Irani Cup
-
NCAలో టీమిండియా స్టార్ క్రికెటర్.. కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీ 2024-25 ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం. ఈ ఇరానీ కప్ హీరో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.డబుల్ సెంచరీఈ క్రమంలో దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్తో పాటు... ఇరానీ కప్-2024లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. లక్నోలో అక్టోబరు 1-5 వరకు రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఈ రెడ్బాల్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా ముంబై ఇరానీ కప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులతో అజేయంగా నిలిచిన సర్ఫరాజ్ ఖాన్.. న్యూజిలాండ్తో సిరీస్కు ముందు టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో అతడిని బీసీసీఐ.. ఎన్సీఏకు పంపించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. కివీస్తో సిరీస్కు అతడిని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. స్ట్రాంగ్గా రీ ఎంట్రీకేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్ వరుస అర్ధ శతకాలతో దుమ్ములేపాడు. అయితే, బంగ్లాతో సిరీస్ సందర్భంగా రాహుల్ తిరిగి రావడంతో అతడికి మళ్లీ మొండిచేయి ఎదురైంది. అయితే,ఈసారి మరింత స్ట్రాంగ్గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సర్ఫరాజ్ సిద్దమైపోయాడు. కాగా ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు చేరువైన టీమిండియా.. బంగ్లాతో టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్తో మూడు టెస్టులు ఆడనుంది. అక్టోబరు 16 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. అయితే, అక్టోబరు 11 నుంచే రంజీల్లో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టబోతోంది. బరోడాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దీంతో సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్కు దూరం కానున్నట్లు పీటీఐ వెల్లడించింది. చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన -
‘టీమిండియా డ్రెస్సింగ్రూంలో గడపడం వల్లే ఇలా’
‘‘దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. అక్కడి మైదానంలోని వికెట్కి అనుగుణంగా మన బ్యాటింగ్ శైలి మార్చుకోవాలి. మా నాన్న ఇదే చెబుతూ ఉంటారు. ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో గడపడం నాకెంతో కలిసి వచ్చింది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దగ్గర నుంచి భిన్న పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనేది సీనియర్లను చూసి నేర్చుకున్నా.ఇక ఈ మేము గెలిచిన ఈ ట్రోఫీ జట్టు మొత్తానిది. అయితే, ముషీర్కు నేను ఓ మాట ఇచ్చాను. ఈ మ్యాచ్లో సెంచరీ చేస్తానని చెప్పాను. యాక్సిడెంట్కు గురై మ్యాచ్కు దూరమైన ముషీర్కు ఈ అవార్డు అంకితం’’ అని టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇరానీ కప్-2024లో డబుల్ సెంచరీతో మెరిసిన ఈ ముంబై బ్యాటర్.. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన తమ్ముడు, క్రికెటర్ ముషీర్ ఖాన్కు అంకితమిచ్చాడు.1997లో చివరిసారిగాకాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై జట్టు.. దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఇరానీ కప్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన రెడ్బాల్ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా నిలిచింది. కాగా ముంబై 1997లో చివరిసారిగా ఇరానీ కప్ గెలిచింది. ఇప్పుడిలా.. మళ్లీ 27 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఓవరాల్గా ముంబైకిది పదిహేనో ఇరానీ కప్.కాగా 1997–98 నుంచి గత సీజన్ వరకు మరో ఎనిమిదిసార్లు ఇరానీ కప్ ఆడినా... ముంబై మాత్రం గెలుపు గీత దాటలేకపోయింది. చివరిసారిగా 2015–16లో ఇరానీ కప్లో ముంబై పరాజయం పాలైంది. ఈసారి సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన ముంబై ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఓవర్నైట్ స్కోరు 153/6తో ఐదోరోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై... 78 ఓవర్లలో 8 వికెట్లకు 329 పరుగులు చేసింది.తనుశ్ కొటియాన్ వీరవిహారం.. ఈ దశలో ముంబై తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో ఇక ఫలితం తేలడం కష్టమని భావించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ‘డ్రా’కు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబైని విజేతగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో.. సర్ఫరాజ్ ఖాన్ (17) రెండో ఇన్నింగ్స్లో త్వరగానే ఔటైనా... తనుశ్ కొటియాన్ (150 బంతుల్లో 114 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో అదరగొట్టాడుమిగతా వాళ్లలో... మోహిత్ అవస్థి (91 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) అతడికి చక్కటి సహకారం అందించాడు. సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ (2) వెంట వెంటనే అవుట్ కావడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసినా... తనుశ్ వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.ఫలితం తేలడం కష్టమనిమోహిత్తో కలిసి తనుశ్ అబేధ్యమైన తొమ్మిదో వికెట్కు 158 పరుగులు జోడించాడు. సాధించాల్సిన లక్ష్యం కొండంత పెరిగిపోగా... అందుకు తగిన సమయం కూడా లేకపోవడంతో చివరకు రెస్ట్ ఆఫ్ ఇండియా సారథి రుతురాజ్ గైక్వాడ్ ‘డ్రా’కు అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్లో ముంబై ఎనిమిది వికెట్లు కోల్పోగా... అందులో 6 వికెట్లు ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ తీయడం విశేషం. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 537 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 416 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీతో మెరిసిన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం కారణంగా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు దూరమైన ముషీర్ ఖాన్కు తన పురస్కారాన్ని అంకితం చేశాడు. కాగా భారత టెస్టు జట్టులో సభ్యుడైన సర్ఫరాజ్ ఖాన్... బంగ్లాదేశ్తో సిరీస్లో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఇరానీ కప్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం సంతోషంముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ..‘27 ఏళ్ల తర్వాత తిరిగి ఇరానీ కప్ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. తనుశ్ కొటియాన్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లోనూ విలువైన పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్లో అజేయ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశాడు.ఘన సన్మానంఇక సుదీర్ఘ విరామం తర్వాత ఇరానీ కప్ను సొంతం చేసుకున్న ముంబై జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. వాంఖడే స్టేడియంలో త్వరలోనే ఆటగాళ్లను సన్మానిస్తామని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ తెలిపాడు. దేశవాళీల్లో తమ ఆధిపత్యం చాటుతూ ముంబై జట్టు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని... సమష్టి ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. ఇరానీ కప్-2024: సంక్షిప్త స్కోర్లు ముంబై తొలి ఇన్నింగ్స్: 537 రెస్టా ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 416ముంబై రెండో ఇన్నింగ్స్: 329/8. చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
ఇరానీ కప్ విజేతగా ముంబై.. 27 ఏళ్ల తర్వాత!
ఇరానీకప్-2024 విజేతగా ముంబై నిలిచింది. కాన్పూర్ వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో.. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ముంబై ఛాంపియన్స్గా అవతరించింది. కాగా ముంబై ఇరానీకప్ను సొంతం చేసుకోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఓవరాల్గా ఇరానీ కప్ విజేతగా ముంబై నిలవడం ఇది 15వ సారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 537 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(222 నాటౌట్) డబుల్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు కొటియన్(64) పరుగులతో రాణించాడు. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబై జట్టుకు 121 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్లో ముంబై 8 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. అయితే శనివారం(ఆక్టోబర్ 5) ఆఖరి రోజు ఆట కావడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా ముంబై ఖాతాలో ఓవరాల్గా ఇది 62 దేశీవాళీ క్రికెట్ ట్రోఫీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీలు-45, ఇరానీ కప్-15, విజయ్ హజారే ట్రోఫీ-4, సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ-1 ముంబై పేరిట ఉన్నాయి.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
Team India: ఇషాన్ కిషన్ కల చెదిరిపోయినట్లే!
ఇరానీ కప్-2024 మ్యాచ్లో టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబైతో జరుగుతున్న ఈ ఐదు రోజుల మ్యాచ్లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 93 పరుగులతో దుమ్ములేపాడు.'శతకం చేజారినాసెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(191)తో కలిసి రెస్ట్ ఆఫ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇక ఇదే మ్యాచ్లో తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ధ్రువ్ జురెల్ అదరగొడుతున్నాడు. ముంబై తొలి ఇన్నింగ్స్లో అతడు మూడు క్యాచ్లతో మెరిశాడు.ముకేశ్ కుమార్ బౌలింగ్లో ఆయుశ్ మాత్రే(19), హార్దిక్ తామోర్(0), యశ్ దయాల్ బౌలింగ్లో కెప్టెన్ అజింక్య రహానే(97) ఇచ్చిన క్యాచ్లు పట్టి.. వారిని పెవిలియన్కు పంపడంలో తోడ్పడ్డాడు. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టి తనపై నుంచి మరలకుండా చేసుకోగలిగాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఇషాన్ కిషన్ విఫలంమరోవైపు.. ఇరానీ కప్-2024 మ్యాచ్లో ధ్రువ్ జురెల్తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకే ఆడుతున్న మరో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. ఐదో స్థానంలోబ్యాటింగ్కు దిగిన ఈ లెఫ్టాండర్ 60 బంతులు ఎదుర్కొని 38 పరుగులకే పరిమితమయ్యాడు. కాగా ఇషాన్ కిషన్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే.టీమిండియా సెలక్టర్ల దృష్టి మరలకుండాముఖ్యంగా టెస్టుల్లో స్థానం పొందాలన్న ఇషాన్ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఈ జార్ఖండ్ బ్యాటర్కు ధ్రువ్ జురెల్ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధ్రువ్.. తన తొలి మ్యాచ్లోనే మెరుగ్గా రాణించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా దులిప్ ట్రోఫీ-2024లోనూ వికెట్ కీపర్గా రాణించిన ధ్రువ్ జురెల్.. బంగ్లాదేశ్తో సిరీస్లో పంత్ బ్యాకప్గా ఉన్నాడు.ఇషాన్ రంజీల్లో రాణిస్తేనేతాజాగా రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అద్బుత ఇన్నింగ్స్తో అలరించాడు. స్వదేశంలో టీమిండియా తదుపరి న్యూజిలాండ్తో ఆడే సిరీస్కు ముందు సెలక్టర్ల ముందు సత్తా నిరూపించుకున్నాడు. దీంతో సెలక్టర్లు.. టెస్టుల్లో ఇషాన్ కిషన్ను వికెట్ కీపర్ రేసు నుంచి తప్పించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఏడాది రంజీల్లో గనుక ఇషాన్ రాణిస్తే తన రాత మారే అవకాశం ఉంటుంది. భారీ ఆధిక్యం దిశగా ముంబైకాగా రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై.. ఇరానీ కప్ కూడా గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. లక్నోలో అక్టోబరు 1న మొదలైన ఈ ఐదు రోజుల మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 537 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు రెస్ట్ ఆఫ్ ఇండియా 416 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ముంబై రెండో ఇన్నింగ్స్లో 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
పృథ్వీ షా విధ్వంసకర ఫిప్టీ.. భారీ ఆధిక్యం దిశగా ముంబై
ఇరానీ కప్-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో సెకెండ్ ఇన్నింగ్స్లో ముంబై ఓపెనర్ పృథ్వీ షా క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20ల్లో స్టైల్లో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్లు, ఓ సిక్సర్తో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా 105 బంతులు ఎదుర్కొన్న 76 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో పృథ్వీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక నాలుగో రోజు ఆటముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో ముంబై 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ముంబై ప్రస్తుతం 274 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(9), తనీష్ కొటియన్(20) పరుగులతో ఉన్నారు. అంతకుముందు రెస్ట్ ఆఫ్ ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్(191) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అదే విధంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 537 పరుగుల భారీ స్కోర్ చేసింది.. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(222 నాటౌట్) డబుల్ సెంచరీతో మెరిశాడు. అయితే ఇంకా కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం కన్పిస్తోంది.చదవండి: ధోని కోసమే ఆ రూల్స్ను మార్చారు: మహ్మద్ కైఫ్ -
డబుల్ సెంచరీ చేజార్చుకున్న అభిమన్యు ఈశ్వరన్
ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్ 2024 మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈశ్వరన్ 191 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షమ్స్ ములానీ బౌలింగ్లో తనుశ్ కోటియన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. నాలుగో రోజు ప్రారంభం నుంచి జాగ్రత్తగా ఆడిన ఈశ్వరన్ అనవసర స్వీప్ షాట్ ఆడి డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. STAND UP & SALUTE ABHIMANYU EASWARAN 🙇- An Icon of Indian domestic cricket. pic.twitter.com/wak0qvFen7— Johns. (@CricCrazyJohns) October 4, 2024అంతకుముందే మరో ఓవర్నైట్ బ్యాటర్ ధృవ్ జురెల్ కూడా సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జురెల్ 93 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షమ్స్ ములానీ బౌలింగ్లో హార్దిక్ తామోర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడు పరుగుల స్వల్ప వ్యవధిలో రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. నాలుగో రోజు లంచ్ విరామం (104 ఓవర్ల తర్వాత) సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్ 400/6గా ఉంది. సరాన్ష్ జైన్ (3), మానవ్ సుతార్ (2) క్రీజ్లో ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 137 పరుగులు వెనుకపడి ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 9, సాయి సుదర్శన్ 32, దేవ్దత్ పడిక్కల్ 16, ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జునెద్ ఖాన్, తనుశ్ కోటియన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 537 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ అజేయ డబుల్ సెంచరీతో (222) ముంబై భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అజింక్య రహానే (97) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు, సరాన్ష్ జైన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..! -
Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్
ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో కదంతొక్కాడు. ఈశ్వరన్ 117 బంతుల్లో సెంచరీ మార్కు తాకడు. మూడో రోజు టీ విరామం సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్ 193/3గా (49 ఓవర్లలో) ఉంది. ఈశ్వరన్ 108, ఇషాన్ కిషన్ 20 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 9, సాయి సుదర్శన్ 32, దేవ్దత్ పడిక్కల్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్తి, జునెద్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై స్కోర్ కంటే ఇంకా 344 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 537 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ అజేయ డబుల్ సెంచరీతో (222) ముంబై భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అజింక్య రహానే (97) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు, సరాన్ష్ జైన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో సూపర్ ట్రాక్ రికార్డుముంబైతో మ్యాచ్లో సెంచరీ చేసిన అభిమన్యు ఈశ్వరన్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈశ్వరన్ ఈ ఫార్మాట్లో 167 ఇన్నింగ్స్లు ఆడి 50 సగటున 7500 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు, 26 సెంచరీలు ఉన్నాయి.చదవండి: ‘భీకర ఫామ్లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’ -
‘భీకర ఫామ్లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ ఇరానీ కప్-2024 మ్యాచ్లో పూర్తిగా నిరాశపరిచాడు. మూడో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అభిమానులు రుతు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే, భారత టెస్టు జట్టుకు ఎంపిక కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.కాగా రంజీ చాంపియన్ ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతోంది. లక్నో వేదికగా అక్టోబరు 1న మొదలైన ఈ రెడ్బాల్ మ్యాచ్లో టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.సర్ఫరాజ్ డబుల్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (276 బంతుల్లో 221 బ్యాటింగ్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 237/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై రెండో రోజంతా అదే జోరు కనబర్చింది.కెప్టెన్ అజింక్య రహానే, షమ్స్ ములానీ (5) త్వరగానే ఔటైనా... తనుశ్ కోటియాన్ (124 బంతుల్లో 64; 6 ఫోర్లు)తో కలిసి సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఏడో వికెట్కు 183 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరానీ కప్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ముంబై ఆటగాడిగా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు.భీకర ఫామ్లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!ఇలా... టీమిండియా టెస్టు జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న సర్ఫరాజ్ దేశవాళీల్లో భీకర ఫామ్ కొనసాగిస్తూ చెలరేగగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వద్ద ఉండగా.. ముంబై ప్లేయర్ జునైద్ ఖాన్ బౌలింగ్లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆదిలోనే రెస్ట్ ఆఫ్ ఇండియాకు షాక్ తగిలింది.అయితే, మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకంతో అదరగొట్టి సెంచరీ దిశగా పయనిస్తుండగా.. సాయి సుదర్శన్(32) అతడికి సహకారం అందించాడు. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆటలో 36 ఓవర్లు ముగిసేసరికి రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ముంబై కంటే 396 పరుగులు వెనుకబడి ఉంది.సెలక్టర్లు మాత్రం ఏం చేస్తారు?కాగా టీమిండియా టెస్టు ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ పాతుకుపోయిన విషయం తెలిసిందే. రోజురోజుకూ బ్యాటింగ్ మెరుగుపరచుకుంటూ ఈ యంగ్స్టర్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో బ్యాకప్ ఓపెనర్గా అయినా స్థానం దక్కించుకునేందుకు రుతు ప్రయత్నిస్తున్నాడు.ఈ క్రమంలో.. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టు సారథిగా వ్యవహరించిన రుతురాజ్.. మూడు మ్యాచ్లలో కలిపి 232 పరుగులు చేయగలిగాడు. అయితే, తాజాగా ఇరానీ కప్ మ్యాచ్లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. కాగా టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రుతురాజ్ కూడా జట్టుకు ఎంపికవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి ఆట తీరుతో అతడు సెలక్టర్లను ఆకట్టుకోవడం కష్టమేనని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ Maiden First-Class wicket for Mohammad Juned Khan on debut 🙌What a way to get off the mark! He gets the big wicket of captain Ruturaj Gaikwad 👌#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/KvUOFHK6Nx— BCCI Domestic (@BCCIdomestic) October 3, 2024 -
Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్
ఇరానీ కప్ 2024లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో సర్ఫరాజ్ ఈ మార్కును తాకాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి సర్ఫరాజ్ 218 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్ (25) క్రీజ్లో ఉన్నాడు. 133.4 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 522/8గా ఉంది. ముంబై ఇన్నింగ్స్లో కెప్టెన్ అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు.సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. సర్ఫరాజ్కు ఇరానీ కప్లో ఇది రెండో సెంచరీ కాగా.. సచిన్, ద్రవిడ్ కూడా ఇరానీ కప్లో తలో రెండు సెంచరీలు చేశారు. ఇరానీ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత దిలీప్ వెంగ్సర్కార్, గుండప్ప విశ్వనాథ్కు దక్కుతుంది. ఈ ఇద్దరు ఇరానీ కప్లో తలో నాలుగు సెంచరీలు చేశారు. వెంగ్సర్కార్, విశ్వనాథ్ తర్వాత ఇరానీ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత హనుమ విహారి, అభినవ్ ముకుంద్, సునీల్ గవాస్కర్, వసీం జాఫర్లకు దక్కుతుంది. వీరంతా ఈ టోర్నీలో తలో మూడు సెంచరీలు చేశారు.చదవండి: డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ -
శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్
రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో కదంతొక్కాడు. సర్ఫరాజ్ 150 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సర్ఫరాజ్ సెంచరీతో సత్తా చాటడంతో రెండో రోజు లంచ్ సమయానికి (94 ఓవర్లలో) ముంబై జట్టు 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. సర్ఫరాజ్తో పాటు తనుశ్ కోటియన్ (26) క్రీజ్లో ఉన్నాడు.SARFARAZ KHAN - THE STAR. ⭐- Yet Another day and yet another Hundred by Sarfaraz Khan in first Class, He has 15 Hundreds & 14 Fifties in First Class. 🤯pic.twitter.com/xIVR7ZV3TX— Tanuj Singh (@ImTanujSingh) October 2, 2024ముంబై ఇన్నింగ్స్లో అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. పృథ్వీ షా 4, ఆయుశ్ మాత్రే 19, హార్దిక్ తామోర్ 0, షమ్స్ ములానీ 5 పరుగులకు ఔటయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్ రెండు వికెట్లు తీశాడు. ఓవర్నైట్ స్కోర్ 237/4 వద్ద ముంబై రెండో రోజు ఆట మొదలుపెట్టిన విషయం తెలిసిందే.15వ ఫస్ట్ క్లాస్ సెంచరీరెస్ట్ ఆఫ్ ఇండియాపై చేసిన సెంచరీ సర్ఫరాజ్ ఖాన్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 15వది. ఈ సెంచరీతో సర్ఫరాజ్ యావరేజ్ 67 దాటింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇది ఐదో అత్యుత్తమ యావరేజ్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఈ ఏడాది మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది అతనికి ఇది రెండో సెంచరీ. ఓవరాల్గా ఇరానీ కప్లోనూ అతనికి ఇది రెండో సెంచరీ.చదవండి: ఇరానీ కప్.. రాణించిన రహానే, సర్ఫరాజ్ -
ఇరానీ కప్.. రాణించిన రహానే, సర్ఫరాజ్
లక్నో: సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే (197 బంతుల్లో 86 బ్యాటింగ్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా, రంజీ చాంపియన్ ముంబై జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన ఇరానీక కప్ మ్యాచ్లో ముంబై సారథి రహానే కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. రహానేతో పాటు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ (84 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (88 బంతుల్లో 54 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా అర్ధ శతకాలతో మెరిశారు.ఫలితంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన రహానే చక్కటి ఇన్నింగ్స్ ఆడగా... ఓపెనర్ పృథ్వీ షా (4), ఆయుష్ మాత్రే (19), హార్దిక్ తమోర్ (0) విఫలమయ్యారు. రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీయగా, యశ్ దయాళ్ ఒక వికెట్ పడగొట్టాడు. రహానేతో పాటు సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్కు 98 పరుగులు జోడించారు. -
‘అప్పుడు నాన్న కూడా నాతోనే ఉన్నారు.. ఇది పునర్జన్మ’
తన ఆరోగ్యం బాగానే ఉందని భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ తెలిపాడు. ఆ దేవుడి ఆశీసుల వల్లే తాను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడని.. ఆపత్కాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఇరానీ కప్-2024లో పాల్గొనేందుకు ఈ ముంబై ఆటగాడు... తండ్రి నౌషాద్ ఖాన్తో కలిసి కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ మెడ భాగంలో గాయాలయ్యాయి.మా నాన్న కూడా నాతోనే ఉన్నారుఅయితే, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా వేగంగా కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ముషీర్ మాట్లాడుతూ.. ఇది తనకు పునర్జన్మ వంటిదని పేర్కొన్నాడు. ‘నా ఆరోగ్యం మెరుగవ్వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మా నాన్న కూడా నాతోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా బాగానే ఉన్నారు.ఇది కొత్త జీవితంలాగా భావిస్తున్నా. కష్టకాలంలో అండగా నిలిచిన ముంబై క్రికెట్ సంఘం (ఎమ్సీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ముషీర్ పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. కాగా టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీ-2024లో ముషీర్ భారీ శతకం సాధించాడు. రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్లకూ దూరంఈ క్రమంలో రంజీ చాంపియన్ ముంబైతో రెస్టాఫ్ ఇండియా ఆడే ఇరానీ కప్-2024 మ్యాచ్కు ఎంపికయ్యాడు. అయితే, ఈ రెడ్బాల్ టోర్నీ మ్యాచ్ ఆడేందుకు లక్నోకు వెళ్తుంగా ప్రమాదం జరిగింది. ఈ ఘటన కారణంగా అతడు అక్టోబర్ 1 నుంచి లక్నోలో ప్రారంభం కానున్న ఇరానీ కప్ మ్యాచ్తో పాటు... ఆ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలోని ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకొని ముషీర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. చదవండి: పూరన్ సుడిగాలి శతకం View this post on Instagram A post shared by Naushad Khan (@musheerkhan.97) -
రోడ్డు ప్రమాదం.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్కు గాయాలు
భారత యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ ప్రమాదం బారిన పడినట్లు సమాచారం. తండ్రి, కోచ్ నౌషద్ ఖాన్తో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్లో వీరికి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముషీర్ మెడకు తీవ్రంగా గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సొంత తమ్ముడు ముషీర్ ఖాన్.అండర్-19 వరల్డ్కప్లో అదరగొట్టిఅండర్-19 వరల్డ్కప్ తాజా ఎడిషన్లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్.. ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 360 పరుగులతో యువ భారత జట్టు టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం తొమ్మిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లలోనే 716 పరుగులతో దుమ్ములేపాడు. దులిప్ ట్రోఫీ-2024లో శతక్కొట్టిఅంతేకాదు.. తన స్పిన్ బౌలింగ్తో ఎనిమిది వికెట్లు కూడా కూల్చాడు. ఈ ఏడాది రంజీల్లో ముంబై చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ.. దులిప్ ట్రోఫీ-2024లో ఆడే అవకాశం ఇచ్చింది. ఇండియా-బి తరఫున బరిలోకి దిగిన ముషీర్ అరంగేట్రంలోనే 181 పరుగులతో అదరగొట్టాడు. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న ఈ యువ క్రికెటర్ ఇరానీ కప్-2024 నేపథ్యంలో ముంబై జట్టుకు ఎంపికయ్యాడు.కాన్పూర్ నుంచి లక్నోకురంజీ చాంపియన్ ముంబై- రెస్టాఫ్ ఇండియా మధ్య లక్నో వేదికగా అక్టోబరు 1-5 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో తండ్రి నౌషద్ ఖాన్తో కలిసి ముషీర్ కాన్పూర్ నుంచి లక్నో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ముంబై నుంచి బయల్దేరకుండా ముషీర్ ఖాన్ తండ్రితో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపిందికాగా ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయమైందని.. కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇరానీ కప్తో పాటు.. రంజీ తాజా ఎడిషన్కు దూరం కానున్నట్లు సమాచారం. మరోవైపు.. సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ టీమిండియాలో పునరాగమనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, రెస్టాఫ్ ఇండియా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపైనే ఈ విషయం ఆధారపడి ఉంది. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.రెడ్బాల్ క్రికెట్లో రీఎంట్రీరంజీల్లో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరకు చేయడం వల్ల.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడంటూ బోర్డు ఇషాన్కు గట్టి షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్ ఇటీవలే బుచ్చిబాబు టోర్నీ ద్వారా రెడ్బాల్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. సెంచరీతో ఆకట్టుకుని.. దులిప్ ట్రోఫీ-2024లో చోటు దక్కించుకున్నాడు.రెస్టాఫ్ ఇండియా టీమ్కు ఎంపికబీసీసీఐ ఆధ్వర్యంలోని ఈ దేశీ రెడ్బాల్ టోర్నీలోనూ ఇషాన్ కిషన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఇండియా-‘సి’ జట్టు తరఫున శతకంతో అలరించాడు. ఈ క్రమంలో ఇరానీ కప్-2024 మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా టీమ్కు ఎంపికయ్యాడు.రిషభ్ పంత్కు విశ్రాంతిరంజీ చాంపియన్ ముంబైతో అక్టోబరు 1- 5 వరకు జరుగనున్న మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా తలపడనుంది. ఆ వెంటనే అంటే.. అక్టోబరు 6- 12 వరకు టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్కు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.బంగ్లా సిరీస్ తర్వాత.. న్యూజిలాండ్తో టెస్టుల నేపథ్యంలో ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి పంత్ స్థానంలో ఇషాన్ను బంగ్లాదేశ్తో టీ20సిరీస్కు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన వికెట్ కీపర్గా సంజూ శాంసన్కు ఛాన్స్ ఇవ్వనున్న సెలక్టర్లు.. అతడికి బ్యాకప్గా ఇషాన్కు జట్టులోస్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రెస్టాఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేస్తేనేఅయితే, అదే సమయంలో.. ఇరానీ కప్ మ్యాచ్ ఉన్నందున రెస్టాఫ్ ఇండియా నుంచి ఇషాన్ను రిలీజ్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఏదేమైనా.. ఒకప్పుడు జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఈ లెఫ్టాండర్.. స్వీయ తప్పిదాల వల్ల ఇప్పుడు జట్టులో అదనపు ప్లేయర్గానైనా చోటు దక్కించుకోవడం గగనమైపోయింది.చదవండి: రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి, మరో టీమిండియా స్టార్ కూడా.. డీడీసీఏ ప్రకటన -
జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్
ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ జట్టుకు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే దులీప్ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్కు మాత్రం బీసీసీఐ సెలక్టర్లు మొండి చేయిచూపించింది. అతడికి ఇరానీ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వలేదు. అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్కు ఎంపికైన భారత క్రికెటర్లు ధ్రువ్ జురెల్, యష్ దయాల్ను ఈ జట్టులో సెలెక్టర్లు చేర్చారు. దీంతో వీరిద్దరూ రెండు టెస్టుకు బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది. మరోవైపు ఈ ఇరానీ కప్లో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.ఇరానీ ట్రోఫీకి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్చదవండి: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం.. ట్రోఫీ మాదే: హర్మన్ -
కెప్టెన్గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!
ఇరానీ కప్-2024కు ముంబై జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. రెస్టాఫ్ ఇండియాపై గెలుపే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్బాల్ మ్యాచ్లో ముంబైకి అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు.ఇక ఈ మ్యాచ్కు ఇద్దరు టీమిండియా స్టార్లు కూడా అందుబాటులోకి రావడంతో జట్టు మరింత పటిష్టంగా మారనుందని ముంబై వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు, రెస్టాఫ్ ఇండియా టీమ్కు మధ్య ఇరానీ కప్ పోటీ జరుగుతుంది.రంజీ తాజా ఎడిషన్ విజేత ముంబైఈ ఏడాది రంజీ టోర్నీలో రహానే సారథ్యంలోని ముంబై జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 1 నుంచి మొదలయ్యే ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియాతో తలపడనుంది. ఇందుకోసం ఎంసీఏ మంగళవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు క్రిక్బజ్ వెల్లడించింది.ఇద్దరు టీమిండియా స్టార్లు అందుబాటులోకిరహానే కెప్టెన్సీలో జరుగనున్న ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో పాటు.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎంసీఏ అధికారులు నిర్ధారించినట్లు పేర్కొంది. కాగా టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. లీసస్టర్షైర్కు ఆడే క్రమంలో అతడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.అయితే, ఇరానీ కప్ మ్యాచ్ నాటికి రహానే పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు కూడా ఎంపిక కాలేదు. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లతో మిడిలార్డర్లో పోటీలో అతడు వెనుకబడ్డాడు.శ్రేయస్కు మరో అవకాశంఇటీవల దులిప్ ట్రోఫీ-2024లోనూ శ్రేయస్ నిరాశపరిచాడు. దీంతో ఇరానీ కప్ మ్యాచ్లోనైనా సత్తా చాటాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. శస్త్ర చికిత్స అనంతరం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన శార్దూల్ ఠాకూర్ సైతం ఈ మ్యాచ్కు అందుబాటులోని రానున్నట్లు సమాచారం. కాగా ముంబై చివరగా 1998లో ఇరానీ కప్ గెలిచింది. అయితే, ఈసారి మేటి ఆటగాళ్లు జట్టులో భాగమవడం సానుకూలాంశం. మరోవైపు.. రెస్టాఫ్ ఇండియా జట్టు గత హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. గత మ్యాచ్లలో సౌరాష్ట్రపై రెండుసార్లు, మధ్యప్రదేశ్ జట్టుపై ఒకసారి గెలిచి ఇరానీ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కాగా శ్రేయస్, శార్దూల్ రంజీ గెలిచిన ముంబై జట్టులోనూ సభ్యులేనన్న విషయం తెలిసిందే.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..! -
టీమిండియాకు శుభవార్త.. స్టార్ ఆల్రౌండర్ వచ్చేశాడు..!
టీమిండియాకు శుభవార్త. స్టార్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు నెలల తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బెంగళూరులో జరిగిన కెప్టెన్ కే తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నీలో శార్దూల్ పాల్గొన్నాడు. ఈ టోర్నీలో అతను ముంబై జట్టుకు ప్రాతనిథ్యం వహించాడు. నిన్న కేఎస్సీఏ సెక్రటరీ ఎలెవెన్తో జరిగిన మ్యాచ్లో శార్దూల్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో శార్దూల్ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. బ్యాటింగ్లో డకౌటైన అతను.. బౌలింగ్లో ఎనిమిది ఓవర్లు వేసి వికెట్ లేకుండా 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో శార్దూల్ రాణించకపోయినా లాంగ్ టెస్ట్ సీజన్కు ముందు భారత్కు ఓ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అందుబాటులోకి వచ్చాడు. బంగ్లాదేశ్తో రెండో టెస్ట్కు భారత సెలెక్టర్లు శార్దూల్ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కుదరకపోయినా ఆసీస్లో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శార్దూల్కు అవకాశం ఇచ్చే ఛాన్స్లు ఉన్నాయి. ఆసీస్లో జరిగిన గత బీజీటీలో శార్దూల్ అద్భుతంగా రాణించాడు. అక్కడి పిచ్లు శార్దూల్ బౌలింగ్ స్టయిల్కు అనుకూలిస్తాయి. లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా కావడంతో శార్దూల్ను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయవచ్చు. కాగా, శార్దూల్ 2024 ఐపీఎల్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. శార్దూల్కు జూన్ 12న లండన్లో కాలి మడమకు సర్జరీ జరిగింది. శార్దూల్ త్వరలో జరిగే ఇరానీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడతాడు. ఆ మ్యాచ్లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే, భారత టెస్ట్ సీజన్ త్వరలో బంగ్లాదేశ్తో జరుగబోయే టెస్ట్ మ్యాచ్ నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది జనవరి వరకు భారత్ 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. బంగ్లాదేశ్తో రెండు, న్యూజిలాండ్తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లలో భారత్ పాల్గొంటుంది. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాతో రెండు టెస్ట్ల అనంతరం భారత్ అదే జట్టుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. మూడు టీ20లు గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగనున్నాయి.తొలి టెస్ట్కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: సచిన్ మరో రికార్డు బద్దలు కొట్టేందుకు రెడీగా ఉన్న కోహ్లి -
ఇరానీ ట్రోఫీ 2023 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
2023 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 175 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 160 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 214, సెకెండ్ ఇన్నింగ్స్లో 79 పరుగులకు ఆలౌటైంది. రాణించిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 5 వికెట్లు పడగొట్టగా.. ధరేంద్ర జడేజా 3, యువరాజ్ సింగ్ దోడియా 2 వికెట్లు తీశారు. చెలరేగిన సౌరభ్ కుమార్.. అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్ వసవద (54) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (4/65), షమ్స్ ములానీ (2/47), పుల్కిత్ నారంగ్ (1/56) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. తిప్పేసిన పార్థ్ భట్.. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియాను పార్థ్ భట్ (7/53) తిప్పేశాడు. అతనికి జడేజా (3/65) కూడా తోడవ్వడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్లో 160 పరుగులకే చాపచుట్టేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. సాయి సుదర్శన్ (43), హనుమ విహారి (22), సర్ఫరాజ్ ఖాన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి విజృంభించిన సౌరభ్ కుమార్.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ సౌరభ్ కుమార్ రెండో ఇన్నింగ్స్లోనూ విజృంభించడంతో (6/43) సారాష్ట్ర తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 79 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. సౌరభ్కు జతగా షమ్స్ ములానీ (3/22), పుల్కిత్ నారంగ్ (1/1) వికెట్లు పడగొట్టారు. -
Irani Trophy 2023: సౌరాష్ట్రను దెబ్బకొట్టిన కావేరప్ప, సౌరభ్ కుమార్
ఇరానీ ట్రోఫీ 2023లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు స్వల్ప ఆధిక్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరాష్ట్ర.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్కు 96 పరుగులు వెనుకపడి ఉంది. ఐదేసిన పార్థ్ భట్.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించడంతో తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకు ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్ పార్థ్ భట్ 5 వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియాను దెబ్బకొట్టాడు. ధరేంద్ర జడేజా (3/20), యువరాజ్ సింగ్ దోడియా (2/74) తలో చేయి వేశారు. సౌరాష్ట్రను దెబ్బకొట్టిన కావేరప్ప, సౌరభ్ కుమార్.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్రను విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (3/64) దెబ్బకొట్టారు. వీరిద్దరికి షమ్స్ ములానీ (2/46), పుల్కిత్ నారంగ్ (1/56) తోడవ్వడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. హార్విక్ దేశాయి (0), చిరాగ్ జానీ (2), షెల్డన్ జాక్సన్ (13), జడేజా (11) విఫలం కాగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్లో అర్పిత్ వసవద (54) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. జడదేవ్ ఉనద్కత్ (17), దోడియా (0) క్రీజ్లో ఉన్నారు. -
Irani Trophy 2023: రాణించిన సాయి సుదర్శన్.. తొలి రోజు బౌలర్ల హవా
ఇరానీ ట్రోఫీ 2023లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం నడిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర బౌలర్లు హవా కొనసాగించారు. పార్థ్ భట్ (4/85), ధరేంద్ర సింగ్ జడేజా (2/89), యువరాజ్ సింగ్ దోడియా (2/74) రాణించారు. వీరి ధాటికి ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజే 8 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రాణించిన సాయి సుదర్శన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఓపెనర్లు సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 69 పరుగులు జోడించారు. అనంతరం మాయంక్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన హనుమ విహారి (33) సైతం ఓ మోస్తరు స్కోర్ చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), యశ్ ధుల్ (10), పుల్కిత్ నారంగ్ (12) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరభ్ కుమార్ (30), నవదీప్ సైనీ (8) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఇరానీ ట్రోఫీ రంజీ ఛాంపియన్ టీమ్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుతుందన్న విషయం తెలిసిందే. -
ఇరానీ కప్ విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
గ్వాలియర్: ఆద్యంతం ఆధిపత్యం చాటుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 30వ సారి ఇరానీ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో ఆదివారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలోని రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 238 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 437 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్లో 58.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 81/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ ఆట చివరిరోజు మరో 117 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో సౌరభ్ కుమార్ మూడు వికెట్లు తీయగా... ముకేశ్ కుమార్, అతీత్, పుల్కిత్ నారంగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. -
కేక పుట్టించిన యశస్వి.. రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్
ఇరానీ కప్ 2023 విజేతగా రెస్టాఫ్ ఇండియా నిలిచింది. మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 238 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. 436 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ నాలుగో ఇన్నింగ్స్లో 198 పరుగులకే కుప్పకూలింది. హిమాన్షు మంత్రి 51 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హర్ష్ గావ్లి 48 పరుగులు చేశాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో సౌరబ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. ముఖేశ్ కుమార్, పుల్కిత్ నారంగ్, అతిత్ సేత్ తలా రెండు వికెట్లు తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో రెస్టాఫ్ ఇండియా 484 పరుగులు చేసింది. అనంతరం మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 294 పరుగులకు ఆలౌట్ కావడంతో రెస్టాఫ్కు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్లో యశస్వి మరోసారి సెంచరీతో చెలరేగగా.. జట్టు 246 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని రెస్టాఫ్ ఇండియా మధ్యప్రదేశ్ ముందు 436 పరుగుల లక్ష్యాన్ని విధించింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. That winning feeling 😃👌#IraniCup | #MPvROI | @mastercardindia Scorecard 👉 https://t.co/UMUCM30e11 pic.twitter.com/5Nxt4DhLXg — BCCI Domestic (@BCCIdomestic) March 5, 2023 A victory to savour! 👌👌 Rest of India register a 238-run win over Madhya Pradesh at the Captain Roop Singh Stadium, Gwalior to win the #IraniCup 👏🏻👏🏻 #MPvROI | @mastercardindia Scorecard 👉 https://t.co/UMUCM30e11 pic.twitter.com/0FQgBND6Sx — BCCI Domestic (@BCCIdomestic) March 5, 2023 చదవండి: హై స్కోరింగ్ మ్యాచ్ల కోసం ఇంత దిగజారాలా? తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీ విజయగాథ -
యశస్వి జైస్వాల్ చారిత్రక ఇన్నింగ్స్లు.. ఓటమి దిశగా మధ్యప్రదేశ్
ఇరానీ ట్రోఫీ 2022-23లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ వన్సైడెడ్గా సాగుతోంది. 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. అర్హమ్ అఖిల్ డకౌట్ కాగా.. శుభమ్ శర్మ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ హిమాన్షు మంత్రి (51) అజేయ అర్ధశతకంతో మధ్యప్రదేశ్ను ఓటమి బారి నుంచి తప్పించేందుకు విఫలయత్నం చేస్తున్నాడు. హిమాన్షుతో పాటు హర్ష్ గవ్లీ (15) క్రీజ్లో ఉన్నాడు. ముకేశ్ కుమార్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు, యశస్వి జైస్వాల్ (144) మెరుపు అర్ధసెంచరీతో విజృంభించడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌట్ కాగా.. పుల్కిత్ నారంగ్ (4/65), నవ్దీప్ సైనీ (3/56), ముకేశ్ కుమార్ (2/44), సౌరభ్ కుమార్ (1/74) ధాటికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 294 పరుగులకే చాపచుట్టేసింది. యశ్ దూబే (109) సెంచరీతో రాణించగా.. హర్ష గవ్లీ (54), సరాన్ష్ జైన్ (66) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించారు. దీనికి ముందు తొలి ఇన్నింగ్స్లో యశస్వి (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, అభిమన్యు ఈశ్వరన్ (154) భారీ సెంచరీతో చెలరేగడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 484 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్ కుష్వా ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 190 పరుగుల ఆధిక్యం, రెండో ఇన్నింగ్స్లో 246 పరుగుల స్కోర్తో కలుపుకుని మధ్యప్రదేశ్కు 437 పరుగుల టార్గెట్ను నిర్ధేశించింది రెస్ట్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాచ్తో ఇరానీ కప్ అరంగేట్రం చేసిన యశస్వి.. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో సెంచరీ సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన భారత యువ కెరటం.. డెబ్యూలోనే డబుల్ సెంచరీ, సెంచరీ
Yashasvi Jaiswal: భారత యువ కెరటం, ఉత్తర్ప్రదేశ్ బార్న్ ముంబై క్రికెటర్ యశస్వి జైస్వాల్ దేశవాలీ టోర్నీ ఇరానీ కప్లో ఇరగదీశాడు. మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. అరంగేట్రం మ్యాచ్లోనే డబుల్ సెంచరీ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు), సెంచరీతో (132 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టి, టీమిండియాలో చోటు కోసం దూసుకొస్తున్నాడు. ఇటీవలి కాలంలో దేశవాలీ క్రికెట్లో ఫార్మాట్లకతీతంగా విజృంభిస్తున్న యశస్వి.. పలు సంచలన ప్రదర్శనల నమోదు చేసి, నేను కూడా టీమిండియా ఓపెనర్ రేసులో ఉన్నానని భారత సెలక్టర్లకు సవాలు విసురుతున్నాడు. Yashasvi Jaiswal has 9 Hundred, including 3 double hundreds in just 15 first-class matches 😲#IraniCup | #CricketTwitter pic.twitter.com/9wvHwCCKIy — InsideSport (@InsideSportIND) March 4, 2023 మధ్యప్రదేశ్తో ఇరానీ కప్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. ఒకే మ్యాచ్లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించడం ద్వారా పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇరానీ కప్లో ఒకే మ్యాచ్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా.. అరంగేట్రం మ్యాచ్లోనే ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక బ్యాటర్గా.. శిఖర్ ధవన్ తర్వాత ఇరానీ కప్ మ్యాచ్లో 300 ప్లస్ పరుగులు చేసిన రెండో బ్యాటర్గా.. ఒకే ఫస్ట్క్లాస్ మ్యాచ్లో డబుల్ సెంచరీ, సెంచరీ నమోదు చేసిన 11వ భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. Yashasvi Jaiswal is the first batter to record a double hundred and a hundred in the same Irani Cup match. He is also only the second player after Shikhar Dhawan to score more than 300 runs in one Irani Cup game. — Lalith Kalidas (@lal__kal) March 4, 2023 ప్రస్తుత దేశవాలీ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న యశస్వి.. కేవలం 13 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగుల మార్కును అందుకుని, ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల యశస్వికి అరంగేట్రం మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్ ఈస్ట్ జోన్పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అతను 146 పరుగులు స్కోర్ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. తొలి ఇన్నింగ్స్లో 484 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (213) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అభిమన్యు ఈశ్వరన్ (154) సెంచరీతో కదం తొక్కాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్ కుష్వా ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. పుల్కిత్ నారంగ్ (4/65), నవ్దీప్ సైనీ (3/56), ముకేశ్ కుమార్ (2/44), సౌరభ్ కుమార్ (1/74) ధాటికి 294 పరుగులకే చాపచుట్టేసింది. యశ్ దూబే (109) సెంచరీతో రాణించగా.. హర్ష గవ్లీ (54), సరాన్ష్ జైన్ (66) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించారు. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. నాలుగో రోజు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి, ఓవరాల్గా 391 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యశస్వి (121) అజేయమైన సెంచరీతో క్రీజ్లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అంకిత్ ఖుష్వా తలో 2 వికెట్లు, కుమార్ కార్తీకేయ, సరాన్ష్ జైన్ చెరో వికెట్ పడగొట్టారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఆధిక్యం
గ్వాలియర్: రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ ఇండియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆట మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 112/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 112.5 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. యశ్ దూబే (258 బంతుల్లో 109; 16 ఫోర్లు) సెంచరీ సాధించగా, సారాంశ్ జైన్ (150 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 85 పరుగులు సాధించింది. తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 275 పరుగులకు పెంచుకుంది. కెపె్టన్ మయాంక్ డకౌట్ కాగా... యశస్వి జైస్వాల్ (58 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్), అభిమన్యు ఈశ్వరన్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. -
అరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్.. డబుల్ సెంచరీతో..!
Irani Cup 2022-23: ముంబై యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్..ఇరానీ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఈ టోర్నీలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. మధ్యప్రదేశ్తో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మ్యాచ్లో 230 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ఇరానీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 259 బంతులు ఎదుర్కొన్న యశస్వి.. 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 213 పరుగులు చేపి ఔటయ్యాడు. యశస్వికి బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (154) తోడయ్యాడు. వీరిద్దరూ శతకాలతో విజృంభించడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. .@ybj_19 roars at the Captain Roop Singh Stadium 💪 💪 A spectacular 2️⃣0️⃣0️⃣ 👏 to help build a solid foundation with Abhimanyu Easwaran Follow the match 👉 https://t.co/L1ydPUXHQL #IraniCup | #MPvROI | @mastercardindia pic.twitter.com/AIrv9JYEAW — BCCI Domestic (@BCCIdomestic) March 1, 2023 కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. యశస్వి, ఈశ్వరన్ శతకాల మోత మోగించారు. సౌరభ్ కుమార్ (0), బాబా ఇంద్రజిత్ (3) క్రీజ్లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఈశ్వరన్ రనౌటయ్యాడు. కాగా, యశస్వి జైస్వాల్కు అరంగేట్రం మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్ ఈస్ట్ జోన్పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అతను 146 పరుగులు స్కోర్ చేశాడు. -
Irani Cup 2023: స్టార్ క్రికెటర్కు దక్కని చోటు.. కారణం ఏంటంటే..?
ముంబై స్టార్ క్రికెటర్, అప్ కమింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్కు దేశవాలీ ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ఇరానీ కప్లో ఆడే అవకాశం లభించలేదు. మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్తో జరగాల్సిన మ్యాచ్కు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు సర్ఫరాజ్ సారధ్యం వహించాల్సి ఉండింది. అయితే చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా సెలెక్టర్లు సర్ఫరాజ్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. సర్ఫరాజ్ గైర్హాజరీలో మయాంక్ అగర్వాల్ రెస్ట్ ఆఫ్ ఇండియా పగ్గాలు చేపడతాడు. డీవై పాటిల్ టీ20 కప్ సందర్భంగా సర్ఫరాజ్కు గాయమైనట్లు సమాచారం. కాగా, సర్ఫరాజ్ గతకొంతకాలంగా జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఇతను దేశవాలీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్నా.. సెలెక్టర్లు ప్రతిసారి మొండిచెయ్యే చూపిస్తున్నారు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధిస్తున్నప్పటికీ.. ఈ ముంబై ఆటగాడిపై సెలెక్టర్లు కనికరం చూపించడం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఒకానొక దశలో సహనం కోల్పోయి సెలెక్టర్లు, బీసీసీఐపై విరుచుకుపడ్డాడు. సెలక్టర్లు తనను మోసం చేశారంటూ వాపోయాడు. ఇదిలా ఉంటే, దేశవాలీ కెరీర్లో ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 79.65 సగటున 13 శతకాల సాయంతో 3505 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్.. 92.66 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు సాధించాడు. రెస్టాఫ్ ఇండియా : మయాంక్ అగర్వాల్, సుదీప్ కుమార్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హర్విక్ దేశాయ్, ముఖేశ్ కుమార్, అతిత్ సేథ్, చేతన్ సకారియా, నవదీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ మార్ఖండే, సౌరభ్ కుమార్, ఆకాశ్ దీప్, బాబా ఇంద్రజీత్, పుల్కిత్ నారంగ్, యశ్ ధుల్ -
అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ.. రెస్ట్ ఆఫ్ ఇండియాదే ఇరానీ కప్
ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా నిలిచింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా 104 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీతో మెరవగా.. కోన శ్రీకర్ భరత్ 27 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ రెండు వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్(138 పరుగులు) సెంచరీతో మెరవగా.. హనుమ విహారి 82 పరుగులు చేయగా సౌరబ్ కుమార్ 55 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో సౌరాష్ట్ర 380 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేయగా.. ప్రేరక్ మాన్కడ్ 72 పరుగులతో రాణించాడు. ఇక 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా 31.5 ఓవర్లలో చేధించి 8 వికెట్ల తేడాతో గెలిచి ఇరానీ కప్ను ఒడిసిపట్టింది. ఇక తొలి ఇన్నింగ్స్లో మూడు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి ఓవరాల్గా ఎనిమిది వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్ కుల్దీప్ సేన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కాగా రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇది 29వ ఇరానీ టైటిల్ కావడం విశేషం. Winners Are Grinners! ☺️ 🙌 Rest of India beat the spirited Saurashtra side to win the #IraniCup. 👏 👏 #SAUvROI | @mastercardindia Scorecard ▶️ https://t.co/u3koKzUU9B pic.twitter.com/WD2ELx8wrP — BCCI Domestic (@BCCIdomestic) October 4, 2022 చదవండి: టి20 ప్రపంచకప్కు దూరం కావడంపై బుమ్రా స్పందన.. 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్కు దూరం -
మారువేషంలో జడేజా.. అంతా ఉనాద్కట్ మాయ!
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మోకాలీ సర్జరీతో టి20 ప్రపంచకప్కు దూరమైన సంగతి తెలిసిందే. జడ్డూతో పాటు బుమ్రా కూడా దూరమవ్వడం టీమిండియా అభిమానులకు షాక్ తగిలేలా చేసింది. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే టీమిండియా ప్రపంచకప్లో ఆడనుంది. మరి టీమిండియా అంచనాలు అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ విషయం పక్కనబెడితే.. ఇరానీ కప్లో భాగంగా సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో జడేజా బ్యాటర్గా ప్రత్యక్షమైన ఫోటో వైరల్గా మారింది. అదేంటి ప్రస్తుతం జడేజా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో ఉన్నాడు కదా.. ఇరానీ కప్లో ఆడడమేంటీ అనుకుంటున్నారా. అదంతా సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ మాయ. అతని పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు చర్చకు దారి తీసింది. రెస్టాఫ్ ఇండియాతో మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో సౌరాష్ట్ర కెప్టెన్ ఉనాద్కట్తో పాటు ప్రేరణ్ మన్కడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్కు 144 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే ప్రేరక్ మన్కడ్ను దూరం నుంచి చూస్తే కాస్త రవీంద్ర జడేజాలానే పోలి ఉంటాడు. ఇక్కడే ఉనాద్కట్ తన తెలివిని ఉపయోగించాడు. తనతో బ్యాటింగ్ చేసిన ప్రేరక్ మన్కడ్ ఫోటోకు కాస్త మార్ఫింగ్ చేసి జడేజాను పెట్టాడు. ''జడ్డూ టీమ్లో ఉండడం ఆనందంగా ఉంది(మారువేషంలో)'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కేవలం సరదా కోసమే చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. జడేజా, ప్రేరక్ మన్కడ్లకు పోలికలు దగ్గరగా ఉండడంతో..'' మరో జడేజా వచ్చేశాడు.. టి20 ప్రపంచకప్కు ఈ జడ్డూను పంపిద్దామా'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్లో 380 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెస్టాఫ్ ఇండియా ముందు 104 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం రెస్టాఫ్ ఇండియా 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 25, శ్రకర్ భరత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. Glad to have Jaddu in the team.. (in disguise 😂) @imjadeja = @PrerakMankad46 pic.twitter.com/3URrzEMgD2 — Jaydev Unadkat (@JUnadkat) October 3, 2022 చదవండి: 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్కు దూరం గెలిపించిన షేన్ వాట్సన్.. ఫైనల్కు బిల్వారా కింగ్స్ -
సౌరాష్ట్ర 380 ఆలౌట్.. రెస్టాఫ్ ఇండియా టార్గెట్ 104 పరుగులు
రాజ్కోట్: ఇరానీ కప్లో భాగంగా సౌరాష్ట్ర రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 104 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలి ఉండడంతో రెస్టాఫ్ ఇండియా విజయం దాదాపు ఖాయమే. ఇక ఓవర్నైట్ స్కోరు 368/8తో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర మరో 12 పరుగులు మాత్రమే చేసి 380 పరుగులకు ఆలౌట్ అయింది. జైదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేసి ఔట్ కాగా.. మిడిలార్డర్లో షెల్డన్ జాక్సన్ (71; 8 ఫోర్లు, 3 సిక్స్లు), అర్పిత్ (55; 7 ఫోర్లు, 1 సిక్స్), లోయర్ ఆర్డర్లో ప్రేరక్ మన్కడ్ (72; 9 ఫోర్లు) రాణించారు. దీంతో సౌరాష్ట్రకు 104 పరుగుల ఆధిక్యం లభించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలోకుల్దీప్ సేన్ ఐదు వికెట్లు తీయగా.. సౌరభ్ 3 వికెట్లు తీశాడు. -
సర్ఫరాజ్ ఇన్నింగ్స్కు ఫిదా అయిన సూర్యకుమార్..
ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దేశీవాళీ టోర్నీల్లో తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్.. ఇప్పడు ఇరానీ కప్లో కూడా అదరగొట్టాడు. ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు సర్ఫరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇరానీ కప్లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 178 బంతులు ఎదర్కొన్న సర్ఫరాజ్ 20 ఫోర్లు, 2 సిక్స్లతో 138 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ను టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రశసించాడు. సోషల్ మీడియాలో సర్ఫరాజ్ ఖాన్ ఫోటోను సూర్య షేర్ చేస్తూ.. "నీ ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది" అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక ఇరానీ కప్ తొలి ఇన్నింగ్స్లో రెస్ట్ ఆఫ్ ఇండియా 374 పరుగులకు ఆలౌటైంది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్లో సర్ఫరాజ్తో పాటు కెప్టెన్ హనుమా విహారి 82 పరుగులతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు 276 పరుగుల అధిక్యం లభించింది. ఇక రెండో రోజు ఆటముగిసే సమయానికి సౌరాష్ట్ర రెండు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. కాగా అంతకుముందు రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు చెలరేగడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. So so so Proud of you👏 pic.twitter.com/aHtT20LeQY — Surya Kumar Yadav (@surya_14kumar) October 1, 2022 చదవండి: IND vs SA: రెండో టీ20కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా? -
సర్ఫరాజ్ ఖాన్.. మొన్న దులీప్ ట్రోపీ.. ఇవాళ ఇరానీ కప్లో
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్ను కనబరుస్తున్నాడు. ఇటీవలే దులీప్ ట్రోపీ ఫైనల్లో సెంచరీతో మెరిసిన సర్ఫరాజ్ ఖాన్.. తాజాగా ఇరానీ కప్లోనూ శతకం సాధించి తన జోరు చూపిస్తున్నాడు. కేవలం 92 బంత్లులోనే శతకం సాధించిన సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం 125 పరుగులతో ఆడుతున్నాడు. అతని ఇన్నింగ్స్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇరానీ కప్లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా పట్టు బిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సర్ఫారాజ్ ఖాన్ 125 పరుగులు, కెప్టెన్ హనుమ విహారి 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు రెస్టాఫ్ ఇండియా బౌలర్ల దాటికి సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ 4 వికెట్లు,కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్లు చెరో మూడు వికెట్లు తీశారు. 💯 for Sarfaraz Khan! 🙌 🙌 What a stunning knock this has been by the right-hander! 👏 👏 Follow the match ▶️ https://t.co/u3koKzDR7B#IraniCup | #SAUvROI | @mastercardindia pic.twitter.com/O2XeAZ91RV — BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022 -
చెలరేగిన ముకేశ్, ఉమ్రాన్, కుల్దీప్ సేన్.. 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్
Irani Cup 2022 - Saurashtra vs Rest of India: ఇరానీ కప్-2022 టోర్నీలో భాగంగా సౌరాష్ట్ర- రెస్టాఫ్ ఇండియా మధ్య టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శనివారం ఆట మొదలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రెస్టాఫ్ ఇండియాకు బౌలర్లు శుభారంభం అందించారు. కుప్పకూలిన టాపార్డర్ రెస్టాఫ్ ఇండియా బౌలర్ల ధాటికి సౌరాష్ట్ర టాపార్డర్ కకావికలమైంది. 0,4,0,1,2.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ పతనం సాగింది. ఛతేశ్వర్ పుజారా(1) సహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయ్యారు. ఇక ఆరో స్థానంలో వచ్చిన అర్పిత్ వసవాడ 22 పరుగులు, తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధర్మేంద్ర సిన్హ్ జడేజా 28 పరుగులతో రాణించారు. 98 పరుగులకే ఆలౌట్ ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో 24.5 ఓవర్లలో 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్ అయింది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ 10 ఓవర్ల బౌలింగ్లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక కుల్దీప్ సేన్ మూడు, ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రంజీ ట్రోఫీ 2019- 20 విజేత సౌరాష్ట్రతో పోరులో వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇక సౌరాష్ట్ర జట్టుకు సారథి జయదేవ్ ఉనద్కట్. చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ T20 WC 2022: ఆస్ట్రేలియాకు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్! ICYMI! Watch how Mukesh Kumar set the ball rolling for Rest of India 🎥 🔽 #IraniCup | #SAUvROI | @mastercardindia https://t.co/GLg0dQvfNj — BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022 -
Irani Cup 2022: కెప్టెన్గా హనుమ విహారి.. జట్టులో ఉమ్రాన్ మాలిక్కు చోటు
Irani Cup 2022- Rest of India (RoI) squad: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్లోని రాజ్కోట్లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబరు 1 నుంచి 5 వరకు టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందులో భాగంగా 2019- 20 రంజీ ట్రోఫీ చాంపియన్స్ సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా జట్లు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. కెప్టెన్గా విహారి ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. సౌరాష్ట్రతో పోటీపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మరో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్కు కూడా జట్టులో చోటు దక్కింది. ఉమ్రాన్ మాలిక్ సైతం ఇక ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్జోన్ జట్టులో భాగమైన ప్రియాంక్ పాంచల్, ద్విశతకంతో చెలరేగిన యశస్వి జైశ్వాల్, యశ్ దుల్ తదితరులు రెస్టాఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. ఫాస్ట్బౌలర్ ఉమ్రాన్ మాలిక్ను సైతం ఈ టీమ్కు ఎంపిక చేశారు. కాగా రంజీ ట్రోఫీ విజేతకు.. వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు మధ్య జరిగే టెస్టు మ్యాచ్లో గెలిచిన జట్టు ఇరానీ కప్ ట్రోఫీ అందుకుంటుంది. అయితే, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించలేదు. రెస్టాఫ్ ఇండియా జట్టు: హనుమ విహారి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధుల్, సర్పరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, కేఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్ సాయికిషోర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్ నాగ్వస్వల్లా. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ ICC T20 Rankings: మరోసారి అదరగొట్టిన సూర్య! అగ్రస్థానానికి అడుగు దూరంలో.. -
మళ్లీ విదర్భదే ఇరానీ కప్
గతేడాది ఇటు రంజీ ట్రోఫీ, అటు ఇరానీ కప్ గెలుచుకున్న విదర్భ జట్టు... అదే ప్రదర్శనను మరోసారి నమోదు చేసింది. తద్వారా డబుల్ ధమాకా సాధించింది. ఇరానీ కప్లో చివరి రోజు శనివారం లక్ష్య ఛేదనలో విదర్భ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ రాణించారు. దీంతో... ఊరించే లక్ష్యంతో ఆ జట్టును పడేయాలనుకున్న రెస్టాఫ్ ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. నాగ్పూర్: ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి వీరోచిత సెంచరీలు విదర్భ జోరు ముందు వెలవెలబోయాయి. ఊరించే లక్ష్యానికి అవలీలగా చేరువైన విదర్భ మళ్లీ ఇరానీ విజేతగా నిలిచింది. వరుసగా రంజీ చాంపియన్షిప్ సాధించినట్లే... ఇరానీ కప్నూ చేజిక్కించుకుంది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఐదు రోజుల మ్యాచ్ ‘డ్రా’ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు గెలుపు వాకిట ఉన్న విదర్భతో ఇక చేసేదేమీ లేక రెస్టాఫ్ ఆటగాళ్లు చేతులు కలిపారు. కేవలం 11 పరుగుల దూరంలోనే ఉన్న విదర్భ చేతిలో ఐదు వికెట్లున్నాయి. ఇక విజయం ఖాయం కావడంతో ముందుగానే ఆటను ముగించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇరానీ కప్ విదర్భ వశమైంది. వసీమ్ జాఫర్ గాయంతో తప్పుకోవడంతో... చివరి నిమిషంలో విదర్భ తుది జట్టులోకి వచ్చిన అథర్వ తైడే (215 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్), గణేశ్ సతీశ్ (195 బంతుల్లో 87; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాచ్ ముగిసే సమయానికి విదర్భ రెండో ఇన్నింగ్స్లో 103.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రాహుల్ చహర్కు 2 వికెట్లు దక్కాయి. వీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 37/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ ఏ దశలోనూ తడబడలేదు. 18 ఏళ్ల అథర్వ తొలి సెషన్ను నడిపించాడు. సంజయ్ రామస్వామి (42; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్కు 116 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత గణేశ్ సతీశ్తో మూడో వికెట్కు 30 పరుగులు జోడించాక జట్టు స్కోరు 146 పరుగుల వద్ద అథర్వ మూడో వికెట్గా నిష్క్రమించాడు. అనంతరం సతీశ్కు మోహిత్ కాలే (37; 5 ఫోర్లు) జతయ్యాడు. వీళ్లిద్దరు నాలుగో వికెట్కు 83 పరుగులు జోడించడంతో రెస్టాఫ్ బౌలర్లకు ఇబ్బందులు తప్పలేదు. 229 పరుగుల వద్ద కాలే నిష్క్రమించగా, 269 పరుగుల వద్ద సతీశ్ను విహారి ఔట్ చేశాడు. అదేస్కోరు వద్ద మ్యాచ్ ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. అక్షయ్ వాడ్కర్ (10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. -
విదర్భ మళ్లీ మెరిసింది..
నాగ్పూర్: గతేడాది ఇరానీకప్లో విజేతగా నిలిచిన విదర్భ..ఈ ఏడాది కూడా మెరిసింది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో విదర్భ వరుసగా రెండో ఏడాది టైటిల్ను కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో చాంపియన్గా నిలవడంతో మరోమారు రెస్టాఫ్ ఇండియాతో ఇరానీకప్లో విదర్భకు తలపడే అవకాశం దక్కింది. ఈ పోరులో ఆద్యంతం ఆకట్టుకున్న విదర్భ టైటిల్ను దక్కించుకుంది. రెస్టాఫ్ ఇండియా నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విదర్భ ఆట నిలిచే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రా అయ్యింది. కాగా, తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం ఆధారంగా విదర్భను విజేతగా ప్రకటించారు. విదర్భ తన తొలి ఇన్నింగ్స్లో 425 పరుగులు చేయగా, రెస్టాఫ్ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్లో 330 పరుగులు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ను 374/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆపై ఇన్నింగ్స్ను కొనసాగించిన విదర్భ ఆదిలోనే కెప్టెన్ ఫైజ్ ఫజాల్ వికెట్ను కోల్పోయింది. ఫజాల్ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించడంతో విదర్భ స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే వికెట్ను నష్టపోయింది. ఆ తరుణంలో సంజయ్ రఘనాథ్(42), అథర్వా తైడే(72)లు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆపై గణేశ్ సతీష్(87) హాఫ్ సెంచరీతో ఆకట్టకోగా, మోహిత్ కాలే(37) ఫర్వాలేదనిపించాడు. విదర్భ ఐదో వికెట్గా గణేశ్ సతీష్ వికెట్ను కోల్పోయిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు సంధి చేసుకున్నారు. దాంతో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో నిలిచిన విదర్భను విజేతగా ప్రకటించారు. 2018 ఇరానీకప్లో కూడా తొలి ఇన్నింగ్స్ ఆధారంగానే విదర్భ టైటిల్ను గెలవడం విశేషం. -
విహారి మరో సెంచరీ
ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి మళ్లీ విదర్భ బౌలర్లతో ఆటాడుకున్నాడు. రెస్టాఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్మన్ మరో సెంచరీ సాధించాడు. మూడు సెషన్లు నింపాదిగా ఆడిన విహారి రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరుకు బాట వేశాడు. కెప్టెన్ రహానే, శ్రేయస్ అయ్యర్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నిర్మించాడు. నాగ్పూర్: వరుసగా రెండో ఇన్నింగ్స్లోనూ రెస్టాఫ్ ఇండియా టాపార్డర్ బ్యాట్స్మన్ హనుమ విహారి (300 బంతుల్లో 180 నాటౌట్; 19 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. రోజంతా ఆడి విదర్భ బౌలర్ల పాలిట సింహస్వప్నంగా మారాడు. దీంతో రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ను 107 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 374 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ముందు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రంజీ చాంపియన్ విదర్భ ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. సంజయ్ (17 బ్యాటింగ్), అథర్వ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఇరానీ కప్లో తలపడుతున్న ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. నాలుగో రోజు శుక్రవారం 102/2 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా తొలి సెషన్లో వికెట్ కోల్పోకుండా మరో 110 పరుగుల్ని జతచేసింది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ విహారి, కెప్టెన్ రహానే (87; 6 ఫోర్లు, 1 సిక్స్) విదర్భ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. ప్రత్యర్థి కెప్టెన్ ఫజల్ ఈ జోడీని విడగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. రెండో సెషన్లో విహారి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇద్దరు కలిసి మరో 63 పరుగులు జతచేశాక ఎట్టకేలకు జట్టు స్కోరు 275 పరుగుల వద్ద ఆదిత్య సర్వతే బౌలింగ్లో రహానే స్టంపౌటయ్యాడు. గత రెండేళ్ల కాలంలో 38 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన రహానే కు ఇదే టాప్ స్కోర్. 2017 ఆగస్టు కొలంబోలో లంకతో జరిగిన టెస్టులో అతను (132) సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడే సెంచరీకి సమీపించే స్కోరు చేశాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ (61 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రీజులోకి వచ్చాక స్కోరులో వేగం పుంజుకుంది. విహారి, అయ్యర్ అబేధ్యమైన నాలుగో వికెట్కు 99 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన శ్రేయస్ 4 భారీ సిక్సర్లతో అలరించాడు. ఇరానీలో సెంచరీల విహారి ఇరానీ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్మన్గా హనుమ విహారి ఘనత వహించాడు. ఇంతకుముందు శిఖర్ ధావన్ 2011–12 సీజన్లో ఈ ఘనత సాధించాడు. అయితే వరుసగా మూడు సెంచరీలు చేసింది మాత్రం మన తెలుగు తేజమే! గత సీజన్ మ్యాచ్లోనూ ఇదే విదర్భపై విహారి శతక్కొట్టాడు. వరుసగా 183, 114, 180 (నాటౌట్) స్కోర్లతో మొత్తానికి విదర్భ పాలిట కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. శుక్రవారం మూడు సెషన్ల పాటు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నాడు. సంక్షిప్త స్కోర్లు రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 330; విదర్భ తొలి ఇన్నింగ్స్: 425; రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్: 374/3 డిక్లేర్డ్ (విహారి నాటౌట్ 180; రహానే 87; శ్రేయస్ నాటౌట్ 61; ఆదిత్య సర్వతే 2/141); విదర్భ రెండో ఇన్నింగ్స్: 37/1. -
హనుమ విహారి బ్యాటింగ్ రికార్డు
నాగ్పూర్: ఆంధ్ర యువ బ్యాట్స్మన్ హనుమ విహారి సరికొత్త బ్యాటింగ్ రికార్డు నెలకొల్పాడు. ఇరానీకప్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇరానీకప్లో భాగంగా రెస్టాఫ్ ఇండియా తరుఫున ఆడుతున్న విహారి.. రంజీ చాంపియన్ విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన విహారి.. రెండో ఇన్నింగ్స్ళో కూడా శతకం నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో భాగంగా విహారి సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో 114 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో అజేయంగా 180 పరుగులు సాధించాడు. ఫలితంగా ఇరానీకప్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. గతేడాది ఇదే విదర్భతో జరిగిన మ్యాచ్లో విహారి 183 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, 2011 తర్వాత ఒక ఇరానీకప్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు సాధించిన తొలి బ్యాట్స్మన్ కూడా విహారినే కావడం మరో విశేషం. ఆనాటి ఇరానీకప్లో రెస్టాఫ్ ఇండియాతో తరఫున ఆడిన శిఖర్ ధావన్.. రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా ఇరానీకప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా తన రెండో ఇన్నింగ్స్ను 374/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. దాంతో విదర్భకు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ 330 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 374/3 డిక్లేర్డ్ విదర్భ తొలి ఇన్నింగ్స్ 425 ఆలౌట్ -
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
-
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
నాగ్పూర్: క్రికెట్లో రోజురోజుకి అంపైర్ల చర్యలు, తప్పిద నిర్ణయాల పట్ల విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. అంపైర్ల తప్పిద నిర్ణయాలతో అనేక జట్లు గెలిచే మ్యాచ్లు ఓడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్ల్లో తప్పిద నిర్ణయాలతో అంపైర్లు అభాసుపాలవుతుండగా.. తాజాగా దేశవాళీ మ్యాచ్లో అంపైర్ సీకే నందన్ తీరు పట్ల సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇరానీ కప్లో భాగంగా రెస్టాఫ్ ఇండియా-విదర్భ మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్లో భాగంగా కెప్టెన్ ఫయాజ్ ఫజల్ అంపైర్ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని ఫజల్ ఫయాన్స్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆఫ్ స్టంప్కి వెలుపలగా పడిన బంతి బ్యాట్కి అందకుండా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. ఔట్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. తొలుత ఆ ఆప్పీల్ను ఫీల్డ్ అంపైర్ నందన్ తిరస్కరించాడు. దీంతో ఆటగాళ్లు తమతమ స్థానాలకు వెళుతుండగా నందన్ మరో ఫీల్డ్ అంపైర్ వైపు చూసి.. ఔటంటూ వేలెత్తాడు. దీంతో.. తొలుత నాటౌట్ అని నిరాశకి గురైన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు సంబరాలు మొదలెట్టగా.. నాటౌట్ అని సంతోషించిన ఫజల్ అసహనంతో కాసేపు క్రీజులోనే ఉండిపోయి అనంతరం భారంగా క్రీజు వదిలాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంపైర్ తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ అంపైర్ నిద్రపోయావా ఏంటి’ అంటూ కొందరు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ‘అంపైర్లకు కూడా ఎప్పటికప్పుడు క్లాస్లు, పరీక్షలు పెట్టాలి’అంటూ మరికొందరు సూచిస్తున్నారు. -
అక్షయ్ కర్నేవర్ అద్భుత శతకం
నాగపూర్: లోయరార్డర్ బ్యాట్స్మన్ అక్షయ్ కర్నేవర్ (133 బంతుల్లో 102; 13 ఫోర్లు, 2 సిక్స్లు) కెరీర్లో తొలి ఫస్ట్క్లాస్ శతకం బాదడంతో రంజీ చాంపియన్ విదర్భ... ఇరానీ కప్పై పట్టు బిగించింది. రెస్టాఫ్ ఇండియాతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో గురువారం ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 425 పరుగులకు ఆలౌటైంది. దీంతో కీలకమైన 95 పరుగుల ఆధిక్యం కూడగట్టుకుంది. ఓవర్నైట్ స్కోరు 245/6తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భను వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ (139 బంతుల్లో 73; 14 ఫోర్లు), కర్నేవర్ ముందుకు నడిపించారు. క్రితం రోజు స్కోరుకు 23 పరుగులు జోడించి వాడ్కర్ వెనుదిరిగాడు. అయితే, అక్షయ్ వాఖరే (20), రజనీశ్ గుర్బానీ (28 నాటౌట్) అండతో కర్నేవర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి మూడు వికెట్లకు విదర్భ 115 పరుగులు జోడించడంతో స్కోరు 400 దాటింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ జట్టు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (27), అన్మోల్ప్రీత్ సింగ్ (6) త్వరగానే వెనుదిరిగారు. ఆదిత్య సర్వతే (1/51), అక్షయ్ వాఖరే (1/13) చెరో వికెట్ తీయగా... వన్ డౌన్ బ్యాట్స్మన్ హనుమ విహారి (85 బంతుల్లో 40 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అజింక్య రహానే (65 బంతుల్లో 25 బ్యాటింగ్, 1 ఫోర్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా చూశారు. ప్రస్తుతం రెస్టాఫ్ ఇండియా 7 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. నాలుగో రోజు శుక్రవారం విహారి, రహానేతో పాటు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఏ మేరకు నిలుస్తారనే దానిపై ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
విదర్భదే ఇరానీ కప్
నాగ్పూర్: తొలిసారి రంజీ ట్రోఫీ సాధించిన విదర్భ జట్టు ఇరానీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాతో ఇక్కడ జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన విదర్భ ఆ తర్వాత ప్రత్యర్థిని 390 పరుగులకే ఆలౌట్ చేసి 410 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. మ్యాచ్ చివరి రోజు మరోసారి బ్యాటింగ్కు దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్లో వికెట్లేమీ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఐదు రోజుల ఫైనల్లో ఫలితం తేలకపోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న విదర్భకు టైటిల్ ఖాయమైంది. తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు చేసిన వెటరన్ బ్యాట్స్మన్ వసీం జాఫర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు 236/6 పరుగులతో ఆదివారం ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా ఓవర్నైట్ బ్యాట్స్మెన్ హనుమ విహారి (327 బంతుల్లో 183; 23 ఫోర్లు, 3 సిక్స్లు), జయంత్ యాదవ్ (96; 14 ఫోర్లు) పోరాడటంతో ఒక దశలో 314/6తో నిలిచింది. కానీ జయంత్ అవుటయ్యాక విహారికి సహకారం అందించే వారు కరువయ్యారు. దీంతో భారీ షాట్లు ఆడిన అతను చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రత్యర్థి బౌలర్లలో గుర్బా నీ 4, ఆదిత్య సర్వతే 3, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. హనుమ విహారి భారీ శతకం రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్లో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి ఆటే హైలైట్. 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకొచ్చిన అతను తుదికంటా పోరాడాడు. సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా స్పిన్నర్ జయంత్ యాదవ్తో కలిసి ఏడో వికెట్కు 216 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 81 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న విహారి చివరి రోజు మరో 102 పరుగులు చేసి భారీ శతకం బాదాడు. జయంత్ అవుటయ్యాక లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ నదీమ్తో కలిసి ఎనిమిదో వికెట్కు 59 పరుగులు జతచేశాడు. ఆ తర్వాత భారీ షాట్లకు దిగిన అతను సర్వతే బౌలింగ్లో అపూర్వ్ వాంఖడేకు చిక్కడంతో రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్కు తెరపడింది. సంక్షిప్త స్కోర్లు: విదర్భ తొలి ఇన్నింగ్స్: 800/7; రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 390 ఆలౌట్ (విహారి 183, జయంత్ యాదవ్ 96, రజనీశ్ గుర్బానీ 4/70); విదర్భ రెండో ఇన్నింగ్స్ 79/0 (అక్షయ్ వాడ్కర్ 50). ►27 ప్రతి ఏడాది రంజీ ట్రోఫీ విజేత, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య జరిగే ఇరానీ కప్ను రంజీ చాంపియన్ గెల్చుకోవడం ఇది 27వ సారి. -
జాఫర్ 285 బ్యాటింగ్
నాగ్పూర్ : ఇరానీ కప్ మ్యాచ్లో రెండో రోజు కూడా వెటరన్ బ్యాట్స్మన్ వసీం జాఫర్ జోరు కొనసాగింది. జాఫర్ (425 బంతుల్లో 285 బ్యాటింగ్: 34 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత డబుల్ సెంచరీతో రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్లో గురువారం ఆట ముగిసేసరికి విదర్భ 3 వికెట్ల నష్టానికి 588 పరుగులు చేసింది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ గణేశ్ సతీశ్ (280 బంతుల్లో 120; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్కు స్వర్గధామంలాంటి పిచ్పై తొలి రోజు 2 వికెట్లు తీసిన రెస్టాఫ్ ఇండియా రెండో రోజు కూడా 90 ఓవర్ల పాటు శ్రమించినా ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగింది. ప్రస్తుతం జాఫర్తో పాటు అపూర్వ్ వాంఖడే (44 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. ఓవర్నైట్ స్కోరు 289/2తో విదర్భ రెండో రోజు ఆట ప్రారంభించింది. ఆరంభంలో రెస్టాఫ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో తొలి తొమ్మిది ఓవర్లలో ఎనిమిది పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో జాఫర్, సతీశ్ అలవోకగా పరుగులు సాధించారు. అశ్విన్ కొన్ని సార్లు వీరిద్దరిపై ఒత్తిడి పెంచగలిగినా వికెట్ మాత్రం దక్కలేదు. లంచ్ సమయానికి విదర్భ స్కోరు 407/2 కాగా...టీ విరామానికి అది 504కు చేరింది. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాఫర్ ఎనిమిదో డబుల్ సెంచరీని పూర్తి చేసుకోగా... సతీశ్ 12వ శతకం సాధించాడు. ఎట్టకేలకు మూడో సెషన్లో ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చిన బంతిని ఆడబోయి సతీశ్ వికెట్ కీపర్ భరత్కు క్యాచ్ ఇవ్వడంతో 289 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం 250 పరుగుల మైలురాయిని కూడా దాటిన జాఫర్ ఇరానీ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మురళీ విజయ్ (266) రికార్డును కూడా అధిగమించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 40 ఏళ్ల వయసులో ఒకే ఇన్నింగ్స్లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ, ఆసియా క్రికెటర్ జాఫర్. -
తొలి ఆసియా క్రికెటర్గా..
నాగ్పూర్: వయసు మీద పడుతున్నా క్రికెట్లో విశేషంగా రాణిస్తూ రికార్డులు మోత మోగిస్తున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ వసీం జాఫర్. ఇరానీ కప్లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో విదర్భ ఆటగాడు జాఫర్ డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా క్రికెట్ చరిత్రలో 40 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా జాఫర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో లేటు వయసులో 250కి పైగా పరుగులు సాధించిన తొలి ఆసియా క్రికెటర్గా జాఫర్ గుర్తింపు సాధించాడు. బుధవారం తొలి రోజు ఆటలో 53 సెంచరీ సాధించిన జాఫర్.. దాన్ని ఈరోజు డబుల్ సెంచరీగా మలుచుకున్నాడు. -
వసీం జాఫర్ సెంచరీ
నాగ్పూర్: వసీం జాఫర్ (113 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో చెలరేగడంతో రెస్టాఫ్ ఇండియాతో బుధవారం మొదలైన ఇరానీ కప్ మ్యాచ్లో రంజీ చాంపియన్ విదర్భ తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విదర్భ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కెప్టెన్ ఫైజ్ ఫజల్ (89; 6 ఫోర్లు, 1 సిక్స్), సంజయ్ రామస్వామి (53; 6 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 101 పరుగులు జతచేశారు. సంజయ్ అవుటయ్యాక క్రీజులోకొచ్చిన జాఫర్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల జాఫర్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 53వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ (25–1–66–1) ఆఫ్ స్పిన్ను పక్కన పెట్టి లెగ్బ్రేక్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. -
జడేజా అవుట్.. అశ్విన్ ఇన్
న్యూఢిల్లీ : ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్ను దృష్టిలో పెట్టుకుని టీమ్ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ సీనియర్ స్పిన్నర్ అశ్విన్కు చోటు కల్పించింది. గాయంతో బాధపడుతున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్ భర్తీ చేయనున్నాడు. గాయం కారణంగా దేవధర్ ట్రోఫీకి దూరమైన అశ్విన్ ప్రస్తుతం కోలుకోవడంతో రెస్టాఫ్ ఇండియా స్క్వాడ్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీమ్కు కరుణ్ నాయర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియా జట్టు మార్చ్ 14 నుంచి 18 వరకు నాగపూర్లో జరగనున్న మ్యాచ్లో రంజీ ట్రోఫీ చాంపియన్స్తో తలపడనుంది. రెస్టాఫ్ ఇండియా జట్టు: కరుణ్ నాయర్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, ఆర్. సమర్థ్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అన్మోల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్పుత్, నవ్దీప్ సైనీ, అతీత్ -
కీపర్గా సాహాకే మా ఓటు!
చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టీకరణ ముంబై: టెస్టు జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్గా తమ తొలి ప్రాధాన్యత వృద్ధిమాన్ సాహాకే అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. ఇరానీ కప్లో అద్భుత ప్రదర్శనతో అతను తన ఫిట్నెస్ కూడా నిరూపించుకున్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. సాహా గాయం కారణంగానే జట్టుకు దూరమయ్యాడనే విషయాన్ని ప్రసాద్ గుర్తు చేశారు. ‘కోల్కతా టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన సాహా అంతకుముందు వెస్టిండీస్లోనూ సెంచరీ సాధించాడు. అతను ఫామ్ కోల్పోయి కాకుండా గాయం వల్లే జట్టుకు దూరమయ్యాడు. టెస్టుల్లో కీపింగ్ బాగా చేసే ఆటగాడికే మా ప్రాధాన్యత. పార్థివ్ వికెట్ కీపింగ్ కూడా ఎంతో మెరుగైనా, ఇప్పటికీ సాహానే మా అత్యుత్తమ వికెట్ కీపర్’ అని తమ నిర్ణయాన్ని ప్రసాద్ పరోక్షంగా వెల్లడించారు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో బాగా ఆడినా 2019 ప్రపంచకప్లో ధోని, యువరాజ్ ఆడటం గురించి ఇప్పుడే ఆలోచించడం చాలా తొందరపాటు అవుతుందని ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్
సాహా డబుల్ సెంచరీ పుజారా అజేయ శతకం ముంబై: రెస్టాఫ్ ఇండియా జట్టు ఇరానీ కప్ను నిలబెట్టుకుంది. మంగళవారం ఇక్కడ ముగిసిన ఐదు రోజుల మ్యాచ్లో రెస్ట్ జట్టు ఆరు వికెట్ల తేడాతో రంజీ ట్రోఫీ చాంపియన్ గుజరాత్పై ఘన విజయం సాధించింది. వృద్ధిమాన్ సాహా (272 బంతుల్లో 203 నాటౌట్; 26 ఫోర్లు, 6 సిక్సర్లు) డబుల్ సెంచరీ, చతేశ్వర్ పుజారా (238 బంతుల్లో 116; 16 ఫోర్లు) సెంచరీ సహాయంతో రెస్టాఫ్ ఇండియా 4 వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓవర్నైట్ స్కోరు 266/4తో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు మరో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. చివరి రోజు రెస్ట్ జట్టు 19.1 ఓవర్లలో 113 పరుగులు సాధించగా, సాహా, పుజారా ఐదో వికెట్కు అభేద్యంగా 316 పరుగులు జోడించారు. ఇరానీ కప్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. ఈ ట్రోఫీని రంజీ విజేత 27 సార్లు గెలవగా, ఇప్పుడు రెస్టాఫ్ ఇండియా కూడా 27 టైటిల్స్తో దానిని సమం చేసింది. చివరి రోజు ఛేదనలో సాహా, పుజారాలకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. అనుభవం లేని గుజరాత్ బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో వీరిద్దరు అలవోకగా పరుగులు సాధించారు. ఈ క్రమంలో ముందుగా పుజారా 215 బంతుల్లో తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 37వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాహా, 270 బంతుల్లో కెరీర్లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. ఇరానీ కప్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్లో ఒక బ్యాట్స్మన్ డబుల్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు ఈ మ్యాచ్లో అంపైరింగ్ పొరపాట్లపై గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్ మరోసారి బహిరంగంగా తన అసంతృప్తిని ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్లో తన బ్యాట్కు బంతి తగలకుండానే అవుట్ ఇచ్చాడంటూ ‘మీరు అసలు అంపైరింగ్ ఎందుకు చేస్తారు’ అని నేరుగా అంపైర్ మొహంపైనే ప్రశ్నించడం వివాదం రేపింది. -
చెలరేగిన సాహా
-
చెలరేగిన సాహా
ముంబై:గుజరాత్ తో జరిగిన ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా ఆటగాడు వృద్ధిమాన్ సాహా చెలరేగిపోయాడు. సుదీర్ఘంగా క్రీజ్లో నిలబడి డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. గాయం కారణంగా ఇంగ్లండ్ తో జరిగిన మూడు టెస్టులకు దూరమైన సాహా..ఇరానీ కప్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. 272 బంతుల్లో 26 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 203 పరుగులు చేసి రెస్టాఫ్ ఇండియాకు చిరస్మణీయమైన విజయాన్ని అందించాడు. మరో ఆటగాడు చటేశ్వర పూజారా(116 నాటౌట్) తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. వీరిద్దరూ అజేయంగా 316 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రెస్టాఫ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్ విసిరిన 379 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రెస్టాఫ్ ఇండియాను సాహా-పూజారాలు ఆదుకున్నారు. తొలి మూడు రోజులు గుజరాత్ పూర్తి ఆధిపత్యం కొనసాగించినా, నాల్గో రోజు నుంచి మ్యాచ్ రెస్టాఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్లింది. 266/4 ఓవర్ నైట్ స్కోరు మంగళవారం ఐదో రోజు ఆటను కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా మరో వికెట్ పడకుండా గెలుపును సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ ఆటగాళ్లు పూజారా సెంచరీ నమోదు చేయగా, సాహా డబుల్ సెంచరీతో కదం తొక్కాడు.ప్రధానంగా పార్థివ్ పటేల్కు పోటీగా తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి సెలక్టర్ల దృష్టి తనపై పడేలా చేశాడు. -
సాహా అజేయ సెంచరీ
విజయానికి 113 పరుగుల దూరంలో రెస్టాఫ్ ఇండియా ముంబై: గాయంతో ఇంగ్లండ్తో జరిగిన చివరి మూడు టెస్టులకు దూరమైన వృద్ధిమాన్ సాహా తన పునరాగమన మ్యాచ్లో కీలక శతకం సాధించాడు. పార్థివ్ పటేల్కు పోటీగా తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి సెలక్టర్ల దృష్టి తనపై పడేలా చేశాడు. సాహా (123 బ్యాటింగ్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీ కారణంగా... గుజరాత్తో ఇక్కడ జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా విజయం దిశగా సాగుతోంది. 379 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్ట్ జట్టు నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 266 పరుగులు చేసింది. సాహాతో పాటు చతేశ్వర్ పుజారా (83 బ్యాటింగ్; 10 ఫోర్లు) క్రీజ్లో ఉన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్కు ఇప్పటికే అభేద్యంగా 203 పరుగులు జోడించారు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న రెస్టాఫ్ ఇండియా చివరి రోజు విజయం కోసం మరో 113 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 227/8తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన గుజరాత్ తమ రెండో ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. -
పటిష్టస్థితిలో గుజరాత్
ముంబై: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్లో రంజీ చాంపియన్ గుజరాత్ పటిష్టస్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ (73; 9 ఫోర్లు), చిరాగ్ గాంధీ ( 55 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. రెస్ట్ బౌలర్లలో స్పిన్నర్ నదీమ్ (4/53), హైదరాబాద్ స్పీడ్స్టర్ సిరాజ్ (2/39) రాణించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని (132) కలుపుకొని ప్రస్తుతం గుజరాత్ 359 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 206/9 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో 226 పరుగుల వద్ద ఆలౌటైంది. -
గుజరాత్దే పైచేయి
ముంబై: ఇరానీ కప్లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో గుజరాత్ ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో గుజరాత్ 358 పరుగులు చేయగా, రెస్టాఫ్ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 226 పరుగులకు ఆలౌటైంది. దాంతో గుజరాత్ కు 359 పరుగుల ఆధిక్యం సాధించింది. 206/9 ఓవర్ నైట్ స్కోరుతో ఈరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా మరో 21 పరుగుల్ని జత చేసి ఆలౌటైంది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ ఆదిలోనే గోహెల్(1) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో ప్రియాంక్ పాంచల్(73) ఆదుకోగా,రావల్(23), పార్థీవ్ పటేల్(32)లు ఫర్వాలేదనిపించారు. ఆపై చిరాక్ గాంధీ(55 బ్యాటింగ్)హాఫ్ సెంచరీ సాధించి క్రీజ్లో ఉన్నాడు. -
కష్టాల్లో రెస్టాఫ్ ఇండియా
ముంబై: రంజీ చాంపియన్ గుజరాత్ బౌలర్లు సమష్టిగా రాణించారు. ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా బ్యాట్స్మెన్ ను వణికించారు. దీంతో రెండో రోజు ఆటలో రెస్టాఫ్ ఇండియా 72 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ అఖిల్ హేర్వాడ్కర్ (48) రాణించగా, మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ (8 బ్యాటింగ్), పంకజ్ సింగ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో చింతన్ గజ, హార్దిక్ పటేల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, మోహిత్ తడాని 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 300/8 ఓవర్నైట్ స్కోరుతో శనివారం రెండో రోజు ఆట కొనసాగించిన గుజరాత్ తొలి ఇన్నింగ్స్లో 102.5 ఓవర్లలో 358 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు సెంచరీ సాధించిన చిరాగ్ గాంధీ (202 బంతుల్లో 169; 22 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ స్కోరు వద్ద నిష్క్రమించాడు. -
ఆదుకున్న చిరాగ్ గాంధీ
► గుజరాత్ తొలి ఇన్నింగ్స్ 300/8 ► రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్ మ్యాచ్ ముంబై: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్లో చిరాగ్ గాంధీ (159 బంతుల్లో 136 బ్యాటింగ్; 18 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో గుజరాత్ జట్టును ఆదుకున్నాడు. వరుస వికెట్ల పతనాన్ని తన అద్భుత బ్యాటింగ్తో అడ్డుకున్న తన ఆటతీరుతో రంజీ చాంపియన్ గుజరాత్ మెరుగైన స్థితిలో నిలిచింది. దీంతో తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ తమ తొలి ఇన్నింగ్స్లో 88 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 300 పరుగులు చేసింది. గాంధీకి జతగా ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పటేల్ (9 బ్యాటింగ్) ఉన్నాడు. మన్ ప్రీత్ జునేజా (90 బంతుల్లో 47; 7 ఫోర్లు), ధృవ్ రావల్ (94 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ను రెస్టాఫ్ ఇండియా బౌలర్లు వణికించారు. తొలి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ గోహెల్ డకౌట్గా వెనుదిరిగాడు. పేసర్లు సిద్ధార్థ్ కౌల్ (4/73), పంకజ్ సింగ్ (3/77) ధాటికి 82 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టు ఇబ్బందుల్లో పడింది. ఫామ్లో ఉన్న ప్రియాంక్ (61 బంతుల్లో 30; 6 ఫోర్లు), కెప్టెన్ పార్థివ్ (11) త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఈ దశలో జట్టు ఇన్నింగ్్సను నిర్మించే బాధ్యతను 26 ఏళ్ల గాంధీ తీసుకున్నాడు. జునేజాతో కలిసి రెస్టాఫ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరు దాదాపు రెండో సెషన్ అంతా ఆధిపత్యం ప్రదర్శించి ఐదో వికెట్కు 110 పరుగులు జత చేశారు. -
‘రెస్ట్’ సంచలనం
► ఇరానీ కప్లో 480 పరుగుల లక్ష్య ఛేదన ► 4 వికెట్లతో ముంబై పై విజయం ► రాణించిన ఫజల్, నాయర్ ముంబై: బ్యాటింగ్లో సమష్టిగా చెలరేగిన రెస్టాఫ్ ఇండియా జట్టు... సంచలన విజయంతో ఇరానీకప్ గెలుచుకుంది. గురువారం ముగిసిన మ్యాచ్లో రెస్ట్ జట్టు 4 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. 480 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐదో రోజు బరిలోకి దిగిన రెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 129.4 ఓవర్లలో 6 వికెట్లకు 482 పరుగులు చేసి నెగ్గింది. దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇది మూడో అత్యధిక లక్ష్య ఛేదన. గతంలో 2010 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్ 536; 2004 దులీప్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో సౌత్జోన్ 501 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాయి. అయితే ఇరానీ చరిత్రలో మాత్రం ఇదే అత్యధికం కావడం గమనార్హం. 100/1 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఫయాజ్ ఫజల్ (127) సెంచరీతో స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడాడు. సుదీప్ చటర్జీ (54)తో కలిసి రెండో వికెట్కు 110; కరుణ్ నాయర్ (92)తో కలిసి మూడో వికెట్కు 130 పరుగులు జత చేశాడు. ఈ దశలో ముంబై స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా స్వల్ప వ్యవధిలో ఫజల్, సుదీప్, నాయర్లను అవుట్ చేశాడు. దీనికి తోడు నమన్ ఓజా (29) అనూహ్యంగా రనౌటయ్యాడు. ఆఖరి సెషన్లో 35 ఓవర్లలో 159 పరుగులు చేయాల్సిన దశలో స్టువర్ట్ బిన్నీ (54), షెల్డన్ జాక్సన్ (59 నాటౌట్)లు చెలరేగిపోయారు. ఆరో వికెట్కు 56 నిమిషాల్లో 101 బంతుల్లో 92 పరుగులు జోడించారు. బిన్నీ అవుటైనా... జయంత్ (19 నాటౌట్)తో కలిసి జాక్సన్ విజయాన్ని పూర్తి చేశాడు. -
కర్ణాటకదే ఇరానీ కప్
బెంగళూరు: దేశవాళీ టోర్నీల్లో కర్ణాటక జట్టు హవా కొనసాగుతోంది. రంజీ ట్రోఫీలాగే ఇరానీ కప్నూ నిలబెట్టుకుంది. రెస్టాఫ్ ఇండియాతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఇరానీ కప్ ఫైనల్లో కర్ణాటక 246 పరుగులతో ఘన విజయం సాధించింది. 403 పరుగుల విజయలక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన రెస్ట్ జట్టు 43.3 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. జాదవ్ (56) మినహా అందరూ విఫలమయ్యారు. స్పిన్నర్ గోపాల్ నాలుగు, మిథున్ మూడు వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు కర్ణాటక తమ రెండో ఇన్నింగ్స్లో 422 పరుగులకు ఆలౌటయింది. మనీష్ పాండే (123 నాటౌట్) సెంచరీ చేశాడు. ముంబై తర్వాత ఇరానీకప్ను రెండు సార్లు గెలిచిన జట్టు కర్ణాటక కావడం విశేషం. -
రెస్టాఫ్ ఇండియా 264 ఆలౌట్
కర్ణాటకతో ఇరానీ కప్ మ్యాచ్ బెంగళూరు: ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియాకు 20 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కర్ణాటకతో జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు బుధవారం రెస్ట్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 264 పరుగులకు ఆలౌటైంది. కేదార్ జాదవ్ (106 బంతుల్లో 78; 13 ఫోర్లు) అర్ధ సెంచరీ మినహా మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. కర్ణాటక బౌలర్లలో మిథున్, గోపాల్, వినయ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం కర్ణాటక ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 39 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టు ప్రస్తుతం 19 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
నేటి నుంచి ఇరానీ కప్
కర్ణాటకతో రెస్టాఫ్ ఇండియా పోరు బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్కు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం నుంచి జరిగే ఈ ఐదు రోజుల మ్యాచ్లో రంజీ చాంపియన్ కర్ణాటకతో రెస్టాఫ్ ఇండియా తలపడుతుంది. వినయ్ సారథ్యంలో కర్ణాటక ఈ సీజన్ రంజీల్లో అద్భుతంగా ఆడింది. రాబిన్ ఉతప్ప, మనీష్ పాండే, మిథున్లతో ఈ జట్టు పటిష్టంగా ఉంది. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. ఇక మనోజ్ తివారీ సారథ్యంలో బరిలోకి దిగుతున్న రెస్ట్ జట్టులో ఉన్ముక్త్ చంద్, ప్రజ్ఞాన్ ఓజా, బాబా అపరాజిత్, కేదార్ జాదవ్ తదితరులు ఉన్నారు. -
ఇరానీ కప్ విజేత కర్ణాటక
బెంగళూరు: రంజీ ట్రోఫీ విజేత కర్ణాటక.. ఇరానీ కప్నూ కైవసం చేసుకుంది. లెగ్స్పిన్నర్ ఎస్.గోపాల్ (5/35) కెరీర్లో తొలిసారి హ్యాట్రిక్ సాధించడంతో రెస్టాఫ్ ఇండియాపై కర్ణాటక ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓవర్నైట్స్కోరు 114/3తో నాలుగో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రెస్ట్ జట్టు... గోపాల్కు తోడు వినయ్కుమార్ (4/70) 57.5 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. అపరాజిత్ (66) ఒంటరిపోరాటం చేసినా ఇతర బ్యాట్స్మెన్ ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. 58వ ఓవర్లో గోపాల్ వరుసగా అపరాజిత్ (66), అశోక్ దిండా (0), పంకజ్సింగ్ (0)లను ఔట్చేసి మరో రోజు ఆట మిగిలివుండగానే రెస్ట్ ఇన్నింగ్స్కు ముగింపు పలికాడు. కర్ణాటక కెప్టెన్ వినయ్కుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సంక్షిప్త స్కోర్లు: రెస్టాఫ్ ఇండియా: 201 - 183 కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 606 -
విజయం దిశగా కర్ణాటక
బెంగళూరు: ఇరానీ కప్లో కర్ణాటక జట్టు విజయం దిశగా పయనిస్తోంది. సీఎం గౌతమ్ (168 బంతుల్లో 122; 17 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగడంతో మంగళవారం మూడో రోజు కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 145 ఓవర్లలో 606 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో 405 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన రెస్టాఫ్ ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 38 ఓవర్లలో 3 వికెట్లకు 114 పరుగులు చేసింది. అపరాజిత్ (42 బ్యాటింగ్), కార్తీక్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. గంభీర్ (9) మరోసారి నిరాశపర్చగా, జాదవ్ (44) ఫర్వాలేదనిపించాడు. వినయ్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం రెస్ట్ ఇంకా 291 పరుగులు వెనుకబడి ఉంది. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు 390/5 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కర్ణాటక ఇన్నింగ్స్లో బిన్ని (122 బంతుల్లో 122; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) తొందరగా అవుటైనా... గౌతమ్ నిలకడగా ఆడాడు. వినయ్ (31)తో కలిసి ఏడో వికెట్ 88, గోపాల్ (16)తో కలిసి ఎనిమిదో వికెట్కు 57 పరుగులు జోడించాడు. చివర్లో మిథున్ (34 నాటౌట్) వేగంగా ఆడటంతో భారీ స్కోరు వచ్చింది. రెస్ట్ బౌలర్ పంకజ్ సింగ్ 6 వికెట్లు పడగొట్టాడు. -
కర్ణాటకకు భారీ ఆధిక్యం
రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్ బెంగళూరు: రంజీ చాంపియన్ కర్ణాటక ఇరానీ కప్లోనూ చెలరేగింది. రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఈ ఐదు రోజుల మ్యాచ్లో రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికే 189 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. స్టువర్ట్ బిన్నీ (107 బంతుల్లో 115 బ్యాటింగ్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 98 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో రెస్టాఫ్ ఇండియా 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓవర్నైట్ స్కోరు 35/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన కర్ణాటక 75 పరుగుల వద్ద రాహుల్ (35) వికెట్ కోల్పోయింది. గణేశ్ సతీష్ (180 బంతుల్లో 84; 11 ఫోర్లు), మనీష్ పాండే (47 బంతుల్లో 36; 7 ఫోర్లు) నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ఈ ఇద్దరూ అవుటయ్యాక కరుణ్ నాయర్ (161 బంతుల్లో 92; 12 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ కలిసి ఐదో వికెట్కు 187 పరుగులు జోడించి కర్ణాటకు మంచి ఆధిక్యాన్ని అందించారు. ముఖ్యంగా బిన్నీ అద్భుతంగా ఆడి కేవలం 82 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. నాయర్ 8 పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఆట ముగిసే సమయానికి బిన్నీతో పాటు గౌతమ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో పంకజ్ సింగ్ రెండు వికెట్లు తీసుకోగా... అశోక్ దిండా, అనురీత్, హర్భజన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరో మూడు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో... కర్ణాటక ఈ మ్యాచ్ మీద పట్టుబిగించినట్లే.