Motion Poster
-
రాజ్ తరుణ్ కొత్త చిత్రం.. ఆసక్తిగా టైటిల్
గతేడాది వరుస సినిమాలతో మెప్పించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్. తిరగబడరా స్వామీ, భలే ఉన్నాడే లాంటి చిత్రాలతో అలరించారు. కొత్త ఏడాదిలో అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హీరో. తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియోను విడుదల చేశారు.ఈ చిత్రానికి పాంచ్ మినార్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ కడుముల దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ చిత్రంలో అజయ్ గోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనెక్ట్ మూవీస్ బ్యానర్పై గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు.వివాదంలో రాజ్ తరుణ్..అయితే సినిమాలతో పాటు అలరించిన రాజ్.. గతేడాదిలో ఓ వివాదంలోనూ చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ వివాదం నడుస్తుండగానే తిరగబడరాసామీ మూవీ విడుదలైంది. ఈ వ్యవహారంలో మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పేరును కూడా లావణ్య ప్రస్తావించింది. తన వల్లే రాజ్ తరుణ్ దూరమయ్యాడని ఆరోపించింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. 🎉 Happy New Year 2025 🎉This New Year, the craziness knows no limits with Extra Minar🔥Here’s the fascinating first-look motion poster of #PaanchMinar 🤩-- https://t.co/VbfZtKmgf0Gear up for the kickass crime comedy entertainer in theatres soon⌛️@RashiReal_ pic.twitter.com/ci2ehyUYSW— Raj Tarun (@itsRajTarun) January 1, 2025 -
‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!
‘ది రాజాసాబ్’ అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ది రాజాసాబ్’. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని చేతిలో సిగార్ పటుకొని మహారాజులా కూర్చున్నాడు. మొత్తంగా ఈ సినిమాలో ప్రభాస్ని ఓ డిఫరెంట్ లుక్లో చూపించబోతున్నట్లు మోషన్ పోస్టర్తో చెప్పేశాడు డైరెక్టర్ మారుతి. (చదవండి: ఒకే ఒక మాటతో ట్రెండింగ్లోకి వచ్చేసిన ‘స్పిరిట్’)ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
ఈశ్వర్ సినిమాలొ ప్రభాస్ ఫ్రెండ్, మూగవాడిగా నటించి తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు హను కోట్ల. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురుచూశారు.. ఇప్పుడు ‘ది డీల్’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం కాబోతున్నాడు. సిటడెల్ క్రెయేషన్, డిజిక్విస్ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరో, దర్శకుడు డాక్టర్ హను కోట్ల పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండు బాగాలు గా రాబోతున్న ఈ మూవీ మొదటి భాగం మొత్తం హైదరాబాద్ లో.. కొంత మలేషియాలో చిత్రికరించామని, మలి భాగాన్ని మొత్తం మలేషియలో షూటింగ్ చేసి చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ చిత్రం మొదటి భాగం దసరాకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లుగా చందన, ధరణి ప్రియా నటించగా రఘు కుంచె, రవి ప్రకాష్, మహేష్ పవన్, గిరి, వెంకట్ గోవాడ, శ్రీవాణి, సుజాత దిక్షిత్, సురభి లలిత ముఖ్య పాత్రలు పోషించారు. -
మంచి కంటెంట్ ఉంటే చాలు..ఇండస్ట్రీలో నిలబడొచ్చు: శివాజీ
విశ్వంత్, శిల్ప మంజునాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్. సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బసిరెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ని సీనియర్ హీరో శివాజీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలు మరో ఫెంటాస్టిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్మున్ననని అన్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఈమధ్య ఎక్కువగా వస్తుంది అని, ఇది చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు అవకాశం అందుకోవడం చాలా సులభతరం అయిందని.. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నిలబడొచ్చని నటుడు శివాజీ పేర్కొన్నారు. ‘ ఈ చిత్రం నుంచి ఎలాంటి కంటెంట్ వచ్చిన అది కచ్చితంగా బ్లాస్ట్ అయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరిని రంజింప చేస్తుందని ప్రామిస్ చేస్తున్నాను’అని డైరెక్టర్ బసిరెడ్డి రానా అన్నారు. -
'యావరేజ్ స్టూడెంట్ నాని' మోషన్ పోస్టర్ రిలీజ్
దర్శకులు హీరోలుగా, హీరోలు దర్శకులుగా మారి సక్సెస్ అందుకొంటున్నారు. 'మెరిసే మెరిసే' మూవీతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా మెప్పించాడు. ఇప్పుడు ఇతడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. 'యావరేజ్ స్టూడెంట్ నాని' అనే చిత్రంతో హీరో, దర్శకుడు, నిర్మాతగా పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)యూత్ఫుల్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదివరకే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. శక్తి శ్రీ గోపాలన్ పాడిన పాట బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తుంటే, హీరోహీరోయిన్ల జోడి ఎంతో చూడముచ్చటగా అనిపించింది. ఈ సినిమాలో సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్లు హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతమందించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: మిడిల్ క్లాస్ కష్టాలతో 'మ్యూజిక్ షాప్ మూర్తి' ట్రైలర్) View this post on Instagram A post shared by Sri Neelakanta Mahadeva Entertainments LLP (@snmmovies) -
‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేస్తోంది!
‘డీజే టిల్లు’ వంటి హిట్ మూవీతో యూత్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. బుధవారం (ఫిబ్రవరి 7) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సిద్ధు నటిస్తున్న రెండు చిత్రాల (టిల్లు స్క్వేర్, జాక్) అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాక్’ అనే టైటిల్ ఖరారు చేసి, మోషన్పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్లైన్. ‘‘ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. త్వరలో ట్రైలర్: ‘డీజే టిల్లు’కి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా నుంచి స్పెషల్ బర్త్డే గ్లింప్స్ను విడుదల చేసింది యూనిట్. ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మార్చి 29న సినిమా రిలీజవుతోంది. -
ఆ కిక్కే వేరు రా!
‘‘నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానంటే, దానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ అక్కర్లేదు రా..! నేను చాలు..! ట్వంటీఫోర్ హవర్స్ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది.. నాది అని చెప్పుకోవడానికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే.. ప్చ్.. ఆ కిక్కే వేరు రా..!’’ అనే డైలాగ్స్తో కూడిన వాయిస్ ఓవర్తో మొదలవుతుంది ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మోషన్ పోస్టర్. హీరోయిన్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ ప్రపంచం ప్రేమకథలతో నిండిపోయి ఉంది. కానీ ఈ ప్రేమ కథల్లో ఇప్పటివరకు ఎవరూ వినని, చూడనవి కూడా ఉన్నాయి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం అలాంటిదే’’ అని ట్వీట్ చేశారు రష్మికా మందన్నా. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
'షరతులు వర్తిస్తాయి' లాంటి సినిమాలను ఆదరించాలి: త్రివిక్రమ్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ...మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని.. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని.. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి తెలిపారు. కుటుంబ విలువలను తెలియజేసే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు. మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు కుమార స్వామి (అక్షర) అలాగే చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు’అని అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ. ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు కుమార స్వామి అన్నారు. -
ఆదిపురుష్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మోషన్ పోస్టర్ రిలీజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు మేకర్స్. అక్షయ తృతీయ సందర్భంగా ఆదిపురుష్ టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. జై శ్రీరామ్ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'మా బలమేదంటే మీ పై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే... మహిమాన్విత మంత్రం నీ నామమే.' అంటూ సాగింది. చివర్లో జై శ్రీరామ్ నామస్మరణతో హోరెత్తించింది. హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మోషన్ పోస్టర్లను ప్రభాస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మీరు ఛార్ ధామ్ దర్శించుకోలేదా.. అయితే జై శ్రీరామ్ నామాన్ని జపించండి చాలు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. గతంలో ఈ సినిమా టీజర్ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. -
వినోదం.. సందేశం
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వంలో ఎమ్. నాగ మునెయ్య నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ను నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘‘ఓ బర్నింగ్ ప్రాబ్లమ్కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ఇది. వినోదంతో పాటు సందేశం కూడా ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, సహనిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్ – నందిపాటి శ్రీధర్ రెడ్డి. -
‘మెకానిక్’ మంచి విజయం సాధించాలి: దిల్ రాజు
‘మెకానిక్’ చిత్రం మంచి విజయం సాధించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. మణిసాయితేజ, రేఖనిరోషా హీరోహీరోయిన్ల్గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగ మునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ని దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా ‘మెకానిక్’ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసిన దిల్ రాజుకు దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంకంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది.తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. -
దిల్ రాజు చేతుల మీదుగా ‘మెకానిక్’ మోషన్ పోస్టర్!
మణిసాయితేజ, రేఖనిరోషా హీరోహీరోయిన్ల్గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటున్న ఈచిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. -
కృష్ణగాడి లవ్స్టోరీ
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రాజేష్ దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమాను పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్ కే శ్రీలత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేసి, ఆసక్తికరంగా ఉందన్నారు. ‘‘ఫీల్గుడ్ లవ్స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సాబు వర్గీస్ సంగీతం, ఎస్కే రఫి కెమెరా వర్క్ హైలైట్గా నిలుస్తాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: చుంచు భాను ప్రకాష్, హరిహర ప్రసాద్ పెట్లా. -
విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఓ సాథియా మోషన్ పోస్టర్
ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ తెలుగు మూవీ ఓ సాథియా. ఈ సినిమా నిర్మాత, డైరెక్టర్ మహిళలు కావటం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్పై చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. జి జాంబీ అనే చిత్రంతో ఇప్పటికే హీరో పరిచయం అయిన ఆర్యన్ గౌర్కు ఇది రెండవ సినిమా. ఇటీవల ఈ మూవీ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ను ప్రముఖ లెజెండరి రైటర్, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్కు యూట్యూబ్లో మంచి స్పందన అభిస్తోంది. మోషన్ పోస్టర్ వన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ప్యూర్ లవ్స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకు విన్ను సంగీతం అందించారు. ఈ మోషన్ పోస్టర్కు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ నుంచి రెండోపోస్టర్ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. It's 1Million + Views for our First look Motion poster..Thanks for the immense response #osaathiya #motionposter@AryanGowra @IMishtii pic.twitter.com/uVahXwzYCK — Thanvika Jashwika Creations (@tjcreations123) January 9, 2023 -
హెబ్బా పటేల్ 'అలా నిన్ను చేరి' మోషన్ పోస్టర్ వచ్చేసింది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అలా నిన్ను చేరి. హుషారు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో దినేష్ తేజ్ మరోసారి ఈ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా షురూ చేసి నూతన సంవత్సర కానుకగా అలా నిన్ను చేరి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టైటిల్ లోగో పోస్టర్ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఓ పక్క పల్లెటూరు, మరోపక్క మెట్రో సిటీ.. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ హీరోని బ్యాక్ నుంచి చూపించారు. పోస్టర్ చూస్తుంటే పల్లెటూరు నుంచి కెరీర్ కోసం సిటీకి చేరిన కుర్రాడు.. అమ్మాయి ప్రేమలో పడి తన జర్నీ ఎలా సాగించాడనేదే సినిమా కథ అని తెలుస్తోంది. ‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనంద్ అందిస్తుండగా.. ఆండ్రూ కెమెరామెన్గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా విఠల్, ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు. చదవండి: ఎయిట్ ప్యాక్తో దర్శనమిచ్చిన హృతిక్ రోషన్, ఫోటోలు వైరల్ సంపూర్ణేశ్కు రూ.25 లక్షలు ఫైన్, తారక్ ఏం చేశారంటే? -
బిగ్బాస్ ఫేం సన్ని, సప్తగిరి హీరోలుగా ‘అన్స్టాపబుల్’
బిగ్బాస్ సీజన్ 5 విజేత వీజే సన్నీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అన్స్టాపబుల్. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అనేది ఉపశీర్షిక. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కమెడియన్ సప్తగిరి మరో హీరోగా నటిస్తుండగా.. నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్ల. ఈ సినిమా మోషన్ పోస్టర్ను శనివారం నిర్మాత దిల్రాజు విడుదలచేశాడు. రజిత్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్ బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కుటుంబంతో సహా నవ్వుకునే చిత్రమిది’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘సినిమాలపై ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చాను’’ అన్నారు రజిత్ రావు. ఈ సినిమాకు షేక్ రఫీ, బిట్టు(నర్సయ్య న్యవనంది) సహా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. -
ప్రియమణి 'డాక్టర్ 56' మోషన్ పోస్టర్ రిలీజ్
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం డాక్టర్ 56. రాజేష్ ఆనందలీల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇక తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వదిలారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని డిసెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. చదవండి: హీరోయిన్పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి ఈ సందర్భంగా ఈ మూవీ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ అలా సస్పెన్స్గా వదిలేశారు. మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్శెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు. -
'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?'.. ఆసక్తికరంగా కొరమీను టైటిల్ పోస్టర్
ఆనంద్ రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కొరమీను'. ఈ సినిమాకు శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టైటిల్ కూడా వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ను హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఆ పోస్టర్ విడుదల చేశారు. ఆనంద్ రవి ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా ఓ బోట్ మీద ఆ లైన్స్ కనిపించాయి. 'కోరమీను' ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తే సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథగా తెలుస్తోంది. సముద్ర తీరంలో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ ఆసక్తి కలిగించేలా ఉంది. ఒక బోట్ పై 'మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?' క్యాప్షన్ కూడా రాసి ఉంది. దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. 'ఈ మూవీలో జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో కథ సాగుతుంది. ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది' అని అన్నారు. కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
జ్వాలాబాయిగా మమతా మోహన్ దాస్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
ఎం.ఎల్.ఏ, రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'. రాజన్న, బాహుబలి, బాహుబలి2, ఆర్. ఆర్.ఆర్, అఖండ చిత్రాలకు రైటర్గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు లుక్ కు మంచి స్పందన వస్తోంది. ఆయన ఈ చిత్రంలో 'భీమ్ రావ్ దొర' గా కనిపించనున్నారు. ఇక తాజాగా 'రుద్రంగి' సినిమా నుంచి మమతా మోహన్ దాస్ నటిస్తున్న జ్వాలాబాయి దొరసాని పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు.ఈ మోషన్ పోస్టర్ లో జ్వాలాబాయి దొరసాని పాత్రలో మమతా మోహన్ దాస్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'నువ్వు దొర అయితే నేను దొరసానిని తగలబెడతా, ఛల్ హట్' అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ మాస్ను ఉర్రూతలూగిస్తున్నాయి. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు కీలకపాత్రల్లో కనిపించన్నునారు. సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. -
నందమూరి తారకరత్న 'సారథి' మోషన్ పోస్టర్ విడుదల
నందమూరి తారకరత్న హీరోగా నటించిన తాజా చిత్రం సారథి. జాకట రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైశాలి హీరోయిన్గా నటించారు. పంచభూత క్రియేషన్స్పై పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి. సిద్ధేశ్వర్ రావు నిర్మించిన ఈ మూవీ మోషనల్ పోస్టర్ని విడుదల చేశారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఖోఖో గేమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్లో చిత్రీకరించాం. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఆలోచన అందరిలో రేకెత్తించేలా మా సినిమా ఉంటుంది. కరోనా మహమ్మారిలో ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమాను పూర్తి చేసినందుకు తారకరత్నికి ధన్యవాదాలు. సిద్ధార్థ్ వాటికన్ సంగీతం అలరిస్తుంది' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మనోహర్ కొల్లి. -
‘రుద్రంగి’ ఫస్ట్లుక్, భీమ్రావ్ దొరగా జగపతిబాబు
జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్గా చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్పై ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మించారు. ‘రుద్రంగి’ ఫస్ట్లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘రుద్రంగి నాది.. రుద్రంగి బిలాంగ్స్ టు మీ’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ వినిపిస్తుంది. జాలి, దయ లేని భీమ్ రావ్ దొరగా జగపతిబాబుని పరిచయం చేశారు. ‘‘త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి నాఫల్ రాజా సంగీతం అందిస్తున్నారు. first innings chusaru, second innings chusaru, third innnings chudabothunaru.. mee #BheemRaoDhora from #Rudrangi movie. pic.twitter.com/NWdYfmbWjR — Jaggu Bhai (@IamJagguBhai) October 3, 2022 -
సమంత 'శాకుంతలం' నుంచి క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ అప్పుడే
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో డిఆర్పి, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పౌరణిక నేపథ్యంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శాకుంతలగా సమంతగా నటిస్తుండగా, దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్ను విడుదల చేసిన మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. నవంబర్4న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. -
టీజర్ చూస్తే బ్లాస్టింగ్
‘‘వేద’ చిత్రం మోషన్ పోస్టర్ చాలా బాగుంది. టీజర్ చూస్తే బ్లాస్టింగ్. ఆ ఏడు కొండలులాగా ఈ సినిమాకు ఏడుగురు నిర్మాతలు ఉన్నారు.. ఇక్కడే వీరు సక్సెస్ అయ్యారు. ఈ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వేద’. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్రకనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని(అమెరికా) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని సుకుమార్ విడుదల చేయగా, రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్ను లాంచ్ చేశారు. ‘‘సైకో రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి. ‘‘సమాజానికి ఉపయోగపడే ప్రయోగాత్మక చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. -
ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ ఫస్ట్లుక్, 3D మోషన్ పోస్టర్ విడుదల
యంగ్ హరో ఆది సాయికుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాప్ గేర్. ఇటీవలె విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి మరో అప్డేట్ను అందించి చిత్ర బృందం. ఈ చిత్రంలో ఆది సరికొత్త పాయింట్తో అలరించబోతున్నాడని తెలుస్తోంది ఈ ఫస్ట్లుక్ పోస్టర్ చూస్తుంటే. ఇకపోతే ఈ మోషన్ పోస్టర్ సరికొత్తగా 3డీలో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్పై పొందుతోంది. ఇందులో ఆది సరసన రియా సుమన్ నటిస్తోంది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
రవితేజ చేతుల మీదుగా 'అధర్వ' మోషన్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ చేతులు మీదుగా ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్.. అంటూ హీరో చెబుతున్న డైలాగ్స్ ఈ మోషన్ పోస్టర్ లో హైలైట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది.ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. -
1770: రాజమౌళి శిష్యుడి డైరెక్షన్లో పాన్ ఇండియా చిత్రం
ఇండియన్ సినిమా వైవిధ్య కథా చిత్రాల కోసం తపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా చారిత్రక, జానపద, పౌరాణిక, ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుందా అని అనిపిస్తుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ఘన విజయాలు దీనికి కారణం కావచ్చు. అలాంటి చారిత్రక ఇతివృత్తంతో 1770 అనే పాన్ ఇండియా చిత్రానికి బీజం పడింది. దీనికి రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించబోతున్నారు. ప్రఖ్యాత రచయిత బకించంద్ర చటర్జీ రాసిన అనందమత్ నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రానికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, కథనాలను అందిస్తున్నారు. దీనిని నిర్మాతలు శైలేంద్ర కువర్, సుజాయ్ కుట్టి, పి.కృష్ణకుమార్, సరజ్ శర్మ కలిసి ఎస్ఎస్ 1 ఎంటర్టైన్మెంట్, పీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. కాగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ధ్వనిస్తున్న వందేమాతరం గీతంతో కూడిన టీజర్ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ మొదలగు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. నవరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రవన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
రాయలసీమ నేపథ్యంలో...
సుమన్, అక్సా ఖాన్, శ్రీను ముఖ్య తారలుగా మను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిద్ధన్న గట్టు’. ఎన్. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రవరం జేబీ, మధు, మహేష్ , మెహబూబ్, మీనాక్షీ రెడ్డి, వెంకట్రాముడు, చిన్న నరసింహులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. సుమన్ మాట్లాడుతూ – ‘‘రాయలసీమ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నా ఏజ్, ఇమేజ్కి తగ్గట్టు ఈ చిత్రంలో నా పాత్రను మలిచారు’’ అన్నారు. ‘‘పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలనే కథాంశంతో ఈ చిత్రం రూపొందించాం’’ అన్నారు మను. ‘‘కథ నచ్చి సినిమా నిర్మించాం’’ అన్నారు నేశినేని శ్రీనివాస్ రెడ్డి. -
విభిన్నంగా నేను c/o నువ్వు మోషన్ పోస్టర్..
రతన్ కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘'నేను c/o నువ్వు'’. ఆగాపే అకాడమీ పతాకంపై అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్లు సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ "నేను c/o నువ్వు'’ చిత్ర మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్.. ఈ సినిమాకు సంబందించి ఒక చిన్న సాంగ్కు డ్యాన్స్ కంపోజ్ చేసి పంపిస్తే లక్ష రూపాయలు ప్రైజ్ మనీని అందజేస్తామని తెలిపింది. మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. 'నాకు ఈ చిత్ర దర్శకుడు సాగా పది సంవత్సరాల నుంచి తెలుసు. సినిమా రంగంపై ఎంతో ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. ఇది సాగా కు రెండో చిత్రం. ఈ సినిమా కోసం తానే దగ్గరుండి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ తన భుజాలమీద వేసుకుని ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాడు' అన్నారు. చిత్ర దర్శకుడు సాగారెడ్డి తుమ్మ మాట్లాడుతూ.. '1980లో నా చిన్నతనంలో నేను దగ్గరగా చూసిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాను. ఈ చిత్రానికి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, పాటల రచయితతో పాటు మొత్తం టెక్నీషియన్స్ అందరూ నాకు మంచి స్నేహితులు. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాలను దయచేసి సపోర్ట్ చేయండి' అన్నారు. సహ నిర్మాత జోషఫ్ మాట్లాడుతూ.. 'నాకు దర్శకుడు సాగా కథ చెప్పగానే నచ్చి ఈ ప్రాజెక్ట్ లొకి వచ్చాను. సాగా ఎంతో విజనరీ ఉన్న డైరెక్టర్. పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓ వైపు వివాహ శుభకార్యాన్ని చూపిస్తూ, మరోవైపు సంకెళ్ళతో కాళ్ళను బంధించిన ఒక చిన్న క్రైమ్ స్టోరీ అనిపించేలా పోస్టర్ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కథ డిఫరెంట్ గా ఉంటుందని అర్థం అవుతుంది' అన్నారు. చదవండి: సుహాస్ హీరో అనగానే అవసరమా? అంటూ చీప్ లుక్కిచ్చారు పెళ్లైన ఆరేళ్లకు తల్లి కాబోతున్న హీరోయిన్ -
అపర్ణా మాలిక్ ‘డెడ్లైన్’ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
అపర్ణా మాలిక్ హీరోయిన్గా, విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం డెడ్లైల్. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమాను శ్రీ విఘ్నతేజ ఫిలిం పతాకంపై బొమ్మారెడ్డి వీఆర్ఆర్ రచన దర్శకత్వంలో తాండ్ర గోపాల్ నిర్మించారు. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. చదవండి: ఉత్కంఠగా సమంత ‘యశోద’ మూవీ ఫస్ట్గ్లింప్స్ ఈ సందర్భంగా దర్శకుడు బొమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో ప్రతి స్త్రీ ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల గురించి చర్చించే చిత్రమే ఈ డెడ్ లైన్. నేటి యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని మా చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించాం. ప్రేక్షకుడు ఊహించని విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉత్కంఠ భరితంగా చిత్రీకరించాం. విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు’ అని అన్నారు. -
ఆకట్టుకుంటున్న 'విక్కీ ది రాక్ స్టార్' ఫస్ట్ లుక్
విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కితున్న చిత్రం ‘విక్కీ ది రాక్ స్టార్’. శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్పై ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సీఎస్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ విడుదలైంది. చదవండి 👉: యశ్ నుంచి ప్రకాశ్ రాజ్ దాకా.. కేజీఎఫ్ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే? నేల పై సాగు చేసే రైతు ఆకాశం వైపుకి , ఆకాశమే హద్దు గా భావించే యువత నేల వైపుకి , ఒక వైపు నాగలితో రైతన్న, మరో వైపు గిటార్ తో విక్కి ది రాక్ స్టార్ , రైతు కాలికి ముద్దు పెడుతూ ఉన్న ఈ పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘నీ కాళ్ళకే ముద్దులె పెట్టనా ఫార్మర్ ’ అంటూ బాక్ గ్రాండ్ లో వస్తున్న లిరిక్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది.ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఒక అమ్మాయితో మోషన్ పోస్టర్ చూసేయండి
సూరజ్ పవన్, శీతల్ భట్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఒక అమ్మాయితో’. ‘కోవిడ్ టైమ్ కహానీ’ అనేది ఉపశీర్షిక. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా. వి.భట్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. గార్లపాటి రమేష్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫీల్ గుడ్ మూవీలా వస్తున్న మా సినిమాలో యూత్కు తగ్గ అంశాలతో పాటు థ్రిల్, కామెడీ, ఎమోషన్స్ ఉంటాయి’’ అన్నారు. ‘‘త్వరలో విడుదలవుతున్న మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మురళి బోడపాటి. ‘‘ఒక అమ్మాయితో’ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు సూరజ్ పవన్. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ రమణ, సంగీత దర్శకుడు కన్ను సమీర్, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్, నటులు అశోక్ కుమార్, శ్రీ రాగ్, సురేష్ తదితరులు మాట్లాడారు. -
‘14 డేస్ లవ్’ ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన వి.వి. వినాయక్
Vv Vinayk Launched 14Days Love First Look: మనోజ్ పుట్టుర్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘14 డేస్ లవ్’. నాగరాజ్ బోడెమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై హరిబాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్లుక్ని డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘ఈ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్ బోడెమ్కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్ని ఇవ్వాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు. -
బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ లాంచ్ ఫోటోలు
-
ఆకట్టుకుంటున్న ‘మణిశంకర్’ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్దే ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మణిశంకర్’. యాక్షన్ ఎలిమెంట్స్తో ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం జి. వెంకట కృష్ణన్ అందించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎస్. శంకర్రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘మణిశంకర్’ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ముందు కత్తులతో ఇంటెన్స్ లుక్లో శివ కంఠమనేని ఉన్న ఈ క్రియేటివ్ మోషన్ పోస్టర్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా హీరో శివకంఠమనేని మాట్లాడుతూ.. ‘ఈ రోజు విడుదలైన మా ‘మణిశంకర్’ టైటిల్, ఫస్ట్లుక్ మోషన్పోస్టర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సంజన గల్రాని, ప్రియా హెగ్దేలతో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు జీవీకే మేకింగ్ చాలా కొత్తగా ఉంది. ఒక కొత్త కాన్సెప్ట్ తప్పకుండా మీ అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’ అన్నారు. అలాగే దర్శకుడు జీవీకే మాట్లాడుతూ.. ‘మణిశంకర్ అనేది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. -
`ఛలో ప్రేమిద్దాం` ఫస్ట్ లుక్ చూశారా?
సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఛలో ప్రేమిద్దాం. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వం వహిస్తుండగా ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను ఆదివారం రిలీజ్ చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ...``ఓ రోజు డైరక్టర్ సురేష్ వచ్చి మోషన్ పోస్టర్ చూపించారు. మోషన్ పోస్టర్ నచ్చడంతో లాంచింగ్ కి వచ్చాను. అందరూ ప్రొడ్యూసర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంకట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ఒక కొత్త డైరక్టర్ కి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు. అలా ఛలో ప్రేమిద్దాం నిర్మాత ఉదయ్ కిరణ్ గారు ఇచ్చిన మాట కోసం సురేష్కి సినిమా ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఉదయ్ కిరణ్ కచ్చితంగా గొప్ప నిర్మాతగా ఎదుగుతారు. ఇక ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూశాక విజువల్ ట్రీట్ లా సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది`` అన్నారు. ఈ సినిమాను నవంబర్ నెలాఖరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్, హేమ, రఘు కారుమంచి, సూర్య, తాగుబోతు రమేష్, అనంత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; పాటలుః సురేష్ గంగుల, దేవ్, ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క, సినిమాటోగ్రఫీః అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి -
‘రాధేశ్యామ్’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లోనే తొలి చిత్రంగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లెటెస్ట్ మూవీ రాధేశ్యామ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాధాకృష్ణ దర్శకత్వంతో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ గతేడాది అక్టోబర్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్లో 21 మిలియన్లకు పైగా వ్యూస్ను రాబట్టింది. దీంతో ఇండియన్ సినిమాల్లో ఓ మోషన్ పోస్టర్ అత్యధిక వ్యూస్ రాబట్టడం ఇదే తొలిసారి. దీంతో రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్గా రికార్డు సృష్టించింది. భారత్ సినీ చరిత్రలో మోషన్ పోస్టర్ అత్యధిక వ్యూస్ రాబట్టిన తొలి సినిమాగా రాధేశ్యామ్కు నిలిచింది. కాగా ఈ మూవీలో ప్రభాస్ విక్రమాధిత్యగా, పూజా హెగ్డె ప్రేరణగా కనిపించనున్నారు. పిరియాడికల్ ప్రేమకథ తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ విడుదల కానుంది. -
Valimai: అజిత్ లుక్ అదిరింది..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
ajit Valimai motion poster: కోలీవుడ్ అగ్ర కథనాయకుడు అజిత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వాలిమై’కు సంబంధించి అభిమానుల్లో అనందం నింపేలా ఓ అప్డేట్ వచ్చింది. కాగా, ఆదివారం ఈ చిత్రంలోని అజిత్ ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇందులో అజిత్ సీబీ సీఐడి అధికారిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ నటుడు కార్తికేయ విలన్గా నటిస్తున్నారు. అజిత్కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్ శంకర్రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో ‘వాలిమై’ చిత్ర అప్డేట్స్ ఇవ్వడం లేదంటు అజిత్ అభిమానులు సోషల్మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఇది తారస్థాయికి చేరింది. ఏకంగా ఓ సారి క్రీడా మైదానాల్లో ప్లకార్డులు ప్రదర్శించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో అభిమానుల తీరుపై ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు. HD Posters of #ThalaAjith's #Valimai #ValimaiMotionPoster ▶️ https://t.co/NwxiG3ubjY#Valimai #ValimaiFirstlook#Ajithkumar @BoneyKapoor #HVinoth @BayViewProjOffl @SureshChandraa #NiravShah @thisisysr @humasqureshi @ActorKartikeya @RajAyyappamv pic.twitter.com/cY3VaELpdF — BARaju's Team (@baraju_SuperHit) July 11, 2021 -
‘బింబిసార’గా కల్యాణ్ రామ్.. ఇది మరో ప్రయోగం
Nandamuri Kalyan Ram: హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకన్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఇప్పటివరకు రొమాంటిక్, మాస్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ నందమూరి హీరో.. ఇప్పుడు ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. తన తాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా శుక్రవారం తన కొత్తసినిమా టైటిల్ని ప్రకటించాడు. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ మోషన్ పోస్టర్ని చిత్రబృందం షేర్ చేసింది. కత్తిని పట్టుకుని కల్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కల్యాణ్ రామ్ లుక్ అందరికి ఆకట్టుకుంటుంది. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె ‘బింబిసారా’నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. -
రామ్చరణ్ బర్త్డే: ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
రేపు(శనివారం) రామ్చరణ్ బర్త్డే. ఈ సందర్భంగా చెర్రీ అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే నానా సందడి చేస్తున్నారు. రామ్చరణ్ సినిమా పోస్టర్లను, అతడి స్టిల్స్ను షేర్ చేసుకుంటూ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అభిమానుల కోసం సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేసిన కామన్ డీపీ అంతంత మాత్రంగానే ఉండటంతో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. క్రియేటివ్గా కాకుండా ఓ సాదాసీదా ఫొటోను వదిలారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని కూల్ చేసేందుకు మోషన్ పోస్టర్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో నిప్పుల మధ్యలో నుంచి దూకుతున్న సింహంలా కనిపించాడు చెర్రీ. ఆర్ఆర్ఆర్లో నిప్పుకు ప్రతీకగా రామ్చరణ్ను చూపించడంతో మోషన్ పోస్టర్లో కూడా నిప్పునే ప్రధానంగా ఎంచుకున్నారు. డీపీ కంటే ఈ వీడియో వంద రెట్లు నయమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా వుంటే చరణ్ ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో ఆలియా సీతగా అతడితో జోడీ కడుతోంది. చెర్రీ బర్త్డేను పురస్కరించుకుని ఫ్యాన్స్కు ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది చిత్రయూనిట్. అందులో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు రామరాజు లుక్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. Here is the animated motion poster of @AlwaysRamCharan Anna’s by his beloved fans celebrating his birthday.. Looks superb!!🔥🔥🔥#RCBdaySplMotionPoster pic.twitter.com/Jbu7DS8fGm — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 26, 2021 చదవండి: హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్ -
అదే అసలైన ‘రిపబ్లిక్’ అంటున్న మెగా మేనల్లుడు
దేవకట్టా దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ను ఖరారు చేస్తూ సోమవారం మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘రిపబ్లిక్ ఇన్ టు పబ్లిక్’ అంటూ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు జనవరి 26, రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ వాయిస్ ఓవర్ ఈ మోషన్ పోస్టర్కు ప్రధానాకర్షణగా నిలిచింది. ‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’ అంటూ కోర్టు రూమ్లో సాయి ధరమ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. చదవండి: ఆచార్య: రామ్ చరణ్కు జోడీ కుదిరింది దీనికి తోడు గుర్రాలను చూపిస్తూ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత దేవా కట్టా నుంచి వస్తున్న పొలిటికల్ సినిమా ఇది. ఈ సినిమా పూర్తిగా రాజకీయాలు, ప్రజాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తుండగా రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ హీరో కాగా గత రెండేళ్లుగా సాయి వరస విజయాలు అందుకుంటున్నాడు. 2019లో చిత్రలహరి సినిమాతో ఫామ్లోకి వచ్చిన ఈ యువ హీరో.. అదే ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే అంటూ బ్లాక్బస్టర్ అందుకున్నాడు. గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఇప్పుడు రిపబ్లిక్ అంటూ మరోసారి పోటీకి సిద్ధమయ్యాడు. -
అన్నాచెల్లెళ్ల అనుబంధం
‘‘నరసింహపురం’ టైటిల్, మోషన్ పోస్టర్ బాగున్నాయి. నేపథ్య సంగీతం అదిరిపోయింది. నా మిత్రుడు నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు శ్రీకాంత్. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నంద కిశోర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నరసింహపురం’. సిరి హనుమంతు హీరోయిన్గా నటిస్తుండగా, వర్థమాన నటి ఉష హీరో చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు శ్రీరాజ్ బళ్ళా. ‘‘వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది’’ అన్నారు నందకిశోర్. ఈ కార్యక్రమంలో సిరి హనుమంతు, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, విజువల్ ఎఫెక్ట్స్ చందు ఆది పాల్గొన్నారు. -
యాక్షన్ జెమ్
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా నటించిన తాజా చిత్రం ‘జెమ్’. రాశీ సింగ్, నక్షత్ర హీరోయిన్లుగా నటించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో మహాలక్ష్మీ మూవీ మేకర్స్ పతాకంపై పత్తికొండ కుమారస్వామి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ని హీరో రవితేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ రాజా మాట్లాడుతూ– ‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. రెండేళ్లు శ్రమించి సిద్ధం చేసిన కథను అంతే బాగా తెరకెక్కించారు సుబ్రహ్మణ్యంగారు’’ అన్నారు. ‘‘అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించాం’’ అన్నారు సుశీల సుబ్రహ్మణ్యం. ‘‘అవుట్పుట్ సంతృప్తికరంగా వచ్చింది’’ అన్నారు పత్తికొండ కుమారస్వామి. ‘‘తమిళ, కన్నడలో సినిమాలు చేసిన కుమారస్వామిగారు తెలుగులో మా అబ్బాయితో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్. -
‘రాధేశ్యామ్’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?
డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తోన్న 'బీట్ ఆఫ్ రాధేశ్యామ్'ని మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. విజువల్ వండర్గా వచ్చిన ఈ పోస్టర్ అభిమానులను ఎంతో అలరిస్తుంది. 1.16 నిమిషాల నిడివి ఉన్న ఈ పోస్టర్లో ముందుగా అర చేయి కనిపిస్తుంది. దాంట్లో అడవి.. అందులో రైలు. ఒపెన్ చేస్తే ఫస్ట్ రోమియో-జులియేట్, తర్వాత సలీం-అనార్కలీ, తర్వాత దేవదాసు-పార్వతీల బొమ్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజా హెగ్డే రైలు బోగి డోర్ వద్ద నిల్చుని బయటకు చూస్తుంది. తర్వాత డార్లింగ్ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. ఇదంతా చూస్తుంటే ఓ ట్రైన్లో వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథగా రాధేశ్యామ్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలానే ముందు వచ్చిన అమర ప్రేమికుల బొమ్మలను చూస్తే.. ఈ చిత్రం కూడా గొప్ప అమర ప్రేమ కావ్యంగా ఉంటుందా లేక ఆ కథల్లనే రాధేశ్యామ్ కూడా విషాదంగా ముగుస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ ఈ మోషన్ పోస్టర్ మాత్రం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. (చదవండి: ‘రాధేశ్యామ్’ సర్ప్రైజ్.. ప్రభాస్ లుక్ అదుర్స్) ఇక ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. -
విభిన్న కథాంశంతో ప్రియదర్శిని రామ్ 'కేస్ 99'
సాక్షి , హైదరాబాద్ : సాక్షి టీవీ సీఈవోగా , ఫ్యామిలీ ఫీచర్స్ ఎడిటర్గా, లవ్ డాక్టర్గా మనకు సుపరిచితులయిన ప్రియదర్శిని రామ్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాస్, మనోడు లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి రామ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మనోడు సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లో స్ఫెషల్ జ్యరీ నందీ అవార్డు కూడా రామ్ సొంతం చేసుకున్నారు. తాజాగా హత్యలు, బలవన్మరణాలు, కిడ్నాప్లు,అత్యాచారాలను వెనక ఉన్న హ్యూమన్ ఎమోషన్ కీపాయింట్ ఆధారంగా చేసుకొని ప్రియదర్శిని రామ్ 'కేస్ 99' అనే ఇన్వస్టిగేషన్ డ్రామాను తెరకెక్కించారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారులో ఓఆర్ఆర్లు ఏర్పడ్డాకా సిటీ అంచుల్లో భూ తగాదాలు, దందాలు, మాఫియా పేరిట జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా 'కేస్ 99' సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ను ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను శనివారం రిలీజ్ చేయనున్నారు. 115 నిమిషాల నిడివి ఉన్న కేస్ 99 సినిమా దీపావళికి సందడి చేయనుందని ఫిలింనగర్లో టాక్. తిరువీర్, అనువర్ణ, నిహాల్, అజయ్, అపరాజిత, అశోక్ రావు, విజయ్ గోపరాజు, క్రిష్ రాజ్, మనోజ్ ముత్యం, నితిన్ ప్రసన్న, ప్రియదర్శిని రామ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కీర్తి చిలుకూరి, గౌతమ్ రెడ్డి, వివేక్ రెడ్డి నిర్మిస్తుండగా, ఆషిక్ అరుణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
నాలుగు జంటల కథ
శ్రీజిత్ హీరోగా, శిల్పా దాస్, నిష్కల హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెరసాల’. రాంప్రకాష్ గుణ్ణం దర్శకత్వంలో మాదినేని సురేష్, సుధారాయ్ గుణ్ణం నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ని నిర్మాత రాజ్ కందుకూరి, టైటిల్ లోగోని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. రాంప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకి హారర్ ఎలిమెంట్ని మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. నాలుగు జంటల మధ్య సాగే కథ ఇది’’ అన్నారు. ‘‘మా సినిమా రష్ చూసుకున్నాక చెప్పిన దానికంటే దర్శకుడు చాలా బాగా తీశాడని అర్థమైంది. మొదటి ప్రాజెక్ట్తోనే మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది’’ అన్నారు మాదినేని సురేష్. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ తమిరి. -
భారీ కుంభకోణం
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ బ్రదర్ – సిస్టర్గా నటిస్తోన్న క్రాస్ఓవర్ చిత్రం ‘మోసగాళ్లు’. శుక్రవారం హీరో వెంకటేశ్ ఈ చిత్రానికి సంబంధించిన ‘ది రైజ్ ఆఫ్ మోసగాళ్లు’ (టైటిల్ థీమ్ మ్యూజిక్)ను విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. భారత్లో మొదౖలై అమెరికాను సైతం వణికించిన చరిత్రలోనే అతి పెద్ద భారీ ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్కుమార్ ఆర్. -
రికార్టు సృష్టించిన ‘లక్ష్మిబాంబ్’ మోషన్ పోస్టర్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం 'లక్ష్మీ బాంబ్' మోషన్ పోస్టర్ను గురువారం రాత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టర్ విడుదల చేసిన 24 గంటల్లోనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను కలుపకుని 21 మిలియన్ల వ్యూస్ సంపాదించిన రికార్టు సృష్టించిన మోషన్ పోస్టరుగా నిలిచింది. అక్షయ్ ట్రాన్స్జెండర్గా నటిస్తున్న ఈ హార్రర్ చిత్రంపై ఆయన అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: లక్ష్మీబాంబ్ని తీసుకొస్తున్నా) అక్కి ఈ పోస్టర్ను షేర్ చేస్తూ... ‘ఈ దీపావళికి ‘లక్ష్మీ బాంబ్’తో మీ ఇంటికి రాబోతున్న’ అంటూ షేర్ చేశాడు. అయితే తెలుగు బాక్సాఫిస్ వద్ద బ్టక్బస్టర్గా నిలిచిన కాంచనను హిందీ రిమేక్ ‘లక్ష్మిబాంబ్’తో అక్కి లీడ్ రోల్లో నటిస్తున్నాడు. రాఘవా లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కియార అద్వానీ నటిస్తోంది. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్ 9న హాట్స్టార్లో విడుదల కానుంది. -
‘మోసగాళ్ళు’ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల
-
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం!
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘మోసగాళ్ళు’ సినిమా మోషన్ పోస్టర్ శుక్రవారం విడుదలైంది. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై విష్ణు మంచు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ను హీరో దగ్గుబాటి వెంకటేష్ లాంచ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న హాలీవుడ్–ఇండియన్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటుంది. ఇక మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో విష్ణు–కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రలు చేస్తున్నారని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. దీంతో అసలు వీరిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయన్న సస్పెన్స్ అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ కుమార్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నాడు. వేసవిలోనే ‘మోసగాళ్లు’ విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగగా వాయిదా పడింది. దీంతో మరి థియేటర్స్ తెరిచేవరకు చిత్రబృందం వెయిట్ చేస్తుందా లేక ఓటీటీ వైపు వెళ్తుందా అన్నది తెలియాల్సి ఉంది. (బ్రదర్ అండ్ సిస్టర్) -
రైడర్
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. లహరి ఫిలిమ్స్ బ్యానర్పై చంద్రు మనోహరన్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో నిఖిల్ కుమార్ ఒక ఫెరోషియస్ యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. కశ్మీరా పరదేశీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: శ్రీష ఎం. కుడువల్లి. -
'వకీల్ సాబ్' మోషన్ పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నడు(బుధవారం) 49వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి' సినిమాతో టాలీవుడ్లో హీరోగా రంగప్రవేశం చేసిన ఆయన ఎందరో అభిమానులకు దేవుడిగా మారే స్థాయికి ఎదిగిపోయారు. అయితే అనూహ్యంగా అన్న చిరంజీవి బాటలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు విరామం ఇవ్వడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత "వకీల్ సాబ్"తో తిరిగి సందడి చేయనున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'వకీల్ సాబ్' చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ పోస్టర్ విడుదలైంది. (ఆ రోజు పవన్ అభిమానులకు డబుల్ ధమాకా) ఇందులో మహాత్మాగాంధీ, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తులను మొదట చూపించారు. ఆ తర్వాత పవన్ సూటు వేసుకుని లాయర్ గెటప్లో దర్శనమిచ్చారు. ఒక చేత క్రిమినల్ లా పుస్తకం పట్టుకుని, మరో చేత కర్ర పట్టుకుని ఏ దారిలోనైనా నేరస్థులను వదిలేదే లేదని చెప్పకనే చెప్తున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్లో "సత్యమేవ జయతే" అంటూ వస్తుండటం మోషన్ పోస్టర్కు అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా శ్రీరామ్ వేను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ క్రియేషన్స్పై దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. ఇది బాలీవుడ్ బ్లాక్బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే (నిహారిక నిశ్చితార్థం: పవన్ అందుకే వెళ్లలేదు) -
చిరంజీవి డీపీలో ఈ లాజిక్ ఏంటో తెలుసా?
ఎవరి పుట్టిన రోజును వాళ్లే జరుపుకుంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును మాత్రం ఆయన అభిమానులందరూ పండగలా జరుపుకుంటారు. అదీ మెగా హీరోకు ఉన్న క్రేజ్. రేపు(శనివారం) ఆయన పుట్టిన రోజు. ఇంకొన్ని గంటల్లో ఆయన 65వ వడిలోకి అడుగు పెట్టనున్నారు. దీంతో మెగా అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు. మరోవైపు తండ్రికి మొదటి బర్త్డే విషెస్ చెప్పారు హీరో రామ్చరణ్. నాన్న పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు కామన్ డీపీని కూడా విడుదల చేశారు. ఇందులో చిరంజీవి కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను ఒక్కో మెట్టుపై ఉంచారు. (చిరు ఫ్యాన్స్కు పండుగే.. డబుల్ ధమాకా!) "ఖైదీ" నుంచి మొదలై "ఖైదీ నంబర్ 150" వరకు ఉన్న పాత్రలను మెట్లపై నిలిపి చూపించారు. వీటి మధ్యలో 'పసివాడి ప్రాణం', 'స్వయంకృషి', 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు', 'ఇంద్ర' చిత్రాలకు సంబంధించిన పాత్రలున్నాయి. కానీ రాజకీయాల్లో వెళ్లి బ్రేక్ తీసుకున్న సమయానికి సంకేతంగా కొన్ని మెట్లను ఖాళీగా వదిలేశారు. ఇక మెగాస్టార్ టైటిల్ మధ్యలో మాత్రం "సైరా నరసింహారెడ్డి" పాత్రను నిలిపారు. "రక్తదానం చేయండి - ప్రాణాలు కాపాడండి" అన్న మెగాస్టార్ నినాదంతో పాటు "ప్లాస్మా దానం చేసి కరోనా రోగుల ప్రాణాలు కాపాడండి" అని ఈ పోస్టర్లో పేర్కొన్నారు. మరోవైపు 'హ్యాపీ బర్త్డే మెగాస్టార్' అంటూ చిరంజీవి కామన్ పోస్టర్ను కూడా వదిలారు. బీజీఎమ్తో అదరగొడుతున్న ఈ వీడియోలో ఆయన సూపర్ హిట్ సినిమాల పోస్టర్లు కనిపిస్తాయి. చివర్లో అందరికీ చెక్ పెట్టే రాజుగా హైలుక్లో కనిస్తారు. (వీరిలో ఓ వ్యక్తి మీకు బాగా తెలుసు..) -
మహేశ్ బర్త్డే కానుక అదిరిపోయింది
సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు 45వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా 'సర్కారు వారి పాట' చిత్రబృందం ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు మ్యూజికల్ సర్ప్రైజ్ ఇచ్చింది. సర్కారు వారి పాట అంటూ సాగుతూ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సంగీతం అదిరిపోయింది. ప్రీలుక్లో స్టైలిష్గా మెడ మీద రూపాయి నాణెం టాటూతో కనిపించిన మహేశ్ ఈ సారి రూపాయి బిళ్ళను ఎగరేస్తూ మ్యాజిక్ చేశారు. దీంతో బర్త్డే గిఫ్ట్ అదిరిపోయిందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ మహేశ్ పూర్తి లుక్ మాత్రం చూపించనేలేదు. (బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కు మహేష్ పిలుపు) హీరో బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు #HBDMaheshBabuను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈపాటికే సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్ను, మహేశ్ ప్రీలుక్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ సందేశాన్ని ఇవ్వనుంది. 'గీతా గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. (ఆ విషయంలో తగ్గేది లేదన్న స్వీటీ ) -
‘ఎ’ చిత్ర యూనిట్కు జగపతి బాబు విషెస్
నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని, స్నేహల్ కమత్, బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన మెడికల్ థ్రిల్లర్ చిత్రం ‘ఎ’. అవంతిక ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ను నటుడు జగపతి బాబు విడుదల చేశారు. తన ట్విటర్ ద్వారా ‘ఎ’ చిత్ర మోషన్ పోస్టర్ను విడుదలచేసిన జగపతి బాబు చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక మోషన్ పోస్టర్కు సైతం ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుండటంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఇదే ఉత్సాహంలో త్వరలోనే టీజర్ను కూడా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. Here's the #A (AD INFINITUM) Movie Motion Poster. Best wishes to the entire team.@ugandharmuni @avanthikaprodu1 @NithinPrasannaz #PreethiAsrani #MOVIEAADINFINITUM https://t.co/mjsfujGJo3 — Jaggu Bhai (@IamJagguBhai) May 20, 2020 చదవండి: జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది? రానా నిశ్చితార్థం జరిగిపోయిందా? -
అర్జున్.. అను వచ్చేశారు
‘భీష్మ’ వంటి హిట్ చిత్రం తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రంగ్ దే’. కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్ పాత్రలో నితిన్, అను పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ పాత్రలను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కెమెరా: పి.సి. శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). పుట్టినరోజు వేడుకల్లేవ్.. పెళ్లి వాయిదా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నేడు తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం లేదని, ఏప్రిల్ 16న దుబాయ్లో జరగాల్సిన పెళ్లిని కూడా వాయిదా వేశానని నితిన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులున్నాయో మీకు తెలుసు. లాక్డౌన్ కొనసాగుతుండటంతో నేడు నా పుట్టినరోజుని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడా కూడా నా జన్మదిన వేడుకలు జరపవద్దు. నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో మనం ఇళ్లల్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు’’ అన్నారు. ∙కీర్తీ సురేశ్, నితిన్ -
‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ఇదే..
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు సంబంధించిన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ టైటిల్కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా బుధవారం చిత్రబృందం ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్- ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. మోషన్ పోస్ట్ర్లో ఎన్టీఆర్ నీటిలో నుంచి, రామ్చరణ్ నిప్పులో నుంచి నడుచుకుంటూ వస్తున్న సన్నివేశాల్ని చూపించారు. కాగా, ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరీస్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2021 సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘జగమే తంత్రం’ అంటున్న ధనుష్
కోలీవుడ్ స్టార్ ధునుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జగమే తంతిరమ్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు. తెలుగులో ‘జగమే తంత్రం’అనే పేరుతో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ధనుష్ డిఫరెంట్ గెటప్లో దర్శనమిచ్చాడు. చొక్కా, పంచెతో తమిళ సంప్రదాయంలో కనిపించినా.. చేతిలో గన్నులు భయపెట్టేలా ఉన్నాయి. దీంతో మాస్ ఆడియన్స్కు ఈ సినిమాతో పండగే అని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ధనుష్కు ఇది 40వ చిత్రం కావడంతో ‘డి 40’అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరిపారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 1న రిలీజ్ కానుంది. -
గ్యాంగ్స్టర్గా దుమ్ములేపిన ధనుష్
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జగమే తంత్రం’. ధనుష్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ధనుష్ మాస్ లుక్ ఆకట్టుకుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్ను కట్టిపడేసేలా ఉంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర పోషించారు. ఆయనకిది 40వ చిత్రం కావడంతో.. ధనుష్ అభిమానులు D40 పేరుతో హాష్టాగ్ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. మే 1న ఈ చిత్రం విడుదల కానుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో ‘జగమే తంత్రం’ నిర్మించాయి. ఎస్. శశికాంత్ నిర్మాతగా, సహ నిర్మాతగా చక్రవర్తి రామచంద్రన్ వ్యవహరించారు. ఇక భిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే కార్తీక్ సుబ్బరాజ్.. ‘పేట’ సినిమాలో రజనీ వయసును 20 ఏళ్లు తగ్గించేశారనే ప్రశంసలను అందుకున్నారు. రజనీకాంత్కు సూపర్ సక్సెస్ ఇచ్చిన కార్తీక్ ధనుష్తో ఛాన్స్ కొట్టేశాడు. జిగర్తండా, కాదల్ సొల్పవదు ఎప్పడి, మెర్కూరి, ఇరైవి కార్తీక్ దర్శకత్వం వహించిన సూపర్హిట్ సినిమాలు. -
‘15-18-24 లవ్ స్టోరీ’ మోషన్ పోస్టర్ రిలీజ్
బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల, కీర్తన, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘15-18-24 లవ్ స్టోరీ’. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్లు నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రంతో త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోబోతోంది. ప్రేమికుల రోజు పురస్కరించుకొని ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను హీరోయిన్ మెహరీన్ విడుదల చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు. అదేవిధంగా చిత్ర యూనిట్కు మెహరీన్ బెస్ట్ విషెస్ తెలిపారు. ‘వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యావసనాల మీద అద్భుతమైన కథా, కథనాలతో దర్శకుడు కిరణ్కుమార్ ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్ర యూనిట్ తెలిపింది. -
రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘ఏమైపోయావే’
రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఏమైపోయావే’. మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరి కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నారు. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఏమైపోయావే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించి చిత్ర యూనిట్కు మంచి పేరు రావాలిన కోరుకుంటున్నా’అని అన్నారు. రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి, శ్రీను కేసబోయిన, మిర్చి మాధవి, సునీత మనోహర్, నామాల మూర్తి, మీసం సురేష్, మళ్ళీ రావా బుజ్జి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రామ్చరణ్ సంగీతమందిస్తున్నాడు. -
‘కోబ్రా’తో భయపెడుతున్న విక్రమ్
కథలతో ప్రయోగాలు చేసే తమిళ ప్రముఖ హీరో విక్రమ్ తెలుగువాళ్లకూ సుపరిచితుడే. ‘అపరిచితుడు’ చిత్రంతో తెలుగులో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత విక్రమ్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులోనూ రిలీజయ్యాయి. కానీ కొన్ని మాత్రమే గుర్తింపు తెచ్చుకోగా మిగతావి పత్తా లేకుండా పోయాయి. ఈ క్రమంలో మరో డిఫరెంట్ చిత్రంతో విక్రమ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తున్న విక్రమ్ 58వ సినిమాకు ‘కోబ్రా’ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా బుధవారం టైటిల్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఒకవైపు ఆసక్తిని రేకెత్తిస్తూనే మరోవైపు భయాన్ని కలగజేస్తున్న ఈ వీడియోలో పాములు భయంకరంగా బుసలు కొడుతున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరో విక్రమ్తో జోడీ కడుతోంది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా లలిత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. -
అరుణాచలం దర్బార్
రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘అరుణాచలం’ చిత్రం ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుందర్ సి. దర్శకత్వంలో 1997లో విడుదలైన ఈ సినిమాలో అరుణాచలంగా అలరించిన రజినీ మరోసారి ‘దర్బార్’ చిత్రంలో అరుణాచలం పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘దర్బార్’ సినిమా తెలుగు మోషన్ పోస్టర్ని గురువారం హీరో మహేశ్బాబు విడుదల చేశారు. ‘‘రజనీకాంత్ సార్ నటించిన ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మీపై ఈ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మురుగదాస్ సార్, చిత్రబృందానికి నా అభినందనలు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేశ్బాబు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలంగా కొత్త లుక్లో రజనీని చూసి, ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని తమిళ్లో కమల్హాసన్, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్లాల్ విడుదల చేశారు. ‘‘అత్యంత భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. అన్ని రకాల వాణిజ్య హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన రజనీ పోస్టర్స్కు చాలా మంచి స్పందన వస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ‘దర్బార్’ సినిమా విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. అందులోనూ క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, రజనీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం అంటూ అంచనాలు పీక్స్లో ఉండటం ఖాయం. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దర్బార్’. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో రజనీ పోలీస్ గెటప్లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం భారీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ను గ్రాండ్గా విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ‘దర్బార్’ చిత్ర తమిళ, మలయాల, హిందీ, తెలుగు మోషన్ పోస్టర్లను కమల్ హాసన్, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, మహేశ్ బాబు వంటి స్టార్ల చేతుల మీదుగా విడుదల చేయించింది. ప్రస్తుతం రజనీ దర్బార్ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘ఆదిత్య అరుణాచలం’గా రజనీ విలన్లు రఫ్పాడించనున్నాడు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే తలైవా పదాలతో పాటు, రజనీ అడుగుల చప్పుడు హార్ట్ బీట్ను పెంచేస్తున్నాయి. దీంతో ‘దర్బార్’ బాక్సాపీస్ వద్ద దంచికొట్టడం ఖాయమని రజనీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, నివేధా థామస్, మరియు సునీల్ షెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాతికి విడుదల కానుంది. -
ప్రతిరోజూ పండగే మోషన్ పోస్టర్
-
నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు
‘‘శ్రీనివాస్రెడ్డి నాకు మంచి మిత్రుడు. ఒకప్పుడు నేను మద్రాసులో ఉండలేననుకుని, సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోదాం అనుకున్నాను. అప్పుడు ‘నువ్విక్కడ ఉండి చాలా సాధించగలవు’ అంటూ నాలో నమ్మకాన్ని నింపాడు శ్రీనివాస్రెడ్డి. నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. శ్రీనివాస్రెడ్డి దర్శకత్వంలో శ్రీనవ్హాస్ క్రియేషన్స్, శ్రీకార్తికేయ సెల్యూలాయిడ్స్ నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఇషా రెబ్బా, సత్యదేవ్ జంటగా శ్రీనివాస్ కానూరి నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ను వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్ వినగానే రేడియోలో వచ్చే వాయిస్ గుర్తొచ్చింది. శ్రీనివాస్రెడ్డి మంచి దర్శకుడు. మంచి స్క్రిప్ట్ దొరికితే ఎంత బాగా సినిమా తీస్తాడో చెప్పడానికి ‘ఢమరుకం’ ఓ ఉదాహరణ. ఇప్పుడు ఈ ‘రాగల 24 గంటల్లో’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’... ఇలా నా ప్రతి చిత్రం ఫస్ట్లుక్ కానీ, ఆడియో గానీ వినాయక్గారి చేతుల మీదగా విడుదల చేయించడం నాకు ఆనవాయితీ. మా నిర్మాత శ్రీనివాస్గారి సహకారం వల్ల మంచి అవుట్పుట్ వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్రెడ్డి. ‘‘ఇది నా మొదటి చిత్రం. ప్రేక్షకులందరూ మంచి సినిమా తీశావని అభినందిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీనివాస్ కానూరి. ఈ చిత్రానికి కెమెరా: అంజి, ఎడిటింగ్: తమ్మిరాజు, మాటలు: కృష్ణభగవాన్, సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అలీ బాబా. -
సంగీతం నేపథ్యంలో...
సుదీప్, సుస్మిత, సందీప్, రాజ్సింగ్ ముఖ్య తారలుగా ఆర్.ఎస్ సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆగ్రహం’. ఎస్.ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేసి, చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు. సురేష్ మాట్లాడుతూ– ‘‘సంగీతానికి ప్రాధాన్యం ఉన్న విభిన్న కథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మే ఆఖరులో విడుదల చేయాలనుకుంటున్నాం. మా సినిమా మోషన్ పోస్టర్ని విడుదల చేసిన పూరి జగన్నాథ్గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ చెరుకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఆర్.కె, సంగీతం: ఆర్.ఆర్.రవిశంకర్. -
‘మహానటి’ మోషన్ పోస్టర్ విడుదల
-
‘మహానటి’ మోషన్ పోస్టర్ విడుదల
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. టైటిల్ రోల్లో కీర్తి సురేశ్ నటించగా, ముఖ్య పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్ర యూనిట్. రెండ్రోజుల క్రితమే విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయగా తాజాగా సమంత, విజయ్లతో కూడిన ఒక మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. మధురవాణీగా సమంత, విజయ్ ఆంటోనిగా విజయ్ దేవరకొండలు నటిస్తున్నారని తెలిసిందే. నిజం ఎప్పుడు అందంగానే ఉంటుంది మధురవాణి గారు అంటూ వచ్చిన పోస్టర్లో ఏ విషయం గురించో ఇద్దరు మాట్లాడుకుంటున్నారని తెలిసిపోయింది. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్లో విజయ్ పాత కెమెరాను పట్టుకుని, నవ్వుకుంటూ సమంతతో ఏదో మాట్లాడుతుండగా...సమంత మాత్రం తీక్షణంగా ఏదో పుస్తకాన్ని చదువుకుంటూ వింటున్నట్లు కనపడుతుంది. అసలు వీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రేపు (ఏప్రిల్ 14న) టీజర్ను విడుదల చేయనున్నట్లు చిత్రబృంధం తెలిపింది. మే 9న మహానటి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #VijayAntony and #Madhuravani are all set to bring you the greatest story ever told of the greatest actress that ever lived - #Mahanati #మహానటి #MahanatiTeaserOnApril14thhttps://t.co/cpJkEmHjnU@TheDeverakonda @Samanthaprabhu2 — Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 12, 2018 -
ఒకే జీవితం
సూపర్గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అన్నది ఉపశీర్షిక. శ్రుతీ యుగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.వెంకట్ దర్శకత్వంలో లార్డ్ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని హీరో జీవా విడుదల చేశారు. వెంకట్ మాట్లాడుతూ– ‘‘టెక్నాలజీ పేరుతో పరుగెడుతోన్న నేటి తరం మానవ సంబంధాలకు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. జితన్ రమేష్ చక్కగా నటించారు. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి మా చిత్రం చూసిన ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు. ‘‘మోషన్ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీవా. ‘‘నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు నారాయణ్ రామ్. ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: వై.గిరి. -
‘సాక్ష్యం’ మోషన్ పోస్టర్ లాంచ్
-
మంచి బ్రేక్ అవుతుంది!
చంద్రకాంత్, రాధికా మెహరోత్రా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. గోవర్ధన్.జి స్వీయ దర్శకత్వంలో రఘురాం రొయ్యూరుతో కలిసి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ అధిక భాగం అమెరికాలో జరిగింది. ఇటీవల విడుదలైన ఈ మోషన్ పోస్టర్కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ– ‘‘నేను పుట్టి, పెరిగింది హైదారాబాద్లోనే. ఇంజినీరింగ్ పూర్తి చేసి యాక్టింగ్ను కెరీర్గా తీసుకోవాలని డిసైడ్ అయ్యాక అమెరికాలో ట్రైనింగ్ తీసుకున్నా. ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం‘ వంటి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్తో హీరోగా పరిచయం కావడం నా లక్. చక్కని టీమ్తో రూపొందిన ఈ సినిమా నాకు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు -
సైరా... నాకు సవాల్లాంటిది : చిరంజీవి
‘ఎప్పటి నుంచో స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలో... ముఖ్యంగా భగత్సింగ్ పాత్రలో నటించాలనుకుంటున్నా. ఇన్నాళ్లకు తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ పాత్ర నాకు సవాల్లాంటిది’’ అని చిరంజీవి అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్లో మంగళవారం ఫ్యాన్స్ సమక్షంలో జరిపారు. ఈ సందర్భంగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో తండ్రి చిరంజీవి హీరోగా తనయుడు రామ్చరణ్ నిర్మిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ మోషన్ పోస్టర్ను దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఫస్ట్ లుక్ పోస్టర్ను నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ వేడుకకు చిరంజీవి రాకపోయినా, తన మనసులోని మాటలను వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘సైరా నరసింహారెడ్డి’ కోసం సురేందర్రెడ్డి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ చిత్రం అద్భుత దృశ్యకావ్యంలా ఉంటుంది. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీలాంటి అభిమానుల కోసం నేనేం చేయగలను? మీరు గర్వపడే సినిమాలు చేయడం తప్ప. ‘సైరా నరసింహారెడ్డి’ మీరందరూ గర్వపడే సినిమా అవుతుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి 40ఏళ్ల సినీ ప్రయాణంలో 37ఏళ్లు ఆయనతో కలసి నేనూ ప్రయాణించడం సంతృప్తిగా ఉంది. ఆయన వేసిన తారు రోడ్డులో పవన్కల్యాణ్, రామ్చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, శిరీష్, నీహారిక సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇందుకు వారు చిరంజీవికి కృతజ్ఞతగా ఉంటారు’’ అన్నారు. ‘‘బాహుబలి’ అంత పెద్ద విజయం సాధించడానికి కారణం సాంకేతిక నిపుణులే. ‘సైరా నరసింహారెడ్డి’కి కూడా మంచి టెక్నీషియన్స్ కుదిరారు. ఇది చిరంజీవిగారి 151వ చిత్రం అంటున్నారు. కానీ, 150 సినిమాల మైలురాయి దాటిన తర్వాత ఆయన నటిస్తున్న తొలి చిత్రం అనిపిస్తోంది’’ అన్నారు రాజమౌళి. రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘మీరు మా అభిమానులా? లేక మేము మీ అభిమానులా? అని నాకు డౌట్గా ఉంది. నాన్నగారి పుట్టినరోజును పురస్కరించుకుని 42,000 మంది రక్తదానం చేయడం గ్రేట్. అందుకే నాన్నగారు అభిమానులను ‘మెగా ఫ్యాన్స్ కాదు.. మెగా బ్లడ్ బ్రదర్స్’ అంటుంటారు. సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, మీ అభిమానం మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ సినిమాలో పనిచేయనున్న ఆర్టిస్టులందరూ అడగ్గానే ఒప్పుకోవడం ఆంజనేయస్వామి ఆశీస్సుల వల్లే అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఎందుకో తెలియదు కానీ, ‘సైరా నరసింహారెడ్డి’ పేరు చెబితే నాకు ఒక విధమైన వణుకు మొదలవుతోంది. ఇప్పుడు నా ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే. నాపై పెద్ద బాధ్యత పెట్టారు. నాకు చిరంజీవిగారు, రామ్చరణ్ సపోర్ట్గా ఉన్నారు. మెగా ఫ్యాన్స్, ప్రేక్షకుల సపోర్ట్ కూడా కావాలి’’ అని సురేందర్ రెడ్డి అన్నారు. రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, దర్శకుడు సుకుమార్, హీరోలు సాయిధరమ్తేజ్, వరుణ్తేజ్, నిర్మాత పి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: ఎ.ఆర్. రెహమాన్, కెమెరా: రవివర్మన్, కథ: పరుచూరి బ్రదర్స్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సమర్పణ: సురేఖ కొణిదెల. -
తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ'
తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ తాప్సీ. తెలుగులో గ్లామర్ రోల్స్తో ఆకట్టుకున్న ఈ బ్యూటి, హిట్ సినిమాల్లో నటించినా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్లో అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. బేబీ, పింక్ సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ సౌత్ ఇండస్ట్రీ మీద కూడా కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. అయితే బాలీవుడ్లో కూడా ఫ్లాప్ ఎదురవ్వటంతో ఇప్పుడు మరోసారి టాలీవుడ్ బాట పట్టింది ఈ బ్యూటి. సౌత్లో సక్సెస్ ఫార్ములాగా మారిన హర్రర్ జానర్లో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ సినిమాలో తాప్సీ చంద్రముఖి తరహా పాత్రలో కనిపించనుందట. మహీ రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రఘు, షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ'
-
చిన్న సినిమాకి చిరు ప్రశంస
‘‘మోషన్ పోస్టర్ చాలా క్యూట్గా ఉందని చిరంజీవిగారు నన్ను ప్రశంసించడం జీవితంలో మరచిపోలేని క్షణం. చిరంజీవిగారు మోషన్ పోస్టర్ను విడుదల చేయడంతో మా చిన్న సినిమా పెద్ద చిత్రమైపోయింది. త్వరలోనే ట్రైలర్ను విడుదల చేస్తాం. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని దర్శకుడు అయోధ్య కార్తీక్ అన్నారు. మత్స్య క్రియేషన్స్ – పి.ఎల్.కె. ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఇది మా ప్రేమకథ’. అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా ‘యాంకర్’ రవి హీరోగా పరిచయం అవుతున్నారు. మేఘనా లోకేష్ కథానాయిక. ఈ చిత్రం మోషన్ పోస్టర్ను శనివారం చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా చిత్రం ఫస్ట్ లుక్ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఇప్పుడు మోషన్ పోస్టర్ను ఏకంగా చిరంజీవిగారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: మోహన్ రెడ్డి, సహనిర్మాత: పి.ఎల్.కె. రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడగొంట్ల. -
బాహుబలి-2 పోస్టర్ వచ్చేసింది
కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు? అనే ప్రశ్నకు జవాబు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. బాహుబలి-2ను త్వరలో విడుదల చేసేందుకు రాజమౌళి అండ్ కో సిద్ధమౌతోంది. శివరాత్రి సందర్భంగా ప్రమోషన్ల కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బాహుబలి-2 మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఏనుగుపైకి ఎక్కుతున్న ప్రభాస్ పోజ్ చూడ ముచ్చటగా ఉంది. కాగా, ఆర్కా మీడియా వర్క్స్ బాహుబలిని నిర్మిస్తోంది. విజువల్ రియాల్టీ(వీఆర్)లో బాహుబలి-2 తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. -
వరుణ్ బర్త్డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఫిదా మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిస్టర్, ఫిదా సినిమాల షూటింగ్లను ఒకేసారి చేసేలా ప్లాన్ చేసినా.. ప్రమాదం కారణంగా వరుణ్ కొంత కాలం షూటింగ్లకు దూరం కావటంతో ఫిదాను వాయిదా వేశారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫిదాను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఫిదా సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా శక్తికాంత్ సంగీతం అందిస్తున్నాడు. -
వరుణ్ బర్త్డే గిఫ్ట్, ఫిదా మోషన్ పోస్టర్
-
కాటమరాయుడు మోషన్ పోస్టర్ విడుదల
సమ్మర్ సీజన్ కోసం శరవేగంగా సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా మోషన పోస్టర్ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. హీరో పవన్తో పాటు హీరోయిన్ శ్రుతి హాసన్ ఇద్దరూ కలిసి దీపాలు పెడుతున్నట్లుగా ఉన్న ఈ 20 సెకన్ల పోస్టర్ను అభిమానుల కోసం విడుదల చేశారు. శివబాలాజీ, అజయ్, అలీ, కమల్ కామరాజు, చైతన్యకృష్ణ సహా పలువురు నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత శరత్ మరార్ పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. గతంలో 'గోపాల... గోపాల'తో పవన్ కల్యాణ్ మనసు చూరగొన్న దర్శకుడు కిశోర్ పార్థసాని (డాలీ) కూడా తనపై నిర్మాత, హీరో పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అనువైన సొంత టీమ్తో చకచకా షూటింగ్ చేస్తున్నారు. హిట్ సినిమా కథాంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని, పూర్తిగా తెలుగు వాతావరణం, పాత్రలతో తయారవుతున్న 'కాటమరాయుడు' వార్తలను బట్టి చూస్తే, వచ్చే వేసవిలో విడుదలయ్యేలాగే ఉంది. -
కాటమరాయుడు మోషన్ పోస్టర్ విడుదల