messages
-
అర్ధరాత్రిళ్లు మేసేజ్లు.. అశ్లీలతే అవుతుంది!
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మెసేజ్లు పంపడం.. అశ్లీలత కిందకే వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ మాజీ కార్పొరేటర్కు అశ్లీల సందేశాలు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.‘‘మీరంటే ఇష్టం, మీరు చూడడానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, మీకు వివాహం అయ్యిందా? లేదా?, మీరు సన్నగా ఉన్నారు!!..’’ అంటూ.. తెలియని మహిళలకు అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదు. ఈ చర్య అశ్లీలత(Obscene) కిందకే వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు, వాళ్ల భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేరు. ప్రత్యేకించి.. ఒకరికొరు పరిచయం లేని సమయంలో అస్సలు భరించలేరు’’ అని అడిషనల్ సెషన్స్ జడ్జి డీజీ ధోబ్లే వ్యాఖ్యానించారు.అయితే రాజకీయ వైరంతోనే ఆమె తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆ వ్యక్తి వాదించగా.. కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఏ మహిళ తెలిసి తెలిసి తప్పుడు కేసుతో తన పరువును పణంగా పెట్టాలనుకోదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని, కాబట్టి నిందితుడు ట్రయల్ కోర్టు విధించిన శిక్షకు అర్హుడు అని సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది.ముంబై బోరివాలీ ఏరియాకు చెందిన మాజీ కార్పొరేటర్కు.. 2016 జనవరిలో నార్సింగ్ గుడే అనే వ్యక్తి వాట్సాప్ సందేశాలు పంపాడు. ‘‘మీరు చూడడానికి బాగుంటారు.. మీరంటే ఇష్టం. మీకు పెళ్లైందా?’’ అంటూ అర్ధరాత్రిళ్లు మెసేజ్లు పంపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేసుకుని నార్సింగ్ను అరెస్ట్ చేశారు ఆరేళ్ల తర్వాత.. మేజిస్ట్రేట్ కోర్టు నార్సింగ్ను దోషిగా నిర్ధారించి.. మూడు నెలల శిక్షను విధించింది. అయితే ఈ శిక్షను అతను సవాల్ చేయగా.. తాజాగా ట్రయల్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టు సమర్థించింది. -
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో..
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.స్కామర్లు మోసపూరిత సందేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్లను పంపిస్తున్నారు. ఈ మెసేజ్ను పీబీఐ షేర్ చేస్తూ.. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదని పేర్కొంది.గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఇన్స్టాలేషన్ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్కు కాల్ చేయాలి.స్కామర్లు పంపించిన మెసేజ్లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/2J05G5jJZ8— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2024ఇదీ చదవండి: సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..సైబర్ నేరాలను తగ్గించడంలో ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైబర్ నేరాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పనిచేస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆటోమాటిక్ వార్ణింగ్ సిస్టం రూపొందిస్తోంది. దీని సాయంతో అనుమానాస్పద లింకులు వచినప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. -
ఇన్స్టాగ్రామ్లో సాంకేతిక సమస్య! మీకూ ఎదురైందా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5:14 గంటల సమయంలో ప్రత్యేక్ష సందేశాలు(డైరెక్ట్ మెసేజ్లు) పంపించడంలో సమస్య ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు. ఈమేరకు ఇతర సమాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్లు పెట్టారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ పంపించేందుకు వినియోగదారులు కొంత సమయంపాటు ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:14 గంటల సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనిపై దాదాపు రెండువేల కంటే ఎక్కువే ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య ఎదురైన యూజర్లు ట్విటర్ వేదికగా ఇంకెవరికైనా ఇలాంటి ఇబ్బంది తలెత్తిందా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. కాగా, ఈ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియరాలేదు. ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!అమెరికాలో అక్టోబర్ 15న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో వేలాది సంఖ్యలో మెటా యూజర్లు ఇబ్బంది పడినట్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఫేస్బుక్కు సంబంధించి సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో సమస్యల గురించి 5,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. -
ఎయిర్టెల్ సంచలన ఫీచర్.. కస్టమర్లకు ఇక నో టెన్షన్!
స్పామ్, అవాంఛిత కాల్స్, మెసేజ్ల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఇవి మొబైల్ యూజర్లను విసిగించడమే కాకుండా వారిని మోసాలకు సైతం గురిచేస్తున్నాయి. ఈ ముప్పును అరికట్టడానికి భారతీ ఎయిర్టెల్ సంచలన ఫీచర్ను తీసుకొచ్చింది. “దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్హౌస్ టూల్గా ఎయిర్టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్లపై కస్టమర్లకు రియల్-టైమ్ అలర్ట్స్ను అందిస్తుంది. తద్వారా అటువంటి అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు చాలా వరకు కట్టడయ్యే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.“స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. మేము గత పన్నెండు నెలలుగా దీనిని సమగ్రంగా పరిష్కరించడం కోసం కృషి చేశాం. దేశ మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్-రహిత నెట్వర్క్ను ప్రారంభించడం ద్వారా ఈ రోజు ఒక మైలురాయిని సూచిస్తుంది“ అని ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఉచితంగా..ఈ ఫీచర్ను తమ కస్టమర్లకు ఎయిర్టెల్ ఉచితంగా అందించనుంది. వినియోగదారులందరికీ ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తారు. అంటే దీని కోసం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాల్సిన పని గానీ, దానిని యాక్సెస్ చేయడానికి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం గానీ లేదు.ఇదీ చదవండి: జియో సూపర్హిట్ ప్లాన్..ఈ సిస్టమ్ డ్యూయల్-లేయర్డ్ “AI షీల్డ్”ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఇది నెట్వర్క్ అలాగే ఐటీ సిస్టమ్ స్థాయిలు రెండింటిలోనూ ప్రతి కాల్ను, ఎస్ఎంఎస్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది సందేశాలను గుర్తిస్తుండగా ప్రతిరోజూ 150 కోట్ల మేసేజ్లను, 250 కోట్ల కాల్స్ను ప్రాసెస్ చేసి 30 లక్షల స్పామ్ ఎస్ఎంఎస్లు, 10 కోట్ల స్పామ్ కాల్స్ గుర్తించగలదని విట్టల్ వెల్లడించారు. -
వాట్సాప్ నుంచి వేరే యాప్లకు మెసేజ్లు, కాల్స్..
సోషల్ మీడియాలో మేసేజ్లు పంపడానికి, కాల్స్ చేయడానికి విస్తృతంగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. ఇలాంటివి ఇంకా పలు మెసేజింగ్ యాప్లు ఉన్నాయి. ఒక యాప్ నుంచి మరో యాప్కి మెసేజ్లు, కాల్స్ చేసే వెసులుబాటు ఉంటే ఎంత బాగుంటుంది.. దీనికి సంబంధించే వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా కీలక ప్రకటన చేసింది.యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ల చట్టం (DMA)కి అనుగుణంగా తమ ప్రసిద్ధ మెసేజింగ్ ప్లాట్ఫారమ్లైన వాట్సాప్, మెసెంజర్లను 2027 నాటికి థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలతో ఇంటర్ఆపరేబిలిటీకి సపోర్ట్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు మెటా ప్రకటించింది. దీని ప్రకారం యాజర్లు నేరుగా వాట్సాప్, మెసెంజర్ యాప్ల నుంచి ఇతర నాన్-మెటా మెసేజింగ్ యాప్లకు నేరుగా మెసేజ్లు, కాల్స్ చేయవచ్చు, అందుకోవచ్చు.మెటా ఈ కొత్త ఫీచర్ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో యూజర్ల గోప్యత, భద్రత ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంది. థర్డ్-పార్టీ చాట్లు ఇప్పటికే ఉన్న వాట్సాప్, మెసెంజర్ కమ్యూనికేషన్ల లాగే ఎన్క్రిప్షన్, వినియోగదారు గోప్యతను నిర్వహించేలా చూసే సాంకేతిక పరిష్కారంపై కంపెనీ పని చేస్తోంది. థర్డ్-పార్టీ చాట్ల గురించి వినియోగదారులకు తెలియజేసే కొత్త నోటిఫికేషన్లను మెటా ప్రవేశపెట్టింది. వాట్సాప్ లేదా మెసెంజర్కి వేరే యాప్ అనుసంధానమైన ప్రతిసారీ యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది.కాల్స్ మాత్రం కాస్త ఆలస్యంథర్డ్ పార్టీ యాప్లతో అనుసంధానమయ్యే విషయంలో వాట్సాప్, మెసెంజర్ యూజర్లకు సౌలభ్యం ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని యాప్ల మెసేజ్లు ఒకే ఇన్బాక్స్లో కనిపించే లేదా విడివిడి ఇన్బాక్స్లలో కనిపించే ఆప్షన్లను ప్రవేశపెట్టే యోచనలో మెటా ఉంది. థర్డ్ పార్టీ యాప్లతో రియాక్షన్స్, డైరెక్ట్ రిప్లైస్, టైపింగ్ ఇండికేటర్స్, రీడ్ రిసీపియంట్స్ వంటి మెరుగైన మెసేజింగ్ ఫీచర్లతో పాటు గ్రూప్ చాట్ సౌలభ్యాన్ని కూడా 2025 నాటికి అందుబాటులోకి తెచ్చే పనిలో మెటా ఉంది. అయితే థర్డ్ పార్టీ యాప్లతో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు. -
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్కాల్ను తిరస్కరించకూడదు. ఎఫ్డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
క్రికెటర్ల నుంచి మెసేజ్లు.. ఎవరీ అందాల తార? (ఫోటోలు)
-
‘వికసిత్ భారత్’ సందేశాలను ఆపండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసే వికసిత్ భారత్ సంకల్ప్ సందేశాలు ఓటర్ల ఫోన్లకు వాట్సాప్లో పంపడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. వెంటనే ‘వికసిత్ భారత్’ గంపగుత్త మెసేజ్లను వాట్సాప్ ద్వారా పంపడం ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి గురువారం ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొనడమే తమ ఉద్దేశమని ఈసీ పేర్కొంది. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి అమల్లోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ పథకాలు, విజయాలను ప్రచారం చేయడం నిషేధమని ఈసీ పేర్కొంది. -
ఆమెకు 25.. అతడికి 42.. బాయ్ఫ్రెండ్తో సబలెంక (ఫొటోలు)
-
వాట్సాప్ నుంచి వేరే యాప్లకూ మెసేజ్లు!
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులకు అనువుగా యాప్లో మార్పులు చేస్తున్న ‘వాట్సాప్’ త్వరలో మరో ఫీచర్ను జతచేయనుంది. ఇకపై వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్లకూ మెసేజ్లను పంపుకోవచ్చు. దీనికి అనువుగా కొత్త ఫీచర్ను వాట్సాప్లో త్వరలో తీసుకురానున్నారు. దీంతో ఇతర సామాజిక మాధ్యమాల వేదికలపైనా వాట్సాప్ నుంచి మెసేజ్లను షేర్ చేసుకోవచ్చు. ఇతర చాట్స్ కోసం ప్రత్యేకంగా, విడిగా ఒక చాట్ ఇన్ఫో స్క్రీన్ ఒకటి కనిపించేలా ఫీచర్ను వాట్సాప్ సిద్ధంచేస్తోంది. ఈ కొత్త ఫీచర్కు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ నిపుణులు తలమునకలైనట్లు తెలుస్తోంది. వాట్సాప్తో మెసేజ్ల షేరింగ్లపై సిగ్నల్, టెలిగ్రామ్ యాప్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని వాబేటాఇన్ఫో అనే సంస్థ స్పష్టంచేసింది. ఏఏ యాప్లతో అనుసంధానం అవ్వాలనేది ఆయా వాట్సాప్ యూజర్ల స్వీయనిర్ణయం, స్వీయ నియంత్రణ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లదని వివరించింది. బీటీ వెర్షన్ను టెస్ట్చేస్తున్న కొన్ని సెలక్ట్ చేసిన గ్రూప్లకు మాత్రమే ఈ వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్షాట్ అడ్డుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. మరి కొద్ది వారాల్లో ఈ ఫీచర్ను యూజర్లు అందరికీ అందుబాటులోకి తేనున్నారు. -
అప్పుడు వాట్సాప్.. ఇప్పుడు మెసేజ్లు! బ్లాక్ చేస్తున్న ప్రముఖ బ్యాంకు..
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ (HSBC Holdings Plc).. తమ ఉద్యోగులు ఆఫీస్ మొబైల్ ఫోన్ల నుంచి మెసేజ్లు పంపే వీలు లేకుండా కట్టడి చేస్తోంది. అనధికారిక కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించడంపై రెగ్యులేటరీ సంస్థలు ఇటీవల చర్యలు చేపట్టిన నేపథ్యంలో హెచ్ఎస్బీసీ తమ సిబ్బందిని ఆఫీస్ ఫోన్లలో సందేశాలు పంపకుండా బ్లాక్ చేస్తోంది. కంపెనీ ఉద్యోగులకు జారీ చేసిన ఫోన్లలో మెసేజ్ ఫంక్షన్ను డిసేబుల్ చేసే ప్రక్రియలో ఉందని విషయం తెలిసిన కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. అంటే బ్యాంకు సిబ్బంది తమ ఆఫీస్ ఫోన్ల నుంచి సందేశాలను పంపలేరు, స్వీకరించలేరు. కాగా హెచ్ఎస్బీసీ ఇప్పటికే సిబ్బంది వర్క్ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించకుండా బ్లాక్ చేసింది. అయితే కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. వారు తమ వర్క్ ఫోన్ల నుంచి మెసేజ్లు పంపించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల వ్యక్తిగత ఫోన్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఆమోదించిన కమ్యూనికేషన్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు హెచ్ఎస్బీసీ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. సమాచారాన్ని పంచుకోవడానికి ట్రేడర్లు, డీల్మేకర్లు ఫోన్లు, సిస్టమ్లను ఎలా ఉపయోగిస్తున్నారు.. వారి యజమానులు వీటిని ఎలా ట్రాక్ చేస్తున్నారన్న దానిపై నియంత్రణ సంస్థలు పరిశోధిస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. వాల్ స్ట్రీట్లోని కొన్ని అతిపెద్ద బ్యాంకులలో మార్కెట్ మానిప్యులేషన్కు సంబంధించిన అధిక ప్రొఫైల్ కేసుల తర్వాత ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడమే లక్ష్యంగా రెగ్యులేటరీలు ఈ చర్యలు చేపట్టాయి. వందల కోట్ల జరిమానా వాట్సాప్తో సహా అనధికారిక మెసేజింగ్ యాప్లలో ఉద్యోగుల కమ్యూనికేషన్లను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు గానూ హెచ్ఎస్బీసీ ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ రెగ్యులేటరీ సంస్థకు పెద్ద మొత్తంలో జరిమానా కట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్కు 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 250 కోట్లు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు మరో 15 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 124 కోట్లు) చెల్లించింది. -
ఆండ్రాయిడ్ ఫోన్లలో భూకంప హెచ్చరికలు!
న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు వారు ఉంటున్న ప్రాంతంలో సంభవించబోయే భూకంపానికి సంబంధించిన తక్షణ సమాచారాన్ని అలర్ట్ల రూపంలో గూగుల్ అందించనుంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో ‘ఎర్త్క్వేక్ అలర్ట్’ సందేశ సేవలను ప్రారంభించనుంది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ), జాతీయ భూకంప కేంద్రాల సమన్వయంతో కొత్తగా ‘ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్స్ సిస్టమ్’ను భారత్లో మొదలుపెట్టనుంది. ‘యూజర్లు ఉంటున్న ప్రాంతంలో ఒకచోట భూకంపం వస్తే దానికి పసిగట్టి వెంటనే ఆ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ అలర్ట్లు మెరుపువేగంతో వెళతాయి’ అని గూగుల్ బుధవారం ఒక బ్లాగ్లో పేర్కొంది. ఆండ్రాయిడ్ 5, ఆపై అప్డేటెడ్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్లు ఇన్స్టాల్ అయిన ఫోన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
ఉచిత ల్యాప్టాప్లు ఇస్తామని మోసాలు
సాక్షి, హైదరాబాద్: విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులతో ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నట్టు ఫోన్ సందేశాలను పంపుతున్నారు. వాటిలో వివరాలు నమోదు చేయాలంటూ కొన్ని యూఆర్ఎల్ లింక్లను జత చేస్తున్నారు. ఇవి నిజమైనవని ఎవరైనా నమ్మి ఆ లింక్లను తెరిస్తే అందులో ప్రాథమిక సమాచారం, ఆధార్, ఫోన్, బ్యాంకు ఖాతా నంబర్లు.. ఇలా పూర్తి సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఫోన్లోకి మాల్వేర్ను మనకు తెలియకుండానే ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇలా వారి వలకు ఎవరైనా చిక్కితే సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను కొల్లగొడుతున్నట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ అధికారులు హెచ్చరించారు. ఉచిత ల్యాప్టాప్ల పేరిట వచ్చే సందేశాలను నమ్మవద్దని వారు కోరుతున్నారు. స్టే సేఫ్ ఆన్లైన్ క్విజ్ ఆన్లైన్ మోసాలపై అవగాహన.. పోటీల గడువు ఈనెల 31 సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచేందుకు కేంద్ర హోంశాఖ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ‘స్టే సేఫ్ ఆన్లైన్..’ నేపథ్యంతో ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. పోటీలకు ఈనెల 31 వరకు గడువుందని అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ క్విజ్లో పాల్గొనదలచిన వారు https://www.mygov.in/staysafeonline లింక్ పై క్లిక్ చేస్తే అదనపు వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, https://t.me/ ssoindia లింక్ ద్వారా గ్రూప్లో చేరొచ్చు. ఈ ఆన్లైన్ క్విజ్లో పాల్గొనే వారికి ఒక్కొక్కరికి 10 ప్రశ్నలు ఇస్తారు.. 5 నిమిషాల వ్యవధిలో వీటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్విజ్లో టాప్ 10లో నిలిచే విజేతలకు ఒక్కొ క్కరికి రూ.10 వేల చొప్పున నగదు పురస్కా రం ఇవ్వనున్నారు. క్విజ్లో పాల్గొని 50 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. -
30 ఏళ్ల క్రితం ఇండియా ఇలానే ఉండేది..ఇప్పుడు కావలసింది అవే..
పేపర్ తెరిస్తే ఘోరమైన వార్తలు. రక్త సంబంధాల మధ్య కూడా కక్షలు, కార్పణ్యాలు. మానవ సంబంధాలపై విశ్వాసం పోయేలా సంఘటనలు.ఇటువంటి సమయంలో ఒక ట్విటర్ పోస్ట్ చాలామందికి హాయినిచ్చింది. ‘గాయత్రీ... ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తన పొరుగింటివారు వాట్సప్ మెసేజ్ పెట్టినసంగతిని మైసూర్కు చెందిన ఒక మహిళ షేర్ చేస్తూ తమ కాలనీలో అందరూ ఎంత స్నేహంగా ఉంటారో చెప్పింది. ‘ముప్పై ఏళ్ల క్రితం ఇండియా ఇలాగే ఉండేది’ అని అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఏం... ఇప్పుడు ఎందుకు అలా ఉండకూడదు? నిజమే. పక్కింటి పాప తలుపు తట్టి ‘బీరకాయ కూర చేసింది అమ్మ. ఇచ్చి రమ్మంది’ అని చెప్తే చాలా బాగుంటుంది. ‘గడి ముందుకేసి కూరగాయలకు వెళుతున్నా. కాస్త చూస్తుండక్కా’ అని ఎదురింటి వాళ్లతో అంటే ‘అదేం భాగ్యం. వెళ్లిరా’ అని సొంతింటి కన్నా ఈ ఇంటి పైనే దృష్టి పెట్టే వాళ్లు దొరికితే మరెంతో బాగుంటుంది. ఇలా ఉండటానికే మనుషులు ఇష్టపడేవాళ్లు. కాని ఇప్పుడు ఇలా ఉండటం ‘భాగ్యం’ అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. మైసూర్లో ఒక కాలనీ ‘గాయత్రి. ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తనకు వచ్చిన మెసేజ్ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘మా కాలనీలో అంతా ఇలాంటి స్నేహమే’ అని గాయత్రి జయరామన్ అనే మైసూర్ జర్నలిస్ట్ ట్వీట్ చేసింది. 20 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్న గాయత్రి ‘హూ మి, పూర్’ అనే పుస్తకం రాసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే గాయత్రి పక్కింటావిడ ఇడ్లీలకు పిలవడంతో సంతోషపడి తన కాలనీ స్నేహాలన్నీ ట్వీట్లుగా రాసింది. ‘యోగా సెంటర్కు రాపిడో బుక్ చేద్దామని ఇంటి బయట నిలబడతానా... ఎవరో ఒకరు దింపడానికి వస్తారు. నా కుక్కపిల్ల నేను బయటికెళ్తే గోల చేస్తుంది. నేను ఇంట్లోనే ఉన్నాననే భావన కలిగించడానికి తలుపు తెరిచి పెట్టి పనుల కోసం బయటకు వెళితే మా కాలనీలో అందరూ కాపలా కాసేవాళ్లే. ఒక రోజు ఒకావిడ బిసిబేలాబాత్ పంపుతారు. నిన్న ఒకామె సాంబార్ పంపింది. మా కాలనీలో ఒకరి గిన్నెలు మరొకరి వంట గదిలో ఉండటం మామూలే. ఇలాంటి స్నేహాలతో మేమంతా ఉండటం సంతోషంగా ఉంది’ అని రాసింది. దాంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. ‘మేము గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు అందరం ఇలాగే ఉండేవాళ్లం’ అని ఒకరు రాస్తే ‘మైసూర్లో అందరూ ఇలా ఉండొచ్చు. బెంగళూరులో ఈ వాతావరణం మిస్ అవుతున్నాను’ అని మరొకరు రాశారు.‘ముప్పై ఏళ్ల క్రితం అందరూ ఇలా ఉన్నవాళ్లే. ఇప్పుడెక్కడ’ అని మరొకరు బాధ పడ్డారు. ‘లాక్డౌన్ సమయంలో కొంతకాలం మాత్రం ఇలా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఎవరి గుహల్లోకి వాళ్లు వెళ్లిపోయారు’ అని మరొకరు రాశారు. ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉండటం, ‘ఏం బాబాయ్’ అంటే ‘ఏం అల్లుడూ’ అని పలకరించుకోవడం.. ‘ఆంటీ ఇంటి నుంచి టీ పౌడర్ తీసుకురాపో’ అని పంపించడం కూడా అసాధ్యమైన విషయాలుగా మారిపోతే ఏ ఊతంతో ఏ స్పందనలతో జీవించాలి మనం? శ్రుతి మించి ప్రైవసీ పల్లెల్లో అయినా పట్నాల్లో అయినా ప్రతి ఒక్కరూ శ్రుతి మించిన ప్రైవసీలోకి జారుకుంటున్నారు. మొదట ఉమ్మడి కుటుంబాలు వద్దనుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని వద్దనుకుంటున్నారు. కేవలం ఎప్పుడూ ఇళ్లకు కూడా రాని కొందరు స్నేహితులు, పరిచయస్తులు చాలనుకునే స్థితికి చేరుకున్నారు. ‘మన బతుకులో ఎవరి జోక్యం అక్కర్లేదు’ అనే భావనలో ఉన్న సౌకర్యం ఎలా ఉన్నా ‘ఎవరి సాయం, తోడు లేకుండా బతుకు ఎలా ఉంటుంది’ అనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. ప్రైవసీ పిచ్చి ఒంటరితనంలోకి, ఏకాంతంలోకి, మనకు ఎవరూ లేరని భావనలోకి నెట్టి అభద్రతకు, ఆందోళనకు గురి చేస్తుంది. ‘ఎదుటివారి లోపాలు వెతకడం, జడ్జ్ చేయడం, మనకు హితవు చెప్పిన వారిని కూడా పగవారిని చేసుకోవడం, అనుబంధాలు ఆర్థికపరమైన సాయాలు కోరతాయనే మిషతో అందరినీ దూరం పెట్టడం’ ఇవి నేడు ప్రతి మనిషిని కేవలం కుటుంబ జీవితానికి, కుటుంబ అనుబంధాలకి (అవి కూడా సరిగ్గా ఉంటే) పరిమితం చేస్తున్నాయి. పక్కింటామె ‘ఇడ్లీ తిందూరా’ అని పిలవడమే వార్తగా మారి, అది చదివి ఆనంద బాష్పాలు వచ్చే స్థితికి మనం చేరుకుంటే ఆ తప్పు ఇడ్లీదో చట్నీదో కాదు. మనదే. ప్రేమ, అభిమానాలే ఇంధనాలు ఒక దూరప్రయాణం పరిచయస్తులు ఎవరూ లేని రైలులో చేస్తుంటే ఎలా ఉంటుందో, జీవన ప్రయాణం ప్రేమ, అభిమానాలు పంచేవాళ్లు లేకుంటే అలా ఉంటుంది. నలుగురు స్నేహితులతో సాగే పిక్నిక్ యాత్రలా జీవితం ఎందుకు ఉండకూడదు? కనీసం అప్పుడప్పుడన్నా వీధి అరుగుపై ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పుకునే కమ్మదనంతో జీవితం ఎందుకు ఉండకూడదు? పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసి ఇరుగు పొరుగు పిల్లలతో స్నేహం చేయడం మానేస్తున్నారు. దీనివల్ల వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉండబోతోందో ఆలోచించారా? (చదవండి: అర్చన... అనుకున్నది సాధించింది) -
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తు.. ‘పింక్ వాట్సాప్’!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలను తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల వినియోగదారుల్లో అత్యధికం మంది ఉపయోగించే వాట్సాప్ ద్వారా మాల్వేర్లను చొప్పించే ప్రణాళికను ఇటీవల కాలంలో అమలు చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో కనిపించే వాట్సాప్... సరికొత్త ఫీచర్లతో గులాబీ రంగులో (పింక్) వచ్చిందంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాళ్లు లింక్లు పంపుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఎస్ఎంఎస్లతోపాటు వాట్సాప్ మెసేజ్ల రూపంలో ఈ లింక్లు పంపుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ లింక్లను క్లిక్ చేసి అది అడిగే అప్డేట్ కోసం ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే ఫోన్లోని ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, బ్యాంకుల పాస్వర్డ్ల వంటి వివరాలన్నీ సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆయా వ్యక్తులు సభ్యులుగా ఉండే వాట్సాప్ గ్రూప్లలోకి ఆటోమేటిక్గా పింక్ వాట్సాప్ పేరిట లింక్లు షేర్ అవుతాయని పేర్కొన్నారు. కీబోర్డ్ ఆధారిత మాల్వేర్లను పింక్ వాట్సాప్లోకి చొప్పించడం ద్వారా బ్యాంకు పాస్వర్డ్లను తస్కరించి సైబర్ నేరగాళ్లు డబ్బు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పింక్ వాట్సాప్ పేరిట వచ్చిన లింక్లను ఓపెన్ చేసి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని ఉంటే వాటిని వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలని సూచిస్తు న్నారు. అన్ఇన్స్టాల్ చేస్తేనే ఆ నకిలీ లింక్లను షేర్ కాకుండా ఆపగలుగుతామని చెబుతున్నారు. ఒకవేళ మనకు తెలిసిన వారి నుంచి ఇలా పింక్ వాట్సాప్ పేరిట ఏవైనా మెసేజ్లు వస్తే వారిని వెంటనే అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. -
ఇబ్బంది పెట్టే కాల్స్కు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు!
అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి యూజర్లకు ఉపశమనం కలిగేలా టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఫోన్ కాల్స్, మెసేజ్లు యూజర్లకు పంపాలంటే వారి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం 2 నెలల్లోపు ఓ యూనిఫైడ్ డిజిటల్ వేదికను అభివృద్ధి చేయాలని సూచించింది. ముందుగా అడ్వైర్టెజ్మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్ అందుకోవడానికి సబ్స్క్రైబర్లు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. సంస్థలు కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు వాణిజ్య ప్రకటనలు పంపడం ఆరంభిస్తాయంటూ ఓ ప్రకటనలో ట్రాయ్ వివరించింది. ప్రస్తుతం సంస్థలు ప్రమోషనల్ కాల్స్,మెసేజెస్ పంపుతున్నామని, అందుకు వినియోగదారుల అనుమతి కోరేలా ఎలాంటి వ్యవస్థ లేదు. అందుకే 2 నెలల్లో యూనిఫైడ్ డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. సమ్మతి కోరుతూ పంపే సందేశాలు ‘127’తో మొదలయ్యేలా కామన్ షార్ట్ కోడ్ను వినియోగించాలని ఆయా సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. చదవండి👉 సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్! -
ఈ కాల్స్తో జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ వాడకం పరిపాటిగా మారింది. ఇప్పుడు వాట్సప్ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్లు చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ప్రధానంగా +254, +84, +63, +374 , +1(218), +1(803) ...తో ప్రారంభయ్యే నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్, మెజేస్లు నమ్మవద్దంటున్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నంబర్ల నుంచి వచ్చే మిస్డ్కాల్స్కు సైతం స్పందించవద్దని వారు సూచిస్తున్నారు. స్పామ్ కాల్స్తో సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారని, తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా విదేశీ కోడ్తో ఉంటున్న ఈ నంబర్ల నుంచి వస్తున్న వాట్సాప్ సందేశాల్లో లింక్లను పంపుతున్న సైబర్ కేటుగాళ్లు వాటిపై క్లిక్ చేస్తే మన ఫోన్లోకి మాల్వేర్ను పంపించి, మన ఫోన్ను వారి కంట్రోల్కి తీసుకుంటున్నారు. దాని నుంచి మన బ్యాంకు లావాదేవీల వివరాలు, పాస్వర్డ్లు చోరీ చేసి డబ్బులు కొల్లగొడుతున్నట్టు వారు హెచ్చరించారు. ఇలాంటి కోడ్ నంబర్తో వచ్చే వాట్సాప్ కాల్స్ను లిఫ్ట్ చేయవద్దని, అలాంటి నంబర్లను బ్లాక్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సూచించింది. సింగపూర్,వియత్నాంలనుంచి ఆ ఫోన్లు ప్రధానంగా ఈ ఫోన్ కాల్స్ సింగపూర్,వియత్నాం, మలేషియా ప్రాంతాల నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తరహా నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ ఎక్కువగా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య, లేదంటే తెల్లవారుజామున వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా స్పామ్కాల్స్ బెడద నుంచి కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బయటపడొచ్చని సైబర్ఇంటెలిజెన్స్ నిపుణుడు ప్రసాద్ తెలిపారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు.. ♦ కొత్త కొత్త కోడ్ నంబర్లలో వచ్చే అంతర్జాతీయ ఫోన్కాల్స్, మెసేజ్లు, లింక్లకు స్పందించవద్దు. ♦ అనుమానాస్పదంగా ఉండే అంతర్జాతీయ ఫోన్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలి. ♦ ఫోన్కాల్, లేదా చాటింగ్లో మన వ్యక్తిగత, బ్యాంకు ఖాతా సమాచారాన్ని అడిగితే పంచుకోవద్దు. ♦ సైబర్ క్రైం పోలీసులకు లేదా సైబర్ క్రైం వెబ్సైట్లో సంబంధిత నంబర్లపై ఫిర్యాదు చేయాలి. ♦ మొబైల్ఫోన్, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, యాంటి వైరస్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటినిబ్లాక్ చేయాలి.. మనకు కొత్త కొత్త కోడ్ నంబర్లతో వచ్చే స్పామ్ కాల్స్ను ఎప్పటికప్పుడు బ్లాక్ చేయాలి. పదేపదే ఇలాంటి కాల్స్ వస్తుంటే ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైం సిబ్బంది దృష్టికి తేవాలి. అదేవిధంగా వాట్సాప్లో ఇతర దేశాల కోడ్ నంబర్లతో మొదలయ్యే నంబర్ల నుంచి వచ్చే వీడియో, ఆడియోకాల్స్కి ఆన్సర్ చేయవద్దు. ఆ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లో ఉండే లింక్లను ఓపెన్ చేయవద్దు. – శ్రీనివాస్ , ఇన్స్పెక్టర్ -
ఇబ్బందికర సందేశాలకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: ఇబ్బందికర సందేశాలను అరికట్టేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు ప్రారంభించింది. టెలిమార్కెటింగ్ సందేశాల టెంప్లేట్ల దుర్వినియోగంపై 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ శుక్రవారం ఆదేశించింది. కంపెనీల హెడర్లు, కంటెంట్ టెంప్లేట్లను కొంతమంది టెలిమార్కెటర్లు దుర్వినియోగం చేస్తున్నారని తాము గుర్తించామని తెలిపింది. ‘తాము కోరని వాణిజ్య ప్రకటనలు అందుకోవడం అనేది ప్రజల అసౌకర్యానికి ప్రధాన మూలం. వ్యక్తుల గోప్యతకు ఇవి ఆటంకం కలిగిస్తాయి. వీటిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని ట్రాయ్ తెలిపింది. టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018 కింద మెసేజ్ టెంప్లేట్ల దుర్వినియోగాన్ని ఆపడానికి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అధీకృత టెలిమార్కెటింగ్ కంపెనీలు సందేశాల కోసం మొబైల్ నంబర్లకు బదులుగా కంపెనీ పేరును సూచించే హెడర్లను ప్రదర్శిస్తాయి. టెలిమార్కెటింగ్ సందేశాల శీర్షికలు, కంటెంట్ టెంప్లేట్ల విధానంలో (కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్) మార్పులు చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ఇతర కంపెనీల పేర్లను పోలిన మెసేజ్ టైటిల్స్, హెడర్లు వినియోగదార్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ లాభాల కోసం వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రాయ్ స్పష్టం చేసింది. బ్లాక్చెయిన్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్ఫామ్స్లో నమోదైన అన్ని హెడర్లను 30 రోజుల్లోపు తిరిగి ధృవీకరించాలని.. ధృవీకరించని హెడర్లను బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశించింది. 30 రోజుల పాటు ఉపయోగించని అన్ని హెడర్లను తాత్కాలికంగా నిష్క్రియం (డీయాక్టివేట్) చేయడానికి 60 రోజుల్లోపు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. -
'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్లో..
క్విటో: బీచ్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి ముందు తమ ప్రియమైన వారికి వీరు పంపిన సందేశాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్లో ఉన్నామని, ఎదో జరగబోతుందని ముందే పసిగట్టి వారు మెసేజ్లు పంపిన కాసేపటికే కిరాతకంగా హత్యకు గురయ్యారు. దండగులు వీరి గొంతులు కోసి చిత్ర హింసలకు గురి చేసి హతమార్చారు. ఈక్వెడార్లోని క్వినెడే సమీపంలో ఎస్మరాల్డస్ బీచ్లో ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ముగ్గురు యువతుల పేర్లు.. డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22). ఏప్రిల్ 4న అదృశ్యమైన వీరు ఆ మర్నాడే దారుణంగా హత్యకు గురయ్యారు. మంచి స్నేహితులైన వీరు బీచ్కు వెళ్లి సరదాగా గపడపాలని ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 4న అనుకున్నట్టే బీచ్కు వెళ్లారు. స్విమ్ సూట్ లాంటి దుస్తులు ధరించి అక్కడే హాయిగా సేదతీరారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఈ ముగ్గురూ ఊహించని ప్రమాదంలో పడ్డారు. ఎవరో వారిని వెంబడించారు. దీంతో తమకు ఏదో జరగబోతుందని భావించి తమ ప్రియమైన వారికి సందేశాలు పంపారు. అయితే మెసేజ్లు రాత్రి 11:10 గంటల సమయంలో పంపడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళన చెందారు. వారు అనుకున్నట్టే.. జరగకూడని ఘటన జరిగింది. నయేలి, డెన్నిసి చనిపోయే ముందు నయేలి తన సోదరికి వాట్సాప్ సందేశం పంపింది. 'ఏదో జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మెసేజ్ చేస్తున్నా' అని నయేలి మెసేజ్ చేసింది. సోదరి వెంటనే ఆమెకు కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. నయేలికి పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్ఫ్రెండ్కు సందేశం పంపింది. 'ఏదో జరగబోతుందని నాకు అన్పిస్తుంది. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఒక్క విషయం గుర్తుంచుకో.. ఐ లవ్ యూ వెరీ మచ్' అని మెసేజ్ చేసింది. జాలర్లు చూసి.. ఆ తర్వాత కాసేపటికే ముగ్గురిని ఎవరో దారుణంగా హత్య చేశారు. బీచ్లో అర్ధనగ్నంగా ఉన్న వీరిని చిత్ర హింసలు పెట్టి పదునైన ఆయుధాలతో గొంతులు కోశారు. ఆ తర్వాత శవాలను పూడ్చిపెట్టారు. ఏప్రిల్ 5న చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. ఓ కుక్క వీరి మృతదేహాల వద్ద తవ్వడం చూసి అక్కడకు వెళ్లగా శవాలు కన్పించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ హత్యలు ఎవరు చూసి ఉంటారనే విషయంపై పోలీసులకు ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ముగ్గురిలో ఓ యువతి బీచ్కు వెళ్లినరోజు సమీపంలోని ఓ హోటల్లో గడిపింది. దీంతో అధికారులు క్లూ కోసం సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు మంచి భవిష్యత్ కోసం వేరే దేశం వెళ్లి స్థిరపడాలనుకున్నారని, కానీ ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: వేరొకరి ఇంటి డోర్బెల్ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి.. -
పాన్ అప్డేట్ అంటూ సందేశాలు.. క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా!
ఆధార్ అప్డేట్, పాన్ కార్డు అప్డేట్ వంటివి వినియోగదారులు ఆన్లైన్లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇటీవల కొంతమంది అప్డేట్ యువర్ పాన్ అనే సందేశంతో కొన్ని ఫేక్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటిపై క్లిక్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశిస్తోంది. గత కొన్ని రోజులుగా స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పేరుతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో కొన్ని ఫేక్ మెసేజిలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇవి నకిలీ సందేశాలైనప్పటికీ @TheOfficialSBI అనే పేరుతో రావడం గమనార్హం. ఇందులో మీ పాన్ కార్డు అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు అకౌంట్ నిలిచిపోతుందని ఉంటుంది. దీనికి భయపడి కొంతమంది దానిపైన క్లిక్ చేసి సైబర్ దాడులకు బలైపోతున్నారు. ఇలాంటి ఫేక్ సందేశాలపై ఎవరూ క్లిక్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరించింది. SBI ఎప్పుడూ మీ పర్సనల్ డీటైల్స్, అకౌంట్ వివరాలు సందేశాల ద్వారా అడగదు, కావున వినియోగదారుడు తప్పకుండా వీటిని గమనించి జాగ్రత్త వహించాలి. ఇదిలా ఉండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కూడా ఫేక్ మెసేజస్ వస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇందులో గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్ల ప్రీ అప్రూవల్ కోసం కేవైసీ డాక్యుమెంట్స్ కావాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి వచ్చినట్లుగా ఈ మెసేజ్ వైరల్ అవుతోంది. దీనిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పంపించలేదని, దానికి ఎవరూ స్పందించవద్దని అధికారులు చెబుతున్నారు. A #Fake message issued in the name of @TheOfficialSBI is asking recipients to update their PAN on a suspicious link to prevent their account from getting expired.#PIBFactCheck ✅ Beware of such frauds. ✅ SBI never sends emails/SMS asking for personal/banking details. pic.twitter.com/1u8tFywQcf — PIB Fact Check (@PIBFactCheck) March 24, 2023 -
అవాంఛిత కాల్స్పై టెల్కోలతో ట్రాయ్ భేటీ
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ’వ్యాపారపరమైన అవాంఛిత కమ్యూనికేషన్ (యూసీసీ) డిటెక్ట్’ విధానాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడానికి సంబంధించి మార్చి 27న టెల్కోలతో సమావేశం కానుంది. (ఇదీ చదవండి: హిండెన్బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?) డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ) ప్లాట్ఫాంపై అవాంఛిత సందేశాలను టెల్కోలు గుర్తించడం, వాటిని పంపే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, కృత్రిమ మేథ ఆధారిత యాంటీ–ఫిషింగ్ సిస్టమ్ను వినియోగించడం తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సాంకేతిక సొల్యూషన్స్, నియంత్రణ, ఆదేశాలు, నిశిత పర్యవేక్షణ వంటి బహుముఖ వ్యూహాలతో అవాంఛిత కాల్స్, మెసేజీల సమస్యను పరిష్కరించే దిశగా టెల్కోలతో సమావేశం ఉండనున్నట్లు ట్రాయ్ పేర్కొంది. (మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం) -
వాటమ్మా.. వాట్సాప్ ‘స్పామ్’మ్మా
ఆఫీస్లోనో.. ఇంట్లోనో పనిలో నిమగ్నమై ఉండగా వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది. ఎవరు మెసేజ్ పంపారో.. ఏంటోనని పని ఆపేసి మరీ చూస్తే.. ‘ఫలానా షోరూమ్లో పండుగ ఆఫర్ ఉంది. త్వరగా షాపింగ్ చేయండి. ఆఫర్ వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి’ అనే మెసేజ్ కనిపిస్తుంది. అలాంటివి చూడగానే చిర్రెత్తుకొస్తుంది. ఇలాంటి మెసేజ్లు దేశంలోని వాట్సాప్ వినియోగదారుల్లో 95 శాతం మందిని విసిగిస్తున్నాయి. రోజుకు కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ మెసేజ్లు వాట్సాప్ వస్తున్నాయి. ‘లోకల్ సర్కిల్’ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. తెలియని నంబర్ల నుంచి వస్తున్న ఇలాంటి మెసేజ్లపై దేశవ్యాప్తంగా 351 జిల్లాల్లో 51 వేల మంది వాట్సాప్ వినియోగదారులను వివిధ అంశాలపై ప్రశ్నించారు. వీటిల్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రకటనలు, ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవలు వంటివి ఉంటున్నట్లు తేలింది. ఇలా చేయండి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మన వాట్సాప్కు అభ్యంతరకర, అసభ్యమైన మెసేజ్లు పంపినా.. పదేపదే స్పామ్ మెసేజ్లతో ఇబ్బంది పెడుతున్నా సంబంధిత కాంటాక్ట్లను బ్లాక్ చేసే అవకాశం వాట్సాప్లో ఉంది. ఇలా చేస్తే వాట్సాప్ ఫిర్యాదుల బృందానికి రిపోర్ట్ ఫార్వర్డ్ చేయబడుతుంది. ఒకే కాంటాక్ట్పై ఎక్కువ రిపోర్ట్లు నమోదైతే ఆ కాంటాక్ట్ను తాత్కాలికంగా నిలిపివేస్తారు. -
వర్రీ ‘గుడ్ మార్నింగ్: 2 వేల కోట్లకు పైగా కొత్త ఏడాది శుభాకాంక్షలు
ఉదయం నిద్ర లేవగానే చాలా మంది మొదట చేతిలోకి తీసుకునేది సెల్ఫోనే. మొబైల్ ఓపెన్ చేయగానే టపటపా వచ్చిపడే మెస్సేజీలలో ‘గుడ్ మార్నింగ్’ సందేశాలే అధికం. ఒకప్పుడు బాగానే ఉన్నా ఇప్పుడవి చిరాకు పుట్టిస్తున్నాయి. ఎవరు పంపారో చూడకుండానే తొలగించే ప్రక్రియతో రోజు ప్రారంభించాల్సిన పరిస్థితి. గుడ్ మార్నింగ్ సందేశాలు స్మార్ట్ఫోన్కు పెద్ద సమస్యగా మారుతున్నాయి. భారత్లో ఈ మెస్సేజ్ల వల్ల మూడో వంతు ఫోన్లు పనిచేయడం లేదని, ప్రతి మూడు స్మార్ట్ ఫోన్లలో ఒకటి మెమరీ ఫుల్ అయిపోతోందని అమెరికాకు చెందిన కంప్యూటర్ డ్రైవ్ తయారీ, డేటా నిల్వ సంస్థ ‘వెస్ట్రన్ డిజిటల్ కార్పొరేషన్’ తెలిపింది. – సాక్షి, అమరావతి 10 రెట్లు పెరిగిన సెర్చింగ్ భారతీయుల గుడ్ మార్నింగ్ సందేశాలు రోజూ కోట్ల సంఖ్యలో ఇంటర్నెట్ను ముంచెత్తుతున్నాయి. అపరిమిత డేటా అందుబాటులో ఉండడంతో గత ఐదేళ్లలో గుడ్ మార్నింగ్ సందేశాల కోసం గూగుల్లో సెర్చ్ చేయటం 10 రెట్లు పెరిగింది. దేశంలో పింటరెస్ట్ యాప్ నుంచి సందేశాలతో కూడిన ఫొటోల డౌన్లోడ్ ఏడాదిలో 9 రెట్లు పెరిగింది. భారత్లో 2 వేల కోట్ల న్యూ ఇయర్ మెస్సేజ్లు సోషల్ మీడియా గ్రూప్లో వాట్సాప్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది వాట్సాప్ వాడుతుండగా మన దేశమే అతిపెద్ద మార్కెట్. భారత్లో 48.75 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉండగా 39 కోట్ల మంది నిత్యం గ్రూపుల్లో చురుగ్గా ఉంటున్నట్లు వెస్టర్న్ డిజిటల్ కార్పొరేషన్ సర్వే తేల్చింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ల సందేశాలు పంపితే భారత్ నుంచి 20 బిలియన్లకు పైగా (2 వేల కోట్లకు పైగా) సందేశాలు వెల్లువెత్తాయని, ఇది ప్రపంచ రికార్డుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇలా వచ్చిపడే సందేశాలతో చాలామంది ఫోన్లు స్తంభించిపోతున్నాయి. వాటిని చదివి ప్రతిస్పందించడం కష్టంగా మారింది. అమెరికాలో నిత్యం ప్రతి పది మందిలో ఒకరి ఫోన్ మెమరీ సందేశాలతో నిండిపోతుండగా మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు వెస్టర్న్ డిజిటల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ సమస్యకి పరిష్కారంపై అధ్యయనం చేసిన గూగుల్ ‘ఫైల్స్ గో’ అనే కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ సగటున ఒక్కో యూజర్కు ఒక గిగాబైట్ వరకూ డేటాను క్లియర్ చేసిందని గూగుల్ ప్రకటించింది. ఆఫ్లైన్లోనూ సేవలు వినియోగించుకునే అవకాశం ఉండడం ఈ యాప్ ప్రత్యేకత. -
యుద్ధం తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్తో మూడు యుద్ధాలు చేసి గుణపాఠం నేర్చుకున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తాము తమ పొరుగుదేశం భారత్తో శాంతిని కోరుకుంటున్నాం అన్నారు. కాశ్మీర్ వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దుబాయ్కి చెందిన అల్ అరేబియా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ.."భారత ప్రధాని మోదీకి నా సందేశం ఏంటంటే?.. మన మధ్య చిచ్చు రేపుతున్న బర్నింగ్ పాయింట్లను పరిష్కరించడానికి టేబుల్పై కూర్చోని చిత్తశుద్ధితో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవిద్దాం. పరస్పరం కలిహించుకోవడంతో సమయం, వనరులు వృధా చేస్తున్నాం" అని అన్నారు. తాము భారత్లో చేసిన మూడు యుద్ధాల కారణంగా పాక్ ప్రజలకు తీరని కష్టాలను మిగిల్చాయి. వారంతా తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. అదీగాక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న పాక్ తమకు సాయం చేయమంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రజలు ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా గోధుమపిండి కోసం ఘోరంగా ఆర్రుల చాజుతున్నారు. మరోవైపు అక్కడి ప్రజలు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఎదుర్కొంటోన్నారు. గతేడాది చివర్లోనే దేశ భద్రతా దళాలతో కాల్పులు విరమించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రధాని షెహబాజ్ పోరుగు దేశంతో ముక్కుసూటిగా నిజాయితీగా వ్యహిరిస్తాం అని పిలుపునిచ్చారు. ఇరుదేశాల్లోనూ నైపుణ్యవంతులైన వైద్యులు, ఇంజనీర్లు, కార్మికులు ఉన్నారని, ఆ వనరులను ఉపయోగించుకుని శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మందుగుండు సామాగ్రి కోసం వనరులను దుర్వినియోగం చేయాలనుకోవటం లేదని తెలిపారు. ఈ క్రమంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ..పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, కాశ్మీర్లో జరుగుతున్న వాటిని ఆపాలని అన్నారు. ఈ మేరకు తీవ్ర సంక్షోభంతో సతమతమవుతున్న పాక్ భారత్తో శాంతి చర్చలకు సిద్ధమంటూ నేరుగా సంకేతాలిస్తోంది. (చదవండి: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన) -
WhatsApp: వాట్సాప్లో కెప్ట్ మెసేజ్ ఫీచర్
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ‘కెప్ట్ మెసేజ్’ అనే కొత్త ఫీచర్ని పరీక్షిస్తోంది. దీనితో డిజపీయరింగ్ మెసేజ్లను సేవ్ చేయవచ్చు. చాట్లకు సంబంధించి మరింత కంట్రోల్కు యూజర్లకు ఉపకరించే ఫీచర్ ఇది. 2021లో స్నాప్చాట్... మొదలైన వాటి స్ఫూర్తితో వాట్సాప్ ‘డిజప్పియరింగ్ మెసేజ్’ ఫీచర్ను ప్రవేశ పెట్టింది. ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు నిర్ణీతమైన కాలవ్యవధి తరువాత మెసేజ్ దానికదే డిలీట్ అయిపోతుంది. మళ్లీ దాన్ని చూడడం కుదరదు. అయితే ‘కెప్ట్ మెసేజ్’ టూల్ డిజప్పియరింగ్ చాట్లో కూడా మెసేజ్లను ప్రిజర్వ్ చేస్తుంది. (క్లిక్ చేయండి: ఇన్స్టాలో డిలీట్ చేసిన కంటెంట్ను రీస్టోర్ చేసుకోవడానికి...) -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త అప్డేట్ తీసుకు రాబోతోంది. నిత్యం సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్పై పరీకక్షిస్తోంది. వ్యూ వన్స్ టెక్ట్స్ ఫీచర్ను పరిచయం చేయనుంది. ఇదీ చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! వాట్సాప్లో మెసేజ్ను ఒకసారి రిసీవర్ ఒకసారే మాత్రమే చూడగలరు. రిసీవర్ చదవిన వెంటనే ఆ మెసేజ్ ఆటో మేటిక్గా డిలీట్ అవుతుందన్న మాట. అటు మెసేజ్ పంపిన వారికి, అందుకున్న వారికి కూడా ఆ మెసేజ్ కనపించదు. తమ వాట్సాప్ చాట్ను ఎవరూ చూడకుండా సీక్రెట్గా ఉండాలనుకునే యూజర్లకు ఇది బాగా ఉపయోగ పడనుంది. (WhatsApp 3D Avatar: వాట్సాప్ అవతార్ వచ్చేసింది..మీరూ కస్టమైజ్ చేసుకోండి ఇలా!) వేబేటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో యూజర్లందరికీ ఎప్పుడు అందుబాటులోకి తెస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే. కాగాఇప్పటికే వాట్సాప్లో వన్స్ వ్యూ ఫీచర్.. వీడియోలు, ఫొటోలకు వినియోగంలో ఉంది. వీడియోలు లేదా ఫొటోలకు వన్స్ వ్యూ ఫీచర్ ఆప్షన్ ద్వారా ఒక్కసారి మాత్రమే కనిపించి ఆ తరువాత అదృశ్యమవుతాయి.దీన్ని ఫార్వార్డ్ చేయడం, స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా కుదరదు. ఇదే ఫీచర్ను టెక్ట్స్ ఫార్మాట్ కోసం వ్యూ వన్స్ ఫీచర్ను పరీక్షిస్తుండటం గమనార్హం. -
ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఈ సేవలు బంద్!
ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ YES Bank (యస్ బ్యాంక్) కీలక ప్రకటన చేసింది. ఇకపై సబ్స్క్రిప్షన్ ఆధారిత ఎస్ఎంఎస్ (SMS) బ్యాలెన్స్ అలర్ట్ సేవలను నిలిపివస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ నుంచి తప్పనిసరి అలర్ట్స్ (Mandatory Alerts)మాత్రం యథావిధిగా వస్తాయని తెలిపింది. కాగా బ్యాంక్ ఈ తప్పనిసరి అలర్ట్తో పాటు, సబ్స్క్రిప్షన్ ఆధారిత ఎస్ఎంఎస్ అలర్ట్ సదుపాయాన్ని గతంలో అందించేది. బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘డిసెంబరు 01, 2022 నుంచి SMS ద్వారా బ్యాలెన్స్ అలర్ట్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నాం. ఒకవేళ కస్టమర్లు ఎస్ఎంస్ అలర్ట్ ప్యాకేజీకి సబ్స్క్రైబ్ చేసుకుని, కస్టమర్లుకు కూడా ఈ సేవలను ఇకపై పని చేయవు. అయితే ఇదివరకు మాదిరిగానే తప్పనిసరి అలర్ట్స్ మాత్రం మాత్రం వస్తాయని’ స్పష్టం చేసింది. అయితే కస్టమర్లు తమ బ్యాలెన్స్ను ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుసుకోవచ్చని తెలుపుతూ.. అందుకోసం యస్ మొబైల్, యస్ ఆన్లైన్, యస్ రోబోట్ వంటి ఆన్లైన్ సౌకర్యాలను ఉపయోగించుకునే సదుపాయం ఉందని వెల్లడించింది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
టీడీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలికి వేధింపులు
సాక్షి, డోన్: నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత చండ్రపల్లె వెంకటరమణ ఆచారి.. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని లొంగదీసుకునేందుకు వాట్సాప్, ఫేస్బుక్లలో అసభ్యకర మెసేజ్లు పంపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు సోమవారం పోలీసులను కలిసి వెంకటరమణ ఆచారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డోన్ సీఐ మల్లికార్జున తెలిపిన వివరాలు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పీఏనంటూ వెంకటరమణఆచారి విశాఖకు చెందిన బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె విసుగు చెంది సోమవారం కొందరు మహిళా ప్రతిని«ధులను వెంట తీసుకుని వైజాగ్ నుంచి డోన్కు వచ్చి వెంకటరమణ ఆచారిని నిలదీసే ప్రయత్నం చేయగా.. ఆచారి, ఆయన కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. సొంత పార్టీలోనే మహిళా నేతకు రక్షణ కరువైంది.. రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న తన పట్ల ఆచారి ప్రవర్తించిన తీరుపై పలు మార్లు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నత పదవిలో ఉన్న తనకే సొంత పార్టీ నేతల నుంచి రక్షణ కరువైందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం) -
ఇబ్బంది పెట్టే కాల్స్, సందేశాలకు చెక్!
న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించేందుకు పలు టెక్నాలజీపై పనిచేస్తున్నట్టు టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ ప్రకటించింది. ఆర్థిక మోసాల నివారణకు ఇతర నియంత్రణ సంస్థలతో కలసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపింది. ‘‘అనుచిత వాణిజ్య సంప్రదింపులు లేదా ఇబ్బంది పెట్టే సంప్రదింపులు అన్నవి ప్రజలను ఎక్కువగా అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. నమోదు కాని టెలీ మార్కెటర్ల (యూటీఎం)కు వ్యతిరేకంగా అధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పలు అనుచిత సందేశాలు కూడా పెరిగాయి. వీటితో పాటు ఇబ్బంది పెట్టే కాల్స్ను కూడా ఒకే రీతిలో చూడడమే కాకుండా, పరిష్కారం కనుగొనాల్సి ఉంది’’అని ట్రాయ్ పేర్కొంది. అనుమతి లేని వాణిజ్య సంప్రదింపులకు చెక్ పెట్టేందుకు పలు భాగస్వామ్య సంస్థలో కలసి చర్యలు తీసుకోనున్నట్టు ట్రాయ్ తెలిపింది. -
అమలులోకి కొత్త రూల్.. ఆ సమయంలో ఎస్ఎంఎస్ సేవలు బంద్!
ఎస్ఎంస్ల మోసాలను నివారించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(DoT) షార్ట్ మెసేజ్ సర్వీస్ (SMS) సేవలకు సంబంధించి కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియాతో సహా టెలికాం ఆపరేటర్లను సిమ్ మార్పిడి లేదా అప్గ్రేడ్ ప్రక్రియలో ఎస్ఎంఎస్ (SMS) సౌకర్యాన్ని (ఇన్కమింగ్, అవుట్గోయింగ్ రెండూ) నిలిపివేయాలని ఆదేశించింది. కొత్త SIM కార్డ్లను యాక్టివేట్ చేసిన తర్వాత 24 గంటల పాటు ఎస్ఎంఎస్ (SMS) సేవలు నిలిపివేయాలని సూచించింది. కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాయి.. కొత్త నిబంధన ప్రకారం, సిమ్ కార్డ్ లేదా నంబర్ను మార్చమని రిక్వెస్ట్ వచ్చిన తర్వాత, టెలికాం ఆపరేటర్లు కస్టమర్లకు అభ్యర్థనకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా పంపాలి. సిమ్ కార్డ్ హోల్డర్ ఐవీఆర్ఎస్ ( IVRS ) కాల్ ద్వారా ఈ అభ్యర్థనను మరింత ధృవీకరించాలి. కస్టమర్ ఏదైనా సమయంలో సిమ్ కార్డ్ అప్గ్రేడ్ అభ్యర్థనను తిరస్కరిస్తే, వెంటనే దీన్ని నిలిపివేయాలి. సిమ్ స్విచ్ స్కామ్లు, ఇతర సంబంధిత సైబర్ నేరాలను తగ్గించేందుకు టెలికాం శాఖ ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి తెచ్చింది. వీటిని అమలు చేసేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు 15 రోజుల గడువు కూడా ఇచ్చింది. చదవండి: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా! -
Whatsapp: దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. అయోమయంలో యూజర్లు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవల్లో మంగళవారం అంతరాయం ఏర్పడింది. కొన్ని సాంకేతిక సమస్యలతో వాట్సాప్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం ప్రకారం.. అక్టోబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్లో యూజర్లు పంపిన మెసేజ్ల డెలివరీ స్టేటస్ చూపించడం లేదు. వాట్సాప్లో డబుల్ టిక్ , బ్లూటిక్ మార్కులు చూపించడం లేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో ఉన్నారు యూజర్లు. ఇప్పటికే వేల మంది వినియోగదారులు వెబ్సైట్లో ఈ సమస్యపై ఫిర్యాదు చేశారు. అందులో కొందరు యూజర్లు మెసేజ్లు పంపడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా, మరికొందరు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఉన్నాయని, బ్లూ టిక్ కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ట్విట్టర్లో వాట్సాప్ యూజర్లు.. ‘వాట్సాప్ డౌన్’ (#Whatsapp Down) అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. దీనిపై ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. People coming to twitter after #whatsappdown 😭😂 pic.twitter.com/kt1tZRDMbQ — Aritra ❤️ (@Aritra05073362) October 25, 2022 When WhatsApp is Down.#whatsappdown pic.twitter.com/xHgsHd9h8v — ɅMɅN DUВΞY (@imAmanDubey) October 25, 2022 When your WhatsApp is playing up but you come to Twitter and see that everyone else is having the same problem #WhatsAppDown pic.twitter.com/pMcJm0Zn56 — Jamie (@GingerPower_) October 25, 2022 People Coming to Twitter to see if WhatsApp is down#WhatsappDown pic.twitter.com/eGi25KiQhU — Bella Ciao (Chai) (@punjabiii_munda) October 25, 2022 చదవండి: షాపింగ్ బంద్, అల్లాడిన యూపీఐ లావాదేవీలు.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త!
భారతీయులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. పండగ సమయాల్లో షాపులు కళకళలాడుతాయన్న సంగతి తెలిసిందే. అందుకే కంపెనీలు బ్యాంకులు, వ్యాపారులు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రత్యేకంగా దివాళి సందర్భంగా కొందరు వారి స్నేహితులకు, బంధువులకు బహుమతులను కూడా ఇస్తుంటారు. అయితే ఈ గిఫ్టింగ్ సీజన్లో ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఉచితంగా దీపావళి బహుమతుల పేరుతో మీ బ్యాంక్ ఖాతాని ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ మెసేజ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరిస్తోంది. వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో దీపావళి బహామతుల పేరుతో అనధికారికంగా మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి. ఫెస్టివల్ ఆఫర్స్, గిఫ్ట్స్, బహుమతుల పేరుతో మెసేజ్ లింక్స్ను పంపిస్తున్నారని తెలపింది. ఆ లింక్స్ క్లిక్ చేస్తే యూజర్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. ఒక వేళ వాటిని క్లిక్ చేస్తే చైనాకు చెందిన వెబ్సైట్లకు లింక్ అయ్యే అవకాశం ఉందని, అవి .xyz, .top డొమైన్లతో ఈ వెబ్సైట్స్ ఉన్నట్లు CERT-In గుర్తించింది. ఈ రకంగా మోసం అయితే బహుమతులను పొందేందుకు అమాయకంగా ప్రజలు వాటికి ఆకర్షితులవుతారు. వినియోగదారు లింక్పై క్లిక్ చేసినప్పుడు, అతనికి బహుమతి గెలుచుకున్నట్లు అభినందనలు సందేశం వస్తుంది. ఆపై వారి వ్యక్తిగత వివరాలను నింపాల్సి ఉంటుంది. అలా నింపిన తర్వాత, బహుమతిని క్లెయిమ్ కోసం ఆ లింక్ ఉన్న మెసేజ్లను వారి స్నేహితులు, బంధువులతో పంచుకోవాలని అప్పుడే గిఫ్ట్ పొందగలరని చూపిస్తుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యాక యూజర్ల వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ దాడి గురయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ స్కామ్ను ఎలా నివారించాలి ఈ తరహా స్కామ్లను నివారించేందుకు, బహామతులు, రుణాల పేరుతో అనధికారికంగా వచ్చే లింక్ల పట్ల జాగ్రత్తగా వహించాలి. మెసేజ్ మన మొబైల్ లోకి రాగానే ఆ లింక్ మూలాన్ని తనిఖీ చేయడం మంచిది. డొమైన్ పేరు కూడా సరిచూసుకోవడం ఉత్తమం. ఏ మాత్రం మెసేజ్ పై సందేహం ఉన్నా మీరు దానిపై క్లిక్ చేయడం మానుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా పర్సనల్ డేటాను బహిర్గతం చేయకూడదు. -
హమ్మయ్యా..వాట్సాప్లో ఇక ఆ సమస్య లేనట్లే!
ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ యూజర్లకు శుభవార్త. యూజర్ల సౌలభ్యం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్లు, ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటికే ఉన్న 'డిలీట్ ఫర్ ఎవరివన్' ఆప్షన్ను ఆప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ బ్లాగ్ వీ బీటా ఇన్ఫో ప్రకారం..యూజర్లు సెండ్ చేసిన మెసేజ్లలో ఏదైనా మిస్టేక్ ఉంటే డిలీట్ చేసే సదుపాయం ఉంది.అయితే పొరపాటు ఉన్న ఆ మెసేజ్లను టైంకి డిలీట్ చేయకపోతే ఎన్ని అనార్ధాలు జరుగుతాయో మనకు తెలియంది కాదు. ఆ సమస్యకు పరిష్కార మార్గంగా వాట్సాప్ 2017లో డిలీట్ ఫర్ ఎవిరివన్ ఆప్షన్ను యూజర్లకు పరిచయం చేసింది. 📝 WhatsApp beta for Android 2.22.15.8: what's new? WhatsApp is updating the time limit to delete messages for everyone, for some beta testers!https://t.co/4EmyZfdkFI — WABetaInfo (@WABetaInfo) June 30, 2022 ఇక ఆ సమస్య తీరినట్లే పొరపాటున మీ వాట్సాప్లో మీ కుటుంబ సభ్యులకు,స్నేహితులకు పంపిన మెసేజ్లు, వీడియోలు, ఫోటోలు పంపితే.. వాటిని డిలీట్ చేసే టైం 1గంట,8 నిమిషాల,16 సెకన్లలోపు ఎప్పుడైనా డిలీట్ చేయోచ్చు. ఆ తర్వాత వాటిని డిలీట్ చేయాలన్నా సాధ్యపడేది కాదు. అందుకే ఆ టైం ఫ్రేమ్ను పొడిగిస్తూ డిలీట్ ఫర్ ఎవరివన్ ఆప్షన్ను అప్డేట్ చేసింది. ఈ అప్డేట్ ప్రకారం.. మిస్టేక్ ఉన్న మెసేజ్లను డిలీట్ చేసేందుకు 2రోజుల 12గంటల సమయం వరకు పొడిగించింది. ప్రస్తుతం ఈ ఆప్షన్ టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలో అందరికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వీ బీటా ఇన్ఫో తన బ్లాగ్లో పేర్కొంది. -
సిగరెట్ ప్యాక్ కాదు.. ప్రతి సిగరెట్ పైనా హెచ్చరిక!
సిగరెట్ బాక్సుల మీద ఆరోగ్యానికి హానికరం హెచ్చరికలు ఫొటోలతో సహా ఉండేవి. కానీ, ఆ సందేశాలు ప్రజల్లో అంతగా చైతన్యం తీసుకురాలేకపోయాయి. పోగరాయళ్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అందుకే సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక సందేశం చేరువయ్యేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొదటిది కావడం విశేషం. ఇంతవరకు పొగాకు లేదా సిగరెట్ ఉత్పత్తుల పై గ్రాఫిక్ ఫోటోతో కూడిన వార్నింగ్ సందేశాలు ఉండేవి. సిగరెట్ కంపెనీలు వాటిని అనుసరిస్తూ.. ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాయి. అయితే పోను పోను ప్రజల్లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కెనడా దేశం ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇంతవరకు ప్యాకెట్లపైనే హెచ్చరికలు ఇస్తున్నాం. అలా కాకుండా ప్రతి సిగరెట్ట్ పైన ఈ సందేశం ఉంటే...గుప్పు గుప్పు మని పీల్చే ప్రతి సిగరెట్ ఎంత విషమో అర్థమవుతుందని అంటోంది కెనడా ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఈ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు కెనడా మానసిక ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. అంతేకాదు ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకువచ్చిన తొలిదేశం కెనడానే అని చెప్పారు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం రావడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ సందేశాలు చేరువవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 నాటికల్లా ఈ ప్రతిపాదన అమలులోకి తెచ్చేందుకు కెనడా ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోందన్నారు. ఈ మేరకు కెనడియన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన సీనియర్ పాలసీ విశ్లేషకుడు రాబ్ కన్నింగ్హామ్ మాట్లాడుతూ...ప్రతి సిగరెట్లపై ముంద్రించే హెచ్చరిక ప్రతి వ్యక్తికి చేరువయ్యేలా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఇంతవరకు మరే ఏ ఇతర దేశం దేశం ఇలాంటి నిబంధనలను అమలు చేయలేదు. ఇది విస్మరించలేని హెచ్చరిక అని అన్నారు. ఈ సరికొత్త విధానాన్ని ఇంటర్నేషనల్ టుబాకో కంట్రోల్ పాలసీ ఎవాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ జియోఫ్రీ ఫాంగ్ ప్రశంసించారు. తాజా గణాంకాల ప్రకారం కెనడాలో 10 శాతం మంది ధూమపానం చేస్తున్నారని, 2035 కల్లా ఆ సంఖ్యను తగ్గించేందుకే కెనడా ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. (చదవండి: కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్–2) -
బాలుడి సూసైడ్ మెసేజ్.. సాంకేతికతతో ప్రాణాలు కాపాడిన పోలీసులు
సైదాబాద్: ఓ బాలుడు ఆత్మహత్య చేసుకుంటాన్నానని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయగా సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సాంకేతికత ఆధారంగా బాలుడిని కనుగొని ప్రాణాలు కాపాడారు. ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి వివరాల ప్రకారం.. ఐఎస్సదన్ డివిజన్ సింగరేణి కాలనీ రోడ్ నెంబర్–7లో నివసించే రమావత్ పృథ్వీరాజ్ (17) బుధవారం రాత్రి తన ఫోన్ నుంచి స్నేహితుడికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని మెసేజ్ పెట్టి స్విచ్ఛాఫ్ చేశాడు. అతని ద్వారా విషయం తెలుసుకున్న బాలుడి అన్న రమావత్ చరణ్రాజ్ పోలీసులకు సమాచారమివ్వగా డీసీపీ కార్యాలయంలో సీడీఆర్గా విధులు నిర్వహించే మురళి సహాయంతో పృథ్వీరాజ్ ఫోన్ నెంబర్ ఆధారంగా అతను డబీర్పురా రైల్వేస్టేషన్ వద్ద ఉన్నట్లు గుర్తించి హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే అక్కడి ఫ్లాట్ఫాంపై పృథ్వీరాజ్ నిద్రమాత్రలు వేసుకొని పడి ఉండటం వారు గుర్తించారు. హాస్పిటల్కు తరలించి చికిత్స అందించటంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తక్షణమే స్పందించి బాలుడి ప్రాణాలు కాపాడిన సైదాబాద్ పోలీసులను పలువురు అభినందించారు. (చదవండి: బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?) -
వాట్సాప్లో మెసేజ్లను తెగ ఫార్వర్డ్ చేస్తున్నారా..! అయితే
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ మరో సరికొత్త ఫీచర్తో ముందుకురానుంది.ఈ ఫీచర్తో ఫార్వర్డ్ మెసేజ్లకు కళ్లెం వేయనుంది వాట్సాప్. ఫార్వర్డ్ చేయలేరు..! ఫార్వర్డ్ మెసేజ్లపై వాట్సాప్ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం కొత్త ఫీచర్ను పరీక్షిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్తో ఆయా వాట్సాప్ యూజర్లు సదరు మెసేజ్లను ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్కు ఫార్వార్డింగ్ చేయడాన్ని పరిమితం చేయనుంది. దీంతో ఒక మెసేజ్ను సదరు యూజరు ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్కు ఒకే సమయంలో ఫార్వర్డ్ చేయలేరు. ఈ చర్యతో ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచార వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చునని వాట్సాప్ అభిప్రాయపడుతోంది. WABetainfo ప్రకారం...వాట్సాప్ ఒకేసారి ఒక గ్రూప్ చాట్కు మాత్రమే సందేశాలను ఫార్వార్డ్ చేసే అవకాశాన్ని పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్తో ఒక సందేశాన్ని ఫార్వార్డ్ చేసినట్లుగా గుర్తించనప్పుడు, దానిని ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్లకు ఫార్వార్డ్ చేయడం ఇకపై సాధ్యం కాకుండా చేయనుంది. ఒక వేళ సదరు సందేశాన్ని ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్లకు ఫార్వార్డ్ చేయాల్సి వస్తే, యూజర్లు ఆయా సందేశాన్ని సెలక్ట్ చేసుకొని, మళ్లీ ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది. తొలుత ఫీచర్ వాట్సాప్బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ ఫార్వార్డింగ్ విషయంలో వాట్సాప్ గతంలో ఒక అప్డేట్ను విడుదల చేసింది. దీని ద్వారా యూజర్లు ఒకేసారి ఒక చాట్కు సందేశాలను ఫార్వార్డ్ చేయవచ్చు. వాట్సాప్ సదరు మెసేజ్ అనేక సార్లు ఫార్వార్డ్ చేశారని ‘ ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అంటూ ఆయా మెసేజ్కు లేబిలింగ్ను వాట్సాప్ ఇస్తోంది. చదవండి: శాంసంగ్కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ యూజర్లు.! -
నటి సంజనకు అభ్యంతరకర సందేశాలు
యశవంతపుర(కర్ణాటక): నటి సంజనా గల్రానికి అభ్యంతరకర సందేశాలు పంపిన ఓ ఫ్యాషన్ డిజైనర్ కుమారుడిని ఇందిరానగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి 25 అర్ధరాత్రి నటి సంజనాకు అభ్యంతరకర సందేశాలు పంపాడు. దీంతో సంజనా వాట్సాప్ చాట్ సందేశాలను పోలీసులకు అందజేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను సంజనకు ఎలాంటి సందేశాలను పంపలేదని పోలీసులకు వివరించినట్లు సమాచారం. -
కేంద్రానికి ఈమెయిల్ ద్వారా మెసేజ్లు
-
యాపిల్పై గూగుల్ సంచలన ఆరోపణలు
టెక్ దిగ్గజ కంపెనీలు పరస్పర ఆరోపణలతో మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. యాపిల్ మెసేజింగ్ సర్వీస్.. ఐమెసేజ్ విషయంలో యూత్ యూజర్లు ఆందోళన చెందుతున్నారట. అందుకు కారణం.. ఐఫోన్ యూజర్లు.. ఐమెసేజ్ ఉపయోగించి మెసేజ్లు పంపించుకున్నప్పుడు బ్లూ కలర్లో మెసేజ్లు చూపిస్తున్నాయి. అదే గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రం గ్రీన్ కలర్ నోటిఫికేషన్ కనిపిస్తోంది. ఇది యూజర్లను ఇబ్బందికి గురి చేస్తోందట!. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్.. డజన్ల మంది టీనేజర్లను, కాలేజీ స్టూడెంట్లను ప్రశ్నించి.. వాళ్ల అభిప్రాయాల ఆధారంగా ఓ కథనం ప్రచురించింది. వాళ్లలో చాలామంది ఈ ఆప్షన్పై ఇబ్బందిగా ఫీలవ్వడం విశేషం. మరోవైపు ఈ ఫీచర్పై గూగుల్ సైతం మండిపడింది. పోటీతత్వం పేరుతో భిన్నత్వం ప్రదర్శించడం, యువత మానసిక స్థితిని యాపిల్ దెబ్బ తీస్తోందని గూగుల్ ఆరోపణలు గుప్పించింది. Apple’s iMessage lock-in is a documented strategy. Using peer pressure and bullying as a way to sell products is disingenuous for a company that has humanity and equity as a core part of its marketing. The standards exist today to fix this. https://t.co/MiQqMUOrgn — Hiroshi Lockheimer (@lockheimer) January 8, 2022 అయితే యాపిల్ ఈ ఆరోపణల్ని ఓపెన్గా ఖండించకపోయినా.. ఓ ప్రకటనలో అదేం లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది యాపిల్.. ఎపిక్ గేమ్స్ కేసు సందర్భంగా.. ఆండ్రాయిడ్ యూజర్లకు ఐమెసేజ్ ఫీచర్ అందుబాటులో ఉంచాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ.. చివరకు ఆ ప్రతిపాదనను యాపిల్ మేనేజ్మెంట్ తిరస్కరించిందని తేలింది. -
టీకా సిత్రాలు.. ఆందోళనలో ప్రజలు!
దౌల్తాబాద్కు చెందిన అనురాధ కరోనా నివారణకు కొద్ది రోజుల క్రితమే తొలిడోస్ను తీసుకున్నారు. అయితే రెండో డోస్ కూడా తీసుకున్నట్లు ఆమె భర్త సెల్కు మెసేజ్ రావడంతో అవాక్కయ్యారు. మరో ఘటనలో.. దౌల్తాబాద్కు చెందిన సత్యనారాయణ మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోస్కు వైద్యసిబ్బంది దగ్గరకు వెళ్ళగా మీరు తీసుకున్నారు కదా అని చెప్పడంతో అయోమయానికి గురయ్యారు. నా సెల్కు మెసేజ్ రాలేదు కదా అంటే సమాధానం లేదు. సాక్షి,దౌల్తాబాద్(హైదరాబాద్): కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే దివ్యౌషధమని, ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసు కోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రారంభంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకడుగు వేసిన ప్రజలు రెండో వేవ్ ఉధృతం కావడంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాక్సిన్ వేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించింది కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో మొదటిడోస్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. రెండో డోస్లోనే.. మొదటి డోస్ను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యసిబ్బంది రెండో డోస్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో అనేక తప్పులు దొర్లుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకున్నా తీసుకున్నట్లు ప్రజల సెల్కు మెసేజ్లు వస్తున్నాయి. దీంతో వారంతా కంగారు పడుతున్నారు. టీకాల లక్ష్యాన్ని చేరుకోవాలన్నా ఆతృతనా..? మరేమైనా కారణంతోనా..? తెలియదు కానీ మెసేజ్లు మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. ఉన్నతాధికారుల ఒత్తిడి పెరగడంతోనే ఆన్లైన్లో అంకెల గారడీ ప్రదర్శించేందుకే అన్ని విధాలా కసరత్తు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. 9 ఉపకేంద్రాల పరిధిలో.. మండలంలో 39,065 మందిని వ్యాక్సిన్కు అర్హులుగా గుర్తించి వందశాతం లక్ష్యాన్ని ఇటీవలే అధిగమించారు. రెండో డోస్కు మండలంలోని 9 ఉపకేంద్రాల పరిధిలో ఏఎన్ఎంలు, వైద్యసిబ్బంది రెండోడోస్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు 15,551 మందికి రెండో డోస్ వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది సిబ్బంది తొలిడోస్ వేసుకున్న వారికి ఫోన్చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.రెండోడోస్ వేసుకున్నారా..?ఆన్లైన్లో నమోదు చేయమంటారా..? అంటూ అడుగుతున్నారు. ఈ క్రమంలో రెండో టీకా తీసుకున్నట్లు సంక్షిప్త సందేశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వైరస్ టెన్షన్!.. తారస్థాయిలో విరుచుకుపడుతున్న థర్డ్వేవ్ -
వాట్సాప్ కొత్త ఫీచర్లు, ఫేస్ రికగ్నైజేషన్తో లాక్ వేయొచ్చు..!
వాట్సాప్ రెండు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా వాట్సాప్ అప్డేట్ చేసిన ఈ ఫీచర్లు బాగున్నాయని, యూజర్ల భద్రత పరంగా ఇప్పటి వరకు విడుదలైన ఫీచర్ల కంటే కొత్తగా అప్డేట్ చేసిన ఫీచర్ల ఉపయోగం ఎంతో ఉందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ఫ్లాష్ కాల్స్, మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఫీచర్లను విడుదల చేసింది. యూజర్ల సెక్యూరిటీ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో ఫ్లాష్ కాల్స్ ఫీచర్ను విడుదల చేసింది. వాట్సాప్ ఇన్ స్టాల్ సమయంలో జరిగే ప్రాసెస్లో ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ తప్పని సరి చేసింది. అంతేకాదు కాంటాక్ట్లను బ్లాక్ చేయడం, ఎవరితో ఏం షేర్ చేయాలనే దానిని కంట్రోల్ చేయడం, అవసరమైన వాట్సాప్ మెసేజ్లను సీక్రెట్గా స్టోర్ చేయడం, టచ్ ఐడి లేదా ఫేస్ ఐడితో యాప్ను లాక్ చేయడం వంటి సెక్యూరిటీ సౌకర్యాలు కొత్తగా తెచ్చిన ఫీచర్లలలో ఉన్నాయని వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. అంతే కాదు ఈ ఫ్లాష్ కాల్ ఫీచర్ లో యూజర్లు కొత్త ఫోన్లో వాట్సాప్ను ఇన్స్టాల్ చేసే సమయంలో ఎస్ఎంస్ వెరిఫికేషన్, ఆటోమేటెడ్ కాల్ ద్వారా ఫోన్ నంబర్ను యాక్సెప్ట్ చేసే ఆప్షన్ కోసం ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. మరో మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఫీచర్ యూజర్ల ప్రొఫైల్ ఫోటో, చివరిగా చూసిన యూజర్లు ఎవరు, చూసిన వారిలో అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని నియంత్రించవచ్చు. అవసరం అనుకుంటే బ్లాక్ చేయొచ్చు. అంతేకాదు సెక్యూరిటీ దృష్ట్యా రెండు సార్లు వెరిఫికేషన్ కూడా చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. మొత్తం వాట్సాప్ చాట్కోసం ప్రైవసీ సెట్టింగ్ను తెచ్చింది. -
వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్
చేజారిపోతున్న యూజర్లను మళ్లీ తనవైపుకు తిప్పుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త అప్డేట్లతో ముందుకు వస్తోంది. తాజాగా మరో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. యాపిల్ ఐ మెసేజ్,ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ తరహాలో మెసేజ్ రియాక్షన్ ఎమోజీ తో పాటు వరల్డ్ వైడ్గా పాపులర్ అయిన వెబ్ సిరీస్ 'మనీ హెయిస్ట్' ఎమోజీలను వినియోగించుకోవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా'లో తెలిపింది. More details: • You can react to a message multiple times with different emojis. • The process to send a reaction is end-to-end encrypted, so nobody outside the chat can see your reactions. • You can react to messages in individual chats as well. https://t.co/mJwPL44xvK — WABetaInfo (@WABetaInfo) September 4, 2021 కమ్యూనిటీ బ్లాగ్లో ఏముంది? 'వాట్సాప్ బీటా' ఇన్ఫర్మేషన్ ప్రకారం..వాట్సాప్ పర్సనల్ అకౌంట్, లేదంటే పబ్లిక్ గ్రూప్లలో యూజర్ల మధ్య సంభాషణలు జరుగుతుంటాయి. ఆ సమయంలో సిచ్చువేషన్కు తగ్గట్లు ఎమోజీలను సెండ్ చేయాలంటే సాధ్యమయ్యేది కాదు. కానీ తాజాగా వాట్సాప్ ఆ ఫీచర్ను బిల్డ్ చేసినట్లు వెల్లడించింది.ఇకపై యూజర్లు చాటింగ్కు అనుగుణంగా ఎమోజీలను సెండ్ చేసుకోవచ్చుని, ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు స్పష్టం చేసింది. వీటితో పాటు నెట్ ఫ్లిక్స్లో విడుదలైన 'Money Heist Season 5' కి చెందిన 17 ఎమోజీలను త్వరలో విడుదల చేస్తున్నట్లు బ్లాగ్ పేర్కొంది. ఈ రెండు ఫీచర్లను ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై వాట్సాప్ క్లారిటీ ఇవ్వలేదు. కమ్యూనిటీ బ్లాగ్లో స్క్రీన్ షాట్లను షేర్ చేయడంతో ఫీచర్లు మరో కొద్దిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని యూజర్లు అంచనా వేస్తున్నారు. అకౌంట్లను బ్లాక్ చేస్తున్న వాట్సాప్ గత కొద్ది కాలంగా ఆయా దేశాల ఐటీ రూల్స్కు విరుద్దంగా వ్యవహరిస్తున్న యూజర్లపై వాట్సాప్ ఉక్కుపాదం మోపుతోంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనుచిత, హానికరమైన సమాచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే ఈ ఏడాది జూన్ - జూలై నెలల మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు అధికారికంగా చెప్పింది. అందుకే చేజారిపోతున్న యూజర్లను తనవైపుకు తిప్పుకునేందుకు వాట్సాప్ మరిన్ని అప్డేట్లను తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
సార్.. నా రెండో భార్య వల్లే మొదటి భార్యతో అలా..!
‘ఆయనకి ఇద్దరు’ అనే మాట కొందరు మగవారి జీవితాల్లో రహస్య వ్యవహారమే కానీ.. మొదటి భార్య అనుమతితో రెండో వివాహం చాలాచోట్ల సమ్మతమే. అయితే అతడికి సమస్యంతా రెండో భార్యతోనే వచ్చింది. సహజంగానే ఆడవారికి సవతిపోరు పడదు. అందుకే తెలివిగా వీలుచిక్కినప్పుడల్లా అతడి ఫోన్ నుంచి సీక్రెట్గా మొదటి భార్య(సవతి)తో అతడిలానే చాట్ చేసి.. కథను విడాకులు దాకా లాక్కొచ్చింది రెండోభార్య. విషయం తెలుసుకున్న అతగాడు లబోదిబోమంటూ కోర్టుకెక్కాడు. రెండో భార్యపై కేసు వేశాడు. నష్టపరిహారంతో పాటు జైలు శిక్ష కూడా పడేలా చేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. వాట్సాప్లో మరింత క్లోజ్, చివరికి! అసలు ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. వేర్వేరు ఇళ్లల్లో ఉంచాడు. ఇద్దరినీ చక్కగానే చూసుకుంటున్నాడు. అయితే రెండో భార్యకి కొంచెం పొజెసివ్నెస్ ఎక్కువ. తన భర్త తన సవతికి దగ్గరవ్వడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. దాంతో ఆమె అతడికి తెలియకుండా, అతడి ఫోన్ రహస్యంగా తీసుకుని మొదటి భార్యతో అతడు చేసిన చాటింగ్ మొత్తం చదివేది. అతడి ఈ–మెయిల్స్ కూడా తెరిచి చూసేది. కొన్ని మెసేజులకు కోపం తెప్పించేలా రిప్లైలు ఇచ్చేది. దాంతో మొదటి భార్యకు అతడికి చాలా మనస్పర్థలు వచ్చాయి. ఆ గొడవలు కాస్త ముదిరి విడాకులు కూడా అయ్యాయి. దాంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. అంతటికీ కారణం తన రెండో భార్యేనంటూ కోర్టును ఆశ్రయించాడు. చదవండి: పబ్–జీ ఖర్చు 10 లక్షలు తన రెండో భార్య కారణంగానే తన మొదటి భార్యతో విడిపోవాల్సి వచ్చిందని, అందుకుగాను తాను ఆర్థికంగా చాలా నష్టపోయానని, చివరికి కోర్టు వ్యవహారాల్లో తలమునకలై ఉద్యోగం కూడా పోగొట్టుకున్నానని.. అన్ని ఖర్చుల నిమిత్తం పరిహారం ఇప్పించమని జడ్జిని దీనంగా వేడుకున్నాడు. రాస్ అల్ ఖైమా సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ కేసుని పరిశీలించి.. భర్త ఫోన్లలో అతడికి తెలియకుండా మెసేజులు చదవడమంటే అతడి ప్రైవసీకి భంగం కలిగించే చర్యేనని తేల్చి.. నష్ట పరిహారంగా 8,000 దిర్హామ్లు అంటే సుమారు లక్ష అరవై నాలుగు వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అంతే కాకుండా కోర్టు ఖర్చులకు మరో రూ.42 వేలు చెల్లించడంతో పాటు ఆమెకు ఒక నెల రోజులు జైలు శిక్ష కూడా విధించారు. చదవండి: చున్నీ బిగించి చంపి.. లోయలో తోసి.. -
కీచకుడిగా మారిన టీడీపీ వార్డు కౌన్సిలర్..
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ కీచకుడిలాగా ప్రవర్తించాడు. తాడిపత్రికి చెందిన 33 వ వార్డు కౌన్సిలర్ విజయ్కుమార్ ఒక మహిళను వేధించడమే కాకుండా అసభ్యపదజాలంతో మెసేజ్లు పంపాడు. దీంతో విసిగిపోయిన సదరు మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చదవండి: ఓటుకు కోట్లు కేసు: రేవంత్ రెడ్డికి సమన్లు -
మృతిచెందిన వ్యక్తికి కరోనా నెగిటివ్ రిపోర్ట్
సాక్షి, రామగుండం(కరీంనగర్): అంతర్గాం మండలంలోని రాయదండికి చెందిన మూడు కుటుంబాల్లో 13 మంది కరోనా టెస్ట్ చేయించుకోకున్నా వారి సెల్ నంబర్లకు నెగెటివ్ రిపోర్ట్ అంటూ మెసేజ్లు రావడంతో అవాక్కయ్యారు. వీరిలో ఒకరు గతంలోనే మృతిచెందారు. ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. రాయదండికి చెందిన మచ్చ బాలయ్య గత అక్టోబర్ 3న అనారోగ్యంతో మృతిచెందాడు. అంతకుముందు అతనికి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పపత్రిలో కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చింది. మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స చేయించినప్పటికీ పరిస్థితి విషమించి, చనిపోయాడు. ఈ నేపథ్యంలో మృతుడితోపాటు అతని కుటుంబసభ్యులు శారద, సంజీవ్, విష్ణు, మరో రెండు కుటుంబాలకు చెందిన మచ్చ రామయ్య, రజిత మొత్తంగా 13 మందికి జూలై 28న బసంత్నగర్ పీహెచ్సీలో కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు, రిపోర్ట్లో నెగెటివ్ వచ్చినట్లు వారి ఫోన్ నంబర్లకు మెస్సేజ్లు వచ్చాయి. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు కరోనా టెస్ట్కు వెళ్లకపోగా పరీక్ష చేయించుకున్నట్లు మెస్సేజ్లు రావడం పట్ల మృతుడి కుమారుడు సంజీవ్ ‘సాక్షి’తో తన ఆవేదన వెలిబుచ్చాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన వంగల రమేష్, అతని భార్య వాణి గత ఏప్రిల్ 15న తన కోవిషీల్డ్ మొదటి డోస్ టీకా వేసుకున్నారు. ఆ సమయంలో ఒకే ఫోన్నంబర్ ఇచ్చారు. జూలై 26న రెండో డోస్ టీకా వేసుకునేందుకు వెళ్తే వాణి పేరు మాత్రమే ఆన్లైన్లో చూపిస్తోందని ఆమెకు మాత్రమే వ్యాక్సిన్ వేశారు. రమేష్కు వేయకుండా పంపించారు. అసలైన లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
నార్మల్ టెక్స్ట్ మెసేజ్ షెడ్యూల్ చేయడం ఎలా?
మీరు మీ స్నేహితుల, బందువుల, ఇష్టమైన వారి పుట్టిన రోజు లేదా ఇతర వేడుకలు సంబందించి అందరికి కంటే ముందుగా శుభాకాంక్షలు తెలపాలని అనుకుంటున్నారా?. అయితే, దీని కోసం మీరు సమయాన్ని వృదా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుంచి గూగుల్ మెసేజెస్ ద్వారా సాదారణ టెక్స్ట్ మెసేజ్ లను షెడ్యూల్ చేయవచ్చు. చాలా సులభంగా సందేశాలను షెడ్యూల్ చేయవచ్చు. సందేశాలను షెడ్యూల్ చేయాలంటే కచ్చితంగా మీ ఫోన్ మొబైల్ డేటా లేదా వై-ఫైకి కనెక్ట్ కావాలని గుర్తుంచుకోండి. అలాగే, గూగుల్ మెసేజెస్ కొత్త వెర్షన్(7.8.064) ఇన్స్టాల్ చేసుకోవాలి. గూగుల్ మెసేజెస్ తో టెక్స్ట్ మెసేజ్ ఎలా షెడ్యూల్ చేయాలి? మీ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ యాప్ ఓపెన్ చేసి మీకు నచ్చిన వారి నెంబర్ ఎంచుకోండి. ఇప్పుడు మీరు షెడ్యూల్ చేయదలిచిన సందేశాన్ని టైప్ చేయండి, కానీ అప్పుడే సెండ్ బటన్పై నొక్కకండి. మీ సందేశం టైపు చేశాక సెండ్ బటన్ను అలాగే నొక్కి పట్టి ఉంచండి, ఇప్పుడ మీకు షెడ్యూల్ సెండ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. మీకు నచ్చిన తేదీ, సమయాన్ని ఎంచుకొని సేవ్ చేసి సెండ్ బటన్ మీద నొక్కండి. ఇప్పుడు మీరు చేసిన షెడ్యూల్ సమయానికి మెసేజ్ వారికి వెళ్తుంది. తేదీ, సమయాన్ని మార్చడానికి షెడ్యూల్ చేసిన మెసేజ్ పక్కన కనిపిస్తున్న క్లాక్ సింబల్ మీద క్లిక్ చేసి అప్డేట్ మెసేజ్ నొక్కడం ద్వారా మార్చుకోవచ్చు. చదవండి: ఫ్లిప్కార్ట్లో రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్ -
గూగుల్ మెసేజిస్ లో అదిరిపోయే ఫీచర్
మీ మిత్రుడు, బంధువులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మర్చిపోయారా? అర్ధరాత్రి వారిని లేపకుండానే వారికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా. అయితే, మీకు ఒక శుభవార్త. గూగుల్ తన మెసేజిస్ యాప్ లో అదిరిపోయే ఫీచర్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే వీడియో కాలింగ్, లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్స్ తీసుకొచ్చిన గూగుల్. తాజాగా, షెడ్యూల్ అనే కొత్త ఫీచర్ తీసుకొనివస్తుంది. దీని ద్వారా మీరు మీ మెసేజ్ లను షెడ్యూల్ చేయవచ్చు. మీరు మెసేజ్ ను షెడ్యూల్ చేయడానికి ముందు మీ ఫోన్లో గూగుల్ మెసేజ్ తాజా వెర్షన్(7.4.050 )ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఫీచర్ కేవలం గూగుల్ మెసేజ్ యాప్ లో మాత్రమే వర్తిస్తుంది. మీ ఫోన్ లో వచ్చిన మెసేజ్ యాప్ లో ఈ ఫీచర్ వర్తించదు. మీరు మెసేజ్ లను షెడ్యూల్ చేయాలంటే ఈ క్రింద స్టెప్స్ అనుసరించండి. మెసేజ్ ను షెడ్యూల్ చేయడానికి ముందు మీ సందేశాన్ని టైప్ చేయండి తర్వాత సేండ్ బటన్ను లాంగ్ ప్రెస్(ఎక్కువ సేపు) చేయండి. ఇప్పుడు మీకు తేదీలు, సమయం చూపించే ఒక పాప్-అప్ మెసేజ్ వస్తుంది. దానిలో కనిపించే తేదీ, సమయాన్ని ఎంచుకొని సేవ్ చేస్తే సరిపోతుంది. దీని ద్వారా మీ ఫొటోలు, వీడియోలు కూడా షెడ్యూల్ చేయవచ్చు. చదవండి: ఇంధన ధరలు తగ్గేది అప్పుడే: ధర్మేంద్ర ప్రధాన్ పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్ -
ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్
సాక్షి, ముంబై: సోషల్ మీడియా ప్లాట్పాం ఇన్స్టాగ్రామ్ తాజాగా ‘రిసెంట్లీ డిలిటెడ్’ ఫీచర్ను ప్రవేశపెట్టింది. మన ఎకౌంట్ నుంచి డిలిట్, రిమూవ్ చేసిన పోస్ట్లు, వీడియోలు, రీల్స్, ఐజీటీవీ వీడియోలు...30 రోజుల లోపు రీస్టోర్ చేసుకోవచ్చు. 30 రోజుల తరువాత ఇవి ఆటోమెటిగ్గా డిలిట్ అయిపోతాయి. డిలిట్ కంటెంట్ కోసం సెట్టింగ్-ఎకౌంట్-రీసెంట్ డిలిటెడ్లోకి వెళితే సరిపోతుంది. డిలిట్ అయినవి హ్యాకర్ల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. యూజర్ల కోరికమేరకు ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది. గూగుల్లోకొత్తగా... సంగీత అభిమానులకు ఉపకరించే మార్పును డెస్క్టాప్ సెర్చ్ రిజల్ట్లో చేసింది గూగుల్. నెవిగేషన్ డ్రాయర్తో టాప్ లెఫ్ట్లో మనం కోరుకునే సమాచారానికి సంబంధించిన వివరణతో పాటు వోవర్ వ్యూ, లిజెన్, వీడియోసాంగ్...ఇలా సబ్కేటగిరిలు కనిపిస్తాయి. షేర్ బటన్ ఉంటుంది. తాజా మార్పు వల్ల మనం కోరుకునే పేజీని వెంటనే క్లిక్ చేయవచ్చు. టైమ్ సేవ్ అవుతుంది. -
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ను లాంచ్ చేయనుంది. పలు గ్రూపులు, వ్యక్తుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న మెసేజ్లను, ఫోటోలను, వీడియోలు తదితర కంటెంట్ను డిలీట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్లంకదా. తాజాగా ఇలాంటి జంక్ మోసేజెస్ను సులువుగా తొలగించేందుకు వీలుగా ఒక కొత్త ఫీచర్ను పరిచయం చేసింది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు తమ ఫోన్లలో స్టోరేజ్ డాటాను పెంచుకోవచ్చని వాట్సాప్ వెల్లడించింది. వినియోగదారులకు ఉపయోగపడే విదంగా స్టోర్ మేనేజ్మెంట్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తద్వారా పలుసార్లు ఫార్వార్డ్ చేసిన, అనవసరమైన వీడియోలను, ఫొటోలను క్లీన్ చేసుకునేందుకు మరింత సులభం తొలగించుకోవచ్చు. 5ఎంబీ కంటే ఎక్కువ సైజులో ఉన్న ఫైలును గుర్తిస్తుంది. పరిమాణంలో ఫైల్ సైజ్ను బట్టి విడివిడిగా చూపిస్తుందని, దాని ద్వారా అవసరమైన వాటిని, అనవసరమైన వాటిని వినియోగదారులు త్వరగా గుర్తించగలుగుతారని సంస్థ చెప్పింది. అంతేకాకుండా ఒకటి లేదా చాలా వాటిని డిలీట్ చేయడానికి ముందు ఒకసారి చూసుకునే వెసులుబాటును కల్పిస్తుందని అన్నారు. అయితే ఈ ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. యాప్లోని సెట్టింగ్స్లోకి వెళ్లి స్టోరేజి అండ్ డేటాలో ఈ ఫీచర్ కనిపిస్తుందని సంస్థ తెలిపింది. ఇప్పటివరకూ వాట్సాప్ ‘స్టోరేజ్ యూసేజ్’ విభాగం కింద చాట్లు కనిపించేవి. తాజా ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఇంటర్ఫేస్మీద ఒక బార్మీద కనిపిస్తుంది. ఇందులో మీడియా కంటెంట్ ద్వారా ఎంత స్టోరేజ్ వినియోగించాం అనేది చూపిస్తుంది. అలాగే చాలాసార్లు ఫార్వార్డ్ చేయబడిన మీడియా ఫైళ్ళను ప్రత్యేకంగా చూపిస్తుంది. దీంతో అలాంటి ఫైళ్ళను సులభంగా గుర్తించి డిలీట్ చేయడానికి సహాయపడుతుంది. -
మోసగాళ్లకు చెక్ : మెసెంజర్లో కొత్త ఫీచర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ తన మెసెంజెర్ యాప్లో కొత్త భద్రతా చర్యలను ప్రారంభించింది..యూజర్లకు తెలియకుండా తెర వెనుక జరిగే మోసాలను గుర్తించి, యూజర్లను అలర్ట్ చేస్తుంది. స్మార్ట్ఫోన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా వీటిని మనిస్తుంది. ఏదైనా అనుమానాస్పదంగా భావిస్తే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా సంబందిత యూజర్ ను హెచ్చరిస్తుంది. మెసెంజర్ టెక్స్ట్ చాట్లలో సేఫ్టీ సందేశాలు పాపప్ అవుతాయని ప్రైవసీ అండ్ సేఫ్టీ నిర్వహణ డైరెక్టర్ జే సుల్లివన్ తెలిపారు. సంభాషణలను స్కామర్లు ఎవరూ వినకుండా , గమనించకుండా స్నేహితులు , ప్రియమైనవారితో సురక్షితంగా ప్రైవేటుగా కమ్యూనికేట్ చేయగలగాలన్నారు. ముఖ్యంగా మైనర్ యూజర్ల భద్రత తమకు ముఖ్యమన్నారు. సంబంధిత ఖాతారుదారుడు పంపించే మెసేజెస్, ప్రాంతం, అకౌంట్ నైజం ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ స్కామర్లను గుర్తిస్తుందని ఫేస్బుక్ తెలిపింది. అలాంటి మోసగాళ్లు పంపే సందేశాలకు స్పందించక ముందే హెచ్చరిక నోటీసులు పాపప్ అవుతాయని,దీన్ని యూజర్లుగమనించాలని పేర్కొంది. ఈ ఫీచర్ తమ మిలియన్ల యూజర్లను భారీమోసాలు, హానికరమైన చర్యలనుంచి కాపాడుతుందని ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు అందుబాటులోఉన్న ఈ ఫీచర్ వచ్చే వారం ఐఫోన్లలోని మెసెంజర్లో కూడా ప్రారంభిస్తామని ఫేస్బుక్ వెల్లడించింది. We’re introducing a new privacy-preserving safety feature that will help millions of people avoid potentially harmful interactions and possible scams. https://t.co/ajJagpJjJ9 — Messenger (@messenger) May 21, 2020 -
పేటీఎం మెసేజ్లు, సీఈవో హెచ్చరిక
సాక్షి, ముంబై: ప్రముఖ ఇ-వాలెట్ సంస్థపేటీఎం నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజాగా తన వినియోగదారులను హెచ్చరించింది. ఈ మేరకు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. కెవైసీ వివరాలు అందించకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని, సంబంధిత యాప్ను డౌన్లోడ్ చేసుకోమంటూ వినియోగదారులకు మెసేజ్లు రావడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై స్పందించిన విజయ్ శేఖర్ కేవైసీ స్కాంపై కస్టమర్లను అలర్ట్ చేశారు. మీ పేటీఎం ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలకోసం ఏదైనా మెసేజ్ వచ్చిందా..అయితే అలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండమని ఆయన హెచ్చరించారు. పేటీఎం అలాంటి వివరాలను వినియోగదారులను కోరడం లేదని, అలాగే యాప్ను డౌన్లోడ్ చేసుకోమని తాము సూచించమని వినియోగదారులకు స్పష్టం చేశారు. అలాంటి సందేశాలను, కాల్స్ను నమ్మవద్దని కోరారు. అలాగే భారీ బహుమతి, లక్కీ చాన్స్ అంటూ వచ్చే మెసేజ్ల మాయలో పడొద్దని కూడా ఆయన సూచించారు. మీ వివరాలను హ్యాక్ చేయడానికి మెసగాళ్లు చేసే పని ఇదని వారి వలలో పడకండి అంటూ ఆయన హెచ్చరించారు. ఇదో కుంభకోణమని పేర్కొన్న ఆయన దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మరోవైపు చాలామంది వినియోగదారులు తమకూ ఇలాంటి మెసేజ్లు వచ్చాయని ట్విటర్లో షేర్ చేయడం గమనార్హం. pic.twitter.com/FgSAQFwLJv — Vijay Shekhar (@vijayshekhar) November 20, 2019 These or some SMS with some lucky draw are examples of fraudsters attempting to get your details. Don’t fall for them. pic.twitter.com/vyLUn5Z7Z7 — Vijay Shekhar (@vijayshekhar) November 19, 2019 -
ఆ మెసేజ్లే అంతా చెప్పేస్తాయి
వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లు నేటి యువత ప్రేమకు వారధులుగా మారుతున్నాయి. ప్రతి క్షణం సందేశాల ప్రవాహాన్ని ఇటునుంచటు, అటునుంచిటు చేరవేస్తూ బంధాలను బలపరుస్తున్నాయి. అంతే కాకుండా సాంకేతిక కారణంగా మనం మాటల్లో చెప్పలేని భావాలను సైతం చిన్న సంజ్ఞలతో చెప్పేస్తున్నాం. అయితే ఒకరికొకరు తమ ప్రేమను తెలుపుకుని మెసేజ్ల ద్వారా ప్రతి రోజూ టచ్లో ఉండేవారి సంగతి పక్కన పెడితే.. తమ కిష్టమైన వ్యక్తులతో చాటింగ్ చేస్తూ తమ ప్రేమను చెప్పలేక, ఆవతలి వ్యక్తి తమను ప్రేమిస్తున్నారో లేదో తెలియక సతమతమయ్యేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి మెసేజ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మనం ప్రేమించే వ్యక్తులు మనతో చాటింగ్ చేసేటప్పుడు పంపిన మెసేజ్లను బట్టి కొంతవరకు మనపై వారికున్న ప్రేమను తెలుసుకోవచ్చు. 1) ముద్దు పేర్లతో సంభోదన చాలా వరకు మనకు నచ్చిన వ్యక్తులనే ముద్దు పేర్లతో పిలుచుకోవటం జరుగుతుంది. మనకిష్టమైన వ్యక్తి మనతో చాటింగ్ చేస్తున్నపుడు తరుచుగా మనల్ని ముద్దు పేరుతో సంభోదిస్తుంటే ఒకరకంగా మన ప్రేమకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు భావించాలి. తరుచుగా ముద్దు పేర్లతో పిలవటం అన్నది మీ ప్రేమకు ఓ ముందడుగులాంటిది. 2) పర్సనల్ ఎమోజీలు, స్టిక్కర్లు ఎదుటి వ్యక్తితో మనకున్న అనుబంధాన్ని బట్టే మనం ఆయా రకాల ఎమోజీలు, స్టిక్కర్లు పంపిస్తామని తాజా పరిశోధనల్లో కూడా తేలింది. మామూలు సంభాషణల్లో ఎమోజీలు, స్టిక్కర్ల అవసరం అంతగా రాదు. స్నేహితులతో, మనకు బాగా నచ్చిన వారితోనే పర్సనల్ ఎమోజీలు, స్టిక్కర్లు పంపిస్తాము. మీరు ఇష్టపడేవాళ్లుకూడా మీకు తరుచుగా పర్సనల్ ఎమోజీలు, స్టిక్కర్లు పంపిస్తుంటే మీరంటే వారికి ఇష్టం ఉందని భావించొచ్చు. 3) వాట్సాప్ స్టాటస్లు, ఫ్రొఫైల్ పిక్పై స్పందన మీ వాట్సాప్ స్టాటస్లు, ఫ్రొఫైల్ పిక్లపై తరుచుగా స్పందిస్తూ ఉంటే ఎదుటి వ్యక్తికి మీ మీద ఆసక్తి ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. మీరు అలా వాటిని మార్చగానే ఆవతలినుంచి స్పందన వస్తే వారు మీ వాట్సాప్ మెసేజలను ప్రతిక్షణం గమనిస్తూ ఉన్నారని అర్థమవుతుంది. మీపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించారని తెలిసిపోతుంది. 4) తీపి గుర్తులు పంచుకోవటం వారికి సంబంధించిన పర్సనల్ విషయాలను ఎక్కువగా పంచుకోవటం, ముఖ్యంగా చిన్నప్పటి ఫొటోలను మీకు పంపటం అన్నది మీ ప్రేమకు శుభసూచకం. మనకు బాగా దగ్గరైన వారికే మనల్ని మనలాగా చూపించుకోవటానికి ప్రయత్నిస్తాం. వారు తరుచుగా ఈ పని చేస్తుంటే వారి దృష్టిలో మీరు ప్రత్యేకం అని భావించాలి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
వాట్సాప్ మరో అద్భుతమైన అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్లో మన పంపించే మెసేజ్లో వాటంతట అవే డిలీట్ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై ఈ మెసేజ్లు నిర్ణీత సమయం (5సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటంతట అవే ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సాప్ సెట్టింగ్స్ విభాగంలో అందజేసే ‘డిజప్పియరింగ్ మెసేజెస్’ అనే ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వా బేటా అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్ను పరీక్షిస్తోంది. అంటే ఏదైనా సెన్సిటివ్ మెసేజ్ను పంపించాక, అది ఎక్కువ సేపు ఉండకూడదని భావిస్తే..డిజప్పియర్డ్ మెసేజెస్ లోకి వెళ్లి, ఆఫ్, 5 సెకండ్స్, గంట అనే అప్షన్ను ఎంచుకోవాలి. ఇది గ్రూపు చాటింగ్లో గానీ, వ్యక్తిగత చాటింగ్లో గానీ ఈ ఆప్షన్ను వినియోగించుకోవచ్చు. ఒక్కసారి డిలీట్ అయిన తరువాత ఇవి చాట్లో ట్రాక్లో కూడా అందుబాటులో ఉండవు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులోకి తేనుంది. ఇటీవల వాట్సాప్ స్టేటస్ స్టోరీలను డైరెక్టుగా ఫేస్బుక్ స్టోరీలో షేర్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితేతాజా అప్డేట్పై వాట్సాప్ అధికారికంగా ప్రకటన చేయాల్సి వుంది. చదవండి : వాట్సాప్ అప్డేట్ -
‘మనిద్దరం కలిసి చనిపోదాం’
వాషింగ్టన్: ‘మనిద్దరం కలిసి చనిపోదాం.. అమెరికాలో తిరుగుతూ.. చర్చిలు, విమానాశ్రయాల్లో హింసకు పాల్పడదాం’ అంటూ ఓ వ్యక్తి తన స్నేహితురాలికి ఏకంగా 10 వేల సందేశాలు పంపించాడు. వివరాలు.. ఫ్లోరిడాకు చెదిన నికోలస్ సి. నెల్సన్ అనే వ్యక్తికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి నెల్సన్ సదరు మహిళకు బెదిరింపు, అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించాడు. 12 రోజుల వ్యవధిలో దాదాపు 10 వేల మెసేజ్లు చేశాడు. వాటిలో కొన్ని అసభ్యకరంగా ఉండగా.. మరి కొన్ని ‘మనం కలిసి చనిపోదాం.. అమెరికాలో తిరుగుతూ.. చర్చిలను పేల్చేద్దాం.. విమాన్రాశ్రయంలో దూరి కాల్పులకు పాల్పడదాం’ అనే హింసాత్మక సందేశాలు కూడా ఉన్నాయి. అంతేకాక నెల్సన్ సదరు మహిళకు ఓ విమానాశ్రయం ఫోటో పంపి.. తన మాట నిలబెట్టుకోబోతున్నాను అని పేర్కొన్నాడు. నెల్సన్ ప్రవర్తనతో విసిగిపోయిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వారు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ విషయం గురించి సదరు మహిళ మాట్లాడుతూ.. స్నేహితుల ద్వారా నికోల్సన్తో పరిచయం ఏర్పడిందని.. ఇప్పటి వరకూ రెండు మూడు సార్లు మాత్రమే తాను అతడిని చూశానని తెలిపింది. అంతేకాక నెల్సన్ తనకు చేసిన మెసేజ్లలో చనిపోతానని పేర్కొనలేదు.. కానీ జైలుకు వెళ్తానని చెప్పేవాడు అని పేర్కొంది. -
వాట్సాప్ యూజర్లకు అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదిక వాట్సాప్ల వేధింపులను ఎదుర్కొంటున్న బాధితులకు ఊరట. వాట్సాప్లో వేధింపులపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డాట్) అవకాశాన్ని కల్పించింది. అశ్లీల, అభ్యంతరకరమైన సందేశాలకు చెక్ చెప్పేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బాధితులు తమకు ఫిర్యాదు చేయవచ్చని శుక్రవారం సంబంధిత అధికారి ప్రకటించారు. వేధింపులు, బెదిరింపులు కస్టమర్ డిక్లరేషన్ ఫాంలో అంగీకరించిన నిబంధనల ఉల్లంఘనకు కిందికి వస్తుందని తెలిపింది. ఇలాంటి అవాంఛిత పద్ధతులను అనుసరిస్తున్న కస్టమర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ఫిబ్రవరి 19న కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదకరమైన, బెదిరింపు, అసభ్యమైన వాట్సాప్ సందేశాలను అందుకున్న బాధితులు ఎవరైనా ccaddn-dot@nic.in కు బఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని డాట్ కంట్రోలర్ ఆశిష్ జోషి ట్వీట్ చేశారు. అయితే ఇందుకు అలాంటి సందేశాల స్క్రీన్ షాటన్లు అందిచాల్సి వుంటుందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సంబంధిత టెలికాం ప్రొవైడర్లతోపాటు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకుంటామని జోషి వెల్లడించారు. అలాగే అభ్యంతరకరమైన, అశ్లీల, అనధికారిక కంటెంట్ పంపిణీ అవుతున్న ప్రొవైడర్ల లైసెన్స్ను రద్దు చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఇటీవల జర్నలిస్టులు సహా, పలువురు ప్రముఖులకు వాట్సాప్ ద్వారా బెదిరింపులు, వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో టెలికాం విభాగం ఈ చర్యలు చేపట్టింది. -
టీడీపీ నేతలో ‘అపరిచిత కాముడు’
-
హలో గురూ ఓటు కోసమే..!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు, అభ్యర్థులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. నేటి స్మార్ట్యుగంలో ప్రచారం కూడా స్మార్ట్గానే చేస్తున్నారు. సంక్షిప్త సందేశాలు, వాయిస్ కాల్స్తో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒకటి, రెండు పార్టీలు మినహా ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అయినా, టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నవారు అభ్యర్థుల పేర్లతో బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు అంటూ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లోని ఓటర్లకు సందేశాలు పంపారు. 2014 ఎన్నికల్లోనే చాలామంది అభ్యర్థులు ఈ విధానంలో కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే, అభ్యర్థులు, ఆశావహుల చేతికి తమ ఫోన్ నంబర్లు ఎలా వెళుతున్నాయన్నది పౌరులకు అంతుచిక్కడంలేదు. వారికి స్థానికంగా ఓటు హక్కు ఉన్నా లేకున్నా టెక్ట్స్ మెసేజ్లు, వాయిస్ కాల్స్ వెళుతుండటం గమనార్హం. ప్రధానంగా గ్యాస్ ఏజెన్సీలు, కేబుల్ ఆపరేటర్లు, బ్యాంకులు, షాపింగ్మాల్స్, టౌన్షిప్, అపార్ట్మెంట్ ఆఫీసులు, ఓటరులిస్టుల ద్వారా ఫోన్ నంబర్లను కొందరు అక్రమంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏజెన్సీలు రేటు కట్టి ఫోన్ నంబర్ల జాబితాలను విక్రయిస్తున్నారు. అభ్యర్థులు వీటిని వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు అందజేసి ఆ నంబర్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, పోటీచేసే వ్యక్తి ఇంటింటికీ తిరిగినా ఓటర్లందరినీ కలిసే అవకాశాల్లేవు. అందుకే ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. బల్క్ మెసేజ్ ప్యాకేజీలు రోజుకు రూ.వెయ్యి నుంచి ఆపై వరకు ఉన్నాయి. ఇంటర్నెట్ సాయంతో రోజుకు వేలాది సందేశాలు పంపే వెసులు బాటు కూడా ఉంది. అయితే ఫోన్ కాల్కి మాత్రం రూపాయి నుంచి రూ.5 వరకు చార్జీ చేస్తున్నారు. ఆ లెక్కన రోజుకు 30 నుంచి 40 వేల ఫోన్లకు వాయిస్కాల్స్ పంపే వెసులుబాటు ఉంది. వీటి ప్యాకేజీలు రూ.50 వేల నుంచి ఉన్నాయి. ఈ లెక్కన 119 నియోజవర్గాల్లో అభ్యర్థులు, రెబెల్స్ అంతా కలుపుకుంటే ఈ లిస్టు చాంతాడంత అవుతుంది. అంతా ఇదే విధానాన్ని అనుసరిస్తే ఆ వ్యయం రూ.కోట్లల్లో ఉంటుంది. నామినేషన్ వేసే దాకా.. తాము పోటీలో ఉన్నామని వారి పార్టీల అధిష్టానాలకు, తమ ప్రత్యర్థులకు చాటుకోవాలన్న తాపత్రయంలో, గెలుపుపై ధీమాను చాటేందుకు ఆశావహులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఏదో ఒక పార్టీపై బీ–ఫారం సంపాదించి నామినేషన్ వేసే వరకు అది అతని వ్యక్తిగత ప్రచారమే అవుతుంది. అయితే, ఈ ప్రచారానికి వీరు ఎన్నికల సంఘానికి లెక్కలు చూపెడతారా? లేదా.. అన్నది సందేహమే. అనుమతి లేకుండా ఫోన్ చేయడం, మెసేజ్లు పంపడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని పోలీసులు, న్యాయనిపుణులు అంటున్నారు. దీనిపై వినియోగదారులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ జనాభాలో 40 శాతం యువత ఉంది. సోషల్మీడియాలో ఒక్కొక్కరికి రెండు, మూడు ఖాతాలున్నాయి. అందుకే, వారిని చేరుకునేందుకు పార్టీలు, నేతలు సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. -
ఫేస్బుక్ మెసేంజర్లో కొత్త ఫీచర్
సోషల్మీడియా నెట్వర్క్ ఫేస్బుక్ తన మెసేజింగ్ ప్లాట్పాం మెసేంజర్లో కొత్త ఫీచర్ను జోడించనుంది. వాట్సాప్ మాదిరిగానే మెసేజ్లకు సంబంధించి అన్సెండ్ ఆప్షన్ను పరిశీలిస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూజర్లు అప్పటికే సెండ్ చేసిన సందేశాన్ని తొలగించడానికి అనుమతిస్తుంది. ఇన్బాక్స్నుంచి ఒక మెసేజ్ను డిలీట్ చేయడంతోపాటు, అన్సెండ్ ఆప్షన్తో గ్రహీత ఇన్బాక్స్నుంచి తొలగించేందుకు కూడా అనుమతిస్తుంది. వాట్సాప్లో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్లాంటిదే ఇది కూడా. అలాగే ఇలా చేయడానికి అచ్చం వాట్సాప్లోలాగానే సమయ పరిమితి ఉంటుందిట. అయితే ఈ టైంను సంస్థ ఇంకా ప్రకటించలేదు. కాగా వాట్సాప్ సందేశాలకు తొలగింపునకు సంబంధించిన కొత్త అప్డేట్ను జోడించింది. పొరపాటున మెసేజ్ పంపించాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్కు కాకుండా మరో గ్రూపు లేదా కాంటాక్ట్కు పంపించినట్లయితే ఆ మెసేజ్ను అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్ చేసుకునే అవకాశాన్ని తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఇలా సెండ్ చేసిన సందేశాలను 68నిమిషాల లోపు మాత్రమే తొలగించే అవకాశం ఉంది. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ వినియోగించి మెసేజ్ను డిలీట్ చేసుకోవచ్చని వాట్సాప్ను మానిటర్ చేస్తున్న వాబిటెయిన్ ఇన్ఫో వెబ్సైట్ తెలిపింది. అయితే సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్న సందర్భాల్లో జరుగుతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
వాట్సాప్ కొత్త అప్డేట్
ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ వాట్సాప్ యూజర్లకు మరో వెసులుబాటును కల్పించింది. మెసేజ్లను డిలీట్ చేసే గడువును భారీగా పొడిగించింది. పొరపాటున సెండ్ చేసిన మెసేజ్ను కొంత సమయంలోపే డిలీట్ చేయాల్సి ఉంటుంది కదా.. ఈ అంశంలోనే వినియోగదారులకు భారీ ఊరట కల్పించనుంది. ఈ మేరకు తాజాగా ఈ ఫీచర్లో మరో మార్పు తీసుకురానుంది. గతేడాది కొత్త ఫీచర్ "డిలీట్ ఫర్ ఎవ్రీవన్"ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా ఒక వేళ ఏదైనా మెసేజ్ పంపించాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్కు కాకుండా మరో గ్రూపు లేదా కాంటాక్ట్కు పంపించినట్లయితే ఆ మెసేజ్ను అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు. ఇప్పటివరకు ఇలా సెండ్ చేసిన సందేశాలను 68నిమిషాల లోపు మాత్రమే తొలగించే అవకాశం ఉంది. తాజా అప్డేట్ ప్రకారం డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ వినియోగించి మెసేజ్ను డిలీట్ చేసుకోవచ్చని వాట్సాప్ను మానిటర్ చేస్తున్న వాబిటెయిన్ ఇన్ఫో వెబ్సైట్ తెలిపింది. అయితే సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్న సందర్భాల్లో జరుగుతుందని వెల్లడించింది. -
వాట్సాప్నకు మూడో నోటీసుపై కేంద్రం యోచన
న్యూఢిల్లీ: మెసేజ్ల జాడ కనుక్కునే సాంకేతికతను అమలు చేయాలంటూ మెసెంజర్ సేవల సంస్థ వాట్సాప్నకు మూడోసారి నోటీసు ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ యోచిస్తోంది. దీనిపై అంతర్గతంగా చర్చ జరిగినట్లు, వచ్చే వారం, పది రోజుల్లో వాట్సాప్నకు మూడోసారి నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాట్సాప్లో వైరల్గా మారుతున్న తప్పుడు వార్తలు, మెసేజ్లు పలు సందర్భాల్లో హింసకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇటువంటి మెసేజ్లకు మూలం ఎక్కడ ఉంది, ఎలా విస్తరిస్తున్నాయి అన్నది జాడ తెలుసుకునేందుకు తగు సాంకేతికతను అందుబాటులోకి తేవాలంటూ వాట్సాప్నకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపింది. అయితే, సందేశాల ఎన్క్రిప్షన్కు, యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందనే కారణాలతో వాట్సాప్ ఇందుకు అంగీకరించడం లేదు. అయితే, మెసేజ్లను ఫార్వర్డ్ చేయడంపై పరిమితులను మాత్రం ప్రవేశపెట్టింది. దీంతో తమకు వచ్చిన కంటెంట్ను ఇతరులు ఫార్వర్డ్ చేసిన పక్షంలో .. సదరు మెసేజ్పై ఫార్వర్డ్ అనే లేబుల్ కనిపిస్తుంది. -
వాట్సాప్లో ఆ ఫీచర్ కూడా వచ్చేసింది
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫాం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ, రెచ్చగొట్టే తప్పుడు వార్తలు బాగా షేర్ అవుతున్న వైనంపై భారత ప్రభుత్వం సీరియస్గా స్పందించిన నేపథ్యంలో ఫార్వర్డ్ మెసేజ్లను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. మెసేజ్లు, ఇమేజ్లు, వీడియోలు ఒకేసారి పెద్ద సంఖ్యలో షేర్ చేయకుండా ఐదుగురికి మాత్రమే వాటిని పంపేలా ‘వాట్సాప్’ నియంత్రణ చర్యలు చేపట్టింది. భారతదేశంలో 200 మిలియన్లకు పైగా యూజర్లను కలిగివున్న వాట్సాప్ సందేశాల షేరింగ్పై ఈ ఆంక్షలు విధించింది. వాట్సాప్ ప్రస్తుత వెర్షన్లో కేవలం ఐదుగురికి మాత్రమే ఒక మేసేజ్ను ఫార్వార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ వారం నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు వినియోగదారుల అవగాహన కోసం ఒక వీడియోను కూడా విడుదల చేసింది. వాట్సాప్లో ఇప్పటికే ఈ నిబంధన వాట్సాప్లో షేరింగ్ ప్రక్రియలో అమల్లోకి వచ్చిన తీరును మనం గమనించ వచ్చు. ఒక మెసేజ్ను ఐదుగురికి మించి షేర్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే ఒక వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. మరోవైపు గత నెలలో ఫేస్బుక్ సొంతమైన ఫ్లాట్ఫాం వాట్సాప్లో ఐదు చాట్లకు సందేశాన్ని ఫార్వర్డ్ చేయడానికి కట్టడి చేసేలా టెస్టింగ్ ఫీచర్ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వ ఒత్తిడితో వాట్సాప్ సందేశాలను, చిత్రాలు, వీడియోల సామూహిక ఫార్వార్డింగ్ను తగ్గించేందుకు ఈ నియంత్రణ విధిస్తున్నట్టు పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మాములుగా వచ్చిన మెస్సేజ్ లకు, ఫార్వార్డ్ ద్వారా వచ్చిన మెస్సేజ్లకు మధ్య డిఫరెన్స్ ను స్పష్టంగా చూపించేలా ‘ఫార్వార్డెడ్’ అని సింబల్ రూపంలో చూపిస్తూ వుండటం మనకు తెలిసిందే. -
వాట్సాప్ షాకిచ్చింది.. కేవలం ఐదు చాట్లకే..
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు భారత ప్రభుత్వం గట్టివార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాట్సాప్లో అసత్య వార్తలు ప్రచారం కావడం వల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారని.. అటువంటి తప్పుడు సందేశాలు వైరల్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్ను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో వాట్సాప్ సైతం నకిలీ వార్తలు విజృంభించకుండా చూస్తున్నాయి. దానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి. వాట్సాప్ మెసేజ్లు, ఇమేజ్లు, వీడియోలు పెద్ద మొత్తంలో ప్రచారం కాకుండా ఉండేందుకు వాట్సాప్ గట్టి చర్యలు తీసుకుంటోంది. శుక్రవారం జారీ చేసిన ప్రకటనలో.. వాట్సాప్లో ఫార్వర్డ్ అయ్యే టెస్ట్పై పరిమితి విధించినట్టు వాట్సాప్ ప్రకటించింది. కేవలం ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్ ఫార్వర్డ్ అయ్యేలా నిర్దేశించింది. అదేవిధంగా మీడియా మెసేజ్లకు క్విక్ ఫార్వర్డ్ బటన్ను తీసేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల కంటే, భారత్లోనే మెసేజ్లు, వీడియోలు, ఫోటోలు ఎక్కువగా ఫార్వర్డ్ అవుతున్నాయని వాట్సాప్ తెలిపింది. ఒకేసారి మల్టిపుల్ చాట్లకు మెసేజ్ను ఫార్వర్డ్ చేసుకునేలా వాట్సాప్ ఫీచర్ను కొన్నేళ్ల క్రితమే తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం పెద్ద ఎత్తున్న మెసేజ్లు ఫార్వర్డ్ అవుతూ... అనాగరిక ధోరణులు పెరుగుతుండటంతో, ఐదు చాట్లకు మాత్రమే మెసేజ్ను ఫార్వర్డ్ చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఈ ఫార్వర్డ్ మెసేజ్లో ఓరిజినల్ ఏదో గుర్తించేందుకు వాట్సాప్ గత నెలలోనే ఫార్వర్డ్ లేబుల్ ఫీచర్ను తీసుకొచ్చింది. వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లతో దేశంలో భారీ ఎత్తున దాడులు పెరుగుతుండటంతో, వాట్సాప్కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కేంద్ర నోటీసులకు స్పందించిన వాట్సాప్, టెక్నాలజీని వాడుకుని, కొత్త ఫీచర్లతో ఫార్వర్డ్ మెసేజ్లను గుర్తిస్తామని, ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. -
గూగుల్ మెసేజస్ వెబ్పైకి వచ్చేసింది..
వాట్సాప్, ఫేస్బుక్లకు పోటీగా.. గూగుల్ మెసేజస్ ప్లాట్ఫామ్ను మరింత అప్డేట్ చేసింది. తాజాగా గూగుల్ మెసేజస్ను స్మార్ట్ఫోన్లో మాత్రమే కాక, వెబ్ ద్వారా కూడా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఆండ్రాయిడ్ మెసేజస్ ఫర్ వెబ్ను ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ఆవిష్కరించినట్టు గూగుల్ వెల్లడించింది. గత వారం నుంచే దీన్ని గూగుల్ మార్కెట్లోకి ఆవిష్కరించడం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చేసిందని గూగుల్ ప్రకటించింది. దీంతో మీరు కంప్యూటర్ల మీద పనిచేస్తున్నప్పుడు యాప్తో పనిలేకుండా వెబ్బ్రౌజర్ నుంచే మీ ఫోన్ కాంటాక్ట్లకు మెసేజ్లు పంపించుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ మెసేజస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. లేటెస్ట్ అప్డేట్తో ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్ యూజర్లు, అన్ని మెసేజ్లు, సంభాషణలను తమ వ్యక్తిగత కంప్యూటర్లలో యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ఆండ్రాయిడ్ మెసేజస్ ఫర్ వెబ్ అచ్చం వాట్సాప్ వెబ్ మాదిరిగానే ఉంది. కాగ, వాట్సాప్ వెబ్ 2015లో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ మెసేజస్ ఫర్ వెబ్ ఎలా ఉపయోగించాలి... తొలుత ఆండ్రాయిడ్ మేసేజస్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి మీ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేయాలి అలాగే కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో క్రోమ్, ఫైర్బాక్స్, ఒపెరా, యాపిల్ సఫారీ బ్రౌజర్లలో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసి ఉండాలి ఫోన్లో ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్ను ఓపెన్ చేసుకోవాలి యాప్ హోం పేజీలో కుడివైపు పైన కనిపించే మూడు డాట్స్ను క్లిక్ చేయాలి మోర్ ఆప్షన్స్ మెనూను టాప్ చేసి, మెసేజస్ ఫర్ వెబ్ను ఎంపిక చేసుకోవాలి మెసేజస్ ఫర్ వెబ్ను ఎంపిక చేసుకున్నాక వచ్చిన పేజీలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవాలి పేజీ లోడ్ అయ్యాక, మీరు మెసేజ్లు చూసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. -
వేళ్లు జాగ్రత్త.. లేకుంటే జైలు ఖాయం!
స్మార్ట్ఫోన్లు వచ్చాక ఎవరి ఒళ్లు వారి దగ్గరే ఉంటోంది. అయితే ఇకనుంచీ ఒళ్లు మాత్రమే దగ్గరుంటే సరిపోదు. ఫోన్ని కూడా హద్దులు దాటకుండా చూసుకోవాలి. ఈ వర్షాకాల సమావేశాల్లో 1986 నాటి ‘ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్’కి సవరణలు తేవాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదించబోతోంది. సవరణ బిల్లు ఆమోదం పొంది, అది అమలు అవడం ప్రారంభించిన క్షణం నుంచీ.. ఎవరైనా తమ స్మార్ట్ఫోన్లలోంచి స్త్రీలకు అసభ్యకరమైన సందేశాలు పంపినా, మహిళల శీల ప్రతిష్టకు భంగకరంగా పోస్టింగులు పెట్టినా.. సరాసరి జైలుకే! ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం రచనల్లోగానీ, వ్యాపార ప్రకటనల్లో గానీ, పెయింటింగులలో గానీ, కరపత్రాలలో గానీ, ఆఖరికి హోర్డింగులలో గానీ మహిళలను కించపరిచేలా, వాళ్లను అవమానించేలా, అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరిస్తే అది నేరం అవుతుంది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో డిజిటల్ మీడియాను కూడా ఈ చట్టం పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన ఆమోదం పొందితే కనుక అన్నివిధాలైన ఆన్లైన్, డిజిటల్, ఎలక్ట్రానిక్ సర్వీసులకు ఇది వర్తిస్తుంది. చట్ట సవరణలో భాగంగా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరిపే ఒక సంస్థను నెలకొల్పాలని కూడా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తీర్మానించింది. విచారణ సంస్థలో అడ్వరై్టజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సమాచార–ప్రసారశాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సారాంశం ఏంటంటే.. టెక్సి›్టంగ్లు, పోస్టింగ్లు చేసే వేళ్లను అదుపులో పెట్టుకోవాలని... లేకుంటే జైలు ఖాయం అని! -
డిలీట్ చేసినా మళ్లీ డౌన్లోడ్ చేయొచ్చు
న్యూఢిల్లీ: వాట్సాప్లో మనకు ఇతరులు పంపిన ఫొటోలు, వీడియోలు తదితరాలను మనం ఒకసారి డిలీట్ చేస్తే వాటిని మళ్లీ డౌన్లోడ్ చేయడం ఇప్పటివరకు సాధ్యమయ్యేది కాదు. అయితే ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్తగా తెచ్చిన ఫీచర్తో ఇది సాధ్యమే. వాట్సాప్లో ఎవరైనా పంపిన ఫైళ్లను ఫైల్ మేనేజర్లోకి వెళ్లి డిలీట్ చేసినా.. మళ్లీ ఆ ఫైల్ పంపిన వారి చాట్ విండోలోకి వెళ్లి వాటిని మరోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ వర్షన్ 2.18.106 లేదా ఆపై వర్షన్లలో ఈ అప్డేట్ ఉన్నట్లు సమాచారం. గతంలో వాట్సాప్లో ఒకరు పంపిన ఫైల్ను గ్రహీత డౌన్లోడ్ చేయగానే ఆ ఫైల్ వాట్సాప్ సర్వర్ల నుంచి డిలీట్ అయిపోయేది. ఒకవేళ గ్రహీత ఆ ఫైల్ను డౌన్లోడ్ చేయకపోతే గరిష్టంగా 30 రోజుల వరకు అది సర్వర్లలో ఉండేది. ఇకపై గ్రహీత ఫైల్ను డౌన్లోడ్ చేసినా సరే అది వాట్సాప్ సర్వర్ల నుంచి డిలీట్ అవ్వదు. కాబట్టి వినియోగదారులు ఆ ఫైల్ను తమ ఫోన్లో పొరపాటున డిలీట్ చేసినా మరోసారి డౌన్లోడ్ చేసుకోగలరు. -
పద పదవే వయ్యారి.. పావురమా..!
ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు హవా సాగుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఒడిశా పోలీసులు రాజుల కాలం నాటి పాత పద్ధతి కనుమరుగుకాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే పావురాళ్లతో సందేశాలు, వర్తమానాలు పంపించడం... మొఘల్ రాజుల కాలంలో ఈ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించారు. యుద్ధక్షేత్రాలతో పాటు అంతఃపురాల్లోకి రహస్యసమాచారాన్ని చేరవేసేందుకు ఈ పద్ధతిని పాటించారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) భువనేశ్వర్ సహకారంతో ఒడిశా పోలీసులు ఇటీవల ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. చారిత్రక వారసత్వ పరిరక్షణకు సంబంధించిన సందేశాలు పంపించేందుకు ఈ ప్రయోగం చేశారు. దీని కోసం భువనేశ్వర్ నుంచి 25 కిలోమీటర్ల దూరమున్న కటక్కు 50 పావురాళ్లను పంపించారు. గంటలోపే ఇవన్నీ గమ్యస్థానం కటక్ చేరుకున్నాయి. అయితే ఒడిశాకు ఓ ప్రత్యేకత ఉంది. వైర్లెస్, టెలిఫోన్ లింక్లు లేని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు 1946లో 200 పావురాళ్లతో కూడిన ‘ఒడిశా పావురాళ్ల సర్వీసు’ ను పోలీసుసిబ్బందికి సైన్యం అందజేసింది. మొదట కొండలతో కూడుకున్న కోరాపుట్ జిల్లా లో దీనిని ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాటు దీనిని విశ్వసనీయమైనదిగా భావించడంతో ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 700 బెల్జియన్ హోమర్ పావురాళ్లతో సందేశాలు పంపించే డ్యూటీని కొనసాగించారు. కొన్నేళ్ల పాటు మారుమూల ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల మధ్య సంబంధాలు, సమాచార మార్పిడికి ఈ విధానం ఉపయోగపడింది. ఒక చిన్న కాగితం ముక్కపై రాసిన సందేశాన్ని ఓ ప్లాస్టిక్ క్యాప్సుల్లో పెట్టి ఈ పావురాళ్ల కాళ్లకు కట్టేవారు. ఇవి 15 నుంచి 25 నిమిషాల్లోనే 25 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. ఈ రకం పావురాళ్ల జీవితకాలం 20 ఏళ్ల వరకు ఉండేది. 1982లో వరదల్లో బాంకీ పట్టణం చిక్కుకున్నపుడు, 1999లో సూపర్ సైక్లోన్, వరదల సందర్భంగా కూడా కటక్ కేంద్రంగా ఈ సర్వీసు ఉపయోగించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మెసేజ్ డిలీట్ చేయడానికి మరికొంత సమయం
వాట్సాప్లో పొరపాటున ఏదైనా మెసేజ్ ఎవరికైనా పంపితే, ఏడు నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్ చేసేవచ్చు. ఇలా మెసేజ్ను డిలీట్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ పీచర్తో సెంటర్ తనతో పాటు రిసీవర్ వద్ద కూడా మెసేజ్ను డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఏడు నిమిషాల వ్యవధి సమయాన్ని వాట్సాప్ మరింత పెంచింది. చాట్లో మెసేజ్ను డిలీట్ చేయడానికి 4,096 సెకన్ల(68 నిమిషాల 16 సెకన్ల) సమయాన్ని యూజర్లకు కేటాయించింది. అంటే వాట్సాప్ యూజర్లకు మెసేజ్ డిలీట్ చేయడానికి గంట సమయం ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అభివృద్ధి చేసిన కొత్త బీటా 2.18.69 వెర్షన్లో ఈ వ్యవధిని పెంచింది. వాట్సాప్ గురించి ఎప్పడికప్పుడు అప్డేట్స్ అందించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు తీసుకొచ్చిన ఈ ఫీచర్, ఐఓఎస్, విండోస్ ప్లాట్ఫామ్స్కు కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. డిలీట్ మెసేజ్ ఫీచర్ సమయాన్ని పెంచడం మాత్రమే కాక, ఈ కొత్త అప్డేట్లో స్వల్ప మార్పులు కూడా చేసింది. ఈ బీటాలోనే లాక్డ్ రికార్డింగ్, స్టికర్ ప్యాక్ డిస్ప్లే సైజ్ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. -
మెసేజ్, కాల్స్తోనూ పర్యావరణానికి ముప్పు
టొరంటో: మెసేజ్, కాల్స్తో పర్యావరణానికి నష్టం ఎలాగా అని ఆలోచిస్తున్నారా..? ఈ రెండింటితోనే కాదు.. మీరు డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేసే వీడియోలు, వీడియో కాల్స్, ఇంటర్నెట్ వినియోగం వీటన్నిటి వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే వీటిని ప్రాసెస్ చేయడానికి పెద్దఎత్తున డేటా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు నిరంతరాయం పనిచేస్తుంటాయి. దీంతో ఈ కేంద్రాల నుంచి భారీగా వెలువడే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2040 నాటికి పర్యావరణానికి జరిగే నాశనంలో స్మార్ట్ఫోన్స్, డేటా సెంటర్లదే అధిక భాగం ఉంటుందని హెచ్చరించారు. దీనిలో భాగంగా స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, డెస్క్టాప్స్, డేటా సెంటర్లు, ఇతర కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో వినియోగించే కర్బన ఉద్గారాలపై వారు పరిశోధన చేపట్టారు. ప్రస్తుతం ఈ రంగం నుంచి వెలువడే కర్బన్ ఉద్గారాల శాతం 1.5 గా ఉందని.. 2040 నాటికి 14 శాతానికి చేరుకుంటుందన్నారు. -
మహిళకు ఫేస్బుక్లో అసభ్య సందేశాలు
సాక్షి, మైసూరు: ఆమె పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. ఓ రక్షక భటుడి వేధింపుల నుంచి కాపాడాలని స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితురాలికి అండగా నిలవాల్సిన హెడ్కానిస్టేబుల్ సైతం వేధింపుల పర్వం మొదలు పెట్టాడు. ఫేస్బుక్లో అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపాడు. దీంతో బాధితురాలు శనివారం నగరంలోని లక్ష్మీపురం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. వివరాలు...బాధితురాలు నగరంలోని మరిమల్లప్ప పాఠశాల సమీపంలో చాట్ దుకాణం నడుపుతోంది. ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఆమెను వేధించసాగాడు. దీంతో బాధితురాలు అతనిపై ఫిర్యాదు చేయడానికి కొద్ది రోజుల క్రితం జయలక్ష్మీపురం పోలీస్స్టేషన్కు వచ్చింది. ఈ క్రమంలో న్యాయం చేస్తానని నమ్మబలికి ఆ మహిళతో పరిచయం పెంచుకున్న అక్కడి హెడ్కానిస్టేబుల్ ఫేస్బుక్లో అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపుతూ వేధించసాగాడు. పలుమార్లు హెచ్చరించినా తీరుమారకపోవడంతో. బాధితురాలు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆ రోజు వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు పంపుకున్నారో తెలుసా.?
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్గా వాట్సాప్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7500 కోట్లు మెస్సేజ్లు. గత నెల 31న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ యూజర్లు పంపిన సందేశాల సంఖ్య ఇది. ఈ విషయాన్ని వాట్సప్ తాజాగా వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక మంది యూజర్లు వాడుతున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్గా వాట్సప్ నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు మెస్సేజ్లకు తోడు 1,300 కోట్ల ఇమేజ్లు, 500 కోట్ల వీడియోలను న్యూ ఇయర్ సందర్భంగా వాట్సప్ యూజర్లు పంపుకున్నారు. అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి తరువాత వాట్సప్ కొంత సేపు పనిచేయలేదు. ఆ యాప్ను పెద్ద ఎత్తున యూజర్లు వాడడంతో క్రాష్ అయింది. కానీ సమస్యను త్వరగా చక్కదిద్దారు. దీంతో మళ్లీ వాట్సప్ సేవలు యదావిధిగా నడిచాయి. ఇందులో ప్రస్తుతం రోజుకు 100 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటున్నారు. -
ఊరకే ఫేస్బుక్ చూడటం ముప్పే!
లాస్ ఏంజెలిస్: ఫేస్బుక్లో ఏ పోస్ట్లు, మెసేజ్లు చేయకుండా కేవలం ఇతరుల పోస్ట్లను మాత్రమే చూస్తూ ఉంటే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం ఉంటుందని ఫేస్బుక్ తొలిసారిగా అంగీకరించింది. రెండు పరిశోధనలను పరిగణలోకి తీసుకుని ఫేస్బుక్ ఓ బ్లాగ్లో ఈ విషయం తెలిపింది. తొలి పరిశోధన అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులపై జరిగింది. కొంతమంది విద్యార్థులను ఎంపికచేసి వారిని పది నిమిషాలపాటు కేవలం ఇతరుల ఫేస్బుక్ పోస్ట్లను చూడమని (పోస్ట్లు, మెసేజ్లు వంటివి చేయకుండా) చెప్పారు. మరికొంత మంది విద్యార్థులకు ఇతరులకు మెసేజ్లు పంపాల్సిందిగా, పోస్ట్లు చేయాల్సిందిగా చెప్పారు. ఆ రోజు చివరకు వచ్చేటప్పటికి కేవలం ఇతరుల పోస్ట్లు చూస్తూ కూర్చున్నవారు మిగిలిన వారి కంటే నిరుత్సాహంగా, నిర్లిప్తంగా ఉన్నారు. కాలిఫోర్నియా, యేల్ విశ్వవిద్యాలయాల వారు చేసిన మరో పరిశోధన ప్రకారం...ఎక్కువగా ఇతరుల ఫేస్బుక్ పోస్ట్లు చూసేవారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. -
మొబైల్ చరిత్రలోనే అదో కీలక ఘట్టం!
పొద్దున నిద్రలేవగానే స్మార్ట్ఫోన్ యూజర్లు చేసే పని వాట్సప్ సందేశాలు (ఎస్సెమ్మెస్లు) చెక్ చేసుకోవడం. కొన్నేళ్ల కిందట ఫేస్బుక్లోనూ మన స్నేహితులు, బంధువులు, సన్నిహితులకు సందేశాలు సంపేవాళ్లం. కానీ ఇంటర్నెట్ వాడకం మొదలైన తొలిరోజుల్లో నెట్ వాడకుండా మాములుగానే ఎస్సెమ్మెస్లు పంపేవారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా.. తొలి ఎస్సెమ్మెస్ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. మొట్టమొదటిసారి 1992 డిసెంబర్ 2న నెయిల్ పాప్ వర్త్ అనే ఇంజినీర్ తొలి సందేశాన్ని పంపించారు. వోడాఫోన్ నెట్వర్క్ ద్వారా కంప్యూటర్ నుంచి ఆ ఇంజినీర్ పంపిన తొలి ఎస్సెమ్మెస్ 'మెర్రీ క్రిస్మస్'. ఆ సమయంలో వోడాఫోన్కు డైరెక్టర్ గా ఉన్న రిచర్డ్ జార్విస్ ఆ మెస్సేజ్ అందుకున్న వ్యక్తి. ఆ మరుసటి ఏడాది 1993లో నోకియా ఎస్సెమ్మెస్ లు పంపించే మొబైల్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 1999లో ఇతర నెట్వర్క్ యూజర్లకు కూడా సందేశాలు పంపడం సాధ్యమైంది. జపాన్ వారు ఎమోజీలను క్రియేట్ చేయడం అప్పట్లో సంచలనమే. ఆ తర్వాతి రోజుల్లో ఇంటర్నెట్ వాడకం, ఆపై స్మార్ట్ఫోన్లు రావడంతో నెట్ వాడి ఎస్సెమ్మెస్లు పంపడం, ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సప్ లలో తమ మిత్రులకు సందేశాల ద్వారా విషయాలను షేర్ చేసుకుంటున్నారు. తొలి సందేశాన్ని పంపిన పాప్వర్త్ ప్రస్తుత అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. '1992లో నేను పంపిన సందేశం ఇప్పుడు ఇంత ఫేమస్ అవుతోందని భావించలేదు. తొలి సందేశాన్ని పంపింది నేనేనని నా పిల్లలకు కొన్ని రోజుల కిందట చెప్పగా.. వారు ఎంతో సంతోషించారు. నా తొలి ఎస్సెమ్మెస్ మొబైల్ చరిత్రలోనే ఓ కీలక ఘట్టమని' ఇంజినీర్ పాప్వర్త్ వివరించారు. -
అడ్మిన్ తలచుకుంటే..!
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ యాప్ ‘వాట్సాప్’.. గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని అధికారాలు అప్పగించనుంది. అనవసర సందేశాలు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పోస్టు చేస్తూ.. గ్రూపులోని మిగిలిన సభ్యులను ఇబ్బందిపెడుతున్న వారిని నియంత్రించేలా యాప్లో మార్పులు చేస్తోంది. అడ్మిన్ తలచుకుంటే ఇలాంటి సందేశాలను నిలిపేయవచ్చని.. కొత్త సాంకేతికతను పరీక్షించే డబ్ల్యూఏ బీటా ఇన్ఫో వెబ్సైట్ వెల్లడించింది. గూగుల్ ప్లేలో అందుబాటులో ఉన్న వాట్సాప్ బీటా వెర్షన్ 2.17.430లో ఈ సదుపాయం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఈ సదుపాయాన్ని కేవలం గ్రూపు అడ్మిన్లు మాత్రమే వినియోగించుకోవచ్చు. ఒక్కసారి సదరు సభ్యుడిని ఈ జాబితాలో చేరిస్తే.. ఆ సభ్యుడు గ్రూపులోని ఇతరులు పంపే సందేశాలను చదివేందుకు మాత్రమే వీలుంటుంది. తన సందేశాన్ని గ్రూపు సభ్యులందరికీ చేరవేయాలనుకుంటే సందేశాన్ని టైప్ చేసి ‘మెసేజ్ అడ్మిన్’ బటన్ నొక్కాల్సి ఉంటుంది. దీన్ని అడ్మిన్ ధ్రువీకరిస్తేనే ఈ మెసేజ్లు పోస్ట్ అవుతాయి. -
అమ్మాయిలా నటిస్తూ..
సాక్షి, సిటీబ్యూరో: అమ్మాయిగా నకిలీ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసి ఫ్రెండ్ లిస్ట్లో యాడ్ అయిన మహిళలు, అమ్మాయిలకు నగ్నచిత్రాలు, అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ రాజకీయ పార్టీకి చెందిన మహిళా కార్యకర్త పట్ల ఇదే తరహాలో బెదిరింపులకు పాల్పడటంతో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని హైదరాబాద్ ఆదర్శ్నగర్కు చెందిన దుర్గాప్రసాద్గా గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్ఫోన్, ఇంటర్నెట్ రౌటర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం...నిందితుడు దుర్గాప్రసాద్ బీఫార్మసీ పూర్తి చేశాడు. కడపకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి పగ పెంచుకున్న అతను హారికరెడ్డి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసి ఆమె ఫొటోలను సోషల్ మీడియా ద్వారా డౌన్లోడ్ చేసుకొని అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె అతడిని బ్లాక్ చేయడంతో అప్పటి నుంచి మహిళలు, అమ్మాయిలకు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం మొదలెట్టాడు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన నగ్నచిత్రాలు, సెల్ఫీ వీడియోలను పంపుతూ అమ్మాయి అనేలా నమ్మించేవాడు. జూలై నెలలో మియాపూర్ ఠాణాలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. అయినా తీరుమారని నిందితుడు అసభ్యకర ఫొటోలు, వీడియోలను ఫేస్బుక్లో ఫ్రెండ్గా అడ్ అయిన మహిళలకు పంపేవాడు. అతడి ఫ్రెండ్ లిస్ట్లో దాదాపు 958 మంది అమ్మాయిలుండగా వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలే అధికం కావడం గమనార్హం. ఇదే తరహాలో ఫెమినిస్టు, రాజకీయ పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తకు హారికరెడ్డి ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. దానిని ఓకే చేసిన బాధితురాలికి కొన్ని రోజుల తర్వాత అసభ్యకర ఫొటోలు, అభ్యంతరక వ్యాఖ్యలు వచ్చాయి. అలాంటివి ఎందుకు పంపిస్తున్నావని అరా తీయగా, అదే ఐడీ నుంచి వాయిస్ కాల్ మెసేంజర్ వచ్చింది. అయితే ఐడీ అమ్మాయి పేరు కనబడుతున్నా, గొంతు మాత్రం అబ్బాయిదిగా వినిపించింది. ఆ తర్వాత వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, వివిధ సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్టు చేసి పరువు తీస్తానని బెదిరించడంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. ఫేస్బుక్ అధికారులు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా నిందితుడు హైదరాబాద్ ఆదర్శ్నగర్కు చెందిన దుర్గాప్రసాద్గా గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఇతడి వల్ల మరెవరైనా మోసపోయారా, వేధింపులకు గురయ్యారా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దారి తప్పిన గురువుకు దేహశుద్ధి
శ్రీకాకుళం(నరసన్నపేట): విద్యార్థినులను సొంతబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. సెల్ఫోన్లలో అసభ్యకర సందేశాలు పంపుతూ ఆడపిల్లలను వేధించసాగాడు. గురువే కదాని తొలుత వారంతా మౌనంగా భరించారు. అతనిలో మార్పు రాకపోవడంతో తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన బాలికల తల్లిదండ్రులు.. దారి తప్పిన ఆ గురువుకు చెప్పులతో కొట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం రహదారిపై ఊరేగిస్తూ తీసుకెళ్లి, పోలీసులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సింగూరు అంబోజీరావు.. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. 8, 9వ తరగతులు చదువుతున్న ఐదుగురు విద్యార్థినులకు అసభ్యకర నందేశాలు పంపేవాడు. తనను ప్రేమించాలని కొందరికి, అసభ్యకరంగా మరికొందరికి మెసేజ్లు పంపించేవాడు. అతని చర్యలకు విసుగుచెందిన విద్యార్థినులు.. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన వారంతా అంబోజీరావు కోసం వల పన్ని, ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టుకున్నారు. అసభ్య మెసేజ్లపై నిలదీశారు. అనంతరం దేహశుద్ధి చేశారు. కాంప్లెక్స్ నుంచి స్కూల్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ మహిళలు చెప్పులతో కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. రోడ్డుపై నడిపించుకొని వెళ్లాలని కొందరు పట్టుబట్టారు. దీంతో కొద్ది దూరం అతని షర్టు తీసి, నడిపించారు. అనంతరం నరసన్నపేట ఏఎస్సై రమేష్ అతనిని స్టేషన్కు తరలించారు. పిల్లల ఫోన్లకు వచ్చిన మెసేజ్లను పోలీసులు పరిశీలించారు. ఈ వ్యవహారంపై ప్రిన్సిపాల్ వాసుదేవరావు తీరును కూడా తల్లిదండ్రులు వ్యతిరేకించారు. గతంలో ఒకసారి ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశామని, ఆయన స్పందించలేదని తెలిపారు. దీనిపై ప్రిన్సిపాల్ను సైతం నిలదీశారు. గతంలో అంబోజీరావుకు హెచ్చరించానని వాసుదేవరావు పోలీసుల ఎదుట తెలిపారు. -
ఆ మెసేజ్లు పంపింది మహిళ!
అనంతపురం సెంట్రల్ : నగరపాలక సంస్థ మేయర్ మదమంచి స్వరూప, ఎమ్మెల్యే వి.ప్రభాకర్చౌదరిలకు సెల్ఫోన్ ద్వారా బెదిరింపులతో కూడిన సందేశాలను పంపినది ఓ మహిళ అని తేలింది. అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ అంశంపై శుక్రవారం రాత్రి మేయర్ స్వరూప ఎస్పీ కార్యాలయానికి వచ్చి వెళ్లారు. మెసేజ్లు పంపుతున్న మహిళ పూర్తి వివరాలను మరో రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. -
బయోమెట్రిక్ లోపాలు.. డీలర్లకు కాసులు
వేముల : పెద్దజూటూరు గ్రామానికి చెందిన ఇతని పేరు వనిపెంట వెంకట్రామిరెడ్డి. ఈనెల 13వ తేదీన విత్తనాల కోసం బయోమెట్రిక్లో వేలిముద్రలు వేశారు. విత్తనాలు తీసుకోకున్నా.. 5 సంచులు ఇచ్చినట్లు సెల్కు మెసేజ్ వచ్చింది. సెల్ మెసేజ్ డీలర్కు చూపితే తీసుకెళ్లావని అంటున్నాడు. అధికారులు కూడా డీలర్కు వంతపాడుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.. ఇలా ఇచ్చుకుంటూ పోతే నష్టాలు వస్తాయని డీలర్ అంటున్నాడని రైతు వాపోయాడు. నా సెల్కు మెసేజ్ వచ్చినా విత్తనాలు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారు. – ఇతని పేరు ఖాదర్. మండలంలోని మీదిపెంట్లకు చెందిన రైతు. విత్తనాల కోసం బయోమెట్రిక్లో వేలిముద్రలు వేశాడు. సెల్కు వచ్చిన మెసేజ్ను గోడౌన్ వద్ద డీలర్కు చూపించాడు. నీవు తీసుకెళ్లావని అంటున్నాడు. ఈ విషయాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. సెల్కు వచ్చిన మెసేజ్పై అధికారులు ఆరా తీయడంలేదు. జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల మంది రైతులు ఇలాంటి మెసేజ్లతో విత్తనాలు అందక అవస్థలు పడుతున్నారు. వాటిని ఆసరాగా తీసుకున్న డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రబీ సాగుకు శనగ విత్తనాల పంపిణీకి ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ డీలర్లకు కాసులు కురిపిస్తోంది. విత్తనాలు తీసుకోకున్నా రైతుల సెల్లకు మెసేజ్లు వస్తున్నాయి. ఇలా వస్తే స్టాకు తీసుకున్నట్లు ఆన్లైన్లో నమోదు అవుతుంది. ఒక్కో మండలంలో 40నుంచి 50మంది దాకా బాధితులు ఉన్నారు. ఇలాంటి మెసేజ్లవల్ల సరాసరి ఒక్కో రైతుకు క్వింటాల్కు చొప్పున 40నుంచి 50క్వింటాళ్ల దాకా విత్తనాలు దారి మళ్లించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. బయట మార్కెట్కు అమ్మితే నాలుగైదు లక్షల వరకు గిట్టుబాటు అవుతుందని డీలర్లు లెక్కలేసుకున్నట్లు తెలుస్తోంది. మండలాల్లో బయోమెట్రిక్ మిషన్లో లోపాలు ఉండటంతో రైతులు విత్తనాలు తీసుకోకున్నా.. తీసుకున్నట్లు సెల్లకు మెసేజ్లు వస్తున్నాయి.సాధారణంగా మిషన్లో వేలిముద్ర అక్టివేట్ అయిన వెంటనే ఎంత భూమి, ఎన్ని బ్యాగ్లు, ఎంత మొత్తం చెల్లించాలనే వివరాలు రావాలి. అలా కాకుండా కొంతమంది రైతులకు నేరుగా విత్తనాల బ్యాగ్లు ఇచ్చినట్లు వస్తోంది. సెల్ మెసేజ్ను తీసుకెళ్లి డీలర్ల వద్ద చూపితే ఇక నీకు విత్తనాలు రావని చెబుతున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు లక్షల సొమ్ము చేసుకుంటున్న డీలర్లు : రైతులకు విత్తనాలు ఇచ్చినట్లు మెసేజ్ ఆధారంగా డీలర్లు విత్తనాలను స్వాహా చేసి బయట మార్కెట్కు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఒక్కో మండలంలో డీలర్లు నాలుగైదు లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. బయో మెట్రిక్లో లోపాలు తలెత్తడంతో అన్నదాతలకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. ఈ మెసేజ్ల ఆధారంగా స్టాకు డీలర్లు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. విత్తనాలు అందేలా చర్యలు విత్తనాలు తీసుకోకున్నా తీసుకున్నట్లు రైతుల సెల్లకు మెసేజ్లు వస్తున్న మాట వాస్తవమే. బయోమెట్రిక్లో సాంకేతిక లోపాలతో అలా వచ్చి ఉండవచ్చు. వివరాలను తీసుకొని రైతులకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటాం. విత్తనాలను ప్రక్కదారి మళ్లించే డీలర్లపై చర్యలు తీసుకుంటాం. – జమ్మన్న(వ్యవసాయ శాఖ ఏడీ), పులివెందుల -
ఆన్లైన్ స్నేహాలు
మెసేజ్లతో పెరుగుతున్న అనుబంధాలు వాట్సప్, ఫేస్బుక్ల్లో ప్రత్యేక గ్రూపులు నేడు ఫ్రెండ్షిప్ డే సిద్దిపేట రూరల్ / జోగిపేట: స్నేహం.. ఓ మధురానుభూతి. అది కలకాలం నిలిచిపోతుంది. దీనికి గుర్తుగా ఓ మంచి బహుమతి ఇవ్వాలని స్నేహితులు ఆరాటపడుతుంటారు. ఏటా ఆగస్టు తొలి ఆదివారం జరుపుకొనే ఫ్రెండ్షిప్డే కోసం చిన్నపెద్దా ఎదురుచూస్తుంటారు. స్నేహనికి మధురస్మృతిగా చక్కటి బహుమతితో ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతారు. కానీ నేడు కొంచెం ట్రెండ్ మారింది. సోషల్ మీడియా అనుబంధాలకు వేదికగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరికి అరచేతిలోనే టెక్నాలజీని వాడేస్తున్నారు. వాట్సప్, ఫేస్బుక్ గ్రూపులు ఉండడంతో ప్రతి పండుగకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఒక్క మెసేజ్ పోస్టుతో స్నేహితులందరికి శుభాకాంక్షలను సులువుగా చెపుతున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ఫ్రెండ్షిప్ బాండ్లు కడతారు.. ఎస్.ఎం.ఎస్ లతో గ్రీటింగ్స్ చెబుతారు.. కుదిరితే కవ్పు కాఫీ, కాకుంటే కబుర్లు చెవ్పుకుని సరదాగా గడువుతారు. స్నేహితులు లేని మనిషి జీవితం ఒయాసిస్ లేని ఎడారిలాంటిదనే చెప్పవచ్చు. ’నీ వెంట నేనున్నా’ అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. ఓటమిలో ఓదార్చేవాడే స్నేహితుడని చెప్పవచ్చు. ప్రస్తుత హైటెక్ యుగంలో.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతులో వాట్సప్, ఫేస్బుక్ ఉంటుంది. వీటికి భలే క్రేజీ ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఆన్లైన్ స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. వాట్సప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరు పలకరించుకునే అవకాశం లభిస్తుంది. స్నేహితులు వాట్సప్, ఫేస్బుక్ల్లో ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రూపుల్లో మంచి, చెడులను పోస్టు చేస్తున్నారు. పోస్టులకు లైక్లు కొడుతూ, షేర్లు చేస్తూ అభిరుచులను పంచుకుంటున్నారు. సిద్దిపేటలో 2005లో టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులంతా కలిసి ‘స్కూల్మెట్స్’ అని వాట్సప్ గ్రూపును క్రియేట్ చేశారు. ఇందులో ఒకరినొకరు పలకరిస్తూ, స్నేహభావాన్ని పంచుకుంటున్నారు. స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో, ఉద్యోగులు ఇలా గ్రూపులను ఏర్పాటు చేసుకుని స్నేహ సౌరభాన్ని ఆన్లైన్ వేదికగా కొనసాగిస్తున్నారు. ఒక్క స్మార్ట్ ఫోన్లో సుమారు 10కి పైగానే గ్రూపులు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. స్నేహంలో స్వార్థం ఉండకూడదు ఆపదలో ఉండి ధైర్యాన్ని ఇచ్చే వాడే నిజమైన స్నేహితుడు. స్వార్థంతో స్నేహం చేయడం మోసమే. స్నేహితుల మధ్య పెరిగేది స్నేహం పెరగాలే తప్ప తగ్గకూడదు. ఓటమిలోనూ నీవెంట నేనున్నానంటూ ధైర్యమివ్వాలి. ఏళ్ల తరబడి స్నేహం చేసిన వారు ఈ సమాజంలో ఉన్నారు. కష్ట, సుఖాలలో కలిసి జీవించే వాడినే స్నేహితులుగా ఎన్నుకోవడం మంచిది. - అశోక్, చేనేత సహకార సంఘం చైర్మన్ నాకు తల్లిదండ్రులు స్నేహితులే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు స్నేహితులే. నేను పుట్టినప్పటి నుంచి అంధుడిగా ఉండడం వల్ల నా ఆలనా పాలనా చూస్తూనే స్నేహితులుగా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తల్లిదండ్రుల కంటే స్నేహితులంటేనే నాకు తృప్తి ఉంటుంది. స్నేహితుల కంటే ఎక్కువగా అన్ని విషయాల్లోనూ నాతో చర్చిస్తుంటారు. భగవంతుడు మరో జన్మలో కూడా ఇలాంటి తల్లిదండ్రులనే ఇవ్వాలని కోరుకుంటాను. - విజయ్కుమార్, లెక్చరర్ -
ఆ రోబోను చంపొద్దంటూ వినతులు!
పెర్మ్: రష్యాలోని పెర్మ్ నగరంలో ఇటీవల సైంటిస్టుల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చిన ప్రోమోబోకు అక్కడి ప్రజల మద్దతు పెరుగుతోంది. కస్టమర్ రిలేషన్స్లో సహాయకారిగా పనిచేసేందుకు తయారు చేసిన ఈ రోబో.. రోడ్డుమీద చెక్కర్లు కొట్టడానికి వెళ్లడంతో తయారీదారులు దానిని రీసైక్లింగ్ చేయాలని భావించారు. అయితే.. అనూహ్యంగా ప్రజలు రోబోకు మద్దతు పలుకుతూ దానిని చంపొద్దంటూ శాస్త్రవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కసారి కలిసిన కస్టమర్ను కూడా ఎప్పటికీ గుర్తుంచుకొని వారికి సహాయం అందించేలా ప్రోమోబో రూపొందించబడింది. ఇది కొత్త కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడానికి తోడ్పడుతుంది. అయితే, అనూహ్యంగా అది రోడ్డు మీదకు వచ్చి ప్రాణాలమీదకు తెచ్చుకోవటంతో.. దానికి గల తిరగాలనే కాంక్షే దానిని రోడ్డు మీదకు రప్పించిందనీ, అంతమాత్రానికే దానిని చంపేస్తారా అంటూ పలువురు రోబో తరపున శాస్త్రవేత్తలను ప్రశ్నిస్తున్నారు. దాని ఫ్రీడం కోసమే అది ఇలా చేసిందని కొందరు అంటుంటే.. మరికొ్ందరు మాత్రం అది అలా ప్రవర్తించడానికి గల కారణాన్ని తెలుసుకొని సరిచేస్తే సరిపోతుందని దానిని రీసైక్లింగ్ చేయొద్దని సోషల్ మీడియాలో తయారీదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఫోన్లో మహిళలను వేధిస్తున్న వ్యక్తి అరెస్టు
►200 మందికి పైగా ‘కాల్స్’ ► బాధితుల్లో బ్యూటీషియన్లు, ► డాక్టర్లు,లేడీ టైలర్లు చిలకలూరిపేటటౌన్: మహిళల సెల్ఫోన్లకు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో వేధిస్తూ మెసేజ్లు పెడుతున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నూతన మోడల్ పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ బి.సురేష్బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న ఓ మహిళ ఈ నెల 17వ తేదీన తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడడంతో పాటు అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే పలువురు మహిళల నుంచి ఇదే రకమైన మౌఖిక ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఈ విషయాన్ని సవాలుగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. వారి విచారణలో నిందితుడి ఆచూకీ తెలిసింది. రేపల్లెకు చెందిన కౌతరపు చిరంజీవిరావు అనే వ్యక్తి ప్రస్తుతం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ అదే క్వార్టర్సలో నివాసం ఉంటున్నాడు. తనకు దొరికిన ఓ సిమ్కార్డుతో పాటు ఐడీ ప్రూఫ్లు సమర్పించని మరో సిమ్కార్డును ఉపయోగిస్తూ మహిళలకు ఫోన్లు, మెసేజ్లు పంపసాగాడు. బ్యూటీపార్లర్ల బోర్డులపై, ఆసుపత్రి బోర్డులు, లేడీటైలర్ల బోర్డులపై ఉన్న సెల్ ఫోన్ నంబర్లను సేకరించి స్థానిక మహిళలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలను వేధించసాగాడు. పోలీసు విచారణలో ఇతను సుమారు 200 మంది మహిళలను వేధించినట్లు బయటపడింది. రెండు నంబర్ల ద్వారా కేవలం మహిళలకు మాత్రమే ఫోన్ చేస్తూ ఇతరులకు ఆ నంబర్ల ద్వారా ఫోన్ చేయకుండా జాగ్రత్త పడేవాడు. పోలీసులు బాధిత మహిళలతో ట్రాపింగ్ చేసి నిందితుడిని పట్టుకున్నట్లు సమాచారం. నిందితుడిని పట్టుకొన్న ఎస్ఐ ఎం.ఉమామహేశ్వరరావుతో పాటు సిబ్బంది ఎస్. షాబుద్దీన్, బి.రమేష్లకు సీఐ అభినందనలు తెలియజేశారు. ఎస్పీ పంపిన క్యాష్ రివార్డును ఇద్దరు సిబ్బందికి అందజేశారు. నిందితుడిని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో పట్టణ ఎస్ఐలు షేక్ నఫీస్బాషా, పి కోటేశ్వరరావు, ఎం.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలి ఎవరైనా మహిళలకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడినా, మెసేజ్లు పంపినా, ఫేస్బుక్, వాట్సప్ ద్వారా వేధించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సురేష్బాబు తెలిపారు. ఫిర్యాదు చేసిన మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.