చునని ఇమిగ్రేషన్ లాయర్లు వెల్లడించారు. ► అమెరికా పౌరసత్వం మరియు ఇమిగ్రేషన్ సర్వీసు గణాంకాల ప్రకారం 2016–19 మధ్య హెచ్–1బీలో భారత కంపెనీల వాటా 51% నుంచి 24%కి తగ్గిపోయింది. -
హెచ్1బీ వీసా రద్దుకు ట్రంప్ ఆలోచన
వాషింగ్టన్: హెచ్1బీ సహా పలు వర్క్ వీసాల జారీని నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం ప్రబలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నారని వెల్లడించింది. పలువురు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వెలువడిన ఆ కథనం ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. (‘ట్రంప్.. తిరిగి బంకర్లోకి వెళ్లు’) ఆ నిర్ణయం అమల్లోకి వస్తే.. కొత్తగా హెచ్1బీ, లేదా ఇతర వర్క్ వీసా వచ్చినవారు అమెరికా వెలుపల ఉంటే, వారికి కూడా దేశంలోకి అనుమతి ఉండదు. అయితే, ఇప్పటికే హెచ్1బీ, ఇతర వీసాలపై అమెరికాలో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నిపుణులైన విదేశీయులకు అమెరికాలోని సంస్థలు అమెరికాలో ఉద్యోగ అవకాశం కల్పించేదే హెచ్1బీ వీసా. భారతీయుల్లో చాలామంది ఈ వీసా సాధించాలని కలలు కంటుంటారు. భారత్, చైనాల నుంచి వేలాది మంది వృత్తి నిపుణులను టెక్నాలజీ సంస్థలు ఈ వీసాపై అమెరికాకు తీసుకువస్తుంటాయి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయి, ఇండియాకు తిరిగొచ్చిన భారతీయులకు ట్రంప్ తీసుకోనున్న నిర్ణయం అశనిపాతం కానుంది. హెచ్1బీతో పాటు, హెచ్2బీ, జే1, ఎల్1 వీసాలను కూడా రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని, పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని వైట్హౌజ్ అధికార ప్రతినిధి హోగన్ గిడ్లీ స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయం అమెరికా సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, సంస్థలకు అవసరమైన నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తూ ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్నకు యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ థామస్ డోనోహూ ఒక లేఖ రాశారు. (జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడి ఆవేదన) -
భారత ఐటీ నిపుణుల నెత్తిన పిడుగు
సాక్షి, న్యూఢిల్లీ /వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలకు సంబంధించి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా దేశంలో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయికి చేరడంతోపాటు, వలసలను నిరోధించడానికి ఈ నిర్ణయంవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. హెచ్1బీ సహా పలు రకాల వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు, ఉద్యోగాల్లో అమెరిన్లకే ప్రాధాన్యత లభిస్తుందని ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్టు మీడియా నివేదికల సారాంశం. హెచ్1బీ వీసా, ఇతర వర్క్ వీసాలను నిలిపివేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. దీని ప్రకారం హెచ్ 1బీ వీసాతో పాటు, హెచ్ 2బీ వీసా, జే1, ఎల్1 వీసాలను కూడా నిలిపివేయవచ్చు. దీంతో సుమారు లక్ష మందికి పైగా ప్రభావితం కానున్నారని తెలిపింది. అయితే ఇప్పటికే హెచ్1బీ వీసా ఉన్నవారు ప్రభావితం అయ్యే అవకాశం లేదని పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ఈ నిషేధం ఎత్తివేసేంతవరకు భారతీయ ఐటీ నిపుణుల 'గ్రేట్ అమెరికన్ డ్రీం'కు చెక్ పడినట్టేననే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే హెచ్1బీ వీసాదరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుండి 20వేల డాలర్లకు పెంచే ప్రతిపాదననకూడా ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతోపాటు ఒబామా తీసుకొచ్చిన హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అనుమతినిచ్చే హెచ్4 వీసాలపైకూడా బ్యాన్ విధించాలని భావిస్తోందట. అమెరికన్ నిపుణులు, ఇతర ఉద్యోగార్ధులు, ముఖ్యంగా వెనుకబడిన, తక్కువ వయస్సు గల అమెరికా పౌరులను రక్షించడానికి కెరీర్ నిపుణుల వివిధ సూచనలను పరిశీలిస్తోందని, ఈ అంశంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వైట్ హౌస్ ప్రతినిధి హొగన్ గిడ్లీ ఒక ప్రకటనలో తెలిపారు. -
అమెరికాలో చదువుకున్న వారికే తొలి ప్రాధాన్యం
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1 వీసాల్లో కీలక సంస్కరణలకు తెర తీసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడుతూనే ఆ దేశంలో చదువుకున్న విదేశీ యువతకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా బిల్లును రూపొందించారు. ‘‘హెచ్–1బీ, ఎల్–1 వీసా సంస్కరణల చట్టం’’ పేరుతో ఈ బిల్లును రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం చట్ట సభల్లో ప్రవేశపెట్టింది. అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించేవారికి హెచ్–1బీ మంజూరులో ప్రాధాన్యతనిస్తారు. అంతే కాకుండా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్లు, అధిక వేతనాలకు పనిచేసే నైపుణ్యం ఉన్నవారికి వీసా మంజూరు చేసేలా సంస్కరణలు చేశారు. సెనేట్లో చుక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పాస్క్రెల్, పాల్ గోసర్ తదితర ప్రజాప్రతినిధులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చర్య వల్ల అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత స్థానం మనదే. భారత్కు చెందిన 2 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రస్తుతం అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్నారు. లేబర్ శాఖకు మరిన్ని అధికారాలు ఈ బిల్లు లేబర్ శాఖకు మరిన్ని అధికారాల్ని కట్టబెట్టింది. కంపెనీ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని శిక్షించే అధికారం కూడా లేబర్ శాఖకు ఉంటుంది. వివిధ కంపెనీలను పర్యవేక్షించడం ఏ వీసాపై ఎందరు ఉద్యోగులున్నారు , వారికిస్తున్న జీతభత్యాలు, వారు అభ్యసించిన విద్య వంటి గణాంకాలను సేకరిస్తే ఆయా కంపెనీల్లో జరిగే అక్రమాలు వెలుగు చూసే అవకాశాలుంటాయి. ఇక ఎల్–1 వీసాల నిబంధనల అమలుపై పర్యవేక్షించే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీకి అప్పగించింది. బిల్లులో ఏం ఉందంటే.. ► అమెరికాలో విద్యనభ్యసించే విదేశీ యువతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారికి తొలి ప్రాధాన్యం ఇస్తూనే అమెరికన్ల ప్రయోజన్ల కాపాడడం ► ఉన్నత విద్యనభ్యసించిన వారు, అత్యధిక వేతనాలు తీసుకునే నిపుణులైన పనివారికి ప్రాధాన్యం ► అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్–1బీ, ఎల్–1 వీసాదారులతో భర్తీ చేయడంపై నిషేధం ► హెచ్1బీ వీసాదారులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనుల్లోనూ, వారు పనిచేసే కార్యాలయాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు పడకుండా చర్యలు ► తక్కువ వేతనాలు ఇస్తూ ఔట్ సోర్సింగ్ ఇచ్చే ఉద్యోగులపై .హెచ్1–బీ, ఎల్–1 వీసాలపై తాత్కాలికంగా భారీ సంఖ్యలో విదేశాల నుంచి తీసుకువచ్చి వారికి శిక్షణ ఇచ్చాక, తిరిగి వారి దేశానికి అదే పనిచేయడానికి పంపే కంపెనీలపై ఆంక్షలు ► 50 మందికంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కంపెనీల్లో సగం మంది వరకు హెచ్–1బీ లేదంటే ఎల్–1 వీసా వినియోగదారులు పని చేస్తుంటే అదనంగా హెచ్–1బీ వినియోగదారుల నియామకాలపై నిషేధం. అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇస్తాం. మార్కెట్లో విదేశీ నిపుణులకు డిమాండ్ ఉంటే అమెరికా కాలేజీలు, యూనివర్సిటీల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తాం. చట్టంలో లొసుగుల్ని ఆధారంగా చేసుకొని ఔట్ సోర్సింగ్ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలకు కోత పెట్టి చీప్ లేబర్ని నియమించుకుంటున్నారు. ఇక నుంచి అలాంటివి కుదరవు. ఈ బిల్లు అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడమే కాకుండా నిపుణులైన విదేశీయుల్ని తక్కువ వేతనానికి తీసుకొచ్చి పనిచేయిస్తున్న యాజమాన్యాల దోపిడీని కూడా అరికడుతుంది’ –గ్రాస్లీ, కాంగ్రెస్ సభ్యుడు -
హెచ్1బీతో అమెరికన్లకు నష్టం లేదు!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల వల్ల అమెరికన్లకు జరిగే నష్టం లేదని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. ఈ రకమైన వీసాలున్న విదేశీ ఉద్యోగులు ఉండటం ఉపాధి అవకాశాలను పెంచుతాయని పరిశోధన తెలిపింది. అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులతో పని చేయించుకునేందుకు హెచ్–1బీ వీసాలు వీలు కల్పిస్తాయన్నది తెలిసిందే. విదేశీ ఉద్యోగులు.. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తూండగా.. ఇందుకు హేతువు లేదని పరిశోధన చెబుతోంది. హెచ్1బీ వీసాదారుల వల్ల నిరుద్యోగ సమస్య తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోందని ఈ పరిశోధనను నిర్వహించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తెలిపింది. -
వీసా బ్యాన్పై కసరత్తు!
వాషింగ్టన్: హెచ్1బీ సహా పలు రకాల వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అమెరికా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్క్ ఆథరైజేషన్తో కూడిన స్టుడెంట్ వీసాలపై నిషేధం విధించాలని భావిస్తోంది. కరోనా కారణంగా అమెరికా ఉద్యోగరంగంలో నెలకొన్న సంక్షోభంతో వర్క్ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. సాంకేతిక, ఇతర నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగావకాశం కల్పించేదే హెచ్1బీ వీసా. ఈ వీసాకు భారత్, చైనాలో భారీ డిమాండ్ ఉంది. ఈ వీసాపై ప్రస్తుతం దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉన్నారు. ‘వర్క్ వీసాల నిషేధానికి సంబంధించి ఈ నెలలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడవచ్చు. ఈ దిశగా ఇమిగ్రేషన్ సలహాదారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు’అని శుక్రవారం వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడే వైద్య నిపుణుల కొరత తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న 40 వేల గ్రీన్కార్డులను విదేశీ వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఆమోదం పొంది, జారీ చేయని గ్రీన్ కార్డ్లను ఇప్పుడు వైద్యులు, నర్సులకు జారీ చేయాలని కోరుతూ పలువురు సభ్యులు కాంగ్రెస్లో ప్రతిపాదన చేశారు. -
‘హెచ్4’ ఉద్యోగాలతో ముప్పేం లేదు!
వాషింగ్టన్: అమెరికాలోని హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించే నిబంధనను తొలగించేలా ఆదేశాలివ్వవద్దని దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్లోని ఫెడరల్ కోర్టును కోరింది. వారు ఉద్యోగాలు పొందడం వల్ల అమెరికన్ల ఉద్యోగావకాశాలు అంతగా ప్రభావితం కావడం లేదని కోర్టుకు తెలిపింది. హెచ్4 వీసాదారుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు తీవ్రస్థాయిలో ముప్పు ఏర్పడుతుందన్న ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’వారి వాదన సరికాదని వాషింగ్టన్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు ట్రంప్ ప్రభుత్వం మే 5న వివరించింది. దానికి సంబంధించి ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’చూపిన ఆధారాలు సరికావని వాదించింది. ఈ నిర్ణయం వేలాది భారతీయులకు శుభవార్తగా మారింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి, 21 ఏళ్లు పైబడిన పిల్లలకు అమెరికా ప్రభుత్వం హెచ్4 వీసా జారీ చేస్తుంది. హెచ్4 వీసాదారుల్లో కొన్ని కేటగిరీల వారు ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని 2015లో నాటి ఒబామా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కల్పించింది. 2017 డిసెంబర్ నాటికి 1,26,853 హెచ్4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ దరఖాస్తులను అమెరికా పౌర, వలస సేవల(యూఎస్సీఐఎస్) విభాగం ఆమోదించింది.ఒబామా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమెరికన్ టెక్నాలజీ వర్కర్ల తరఫున ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’సంస్థ కోర్టులో సవాలు చేసింది. హెచ్4 వీసాదారులు యూఎస్లో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటును తొలగించే విషయమై ఆలోచిస్తున్నామని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కానీ, దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
హెచ్1బీ వీసాలు... తక్కువ జీతాలిచ్చేందుకే!
వాషింగ్టన్: స్థానిక ఉద్యోగులకన్నా తక్కువ జీతాలిచ్చి పనిచేయించుకునేందుకే చాలా మటుకు అమెరికన్ సంస్థలు హెచ్1బీ వీసాల మార్గాన్ని ఉపయోగించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్ తదితర దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశాల నుంచి ఉద్యోగులను హెచ్1బీ వీసాలపై అత్యధికంగా నియమించుకునే టాప్ 30 సంస్థలపై ఎకనమిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఈపీఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నిర్దిష్ట నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్1బీ వీసాలు ఉపయోగపడతాయి. అయితే, ఇలా నియమించుకున్న ఉద్యోగుల్లో దాదాపు 60 శాతం మందికి స్థానిక సగటు వేతనాల కన్నా కంపెనీలు తక్కువగా చెల్లిస్తున్నాయని ఈపీఐ పేర్కొంది. నిపుణులని చెబుతున్నా పెద్దగా నైపుణ్యాలు అవసరం లేని, తక్కువ జీతాలుండే లెవెల్ 1 (ఎల్1), లెవెల్ 2 (ఎల్2) స్థాయి ఉద్యోగాల్లో సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. లిస్టులో ఏడో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్.. సుమారు 77 శాతం మంది హెచ్1బీ ఉద్యోగులను ఎల్1, ఎల్2 స్థాయుల్లో నియమించుకుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న అమెజాన్డాట్కామ్ ఏకంగా 86 శాతం మంది హెచ్1బీ ఉద్యోగులను ఎల్1, ఎల్2 స్థాయిల్లో నియమించుకుంది. యాపిల్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లోనూ దాదాపు ఇదే ధోరణి ఉన్నట్లు ఈపీఐ పేర్కొంది. 2019లో 53,000 కంపెనీలు హెచ్1బీ వీసాలను వినియోగించుకున్నాయి. మొత్తం 3,89,000 దరఖాస్తులు ఆమోదం పొందగా ప్రతి నాలుగింటిలో ఒకటి .. టాప్ 30 హెచ్1బీ కంపెనీలకి చెందినదే ఉంది.