Netflix
-
నేరుగా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. చాలా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ.. మరికొన్ని మాత్రం నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అలా ఇప్పుడో హిందీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎప్పుడు రాబోతుంది?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'జ్యూయల్ థీఫ్'. టైటిల్ చూడగానే అర్థమైందనుకుంటా. మనీ హైస్ట్ లా ఇందులోనూ రెడ్ సన్ అనే రూ.500 కోట్ల విలువైన డైమండ్ కొట్టేయాలని హీరోకి విలన్ పనిఅప్పజెబుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.వార్, పఠాన్ తదితర చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి నిర్మాత. రాబీ గ్రేవాల్, కుకీ గులాటీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25 నుంచి ఇది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా ప్రకటించారు.(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?) -
ఓటీటీకి పూజా హెగ్డే డిజాస్టర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆదరణ కరవైంది. యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన దేవా అభిమానులను థియేటర్లలో రప్పించడంలో విఫలమైంది.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈనెల 28 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ మేరకు దేవా పోస్టర్ను పంచుకుంది.కాగా..2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అదే సినిమాని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఇక్కడ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమానే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తెరకెక్కించగా డిజాస్టర్గా నిలిచింది. మరీ ఓటీటీలోనైనా అభిమానులను ఏమేర అలరిస్తుందో వేచి చూడాలి.Bhasad macha 🥁🥁🥁 Trigger chala 🚨🚨🚨 Deva aa raha hai 🔥#DevaOnNetflix pic.twitter.com/9eHQGvnjWn— Netflix India (@NetflixIndia) March 27, 2025 -
రాజకీయ ఒత్తిళ్లకు లొంగారు.. ‘నెట్ఫ్లిక్స్ ’పై అనురాగ్ కశ్యప్ ఫైర్!
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నెట్ఫ్లిక్స్ ఇండియాపై సంచలన వాఖ్యలు చేశాడు. నెట్ఫ్లిక్స్ ఇండియా(Netflix India)లో పనిచేసే పై స్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యారని, వారు నైతికంగా అవినీతిపరులేనని విమర్శించాడు. నెట్ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్ని ప్రశంసిస్తూ.. ఇలాంటి ప్రాజెక్టులను భారత్లో నెట్ఫ్లిక్స్ సంస్థ తిరస్కరిస్తోందని ఆరోపించాడు. నెట్ఫ్లిక్స్ ఇండియా దర్శకుల సృజనాత్మక స్వేచ్ఛను అణచివేస్తోందని, కమర్శియల్ కంటెంట్ను మాత్రమే ప్రోత్సహిస్తోందని కశ్యప్ మండిపడ్డాడు.అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘మాక్సిమం సిటీ’ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్ 2024లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. నెట్ఫ్లిక్స్ నిర్ణయాన్ని అనురాగ్ అప్పుడే వ్యతిరేకించాడు. తాజాగా మరోసారి నెట్ఫ్లిక్స్పై తనకున్న అసంతృప్తిని ఇన్స్టా వేదికగా వెల్లడించారు. ‘మాక్సిమం సిటీ’ రద్దుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆయన ఆరోపించాడు. సృజనాత్మక స్వేచ్ఛపై నెట్ఫిక్స్ ఆంక్షలు విధిస్తోందని విమర్శించాడు.దీనికి యూకే వెబ్ సిరీస్ అడోలసెన్స్ని ఉదాహరణగా చూపించాడు. ఈ వెబ్ సిరీస్ మార్చి 13 నుంచి నెట్ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ యుక్త వయస్సు యొక్క చీకటి అంశాలను, ఆన్లైన్ ద్వేషం, మరియు సామాజిక సమస్యలను చూపిస్తుంది.ఇలాంటి సాహసోపేతమైన కథను నెట్ఫ్లిక్స్ ఇండియా అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.‘మాక్సిమం సిటీ’ కథేంటి?సుఖ్దేవ్ సింగ్ సంధు రాసిన "మాక్సిమం సిటీ: బాంబే లాస్ట్ అండ్ ఫౌండ్" పుస్తకం ఆధారంగా అనురాగ్ కశ్యప్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు. ఈ సిరీస్లో ముంబై నగరం యొక్క చీకటి కోణాలను చూపించాలని భావించారు. అయితే, 2024లో నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ను రద్దు చేసింది, దీనిపై కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే ‘సేక్రెడ్ గేమ్స్’మూడో సీజన్ కోసం కూడా నెట్ఫ్లిక్స్తో చర్చలు జరిగాయి. కానీ కంటెంట్తో పాటు బడ్జెట్పై వివాదాలు రావడంతో నెట్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును కూడా రద్దు చేసుకుంది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) -
నేరుగా ఓటీటీకి మీరా జాస్మిన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ మీరా జాస్మిన్, నయనతార నటించిన చిత్రం 'ది టెస్ట్'. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కించారు.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. మీరా జాస్మిన్ ఫోటోలు షేర్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్ను రివీల్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి టెస్ట్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో కూడా అందుబాటులో ఉండనుందని ట్విటర్ ద్వారా తెలిపింది.ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగువారికి సుపరిచితమే. రవితేజ భద్ర సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది. అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. ఆ తర్వాత విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టెస్ట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.Some things change, but our love for Meera Jasmine? Never 🥰Watch TEST, out 4 April in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix!#TestOnNetflix pic.twitter.com/Sm1Neb2B4t— Netflix India South (@Netflix_INSouth) March 18, 2025 -
ఓటీటీలో హిట్ సినిమా 'డ్రాగన్' ఎంట్రీ
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ (Return Of The Dragon) ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు, నిర్మాత అర్చనా కల్పతిలను డైరెక్టర్ శంకర్ కూడా మెచ్చుకున్నారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు.తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్ను విడుదల చేశారు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. ‘లవ్టుడే’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కీలకపాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్గా మారిపోయి బీటెక్లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్లు
థియేటర్లలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. గతవారం కోర్ట్, దిల్రూబా సినిమాలు రిలీజవ్వగా ఈవారం మరికొన్ని చిన్న సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అటు ఓటీటీలోనూ హిట్ చిత్రాలు, సిరీస్లు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం (మార్చి 17 నుంచి 23 వరకు) అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజయ్యే సినిమల జాబితా..🎥 షణ్ముఖ - మార్చి 21🎥 పెళ్లి కాని ప్రసాద్ - మార్చి 21🎥 కిస్ కిస్ కిస్సిక్ - మార్చి 21🎥 టుక్ టుక్ - మార్చి 21🎥 అనగనగా ఆస్ట్రేలియాలో - మార్చి 21🎥 ఆర్టిస్ట్ - మార్చి 21🎥 ది సస్పెక్ట్ - మార్చి 21ఇవే కాకుండా రెండు సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మార్చి 21న ప్రభాస్ 'సలార్: సీజ్ ఫైర్', నాని, విజయ దేవరకొండల 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాలు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి.ఓటీటీ విషయానికి వస్తే..నెట్ఫ్లిక్స్విమెన్ ఆఫ్ ది డెడ్ 2 (వెబ్ సిరీస్) - మార్చి 19ఆఫీసర్ ఆన్ డ్యూటీ - మార్చి 20బెట్ యువర్ లైఫ్ (వెబ్ సిరీస్) - మార్చి 20ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (వెబ్ సిరీస్) - మార్చి 20ది రెసిడెన్స్ (వెబ్ సిరీస్)- మార్చి 20లిటిల్ సైబీరియా - మార్చి 21రివిలేషన్స్ - మార్చి 21జియో హాట్స్టార్అనోరా (ఆస్కార్ విన్నింగ్ మూవీ) - మార్చి 17గుడ్ అమెరికన్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) - మార్చి 19కన్నెడ (వెబ్ సిరీస్) - మార్చి 21విక్డ్ - మార్చి 22ఆహాబ్రహ్మా ఆనందం - మార్చి 20అమెజాన్ ప్రైమ్డూప్లిసిటీ - మార్చి 20స్కై ఫోర్స్ - మార్చి 21అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్లూట్ కాంట్ (వెబ్ సిరీస్) - మార్చి 20చదవండి: అనారోగ్యంతో నటి 'బిందు' మృతి.. చివరిరోజుల్లో.. -
తండేల్ను వెనక్కి నెట్టిన ఎమర్జన్సీ.. సిల్లీ ఆస్కార్ అంటూ కంగనా కామెంట్స్!
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). చాలాసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో కంనగా ఇందిరా గాంధీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా ఆడియన్స్ను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఓటీటీలో దూసుకెళ్తోంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్ సినిమాల జాబితాలో టాప్ ప్లేస్లో ట్రెండింగ్ అవుతోంది. నాగచైతన్య మూవీ తండేల్, అజయ్ దేవగణ్ ఆజాద్ సినిమాలను వెనక్కి నెట్టేసింది.ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్స్ ఎమర్జన్సీ చిత్రాన్ని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు. ఈ చిత్రాన్ని భారత్ నుంచి ఆస్కార్ పంపాలని పోస్ట్ చేశాడు. వీటికి సోషల్ మీడియా వేదికగా కంగనా రిప్లై ఇచ్చింది. ఇన్స్టా లో ట్వీట్స్ను షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందించింది. అమెరికా లాంటి దేశం ఇలాంటి సినిమాలను గుర్తించడానికి ఇష్టపడరు. వారు అభివృద్ధి చెందుతున్న దేశాలను అణచివేస్తారు. అదే ఈ ఎమర్జన్సీలో చూపించాను. వారి సిల్లీ ఆస్కార్ అవార్డ్ను వాళ్ల వద్దే ఉంచుకోనివ్వండి. మాకు నేషనల్ అవార్డులు ఉన్నాయని నెటిజన్కు రిప్లై ఇచ్చింది.బాలీవుడ్ చిత్ర నిర్మాత సంజయ్ గుప్తా కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ రోజు నేను ఎమర్జెన్సీ మూవీని చూశాను. చాలా స్పష్టంగా చెప్పాలంటే.. నేను ముందుగా అంచనా వేసినట్లుగా ఈ సినిమాను ప్లాన్ చేయలేదని అన్నారు. ఈ సినిమాలో కంగనా నటన, దర్శకత్వం రెండూ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీనికి కంగనా బదులిస్తూ 'సినిమా పరిశ్రమ తన ద్వేషం, పక్షపాతాల నుంచి బయటపడాలి.. మంచి పనిని ఎప్పటికీ గుర్తించాలి సంజయ్ జీ.. మీరు ఆ అడ్డంకిని బద్దలు కొట్టినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది.కాగా.. నెట్ఫ్లిక్స్లో శుక్రవారం విడుదలైన ఎమర్జెన్సీ మూడు రోజుల్లోనే నెట్ఫ్లిక్స్ సినిమాల జాబితాలో టాప్ ట్రెండింగ్లో ఉంది. అజయ్ దేవగన్ ఆజాద్, నాగ చైతన్య తండేల్ చిత్రాలను అధిగమించింది. ఈ చిత్రం కంగనా రనౌత్ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి విధించిన 21 నెలల ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కూడా నటించారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. -
నాని టైమ్ నడుస్తోంది.. ఈసారి రూ.54 కోట్ల డీల్!
ఇండస్ట్రీలో ఏ హీరోకి అయినా హిట్ ఫ్లాప్స్ సాధారణం. కానీ గత కొన్నేళ్లుగా వరస సినిమాలతో విజయాల్ని అందుకుంటున్న హీరోల్లో నాని ఒకడు. ఓవైపు హీరోగా హిట్స్ కొడుతూనే మరోవైపు నిర్మాతగానూ సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు. రీసెంట్ హిట్ 'కోర్ట్'.. నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిందే.(ఇదీ చదవండి: హీరోయిన్ అమలాపాల్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?)ప్రస్తుతం తెలుగులో చాలా సినిమాలకు ఓటీటీ డీల్స్ జరగట్లేదు. దీంతో ఫైనల్ కాపీ సిద్ధమైన విడుదలకు నోచుకోవట్లేదు. అదే టైంలో నాని సినిమాలకు మాత్రం రిలీజ్ కి చాలారోజుల ముందే ఓటీటీ డీల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. 'కోర్ట్'ని ఏకంగా రూ.8 కోట్లకు నెట్ ఫ్లిక్స్ తీసుకుందని టాక్.రీసెంట్ గా నాని హీరోగా 'ద ప్యారడైజ్' మూవీని ప్రకటించారు. దీని షూటింగ్ అసలు మొదలు కాలేదు కానీ ఓటీటీ డీల్ మాత్రం రూ.65 కోట్లకు జరిగిపోయిందట. నాని ఇప్పటికే పూర్తి చేసిన 'హిట్ 3' చిత్ర ఓటీటీ హక్కుల్ని ఇదివరకే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ప్రకటించారు. ఇకపోతే ఈ డీల్ రూ.54 కోట్ల జరిగిందని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో నాని టైమ్ నడుస్తోంది. పట్టిందల్లా బంగారమవుతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: హీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ) -
థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా
గత కొన్నేళ్లలో తీసుకుంటే మలయాళంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం 'రేఖాచిత్రం' (Rekhachithram OTT) అనే మూవీ ఓటీటీలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అలానే మరో చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. కాకపోతే థియేటర్లలో విడుదల వారానికే రాబోతుండటం విశేషం.ఓటీటీల చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న కుంచకో బోబన్, ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'(Officer On Duty OTT ). ఫిబ్రవరి 20న మలయాళంలో రిలీజై హిట్ అయింది. ఆ ఊపులోనే తెలుగులోనూ రిలీజ్ ప్లాన్ చేశారు. తొలుత మార్చి 7 అనుకుని 14వ తేదీకి వాయిదా వేశారు. తెలుగులో ఇది విడుదలైనట్లు కూడా చాలామందికి తెలియదు.(ఇదీ చదవండి: ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ తెలుగు రివ్యూ)అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. మార్చి 20 నుంచే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చారు. మలయాళ వెర్షన్ కి నెలరోజుల గ్యాప్ ఓకే కానీ తెలుగులో మరీ థియేటర్లలోకి వచ్చిన వారానికే ఓటీటీలోకి వచ్చేస్తోంది.'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' విషయానికొస్తే.. చైన్ స్నాచింగ్, ఫేక్ గోల్డ్ లాంటి కేసులను అవలీలగా ఛేదించే సీఐ హరిశంకర్(కుంచకో బోబన్) ఫేక్ గోల్డ్ కేసు ఎదురవుతుంది. ఆ కేసును సీరియస్గా తీసుకున్న హరిశంకర్ దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ సమయంలో సీఐ హరిశంకర్కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అంతే కాకుండా ఈ ఫేక్ గోల్డ్ కేసు కాస్తా ఓ అమ్మాయి ఆత్మహత్యకు దారితీస్తుంది. అసలు ఈ కేసుతో ఆ అమ్మాయికి గల సంబంధం ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?)Puthiya officer etheetund, stand in line and salute 🫡Watch Officer on Duty on Netflix, out 20 March in Malayalam, Hindi, Telugu, Tamil, Kannada#OfficerOnDutyOnNetflix pic.twitter.com/1Y8O7aK3ln— Netflix India South (@Netflix_INSouth) March 15, 2025 -
కోర్ట్, దిల్రూబా సినిమాలు వచ్చేవి ఆ ఓటీటీలోనే!
హోలి పండగ (మార్చి 14) రోజు తెలుగులో రెండు సినిమాలు రిలీజయ్యాయి. అదే కోర్ట్ (Court: State Vs a Nobody), దిల్రూబా (Dilruba Movie). కోర్ట్ చిత్రంలో రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, హర్షవర్ధన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాతగా వ్యవహరించారు. కోర్ట్ ఓటీటీ పార్ట్నర్ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడొద్దంటూ కోర్ట్ మూవీపై బలమైన నమ్మకం వ్యక్తపరిచాడు నాని. అతడి నమ్మకమే నిజమైంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగైదు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.(కోర్ట్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)దిల్రూబా ఓటీటీ పార్ట్నర్క బ్లాక్బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దిల్రూబా. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ రన్ను బట్టి నెల రోజుల్లోనే దిల్రూబా ఆహాలోకి వచ్చే అవకాశం ఉంది.(దిల్రూబా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓటీటీలో సడెన్గా 'ఎమర్జెన్సీ ' ఎంట్రీ
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని కంగనానే నిర్మించారు. పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే, సడెన్గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. వాస్తవంగా ఎమర్జెన్సీ మూవీని మార్చి 17న నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానున్నట్లు కంగనా ప్రకటించింది. కానీ, అనుకున్న సమయంకంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎమర్జెన్సీ చిత్రం ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకటించిన సమయం కంటే మూడు రోజులు ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన కంగనా రనౌత్ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు. కంగనా ఇందులో ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలు పోషించారు. -
ఓటీటీలో 'డ్రాగన్' సినిమా.. పోస్టర్ వైరల్
కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా హిట్ కొట్టొచ్చని లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మరోసారి నిరూపించాడు. ఆయన నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ (Return Of The Dragon) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.మార్చి 14న హిందీలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రిలీజవుతుండగా ఇంతలోనే ఓటీటీ గురించి ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని షోషల్మీడియాలో పోస్టర్ షేర్ అవుతుంది. దీంతో అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. అయితే, నెట్ఫ్లిక్స్ అధికారిక సోషల్మీడియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్గా మారిపోయి బీటెక్లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ). -
ఓటీటీలో ముగ్గురు స్టార్స్ నటించిన సినిమా.. డైరెక్ట్గా స్ట్రీమింగ్
నయనతార(Nayanthara) నటించిన ‘ది టెస్ట్’(The Test) సినిమా డైరెక్ట్గా ఓటీటీలో (OTT) విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.నిర్మాత శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ది టెస్ట్’ చిత్రం కొన్ని నెలల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర విడుదల కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తమిళ్,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్ కనిపించనుంది. ఇకపోతే ఇంతకుముందు కూడా నయనతార ప్రధాన పాత్రను పోషించిన మూకుత్తి అమ్మన్(అమ్మోరు తల్లి), నెట్రికన్ చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత నయన్ చేతిలో డియర్ స్టూడెంట్స్, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి. -
ఓటీటీలోకి అదిరిపోయే థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. 'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఇందులో జీత్, ప్రసేన్జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీతో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఇప్పటికే వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ట్రైలర్ ఈవెంట్లో నిర్మాత నీరజ్ పాండే పరోక్షంగా గంగూలీ ఉండొచ్చు అనే కామెంట్ చేశారు.'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' నెట్ఫ్లిక్స్లో మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో అందుబాటులో ఉండనుంది.2000 సంవత్సరంలో బెంగాల్లోని పరిస్థితులను చూపిస్తూ ఈ సిరీస్ను దర్శకుడు దేబాత్మ మండల్ తెరకెక్కించారు. గ్యాంగ్స్టర్లు, రాజకీయ నాయకులలో అధికార దాహం ఉంటే.. అక్కడి నగరంలో శాంతిని కాపాడటానికి పోలీసు అధికారులు చాలా కష్టపడుతుంటారు. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఐపీఎస్ అర్జున్ మైత్రా చట్టాన్ని కాపాడేందుకు ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొన్నారనేది ఇందులో చూపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్ట్ను మేకర్స్ తెరకెక్కించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. బిహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా ఖాకీ: ది బిహార్ చాప్టర్ పేరుతో నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్గా రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది కూడా. వాస్తవానికి ఐపీఎస్ అధికారి అమిత్ ఒక గ్యాంగ్స్టర్ అశోక్ మెమతోను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిందే ఈ వెబ్ సీరిస్. -
ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?
మార్చి తొలివారం వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల హడావుడి నడుస్తోంది. అందుకే తెలుగు సినిమాలేం ఈసారి థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. కానీ ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, కింగ్ స్టన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు.. ఈ వీకెండ్ లో బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం.. జీ5 చరిత్రలోనే రికార్డు)మరోవైపు ఓటీటీలో కేవలం 11 సినిమాలు-వెబ్ సిరీసులే రాబోతున్నాయి. కానీ వీటిలో రేఖాచిత్రం అనే డబ్బింగ్ మూవీతో పాటు తండేల్, విడామయూర్చి, బాపు చిత్రాలు చూడదగ్గవే. ఇవి కాకుండా సర్ ప్రైజ్ రిలీజులు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 3-9వ తేదీ వరకు)నెట్ ఫ్లిక్స్విడామయూర్చి (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 03తండేల్ (తెలుగు సినిమా) - మార్చి 07నదానియాన్ (హిందీ హిందీ మూవీ) - మార్చి 07అమెజాన్ ప్రైమ్దుఫాహియా (హిందీ సిరీస్) - మార్చి 07సోనీ లివ్రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 07ద వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిందీ సిరీస్) - మార్చి 07హాట్ స్టార్డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 04డెలి బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 06బాపు (తెలుగు సినిమా) - మార్చి 07తగేష్ vs ద వరల్డ్ (హిందీ సిరీస్) - మార్చి 07బుక్ మై షోబారా బై బారా (హిందీ మూవీ) - మార్చి 07(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తన పెళ్లి తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్ను చేరుకుంది.బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్ను రివీల్ చేసింది. ఈనెల 7 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ను విడుదల చేసింది.తండేల్ అసలు కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే 'తండేల్' మూవీని వీక్షించాల్సిందే.Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025 -
OTT: మరో వెబ్ సిరీస్కు ఓకే చెప్పిన అదితిరావు
బాలీవుడ్లో ‘జబ్ వియ్ మెట్, రాక్స్టార్, హైవే, లవ్ ఆజ్ కల్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇంతియాజ్ అలీ. తాజాగా ఈ దర్శకుడు ‘ఓ సాథీ రే’ అనే వెబ్ సిరీస్తో అసోసియేట్ అయ్యారు. కానీ దర్శకుడిగా కాదు. రైటర్, షో రన్నర్గా చేస్తున్నారు. ఈ సిరీస్కు అరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, హ్యూమన్ ఎమోషన్స్ ప్రధానాంశాలుగా ఉన్న ఈ సిరీస్లో అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), అర్జున్ రాంపాల్, అవినాష్ తివారీ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ‘‘ఈ రోజుల్లో అప్పటి వింటేజ్ లవ్ ఫీల్ని ఈ సిరీస్తో వీక్షకులు అనుభూతి చెందుతారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హీరో సిద్దార్థ్ను పెళ్లి చేసుకున్న తర్వాత అదితిరావు ఒప్పుకున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే! ప్రస్తుతం అదితి.. ఓ సాథిరే సిరీస్తో పాటు హీరామండి 2 వెబ్ సిరీస్, లయనెన్స్ అనే హాలీవుడ్ సినిమా చేస్తోంది. అదితిరావు- సిద్దార్థ్ 2024లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: దేవుడు చూస్తున్నాడు.. అందుకే ఆ హీరోయిన్ పత్తా లేకుండా పోయింది -
OTT: 13 వారాలుగా ట్రెండింగ్లో తెలుగు సినిమా
పండగను క్యాష్ చేసుకోవాలని ఎవరు మాత్రం అనుకోరు. అందుకే పోటీ ఉన్నా సరే పండక్కి వచ్చేందుకు సిద్ధవుతుంటారు. అలా గతేడాది దీపావళికి కిరణ్ అబ్బవరం 'క', శివకార్తికేయన్ 'అమరన్', దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' (Lucky Baskhar Movie) చిత్రాలు రిలీజయ్యాయి. అక్టోబర్ 31న విడుదలైన ఈ మూడు సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద గండం గట్టెక్కడమే కాకుండా హిట్, సూపర్ హిట్ జాబితాలో చేరిపోయాయి. ఓటీటీలో టాప్ ప్లేస్లో..ఈ మూడు చిత్రాలు ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేశాయి. లక్కీ భాస్కర్ చిత్రం నవంబర్ 28న నెట్ఫ్లిక్స్ (Netflix)లో రిలీజైంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. అయితే మూడు నెలలుగా ఈ సినిమా ఓటీటీలో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. 13 వారాలుగా నెట్ఫ్లిక్స్లో టాప్లో ట్రెండ్ అవుతున్న తొలి దక్షిణాది సినిమా అంటూ సితార ఎంటర్టైన్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది.చదవండి: కలర్ ఫోటో చేతులారా వదిలేసుకున్నా..: హీరోయిన్సినిమాలక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించగా.. నిమిషా రవి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. #LuckyBhaskar’s mind game is spot on in the digital arena too 😎🔥First South Indian film to trend for 13 weeks straight on @netflix 💥A true downpour of love from the audience ❤️#BlockbusterLuckyBaskhar streaming in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi Languages on… pic.twitter.com/nbrAEjhuZm— Sithara Entertainments (@SitharaEnts) February 26, 2025 చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ -
ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఈ నెల 7న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ కూడా అందుకుంది. తాజాగా టీమ్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. తండేల్ మూవీ రిలీజ్ రోజే పైరసీకి గురైంది. దీనిపై నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమా రన్ అవుతోంది. కానీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.(ఇదీ చదవండి: సింగర్ పై 19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!)తండేల్ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో 'పుష్ప 2' తప్పితే చాలా సినిమాల్ని ఈ ఓటీటీ సంస్థ.. నెల రోజులకు అటు ఇటుగా స్ట్రీమింగ్ చేసేస్తోంది. అలానే ఈ సినిమాని కూడా నెలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్చి 6 నుంచే తండేల్.. ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే మార్చి 14న రావొచ్చని మాట్లాడుకుంటున్నారు.తండేల్ విషయానికొస్తే.. శ్రీకాకుళంలోని మత్సలేశం అనే ఊరికి చెందిన కొందరు జాలర్లు.. గుజరాత్ తీరంలో చేపలు పడుతుండగా, అనుకోకుంగా పాకిస్థాన్ నేవి చేతికి చిక్కారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తర్వాత పాకిస్థాన్ జైల్లో కొన్నాళ్ల పాటు ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో తిరిగి ఇళ్లకు చేరారు. ఈ స్టోరీకి ప్రేమకథని జోడించిన డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?) -
ఓటీటీలోకి ఎమర్జెన్సీ.. సింపుల్గా డేట్ చెప్పేసిన కంగనా
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని కంగనా సింపుల్గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. ఎమర్జెన్సీ మార్చి 17న నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో మిస్ అయినవారు ఎమర్జెన్సీ చిత్రాన్ని ఓటీటీలో చూసేయండి.ఎమర్జెన్సీ కథఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ వంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కంగనా.. ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్ సహా దివంగత నటుడు సతీశ్ కౌశిక్ ముఖ్య పాత్రలు పోషించారు. కంగనా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించింది.చదవండి: ఛత్రపతి శివాజీగా ఆయన బాగా సెట్ అవుతారు: పరుచూరి గోపాలకృష్ణ -
డైరెక్ట్గా ఓటీటీకి స్టార్ హీరో కుమారుడి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా వస్తోన్న చిత్రం నదానియన్(Nadaaniyan). ఈ మూవీలో జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్(khushi kapoor) హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ నదానియన్ మూవీని డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రివీల్ చేసింది. వచ్చేనెల మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.కాగా.. ఈ సినిమాకు శౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు. ఏ ధర్మాటిక్ ఎంటర్టైనర్ బ్యానర్పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, దియా మీర్జా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇటీవల ఖుషీ కపూర్ లవ్యాపా మూవీతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. Kuch Kuch Hota Hai aisi Nadaaniyan dekh kar 🥰💕Watch Nadaaniyan, out 7 March, only on Netflix!#NadaaniyanOnNetflix pic.twitter.com/piwn818AFx— Netflix India (@NetflixIndia) February 20, 2025 -
ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత నటిస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్కు ఆర్థిక కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. సమంత నటించిన ఖుషి 2023లో విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో ఆమె నటించలేదు. అయితే, గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సమంత పలకరించింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే, ఇప్పుడీ వెబ్ సిరీస్కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని నెట్టింట వైరల్ అవుతుంది.నెట్ఫ్లిక్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లలో రక్త్ బ్రహ్మాండ్ ఒకటి. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ను డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్ణు పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ రీసెంట్గా సిటాడెల్ సిరీస్ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో ప్రారంభించిన రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ను ఆర్థిక సమస్యల వల్ల తాత్కాలికంగా ఆపేశారని సమాచారం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న ఒకరు బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్కు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ చిత్రీకరణ ఇప్పటి వరకు 25 రోజులు పూర్తి చేసుకుందట. ఇంకా చాలా షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయట. కానీ, ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చయిపోయినట్లు తెలిసింది. ఓ ఆడిట్ ద్వారా ఈ విషయం బయటపడిందట.. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్ను ఆపేశారని టాక్ ఉంది. నెట్ఫ్లిక్స్, డీ2ఆర్ ఫిల్మ్స్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ పనులను రాజ్ అండ్ డీకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మేకింగ్ సమయంలో స్క్రీన్ ప్లేలను ఎప్పటికప్పుడు మార్చేస్తుండటంతో ఖర్చు భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తప్పుబడుతుంది. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలా స్క్రిప్ట్ మారుస్తూ ఉండటంతో కనిపించని స్థాయిలో దుబారా అవుతుందని నెట్ఫ్లిక్స్ పేర్కొంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. -
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు/ సిరీస్లు రిలీజ్
వాలంటైన్స్ వీక్ అయిపోయింది. ఎన్నో ప్రేమ చిత్రాలు అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో అలరించాయి. ఈ వారం కూడా అదే జోష్ కొనసాగేలా ఉంది. తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఫిబ్రవరి మూడో వారంలో థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజవుతున్న సినిమాలు..బాపు - ఫిబ్రవరి 21రామం రాఘవం - ఫిబ్రవరి 21రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ - ఫిబ్రవరి 21జాబిలమ్మ నీకు అంత కోపమా - ఫిబ్రవరి 21ఓటీటీ రిలీజెస్..జీ5క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21 జియో హాట్స్టార్ది వైట్ లోటస్: సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 17విన్ ఆర్ లూజ్ - ఫిబ్రవరి 19ఊప్స్! అబ్ క్యా? - ఫిబ్రవరి 20ఆఫీస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21నెట్ఫ్లిక్స్అమెరికన్ మర్డర్: గాబీ పెటిటో (డాక్యు సిరీస్) - ఫిబ్రవరి 17కోర్ట్ ఆఫ్ గోల్డ్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 18జీరో డే (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20డాకు మహారాజ్ - ఫిబ్రవరి 20 అమెజాన్ ప్రైమ్రీచర్ సీజన్ 3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్సర్ఫేస్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 21హోయ్చోయ్చాల్చిత్రో: ద ఫ్రేమ్ ఫాటల్ - ఫిబ్రవరి 21చదవండి: ఓయ్.. బుజ్జి, బంగారం కాకుండా జింగిలేంటి?: హీరోయిన్ -
ఓటీటీలో 'డాకు మహారాజ్' ఆలస్యం.. ఆ రూల్ పాటిస్తున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన చిత్రం 'డాకు మహారాజ్'.. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే చాలాచోట్ల థియటర్ రన్ ముగిసింది. కానీ, ఓటీటీలో ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి రేసులో వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇప్పటికే ఓటీటీలో రన్ అవుతుంది. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్కు రావచ్చని చిత్ర యూనిట్ సమాచారం ఇచ్చింది. కానీ, డాకు మహారాజ్( Daaku Maharaaj) ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు మరింత సమయం పట్టేలా ఉంది.డాకు మహారాజ్ ఓటీటీ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్కు వస్తుందని నెట్టింట భారీగా వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది. డాకు మహారాజ్ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ, స్ట్రీమింగ్ వివరాలను ఎక్కడా కూడా ప్రకటించలేదు. అందుకు ప్రధాన కారణం సినిమా నిర్మాతలతో చేసుకున్న ఒప్పందమే అని తెలుస్తోంది.డాకు మహారాజ్ సినిమా విడుదలైన రోజు నుంచి 50 రోజుల థియేటర్ రన్ పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిబంధనను చిత్ర యూనిట్ పాటిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు, హిందీ వర్షన్లో విడుదలైంది. అయితే, ఓటీటీ కోసం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్లో ఉన్నారు. ఆ భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయట. అవి పూర్తి అయ్యేందుకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఓటీటీ కోసం మరికొన్ని సీన్లు కూడా అధనంగా జోడించనున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా మార్చి 4న 'డాకు మహారాజ్' ఓటీటీ ఎంట్రీ ఉండొచ్చని తెలుస్తోంది.బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించగా భారీ బడ్జెట్తో నాగవంశీ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
వెంకీ ఫ్యాన్స్ మళ్లీ టెన్షన్ స్టార్ట్..
-
నెట్ఫ్లిక్స్తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
నెల రోజుల్లోపే ఓటీటీకి డాకు మహారాజ్.. ఆ డేట్ ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ వారంలోనే డాకు మహారాజ్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.కాగా.. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించారు. వీరితో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.#DaakuMaharaj OTT Release Sets to Premeire This Sunday on Netflix In Tamil Telugu Malayalam Kannada pic.twitter.com/SQbZvxNEqM— SRS CA TV (@srs_ca_tv) February 3, 2025 -
చూసి తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో బాలీవుడ్ చిత్రం ది రోషన్స్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ జీవితమనే చక్రంలో కొందరి వంతు వస్తుంది, కొందరి వంతు ముగుస్తుంది. ముగిసిన వారి జ్ఞాపకాలు మన మనసులో పదిలంగా ఉంటాయి. వారిలో ఎందరో మహానుభావులుంటారు. వారి జ్ఞాపకాలైతే మనం నెమరువేసుకోవచ్చేమో కానీ ఆ కాలంలో వారు పడ్డ కష్టం, ఆనందం కానీ మనకు తెలియవు. అటువంటి వారి జీవిత చక్రానికి వెండితెర రూపమిస్తే మన ఆనందం అవధులు దాటుతుంది.ఆ కోవకు చెందినదే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది రోషన్స్’ టీవీ షో. ఇదో డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి జీవిత చక్రాలకు తెర రూపమే ఈ షో. బాలీవుడ్ దిగ్గజ రోషన్ కుటుంబానికి చెందిన నాటి సంగీత కళాకారులు రోషన్ లాల్ నాగ్రత్ నుండి నేటి తరం నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) వరకు... వారి జీవిత ప్రయాణాన్ని ఎంతో అందంగా చూపించారు.ఈ డాక్యుమెంటరీలో. ఓ రకంగా చెప్పాలంటే మనం ఈ షో ద్వారా నాలుగు తరాలు ప్రయాణిస్తాం. ముందుగా రోషన్ కుటుంబం నుండి రోషన్ లాల్ నాగ్రత్ సంగీత ప్రయాణంతో ఈ షోప్రారంభమై ఆ పై అతని కొడుకు రాజేష్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో సాగి, ఆ తరువాత ఆయన కొడుకు రాకేశ్ రోషన్ నటనా ప్రయాణంతో పాటు ప్రోడ్యూసర్గా ఎలా రాణించారు? అన్నది చూపిస్తూ నేటి తరం కథానాయకుడు హృతిక్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో షో ముగుస్తుంది.ఈ షో ద్వారా నాటి బాలీవుడ్ సంగీతం నుంచి నేటి తరం సినిమాల వరకు మనకు తెలియని ఎన్నో రహస్యాలతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోని అప్పటి ఒడిదుడుకులను ఇప్పటి పట్టు విడుపులను సవివరంగా చూపించారు. ఈ రోషన్ కుటుంబానికి బాలీవుడ్ పరిశ్రమలో ఉన్న నాటి, నేటి దిగ్గజాలు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకు చెప్పడం మరింత బావుంది. అందుకే ‘ది రోషన్స్’ చూసి నేర్చుకోదగ్గ, తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ. ఇది ప్రతి సినిమా ప్రేక్షకుడు తమ వ్యక్తిగత లైబ్రరీలో భద్రపరుచుకోదగ్గ డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. వర్త్ఫుల్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. ఫిబ్రవరిలో మళ్లీ పోటీ
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా విడుదలైన టాప్ సినిమాలు ఫిబ్రవరి నెలలో ఓటీటీకి రానున్నాయి. ఈ సంక్రాంతికి రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ విడుదలయ్యాయి. అయితే, వీటన్నింటిలో వెంకటేశ్ మూవీనే సంక్రాంతి విన్నర్గా నిలిచిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో కూడా ఈ చిత్రమే పైచెయి సాధించింది. ఇప్పుడు మళ్లీ ఈ మూడు సినిమాలు ఓటీటీలో పోటీ పడనున్నాయి.'గేమ్ ఛేంజర్'-- అమెజాన్ ప్రైమ్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్ ఛేంజర్ (Game Changer) చేరిపోయింది. అయితే, ఫేక్ కలెక్షన్స్ ఇచ్చారంటూ నెట్టింట భారీగా ట్రోల్స్ రావడంతో తరువాతి రోజుల్లో వాటి వివరాలు ప్రకటించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఫిబ్రవరి 14న గేమ్ ఛేంజర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.'డాకు మహారాజ్'--నెట్ఫ్లిక్స్నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్'(Daaku Maharaaj) బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అయితే, నైజాం, హిందీ ఏరియాలో ఏమాత్రం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. బాబీ లొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న విడుదలైంది. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్పై రూమర్లు స్ట్రాంగ్గానే వినిపిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్(Netflix) వేదికగా ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ వంటి స్టార్స్ నటించారు.'సంక్రాంతికి వస్తున్నాం'-- జీ5విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam). ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ మార్క్కు దగ్గరలో ఉంది. ఈ సినిమాతో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్కు మంచి లాభాలు వచ్చాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ రైట్స్ను జీ5 (ZEE5) దక్కించుకుంది. వాస్తవంగా ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రావాలి. కానీ, థియటర్ రన్ మెరుగ్గా ఉండటంతో వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావచ్చు. -
సైఫ్ అలీఖాన్ కుమారుడి తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీఖాన్ నటుడిగా బిగ్ స్క్రీన్కు పరిచయం కాబోతున్నాడు. ఎంతోమంది స్టార్ కిడ్స్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నడానియన్ (Nadaaniyan) అన్న టైటిల్ ఖరారు చేశారు. దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సునీల్ శెట్టి, దియా మీర్జా, జుగల్ హన్సరాజ్, మహిమా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఓటీటీలో రిలీజ్ కానున్న ఫస్ట్ మూవీఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్ ఎప్పుడన్నది చెప్పకుండా త్వరలోనే అంటూ సస్పెన్స్లో ఉంచింది. ఈ సినిమాతో షావునా గౌతమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు.ఇబ్రహీం..సైఫ్ అలీఖాన్, అతడి మాజీ భార్య అమృతా సింగ్ తనయుడే ఇబ్రహీం. మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం సైఫ్.. హీరోయిన్ కరీనా కపూర్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు సంతానం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్ -
'పుష్ప కంటే కాటేరమ్మే నయం'.. ఆ విషయంలో నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతంలో ఎప్పుడులేని విధంగా పలు రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పరాజ్ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా కలెక్షన్స్లో మొదటిస్థానంలో ఉంది.అయితే పుష్ప-2 తాజాగా ఓటీటీకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుడా ఇటీవల అదనంగా యాడ్ చేసిన సన్నివేశాలను ఓటీటీలో చూసే అవకాశాన్ని ఫ్యాన్స్కు కల్పించారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఓటీటీలో పుష్ప-2 చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ రప్పా రప్పా గురించి నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. గాల్లో తేలుతూ అల్లు అర్జున్ ఫైట్ చేసిన సన్నివేశాలైతే ఆడియన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.అయితే క్లైమాక్స్ సీన్పై ఒక పక్క ప్రశంసలు కురుస్తుంటే.. మరోవైపు విమర్శలు కూడా చేస్తున్నారు. ఆ ఫైట్స్ సీక్వెన్స్ను ప్రభాస్ సలార్ మూవీ కాటేరమ్మ ఫైట్ సీన్తో పోలుస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఈ ఫైట్ సీన్ను కామెడీగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది మాస్ హీరో సన్నివేశమా లేదా కామెడీ సన్నివేశమా? అని కామెంట్స్ చేస్తున్నారు. గాల్లోకి ఎగిరి ఫైట్ చేయడం చూస్తుంటే నవ్వడం ఆపుకోలేకపోయానంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే నేను బట్టలు ఉతుక్కోవడం ఇలాగే ఉంటుందని పోస్ట్ చేశారు.కాటేరమ్మ > రప్పా రప్పాపుష్ప-2 క్లైమాక్స్ ఫైట్ (రప్పా రప్పా) కంటే ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలోని కాటేరమ్మ ఫైట్ చాలా బాగుందని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 'రప్పా రప్పా' ఫైట్ సీన్ 'ఓవర్ ది టాప్' ప్రశంసించాడు. అయినప్పటికీ పుష్ప 2 క్లైమాక్స్ చాలా ఓవర్గా ఉంది. సలార్ కాటేరమ్మ సీన్ అదిరిపోయిందని తెలిపాడు. ఇది పుష్ప ఫైట్ కంటే కాటేరమ్మ సీక్వెన్స్కు ఎక్కువ రిపీట్స్ ఉన్నాయని రాసుకొచ్చాడు. అయితే ఇందులో అల్లు అర్జున్ గొప్పగా చేసినప్పటికీ రప్పా రప్పా కంటే కాటేరమ్మ సీన్ ఎక్కువని అభిప్రాయం వ్యక్తం చేశారు.In my opinion,Pushpa 2 climax was more over the top.Salaar kaateramma scene was worth it.It has a greater number of repeats than rappa sequence of pushpa.It's what I really felt.Nonetheless, AA did a great job.But for me,Kaateramma > Rappa#Salaar #Pushpa2 https://t.co/9DnePiuTtA— Sandeep (@02Sandeepdyh) January 31, 2025 How to Watch Pushpa 2 Without Regretting It:1. Intro Scene: Skip it entirely and jump straight to his wake-up scene.2. Songs: Whenever a song pops up, just fast-forward to the next scene.3. Climax Fight (Rappa Rappa): Do yourself a favour. Skip it completely (highly…— 𝓚𝓻𝓲𝓼𝓱𝓪𝓿 (@haage_summane) January 31, 2025 -
హాలీవుడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం బ్యాక్ ఇన్ యాక్షన్(Back in Action) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.హాలీవుడ్ సినిమాలన్నీ ఏదైనా ఒక జోనర్కి సంబంధించనవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఓ యాక్షన్ జోనర్ని ఫ్యామిలీతో కలిపి హాలీవుడ్లో సినిమా రావడమంటే అదో వింత. అదే ‘బ్యాక్ ఇన్’ యాక్షన్ సినిమా. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ సినిమాకి సేత్ గార్డన్ దర్శకుడు . కేమరన్ డియాజ్, జెమీ ఫాక్స్ వంటి ప్రముఖ నటులతో పాటు జేమ్స్ బాండ్ సినిమాలలో సుపరిచితురాలైన గ్లెన్ క్లోజ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం. ఇక కథ విషయానికొస్తే... అమెరికాలోని ప్రముఖ సీఐఎ సంస్థలో ప్రతినిధులుగా పని చేస్తున్న ఎమిలీ, మాట్ ప్రేమించుకుంటుంటారు. వారి ప్రేమకు ఫలితంగా ఎమిలీ గర్భవతి అవుతుంది. ఆ విషయాన్ని ఓ ఆపరేషన్లో భాగంగా మాట్కు చెబుతుంది ఎమిలీ. ఆ ఆపరేషన్ ఏంటంటే ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్య మరియు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించిన ఓ డేటా డ్రైవ్ను తీసుకురావడం. ఈ దశలో ఇద్దరూ ఓ ఘోర విమాన ప్రమాదం నుండి తప్పించుకుంటారు. అలా తప్పించుకున్నవాళ్లు ఇక ప్రపంచానికి తమ ఉనికి తెలియకుండా దూరంగా పుట్టబోయే పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్లిద్దరూ 12 ఏళ్ళ దాకా అటు సీఐఎకి ఇటు ప్రపంచానికి తమ అసలు ఉనికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ 12 ఏళ్లలో వాళ్లకి ఇద్దరు పిల్లలు పుడతారు. తమ పిల్లలకు కూడా తమ అసలు ఐడెంటిటీ తెలియనివ్వరు. అయితే ఏ ఆపరేషన్ కోసం వీళ్లిద్దరూ అజ్ఞాతానికి వచ్చారో ఆ ఆపరేషన్ వల్లే మళ్లీ కథ మొదలవుతుంది. ఆ ఆపరేషన్లో శత్రువులకు దొరకకుండా ఉండాలని మాట్ తనతో పాటు ఆ డేటా డ్రైవ్ని ఎమిలీకి కూడా తెలియకుండా దాస్తాడు. ఆ డ్రైవ్ కోసం విలన్స్ వీళ్లిద్దరినీ మళ్లీ ట్రాక్ చేసి ఎటాక్ చేస్తారు. మరి విలన్స్ ఆ డ్రైవ్ చేజిక్కించుకుంటారా? తమ పిల్లలకు, సమాజానికి తమ ఐడెంటీటీని దాచి పెట్టిన ఎమిలీ, మాట్ విలన్స్ ఎటాక్ నుండి తప్పించుకున్నారా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. పైన చెప్పుకున్నట్టు ఇదో చక్కటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. మంచి స్టంట్స్, విజువల్స్తో పాటు చక్కని కామెడీని ఈ సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు. మరింకెందుకు ఆలస్యం... గ్రాబ్ యువర్ రిమోట్ టు ‘బ్యాక్ ఇన్ యాక్షన్’ ఫర్ వాచింగ్ దిస్ వీకెండ్.– ఇంటూరు హరికృష్ణ -
ప్రాణాలతో చెలగాటమాడే థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీజన్-3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
2021లో రిలీజై అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game). తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇటీవల మరో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్కు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా సీజన్-2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుసగా రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరో సీజన్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్-3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ జూన్ 27న స్క్విడ్ గేమ్-3ని స్ట్రీమింగ్కు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. దీంతో ఇలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్లు ఇష్టపడే ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.Press ⭕ for the final round.Watch Squid Game Season 3 on 27 June. #NextOnNetflix pic.twitter.com/SwdBVLB83f— Netflix India (@NetflixIndia) January 30, 2025 -
ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ 'అనూజ' చిత్రం
ఓవైపు హాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతగా కూడా నిరూపించుకుంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). తాను నిర్మాతగా తెరకెక్కించిన 'అనూజ' (Anuja) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ షార్ట్ లిస్ట్లో స్థానం దక్కించుకొని సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆడమ్ జే గ్రేవ్స్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. జీవిత గమనాన్ని మార్చే సినిమాగా అనూజ అందరినీ మెప్పిస్తుందని ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులో తాను భాగమయ్యినందుకు గర్వపడుతున్నాని ఆమె తెలిపింది.ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్లో అనూజ చోటు దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అనూజ చిత్రం కోసం ఎదరుచూస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 5 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్లో చోటు దక్కించుకున్న ఈ చిత్రం తప్పకుండా అవార్డ్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు.బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. మన దేశం నుంచి రేసులో అనూజ చిత్రం ఉండటం విశేషం. -
ఓటీటీలోకి వచ్చేసిన పుష్పరాజ్.. ఫ్యాన్స్కు బోనస్
పుష్పగాడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేశాడు. దేశవ్యాప్తంగా సినిమా ప్రియులు పుష్ప2(Pushpa 2: The Rule) ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, జనవరి 30 అర్ధరాత్రి నుంచే ఓటీటీలో 'పుష్పగాడి' రూల్ మొదలైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను దాటేసింది. ఇప్పటికి 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 1896 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు.మరో నాలుగు నిమిషాలు అదనంగతేడాది డిసెంబరు 5న భారీ అంచనాలతో విడుదలైన పుష్ప2 మొత్తం రన్టైమ్ 3 గంటల 20 నిమిషాలుగా ఉంది. అయితే, సంక్రాంతి రేసులో ఈ సినిమా నిడివి అదనంగా మరో 20 నిమిషాలు జోడించారు. అప్పుడు పుష్ప రన్ టైమ్ 3:40 నిమిషాలు అయింది. ఫ్యాన్స్కు బోనస్గా ఇప్పుడు ఓటీటీ వర్షన్లో మరో 4 నిమిషాల సీన్లు అదనంగా మరోసారి జత చేశారు. దీంతో పుష్ప2 మొత్తం రన్ టైమ్ 3:44 గంటలు ఉంది. -
ఎట్టకేలకు ఓటీటీకి పుష్ప-2.. అఫీషియల్గా డేట్ ప్రకటించిన నెట్ప్లిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్'పుష్ప 2 ది రూల్'( (Pushpa 2: The Rule)) మూవీ ఓటీటీ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. గత రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు నెట్ఫ్లిక్స్ ఫుల్స్టాప్ పెట్టింది. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 30 నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్లో ట్రైలర్ వీడియోను పోస్ట్ చేసింది.రీ లోడెడ్ వర్షన్ కూడా..పుష్ప- 2 రీలోడెడ్ వర్షన్తో పాటు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. అదనంగా 23 నిమిషాల రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేయనుంది.బాక్సాఫీస్ షేక్ చేసిన పుష్పరాజ్..సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప-2 ది రూల్ (Pushpa 2: The Rule) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత కోసింది. పుష్పరాజ్ దెబ్బకు పలు సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలై ఏడు వారాల తర్వాత పుష్పరాజ్ ఓటీటీలో సందడి చేయనున్నాడు. Pushpa Bhau ne sun li aapki baat, ab Pushpa ka rule, Hindi mein bhi 🔥Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, on 30 January in Hindi, Telugu, Tamil, Malayalam & Kannada!#Pushpa2OnNetflix pic.twitter.com/smPXn4IMD9— Netflix India (@NetflixIndia) January 29, 2025 -
ఓటీటీకి పుష్ప-2.. ఆడియన్స్కు మరో షాకిచ్చిన నెట్ఫ్లిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప-2 ది రూల్'. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి రిలీజైంది. పుష్పకు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఏకంగా బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమాల రికార్డులను ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్పై కన్నేసిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.అయితే ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ త్వరలోనే రానుందని ఫ్యాన్స్కు హింట్ ఇచ్చేసింది. అయితే ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు. అంతకుముందు పుష్ప-2 జనవరి 30న రానుందని నెట్ఫ్లిక్స్లో కనిపించింది. దీంతో అందరూ ఆ తేదీనే ఫిక్సయిపోయారు. కానీ అది పొరపాటున అలా రివీల్ చేశారో తెలీదు.. కాసేపటికే కమింగ్ సూన్ అంటూ ఆడియన్స్కు షాకిచ్చింది.పుష్ప-2 ఫ్రీ కాదట..అయితే తాజాగా నెట్ఫ్లిక్స్ పుష్ప అభిమానులకు మరో షాకిచ్చింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్న ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. పుష్ప-2 ఓటీటీలో చూడాలంటే అదనంగా రూ.199 చెల్లించాలని ట్రైలర్ వీడియోను రిలీజ్ చేసింది. అంటే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ రెంట్ చెల్లించాల్సిందే. దీంతో ఓటీటీలో ఫ్రీగా చూసేద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.బాక్సాఫీస్ వద్ద జోరు..పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.Dabbante lekka ledhu… power ante bayam ledhu… adhey Pushpa 🔥 https://t.co/4qs7VtaTfQ— Netflix India South (@Netflix_INSouth) January 29, 2025 -
ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు!
నయనతార (Nayanthara)పై ధనుష్ వేసిన పరువునష్టం దావాను సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ (Netflix) వేసిన పిటిషన్ను మద్రాస్ న్యాయస్థానం కొట్టివేసింది. నటుడి అనుమతి లేకుండా అతడి సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని తప్పుపట్టింది. నయనతార బయోపిక్లో నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్స్ వాడుకోవడంపై నిర్మాత ధనుష్ (Dhanush) అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. దీన్ని సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు దీన్ని కొట్టిపారేసింది. మరోవైపు బయోపిక్పై మధ్యంతర నిషేధం విధేంచాలన్న ధనుష్ నిర్మాణ సంస్థ పిటిషన్పై ఫిబ్రవరి 5న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.అసలేం జరిగింది?నయనతార జీవితకథ ఆధారంగా నెట్ఫ్లిక్స్ నయతార: బియాండ్ ది ఫెయిరీటేల్(Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులో నానుమ్ రౌడీదాన్ సినిమాలోని మూడు సెకన్ల సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సమయంలోనే విఘ్నేశ్, నయన్ ప్రేమలో పడ్డారు. అందుకని సదరు సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అయితే దానికి ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 24 గంటల్లో ఆ సన్నివేశాలను తొలగించాలని, లేదంటే రూ.10 కోట్లు జరిమానా విధిస్తానన్నాడు. ఆయన హెచ్చరికలను అటు నయనతార, ఇటు నెట్ఫ్లిక్స్ ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో ధనుష్ హైకోర్టును ఆశ్రయించాడు.చదవండి: ప్లాస్టిక్ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్ -
ఓటీటీకి పుష్ప-2.. ఆడియన్స్కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నెట్ఫ్లిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇప్పటికే బాహుబలి, బాహుహలి-2, కేజీఎఫ్ లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డ్పై కన్నేసిన పుష్పరాజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలో పుష్ప-2 ఓటీటీకి సంబంధించి ఈ రోజు పెద్దఎత్తున వార్తలొస్తున్నాయి. దీనికి కారణం నెట్ఫ్లిక్స్లో పుష్ప-2 రీ లోడెడ్ వర్షన్ కమింగ్ ఆన్ థర్స్డే అనే పోస్టర్ కనిపించింది. దీంతో ఈ వారంలోనే పుష్ప-2 ఓటీటీకి రానుందని అంతా ఫిక్సయిపోయారు. ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ను బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో చూసేద్దాం.ఉదయం నుంచి పుష్ప-2 ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అంతా రాసుకొచ్చారు. కానీ తాజాగా నెట్ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది. పుష్ప-2 మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇవాళ నెట్ఫ్లిక్స్లో గురువారం అని ఇచ్చారు కానీ.. ఈ వారంలోనా.. లేదంటే వచ్చేవారంలోనా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఆడియన్స్లో కన్ఫ్యూజన్కు తెరదించేందుకు నెట్ఫ్లిక్స్ పోస్టర్ను రిలీజ్ చేసింది. మరీ ఈ వారంలోనే ఓటీటీకి వస్తుందా? ఫిబ్రవరి 6న రానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ఫిబ్రవరి 6 నుంచే ఛాన్స్..పుష్ప-2 చిత్రం రిలీజైన ఫిబ్రవరి 6వ తేదీకి రెండు నెలలు పూర్తవుతుంది. ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం 56 రోజుల తర్వాతే ఓటీటీకి రావాలి. ఈ లెక్కన చూస్తే ఈ వారంలో ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదు. నెట్ఫ్లిక్స్ చేసిన పొరపాటుకు ఆడియన్స్ ఈ వారంలోనే వస్తుందని ఫిక్స్ అయిపోయారు. మరి పుష్పరాజ్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేస్తాడా? లేదంటే ఫిబ్రవరిలోనా అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.బాక్సాఫీస్ వద్ద జోరు..పుష్ప 2 చిత్రం కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,850 కోట్లు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించింది. ఆపై బాహుబలి2 రికార్డ్స్ను దాటేసింది. కేవలం హిందీలో రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ మూవీ కూడా సాధించలేని రికార్డ్స్ పుష్ప2 క్రియేట్ చేసింది.సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పుష్ప చిత్రానికి సీక్వెల్గా 2024 డిసెంబర్ 5న విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీగా నటించారు. ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటించారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు.The man. The myth. The brAAnd 🔥 Pushpa’s rule is about to begin! 👊 Watch Pushpa 2- Reloaded Version with 23 minutes of extra footage on Netflix, coming soon in Telugu, Tamil, Malayalam & Kannada! pic.twitter.com/ZA1tUvNjAp— Netflix India (@NetflixIndia) January 27, 2025 -
ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు.. ఆ రెండు స్పెషల్!
కొత్త ఏడాదికి తెలుగు సినిమా గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ (Sankranthiki Vasthunam Movie)తో బాక్సాఫీస్ ఇప్పటికీ కళకళలాడుతోంది. జనవరి 12న విడుదలైన నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా సైతం మంచి వసూళ్లు రాబట్టింది. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' ఆరంభంలో అదరగొట్టినా తర్వాత మాత్రం తడబడింది. ఈ సినిమాలు ఇప్పుడప్పుడే ఓటీటీ (OTT)లో వచ్చే సూచనలు కనిపించట్లేదు. అయితే జనవరి చివరి వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు, సిరీస్లు రెడీ అయ్యాయి. అందులో అల్లు అర్జున్ 'పుష్ప 2', త్రిష 'ఐడెంటిటీ' వంటి ఆసక్తికరమైన సినిమాలున్నాయి. ఆ పూర్తి జాబితా ఓసారి చూసేద్దాం..థియేటర్లో విడుదలమదగజరాజ (తెలుగు వర్షన్) - జనవరి 31రాచరికం - జనవరి 31మహిహ - జనవరి 31ఓటీటీనెట్ఫ్లిక్స్అమెరికన్ మ్యాన్హంట్: ఓజే సింప్సన్ (డాక్యుమెంటరీ సిరీస్) - జనవరి 29పుష్ప 2 - జనవరి 30ద రిక్రూట్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 30లుక్కాస్ వరల్డ్ - జనవరి 31ది స్నో గర్ల్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 31 హాట్స్టార్ద స్టోరీటెల్లర్ - జనవరి 28యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్మ్యాన్ (కార్టూన్ సిరీస్) - జనవరి 29ద సీక్రెట్ ఆఫ్ ద షిలేదార్స్ (వెబ్ సిరీస్) - జనవరి 31జీ5ఐడెంటిటీ - జనవరి 31 అమెజాన్ ప్రైమ్ర్యాంపేజ్ - జనవరి 26ట్రిబ్యునల్ జస్టిస్ సీజన్ 2 (రియాలిటీ కోర్ట్ షో) - జనవరి 27బ్రీచ్ - జనవరి 30ఫ్రైడే నైట్ లైట్స్ - జనవరి 30యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ - జనవరి 30 యాపిల్ టీవీ ప్లస్మిథిక్ క్వెస్ట్ సీజన్ 4 (వెబ్ సిరీస్) - జనవరి 29సోనీలివ్సాలే ఆషిక్ - ఫిబ్రవరి 1లయన్స్ గేట్ప్లేబ్యాడ్ జీనియస్ - జనవరి 31ముబిక్వీర్ - జనవరి 31చదవండి: రాజమౌళిపై ట్రోలింగ్.. 'మీరు ఇండియన్స్ కాదా?' -
పుష్ప 2 ఓటీటీ ప్రకటన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'పుష్ప 2' మూవీ (Pushpa 2: The Rule)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరాచకం సృష్టించాడు. రికార్డులన్నీ రప్పారప్పా కొట్టుకుంటూ పోయాడు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. థియేటర్లలో విడుదలై ఏడు వారాలకు పైనే అవుతుండటంతో అభిమానులు ఓటీటీలో పుష్పరాజ్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.ఈ వారమే ఓటీటీలో రిలీజ్ఈ క్రమంలో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. పుష్ప 2 ఈ గురువారం (జనవరి 30న) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ గురువారం రిలీజ్ కానున్నట్లు యాప్లో చూపిస్తోంది. అందులో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు రాసుంది. రీలోడెడ్ వర్షన్ ప్రకారం మూడు గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 ఓటీటీలో సందడి చేయనుంది.సినిమాపుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.చదవండి: ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం -
ఈ వారం ఓటీటీకి ఏకంగా 11 చిత్రాలు.. ఆ రెండే స్పెషల్..!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. ఈ ఏడాది థియేటర్లలో మూడు తెలుగు సినిమాలను సినీ ప్రియులను అలరించాయి. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో వెంకీమామ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. దీంతో ఈ వారంలో ఏయే సినిమాలు వస్తున్నాయని ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల సందడి ముగియడంతో ఓటీటీల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ వారంలో చాలా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. వాటిలో ముఖ్యంగా రజాకార్, బరోజ్ 3డీ ఆడియన్స్లో ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఈ వారంలోనే సినీ ప్రియులను అలరించనున్నాయి. ఏయే మూవీ ఓ ఓటీటీలో రానుందో మీరు ఓ లుక్కేయండి.ఈ వారం ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్..ది నైట్ ఏజెంట్- సీజన్ 2(వెబ్ సిరీస్) -జనవరి 23షాఫ్డెట్( కామెడీ సిరీస్)- జనవరి 24ది శాండ్ క్యాస్టిల్(హాలీవుడ్ మూవీ)- జనవరి 24ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్(కొరియన్ సినిమా)- జనవరి 24అమెజాన్ ప్రైమ్ వీడియో..హర్లీమ్- సీజన్ 3 (వెబ్ సిరీస్)- జనవరి 23జీ5..హిసాబ్ బరాబర్-(హిందీ మూవీ)- జనవరి 24ఆహా..రజాకార్(టాలీవుడ్ సినిమా)- జనవరి 24డిస్నీ ప్లస్ హాట్స్టార్...బరోజ్ 3డీ(మలయాళ మూవీ)- జనవరి 22స్వీట్ డ్రీమ్స్- జనవరి 24జియో సినిమా..దిది-(హాలీవుడ్ సినిమా)- జనవరి 26యాపిల్ టీవీ ప్లస్..ప్రైమ్ టార్గెట్..(హాలీవుడ్ మూవీ) జనవరి 22 -
ఓటీటీలో భయపెడుతూ నవ్వించే సినిమా
సాధారణంగా సినిమాలలో ఓ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యూమర్ అయితే మరొకటి హారర్ జోనర్. కానీ ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా ‘భూల్ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3). ఇది ‘భూల్ భులయ్యా’ సిరీస్లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి, మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. ‘భూల్ భులయ్యా’ మొదటి భాగం ‘చంద్రముఖి’ సినిమా ఆధారంగా తీసింది. కానీ మిగతా రెండు భాగాలను మాత్రం అదే థీమ్తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు ‘భూల్ భులయ్యా 3’ సినిమా కథ విషయానికి వస్తే... 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం కనిపిస్తుంది. ఈ దెయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా బందిస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024లో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్తో ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)... తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్తో హారర్ ఎమోషన్ని కూడా హ్యూమర్ ఎమోషన్తో చక్కగా పలికించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్(Madhuri Dixit), నేటి వర్ధమాన తార విద్యాబాలన్(Vidya Balan) వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతోనూ సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలనివ్వకుండా స్క్రీన్ప్లే నడిపించాాడు. నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘భూల్ భులయ్యా 3’ వీకెండ్ వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీకి సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఇటీవల మలయాళ చిత్రాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అక్కడ సూపర్ హిట్ అయిన చిత్రాలు ఇతర దక్షిణాది భాషల్లోనూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. గతేడాదిలోనూ మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి చిత్రాలు టాలీవుడ్ ఫ్యాన్స్ను మెప్పించిన సంగతి తెలిసిందే.అలా కొత్త ఏడాదిలోనూ మలయాళ చిత్రాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ రైఫిల్ క్లబ్ ఓటీటీకి వచ్చేసింది. ఆశిక్ అబు దర్శకత్వం వహించిన గతేడాది డిసెంబర్లో మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ రోజు నుంచే ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇంకేందుకు ఆలస్యం యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఎంచక్కా చూసేయండి. ఈ చిత్రంలో విజయ రాఘవన్, దిలీశ్ పోతన్, వాణీ విశ్వనాథ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబరు 19న కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ టాక్ను సొంతం చేసుకుంది. దాదాపు రూ.30 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన రైఫిల్ క్లబ్ ఉన్ని ముకుందన్ మార్కో, మోహన్ లాల్ నటించిన బరోజ్ 3డీ లాంటి చిత్రాలతో పోటీపడి సూపర్ హిట్గా నిలిచింది.Ee clubil, thokkine kaalum unnam nokkinuWatch Rifle Club, now on Netflix!#RifleClubOnNetflix pic.twitter.com/66ADkpdtMa— Netflix India South (@Netflix_INSouth) January 16, 2025 -
కలల మేఘంపై అనూజ..
ప్రేక్షకులు మెచ్చే పాత్రలు ఎన్నో చేసిన ప్రియాంక చోప్రా ‘అనూజ’ ద్వారా తన ఉత్తమ అభిరుచిని చాటుకుంది. 97వ ఆస్కార్ అవార్డ్ల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘అనూజ’(Anuja) షార్ట్ లిస్ట్ అయింది. ‘అనూజ’ త్వరలో నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమ్ కానుంది. ఈ షార్ట్ ఫిల్మ్కు మిండి కాలింగ్, గునిత్ మోగాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియాంక చోప్రా.బాలకార్మికులైన పిల్లల బతుకు పోరాటంపై వెలుగులు ప్రసరించిన ఈ లఘుచిత్రానికి ఆడమ్ జోగ్రేవ్స్ డైరెక్టర్. తొమ్మిదేళ్ల అనూజ తన అక్కతో కలిసి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది. తన భవిష్యత్ కోసం పని మానేసి చదువుకోవాలా? కుటుంబం కోసం చదువును త్యాగం చేయాలా? అనే అనూజ జీవితంలోని ఈ సందిగ్ధ స్థితికి ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ అద్దం పడుతుంది.దోపిడి ప్రపంచంలో తమ ఆనందం, అవకాశాల కోసం ఆశపడే, పోరాడే ఇద్దరు సోదరీమణుల గురించి చెప్పే కథ ఇది.ప్రౌడ్ ఆఫ్ దిస్ బ్యూటీఫుల్ ఫిల్మ్’ అంటూ ‘అనూజ’ గురించి తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రియాంక చోప్రా.‘అనూజ’లో అనన్య షాన్ బాగ్ (పాలక్), సజ్దా పఠాన్ (అనూజ), నగేష్ బోంస్లే (మిస్టర్ వర్మ) నటించారు.(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!) -
నెట్ఫ్లిక్స్లో పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే!
కరోనా తర్వాత ఓటీటీల వాడకం దేశవ్యాప్తంగా ఎక్కువైంది. థియేటర్కి వెళ్లి సినిమా చూడడం తగ్గించి.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమాను వీక్షిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్తో పాటు నెట్ఫ్లిక్స్లోనూ ఇండియన్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్కి చెందిన స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా నెట్ఫ్లిక్స్లోనే స్క్రీమింగ్ అవుతున్నాయి. అయినప్పటికీ మిగతా భాషలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి నెట్ఫ్లిక్స్ ఖాతాదారులు తక్కువగానే ఉన్నారు. అందుకే ఆ సంస్థ టాలీవుడ్పై ఫోకస్ చేసింది. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది మరింత మందిని తమ ఖాతాదారులుగా చేర్చుకునేందుకు గాను నెట్ఫ్లిక్స్ పదులకొద్ది సినిమాలను కొనుగోలు చేసింది. టాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ఒకప్పుడు నెట్ఫ్లిక్స్ టాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్రాలకు కాస్త దూరంగా ఉండేది.ఏడాది మూడు నాలుగు చిత్రాలు మాత్రమే రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫుల్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాలను వరుసగా రిలీజ్ చేస్తుంది. గతేడాది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనేక చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.ఇక 2025లోనూ నెట్ఫ్లిక్స్ అదే ఒరవడి కొనసాగించనుంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు సినిమా జాబితాను ప్రకటించింది. ఈ సారి నెట్ఫ్లిక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్ ‘ఓజీ’, నాగచైతన్య ‘తండేల్’తో సహా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ చిత్రాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్లో విడుదలైన తర్వాత ఒప్పందం చేసుకున్న ప్రకారం ఈ చిత్రాలు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతాయి. ఆ క్రేజీ ప్రాజెక్ట్స్పై ఓ లుక్కేద్దాం.OG is back, and everybody is about to feel the heat! 💥 OG is coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/TawVw3QavA— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025పవన్ ‘ఓజీ’.పవన్ కల్యాణ్ నటించాల్సిన సినిమాల్లో ఓజీ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో మాత్రం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. ఈ చిత్రంతో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా.. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించబోతున్నారు.నాగచైతన్య ‘తండేల్’ When fate drags them across borders, only courage can bring them home. 🌊❤️Thandel, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/uRMGVxk43n— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సైతం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తండేల్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం థియేటర్స్లో విడుదల కానుంది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/FCCbwWHdcm— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 రవితేజ ‘మాస్ జాతర’రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, శ్రీలీల మళ్లీ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్ఐ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. A man without a side and betrayal without limits.VD12, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release!#NetflixPandaga pic.twitter.com/WugL3yTprB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025వీడి12విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ని కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో పాటు నాని హిట్ 3, మ్యాడ్ స్క్వేర్, జాక్, అనగనగా ఒక రాజు సినిమాలను సైతం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
భారత్ వర్సెస్ పాక్.. నెట్ఫ్లిక్స్లో దాయాది జట్ల డ్రామా
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉండే ఉత్కంఠ, ఉత్సాహమే వేరు. ఈ రెండు దాయాది జట్ల మధ్య ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప మ్యాచ్లు జరిగాయి. టెస్టులైనా, వన్డేలైనా, టి20లైనా ప్రతీ పోరు ప్రత్యేకమే. మైదానంలో ఇరు జట్ల వైరానికి సంబంధించి ఎన్నో ఘటనలను అభిమానులు ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి ఆసక్తికర ఘటనలు, వ్యాఖ్యలు, వివాదాలతో నెట్ఫ్లిక్స్ సంస్థ కొత్త డాక్యుమెంటరీని రూపొందించింది. ‘ద గ్రేటెస్ట్ రైవల్రీ’ పేరుతో సిద్ధం చేసిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న ప్రసారం కానుంది. గ్రే మ్యాటర్ ఎంటర్నైట్మెంట్ నిర్మించిన ఈ డ్రామాకు చంద్రదేవ్ భగత్, స్టివార్ట్ సగ్ దర్శకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, జావేద్ మియాందాద్, వకార్ యూనిస్, సౌరవ్ గంగూలీ, ఇంజమాముల్ హక్, వీరేంద్ర సెహా్వగ్, షోయబ్ అక్తర్, రవిచంద్రన్ అశి్వన్ ఇంటర్వ్యూలు ఇందులో ఉంటాయి. ‘రెండు దేశాల మధ్య మ్యాచ్లలో ఉండే భావోద్వేగాలు, తీవ్రతవంటివి ఇందులో చూపించాం. మీ అంచనాలకు తగ్గకుండా ఉత్కంఠభరితంగా దీనిని రూపొందించాం. మైదానంలో ఆట మాత్రమే కాదు. మైదానం బయట ఎన్నో ఆసక్తికర అంశాలను ఇందులో చూడవచ్చు’ అని రూపకర్తలు పేర్కొన్నారు. -
థియేటర్లలో రిలీజ్కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. దీంతో సినీ ప్రియులంతా కుటుంబంతో కలిసి మూవీ వీక్షించేందుకు సరికొత్త వేదికగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త చిత్రాలు ఓటీటీల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో కొన్ని థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీకి వస్తే.. మరికొన్ని చిన్న చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.అయితే ఈ సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సినిమాలు రిలీజ్కు ముందే ఓటీటీ ఫ్లాట్ఫామ్ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ప్లిక్స్ వెల్లడించింది. ఇంతకీ ఆ సినిమాలేవో మీరు ఓ లుక్కేయండి.గతంలో విడుదలైన మ్యాడ్ మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో ఇంకా విడుదల కాలేదు. రిలీజ్ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.దీంతో పాటు డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ నటిస్తోన్న తాజా చిత్రం జాక్. ఈ సినిమా కూడా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. మరో టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటిస్తోన్న కోర్టు మూవీ కూడా ఈ ఓటీటీలోనే రానుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న అనగనగా ఒక రాజు, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రాల హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ రివీల్ చేసింది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/zUpUbt2SdV— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 The truth is on trial, and one lawyer is determined to prove it. ⚖️ Court: State vs A Nobody, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/HzHtBdITgc— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 No plan, no limits, only guts 💥 Jack, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/90hJsZEYKd— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
సంక్రాంతికి సినిమాల జాతర.. ఓటీటీల్లో ఏకంగా 16 చిత్రాలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. నగరాలు వదిలి పల్లె చేరుకున్న ప్రజలు పండుగ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఇవాల్టి నుంచి భోగితో మొదలైన.. కనుమతో ఈ సంక్రాంతి మూడు రోజుల పాటు సాగనుంది. ఇంకేముంది కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంటర్టైన్మెంట్ చేసే సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ఈ సంక్రాంతిని మరింత సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేందుకు థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ఇప్పటికే విడుదలయ్యాయి. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పండుగ రోజే బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది.ఈ పండుగ వేళ కుటుంబంతో కలిసి సినిమాలను ఆస్వాదించేందుకు ఓటీటీలే సరైన వేదిక. ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే ఈ పండుగు ఓటీటీల్లో పెద్ద సినిమాలు లేకపోవడం మైనస్. విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించిన విడుదల పార్ట్-2 మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ మూవీ. దీంతో బాలీవుడ్ ఐ వ్యాంట్ టు టాక్ అనే సినిమాతో పాటు పలు హాలీవుడ్ సిరీస్లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్సింగిల్స్ ఇన్ఫెర్నో(కొరియన్ రియాలిటీ షో) సీజన్ 4- 14 జనవరివిత్ లవ్ మెగాన్- హాలీవుడ్- జనవరి 15జో కిట్టీ సీజన్-2 - కొరియన్ వెబ్ సిరీస్- 16 జనవరిబ్యాక్ ఇన్ యాక్షన్-(హాలీవుడ్ మూవీ)- 17 జనవరిది రోషన్స్- హిందీ డాక్యుమెంటరీ సిరీస్- 17 జనవరిఅమెజాన్ ప్రైమ్ వీడియోఐ వ్యాంట్ టు టాక్- హిందీ సినిమా- జనవరి 17పాతల్ లోక్ సీజన్-2- 17 జనవరిడిస్నీ ప్లస్ హాట్స్టార్పవర్ ఆఫ్ పాంచ్- (హిందీ వెబ్ సిరీస్)- 17 జనవరిజీ5విడుదల పార్ట్-2- తమిళ సినిమా- జనవరి 17 సోని లివ్పణి- మలయాళ సినిమా- 16 జనవరిఅమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్చిడియా ఉద్- హిందీ సిరీస్- జనవరి 15ఎపిక్ ఆన్గృహ లక్ష్మి- హిందీ సిరీస్- జనవరి 16జియో సినిమాస్పీక్ నో ఈవిల్- హాలీవుడ్ సినిమా- జనవరి 13హర్లీ క్వీన్- సీజన్ -5(హాలీవుడ్)- జనవరి 17లయన్స్ గేట్ ప్లేహెల్ బాయ్- ది క్రూక్డ్ మ్యాన్-(హాలీవుడ్ మూవీ)- జనవరి 17మనోరమ మ్యాక్స్ఐ యామ్ కథలాన్(మలయాళ సినిమా)- జనవరి 17 -
బాలయ్య 'డాకు మహారాజ్'.. ఏ ఓటీటీకి రానుందంటే?
నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్. బాలీ కొల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిదంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంతో తమన్ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని చెబుతున్నారు.డాకు మహారాజ్కు సక్సెస్ టాక్ రావడంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ఓటీటీ గురించి అప్పుడే చర్చ మొదలెట్టారు. బాలయ్య మూవీ ఏ ఓటీటీకి రానుందని తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఓ టాక్ నడుస్తోంది. బాలకృష్ణ డాకు మహారాజ్ హక్కులను ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. (ఇది చదవండి: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)టికెట్ ధరల పెంపు..జనవరి 12న విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్లో రూ.135, సింగిల్ థియేటర్స్లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.ఈ సారి డాకు మహారాజ్ సినిమాపై అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్లలో 350 షోలు ప్రదర్శించారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుజనవరి 9న జరగాల్సిన డాకు మహారాజ్ (Dsaku Maharaaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event) రద్దయింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది. ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. డైరెక్టర్ బాబీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నా. యాక్షన్తోపాటు మంచి వినోదం, భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. ఈ నెల 12న నా బర్త్ డే కానుకగా ఈ చిత్ర విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కోరారు. -
థియేటర్లలో గేమ్ ఛేంజర్.. ఓటీటీల్లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్!
అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైంది. వరుసగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అంతేకాకుండా ఈ శుక్రవారం నుంచే పొంగల్ సినిమాల సందడి స్టార్ట్ అయింది. థియేటర్లలో రామ్ చరణ్ గేమ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.అయితే ఈ సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు మంచి సమయం. అందరికీ సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్పీరియన్స్. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై బజ్ ఉన్నప్పటికీ.. అందరికీ వీలుపడదు. ఎంచక్కా ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఈ సంక్రాంతికి తెలుగు చిత్రం హైడ్ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు బాలీవుడ్ నుంచి విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీకి రానున్నాయి. దీంతో ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో గేమ్ ఛేంజర్, సోనూ సూద్ ఫతే సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఏ ఓటీటీలో రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ శుక్రవారం ఓటీటీ, థియేటర్ చిత్రాలు..థియేటర్స్..గేమ్ ఛేంజర్(తెలుగు సినిమా)-జనవరి 10ఫతే(హిందీ సినిమా)-జనవరి 10ఓటీటీ సినిమాలు..నెట్ఫ్లిక్స్యాడ్ విటమ్- జనవరి 10బ్లాక్ వారెంట్ -జనవరి 10ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10డిస్నీ+ హాట్స్టార్గూస్బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10జీ5సబర్మతి రిపోర్ట్- జనవరి 10ఆహాహైడ్ అండ్ సీక్- జనవరి 10 హోయ్చోయ్నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10 -
OTT: ఓటీటీలో భయపెడుతూ నవ్విస్తున్న సినిమా!
సాధారణంగా సినిమాలలో ఓ రెండిటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యుమర్ అయితే మరోటి హారర్. కాని ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా భూల్ భులయ్యా3. ఇది భూల్ భులయ్యా(Bhool Bhulaiyaa 3) సిరీస్ లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. భూల్ భులయ్యా మొదటి భాగం చంద్రముఖి సినిమా ఆధారంగా తీసింది. కాని మిగతా రెండు భాగాలు మాత్రం అదే థీమ్ తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు భూల్ భులయ్యా 3(Bhool Bhulaiyaa-3) సినిమా కథ విషయానికొస్తే 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం తయారవుతుంది. ఈ దేయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా భద్రపరుస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024 సంవత్సరంలో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్ గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తాయి. మరి ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్ కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ సినిమా లో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన రోహాన్. తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తో హారర్ ఎమోషన్ ని కూడా హ్యుమర్ ఎమోషన్ తో చక్కగా నటించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్, నేటి వర్ధమాన తార విద్యాబాలన్ వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతో కూడా సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలినివ్వకుండా స్క్రీన్ ప్లే నడిపాడు. నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్నఈ భూల్ భులయ్యా వీకెండ్ వాచబుల్ మువీ. - ఇంటూరు హరికృష్ణ. -
మరోసారి వివాదంలో నయనతార.. చంద్రముఖి నిర్మాతల నోటీసులు
హీరోయిన్ నయనతార (Nayanthara) మరోసారి వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పగతోనే నోటీసులు పంపాడన్న నయన్కాగా తమ అనుమతి లేకుండా నానుమ్ రౌడీ దాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని మూడు సెకన్ల క్లిప్స్ను తన డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిరీ టేల్కు వాడుకున్నారంటూ ధనుష్ (Dhanush).. నయనతారకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే! తమపై కక్షగట్టే ధనుష్ నోటీసులు పంపించాడన్న నయనతార మరి ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి!వివాదం ఎలా మొదలైందంటే?నయనతార జీవితంపై నెట్ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇందుకుగానూ కొన్ని సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అందులో భాగంగా నేనూ రౌడీనే చిత్రంలోని మూడు సెకన్ల సన్నివేశం ఉపయోగించుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాత. ఈ సినిమా చేస్తున్న సమయంలో విఘ్నేశ్- నయన్ లవ్లో పడ్డారు. చాలాకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022లో పెళ్లి చేసుకున్నారు.(చదవండి: నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత)ధనుష్పై నయనతార ఆగ్రహంఈ విశేషాలను తన డాక్యుమెంటరీలో పొందుపరిచారు. అయితే నేనూ రౌడీనే సినిమా క్లిప్స్ తన అనుమతి లేకుండా వాడేయడంతో ధనుష్ రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీనిపై నయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తండ్రి, అన్నయ్య అండతో నువ్వు నటుడిగా ఎదిగావు. నేనూ ఏ బ్యాక్గ్రౌండ్లో లేకుండా ఈ సినీప్రపంచంలో పోరాడి ఈ స్థాయిలో ఉన్నాను. నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నాతోపాటు నా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నా మనసు ముక్కలైందినీకు మాపై పగ ఉండొచ్చు. కానీ దానివల్ల ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డవారి జీవితాలపైనే అది ప్రభావం చూపిస్తుంది. నా ఇతర సినిమా క్లిప్స్ వాడాం.. కానీ ఎంతో ప్రత్యేకమైన నేనూ రౌడీనే చిత్ర సన్నివేశాలు మాత్రం ఉపయోగించలేకపోయాం. ఈ సినిమా పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్టవుతాయి. కానీ ఎన్నిసార్లు అభ్యర్థించినా నువ్వు వాటిని వాడుకోవడానికి వీల్లేదనడం నా మనసును ముక్కలు చేసింది. బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు.ఇంత దిగజారుతావనుకోలేదుకానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్లే మేం బాధపడాల్సి వస్తోంది. నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు -
స్క్విడ్ గేమ్ 3 రిలీజ్ డేట్.. నెట్ఫ్లిక్స్ కావాలనే లీక్ చేసిందా?
డబ్బు కోసం ఆశ.. అందుకోసం షార్ట్కట్స్ వెతికే జనాలు.. దీన్ని అలుసుగా తీసుకున్న ధనికులు.. వారి ప్రాణాలతో చెలగాటమాడే గేమ్ సృష్టిస్తారు. ఈ ఆటలో ఓడిపోయినవారు గేమ్లోనే కాదు జీవితంలోనే ఎలిమినేట్ ఆడతారు. అదే స్క్విడ్ గేమ్. ఈ కొరియన్ వెబ్ సిరీస్ సృష్టికర్త హ్వాంగ్ డాంగ్ హ్యుక్. అంతర్జాతీయ అవార్డులుఈ స్క్విడ్ గేమ్ సిరీస్ను 2021లో రిలీజ్ చేయగా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయింది. క్రిటిక్స్ ఛాయిస్, గోల్డెన్ గ్లోబ్, పీపుల్స్ ఛాయిస్.. ఇలా ఎన్నో అవార్డులు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన ఈ సిరీస్కు కొనసాగింపుగా 2024 డిసెంబర్లో సీక్వెల్ వచ్చింది. ఈ సిరీస్ కూడా ఆదరణ పొందింది కానీ క్లైమాక్స్ను సగంలోనే ముగించేసినట్లుగా ఉంటుంది.గుడ్న్యూస్దీంతో మూడో పార్ట్ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే సీజన్ 3 ఉంటుందని ఓ టీజర్ వదిలింది. అయితే అందులో పొరపాటున 2025 జూన్ 27న రిలీజ్ అవుతుందని పేర్కొంది. ఈ విషయం క్షణాల్లో వైరలవగా.. నెట్ఫ్లిక్స్ కొరియా యూట్యూబ్ ఛానల్ వెంటనే ఆ టీజర్ను డిలీట్ చేసింది.కావాలనే..?నెట్ఫ్లిక్స్ పొరపాటు చేసిందా? లేదంటే అందరూ మాట్లాడుకునేలా చేయాలని కావాలనే అలా రిలీజ్ డేట్ పెట్టి డిలీట్ చేసిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ సారి స్క్విడ్ గేమ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించకుండా ఆరు నెలల్లోనే ఎంచక్కా చూసేయొచ్చని అభిమానులు సంతోషిస్తున్నారు. Netflix accidentally reveals that the final season of ‘SQUID GAME’ releases on June 27. pic.twitter.com/3gswYQpoqf— The Hollywood Handle (@HollywoodHandle) January 1, 2025చదవండి: ఆ హీరోయిన్ ఆస్తులు 4600 కోట్లు.. అమితాబ్ కంటే ఎక్కువే! -
భవిష్యత్తులో ఇలాంటి బైకులే!.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
-
2025 ప్రారంభంలో ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్లు ఇవే!
హిట్లు, ఫ్లాపులు, అవార్డులు, రికార్డులు, వివాదాలతో సినీచిత్రపరిశ్రమ 2024కు ముగింపు పలుకుతోంది. గంపెడాశలతో 2025కి స్వాగతం చెప్తోంది. మరి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్లేంటో చూసేద్దాం..అమెజాన్ ప్రైమ్🎥 గ్లాడియేటర్ 2 - జనవరి 1🎥 బీస్ట్ గేమ్స్ షో (నాలుగో ఎపిసోడ్) - జనవరి 2🎥 ది రిగ్ (వెబ్ సిరీస్) - జనవరి 2🎥 గుణ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 3 హాట్స్టార్📺 ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ - జనవరి 3ఆహా🎥 జాలీ ఓ జింఖానా (తమిళ చిత్రం) - డిసెంబర్ 30నెట్ఫ్లిక్స్📺 అవిసీ: ఐయామ్ టిమ్ (డాక్యుమెంటరీ) - డిసెంబర్ 31📺 డోంట్ డై: ద మ్యాన్ హు వాంట్స్ టు లివ్ ఫరెవర్ - జనవరి 1📺 ఫ్యామిలీ క్యాంప్ - (జనవరి 1)📺 రీయూనియన్ - జనవరి 1📺 లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్) - జనవరి 1📺 మిస్సింగ్ యు (వెబ్ సిరీస్) - జనవరి 1📺 ద బ్లాక్ స్విండ్లర్ - జనవరి 1📺 సెల్లింగ్ ది సిటీ (వెబ్ సిరీస్) - జనవరి 3📺 వెన్ ది స్టార్స్ గాసిప్ (వెబ్ సిరీస్) - జనవరి 4 లయన్స్గేట్ ప్లే🎥 డేంజరస్ వాటర్స్ - జనవరి 3🎥 టైగర్స్ ట్రిగ్గర్ - జనవరి 3బుక్ మై షో📺 క్రిస్మస్ ఈవ్ ఇన్మిల్లర్స్ పాయింట్ - డిసెంబర్ 30మనోరమా మ్యాక్స్🎥 ఐయామ్ కథలన్ (మలయాళం) - జనవరి 1చదవండి: టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ -
ఓటీటీలోకి వచ్చేసిన 'ఆర్ఆర్ఆర్' డాక్యుమెంటరీ
ఆర్ఆర్ఆర్.. టాలీవుడ్ కీర్తిని ఆస్కార్ రేంజ్కు ఈ చిత్రం తీసుకెళ్లింది. ఈ సినిమాకు సంబంధించి తెరవెనుక జరిగిన ఆసక్తికర విషయాలను 'ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో థియేటర్స్లో విడుదల చేశారు. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మూడు గంటల పాటు చూసి అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా వెనక దాగి ఉన్న మూడేళ్ల కష్టాన్ని చూపించాలని మేకర్స్ అనుకున్నారు.ఎన్టీఆర్, రామ్చరణ్ నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా హిట్ కొట్టిన ఈ చిత్రంలో అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్గణ్, శ్రియ, అలీసన్ డూడీ, దివంగత నటుడు రే స్టీవెన్ సన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేశారు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి 'ఆస్కార్' అందుకునే వరకూ జరిగిన ఆసక్తికర సంఘటనలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. డిసెంబరు 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మాత్రమే దీనిని విడుదల చేశారు. అయితే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ జక్కన్నకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. డిసెంబర్ 27 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతన్న 'ఆర్ఆర్ఆర్- బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీని మీరూ చూసేయండి. దీని రన్టైమ్ 1 గంట 38 నిమిషాలు ఉంది. ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర విషయాలను ఇందులో పంచుకున్నారు. -
ఓటీటీలో 'హారర్ థ్రిల్లింగ్' సినిమా స్ట్రీమింగ్
బాలీవుడ్లో సూపర్ హిట్ ఫ్రాంఛైజీ భూల్ భులయ్యా నుంచి విడుదలైన మూడో సినిమా 'భూల్ భులయ్యా 3'. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రి,విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ మూవీ నవంబర్ 1న విడుదలైంది. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని భారీ బడ్జెట్తో నిర్మించారు.భూల్ భూలయ్యా 3 ప్రాజెక్ట్లోకి విద్యాబాలన్ రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్స్లలో చూడని వారు తమ ఇంట్లోనే చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. అందుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భూల్ భూలయ్యా 3 ఓటీటీ ప్రకటన విషయాలను పలు వీడియోలతో నెట్ఫ్లిక్స్ ఇప్పటికే షేర్ చేసిన విషయం తెలిసిందే.రూహ్ బాబా పాత్ర పోషించిన కార్తీక్ ఆర్యన్పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. హారర్ కామెడీ జానర్లో 2024లో విడుదులై హిట్ కొట్టిన సినిమాల జాబితాలో భూల్ భూలయ్యా 3 టాప్లో ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ వండర్లా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఊహకు కూడా అందవని చెప్పవచ్చు. హీరో ఎంట్రీ సాంగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సుమారు 1000 మంది డ్యాన్సర్లతో తెరకెక్కిన ఎంట్రీ సాంగ్ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. సుమారు రూ. 150 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 450 కోట్లు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. -
వారం రోజుల్లోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ
దర్శకధీరుడు తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీకి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం ఈనెల 20న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ గురించి ఈ మూవీలో చూపించారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని రివీల్ చేసింది చిత్రబృందం. ఈనెల 27 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.కాగా.. 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్గా మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ మూవీ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాదిలో సెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.Behind the scenes, beyond the legacy. Watch RRR: Behind and Beyond, an exclusive peek into the making of SS Rajamouli’s magnum opus on Netflix, out 27 December!#RRRBehindAndBeyondOnNetflix pic.twitter.com/Py9pyL7Nws— Netflix India South (@Netflix_INSouth) December 23, 2024 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
ఓటీటీలో ఎప్పటికప్పుడు బోలెడన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాదికి ముగింపు పలుకుతూ మరో కొత్త సినిమా కూడా రిలీజ్కు రెడీ అయింది. తమిళ క్రైమ్ థ్రిల్లర్ సొర్గవాసల్ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ డిసెంబర్ 27 నుంచి సొర్గవాసల్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సిద్దార్థ్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ, సానియా ఇయప్పన్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 29న థియేటర్లలో విడుదలైంది. జైలు బ్యాక్ డ్రాప్తో సస్పెన్స్ థ్రిల్లర్గా ఆకట్టుకుందని సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కథేంటంటే.. హీరో రోడ్డు పక్కన ఫుడ్స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. అక్కడికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ నిత్యం వస్తుంటాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ చొరవతో తనకు లోన్ ఇప్పించమని కోరుతాడు. అలా లోన్ సాంక్షన్ లెటర్ తీసుకునేందుకు ఆఫీసర్ దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో అధికారి హత్య జరగ్గా అందుకు హీరోను నిందితుడిగా భావించి జైల్లో వేస్తారు. ఆ అధికారిని ఎవరు చంపారు? హీరోను కావాలని జైలుకు పంపించిందెవరు? తర్వాత ఎలా బయటకు వచ్చాడు? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)చదవండి: రూ.100 కోట్లిచ్చినా ఆ పాత్ర చేయను: హీరోయిన్ -
సడెన్గా ఓటీటీలో 'తంగలాన్' సినిమా
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే, సడెన్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తంగలాన్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.తంగలాన్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిల్,మలయాళం,కన్నడలో ఈ చిత్రం తాజాగా విడుదలైంది. తంగలాన్ సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. అంతేకాకుండా బౌద్ధమతం గురించి చాలా పవిత్రంగా చూపించిన దర్శకుడు వైష్ణవులను మాత్రం కించపరిచేలా తెరకెక్కించారని పిటీషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలో విడుదలైతే ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసు విచారణ అనంతరం ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలైంది.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
OTT: ఫాంటసీ యానిమేటెడ్ కిడ్స్ మూవీ ‘దట్ క్రిస్మస్ ’ రివ్యూ
క్రిస్మస్ పండుగ సినిమాలకు చాలా మంచి సీజన్. స్టార్ హీరోల నుండి స్మాల్ సినిమాల వరకూ ప్రపంచం మొత్తం సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి కొత్త సినిమాలు రెడీ గా ఉంటాయి. మరీ ముఖ్యంగా కిడ్స్ కోసం ఈ సీజన్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇంక యానిమేటడ్ సినిమాల గురించి అయితే చెప్పనే అక్కరలేదు, బోల్డన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో క్రిస్మస్ సీజన్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా ఇటీవల దట్ క్రిస్మస్ అనే ఫాంటసీ యానిమేటెడ్ కిడ్స్ మూవీ రిలీజ్ అయింది. ప్రముఖ రచయిత రిచర్డ్ కర్టిస్ రాసిన దట్ క్రిస్మస్ అండ్ అదర్ స్టోరీస్ సైమన్ ఓటో ఆధారంగా ఈ సినిమా తీశారు. 2024 అక్టోబరు నెలలో జరిగిన లండన్ ఫెస్టివల్ లో ఈ సినిమాని స్పెషల్ గా స్క్రీన్ చేశారు. అంత చక్కటి కథ తో ఈ సినిమాని తీశారు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే...క్రిస్మస్ పండుగ అంటే లవ్ అండ్ అఫెక్షన్ తో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే పండుగ. ఈ పండుగకు హీరో శాంతా తాత. పిల్లలందరూ ఈ శాంతా తాత ఇచ్చే గిఫ్ట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి శాంతా తాత ఓ మిస్టేక్ వల్ల ఇవ్వాల్సిన గిఫ్ట్ టైంకి ఇవ్వలేకపోతే ఏమవుతుంది అన్నదే ఈ సినిమా. వెల్లింగ్టన్ లో వున్న టౌన్స్ ఫాక్ నగరానికి ఈసారి క్రిస్మస్ పండుగ తనతో పాటు పెద్ద మంచు తుఫానును తీసుకువస్తుంది. తుఫానులో శాంతాతాత గిప్ట్స్ తో బయలుదేరగా దారిలో తుఫానులో చిక్కుకుంటాడు. మరి శాంతాతాత ఆ తుఫాను నుండి తప్పించుకుని టౌన్స్ ఫాక్ నగరంలోని కిడ్స్ కు గిఫ్ట్స్ ఇస్తాడా లేదా అన్నది దట్ క్రిస్మస్ సినిమాలోనే చూడాలి. సినిమా అంతా చాలా సూపర్ గా ఉంటుంది. కిడ్స్ గ్రాబ్ యువర్ స్నాక్స్ అండ్ ట్యూన్ టు నెట్ ఫ్లిక్స్ టు వాచ్ దట్ క్రిస్మస్.– ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో 'జిగ్రా' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్లో మెప్పించినప్పటికీ కథలో పెద్దగా బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టాలను మిగిల్చింది. ఆలియా భట్ తమ్ముడి పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు చాలారోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే, డిసెంబర్ 6న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్లలో ఆమె భాగం కానుంది. -
అల్లు అర్జున్ పుష్ప-2.. ఏ ఓటీటీకి రానుందంటే?
వైల్డ్ ఫైర్ అంటూ థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాడు. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలతో పుష్పరాజ్ హవా మొదలైంది. ఈ రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్పై ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. ఏ ఓటీటీకి రానుందనే చర్చ అప్పుడే మొదలైంది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తాజా సమాచారం. భారీ ధరకు పుష్ప-2ను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మూవీ రిలీజైన నెల రోజుల తర్వాతే ఓటీటీకి వచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.(ఇది చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో 2021లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్గా పుష్ప-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం రష్మిక మందన్నా శ్రీవల్లిగా మరోసారి మెప్పించింది. అంతేకాకుండా కిస్సిక్ అనే ఐటమ్సాంగ్లో శ్రీలీల మెరిసింది. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఓటీటీకి వచ్చేసిన రూ.300 కోట్ల మూవీ.. ఎక్కడ చూడాలంటే?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దీపావళికి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ను వద్ద సూపర్హిట్గా నిలిచింది. దాదాపు నెల రోజుల పాటు థియేటర్లలో రన్ అయింది. ఈ సినిమాకు రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.అమరన్ ఈ రోజు నుంచే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ హిట్ సినిమా కావడంతో ఓటీటీలోనూ అదరగొడుతుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీని కమల్ హాసన్, మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. -
OTT: ‘ది బకింగ్ హామ్ మర్డర్స్’ మూవీ రివ్యూ
నేరం ఎక్కడ జరిగినా నేరస్తుడి కోణం లో పరిశోధన జరిపితే నేరస్తుడు సులభంగా దొరుకుతాడు అని చెప్పే సినిమా ది బకింగ్ హామ్ మర్డర్స్. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకొని అల్లుకున్న కథ ఇది. 2023సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ నాడు జరిగిన 67వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాని దర్శకులు హన్సల్ మెహతా రూపొందించారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రధారి అయిన జస్మీత్ భమ్రా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటించడం విశేషం. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే.. జస్మీత్ ఓ బ్రిటీష్ ఇండియన్ డిటెక్టివ్. తన కొడుకు ఓ డ్రగ్ అడిక్ట్ చేతిలో చనిపోతాడు. ఆ విషయాన్ని తట్టుకోలేక జస్మీత్ బకింగ్ హామ్ నగరానికి కు ట్రాన్సఫర్ చేయించుకుంటుంది. బకింగ్ హామ్ కు రావడం తోనే ఓ కేసు తనకు తానే కావాలని తీసుకుంటుంది. బకింగ్ హామ్ లో నివాసం వుంటున్న దల్జీత్, ప్రీతి కొల్లి దత్తపుత్రుడు ఇష్ ప్రీత కనబడడం లేదని ఆ కేసు సారాంశం. ఈ కేసు జస్మీత్ తీసుకోవడానికి కారణం తప్పిపోయిన ఇష్ ప్రీత్ సరిగ్గా తన కొడుకు వయసు వాడవడం ఒకటయితే ఈ కేసు లో డ్రగ్స్ పాత్ర ఉండడం రెండవ కారణం. ఓ పక్క కొడుకును పోగొట్టుకున్న బాధతో మరో పక్క కనబడని బిడ్డ కోసం తల్లిదండ్రులకు తోడుగా ఈ కేసును జస్మీత్ ఎలా సాల్వ్ చేస్తున్నదే మిగతా సినిమా. సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలంటే అందరూ ఇష్టపడరు. కాని ఈ సినిమా చూసేకొద్దీ చూస్తున్నవాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇక సినిమా స్క్రీన్ ప్లే ఊహకందని ట్విస్టులతో ఉత్కంఠ రేపుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఓ హైలైట్ అనే చెప్పాలి. కరీనాకపూర్ ఈ పాత్రలో జీవించందనే చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా దాదాపు మూడు వారాల నుండి టాప్ 10 లో నిలిచింది. వర్తఫుల్ మూవీ ఫర్ దిస్ వీకెండ్ వాచిట్. -
థియేటర్లలో పుష్పరాజ్ జాతర.. ఓటీటీల్లో ఏకంగా 23 సినిమాల సందడి !
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. డిసెంబర్ నెల ఫస్ట్ వీక్లోనే రిలీజవుతోన్న పుష్ప-2 కోసమే అంతా వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. దీంతో ఈ వారమంతా పుష్ప మానియా కొనసాగనుంది. పుష్ప-2 రిలీజ్ అవుతున్నందున బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు విడుదల కావడం లేదు.అయితే ఓటీటీల్లో ఈ వారంలో సందడి చేసేందుకు చిత్రాలు సిద్ధమయ్యాయి. దీపావళికి రిలీజైన బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన అమరన్ ఓటీటీకి రానుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా వరుణ్ తేజ్ మట్కా సైతం ఈ వారంలోనే ఓటీటీలో సందడి చేయనుంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాలు సైతం ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ అమరన్(తమిళ మూవీ)- డిసెంబర్ 05 చర్చిల్ ఎట్ వార్ (డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబరు 04 దట్ క్రిస్మస్ (యానిమేషన్ చిత్రం)- డిసెంబరు 04 ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబరు 04 ది అల్టిమేటమ్ (వెబ్సిరీస్)- డిసెంబరు 04 బ్లాక్ డవ్జ్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 05 విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ సినిమా)- డిసెంబరు 06 ఎ నాన్సెన్స్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06 జిగ్రా (హిందీ సినిమా)- డిసెంబరు 06 మేరీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06అమెజాన్ ప్రైమ్ మట్కా(తెలుగు సినిమా)- డిసెంబర్ 05 జాక్ ఇన్టైమ్ ఫర్ క్రిస్మస్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 03 పాప్ కల్చర్ జెప్పడీ (వెబ్సిరీస్) -డిసెంబరు 04 అగ్ని (హిందీ సినిమా)- డిసెంబరు 06 ది స్టిక్కీ (హాలీవుడ్ చిత్రం)- డిసెంబరు 06 జియో సినిమా క్రియేట్ కమాండోస్ (యానిమేషన్ మూవీ)- డిసెంబరు 06 లాంగింగ్ (హాలీవుడ్)- డిసెంబరు 07డిస్నీ ప్లస్ హాట్స్టార్ ది ఒరిజినల్ (కొరియన్ సిరీస్) -డిసెంబరు 03 లైట్ షాప్ (కొరియన్)- డిసెంబరు 04జీ5 మైరీ (హిందీ సినిమా)- డిసెంబరు 06సోనీలివ్ తానవ్2 (హిందీ/తెలుగు) -డిసెంబరు 06 బుక్ మై షో స్మైల్-2 (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 04 -
ఓటీటీలో సంచలన రికార్డు సాధించిన 'దేవర’
-
'లక్కీ భాస్కర్' ఎఫెక్ట్.. మరోసారి ఆ తప్పు చేయను: మీనాక్షి చౌదరి
తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటి మీనాక్షిచౌదరి. ఇటీవల ఆమెకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా తమిళంలో విజయ్ఆంటోనీకి జంటగా 'కొలై' చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నటుడు ఆర్జే బాలాజి సరసన నటించిన 'సెలూన్' చిత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ్కు జంటగా 'గోట్' చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో మీనాక్షిచౌదరికి పెద్దగా నటించే అవకాశం లేకపోయినా భారీ చిత్రం కావడంతో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'లక్కీ భాస్కర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్కు భార్యగా, ఒక బిడ్డకు అమ్మగా ఆమె నటించి షాకిచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని కూడా అందుకుంది. దీంతో ఆమె కూడా బాగా సంతోషించింది. అయితే, ఈ సినిమాలో భార్యగా, తల్లిగా నటించడం రుచించలేదట. దీంతో ఇకపై భార్య, అమ్మ పాత్రల్లో నటించరాదని నిర్ణయం తీసుకున్నారట. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ 'లక్కీ భాస్కర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్కు భార్యగా నటించినందుకు తనకు ప్రశంసలు లభించినా కొందరు స్నేహితులు తనను భయపెడుతున్నారని చెప్పారు. కెరీర్ ప్రారంభ దశలోనే ఇలా భార్యగా, తల్లికి బిడ్డగా నటించకపోవడం చాలా మంచిదనే అభిప్రాయాన్ని తన స్నేహితులు సలహా ఇచ్చినట్లు తెలిపింది. అలాంటి పాత్రలకు ఇంకా చాలా కాలం ఉందని సూచించినట్లు పేర్కొన్నారు. అలా కాకుంటే త్వరలోనే అక్క, అమ్మ పాత్రలకు పరిమితం చేస్తారని గట్టిగానే భయపెట్టారని తెలిపింది. దీంతో ఇకపై తాను హీరోకు భార్యగా, బిడ్డకు తల్లిగా నటించే పాత్రలను అంగీకరించరాదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా యాక్షన్తో కూడిన కమర్షియల్ కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాట్లు మీనాక్షిచౌదరి చెప్పారు.లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షి చౌదరి నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఒక భార్యగా మాత్రమే కాకుండా తల్లిగా నటించడంలో తనదైన మార్క్ చూపింది. ఈ సినిమా తన కెరీర్లో బెస్ట్ చిత్రంగా ఉండనుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్లకు పైగానే రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. -
ఓటీటీలో రూ. 300 కోట్ల సినిమా .. అధికారిక ప్రకటన
సూపర్ హిట్ సినిమా అమరన్ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా థియేటర్స్లో భారీ కలెక్షన్స్తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ మూవీ నెట్ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్న్యూస్ వచ్చేసింది.భారీ అంచనాల మధ్య విడుదలై అమరన్ మూవీ డిసెంబర్ 5న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. తమిల్తో పాటు తెలుగు,మలయాళం, కన్నడ,హిందీ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. -
'నా సినిమా నెట్ఫ్లిక్స్ పక్కనపడేసింది.. కోపం, బాధ.. ఎలాగైనా..!'
దిబాకర్ బెనర్జీ.. బాలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాలు తీశాడు. ఖోస్ల కా ఘోస్లా, ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్, లవ్ సెక్స్ ఔర్ ఢోకా వంటి చిత్రాలతో తనకంటూ ఓ పేరు సంపాదించాడు. అయితే అతడు డైరెక్షన్ చేసిన ఓ సినిమా మాత్రం ఏళ్ల తరబడి రిలీజ్కు నోచుకోకుండా ఉండిపోయిందని బాధపడుతున్నాడు.విడుదలకు నోచుకోని సినిమాఅదే 'టీస్'. ఇది రీలీజ్ చేస్తే ఎక్కడ విమర్శల్లో చిక్కుకుంటామోనని నెట్ఫ్లిక్స్ వెనకడుగు వేస్తూ వస్తోంది. తాజాగా ఈ మూవీ ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఈ క్రమంలో వచ్చే ఏడాదైనా దీన్ని రిలీజ్ చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిప్రెషన్..సినిమా స్క్రీనింగ్ అనంతరం దిబాకర్ బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెట్ఫ్లిక్స్ టీన్ను పక్కన పడేయడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. కోపం, ఫ్రస్టేషన్, బాధ... డిప్రెషన్కు లోనయ్యాను. నాన్నా, ఎప్పుడూ కోపంగా ఉంటున్నావేంటని నా కూతుళ్లు అడిగినప్పుడు మరింత బాధపడ్డా.. అప్పుడే థెరపీ చేయించుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కోలుకుని కుదుటపడ్డాను.లాయర్లకే రూ.20-30 లక్షలు ఖర్చునాకు నెట్ఫ్లిక్స్ మీద కోపం లేదు. ఎందుకంటే అప్పట్లో అమెజాన్ ప్రైమ్ కూడా తాండవ్ అనే సంచలనాత్మక సిరీస్ను రిలీజ్ చేసింది. అందుకుగానూ బెదిరింపులు, కేసులు జరిగాయి. ఇలాంటి కేసుల్లో పోరాడేందుకు లాయర్లకే రూ.20-30 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే సంచలనాత్మక కంటెంట్ను రిలీజ్ చేసేందుకు వాళ్లు భయపడుతున్నారు. అందులో తప్పు లేదు.టీస్ మూవీ..నెట్ఫ్లిక్స్ కాకుండా ఇంకెవరైనా కొంటారేమో అని ఎదురుచూశాను కానీ అది జరగలేదు అని చెప్పుకొచ్చాడు. కాగా 2020-21 మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్ టీన్ను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. కానీ తర్వాత ఉన్నట్టుండి మనసు మార్చుకుని సినిమాను అటకెక్కించేసింది. ఈ మూవీలో మనీషా కొయిరాలా, దివ్య దత్త, నజీరుద్దీన్ షా, హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించారు.చదవండి: బిగ్బాస్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే? -
ఓటీటీలో 'అమరన్' స్ట్రీమింగ్ తేదీని లాక్ చేశారా..?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’. థియేటర్స్లో భారీ కలెక్షన్స్తో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు నెట్ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్టింట ఒక వార్త ట్రెండ్ అవుతుంది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్,క సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే, అమరన్ మాత్రం స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు.భారీ అంచనాల మధ్య అక్టోబర్ 31న విడుదలై అమరన్ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా విడుదలై ఇప్పటికే నాలుగు వారాలు దాటింది అయనప్పటికీ కలెక్షన్స్ పరంగా కొన్ని చోట్ల రానిస్తుంది. దీంతో ఓటీటీ విషయంలో ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 5న నెట్ప్లిక్స్లో అమరన్ విడుదల కానుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఇదే తేదీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివకార్తికేయన్ కెరీర్లో టాప్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా అమరన్ నిలిచింది. -
ఓటీటీకి వచ్చేసిన వందకోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ ఏడాది దీపావళికి టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. విడుదలైన మూడు సినిమాలు హిట్గా నిలిచాయి. శివకార్తికేయన్ అమరన్, కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ దివాళీకి విడుదలై బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. అయితే వీటిలో అమరన్ ఇంకా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే వీటిలో సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ ఇవాళే ఓటీటీకి వచ్చేసింది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది.అసలు కథేంటంటే..?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. -
'ఎలిమినేట్ అయితే చంపేస్తారు'.. స్క్విడ్ గేమ్ ట్రైలర్ చూశారా?
2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ను దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్కు దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి సీజన్ లాగే ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంతమంది వ్యక్తులు.. డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్లో భాగమవుతారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.తెలుగులోనూ విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ను మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు, ప్రమాదకరమైన గేమ్స్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.అసలు ఈ స్క్విడ్ గేమ్ ఏంటంటే..జీవితంలో అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్లైట్, గ్రీన్లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం సిక్స్ గేమ్స్ ఉంటాయి. చివరి గేమ్ పేరే స్క్విడ్ గేమ్. అయితే ఈ గేమ్స్లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తుంటారు. సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ను సొంతం చేసుకుంది. -
నయనతార డాక్యుమెంటరీ.. ఎవరికీ ఉపయోగం లేదన్న ప్రముఖ రచయిత!
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ విడుదల తర్వాత వివాదం మొదలైన సంగతి తెలిసిందే. తన సినిమాలో మూడు సెకన్ల క్లిప్ను అనుమతి లేకుండా వాడారని హీరో ధనుశ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరగనుంది.ఇదిలా ఉండగా నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీపై ప్రముఖ బాలీవుడ్ నవలా రచయిత్రి శోభా దే మండిపడ్డారు. తాను నయనతార డాక్యుమెంటరీని చూశానని.. కానీ అందులో స్ఫూర్తిదాయకమైన అంశాలు ఏమీ లేవన్నారు. ప్రోమోలు చూసే వరకు నయనతార గురించి నాకు పూర్తిగా తెలియదని.. అందుకే ధైర్యం చేసి 45 నిమిషాల డాక్యుమెంటరీ చూసినట్లు తెలిపారు.(ఇది చదవండి: నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్)అయితే వివాహం లాంటి వ్యక్తిగత విషయాలను డబ్బుల కోసం ఇలా డాక్యుమెంటరీ రూపొందించడం సరికాదని ఆమె విమర్శించారు. ఇందులో ఎలాంటి సందేశం లేదని అన్నారు. ఆమెను చూసి మరికొందరు సినీ తారలు డబ్బుల కోసం ఇదే పద్ధతిని పాటిస్తారేమో అంటూ విమర్శలు చేశారు. అయితే కొంతమంది శోభా దే వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.కాగా.. నయనతార రూపొందించిన ఈ డాక్యుమెంటరీ కేవలం తన వ్యక్తిగత, కెరీర్, వివాహం ఆధారంగా తీసుకొచ్చారు. విఘ్నేష్ శివన్తో ఆమె వివాహం గురించి ప్రధానంగా చూపించారు. ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఫుటేజీని ఉపయోగించినందుకు రూ.10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shobhaa De (@shobhaade) -
చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే
హీరో నాగచైతన్య మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. డిసెంబరు 4న హైదరాబాద్లోని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఈ శుభకార్యం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. సరిగ్గా ఈ టైంలో ఓ పుకారు బయటకొచ్చింది. చైతూ-శోభిత పెళ్లిని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ.50 కోట్లకు డీల్ మాట్లాడుకుందని అన్నారు. కానీ అందులో నిజం లేదు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)చైతూ-శోభితకు సన్నిహితుడైన ఓ వ్యక్తి.. ఓటీటీ డీల్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని తేల్చేశారు. పెళ్లి.. చాలా ప్రైవేట్గా జరగనుందని క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్లు రావడానికి ఓ కారణముంది. రీసెంట్గా 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరిట ఈమె జీవితాన్ని డాక్యుమెంటరీగా తీసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. దీనిపై నెగిటివ్ కామెంట్సే వినిపించాయి.ఇదే డాక్యుమెంటరీలో నయన పెళ్లి వీడియోని కూడా చూపించారు. ఈ క్రమంలోనే చైతూ-శోభిత పెళ్లిని కూడా నెట్ఫ్లిక్స్ సంస్థ ఓటీటీలో ప్రసారం చేయనుందనే రూమర్ పుట్టుకొచ్చింది. ఇదంతా అబద్ధమని తేలింది. ప్రస్తుతం చైతూ 'తండేల్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'విరూపాక్ష' దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
ఓటీటీలో 'లక్కీ భాస్కర్'.. అధికారిక ప్రకటన
దీపావళి సందర్భంగా 'లక్కీ భాస్కర్' సినిమాతో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఈసారి లక్కీ భాస్కర్తో అక్టోబర్ 31న థియేటర్స్లోకి వచ్చేశాడు. సుమారు రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్లో తన సత్తా నిరూపించుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు.దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా 'లక్కీ భాస్కర్' చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ఆ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉండనుంది. కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ. -
'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!
'బాహుబలి' పేరు చెప్పగానే ప్రభాస్, రాజమౌళి.. ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్కి గుర్తింపు. ఇలా చాలా గుర్తొస్తాయి. ఇప్పటికే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే చాలామంది దీని పేరే చెబుతారు. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'బాహుబలి' విషయంలో ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది. ఓ హిందీ నటుడు ఇప్పుడీ విషయాన్ని మరోసారి బయటపెట్టాడు.'బాహుబలి' రెండు సినిమాలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్.. ఈ కాన్సెప్ట్తో సిరీస్ తీయాలని ప్లాన్ చేసింది. 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్' పేరుతో 2018లో ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ జరగ్గా.. తొలిసారి ఓ టీమ్ పనిచేస్తే ఔట్పుట్ సరిగా రాలేదని మరో టీమ్తో పనిచేయించారు. అయినా సరే కంటెంట్ నచ్చకపోయేసరికి నెట్ఫ్లిక్స్ సంస్థ దాన్ని పక్కనబెట్టేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా 'లక్కీ భాస్కర్')ఈ సిరీస్లో కీలక పాత్రలో నటించిన నటుడు బిజయ్ ఆనంద్.. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 'బాహుబలి' సిరీస్ని నెట్ఫ్లిక్స్ సంస్థ మూలన పడేయడాన్ని బయటపెట్టాడు. దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారని, తాను కూడా దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశానని బిజయ్ చెప్పాడు. ఈ క్రమంలోనే డేట్స్ కుదరక ప్రభాస్ 'సాహో' మూవీలో ఛాన్స్ మిస్సయ్యాయని పేర్కొన్నాడు.దీనిబట్టి చూస్తే సినిమాగా హిట్ అయింది కదా అని ప్రతి దాన్ని క్యాష్ చేసుకుందామనుకుంటే కొన్నిసార్లు ఇలా ఎదురుదెబ్బలు కూడా తగులుతుంటాయి. బిజయ్ ఆనంద్ ఇప్పుడు చెప్పడంతో 'బాహుబలి' సిరీస్ మూలనపడ్డ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభు ఉద్యోగం) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అలియా భట్' యాక్షన్ మూవీ
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలోకి రానుంది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్లో దుమ్మురేపింది. అంకుర్ పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 6న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్లలో ఆమె భాగం కానుంది. -
ఎరుపు రంగు చీరలో లేడీ సూపర్ స్టార్ ..వైరల్గా పెళ్లినాటి పోటోలు
-
మూడు వారాల్లోనే ఓటీటీకి భారీ బడ్జెట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ఆయన 'బఘీరా' అనే సినిమాకు స్టోరీ అందించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. డాక్టర్. సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఫుల్ యాక్షన్ మూవీగా వచ్చి బఘీరా ఓటీటీ ప్రియులను ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే. Veeraru inna kalpanikaralla. Ooralli ondu hosa veera bandidane, avana hesare…Bagheera 🐆⚡️Watch Bagheera on Netflix, out 21 November in Kannada, Tamil, Telugu and Malayalam!#BagheeraOnNetflix pic.twitter.com/xxYzLzF0qD— Netflix India South (@Netflix_INSouth) November 20, 2024 -
నయనతారతో డేటింగ్.. నన్ను ఆ జంతువుతో పోల్చారు: విఘ్నేశ్ శివన్
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. అయితే తాజాగా నయనతార తన జర్నీని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ డాక్యుమెంటరీలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నయనతారతో డేటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో వివరించారు. తాను నయన్తో డేటింగ్లో ఉన్నప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో తనకు తెలుసన్నారు. ఒక మృగాన్ని అందమైన అమ్మాయి ఎంచుకుంటే దానిని ఎవరూ ఆపలేరంటూ.. నన్ను కుక్కతో పోల్చారని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నారని చేసిన మీమ్లో మా ఇద్దరి చిత్రాలు ఉన్నాయని విఘ్నేశ్ తెలిపారు.అయితే తాను నయనతారతో డేటింగ్ చేయడంలో తప్పు ఏంటని ట్రోలర్స్ను విఘ్నేశ్ ప్రశ్నించాడు. బస్ కండక్టర్ సూపర్ స్టార్ (రజినీకాంత్) అయ్యారు.. మన జీవితంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదని అన్నారు. మేమిద్దరం లవ్లో ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని తెలిపారు. వాటిని నేను తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. నయనతార గిల్టీగా ఫీలయిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు నేను తన జీవితంలో భాగం కాకపోతే.. ఆమె మరింత సంతోషంగా ఉండేదన్న భావనతో కలిగిందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు.నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నయన్ తన ప్రేమ జీవితం, కెరీర్ ఆధారంగా తీసుకొచ్చారు. ఆమె తన అరంగేట్రం నుంచి సినీ ప్రయాణం చూపించారు. ఇందులో నాగార్జున, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, రాధిక శరత్కుమార్, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా నటించారు. కాగా.. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత ధనుశ్- నయనతార మధ్య వివాదం మొదలైంది. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ ధాన్ మూవీ క్లిప్లను ఉపయోగించినందుకు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు ధనుశ్. -
OTT: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఎలా ఉందంటే?
నయనతార జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తెరకెక్కించిన డ్యాక్యుమెంటరీ సిరీస్‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నేటి(నవంబర్ 18) నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గంట ఇరవైరెండు నిమిషాల నిడివిగల ఈ డ్యాక్యుమెంటరీ సిరీస్ ఎలా ఉంది? అందులో ఏం చూపించారు?🔸నయనతార జీవితం మొత్తాన్ని ఓ బ్యూటిఫుల్ స్టోరీగా మలిచి తెరపై అందంగా చూపించే ప్రయత్నం చేసింది నెట్ఫ్లిక్స్🔸నయనతార చిన్నప్పటి ఫోటోలను చూపుతూ..ఆమె స్కూల్ డేస్ సీన్తో ఈ డ్యాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది.🔸ఆమెకు సినిమా చాన్స్ ఎలా వచ్చింది? మాలీవుడ్ నుంచి కోలీవుడ్కి ఎలా ఎంట్రీ ఇచ్చిందనేది ఆయాన డైరెక్టర్లతో చెప్పించారు.🔸కెరీర్ తొలినాళ్లతో నయనతార పడిన ఇబ్బందులను, బాడీ షేమింగ్ చేసినప్పుడు తను పడిన మానసిక క్షోభను పంచుకున్నారు.🔸తన పర్సనల్ లైఫ్పై వచ్చిన కొన్ని విమర్శల కారణంగా సినిమా చాన్స్లు కోల్పోయినా.. తిరిగి ఎలా ట్రాక్లోకి వచ్చారనేది ఆసక్తికరంగా తెలియజేశారు.🔸శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు నయనతారను తీసుకున్నప్పడు వచ్చిన విమర్శలను చూసి ఆమె ఎంత బాధపడిందనే విషయాలను ఆయా దర్శక నిర్మాతలతో చెప్పించారు.🔸తనపై వచ్చిన విమర్శలన్నింటిని పక్కన పడేసి.. ‘లేడీ సూపర్ స్టార్’గా ఎలా ఎదిగారనేది ఆసక్తికరంగా చూపించారు.🔸ఫస్టాఫ్ మొత్తం నయనతార బాల్యం, సినీ కెరీర్ని చూపించి..సెకండాఫ్లో విఘ్నేశ్తో ప్రేమాయణం ఎలా మొదలైంది? వివాహ జీవితం ఎలా ఉందనేది చూపించారు.🔸‘నానుమ్ రౌడీ దాన్’సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి? విఘ్నేశ్కి నయన్ ఎలాంటి సపోర్ట్ని అందించింది? ఎలా ప్రేమలో పడిపోయారనేది చక్కగా చూపించారు.🔸పెళ్లికి ముందు వీరిద్దరి రిలేషన్షిప్ ఎలా కొనసాగిందో అనేది వారి మాటల్లోనే చూపించారు. ప్రేమలో ఉన్నప్పడు వారిపై వచ్చిన మీమ్స్ గురించి కూడా సరదాగా పంచుకున్నారు.🔸గ్లాస్ హౌస్లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి రోజు వీరిద్దరు ధరించిన దుస్తుల వెనున ఉన్న కథ, వాటిని తయారు చేయడానికి డిజైనర్లు పడిన కష్టాలను చూపించారు.🔸ఇక ఈ డ్యాక్యుమెంటరీ చివరల్లో నయనతార-విఘ్నేశ్ల కవల పిల్లలను చూపిస్తూ.. ఆహ్లాదకరమైన ముగింపును ఇచ్చారు.🔸మొత్తంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ సిరీస్ సరదాగా సాగుతూ.. నయనతార లైఫ్లో చోటు చేసుకున్న కొన్ని వివాదాలు.. విమర్శలను చూపిస్తూనే..వాటిని ఎదుర్కొని ఎలా ‘లేడీ సూపర్స్టార్’గా ఎదిగారనేది చూపించారు. -
ది కపిల్ శర్మ షో వివాదం.. సల్మాన్ ఖాన్ టీమ్ క్లారిటీ!
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ షో.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో. ఈ షోకు కపిల్ శర్మ హోస్ట్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఇటీవల ఓ ఎపిసోడ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారసత్వాన్ని అగౌరవపరిచేలా చూపించారంటూ ఓ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బొంగో భాషి మహాసభ ఫౌండేషన్ వారికి లీగల్ నోటీసులు పంపింది. ఈ షో తమను కించపరిచేలా ఉందని.. సాంస్కృతిక, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నోటీసుల్లో పేర్కొంది.అన్ని అవాస్తవాలే...అయితే ఈ వివాదం తర్వాత సల్మాన్ ఖాన్ టీమ్కు ఈ షోతో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఆయనకు చెందిన ఎస్కేటీవీకి లీగల్ నోటీసులు వచ్చినట్లు రాసుకొచ్చారు. తాజాగా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ టీమ్ స్పందించింది. అసలు ఆ షోతో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాపై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్టేట్మెంట్ విడుదల చేశారు.కాగా.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
‘దో పట్టి’ మూవీ సక్సెస్ పార్టీలో తారల సందడి (ఫొటోలు)
-
'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?
దీపావళికి హడావుడి లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా 'అమరన్'. తమిళ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. మేజర్ ముకందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు. విడుదలకు ముందు తెలుగులో పెద్దగా హైప్ లేదు కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.ప్రస్తుతం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్కి చేరువలో 'అమరన్' ఉంది. దీంతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. ఎందుకంటే హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మరీ ఈ రేంజ్ సక్సెస్ అయితే ఊహించలేదు. దీంతో ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ప్లాన్ మార్చుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)లెక్క ప్రకారం నెలరోజుల్లోనే 'అమరన్' ఓటీటీలోకి రావాల్సింది. అంటే డిసెంబరు తొలివారంలో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అద్భుతమైన సక్సెస్ కావడంతో మరో 1-2 వారాలు తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నెట్ఫ్లిక్స్ అనుకుంటోందట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డిసెంబరు మూడో వారంలోనే ఓటీటీలోకి 'అమరన్' వచ్చే అవకాశముంది.అడివి శేష్ 'మేజర్' తరహా కథతోనే 'అమరన్' సినిమా తీసినప్పటికీ.. ముకుందన్ భార్య వైపు నుంచి స్టోరీ చెప్పడం, అలానే సాయిపల్లవి యాక్టింగ్ సినిమాని మరో లెవల్కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు సూర్య 'కంగువ' చిత్రానికి రిలీజ్ ముంగిట తలనొప్పిగా మారింది. థియేటర్లు అనుకున్నంతగా దొరకడం కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
నయనతార జీవితం పై నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీ ఫిలిం
-
ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ రానుంది. కొన్నిరోజుల క్రితం ఇందుకు సంబంధించిన పోస్టర్ వదిలారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా నయన్ జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు తదితర విషయాల్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో ఈ డాక్యుమెంటరీ తీశారు.ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేశాడు. నవంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ చూస్తే.. నయన్ గురించి కన్నడ హీరో ఉపేంద్ర, తెలుగు హీరో నాగార్జున, తమిళ నటి రాధిక, తమిళ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్ మాట్లాడటం చూపించారు. చివర్లో దర్శకుడు విఘ్నేశ్.. నయనతారతో తన ప్రేమ ఎప్పుడు మొదలైందో చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. తమిళ నటి పోస్ట్ వైరల్)నేను మనుషుల్ని త్వరగా నమ్మేస్తాను, నా గురించి పేపర్ లో వచ్చేవన్నీ చూసి అమ్మ చాలా భయపడేది లాంటి విషయాలు నయన్ చెప్పింది. అసలు మీ జీవితాన్ని నెట్ఫ్లిక్స్ డాక్యుమెంట్ సిరీస్గా ఎందుకు తీసుకురావాలని అనుకున్నారని అడగ్గా.. పక్కనోళ్ల హ్యాపీనెస్ చూసి, అందరూ హ్యాపీగా ఫీలవ్వాలని నేను అనుకున్నా. అందుకే దీనికి ఒప్పుకొన్నా అని చెప్పింది.నయన్ చెప్పడం బాగానే ఉంది గానీ అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. అలానే నయనతార గతంలో తమిళ హీరో శింబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలు నడిపింది. కాకపోతే అవి తర్వాత స్టేజీకి వెళ్లలేదు. బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ విషయాల్ని ఏమైనా ఈ సిరీస్లో చూపిస్తారా? లేదంటే విఘ్నేశ్తో ప్రేమ, పెళ్లి వరకు మాత్రమే చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి) -
క్రైమ్ థ్రిల్లర్తో వస్తోన్న మిల్కీ బ్యూటీ.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ ముంబయికి షిఫ్ట్ అయింది. దక్షిణాదిలో కేవలం ప్రత్యేక సాంగ్స్లో మాత్రమే కనిపిస్తోంది. గతేడాది జైలర్ మూవీ ఐటమ్ సాంగ్లో మెరిసిన తమన్నా.. ఇటీవల స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్తో అదరగొట్టింది.తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో బాలీవుడ్లో తెరకెక్కించిన చిత్రం 'సికందక్ కా ముఖద్దర్'. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వెల్లడించింది.నవంబర్ 29 నుంచి సికందర్ కా ముఖద్దర్ స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ పోస్టర్ను షేర్ చేసింది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్, రాజీవ్ మెహతా, దివ్య దత్తా, జోయా అఫ్రోజ్ కీలక పాత్రల్లో నటించారు.సికందర్ కా ముకద్దర్ కథేంటంటే..స్పెషల్ 26, బేబీ, 'ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ' వంటి చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ నీరజ్ పాండే ఈ క్రైమ్ థిల్లర్కు దర్శకత్వం వహించారు. ఈ కథలో రూ.60 కోట్ల విలువైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేశారు? దాన్ని వెతకడంతో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? దాదాపు 15 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో చివరికి ఏమైంది? ఆ కేసును పరిష్కరిస్తున్న పోలీసు ఆఫీసర్ చివరికి సక్సెస్ అయ్యాడా? లేదా? అన్నదే అసలు కథ. Teen aaropi, lekin kaun apradhi? Case jald hi khulega. Watch Sikandar ka Muqaddar, out 29 November, only on Netflix!#SikandarKaMuqaddarOnNetflix pic.twitter.com/apoIyTTe8p— Netflix India (@NetflixIndia) November 7, 2024 -
The Great Indian Kapil Show: చూతము రారండీ
వయసుతో సంబంధం లేకుండా మహిళల్లో పెద్దరికం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్నవాళ్ళయినా, పెద్దవాళ్ళయినా పెద్దరికం అన్నది మహిళలకు ఒక సొగసు. మళ్లీ మగవాళ్లు అలాక్కాదు. వాళ్లకెంత వయసు వచ్చినా కూడా మాటల్లో, చేతల్లో చిన్నవాళ్లే... మహిళలతో పోలిస్తే’!సుధామూర్తి వయసు 74. మూర్తి గారి వయసు 78. ఆమె ఆగస్టు 19 న పుడితే, ఆయన ఆగస్టు 20 న జన్మించారు. తేదీలను బట్టి చూసినా సుధ ఆయన కన్నా ఒకరోజు ‘పెద్దరికం ’ ఉన్నవారు. (తమాషాకు లెండి). సరే, సంగతి ఏమిటంటే... ఈ దంపతులిద్దరూ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కు ఆహ్వానం వస్తే వెళ్లారు. సాధారణంగా కపిల్ బాలీవుడ్ సెలబ్రిటీలను తన టాక్ షో కు పిలుస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఈ బిజినెస్ దిగ్గజ దంపతుల్ని ఒప్పించి రప్పించారు. వారితో టాక్ షో సరదాగా నడిచింది. భర్త గురించి భార్యను, భార్య గురించి భర్తను కొన్ని ప్రశ్నలు అడిగారు యాక్టర్ కమ్ కమెడియన్ కపిల్ శర్మ. వాటిల్లో ఒక ప్రశ్న : ‘మొదటిసారి సుధాజీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెలా అనిపించింది?’ అని అడిగారు కపిల్. దానికి మూర్తి గారు చాలా గంభీరంగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు. ‘ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే.. ఒక స్వచ్ఛమైన గాలి పరిమళం నా శ్వాసలోనికి వెళ్లినట్లుగా...’ అన్నారు. ఆ మాటకు వెంటనే సుధామూర్తి... ‘అప్పుడు ఆయన వయసులో ఉన్నారు కదా’ అన్నారు జోకింగ్గా. దెబ్బకు ఆడియెన్స్ భళ్లుమన్నారు. నిజానికి సుధామూర్తి ఉద్దేశ్యం ఆడియెన్స్ని నవ్వించడం కాదు, భర్తలోని కవితాత్మక భావోద్వేగాన్ని కాస్త నెమ్మది పరచటం. పైగా అంతమంది ఎదుట భర్త తనను అంతగా ‘అడ్మైర్’ చెయ్యటంతో ఆమెలోని పెద్దరికం మధ్యలోనే కల్పించుకుని ఆయన్ని ఆపవలసి వచ్చినట్లుంది. ఆపకపోతే... ఇంకా ఏం చెబుతారో అని. అసలే వాళ్ళది లవ్ మ్యారేజ్. ఈ నెల 9న నెట్ఫ్లెక్స్లో స్ట్రీమ్ ఆయ్యే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ఎపిసోడ్లో మూర్తి గారి ఈ అమాయకత్వాన్ని, సుధామూర్తి పెద్దరికాన్ని కనులారా వీక్షించవచ్చు. (డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది)ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు -
ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ సినిమా దేవర ఓటీటీ విడుదల విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తారక్ సింగిల్గా నటించిన చిత్రాల్లో దేవరనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.దేవర ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. నవంబర్ 8న తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. అయితే, హిందీ వర్షన్ మాత్రం నవంబర్ 22న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. -
ఎన్టీఆర్ 'దేవర'.. ఆ రోజే ఓటీటీకి రానుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. సముద్రం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన దేవర రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ తనదైన గ్లామర్తో అలరించింది.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాది ప్రేక్షకులకు ఈ వారం నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వారంలోనే దేవర ఓటీటీకి వస్తే బాగుంటుందని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులకు నవంబర్ 22 నుంచి అందుబాటులోకి రానుందని టాక్.కాగా.. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్. శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కించారు. పార్ట్-2 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
ఓటీటీలో 'దేవర' ఎంట్రీ సమయం వచ్చేసిందా..?
ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ సినిమా దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగా లాభ పడ్డారని నాగవంశీ తెలిపారు.దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన దేవర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓటీటీలో కూడా నెట్ఫ్లిక్స్ భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే ఓప్పందం దేవర మేకర్స్తో ఉన్నట్లు సమాచారం. దీంతో నవంబర్ 8న తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించారట. ఈమేరకు బలంగా వార్తలు వస్తున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, ప్రకాష్రాజ్ వంటి స్టార్స్ నటించారు. -
దీపావళి హిట్ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
దీపావళి సందర్భంగా విడుదలైన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో థియేటర్లు అన్నీ ప్రేక్షకులతో సందడిగా కనిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', కిరణ్ అబ్బవరం 'క', శివ కార్తికేయన్ 'అమరన్' బిగ్ స్క్రీన్పైకి వచ్చేశాయి. మొదటిరోజు భారీ కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలు ఏ ఓటీటీలో విడుదల కానున్నాయో తెలుసుకుందాం.లక్కీ భాస్కర్ (నెట్ఫ్లిక్స్ )మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి ,సాక్షి వైద్య హీరోయిన్లుగా మెప్పించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ అంచనాలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించారు. అయితే, వారి అంచనాలు నిజం చేసేలా సినిమా ఉందని చెప్పవచ్చు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 12.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అమరన్ (నెట్ఫ్లిక్స్)శివకార్తికేయన్- సాయి పల్లవి కాంబినేషన్లో విడుదలైన చిత్రం అమరన్. వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు కంటతడి కూడా పెట్టేస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చేసిన ఈ సినిమాకు రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా అమరన్ రూ. 34 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.కిరణ్ అబ్బవరం 'క' (ఓటీటీ పెండింగ్)కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలైంది. కిరణ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా ఈ చిత్రం నిలిచింది. మొదటిరోజు 'క' సినిమా రూ. 6.18 కోట్లు రాబట్టింది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏ సంస్థ కొనుగోలు చేయలేదు. కానీ, ఆహా తెలుగు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నవంబర్ చివరి వారంలో ఓటీటీ విడుదల కావచ్చని సమాచారం. -
కన్నడ సినిమా రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్.. ఫస్ట్ మూవీ ఇదేనా..?
కన్నడ హీరో శ్రీ మురళి నటించిన తాజా చిత్రం బఘీర. దీపావళీ కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదలైంది. అయితే, మొదటిసారి ఏ కన్నడ సినిమాకు దక్కిన క్రేజ్ ఈ చిత్రానికి దక్కిందని తెలుస్తుంది. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో నిర్మించారు. అయితే, ఈ ప్రాజెక్ట్కు కథ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.'బఘీర' కథను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించడంతో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రీచ్ అయింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కూడా డిజిటల్ రైట్స్ తీసుకునేందుకు ఆసక్తి కనపరిచిందని తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్ ఇంతవరకు ఏ కన్నడ చిత్రాన్ని డైరెక్ట్గా ఓటీటీ రైట్స్ను దక్కించుకోలేదు. అక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవడంతో నెట్ఫ్లిక్స్ ఆసక్తి కనపరచలేదని సమాచారం. అయితే, ఇప్పుడు బఘీర హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు కన్నడ సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.కన్నడ ఇండస్ట్రీకి చెందిన కాంతార సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర భాషలకు సంబంధించిన వర్షన్స్ అమెజాన్ ప్రైమ్లో రన్ అవుతున్నాయి. కన్నడ సినిమాలు ఒకప్పుడు ఇతర భాషలలో విడుదల కాకపోవడంతో ఓటీటీ సంస్థలు పెద్దగా ఆ ఇండస్ట్రీపై ఆసక్తి చూపలేదు. అయితే, కేజీఎఫ్ తర్వాత వారి సినిమాల మార్కెట్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా రేంజ్లో కన్నడ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే బఘీర సినిమా డిజిటల్ రైట్స్ తొలిసారి నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని కన్నడలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. -
'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్!
ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలో క్రేజ్ను దక్కించుకుంది.ఈ వెబ్ సిరీస్ దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
OTT Review: నాటి తీపి గుర్తుల నేటి సినిమా
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం ‘సత్యం సుందరం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనల్ని కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. మరి కొన్ని సినిమాలు ఆవేశాన్నిస్తాయి. ఇంకొన్ని సినిమాలు ఆనందాన్నిస్తాయి. చాలా కొన్ని సినిమాలు మన మనసులో పదిలంగా నిలిచిపోతాయి. ఎందుకంటే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అవి మన గడిచిన జీవితపు గతాల తెరలను తొలగిస్తాయి కాబట్టి. అటువంటి వాటి కోవలో ముందుండే సినిమా ‘మెయ్యళగన్’. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘సత్యం సుందరం’ నెట్ఫ్లిక్స్ వేదికగా లభ్యమవుతోంది.దర్శకుడు సి. ప్రేమ్కుమార్ ఈ సినిమాని సినిమాలా తీయలేదు, మన గత జీవితాలను మళ్లీ మనకు పరిచయం చేశారంతే. ఒకరిద్దరు భారీ తారాగణం తప్ప పెద్ద కథ, పెద్ద సెట్లు, పెద్ద లొకేషన్లు ఇలాంటి ఆకర్షణలేవీ లేవు ఈ సినిమాలో. కానీ మనసున్న ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుందనడంలో సందేహమే లేదు. ప్రతి ఇంట్లో జరిగే ఓ సున్నితమైన అంశాన్ని కథగా తీసుకుని చాలా నేచురల్గా తెరకెక్కించారు దర్శకుడు. కథాపరంగా సత్యం ఉంటున్న ఇల్లు దాయాదుల గొడవల్లో పోతుంది. ఆ బాధతోనే సత్యం కుటుంబం ఉన్న ఊరిని ఉన్న పళంగా విడిచి వెళ్లిపోతుంది. ఇక్కడ నుండే సినిమా ్రపారంభమవుతుంది.పద్దెనిమిదేళ్ల తర్వాత సత్యం తన బాబాయి కూతురు పెళ్లి కోసం మళ్లీ ఆ ఊరులోకి బాధతోనే అడుగుపెట్టవలసివస్తుంది. పెళ్లిలో సత్యాన్ని అతని చుట్టం సుందరం కలుస్తాడు. కానీ సుందరాన్ని సత్యం గుర్తు పట్టడు. సుందరం మాత్రం సత్యం మీద వల్లమాలిన అభిమానాన్ని, ప్రేమను చూపిస్తాడు. అసలే ఆ ఊరితో ఉన్న చికాకుతో పాటు సుందరం ఎవరో గుర్తు రాకపోయినా అతను చూపించే ప్రేమ సత్యాన్ని మరింత మధనపెడుతుంది. మరి... ఆఖరికి సుందరం ఎవరో సత్యం గుర్తుపట్టాడా లేదా? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. సత్యం పాత్రలో అరవిందస్వామి, సుందరం పాత్రలో కార్తీ తమ పాత్రలలో జీవించేశారు. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల మీదే ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఇది సినిమా కాదు... మన గతం. నాటి తీపి గుర్తుల నేటి సినిమా ఈ ‘సత్యం సుందరం’. వర్త్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో నయనతార రియల్ లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా ఉంది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్నను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది షారూఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించిన నయన్.. ఆ తర్వాత వచ్చిన అన్నపూరణి సినిమా వివాదానికి దారితీసింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా పిక్స్ షేర్ చేసి అభిమానులకు అప్డేట్స్ ఇస్తోంది. అయితే తాజా ఫోటోలు చూసి నయన్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, సన్నబడటానికి లై పోసక్షన్ చేయించుకుందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నా బుగ్గల్లో ప్లాస్టిక్ ఏం లేదు!)అయితే గతంలో తన సినీ ప్రయాణంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తన కెరీర్, పెళ్లితో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో చూపించనున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునన్న నయన్ జీవితంపై తెరకెక్కించిన డాక్యుమెంటరీని ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 18 నుంచి ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్ను విడుదల చేసింది. ఈ బయోపిక్కు నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే టైటిల్ ఖరారు చేశారు. Thirai-layum natchathiram, vaazhkailayum natchathiram ✨Watch Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/5m9UbBNZ6M— Netflix India South (@Netflix_INSouth) October 30, 2024 -
ఓటీటీలో డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది బకింగ్హమ్ మర్డర్స్’ ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సెప్టెంబరు 13న రిలీజ్ అయింది. '1992 స్కామ్' వంటి వెబ్ సిరీస్తో దర్శకుడు తన మార్క్ చూపించిన హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అయితే, ఊహించినంతగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మెప్పించలేదు.బ్రిటిష్– ఇండియన్ డిటెక్టివ్ జస్మిత్ భామ్రా పాత్రలో కరీనా మెప్పించింది. క్రైమ్ థ్రిల్లర్గా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. నవంబర్ 8న స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి రానుంది. తెలుగు వర్షన్ గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.ది బకింగ్హామ్ మర్డర్స్ రన్టైమ్ కేవలం 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. రూ. 50 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ. 15 కోట్లు మాత్రమే రాబట్టింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం ఓటీటీలో తప్పకుండా ఈ మూవీని ఇష్టపడుతారని చెప్పవచ్చు. -
ఓటీటీలో 'ఈ కలయిక కాస్త ఘాటు గురూ'.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ది యూనియన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఎక్కడైనా ప్రేమికులు చాలా ఏళ్ల తరువాత కలిస్తే, చాలా హాట్ హాట్గా ఉంటుంది. కానీ ఈ ‘ది యూనియన్’ సినిమాలో ΄పాత ప్రేమికులు కలిసిన తరువాత ఇంత ఘాటా అని చూసే ప్రేక్షకుడు నోరెళ్లబెట్టాల్సిందే. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. జూలియన్ ఫరియానో దర్శకత్వం వహించిన స్పై కామెడీ థ్రిల్లర్ సినిమా ‘ది యూనియన్’. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమాని చూడవచ్చు. హేమాహేమీలైన హాలీబెర్రీ, మార్క్ వాబర్గ్, మైక్ కాల్టర్ నటించిన ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... కథానాయకుడు మైక్ మెకన్నా న్యూజెర్సీ నగరంలో ఓ సాధారణ బిల్డింగ్ కార్మికుడు. రోజువారీ కష్టంతో తన పనేదో తాను చూసుకుపోయే మనస్తత్వం గలవాడు. కాకపోతే కాస్తంత అమ్మాయిల పట్ల పిచ్చి ఎక్కువ. హాయిగా సాగుతున్న మైక్ జీవితంలో అనుకోని ఓ అవాంతరం తన హైస్కూల్ క్రష్ అయిన రోక్సేన్ హాల్ ద్వారా ఎదురవుతుంది. 25 ఏళ్ల తరువాత కలిసిన తన ప్రేమను గుర్తు చేసుకుంటూ డాన్స్ చేస్తూ స్పృహ తప్పుతాడు మైక్. అలా న్యూజెర్సీలో స్పృహ తప్పిన మైక్ తిరిగి కళ్లు తెరిచేసరికి లండన్లో ఉంటాడు. మరోపక్క ఓ బ్రీఫ్కేస్ కోసం ఇరాన్ తీవ్రవాదులు, నార్త్ కొరియా ఏజెంట్లు, రష్యన్ గూఢచారులు తెగ వెతికేస్తుంటారు. ఆ బ్రీఫ్కేస్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కోసం యూనియన్ అనే సంస్థ తమ ప్రతినిధులను చాలా మందినే పొగొట్టుకుంటుంది. అసలు ఆ బ్రీఫ్కేస్కి, కథానాయకుడు మైక్కి సంబంధం ఏంటి? 25 ఏళ్ల తరువాత మైక్ ప్రియురాలు రోక్సేన్ హేల్ అతన్ని ఎందుకు కలిసింది? కలిసిన తరువాత అతను లండన్లో ఉండడం ఏంటి? అయినా ఓ ప్రేమికుల కలయికలో ఇంత ఘాటైన ట్విస్టులా? వీటి సమాధానాల కోసం ‘ది యూనియన్’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రేక్షకుడిని గిలిగింతలు పెట్టిస్తూ ఆద్యంతం థ్రిల్లింగ్ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వీకెండ్ మస్ట్ వాచ్ మూవీ ‘ది యూనియన్’.– ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో 'సత్యం సుందరం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన సినిమా 'సత్యం సుందరం'. ఫీల్గుడ్ చిత్రంగా ప్రేక్షకుల నుంచి మించి రివ్యూస్నే దక్కించుకుంది. సూర్య-జ్యోతిక తక్కువ బడ్జెట్లో ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీంతో 'సత్యం సుందరం' అభిమానుల్లో సంతోషం కనిపిస్తుంది.తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్లో చూడలేకపోయిన వారు తమ ఫ్యామిలీ, స్నేహితులతో తప్పక చూడాల్సిన సినిమాగా నెటిజన్లు చెప్పుకొచ్చారు. కథ అయితే, చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎలాంటి ట్విస్ట్లు లేకుండా సుమారు 3 గంటలపాటు ప్రేక్షకులను దర్శకుడు మెప్పించాడు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 60 కోట్లు రాబట్టిన 'సత్యం సుందరం' మంచి లాభాలను అందించారు. చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!
దసరా సెలవులు ముగిశాయి. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. విజయదశమికి వేట్టయాన్, విశ్వం, జనక అయితే గనక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ సంగతి అటుంచితే మరో వీకెండ్ వచ్చేస్తోంది. అయితే ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఈ వారం కేవలం చిన్న చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలో నిలిచాయి.దీంతో సినీ ప్రియులు ఓటీటీలవైపు చూస్తున్నారు. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటీటీల్లో కాస్తా ఇంట్రెస్టింగ్ కలిగించే చిత్రాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వీకెండ్లో కుటుంబంతో కలిసి మీకు నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి.ఈ వీకెండ్ ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలునెట్ఫ్లిక్స్ ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18 ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్ కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18 కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18 లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18 స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18 ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18హాట్స్టార్ 1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18 రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18 రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18జియో సినిమా క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18 హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19 హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19ఆహారైడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- అక్టోబర్ 19బుక్ మై షో బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18 -
తంగలాన్ ఓటీటీ విడుదలపై ప్రకటన చేసిన నిర్మాత
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న ఈ మూవీ ఆగష్టు 15న విడుదల అయింది. అయితే, తంగలాన్ ఓటీటీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో తంగలాన్ వేట కొనసాగించి ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయింది. బాలీవుడ్లో కూడా విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి చిత్ర నిర్మాత ప్రకటన చేశారు.డైరెక్టర్ పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే, తంగలాన్ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. కానీ, స్ట్రీమింగ్ విషయంలో మేకర్స్ నుంచి పలు అడ్డంకులు రావడంతో ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేయలేదని ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇచ్చారు. 'దీపావళికి తంగలాన్ సినిమాను విడుదల చేయాలని వారు (నెట్ఫ్లిక్స్) నిర్ణయించారు. తంగలన్ పెద్ద సినిమా కాబట్టి పండుగ నాడు విడుదల చేస్తే బాగుంటదని తెలిపారు. అయితే, తంగలాన్ ఓటీటీ విడుదల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి సమస్య లేకున్నా కూడా.. సమస్య ఉందని చెప్పుకునే నేర్పు నేటి సోషల్మీడియా వార్తలకు ఉంది.' అని ఆయన తెలిపారు. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1న తంగలాన్ నెట్ఫ్లిక్స్లో విడుదల కావడం ఖాయమని చిత్ర నిర్మాత పేర్కొన్నారు.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
కృతి సనన్, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్ చూశారా..?
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దో పత్తి’. కృతి డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. కృతి సనన్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయితే, ఇప్పటి వరకు నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించింది.అక్టోబర్ 25 నుంచి ‘దో పత్తి’ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్వాలే సినిమాలో కృతి సనన్, కాజోల్ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'దో పత్తి' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. -
69 ఏళ్ల వయసులో సాహసం.. ఓటీటీకి రియల్ స్టోరీ!
ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం విజయ్ 69. ఓ క్రీడాకారుని నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై మనీశ్ శర్మ నిర్మించారు. ఈ చిత్రానికి అక్షయ్ రాయ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చేనెల 8 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. 69 ఏళ్ల వ్యక్తి ట్రయాత్లాన్ కోసం శిక్షణ పొందడం, జీవితంలోని సవాళ్లను ఎలా అధిగమించాడనేదే కథ.విజయ్ 69 కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువని అనుపమ్ ఖేర్ అన్నారు. ఇది అభిరుచి, పట్టుదల, అచంచలమైన మానవ స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. మన కలలను సాకారం చేసుకోవడానికి వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదనే నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. విజయ్ 69 అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఓటీటీలో 'దేవర'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
దసరాకు దాదాపు అరడజను సినిమాలు రిలీజయ్యాయి. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. దీంతో అప్పటికే థియేటర్లలో ఉన్న 'దేవర' హవా కాస్త కొనసాగింది. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసినట్లు నిర్మాతలు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 'దేవర' ఓటీటీ రిలీజ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తీసిన సినిమా 'దేవర'. యాక్షన్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కించారు. సెప్టెంబరు 27న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ వచ్చి, పికప్ అయింది. అలా 16 రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే ఆరు వారాల ఒప్పందం కుదిరిందట. ఈ లెక్కన నవంబరు 8 నుంచి ఓటీటీలో 'దేవర' స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి) -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు
దసరా హడావుడి అయిపోయింది. సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజను సినిమాలు రిలీజయ్యాయి. దీంతో పెద్దగా చెప్పుకోవడానికి ఈ వారం కొత్త మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో కల్లు కాంపౌండ్, వీక్షణం, సముద్రుడు అనే చిన్న చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. ఓటీటీలో మాత్రం 25 సినిమాలు/వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్, 1000 బేబీస్ అనే డబ్బింగ్ సిరీస్లు మాత్రమే ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా అయితే లాఫింగ్ బుద్ధా అనే కన్నడ మూవీ మాత్రం చూడొచ్చులే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇవే. ఒకవేళ వీకెండ్ వచ్చేసరికి కొత్తగా ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (అక్టోబర్ 14-20వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్మైటీ మాన్స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 15స్వీట్ బాబీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 16గుండమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18అమెజాన్ ప్రైమ్ద ప్రదీప్స్ ఆఫ్ పిట్స్బరో (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 17కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18హాట్స్టార్రీతా సన్యల్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 141000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18జియో సినిమాక్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19ఆపిల్ ప్లస్ టీవీస్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 16బుక్ మై షోబీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: కిర్రాక్ సీత పారితోషికం ఎంతంటే?) -
ఓటీటీలో 'మత్తువదలరా 2' స్ట్రీమింగ్
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద మంచి ఫన్ చిత్రంగా గుర్తింపు పొందింది. కలెక్షన్ల పరంగా కూడా లాభాలను తెచ్చిపెట్టిన ఈ మూవీని రీతేష్ రానా దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్టైనర్గా విజయం సాధించిన ఈ చిత్రంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా జంటతో పాటు సత్య, వెన్నెల కిషోర్ నటించారు.సెప్టెంబర్ 13న విడుదలైన ‘మత్తువదలరా 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 11 అంటే శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు పేర్కొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే.. ‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని.వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. -
ఈ వారం ఓటీటీల్లో 34 సినిమాలు రిలీజ్.. అవేంటంటే? (ఫొటోలు)
-
ఓటీటీ స్నాక్స్ ట్రెండింగ్..!
థియేటర్లో నచ్చిన స్నాక్స్ తింటూ ఫేవరెట్ మూవీని ఎంజాయ్ చేయడం కామన్! ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా దొరుకుతుండటంతో వినోదం ఇంట్లోనే మూడు సినిమాలు ఆరు వెబ్ సిరీస్లుగా వెలిగిపోతోంది. యువతరానికి ముఖ్యంగా జెన్ జెడ్కు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు బాగా కనెక్ట్ కావడంతో ఫుడ్, స్నాక్స్ బ్రాండ్లు దీన్ని ఒక సరికొత్త వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. నెట్ఫ్లిక్స్, డిస్నీ–హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 తదితర ఓటీటీ దిగ్గజాలతో జట్టుకట్టి సరికొత్త కో–బ్రాండెడ్ ప్యాక్లతో పాప్కార్న్ నుంచి ఐస్క్రీమ్ వరకూ అన్నింటినీ ప్రత్యేకంగా చేతికందిస్తున్నాయి.ఓటీటీ స్ట్రీమింగ్ దుమ్మురేపుతుండటంతో స్నాక్స్, పుడ్ బ్రాండ్స్ దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ప్రీమియం పాప్కార్న్ బ్రాండ్ 4700బీసీ ప్రత్యేకంగా ఓటీటీ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ ప్యాక్లను ప్రవేశపెట్టేందుకు నెట్ఫ్లిక్స్తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఈ–కామర్స్, క్విక్ కామర్స్తో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తోంది. ‘ఓటీటీ ప్లాట్ఫామ్లలో మునిగితేలే జెన్ జెడ్ కుర్రకారును టార్గెట్ చేసేందుకు ఇది సరైన మార్గం’ అని 4700బీసీ ఫౌండర్, సీఈవో చిరాగ్ గుప్తా చెబుతున్నారు. ఇదొక్కటేకాదు కిట్క్యాట్, కారి్నటోస్, ప్రింగిల్స్, కోకాకోలా, ఓరియో, థమ్సప్తో పాటు సఫోలా మసాలా ఓట్స్ తదితర స్నాక్స్ బ్రాండ్స్ సైతం సేల్స్ పెంచుకోవడం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్తో జట్టుకట్టిన వాటిలో ఉన్నాయి.అల్టీమేట్ ‘బ్రేక్’.. వినోదంతో పాటు రుచికరమైన మంచింగ్ కూడా ఉంటే ‘ఆహా’ అదిరిపోతుంది కదూ! అందుకే నెస్లే తన కిట్ క్యాట్ చాక్లెట్లను ఓటీటీ యూజర్ల చెంతకు చేర్చేందుకు నెట్ఫ్లిక్స్ ‘సబ్స్క్రిప్షన్’ తీసుకుంది. ‘అల్టీ మేట్ బ్రేక్’ పేరుతో కో–బ్రాండెడ్ ప్రచారానికి తెరతీసింది. తద్వారా ప్రత్యేక ఓటీటీ కిట్క్యాట్ ప్యాక్లను విడుదల చేయడంతో పాటు నెట్ఫ్లిక్స్ షోలు.. స్క్విడ్ గేమ్, కోటా ఫ్యాక్టరీతో జతకట్టింది. గిఫ్టింగ్ సంస్థ అల్యూరింగ్ బాస్కెట్ అయితే ప్రింగిల్స్, కిట్క్యాట్, కోకాకోలాతో కూడిన బండిల్డ్ ప్యాక్లను అందుబాటులోకి తెచ్చింది. ’నెట్ఫ్లిక్స్ – చిల్’, ‘జస్ట్ వన్ మోర్ ఎపిసోడ్’ పేరుతో ఓటీటీ లవర్స్ కోసం వీటిని విక్రయిస్తోంది.ఓటీటీ వినోదంతో పాటు స్నాక్స్ను ప్రమోట్ చేసే విధంగా బీన్ ట్రీ ఫుడ్స్ కూడా ప్రత్యేక ప్యాక్లను అందిస్తోంది. ఇక మాండెలెజ్ కుకీ బ్రాండ్ ఓరియో నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’తో జట్టుకట్టడం ద్వారా ఓరియో రెడ్ వెల్వెట్ను ప్రవేశపెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కోకాకోలా థమ్సప్.. డిస్నీ–హాట్స్టార్తో కలిసి ‘థమ్సప్ ఫ్యాన్ పల్స్’ ప్రచారం నిర్వహిస్తుండగా.. మారికో తన సఫోలా మసాలా ఓట్స్ కో–బ్రాండెడ్ ప్యాక్స్ విక్రయానికి జీ5తో డీల్ కుదుర్చుకుంది.’స్నాక్స్ బ్రాండ్ల అమ్మకాల ఆధారంగా లాభాల పంపకం లేదా సంస్థలు ఒకరికొకరు తమ యాడ్లలో ప్రచారం కల్పించుకోవడం, లేదా క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లలో నేరుగా లింక్లను ఇవ్వడం ద్వారా స్నాక్స్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విక్రయించడం వంటి మార్గాల్లో డీల్స్ కుదురుతున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్లు చెబుతున్నారు. ‘కంటెంట్ను చూస్తూ, నచి్చన స్నాక్స్ తినే అలవాటు ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా ఓటీటీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని 4700బీసీ ఇతర బ్రాండ్లతో జట్టుకట్టాం’ అని నెట్ఫ్లిక్స్ ఇండియా మార్కెటింగ్ పార్ట్నర్షిప్స్ హెడ్ పూరి్ణమ శర్మ చెప్పారు. ఓటీటీ జోరు.. ఫుడ్ ఆర్డర్ల తోడు! దేశంలో కరోనా కాలంలో బంపర్ హిట్ కొట్టిన ఓటీటీ స్ట్రీమింగ్.. ముఖ్యంగా యువత, మహిళలకు బాగా చేరువైంది. కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీ ప్లాట్ఫామ్ల ’బాక్సాఫీస్’ కళకళలాడిపోతోంది. గతేడాది 70.7 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా కంటెంట్ను చూసినట్లు ఇంటర్నెట్ ఇన్ ఇండియా–2023 నివేదిక అంచనా వేసింది. మరోపక్క, ఈ వీడియో ఆన్ డిమాండ్ సబ్్రస్కిప్షన్ మార్కెట్ 2027 నాటికి 2.77 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నట్లు లెక్కగట్టింది.ఇదిలా ఉంటే, రెడీ–టు–ఈట్ లేదా రెడీ–టు–కుక్ ఆహారోత్పత్తుల వృద్ధికి తోడు డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్తో స్నాక్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ జోరుతో చిన్న పట్టణాల్లోనూ స్నాక్న్ బ్రాండ్స్ రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధిస్తున్నాయి. 2023లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉన్న భారతీయ స్నాక్స్ మార్కెట్ 2032 నాటికి రూ.95,000 కోట్లకు పైగా ఎగబాకుతుందనేది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐమార్క్ గ్రూప్ అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ఫుల్ చిల్!70.7 కోట్లు: గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్ను ఉపయోగించుకున్న ఇంటర్నెట్ యూజర్లు2.77 బిలియన్ డాలర్లు: 2027 నాటికి వీడియో ఆన్ డిమాండ్ సబ్ర్స్కిప్షన్ మార్కెట్ వృద్ధి అంచనా.రూ. 95,520 కోట్లు: 2032 నాటికి భారతీయ స్నాక్స్ మార్కెట్ పెరుగుదల అంచనా. -
ఓటీటీకి రాని తంగలాన్.. అసలు సమస్య ఇదేనా?
తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల నటించిన సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగు, తమిళంలో ఓకేసారి రిలీజ్ చేశారు.అయితే ఈ మూవీ రిలీజైన రెండు నెలల కావొస్తున్నా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతుందని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేశారు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.తాజా సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్తో మేకర్స్కు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్ఫ్లిక్స్ రద్దు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తంగలాన్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం.తంగలాన్ కథేంటంటే..'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ వారం దసరా సందడి మొదలైపోయింది. దేవి నవరాత్రుల ఉత్సవాలతో అంతా బిజీగా ఉన్నారు. ఇక సినీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసేందుకు రజినీకాంత్ వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి సినిమాలు ఈ దసరాకు సినీ ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక అంతా పండుగ మూడ్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు ఇంట్లోనే చూడాలనుకుంటారు. అలాంటి వారికోసం ఓటీటీల్లోనూ అలరించేందుకు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు లేకపోయినా.. కాస్తా చూడాలనిపించేవైతే ఉన్నాయి. వాటిలో ఇటీవల హిట్గా నిలిచిన శ్రద్ధాకపూర్ స్త్రీ-2, అక్షయ్కుమార్ సర్ఫీరా, సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.నెట్ఫ్లిక్స్ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) అక్టోబరు 8ఖేల్ ఖేల్ మే(హిందీ సినిమా)- అక్టోబర్ 09స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్)- అక్టోబర్ 09గర్ల్ హాంట్స్ బాయ్- అక్టోబర్ 10మాన్స్టర్ హై 2 (ఇంగ్లీష్) అక్టోబరు 10ఔటర్ బ్యాంక్స్ సీజన్-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10లోన్లి ప్లానెట్- అక్టోబర్ 11అప్ రైజింగ్ (కొరియన్ సిరీస్) -అక్టోబర్ 11ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) -అక్టోబర్ 12 సోనీ లివ్జై మహేంద్రన్ (మలయాళం)-అక్టోబర్ 11రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11 డిస్నీ ప్లస్ హాట్స్టార్సర్ఫీరా(బాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 11వారై (తమిళ సినిమా)- అక్టోబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియోసిటాడెల్: డయానా- అక్టోబర్ 10 జియో సినిమాగుటర్ గూ (హిందీ)- అక్టోబర్ 11టీకప్ (హాలీవుడ్)- అక్టోబర్ 11 యాపిల్ టీవీ ప్లస్డిస్క్లైమర్- అక్టోబర్ 11 ఆహాలెవెల్ క్రాస్- (మలయాళ సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్)గొర్రె పురాణం-(తెలుగు సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్) -
26 సార్లు రీమేక్ అయిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సి ప్రధాన పాత్రలో మదస్సర్ అజీజ్ తెరకెక్కించిన కామెడీ డ్రామా చిత్రం 'ఖేల్ ఖేల్ మే'. టీ-సిరీస్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీలో ఫర్దీన్ ఖాన్, వాణీ కపూర్, ప్రగ్యా జైస్వాల్, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు.దసరా కానుకగా అక్టోబర్ 09 నుంచి 'ఖేల్ ఖేల్ మే' చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సుమారు రూ. 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్ల వరకు రాబట్టింది.మూడు జంటల చుట్టూ తిరిగే కథతో, నవ్వులు పూయించే సన్నివేశాలతో ఉండే ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించుకుంది. 2016లో పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ పేరుతో మొదట ఇటాలియన్లో విడుదలైంది. ఈ ఎనిమిదేళ్లలో 26సార్లు ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఫ్రెంచ్, కొరియన్, మాండరిన్, రష్యన్, ఐస్ల్యాండిక్, తెలుగులో (రిచి గాడి పెళ్లి), మలయాళం (12th మ్యాన్), కన్నడలో (లౌడ్ స్పీకర్) పలు భాషల్లో ఈ చిత్రం రీమేక్ చేశారు. హిందీలో 'ఖేల్ ఖేల్ మే'గా ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైంది. -
ఓటీటీకి వచ్చేసిన 'ది గోట్' మూవీ.. ఎక్కడ చూడాలంటే?
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది.ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాలో త్రిష ప్రత్యేక సాంగ్లో మెరిశారు.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు.అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Adavi ki raju simham aithe, ee lokaaniki raju ee GOAT! 🔥Thalapathy Vijay’s The G.O.A.T - The Greatest of all time is coming to Netflix on 3 October in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! 🐐#TheGOATOnNetflix pic.twitter.com/MQgFkpV6gl— Netflix India South (@Netflix_INSouth) October 2, 2024 -
ఓటీటీలో విజయ్ 'ది గోట్' సినిమా.. అధికారిక ప్రకటన
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ (ది గోట్). ఓటీటీ విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్న్యూస్ వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినా సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ (ది గోట్) సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తే.. త్రిష ఒక స్పెషల్ సాంగ్లో మెరిసింది.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు.అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో కృతి సనన్, కాజోల్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘దో పత్తి’.. డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కృతి సనన్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయితే, ఇప్పటి వరకు నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.'దో పత్తి' సినిమా నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్వాలే సినిమాలో కృతి సనన్, కాజోల్ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'దో పత్తి' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. -
టిన్ అండ్ టీనా మూవీ రివ్యూ
టైటిల్: టిన్ & టీనాకథలోలా - అడాల్ఫొ దంపతులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తారు. కానీ వారి కలలను నీరుగారుస్తూ పెళ్లిరోజే లోలాకు గర్భస్రావం అవుతుంది. అంతేకాదు, ఇంకెప్పుడూ తను తల్లి కాలేదని వైద్యులు నిర్ధారిస్తారు. దీంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది. తననలా చూడలేకపోయిన భర్త దగ్గర్లో ఓ కాన్వెంట్ ఉందని, అందులో ఎవర్నైనా దత్తత తీసుకుందామని చెప్తాడు. మొదట లోలా అందుకు అంగీకరించదు. కానీ తర్వాత ఒప్పుకుని ఏడేళ్ల వయసున్న కవలలు టిన్ అండ్ టీనాను దత్తత తీసుకుంటారు.అప్పుడు అసలు కథ మొదలవుతుంది. పిల్లలు అందరిలా కాకుండా వింతగా ప్రవర్తిస్తుంటారు. భగవంతుడిపై ఎక్కువ విశ్వాసంతో తానేం చేసినా దేవుడిపైనే భారం వేస్తారు. అప్పుడే ఒక మిరాకిల్ జరుగుతుంది. లోలా మల్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లల వింత ప్రవర్తనతో భయపడిపోయిన ఆమె కడుపులో బిడ్డను వారి నుంచి కాపాడుకోవాలని చూస్తుంది. డెలివరీ తర్వాత కూడా క్షణక్షణం భయంగానే గడుపుతుంది. ఆమె భయానికి కారణం ఏంటి? ఆ పిల్లలు ఏం చేశారు? వారిని తిరిగి ఎందుకు కాన్వెంట్లో వదిలేశారు? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే!విశ్లేషణలోలాకు దేవుడంటే నమ్మకం ఉండదు. కానీ తను పెంచుకుంటున్న కవలలకు అపారమైన భక్తి. బైబిల్లో ఉన్నవన్నీ యదాతథంగా అమలు చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే పెంపుడు కుక్కను చంపేస్తారు. స్కూలులో తమను ఆటపట్టిస్తున్న కుర్రాడిని సైతం దారుణంగా టార్చర్ పెట్టి చంపుతారు. వీటిని సహించని లోలా చివరకు వారిని అమాయకులుగా భావించడం వింతగా అనిపిస్తుంది. పిల్లల రాక్షస ప్రవర్తనకు ఇంకేమైనా కారణాలున్నాయా? అని అనిపించకమానదు. క్లైమాక్స్లో లోలా భర్తను కోల్పోవడం... ఎవరివల్లయితే తన కొడుక్కి హాని అనుకుందో ఆ కవలల్ని ఇంటికి తీసుకురావడం అందరికీ మింగుడుపడకపోవచ్చు.లోలాగా మెలీనా స్మిత్, టిన్ అండ్ టీనాగా కార్లోస్ జి మోరోలాన్, అనటాసియా రుస్సో నటించారు. వీరి పర్ఫామెన్స్ బాగుంది. కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు మనకే కంగారు వచ్చేస్తుంటుంది. బిడ్డను కాపాడుకోవడానికి తల్లి పడే ఆరాటం మనల్ని కదిలించివేస్తుంది. వీకెండ్లో ఓసారి చూసేయొచ్చు! టిన్ అండ్ టీనా మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. -
నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్
అనుకున్నట్లుగానే జరిగింది. నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నెలలోపే స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా 'పేకమేడలు')నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'సరిపోదా శనివారం'. వారంలో శనివారం మాత్రమే కోపాన్ని చూపించే వ్యక్తిగా నాని నటించాడు. కథ పరంగా ఓ మాదిరి కొత్తదనం ఉన్నప్పటికీ నాని-ఎస్జే సూర్య అద్భుతమైన యాక్టింగ్తో అదరగొట్టేశారు.ఆగస్టు 29న థియేటర్లలోకి ఈ సినిమాకు వర్షాలు అడ్డంకిగా మారాయి. రిలీజైన రెండు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో నెలలోపో అంటే సెప్టెంబరు 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం)Ippati dhaaka @NameisNani rendu kaalle choosaru… moodo kannu choodataniki meeru ready ah?#SaripodhaaSanivaaram is coming to Netflix on 26th September in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi!#SaripodhaaSanivaaramOnNetflix pic.twitter.com/b0CrfvMb94— Netflix India South (@Netflix_INSouth) September 21, 2024 -
వరల్డ్ బెస్ట్ సిరీస్.. రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్
ఓటీటీల్లో కొన్ని సినిమాలు లేదా వెబ్ సిరీసులు అనుహ్యంగా హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'స్క్విడ్ గేమ్' ఒకటి. పేరుకే ఇది కొరియన్ సిరీస్. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్ని మెప్పించింది. 2021లో రిలీజైన తొలి సీజన్ అద్భుతమైన రికార్డులు సెట్ చేయగా.. ఇప్పుడు రెండో సీజన్ విడుదలకి సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నెట్ఫ్లిక్స్ నిర్మించిన బెస్ట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాయడం విశేషం. డబ్బు అవసరమున్న 456 మందిని ఓ ద్వీపానికి తీసుకొచ్చి ఉంచుతారు. వీళ్ల మధ్య చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. పోటీల్లో గెలిచినోళ్లు తర్వాత దశకు వెళ్తుంటారు. మిగిలిన వాళ్లని నిర్వహకులు నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటారు. చివరకు గెలిచిన ఒక్కరు ఎవరనేదే స్టోరీ.తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. ఈసారి కూడా 456 మంది ఉంటారు. మళ్లీ వీళ్ల మధ్య కొత్త గేమ్స్ పెడతారు. మరి ఇందులోనూ హీరో గెలిచాడా? ఈసారి ఏమేం గేమ్స్ ఉండబోతున్నాయనేది టీజర్లో చూచాయిగా చూపించారు. ఇక ఏడాది చివరి వారంలో అంటే డిసెంబరు 26న సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. మరి ఈ సిరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు?(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?) -
'లాల్ సలామ్' ఓటీటీ ఆలస్యానికి కారణం చెప్పిన ఐశ్వర్య
సౌత్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రజనీకాంత్ 'లాల్ సలామ్' విడుదలైంది. అయితే, ప్రేక్షకుల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి చిత్ర డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఆప్డేట్ ఇచ్చారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొస్తామని ఆమె ఇలా ప్రకటించారు.'లాల్ సలాం' చిత్రాన్ని తెరకెక్కించడంలో మేము చాలా కష్టపడ్డాం. కానీ, మేము అనుకున్నంతగా విజయం పొందలేకపోయాం. మొదటి మేము అనుకున్నట్లుగా థియేటర్లో విడుదల చేయలేదు. కొన్ని సీన్లు లేకుండానే మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ సీన్లు అన్నీ సినిమాకు చాలా ముఖ్యమైనవి. హార్డ్ డిస్క్ కనిపించకపోవడం వల్లే ఈ ఇబ్బందులు పడ్డాం. అయితే, అందులో మిస్ అయిన సీన్లు ఇప్పుడు రికవీరే చేశాం. వాటిని సినిమాకు యాడ్ చేసి సరికొత్తగా ఓటీటీ వర్షన్లో విడుదల చేస్తాం. ఇప్పటికే ఆ సీన్లకు సంబంధించిన మ్యూజిక్ వర్క్ను రెహమాన్ ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.' అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.లాల్ సలామ్ చిత్రంలో మొయిదీన్ భాయ్ పాత్ర నిడివి మొదట్లో 10 నిమిషాలే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన(రజనీకాంత్) ఆ రోల్ చేస్తానన్నాడో తన రేంజ్కు పది నిమిషాలు పెడితే ఏం బాగుంటుందని విడుదలకు రెండురోజుల ముందు అనుకున్నాం. ఈ క్రమంలో ఆయన పాత్రకు సంబంధించి నిడివి పెంచాలని డిసైడయ్యాం. దీంతో స్క్రిప్ట్ మారిపోయింది. ఆపై హార్డ్ డిస్క్ కనిపించకుండా పోయింది. దీంతో తప్పని పరిస్థితిలో సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్కథలో బలం ఉన్నప్పటికీ చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయాల వల్లే సినిమాకు మైనస్గా మిగిలింది. ఇప్పుడు ఓటీటీ వర్షన్లో అలాంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 20న సన్ నెక్ట్స్, నెట్ఫ్లిక్స్లో లాల్ సలామ్ స్ట్రీమింగ్కు రానుందని టాక్. థియేటర్లో చూడని వారికి తప్పకుండా నచ్చుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
నాని 'సరిపోదా శనివారం' ఓటీటీ రిలీజ్ డేట్ లాక్?
నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. దాదాపు 20 రోజులకు రూ.100 కోట్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, తుపాన్ ధాటికి ఈ మూవీ పరిస్థితి దారుణం అయిపోయింది. తొలి వీకెండ్ ఓ మాదిరి వసూళ్లు వచ్చాయి కానీ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా థియేట్రికల్ రన్ దాదాపు చివరకొచ్చేసింది. ఈ క్రమంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే ఓ వ్యక్తి కథతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ఎస్జే సూర్య సూపర్ యాక్టింగ్ చేశారు. కానీ వర్షాల వల్ల ఈ సినిమాని చాలామంది థియేటర్లలో చూడలేకపోయారు. అయితే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఇప్పుడు అనుకున్న టైం కంటే ముందే దీన్ని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు)ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమా.. సెప్టెంబరు 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నాని మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది మరికొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.'సరిపోదా శనివారం' స్టోరీ విషయానికొస్తే సూర్య(నాని)కి కోపమెక్కువ. కానీ తల్లి చెప్పడంతో శనివారం మాత్రమే కోపాన్ని చూపిస్తుంటాడు. పెద్దయిన తర్వాత కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్)తో ప్రేమలో పడతాడు. ఇదలా ఉండగా దయానంద్ (ఎస్జే సూర్య) అనే సీఐ క్రూరుడు, మహా కోపిష్టి. ఇతడు సోకులపాలెం అనే ఊరి ప్రజల్ని తెగ హింసిస్తుంటాడు. అలాంటి దయాకి సూర్య ఎలా అడ్డు నిలబడ్డాడు? చివరకు ఏమైందంనేదే మిగిలిన కథ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
S Jaishankar: ఆ విమానంలో నా తండ్రి కూడా ఉన్నారు
జెనీవా: ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’వెబ్సిరీస్పై ఇంకా చర్చ జరుగుతున్న వేళ అలాంటి హైజాక్ ఉదంతంలో తన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడిగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. 1984 ఏడాదిలో జరిగిన విమాన హైజాక్ ఉదంతంలో తన కుటుంబం సైతం తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. జెనీవాలో ఒక భారతీయసంతతి వ్యక్తులతో భేటీ సందర్భంగా జైశంకర్ తన కుటుంబం గతంలో పడిన వేదనను అందరితో పంచుకున్నారు. ఏడుగురు హైజాకర్లు చొరబడి.. ‘1984 జులై ఐదో తేదీన ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ 421 విమానం శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయి మధ్యలో చండీగఢ్ సమీపంలోని పఠాన్కోట్లో ఆగింది. అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్పిట్లోకి చొరబడి విమానాన్ని తమ అ«దీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారంతా ఆలిండియా సిఖ్ స్టూడెంట్స్ ఫెడరేషన్కు చెందిన వాళ్లు. సిక్కు వేర్పాటువాది జరై్నల్ సింగ్ భింద్రన్వాలేతోపాటు ఇతర నేతలను విడుదలచేయాలని డిమాండ్ విధించారు. విమానాన్ని లాహోర్కు, తర్వాత కరాచీకి, చిట్టచివరకు దుబాయ్కు తీసుకెళ్లారు. విమానం విదేశీగడ్డపైకి వెళ్లడంతో భారత విదేశాంగ శాఖ సైతం రాయబారం నడిపేందుకు రంగంలోకి దిగింది. ఇండియన్ ఫారిన్ సరీ్వస్లో చేరిన తొలినాళ్లలో.. అప్పుడు నేను ఇండియన్ ఫారిన్ సరీ్వస్(ఐఎఫ్ఎస్) యువ అధికారిగా పనిచేస్తున్నా. ప్రయాణికులన విడిపించేందుకు హైజాకర్లతో చర్చలు జరపాల్సిన బృందంలో నేను కూడా సభ్యునిగా ఉన్నా. అత్యంత కీలకమైన పనిలో నిమగ్నంకావాల్సి ఉన్నందున ఇంటికి రాలేనని చెప్పేందుకు మా అమ్మకు ఫోన్ చేశా. అప్పుడు నా భార్య ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో పసిబిడ్డగా ఉన్న నా కుమారుడిని మా అమ్మ ఒక్కరే చూసుకుంటోంది. ‘‘ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ విమానాన్ని హైజాక్ చేశారు’’అని చెప్పా. అయితే పనిలో సీరియస్గా మునిగిపోయాక నాలుగు గంటల తర్వాత నాకో విషయం తెల్సింది. అదేంటంటే నా తండ్రి కృష్ణస్వామి కూడా అదే విమానంలో బందీగా ఉన్నారు. ఓవైపు హైజాక్ విషయం తెల్సి ప్రయాణికుల కుటుంబసభ్యులు భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో నేను ఉన్నా. మరోవైపు ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిని కూడా నేను. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నాది. ఏదేమైనా 36 గంటల ఉత్కంఠ తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు అధికారుల ఎదుట లొంగిపోవడంతో కథ సుఖాంతమైంది. విమానంలోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైజాక్ ఉదంతం విషాదాంతంగా ముగియకుండా ఒక సమస్యకు పరిష్కారంగా మలుపు తీసుకుంది’’అని అన్నారు. ‘‘నేనింకా కాందహార్ వెబ్సిరీస్ చూడలేదు. అయితే హైజాకర్లతో ప్రభుత్వం, మధ్యవర్తులు కాస్తంత వెనక్కి తగ్గి మాట్లాడినట్లుగా అందులో చూపించారట కదా. సినిమాల్లో హీరోను మాత్రమే అందంగా చూపిస్తారు. ప్రభుత్వం సరిగా పనిచేసినా చూపించరు’’అని అన్నారు. అణ్వస్త్ర విధానాల్లో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర మాజీ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణస్వామి హైజాక్ జరిగిన ఏడాది ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్, అనాలసిస్కు డైరెక్టర్గా ఉన్నారు. ఆ తర్వాత భారత ‘అణ్వస్త్ర’విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా పేరొందారు. ‘‘అణ్వాయుధాలను తొలుత భారత్ తనంతట తానుగా ఏ దేశం మీదా ప్రయోగించకూడదు. ఒక వేళ భారత్ మీద ఎవరైనా అణ్వాయుధం ప్రయోగిస్తే ధీటైన సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి’’అనే ప్రాథమిక సిద్ధాంతాల్లో రూపకల్పనలో ఈయన పాత్ర ఉందని చెబుతారు. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుకు తొలి కనీ్వనర్గా వ్యవహరించారు. హైజాకర్లతో చర్చల వేళ ‘‘కావాలంటే మొదట నన్ను చంపండి. ప్రయాణికులను ఏమీ చేయకండి’’అని హైజాకర్లతో కృష్ణస్వామి అన్నారని నాటి పాత్రికేయులు రాజు సంతానం, దిలీప్ బాబ్లు చెప్పారు. -
మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్.. ఎక్కడ చూడాలంటే?
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.అసలు కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో బంగారు వీరుడు 'తంగలాన్'
విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా తంగలాన్. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. విక్రమ్ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా తంగలాన్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాణిజ్యపరంగా కూడా సుమారు రూ. 110 కోట్లు రాబట్టిన తంగలాన్ బాలీవుడ్లో కూడా తాజాగా విడుదలైంది. అక్కడి సినీ అభిమానులు కూడా విక్రమ్ నటనకు ఫిదా అవుతున్నారు. అయితే, తాజాగా తంగలాన్ ఓటీటీ ప్రకటన గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. విక్రమ్ మీద నమ్మకంతో సినిమా విడుదలకు ముందే డీల్ సెట్ చేసుకుంది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించినట్లు ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. అయితే, అదే నిజమని ఇండస్ట్రీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. కానీ, నెట్ఫ్లిక్స్ అధికారిక సోషల్మీడియాలో తంగలాన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. సెప్టెంబర్ 20 తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో మాత్రమే తంగలాన్ విడుదల తప్పకుండా అవుతుందని సమాచారం. అయితే, హిందీ వర్షన్ మాత్రం ఒక వారం గ్యాప్తో రిలీజ్ కానున్నట్లు టాక్.కథేంటి..?గోల్డ్ హంట్ నేపథ్యంలో తంగలాన్ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం టాలీవుడ్ సినిమాలదే హవా!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. అంతా వినాయక చవితి పండుగ సందడితో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. గతనెల రిలీజైన హిట్ కొట్టిన టాలీవుడ్ చిత్రాలు ఈ వారంలో ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. అవేంటో తెలుసుకుందాం.ఈ వారం ఓటీటీల్లో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండడం అభిమానుల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ ఈ వారం నుంచే డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేయనుంది. దీంతో పాటు హిట్ మూవీ ఆయ్, బెంచ్ లైఫ్ లాంటి టాలీవుడ్ వెబ్ సిరీస్ అభిమానులకు కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మిస్టర్ బచ్చన్(టాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12ఆయ్ (టాలీవుడ్ చిత్రం) - సెప్టెంబర్ 12సెక్టార్ 36- (బాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13బ్రేకింగ్ డౌన్ ది వాల్(డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్-2 (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12మిడ్నైట్ ఎట్ ది పెరా ప్యాలెస్ సీజన్-2- (వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12అగ్లీస్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 13అమెజాన్ ప్రైమ్ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ సిరీస్)-సెప్టెంబర్ 10జీ5బెర్లిన్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 13నునాకుజి(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 13సోనిలివ్తలవన్(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 10బెంచ్ లైఫ్(తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12డిస్నీ ప్లస్ హాట్స్టార్గోలి సోడా రైజింగ్ (తమిళ సినిమా)- సెప్టెంబర్ 13హౌ టు డై ఆలోన్ -సెప్టెంబర్ 13ఇన్ వోగ్ ది 90ఎస్(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13లెగో స్టార్ వార్స్: రిబిల్డ్ ది గెలాక్సీ- సెప్టెంబర్ 13జియో సినిమాకల్బలి రికార్డ్స్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 12లయన్స్ గేట్ ప్లేలేట్ నైట్ విత్ ది డెవిల్(హారర్ మూవీ)- సెప్టెంబర్ 13 -
ఓటీటీలో 'ఆయ్' సినిమా.. ప్రకటన వచ్చిందండోయ్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ‘ఆయ్’ భారీ విజయాన్ని అందుకుంది. ఆగష్టు 15న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. మంచి వినోదంతో కూడిన గోదావరి నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ గ్యాప్ని ‘ఆయ్’ తీర్చేసింది. ఇందులో జూ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా నటించారుచిన్న సినిమాగా తెరకెక్కిన 'ఆయ్' బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లకు పైగానే రాబట్టింది. థియేటర్ బిజనెస్ పూర్తి చేసుకున్న ఆయ్ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఈమేరకు నెట్ఫిక్స్ సంస్థ ఆయ్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 12న ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ,మలయాళంలో విడుదల కానుంది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు.కధేంటి..?హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేస్తున్న కార్తీక్ (నార్నె నితిన్) కరోనా లాక్డౌన్ వల్ల తన సొంత ఊరు అమలాపురం వస్తాడు. ఆఫీస్కు వెళ్లే అవకాశం లేకపోవడంతో వర్క్ ఫ్రమ్ హోం చేసుకుంటూనే తన చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ని చూసి ఇష్టపడతాడు. పల్లవి ఎప్పుడూ సోషల్ మీడియాలో చలాకీగా ఉంటుంది. ఆమెకు కులం పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అయితే, కార్తీక్ తన కులానికి చెందినవాడే అనుకొని ఇష్టపడుతుంది. కానీ, తనది వేరే కులం అని తెలుసుకున్న పల్లవి తన ప్రేమ విషయాన్ని తండ్రి వద్ద దాస్తుంది. ప్రేమ విషయం తెలిస్తే చంపేస్తాడని పెద్దలు కుదిర్చిన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇదే సమయంలో పల్లవి, కార్తీక్లను ఒక్కటి చేయాలని వారి స్నేహితులు చాలా ప్రయాత్నాలు చేస్తుంటారు. ఫైనల్గా వారిద్దరిని ఎవరు కలుపుతారు..? స్నేహితుల ప్రయత్నాలు ఫలిస్తాయా..? చివరకు కార్తిక్ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి..? ఫైనల్గా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారా..? తెలియాలంటే సెప్టెంబర్ 12 నెట్ఫ్లిక్స్లో 'ఆయ్' సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన
మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఓటీటీ రిలీజ్పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 'మిస్టర్ బచ్చన్' సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రిలీజ్ తర్వాత మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ డిజాస్టర్గా నిలిచింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే జోడీగా కనిపించారు. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా పాటలు బాగుండటంతో ఓటీటీలో చూద్దాంలే అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నెట్ఫ్లిక్స్ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలోనూ తగ్గేదేలే.. ఆ జాబితాలో టాప్ ప్లేస్లో కల్కి!
ప్రభాస్- నాగ్అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ బ్లాక్బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో నెల రోజులకు పైగా అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఓటీటీలోనూ కల్కి మూవీకి విపరీతమైన క్రేజ్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్లో సౌత్ లాంగ్వేజేస్లో అందుబాటులో ఉంది. హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండు వారాల్లోనే అత్యధికంగా 2.6 మిలియన్ల వ్యూస్, 7.5M గంటల టైమింగ్తో గ్లోబల్లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్లో నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో వరల్డ్ వైడ్గా మొదటి స్థానంలో కొనసాగుతోంది. కాగా..ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.కాగా.. ఈ మూవీకి సీక్వెల్ను కూడా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. పార్ట్-2లో కమల్ హాసన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. ఈ మూవీని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
నెట్ఫ్లిక్స్ సిరీస్పై తీవ్ర అభ్యంతరం.. ఇకపై తప్పు జరగదన్న మేకర్స్!
ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన సరికొత్త వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. ఈ సిరీస్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సిరీస్లోని కొన్ని సన్నివేశాలపై పెద్దఎత్తున వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే సిరీస్పై మండిపడ్డ కేంద్రం వివరణ ఇవ్వాలంటూ మేకర్స్కు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు.ఇకపై కంటెంట్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కంటెంట్ను ప్రసారం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ అంగీకరించింది.అసలేంటీ వివాదం..1999లో భారత విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్లో హైజాకర్ల పేర్లను శంకర్, భోలా అని మార్చి చూపించడమే కాకుండా.. వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చిత్రీకరించారు. దీంతో హైజాకర్లు తమ మత గుర్తింపు దాచిపెట్టేందుకే మారుపేర్లు పెట్టుకున్నారని.. ఈ సిరీస్ రూపొందించిన వారు కావాలనే ఆ పేర్లనే క్యారెక్టర్స్కు పెట్టారని భాజపా ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేసింది. -
వివాదంలో మరో వెబ్ సిరీస్.. నెట్ఫ్లిక్స్కి కేంద్రం సమన్లు!
సినిమానో వెబ్ సిరీస్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. లేదంటే ఈ కాలంలో ఎక్కడిలేనన్నీ వివాదాలు చుట్టుముడతాయి. అదే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తే మరింత కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ మాత్రం తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. గతంలో పలు సినిమాలు, సిరీస్లతో వ్యతిరేకత ఎదుర్కొంది. ఇప్పుడు 'ఐసీ 814: కాందహార్ హైజాక్' సిరీస్తో మరో వివాదానికి కేరాఫ్ అయింది.1999లో భారతీయ విమానం హైజాక్ గురించి అంత త్వరగా జనాలు మర్చిపోలేదు. అదే స్టోరీని తీసుకుని తీసిన వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షా, అరవింద స్వామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా నెట్ఫ్లిక్స్లో రిలీజై అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో వచ్చిన వాటిల్లో బెస్ట్ అని ప్రశంసిస్తున్నారు.(ఇదీ చదవండి: 'బిగ్బాస్ 8' షోలో తెలుగు వాళ్లకు అన్యాయం?)అయితే కాందహార్ హైజాక్ చేసింది పాకిస్థాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులే. అప్పట్లోనే నిందితుల పేర్లు బయటకొచ్చాయి. ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షకీర్ అని అప్పుడే వాళ్లు ఫొటోలు కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన సిరీస్లో మాత్రం పేర్లు మార్చేశారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్ అని వేరే పేర్లతో సంభోదించారు. ఇలా పనిగట్టుకుని ముస్లింలా పేర్లు మార్చి ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడంపై సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.ఈ క్రమంలోనే భారతీయ ప్రసార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ.. నెట్ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. పేర్లు మార్పుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి ఈ విషయంలో సదరు ఓటీటీ సంస్థ ఏమని సమాధానమిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే గొడవలు) -
ఈ వారం థియేటర్లలో 'ది గోట్'.. మరి ఓటీటీకి వచ్చే సినిమాలేవో తెలుసా..!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. దీంతో సినీ ప్రియులను అలరించేందుకు సినిమాలు సైతం సిద్ధమైపోయాయి. ఈ వీక్ థియేటర్లలో విజయ్ ది గోట్ మాత్రమే సందడి చేయనుంది. అంతేకాకుడా టాలీవుడ్లో జనక అయితే గనక, 35 చిన్నకథ కాదు లాంటి చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. అంతకుమించి ఈ వారంలో పెద్ద సినిమాల హడావుడి కనిపించడం లేదు.అయితే ఈ వారంలో ఓటీటీలోనూ పెద్దగా ఆసక్తిగా కలిగిన సినిమాలు కనిపించడం లేదు. బాలీవుడ్ యాక్షన్ మూవీ కిల్ మాత్రమే కాస్తా ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై అనే హాలీవుడ్ చిత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. మరీ ఈ వారంలో ఓటీటీలో ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా చూసేయండి. నెట్ఫ్లిక్స్ది ఫర్ఫెక్ట్ కపుల్(వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 05 అపోలో 13: సర్వైవల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబరు 05బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై(ఇంగ్లీష్ మూవీ)- సెప్టెంబర్ 06 రెబల్ రిడ్జ్ (ఇంగ్లీష్) -సెప్టెంబరు 06 అమెజాన్ ప్రైమ్కాల్ మీ బే(హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 06జియో సినిమాది ఫాల్ గై(ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబర్ 03డిస్నీ ప్లస్ హాట్స్టార్ బ్రిక్ టూన్స్ (ఇంగ్లీష్) సెప్టెంబరు 04కిల్(హిందీ)- సెప్టెంబర్ 06సోనిలివ్తనావ్ సీజన్-2 పార్ట్-1(వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 06లయన్స్ గేట్ ప్లేఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్- సెప్టెంబర్ 06ది ఎటర్నల్ డాటర్(ఇంగ్లీష్ మూవీ)- సెప్టెంబర్ 06వెలరియన్ అండ్ ది సిటీ ఆఫ్ థౌజండ్ ప్లానెట్స్(ఇంగ్లీష్ మూవీ)-సెప్టెంబర్ 06 -
'పుష్ప 2' ఓటీటీ హక్కులు.. ఏకంగా వందల కోట్లు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'తో బిజీగా ఉన్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. మొన్నీమధ్య నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ప్లానింగ్ అంతా చెప్పారు. సెప్టెంబరు-అక్టోబరు కల్లా మరో రెండు పాటలు రిలీజ్ అవుతాయని, అలానే ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తవుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ పక్కా అని బల్లగుద్ది మరీ క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)ఇదలా ఉండగానే పుష్ప 2 మూవీ ఓటీటీ హక్కుల గురించి ఇప్పుడు అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీకి లేనంతగా అమ్మారట. ఏకంగా రూ.270 కోట్లకు నెట్ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.మరో రెండురోజుల్లో 'పుష్ప 2' కొత్త షెడ్యూల్ మొదలవబోతుందట. ఇందులో భాగంగా అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మరోవైపు 'పుష్ప' పార్ట్ 3 కూడా ఉండొచ్చని మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రావు రమేశ్ చెప్పుకొచ్చారు. రెండో భాగాన్నే దాదాపు మూడేళ్ల నుంచి తీస్తున్నారు. ఇక మూడో పార్ట్ అంటే అది ఎన్నేళ్లు అవుతుందో?(ఇదీ చదవండి: ఆరేళ్లు తీసిన క్రేజీ హారర్ సినిమా.. థియేటర్లలో రీ రిలీజ్) -
ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. ఆగష్టు 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంలో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా నటించింది.ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీలోనైనా ఆడియన్స్ను మెప్పిస్తుందేమో చూడాలి.బడ్డీ కథేంటంటే..ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? అనేదే మిగతా కథ. -
ఆ ఓటీటీకి సరిపోదా శనివారం.. భారీ ధరకు రైట్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్హిట్ ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భారీ ధరకు ఓటీటీ రైట్స్?అయితే ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో ఓటీటీ రైట్స్ గురించి చర్చ మొదలైంది. ఓటీటీకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో వస్తుందని సినీప్రియులు తెగ ఆరా తీస్తున్నారు. అయితే సరిపోదా శనివారం మూవీ హక్కులను ఇప్పటికే నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సౌత్ రైట్స్ను మాత్రమే దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు హిందీ ఓటీటీ హక్కులను జియో సినిమా కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.ఓటీటీకి అప్పుడేనా??ఈ మూవీ రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీకి రానుందని క్రేజీ టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచే స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముందని సమాచారం. అదే రోజు రెండు ఓటీటీల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సరిపోదా శనివారం నెల రోజుల్లోపే ఓటీటీలో చూసే అవకాశం ఉంటుంది. కాగా.. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఎస్జే సూర్య విలన్ పాత్రలో మెప్పించారు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారంలో ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. థియేటర్లలో అలరించేందుకు సరిపోదా శనివారం అంటూ నాని సందడి చేయనున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ మూవీతో పాటు ఒకట్రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్ లేదు.దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ వారంలో కూడా ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు బోలెడు సిద్ధమైపోయాయి. వీటిలో ఆసక్తి పెంచుతోన్న టాలీవుడ్ మూవీ బడ్డీ. అల్లు శిరీష్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 30 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, సిరీస్లు కూడా వస్తున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్బడ్డీ (తెలుగు సినిమా)- ఆగస్టు 30ఐసీ 814: ది కాందహార్ హైజాక్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 29కావోస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29పోలైట్ సోసైటీ -(ఇంగ్లీష్ మూవీ)- ఆగస్టు 28టర్మినేటర్ జీరో-(ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29జియో సినిమాఅబిగైల్ (ఇంగ్లీష్ సినిమా)- ఆగస్టు 26గాడ్జిల్లా ఎక్స్ కింగ్: ది న్యూ ఎంపైర్(ఇంగ్లీష్ మూవీ)- ఆగస్టు 29క్యాడేట్స్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 30జీ5ఇంటరాగేషన్ (హిందీమూవీ)- ఆగస్టు 30ముర్షిద్ (హిందీ సిరీస్)- ఆగస్టు 30డిస్నీ ప్లస్ హాట్స్టార్ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్-4- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- ఆగస్టు 27కానా కానుమ్ కాలంగల్ సీజన్-3- తమిళ వెబ్ సిరీస్- ఆగస్టు 30 అమెజాన్ ప్రైమ్ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్-2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29లయన్స్ గేట్ ప్లేహెన్రీస్ క్రైమ్ (ఇంగ్లీష్)- ఆగస్టు 30ది సెప్రెంట్ క్వీన్ సీజన్-2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 30 -
ఓటీటీలో అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమా
టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. ఆగష్టు 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.బడ్డీ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనుకున్న అల్లు శిరీష్కు థియేటర్లో నిరాశే మిగిలింది. ఇప్పుడు ఓటీటీలో అయినా మెప్పిస్తాడేమో చూడాల్సి ఉంది. ఆగష్టు 30న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.బడ్డీ కథ ఇదేఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? అనేదే మిగతా కథ. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఫ్రీగా నెట్ఫ్లిక్స్, 2 జీబీ డేటా.. జియో బెస్ట్ ప్లాన్ ఇదే..
దేశంలో అత్యధిక యూజర్లు ఉన్న టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. దీనికి సుమారు 48 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇటీవల టారిఫ్లు పెంచిన తర్వాత మంచి ప్రయోజనాలు ఉన్న బెస్ట్ ప్లాన్ల కోసం యూజర్లు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తూ ఇతర బెనిఫిట్స్ లభించే ఒక బెస్ట్ జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..నెట్ఫ్లిక్స్తో కూడిన కొత్త కాంబో ప్లాన్ను జియో ప్రారంభించింది. నెట్ఫ్లిక్స్తో పాటు మెరుగైన మొబైల్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది నెట్ఫ్లిక్స్ (మొబైల్) ఉచిత సబ్స్క్రిప్షన్తో వస్తుంది. దీంతో మీరు స్మార్ట్ఫోన్లో నెట్ఫ్లిక్స్ విస్తారమైన లైబ్రరీలో ఉన్న వేలాది మూవీస్, వెబ్ సిరీస్లను ఆస్వాదించవచ్చు.ప్లాన్ బెనిఫిట్స్ఈ ప్లాన్ ధర రూ. 1,299. వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. వినియోగదారులు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. అపరిమిత కాలింగ్తో యూజర్లు ఏ నెట్వర్క్లో అయినా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్కు ఉచిత యాక్సెస్ను పొందవచ్చు. 5జీ ఫోన్ని ఉపయోగిస్తున్నవారు తమ ప్రాంతంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే 5జీ డేటాను ఉపయోగించవచ్చు. -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. అప్పుడెప్పుడో 2018లో హిందీలో వచ్చిన 'రైడ్' అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో మూవీ ఫెయిలైంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైతే తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్)రిలీజ్కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. దీంతో సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఘోరమైన రిజల్ట్ కనిపించింది. హీరోయిన్ తప్పితే చూడటానికి సరైన కంటెంట్ లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అలానే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితుల అంచనా. ఈ క్రమంలోనే అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్కి వచ్చి ఉండేదేమో? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. ఆరు వారాలు విశ్రాంతి) -
నెట్ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్లు ట్రై చేయండి..
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.. ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రూ.199 విలువ చేసే నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను ఉచితంగా అందిస్తున్నాయి.ఫ్రీ నెట్ఫ్లిక్స్ అందిస్తున్న ప్లాన్లు ఇవే..జియో రూ.1,299 ప్లాన్: ఈ ప్లాన్తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత 5జీ డేటాతో 84 రోజుల పాటు (మొత్తం 168 జీబీ మొత్తం) రోజుకు 2 జీబీ డేటాను ఆస్వాదించవచ్చు.జియో రూ.1,799 ప్లాన్: 84 రోజుల పాటు (మొత్తం 252 జీబీ) 3 జీబీ రోజువారీ డేటాతో పాటు రూ .1,299 ప్లాన్ మాదిరిగానే అపరిమిత ప్రయోజనాలను పొందండి.వొడాఫోన్ ఐడియా రూ.1,198 ప్లాన్: ఈ ప్లాన్ మొత్తం 70 రోజుల పాటు 2 జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 140 జీబీ. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.వొడాఫోన్ ఐడియా రూ.1,599 ప్లాన్: ఈ ప్లాన్తో 84 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటాను మొత్తంగా 210 జీబీ డేటాను పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి.ఎయిర్టెల్ రూ.1,798 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. మొత్తం 252 జీబీ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. -
మరికొన్ని గంటల్లో ఓటీటీకి కల్కి.. ఎక్కడ చూడాలంటే?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ హిట్ 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.థియేట్రికల్ రిలీజ్ సూపర్ హిట్ కావడంతో కల్కి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నెల 22 నుంచి అమెజాన్ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని గంటల్లోనే కల్కి ఓటీటీలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ అదే తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకేందుకు ఆలస్యం ఇవాళ అర్థరాత్రి నుంచే ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఓటీటీలో 'మహారాజ' రికార్డ్.. నం.1 ప్లేస్
విభిన్న సినిమాలతో అలరించే విజయ్ సేతుపతి.. రీసెంట్గా 'మహారాజ' సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. తెలుగు, తమిళంలో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. కొన్నిరోజులకు ఓటీటీలోకి రాగా, అక్కడ కూడా మైండ్ బ్లోయింగ్ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)'మహారాజ'లో విజయ్ సేతుపతి తప్పితే మరో పేరున్న యాక్టర్ ఎవరూ లేరు. సీరియస్ రివేంజ్ డ్రామా కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమాలో కథ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లేతో దర్శకుడు మేజిక్ చేశాడు. దీంతో తెలుగు, తమిళంలో హిట్ అయింది. నెట్ఫ్లిక్స్లో రిలీజైన తర్వాత దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలిచింది.అలా దాదాపు ఆరు వారాల నుంచి నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అయిన 'మహారాజ'.. ఈ ఏడాది సదరు ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీని తర్వాతి స్థానాల్లో క్రూ (17.9 మిలియన్లు), లాపతా లేడీస్ (17.1 మిలియన్లు), సైతాన్ (14.8 మిలియన్లు), ఫైటర్ (14 మిలియన్లు), యానిమల్ (13.6 మిలియన్లు), డుంకీ (10.8 మిలియన్లు) ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్) -
దేశాన్ని కుదిపేసిన హైజాక్.. యదార్థ సంఘటనలతో వెబ్ సిరీస్
1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అందులో 188 మంది ప్రయాణికులతో పాటు 15 మంది సిబ్బంది సుమారు 7రోజులు పాటు బందీలుగా ఉంచారు. ఈ ఉదంతాన్ని అనుభవ్ సిన్హా ప్రేక్షకులకు చూపించనున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఎప్పటికీ మరిచిపోలేని ఘటనల్లో ఫ్లైట్ 814 హైజాక్ ఒకటి అని చెప్పవచ్చు. ఇప్పుడు 'ఐసీ814:ది కాంధార్ హైజాక్' పేరుతో వెబ్ సిరీస్ విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు అమృత్సర్, లాహోర్, దుబాయ్లలో కొద్దిసేపు ల్యాండింగ్ చేసిన ఉగ్రవాదులు ఆ తర్వాత తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో ఈ జెట్ను ఉంచారు. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటన ఎప్పటికీ మరిచిపోలేము. అప్పుడు జరిగిన సంఘటనలను ‘ఐసీ814:ది కాంధార్ హైజాక్’ పేరుతో ఒక వెబ్ సిరీస్ను నిర్మించారు. నెట్ఫ్లిక్స్లో ఆగష్టు 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు. -
ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్పై అధికారిక ప్రకటన
ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఆగస్టు 15 నాటికి 50 రోజుల మార్క్ అందుకుంది. దాదాపు థియేట్రికల్ రన్ ముగిసినట్లే. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనేది అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: అక్కడ షారూఖ్ ఖాన్.. ఇక్కడ మహేశ్ బాబు?)గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఆగస్టు మూడో వారంలోనే 'కల్కి' ఓటీటీలోకి రానుంది. అయితే ఆగస్టు 23న కాకుండా ఓ రోజు ముందే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ పోస్టర్ రిలీజ్ చేసి మరీ క్లారిటీ ఇచ్చింది. హిందీ వెర్షన్ అదే తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో భవిష్యత్, భూత కాలాల్ని చూపించారు. అలానే మహాభారతం ఎపిసోడ్ కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఆలోవర్ హిట్ టాక్తో రూ.1200 కోట్ల మేర వసూళ్లు సాధించింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in)The dawn of a new ERA awaits you 🌅And this is your gateway into the GRAND world of Kalki⛩️🔥#Kalki2898ADOnPrime🔥, Aug 22#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani@VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/9FYs2quk5C— prime video IN (@PrimeVideoIN) August 17, 2024 -
‘తంగలాన్’ వచ్చేది ఈ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా.. పా. రంజిత్ ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై చూపించాడని అందరూ ప్రశంసిస్తున్నారు. (చదవండి: ‘తంగలాన్’ మూవీ రివ్యూ)ఇక విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. తంగలాన్ పాత్రలో ఆయనను తప్పా ఇంకెవరినీ ఊహించుకోలేమని పేర్కొంటున్నారు. విజువల్స్, మ్యూజిక్ బాగున్నాయి కానీ.. కథనమే సాగదీతగా ఉందని అంటున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఓటీటీ వివరాలను వెతికే పనిలో పడ్డారు నెటిజన్స్.రెండు నెలలు ఆగాల్సిందే..తంగలాన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్తో పాటు మొత్తం ఐదు భాషల్లో కలిపి రూ. 35 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే సినిమా థియేటర్స్లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన అక్టోబర్ రెండో వారంలో తంగలాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సినిమాలను థియేటర్స్లో చూస్తేనే బాగుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. ఓటీటీ రిలీజ్ డేట్ అదేనా?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ టాలీవుడ్ మూవీ ఓటీటీకి ఎప్పుడెస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా కల్కి ఓటీటీ రిలీజ్పై సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈనెల 23 నుంచే ఓటీటీకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాది హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. హిందీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెలలోనే స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఉండడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది.నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాంగోపాల్ వర్మ అతిథి పాత్రల్లో మెప్పించారు. -
వాస్తవ ఘటనల క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో!
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మస్సే ఇప్పడు భారతీయ సినీ ప్రేక్షకులకు అందరికీ పరిచయమే.. 12th ఫెయిల్ సినిమాలో ఐపీఎస్ సాధించాలనే కోరికతో ఒక యువకుడు పోరాటం సాగిస్తాడు. మనోజ్ కుమార్ శర్మ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. దర్శకుడు విధు వినోద్ చోప్రా కూడా చాలా చక్కగా ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే, తాజాగా విక్రాంత్ మస్సే నటించిన సెక్టార్- 36 చిత్రం డైరెక్ట్గా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.12th ఫెయిల్, ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా అనే చిత్రాలలో నటించి ఫుల్ జోష్లో ఉన్న విక్రాంత్ తన తదుపరి సినిమా సెక్టార్ 36తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా మడోక్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా సెక్టార్ 36 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహానగరాల స్లమ్ ఏరియాలో చిన్న పిల్లల అదృశ్యం వెనకున్న మిస్టరీ ఛేదించే పోలీస్ ఆఫీసర్గా విక్రాంత్ మస్సే కనిపించబోతున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 13న డైరెక్ట్గా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియల్ కీలక పాత్రలో నటించారు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వారంలో ఇండిపెండెన్స్ ఉండడంతో పెద్ద సినిమాలన్నీ ఆ రోజే వచ్చేస్తున్నాయి. టాలీవుడ్లో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి చిత్రాలు ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి తంగలాన్ లాంటి భారీ యాక్షన్ చిత్రం కూడా వస్తోంది. అంతేకాకుండా ఆయ్ సినిమాలాంటి ఒకటి, రెండు చిన్నచిత్రాలు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ సందడి చిత్రాలు రెడీ అయిపోయాయి. వీటిలో టాలీవుడ్ మూవీ డార్లింగ్తో పాటు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్లాల్ ప్రధానపాత్రల్లో నటించిన మనోరతంగల్ స్ట్రీమింగ్కు రానుంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మాట్ రిఫే: లూసిడ్ - ఏ క్రౌడ్ వర్క్ స్పెషల్- ఆగస్టు 13డాటర్స్ (డాకుమెంటరీ)- ఆగస్టు 14రెన్ఫీల్డ్ (హాలీవుడ్)- ఆగస్టు 14వరస్ట్ ఎక్స్ ఎవర్(క్రైమ్ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15యావరేజ్ జో సీజన్ -1- ఆగస్టు 15బ్యాక్యార్ట్ వైల్డర్నెస్- ఆగస్టు 15ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4- పార్ట్ 1- ఆగస్టు 15కెంగన్ అసుర సీజన్ 2- పార్ట్ 2- ఆగస్టు 16ఐ కెనాట్ లైవ్ వితౌట్ యూ- ఆగస్టు 16పెరల్- ఆగస్టు 16షాజమ్- ఫ్యూరీ ఆఫ్ గాడ్స్- ఆగస్టు 17ది గార్ఫీల్డ్ మూవీ(యానిమేషన్ చిత్రం)- ఆగస్టు 17జీ5మనోరతంగల్(తమిళ సిరీస్)- 15 ఆగస్టుకంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15 డిస్నీ ప్లస్ హాట్స్టార్స్టార్ వార్స్: యంగ్ జేడి అడ్వెంచర్స్(యానిమేషన్)- సీజన్ 2- ఆగస్టు 14డార్లింగ్ -టాలీవుడ్ మూవీ- ఆగస్టు 13మై ఫర్ఫెక్ట్ హస్బెండ్- ఆగస్టు 16 జియో సినిమాఇండస్ట్రీ సీజన్-3(వెబ్ సిరీస్)- ఆగస్టు12శేఖర్ హోమ్(బెంగాలీ వెబ్ సిరీస్) - ఆగస్టు 14బెల్ ఎయిర్ సీజన్-2 - ఆగస్టు 15సోనీలివ్చమక్: ది కంక్లూజన్(హిందీ సినిమా) - ఆగస్టు 16హోయ్చోయ్పరిణీత- ఆగస్టు 15 -
వానరాలు నటించిన అచ్చ తెలుగు కథ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.భాష ఏదైనా భావం ముఖ్యమన్న నానుడి ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమాకి సరిగ్గా సరిపోతుంది. ఒకటి రెండు పాత్రల మినహా పూర్తిగా చింపాంజీలు నటించిన సినిమా ఇది. ఈ సినిమాకి వెస్ బాల్ దర్శకుడు. ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా మునుపటి ఏప్స్ సిరీస్కు కొనసాగింపుగా తీసింది. సీజర్ అనే ప్రధాన పాత్రధారి తదనంతరం జరిగే కథ ఇది. సీజర్కు వారసుడిగా ప్రకటించుకుని తనకు తానుప్రాక్సిమస్ సీజర్గా ప్రకటించుకుంటాడు ఓ నాయకుడు. మోవా, అతని సమూహం పై దాడి చేసి బందీలుగా తన రాజ్యానికి తెచ్చుకుంటాడుప్రాక్సిమస్ సీజర్. తన రాజ్యంలో మనుషులకు సంబంధించిన ఓ బంకర్ను మందీ మార్బలంతో తెరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో బంకర్కు సంబంధించిన ఓ మనిషితో కలిసిప్రాక్సిమస్ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు మోవా. తరువాత కొన్ని ట్విస్టులతోప్రాక్సిమస్ సీజర్ను మోవా ఎలా అంతమొందించాడు అన్నది హాట్ స్టార్ ఓటీటీ వేదిక మీద చూడాలి. కథ పరంగా చూస్తే మనకు పాత తెలుగు సినిమా కథ వాసనలు రావచ్చు. టెక్నాలజీని ఉపయోగించి టాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా ఈగ నుండి డైనాసరస్ వరకు అన్ని జంతువులను మన కథకు తగ్గట్టుగా మలుచుకుంటున్నారు నేటి దర్శకులు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇంతటి సాంకేతికత అందుబాటులోకి రాని 80వ దశకంలోనే ‘మాకు స్వాతంత్య్రం కావాలి’ అన్న పేరుతో తెలుగులో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో పూర్తిగా జంతువుల మీద తీసిన సినిమా అది. నాటి ప్రేక్షకులకు అదో వింత, నేటి ప్రేక్షకులకు ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా అనేది ఓ పెద్ద వండర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జంతువులలో కూడా మనిషి భావాలు స్పష్టంగా చూపించడం, అలాగే అద్భుతమైన టేకింగ్ విత్ విజువల్ ఫీస్ట్ స్క్రీన్ల్పేతో ‘కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా వర్త్ టూ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
వీకెండ్లో ఓటీటీ చిత్రాలు.. ఆ ఒక్క సినిమాపైనే అందరి చూపులు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కావడం లేదు. స్టార్ హీరోల సినిమాలన్నీ ఆగస్టు 15న రానున్నాయి. దీంతో ఈ వారం చిన్న చిత్రాలు సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. వాటిలో కమిటీ కుర్రోళ్లు, సింబా, భవనం, తుఫాన్ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు.దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ శుక్రవారం ఏయే చిత్రాలు రానున్నాయని తెగ ఆరా తీస్తున్నారు. ఈ వీకెండ్లో ఓటీటీలో అలరించేందుకు ఇండియన్-2 వచ్చేస్తున్నాడు. కమల్హాసన్- శంకర్ కాంబోలో తెరకెక్కించారు. దీంతో పాటు మలయాళ, తమిళ డబ్బింగ్ చిత్రాలు ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.వీకెండ్ ఓటీటీ చిత్రాలునెట్ఫ్లిక్స్భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా (సినిమా) - ఆగస్టు 9కింగ్స్మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) ఆగస్టు 9మిషన్ క్రాస్ (కొరియన్ సినిమా) - ఆగస్టు 9ఇన్సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్) ఆగస్టు 9రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) ఆగస్టు 1జియో సినిమాగుడ్చడి (సినిమా) - ఆగస్టు 9జీ5గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) - ఆగస్టు 9డిస్నీ ప్లస్ హాట్స్టార్లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఆహాడెరిక్ అబ్రహాం(మలయాళ సినిమా) - ఆగష్టు 107/జీ (తమిళ సినిమా)- ఆగస్టు 9సోనీలివ్టర్బో (సినిమా) - ఆగస్టు 9సింప్లీ సౌత్అన్నపూరణి ఆగస్టు 9(ఇండియాలో స్ట్రీమింగ్ లేదు) -
ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్లు రిలీజ్
ఆగస్టులో భారీ సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకింకా వారం ఉంది. ఈ రెండో వారంలో చిన్నాచితకా చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అటు ఓటీటీలోనూ కామెడీ, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆగస్టు 2వ వారంలో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజయ్యే మూవీస్..🎬 కమిటీ కుర్రోళ్లు - ఆగస్టు 9🎬 సింబా - ఆగస్టు 9🎬 భవనమ్ - ఆగస్టు 9🎬 తుఫాన్ - ఆగస్టు 9ఓటీటీ రిలీజెస్..నెట్ఫ్లిక్స్ద అంబ్రెల్లా అకాడమీ సీజన్ 4 - ఆగస్టు 8భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా (సినిమా) - ఆగస్టు 9కింగ్స్మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) ఆగస్టు 9మిషన్ క్రాస్ (కొరియన్ సినిమా) - ఆగస్టు 9ఇన్సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్) ఆగస్టు 9రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) ఆగస్టు 1జియో సినిమామేఘ బర్సేంగే (వెబ్ సిరీస్) - ఆగస్టు 6గుడ్చడి (సినిమా) - ఆగస్టు 9జీ5భీమా: అధికార్ సే అధికార్ తక్ (హిందీ) ఆగస్టు 5అమర్ సంగి (సీరియల్) - ఆగస్టు 5గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) - ఆగస్టు 9హాట్స్టార్ఆర్ యు షోర్ (ట్రావెల్ సిరీస్) - ఆగస్టు 8లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) - ఆగస్టు 9ది జోన్: సర్వైవల్ మిషన్, మూడో సీజన్ (రియాలిటీ షో) ఆగస్టు 7ఆర్ యూ ష్యూర్ (కొరియన్) ఆగస్టు 8సోనీలివ్టర్బో (సినిమా) - ఆగస్టు 9 చదవండి: ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట!