outsourcing employees
-
ఉద్యోగులకు వేధింపులు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎస్ఆర్ రెసిడెన్సీ హోటల్లో వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది ఉద్యోగులు, వివి«ద ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని ఫెడరేషన్ను కాపాడుకుంటామని ఉద్యోగులు ముక్త కంఠంతో ప్రకటించారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామన్న హామీని నెరవేర్చ లేదన్నారు.పెండింగ్ బకాయిలన్నీ చెల్లించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలుకు పెంచుతామన్న హామీని తుంగలోకి తొక్కి వారి ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు. గత సర్కారు ఇచ్చిన జీవోలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వ వేధింపులు తాళలేక ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.కొందరు ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, వందలాది మందికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చిందన్నారు. పెండింగ్ బకాయిలను ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై సీఎం దృష్టి సారించి సంఘాలను పిలిచి మాట్లాడాలని సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వీఆర్ఏలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు భద్రత కరువు.. గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎంను కోరిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడేవారని, నేరుగా సమస్యలు ఆయన దృష్టికి తెచ్చి చాలా వరకు పరిష్కరించామని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కరువైందని, అందువల్ల మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తెస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు ఒక్క సమస్యనుగానీ, హామీనిగానీ అమలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు. ఉద్యోగులను మీటింగుల్లో తిట్టడం, మంత్రుల బెదిరింపులు ఎక్కువయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం సచివాలయ మహిళా ఉద్యోగులతో చీకట్లో పెన్షన్లు పంపిణీ చేయించడం దారుణమన్నారు. మహిళా ఉద్యోగులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, వారికి భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. -
465 మంది చిరుద్యోగులపై కక్ష సాధింపు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ఎచ్చెర్ల క్యాంపస్: వివిధ విభాగాల్లోని చిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటికే వేలాదిమందిని ఉద్యోగంలోనుంచి తొలగించగా.. తాజాగా మంగళవారం మరో 465మందికి ఉద్వాసన పలికి కొత్త సంవత్సరంలోనూ వారికి చేదు అనుభవాన్ని రుచి చూపించింది. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)తో పాటు కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్), విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్ (వీజీహెచ్)లలో పనిచేసే 431 మంది మలేరియా సిబ్బందిని జనవరి 1వ తేదీ నుంచి పనిలోకి రావద్దంటూ జీవీఎంసీ ఆదేశాలు జారీచేసింది. గత 14 నెలలుగా రోజువారీ వేతనం ఆధారంగా పనిచేస్తున్న సాధారణ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీకావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం వీరిని పనిలోకి తీసుకుంది. ఇప్పటికీ నగరంలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో వీరి సేవలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే, సీజన్ ముగిసినందున వీరి అవసరం లేదని పేర్కొంటూ తొలగిస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంహెచ్వో) ఆదేశాలు జారీచేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలోనూ..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 34 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇకపై విధులకు హాజరు కావద్దంటూ ఆయా విభాగాల అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బాధిత సిబ్బంది అధికారులను కలిసే ప్రయత్నం చేయగా వీసీ రజిని, రిజిస్ట్రార్ సుజాత అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏజీఎస్ మేనేజ్మెంట్ సర్వీస్ ఔట్ సోర్సింగ్ సంస్థ రెన్యూవల్కు దరఖాస్తు చేసుకున్నా వర్సిటీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోగా.. వారి సేవలకు ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారమిచ్చారు. ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఉన్న ఉపాధిని తీసేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో తమ పొట్టకొట్టవద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
ఆందోళనలతో దద్దరిల్లుతున్న ఏపీ..
-
Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం
సాక్షి, నెట్వర్క్: కూటమి సర్కారు తీరుపై రాష్ట్రం నలుచెరుగులా అసహనం కట్టలు తెంచుకుంది. గిరిజన గురుకులాల టీచర్లు సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట బైఠాయించారు.. విధుల్లోకి తీసుకోవాలంటూ వలంటీర్లు ధర్నాలు చేపట్టారు.. సమ్మె సైరన్ మోగించిన 108 ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు.. సమస్యలు పరిష్కరించాలంటూ పిడికిలి బిగించి ఆశా వర్కర్లు భారీ ధర్నాకు దిగారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆయాలు పెండింగ్ జీతాల కోసం పొలికేక పెట్టారు.. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఎక్కడికక్కడ రోడ్లెక్కితే.. ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు.. పారిశుధ్య కార్మీకులు.. వీవోఏలు.. మధ్యాహ్న భోజన కార్మీకులు.. పాఠశాల ఆయాలు.. సీహెచ్సీ వైద్యులు.. వెలుగు యానిమేటర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు.. నిరసనలు చేపట్టారు. మొత్తంగా వీరందరి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. 108 ఉద్యోగుల భారీ ధర్నా సకాలంలో జీతాలు చెల్లించడంతోపాటు 104, 108 వ్యవస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో 108 అంబులెన్స్ ఉద్యోగులు సోమవారం మహాధర్నా చేపట్టారు. ఏపీ 108 సేవల కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ గౌరవాధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 25 నుంచి సమ్మె చేపడతామని నోటీసిచ్చినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరిట ఈనెల 22న వైద్యశాఖ ఉన్నతాధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోనూ 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కలెక్టరేట్ల వద్ద వలంటీర్ల నిరసన ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లు సోమవారం గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లా రాయచోటి, పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్లు, రాజంపేట సబ్ కలెక్టరేట్ వద్ద, విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నాలు, ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఇందులో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తలకిందులుగా నిలబడి నిరసన తెలియజేశారు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు కలెక్టరేట్ల వద్ద సంఘ నేతలు మాట్లాడుతూ తమను ఉద్యోగాల్లోకి తీసుకొని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ అధ్యాపకుల ధర్నా రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లోని ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తమను మెగా డీఎస్సీ నుంచి మినహాయించాలని, ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో సోమవారం భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ కలెక్టరేట్ వద్ద ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్నా చేపట్టారు. దద్దరిల్లిన విశాఖ కలెక్టరేట్చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ చేసిన ధర్నాలతో విశాఖపట్నం కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మీకులు, సామాజిక కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వీవోఏలతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మీకులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేసి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ⇒ విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో 30 మంది హౌస్కీపింగ్ కార్మీకులను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ⇒ ఇసుక విధానం ఎంతోమంది జీవితాల్ని రోడ్డున పడేసిందంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కలెక్టరేట్ ఎదుట భారీఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందించారు. ఇసుక రీచుల్లో దళారులు దోచేస్తున్నారనీ.. టన్నుకు అదనంగా రూ. 300 వరకూ వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయాల ఆందోళనచిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలకు 5 నెలలుగా జీతాలు మంజూరు చేయలేదని సోమవారం ఆయాలు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఆయాలకు చీపురుకట్టలు, ఫినాయిల్, గ్లౌజు, సోపులు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పెండింగ్ జీతాలు ఇవ్వాలని పాఠశాలలో పని చేసే ఆయాలు ధర్నాకు దిగారు. పంటకు పరిహారం ఇవ్వాలని ధర్నావిజయనగరం జిల్లాలో కోత దశలో ఉన్న వరి పంటను కత్తెర, కొమ్ము పురుగు ఆశించి కంకులన్నీ రాలిపోతున్నాయని, పరిహారం అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు సోమవారం ధర్నా చేశారు. సమగ్ర కులగణన చేపట్టాలిసమగ్ర కులగణన చేపట్టాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కల్లూరి నాగరాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఇదే విషయంపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్కు వినతిపత్రం అందించారు. తక్షణం బ్లాస్టింగ్లు ఆపండి.. అపరిమిత బ్లాస్టింగ్లతో మార్టూరు బీటలు వారుతోందని, సర్వే నంబర్ 1 కొండపై ఖనిజాన్ని దోచేస్తూ ప్రజలను కాలుష్యంలోకి నెట్టేస్తున్న క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం మార్టూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి.. కిడ్నీ బాధితులుగా మారుతున్న ప్రజలను కాపాడాలంటూ కలెక్టరేట్లో ఫిర్యాదు ఇచ్చారు.చంద్రబాబు ఇంటి వద్ద ధర్నావిద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసేందుకు గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్ల ప్రయత్నానికి పోలీసులు సోమవారం అడ్డుతగిలారు. మెగా డీఎస్సీతో తమకు అన్యాయం జరుగుతోందని, కనీసం తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్(సీఆర్టీ)గా మార్చాలనే డిమాండ్పై 1,656 మంది ఔట్సోర్సింగ్ టీచర్లు ఈ నెల 16 నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్లు అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉండవల్లిలోని ప్రజాదర్బార్ వేదిక వద్ద లోకేశ్ను కలిసేందుకు ఔట్సోర్సింగ్ టీచర్లు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ను కలిసి వినతిపత్రం అందిస్తామని టీచర్లు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోలీసులు, టీచర్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో సీఎం ఇంటి వద్దే టీచర్లు బైఠాయించారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో గిరిజన గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి సదా భార్గవి వచ్చి వారితో చర్చలు జరిపారు. ప్రభుత్వం దృష్టికి మీ విషయాన్ని తీసుకెళ్తామని, విధుల్లో చేరాలని కోరారు. ఇప్పటికే ఒకసారి ఆందోళన చేశామని, తమ డిమాండ్ను పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఇంత వరకు పరిష్కరించలేదని టీచర్లు మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. దీంతో సదాభార్గవి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లోకేశ్ సమావేశంలో బిజీగా ఉన్నారంటూ లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ ఔట్సోర్సింగ్ టీచర్లతో మాట్లాడారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా పరిగణించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి మూడు రోజుల్లో ఏ విషయాన్ని చెబుతామని వరప్రసాద్ చెప్పడంతో ఔట్సోర్సింగ్ టీచర్లు ధర్నాను విరమించి వెనుదిరిగారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించే వరకు సమ్మె విరమించేది లేదని గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ తేల్చిచెప్పారు. 15 ఏళ్లకుపైగా గురుకులాల్లో కేవలం రూ.10,500 నుంచి రూ.18,000 చాలీచాలని జీతాలతో సేవలు అందిస్తున్న తమకు డీఎస్సీ కారణంగా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. పిడికిలి బిగించిన ఆశా వర్కర్లు.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ఆశాలు భారీ ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వం కార్మీకులుగా గుర్తించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ వయసును పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సహజ మరణానికి రూ. 2లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీహెచ్సీ వైద్యుల ధర్నా విజయవాడ ధర్నా చౌక్లో పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు ధర్నా చేశారు. పీజీ కోటా తగ్గింపుపై ఆందోళన చేపట్టారు. బుడమేరు వరదల వల్ల నష్టపోయిన తమకు పరిహారం అందించాలని కోరుతూ బాధితులు ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళన ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు విజయవాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పనులు లేక అల్లాడుతున్న 40లక్షల మంది కార్మీకులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏపీ వెలుగు యానిమేటర్ల ధర్నా విజయవాడలో కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. రాజకీయ కక్షలతో తొలగించిన వీఓఏలను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు రద్దు చేయాల్సిందే విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ శ్రీకాకుళం జిల్లా హిరమండలం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలతో బెంబెలేత్తిపోతున్న సామాన్యులపై విద్యుత్ చార్జీల పేరుతో మరింత భారం మోపడం సరికాదన్నారు. విజయవాడలోనూ విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారులపై భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం నల్ల గొండ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం వస్తే ఇక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అవుతారని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించడంలో విఫలం కావడం వల్ల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొ న్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ నాణ్యతలేక కూలిపోతున్నాయని, వాటి మీద విచారణ జరిపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంద ని కోమటిరెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలు అయినందునే విచారణ చేపట్టడంలేదని ఆరోపించారు. రూ.9 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, దానిలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
‘ఔట్ సోర్సింగ్’ను రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్/లింగోజిగూడ: రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తూ, రాష్ట్రంలోని 2.5 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్టకొట్టుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అరకొరగా వచ్చే జీతాలను సైతం మూడు, నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్నారని, కొన్ని సార్లు ఆరేడు నెలలైనా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అనేక మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. కర్మన్ఘాట్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లాల నుంచి వ చ్చిన ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పులి లక్ష్మయ్య, కె.సంతోష్, వినోద్, అరుణ్కుమార్, నారాయణ, బిందు తదితరులు మాట్లాడారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్దికరించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పే–స్కేలు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల సర్విసు పూర్తి కాని ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేసి ఆదుకోవాలని అన్నారు. అలాగే 2023 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలు అన్యాయం చేస్తున్నాయి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, మూడు, నాలుగు నెలలకోసారి ఒకటి, రెండు నెలల జీతాలు చెల్లిస్తున్నారని, మిగిలిన జీతాలను కాంట్రాక్టు ఏజెన్సీలు స్వాహా చేస్తున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. కొత్త ఏజెన్సీలు వచ్చి అప్పటికే ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయని, రూ.లక్షలు వసూలు చేసి కొత్త వారిని నియమించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వాళ్లు కొనసాగలంటే మళ్లీ కొత్త ఏజెన్సీలకు భారీ మొత్తంలో లంచాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. వీఆర్ఏల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు? వీఆర్ఏల క్రమబద్దికరణలో భాగంగా వారిని పెద్ద సంఖ్యలో తమ శాఖకు కేటాయించారని, దాంతో ఇకపై మీరు విధులకు రావాల్సిన అవసరం లేదని.. నాలుగైదు జిల్లాల్లో పశుసంవర్థక శాఖ ఆఫీస్ సబార్డినేట్లకు స్థానిక అధికారులు తేల్చి చెప్పారని ఈ సమావేశానికి హాజరైన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జీతాల్లేవ్... రెన్యువల్ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలు మాత్రం అందడం లేదు. అందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 3,650 మంది పనిచేస్తున్నారు. డాక్టరు స్థాయి మొదలు స్టాఫ్ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఎల్రక్టీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర కేడర్ల లో కాంట్రాక్టు ప్రాతిపదికన, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో విధు లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసును ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తారు. ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు సర్విసు కాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి రెన్యువల్ చేస్తేనే నిధులు విడుదల చేస్తారు. పెండింగ్.. పెండింగ్... ఈ ఏడాది ఏప్రిల్లో వైద్య విధాన పరిషత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్విసు రెన్యువల్ ప్రతిపాదనలను ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణంగా ఈ ప్రక్రియ వారం నుంచి పది రోజుల్లోగా పూర్తి కావాలి. కానీ ఏప్రిల్ నెలలో సమర్పించిన ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం రాలేదు. ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ఫైలు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,650 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్విసు రెన్యువల్ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏటా ఇదే తంతు... వైద్య విధాన పరిషత్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో ప్రతి సంవత్సరం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో వేతనాలు అందడంలో ఆలస్యం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం సర్విసు పునరుద్ధరణే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని ఉద్యోగులు మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాలు సమర్పించారు. -
ఔట్ సోర్సింగ్కు సర్దుబాటు షాక్!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎన్నో ఏళ్లుగా సొసైటీల పరిధిలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో)ల సర్దుబాటు రూపంలో ప్రమాదం వచ్చిపడింది. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ.. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొందరిని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో సర్దుబాటు చేయాల్సిందిగా ఆదేశించింది. శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్యను నిర్దేశిస్తూ వారికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించడంతో చర్యలకు దిగిన ఉన్నతాధికారులు ఖాళీలను బట్టి పోస్టింగులు ఇస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే నియమిస్తున్నారా? లేక తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేస్తున్నారా అనే అంశంపై స్పష్టత లేదు. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో 65 మందికి.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో 65 మంది వీఆర్వోలకు ఈ విధంగా పోస్టింగులిస్తూ సొసైటీ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోని వివిధ గురుకుల విద్యా సంస్థల్లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితర పొస్టుల్లో వారిని సర్దుబాటు చేశారు. ఇలా సర్దుబాటు చేసిన పోస్టుల్లో చాలావరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులుండడం గమనార్హం. కాగా మిగతా సొసైటీల్లోనూ ఈ విధంగా అతి త్వరలో వీఆర్వోలకు పోస్టింగులిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆందోళనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గురుకుల విద్యా సంస్థల్లో వీఆర్వోల సర్దుబాటుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు దాదాపు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో నియమితులైన 65 మంది వీఆర్వోలు శాశ్వత ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాల్సి రావచ్చు. తాజాగా సర్దుబాటైన వీఆర్వోలు తక్షణమే జిల్లా అధికారికి రిపోర్టు చేయాలని ఉత్పర్వుల్లో స్పష్టం చేయడంతో మెజార్టీ ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో చేరారు. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. పది నుంచి పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తమను ఒక్కసారిగా విధుల్లోంచి తీసేస్తే భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వయోభారం కారణంగా కొత్తగా తమకు ఉద్యోగావకాశాలు లభించే పరిస్థితి ఉండదని, అందువల్ల ఒకవేళ తమను ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి వస్తే ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని వారు కోరుతున్నారు. అయితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా మిగతా సొసైటీల్లో సైతం ఇదే తరహాలో వీఆర్వోల నియామకాలు చేపట్టే అవకాశం ఉండటంతో, ఆయా సొసైటీల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం.. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా సొసైటీనే నమ్ముకుని ఉన్న వారిని తొలగిస్తే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. మానవీయ కోణంలో ఆలోచించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా.. వీఆర్వోలను సర్దుబాటు చేయాలి. ఈ అంశాన్ని ఇప్పటికే సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. – సీహెచ్ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం -
ఔట్ సోర్సింగ్లకూ 30% వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీపై ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చేపట్టిన నియామకాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకే వెయి టేజీ కల్పించగా తాజా భర్తీల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ వర్తింపజేయాలని నిర్ణయించింది. డాక్టర్ పోస్టులకు రాత పరీక్ష ఉండకపోవడంతో వారికి వైద్యవిద్యలో వచ్చిన మార్కులకు 70 శాతం, మిగిలిన 30 శాతాన్ని వెయిటేజీగా ఇవ్వనుంది. నర్సులు, ఇతర పారామెడి కల్ సిబ్బంది రాత పరీక్షకు 70 శాతం, వెయిటేజీ 30 శాతం ఇవ్వాలని నిర్ణయిం చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తగా చేరబో యే వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసు రద్దుపైనా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలు స్తోంది. వీటిని ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ ఇటీవలే పంపింది. అనుమతి రాగా నే ఆ మార్గదర్శకాలపై ఉత్తర్వులు వెలువడతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సర్వీస్ నిబంధనల్లో భారీ మార్పులు: కొత్త పోస్టుల భర్తీ నేపథ్యంలో సర్వీస్ నిబంధనల్లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయిం చింది. గతంలో స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ పోస్టుల సమయంలో తలెత్తిన న్యాయపరమైన చిక్కులు ఈసారి తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని భావిస్తోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం తయారైన సర్వీస్ నిబంధనలు నాటి పరిస్థితుల ప్రకారం ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ కోర్సులు, పోస్టుల్లో మార్పులు జరిగాయి. కొత్త కోర్సులు వచ్చాయి. పాత నిబంధనల ప్రకారం కొత్త కోర్సులు చేసినవారు అనర్హులయ్యే పరిస్థితులున్నాయి. దీంతో తాజా పరిస్థితుల ప్రకారం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, ఎవరూ కోర్టులకు వెళ్లే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై కసరత్తు జరుగుతోం దని, సర్కారు ఆదేశాల తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని వైద్య వర్గాలు తెలిపా యి. మరో రెండు వారాల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. -
పర్యాటక రంగానికి ‘స్టార్’ హంగులు
సాక్షి, అమరావతి: విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి జిల్లాలో ఐదు నుంచి ఏడు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మూడుచోట్ల స్టార్ హోటళ్ల నిర్మాణాలకు పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలి పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 50 శాతం హోటళ్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. థాయిలాండ్, మలేషియా, స్విట్జర్లాండ్ వంటి 40 శాతం దేశాలు కేవలం పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. వీటి తరహాలోనే రాష్ట్ర ఆదాయ వనరుగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చి.. ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా ప్రచారం కల్పిస్తామని, ఇందుకోసం దసరాలోగా ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడిం చారు. ఈ సమీక్షలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. పర్యాటకంపై ప్రత్యేక కార్యక్రమాలు ► పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం అందరికీ తెలిసేలా నెలకు ఒక జిల్లాలో ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. లోకల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ పర్యాటక సర్క్యూట్లలో ఒక్కో మేనేజర్ను నియమించి.. ప్రత్యేక బస్సు నడుపుతూ ఒకటి, రెండు రోజుల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తాం. ► కోవిడ్కు ముందు రూ.120 కోట్లు పర్యాటక ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అది రూ.60 కోట్లకు పడిపోయింది. అది కూడా కోవిడ్ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో భోజన సదుపాయం కల్పించడం వల్ల సమకూరింది. ► పర్యాటకశాఖలో కోవిడ్తో మృతిచెందిన 8 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ఒకే చోట ఐదేళ్లకు మించి పని చేస్తున్న వారికి స్థాన చలనం తప్పదు. త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తాం. సీ ప్లెయిన్లను నడిపేందుకు చర్చలు ► బోట్ల నిర్వహణ సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన తొమ్మిది కమాండ్ కంట్రోల్ సెంటర్ల మార్గదర్శకాలకు అనుగుణంగా 24 ప్రభుత్వ, 164 ప్రైవేటు బోటు సేవలు ప్రారంభిస్తాం. విశాఖపట్నం, విజయవాడ, నాగార్జునసాగర్, సూ ర్యలంక తదితర ప్రాంతాల్లో సీ ప్లెయిన్లను నడిపేందుకు ఆయా సంస్థలతో చర్చిస్తున్నాం. ► కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ప్రసాద్’ (పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద టెంపుల్ టూరిజంలో భాగంగా రూ.50 కోట్లతో శ్రీశైలం ఆలయ అభివృద్ధి చేపట్టాం. మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం. నూతన క్రీడా పాలసీకి సన్నాహాలు గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు నూతన క్రీడా పాలసీని తీసుకొస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ముసాయిదా సిద్ధమైందని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆమోద ముద్ర వేయిస్తామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, క్రీడాకారులను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మిస్తామన్నారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో క్రీడా ప్రాంగణాన్ని ఖేలో ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమీక్షలో ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సీఈఓ ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘పొరుగు’ను పట్టించుకోండి సారూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కార్మిక చట్టాల ప్రకారం అందాల్సిన లబ్ధికి వారు నోచుకోవడం లేదు. కొందరికైతే ప్రతి నెలా ఐదో తేదీలోపు అందాల్సిన జీతం డబ్బులు నెలలు గడుస్తున్నా అందడంలేదు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం, వీటిని అదుపు చేయడంలో యంత్రాంగం విఫలమవుతుండటంతో చివరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిర్దేశించిన పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి చేసే అన్ని రకాల పనులను వీరు నిర్వహిస్తారు. పేరుకు బాగానే ఉన్నా.. వేతనాలు, ఇతర సౌకర్యాల విషయంలో అధమమే. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వీరంతా నియమితులు కావడం.. వేతన చెల్లింపులు నేరుగా ఉద్యోగి ఖాతాకు కాకుండా ఏజెన్సీకి ప్రభుత్వం విడుదల చేయడంతో ప్రభుత్వానికి, ఉద్యోగికి మధ్య అంతరం ఎక్కువగా ఉంటోంది. సమస్యలు వస్తే వాటి పరిష్కారంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవడం కూడా ఒక కారణమే.. ఏజెన్సీలతో ఇబ్బందులే.. తాత్కాలిక ఉద్యోగ నియామకాల విషయంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉద్యోగంలో చేరే సమయంలో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు సైతం వస్తుండగా.. నెలవారీగా ఇచ్చే వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేయడం, వేతనాల్లో కోతలు విధించడం, ఉద్యోగులకు చేకూరాల్సిన ప్రధాన లబ్ధి ఈఎస్ఐ, పీఎఫ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం ఉండటంలేదు. మరోవైపు ఏజెన్సీలపై జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఫిర్యాదులిచ్చినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదివరకు ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులను టామ్కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ) ద్వారా చేపట్టామని, కానీ కాంట్రాక్టు ఉద్యోగుల నిర్వహణ ఇబ్బందులతో ఆ ప్రక్రియను ప్రభుత్వం జిల్లాలకు అప్పగించింది. అయితే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై కార్మిక, ఉపాధి కల్పన శాఖకు అజమాయిషీ లేదని ఆ శాఖ సంచాలకుడు కేవై నాయక్ చెబుతున్నారు. యాదాద్రిలో టీమ్.. కరీంనగర్లో వారధి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిర్వహణ ప్రక్రియ యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో భిన్నంగా ఉంది. ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేకంగా టీమ్ (తెలంగాణ ఎంప్లాయీస్ అసిస్టెన్స్ మిషన్) పనిచేస్తుండగా.. కరీంనగర్ జిల్లాలో వారధి అనే సొసైటీ ఉంది. వీటికి ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఉంటారు. ఆయా జిల్లాల పరిధిలో ఏ శాఖకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు అవసరమైనా.. ఈ సంస్థలు ఎంపిక చేస్తాయి. ఈ ఉద్యోగాల్లో కూడా మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేస్తున్నామని టీమ్ సంస్థ సభ్య కార్యదర్శి శ్రీనివాసుల వెంకట రంగయ్య చెబుతున్నారు. అలాగే వేతన చెల్లింపులు, పీఎఫ్, ఈఎస్ఐ ప్రక్రియంతా నిర్దేశించిన గడువు నాటికి కచ్చితంగా చెల్లించడమే తమ బాధ్యత అని వారధి సభ్య కార్యదర్శి గాదె ఆంజనేయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పద్ధతే పాటిస్తే బాగుంటుందని పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్గా ఉంటూ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఇప్పటికే ఉన్నా.. చాలాచోట్ల ఆ కమిటీలు యాక్టివ్గా లేవని సమాచారం. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ సర్వీసుల విషయంలో మరింత ముందుంది. నియామకాల్లో మధ్యవర్తిత్వం లేకుండా పూర్తి పారదర్శకత, వేతన చెల్లింపుల్లో కచ్చితత్వం, ఉద్యోగులకు కలగాల్సిన లబ్ధిని పక్కాగా అందించాలనే లక్ష్యంతో ఆప్కోస్ (ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీసెస్) పేరిట ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఈ కార్పొరేషన్ ద్వారా నియమిస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. -
వచ్చే నెల 1నే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. వచ్చే నెల 1నే వారికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెలా ఒకటినే వారికి జీతాలు ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డేటా సక్రమంగా ఉందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అధికారులను శనివారం ప్రభుత్వం ఆదేశించింది. ► ఇచ్చిన మాట మేరకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 3న ప్రత్యేకంగా ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ► ఈ నెల 3 నాటికి 50 వేలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చారు. ► కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులకు వచ్చే నెల 1 నుంచి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా వేతనాలను చెల్లించనున్నారు. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి కార్పొరేషన్ సమర్పించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డేటాను పే అండ్ అకౌంట్ ఆఫీసర్లు పరిశీలించాల్సిందిగా ట్రెజరీ, అకౌంట్స్ డైరెక్టర్ ఆదేశించారు. ► జిల్లా కార్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్స్కు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డేటాను జిల్లా ట్రెజరీ అధికారులు పరిశీలించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ► ఆయా పోస్టులకు విద్యార్హతలతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు. ఆర్థిక శాఖ అనుమతితోనే ఉద్యోగులను తీసుకున్నారా, లేదా, మంజూరైన పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారా, లేదా చూడాలని సూచించారు. ► డేటాను పూర్తిగా పరిశీలించి జిల్లా ట్రెజరీల డిప్యూటీ డైరెక్టర్లు నివేదికను వచ్చే నెల 9లోగా ఆన్లైన్లో పంపించాలన్నారు. ఇక నియామకాలు కార్పొరేషన్ ద్వారానే.. ► ఇక ప్రభుత్వ రంగంలో ఏ శాఖ లేదా సంస్థకైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరమైతే ఈ కార్పొరేషన్ ద్వారానే తీసుకోనున్నారు. దీని వల్ల ఏజెన్సీలు, దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ► గతంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కావాలంటే అభ్యర్థులు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అలాగే జీతాలకు ఆ ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు ఇచ్చేది. ఏజెన్సీలు ఉద్యోగులకు జీతం పూర్తిగా ఇవ్వకుండా మిగుల్చుకునేవి. ► ఇప్పుడు ఉద్యోగాలకు, జీతాలకు పైసా లంచం లేకుండా పూర్తి పారదర్శకంగా కార్పొరేషన్ నిర్వహించనుంది. ► వివక్షకు తావులేకుండా 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వడంతోపాటు, వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇవ్వనున్నారు. ► అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్ఐ, ఈపీఎఫ్ను కార్పొరేషన్ సక్రమంగా నిర్వహించనుంది. -
‘భగీరథ’ గుట్టపై కలకలం
గజ్వేల్: మిషన్ భగీరథ పథకానికి కేంద్ర బిందువుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ప్రాంతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని కోమటిబండ మిషన్ భగీరథ గుట్టపై సోమవారం కలకలం రేగింది. తమను విధుల నుంచి తొలగించారని ఆగ్రహంతో ఉన్న భగీరథ పథకం ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లేలా తమ నిరసనకు వ్యూహాత్మకంగా గజ్వేల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మందికిపైగా ఉద్యోగులు వివిధ దారుల్లో తరలివచ్చి ఒక్కసారిగా మిషన్ భగీరథ హెడ్వర్క్స్కు చేరుకొని మెరుపు ఆందోళనకు దిగారు. ఓవర్హెడ్ ట్యాంకులపైకి ఎక్కి తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. సుమారు ఏడు గంటలకుపైగా ఈ ఆందోళన కొనసాగడంతో పోలీసు, రెవెన్యూ, మిషన్ భగీరథ అధికారులు ఉరుకులు, పరుగులు పెటాల్సి వచ్చింది. రాత్రి 7 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఆ తర్వాత పోలీసులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నచ్చజెప్పి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తామని, ఆందోళన చేపట్టినందుకు కేసులు ఉండవని హామీ ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా ట్యాంకుల పైనుంచి కిందకు దిగారు. ఆ తర్వాత వారందరినీ బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో.. మిషన్ భగీరథ పథకంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేయడానికి 2015లో రాష్ట్రవ్యాప్తంగా 709 మందిని ఎంపిక చేశారు. ఇందులో 662 మంది వర్క్ ఇన్స్పెక్టర్లుగా, 47 మంది జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వీరి పోస్టులను ఏడాదికోసారి రెన్యువల్ చేస్తుంటారు. ఈసారి మార్చి 31న వీరిని రెన్యువల్ చేయాల్సి ఉండగా అది జరగలేదు. జూన్ 30 వరకు అలాగే విధుల్లో కొనసాగించారు. ఆ తర్వాత జూలై 1 నుంచి విధుల్లోకి రావొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ పరిణామంతో ఆందోళనకు గురైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ రూపాల్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. తమను యథాతథంగా విధుల్లో కొనసాగించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే కనీసం ఈ ఏడాదైనా కొనసాగించి వచ్చే ఏడాది తొలగించాలని చెబుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వీరికి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ సమస్యను తెలపాలన్న భావనతో వ్యూహాత్మకంగా గజ్వేల్ను ఆందోళనకోసం ఎంచుకున్నారు. -
నిమ్స్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రిలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న అకౌంటెంట్లు, క్లర్కులు శుక్రవారం కోఠి పబ్లిక్ హెల్త్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కోవిడ్ కాలంలో తీవ్ర పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. తమ జీతాలు పెంచకపోతే వచ్చే నెల నుంచి సమ్మెకు వెళతామని హెచ్చరించారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలోనూ తమకు సరిగా జీతాలు చెల్లించడం లేదని అక్కడి పారామెడికల్, టెక్నికల్ సిబ్బంది ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అటు గాంధీ ఆస్పత్రిలోనూ ఔట్ సోర్సింగ్ నర్సులు ఆందోళనకు దిగగా ప్రభుత్వం వారు కోరిన పలు డిమాండ్లు నెరవేర్చేందుకు అంగీకరించడంతో సమ్మె ఆలోచన విరమించి తిరిగి విధుల్లోకి చేరారు. (ఔట్ సోర్సింగ్ నర్సులకు రూ.25 వేల వేతనం) (కరోనా కోరల్లో నిమ్స్!) -
ఔట్ సోర్సింగ్ నర్సులకు రూ.25 వేల వేతనం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడ్డ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ నర్సుల వేతనాలను రూ.25 వేలకు పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అదేవిధంగా పనిచేసిన రోజున రూ.500 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. వేతనాల పెంపను కోరుతూ గాంధీ ఆస్పత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన సరికాదని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రమేశ్రెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూనే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో స్పందించిన ప్రభుత్వం వేతన పెంపుతో పాటు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కోవిడ్–19 ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా పనిచేసిన రోజున రూ.300 ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం వెలువడే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ బాధితులకు ఇబ్బంది కలగకూడదని సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. వెంటనే విధుల్లో చేరనున్నట్లు తెలిపింది. -
గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. నర్సులకు 17,500 నుంచి 25 వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కరోనా డ్యూటీ చేస్తున్న వారికి డైలీ ఇన్సెంటివ్ల కింద రూ.750 ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. నాల్గవ తరగతి ఉద్యోగులకు రోజుకు 300 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు ఇకపై వారికి 15 రోజులు మాత్రమే డ్యూటీ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సులు ప్రకటించారు. (గాంధీలో నిరవధిక సమ్మె) చదవండి: ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం -
గాంధీలో కొనసాగుతున్న సమ్మె..
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. సెక్యూరిటీ, శానిటైజేషన్, ఫోర్త్ క్లాస్ పేషేంట్ కేర్ సిబ్బంది విధులు బహిష్కరించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా నిరవధిక సమ్మెలో 600 మంది నర్సులు పాల్గొన్నారు. దీంతో కరోనా పేషెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విధులకు హాజరు కావాలని, సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం కోరినా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరమని చెబుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి గాంధీలో నిరవధిక సమ్మె
గాంధీ ఆస్పత్రి: కోవిడ్–19 నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి నిరసన సెగ తగిలింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ప్రభుత్వం, వైద్య ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, ఏఐటీయూసీ ప్రతినిధులతోపాటు గాంధీ సిబ్బంది జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల రెగ్యులరైజ్ ప్రధాన డిమాండ్తో పాటు సమాన పనికి సమాన వేతనం నినాదంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. ఇదిలాఉండగా మంగళవారం ఉదయం నుంచి ఆందోళనకారులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 212 మంది నర్సింగ్ సిబ్బంది గత 5 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మమ్మల్ని పట్టించుకోవట్లేదు..: ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్తో పాటు రూ.34 వేల వేతనం, ఇన్సెంటివ్స్, బీమా సౌకర్యం కల్పించాలని గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కాంట్రాక్టు నర్సింగ్ యూనియన్ ప్రతినిధులు సుజాతరెడ్డి, మేఘమాల, ఇందిర, సరళ, మధులతలు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ‘నాల్గవ తరగతి ఉద్యోగులను, 300 ఓసీఎస్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి. పారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్ల వేతనాలు రూ.20 వేలకు పెంచాలి’అని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఐఎన్టీయూసీ గాంధీ యూనిట్ అధ్యక్షుడు శివకుమార్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, నిరవధిక సమ్మె విషయం తన దృష్టికి రాలేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. బెడ్లపైనే మృతదేహాలు.. డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులు, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, పేషెంట్ కేర్ టేకర్లు మంగళవారం మూకుమ్మడిగా విధులు బహిష్కరించడంతో చికిత్స పొందుతున్న సుమారు 900 మంది కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వార్డుల్లో పారిశుధ్య లోపంతో తీవ్ర దుర్వాసనల మధ్య వైద్యులు విధులు నిర్వహించారు. చికిత్స పొందుతూ మరణించిన రోగుల మృతదేహాలను మార్చురీకి తరలించేందుకు అవకాశం లేకపోవడంతో గంటల తరబడి బెడ్లపైనే పడున్నాయి. -
ఉద్యోగ భద్రత.. సర్కారు బాధ్యత
మహారాణిపేట(విశాఖ దక్షిణ): అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు దశాబ్దాలుగా ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నారని, వారి భద్రతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ను ఏర్పాటు చేశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కార్పొరేషన్ ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆయన మాట్లాడారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు దళారీ వ్యవస్ధ కారణంగా ఎంతో మంది మోసపోయారని, అటువంటి అన్యాయాలు, అక్రమాలు భవిష్యత్తులో జరగకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేశారన్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 వేల మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారని, జిల్లా వ్యాప్తంగా 3617 మందికి మేలు కలుగుతుందని చెప్పారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించారు. రిజర్వేషన్లు, మెరిట్, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అన్ని బెనిఫిట్స్తో అవకాశం కల్పిస్తామన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా యువత హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. ఉద్యోగులు మరింత నిబద్ధతతో పని చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వినయ్చంద్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీ న జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. స్పందన కార్యక్రమానికి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే స్కిల్డ్, సెమి స్కిల్డ్, ఆన్స్కిల్డ్ అభ్యర్థులను ఎప్పటికప్పుడు కార్పొరేషన్కు రిఫర్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సదుపాయాలు సక్రమంగా అమలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు యు.వి.రమణమూర్తిరాజు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్రాజ్, పెట్ల ఉమాశంకర్గణేష్, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సిహెచ్.సుబ్బిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఇక కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ అవుట్ సోర్సింగ్ సరీ్వసెస్ కార్పొ రేషన్ ద్వారా ఇక నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ప్రభుత్వ శాఖ లకు అవసరమైన ఖాళీలను రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తాం. ఏపీసీవోఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోస్టుల భర్తీ కమిటీకి కలెక్టర్ ఎక్స్ అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గాను, మెంబర్ కనీ్వనర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ ఉంటారు. – సిహెచ్.సుబ్బిరెడ్డి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.. నాలుగేళ్లుగా లీగల్ మెట్రాలజీ శాఖలో పని చేస్తున్నా. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క సారి జీతాలు సక్రమంగా అందేవి కావు. గట్టిగా అడిగితే ఉద్యోగం పోతుందేమోనని భయం ఉండేది. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటైంది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతం వస్తుందన్న నమ్మకం కలిగింది. ముఖ్యమంత్రి నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ జగన్కు రుణపడి ఉంటాం. – ఎస్.శివశంకర్, డ్రైవర్ జీతాలు పెరుగుతాయి.. జీతాలు పెంచాలని ఎన్నో సార్లు గతంలో వినతి పత్రాలు అందించాం. నాకు నెలకు రూ.13,500 జీతం వస్తోంది. నా కుటుంబ పోషణకు సరిపోడం లేదు. పని ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లింపులు చేయడం చాలా మంచిది. దీని వల్ల జీతాలు పెరుగుతాయన్న నమ్మకం కలుగుతోంది. సీఎం వైఎస్ జగన్ను అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. – బి.శ్రీనివాసరావు, రుషికొండ టూరిజం ఉద్యోగి -
చర్చలు విఫలం..
గాంధీఆస్పత్రి: గాంధీఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్నర్సులు బుధవారం వైద్యాధికారులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెకొనసాగుతుందని, గురువారం వైద్య మంత్రి ఈటల రాజేందర్ను కలిసిపరిస్థితిని వివరిస్తామని అవుట్ సోర్సింగ్ స్టాఫ్నర్సుల యూనియన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా పదమూడేళ్లుగా గాంధీ ఆస్పత్రిలో 212 మందిస్టాఫ్నర్సులు అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కోవిడ్ నోడల్ కేంద్రంగా ప్రకటించడంతోవారంతా ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోరెగ్యులరైజ్ చేయాలని లేకుంటే ప్రభుత్వం తరపున కాంట్రాక్టు పద్ధతిలోనైనా తమను తీసుకోవాలని కోరుతూ బుధవారం బహిష్కరించారు. ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు మేఘమాల, లక్ష్మీ, ఇందిర, ప్రమీలలు డీఎంఈ రమేష్రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్తో మాట్లాడారు. ఇటువంటి తరుణంలో విధులు బహిష్కరించడం తగదని, రెగ్యులరైజ్, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తమ చేతుల్లోలేదని, ప్రభుత్వం నిర్ణయిస్తుందని అధికారులు స్పష్టం చేయడంతో యూనియన్ ప్రతినిధులు బయటకు వచ్చి చర్చలు విఫలం అయినట్లు ప్రకటించారు. విధులకు హాజరుకాకుంటే టెర్మినేట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు షిఫ్ట్ల్లో 150 మంది రెగ్యులర్ నర్సింగ్ సిబ్బంది గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 200మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించడంతో రెగ్యులర్ సిబ్బంది 150 మంది మూడు షిఫ్ట్ల్లో పనిచేస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. బుధవారం 18 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్నర్సులు విధులకు హాజరయ్యారని, మిగిలిన వారంతా బహిష్కరించారని వివరించారు. కోవిడ్ బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామన్నారు. -
గాంధీ ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది సమ్మె
సాక్షి, సికింద్రాబాద్: కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో బుధవారం నుంచి విధులను బహిష్కరించనున్నట్లు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు మంగళవారం సమ్మె నోటీస్ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రెగ్యులరైజ్ చేయాలని లేదా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 13 ఏళ్లుగా 200 స్టాఫ్నర్సులు అవుట్ సోర్సింగ్ పద్ధతిని విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినెల వేతనాలు కూడా సక్రమంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రాణాలకు తెగించి కోవిడ్ విధులు నిర్వహిస్తున్న తమ సేవలను ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు గుర్తించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రూ.17,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు రూ.7,500 ఇన్సెంటివ్ ప్రకటించిన ప్రభుత్వం తమకు కంటితుడుపు చర్యగా కేవలం 10 శాతం ఇన్సెంటివ్ ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ స్టాఫ్నర్సులకు రూ.23,000 ఇవ్వాల్సి ఉన్నా నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న కొందరికి మాత్రమే అది వర్తింపజేస్తున్నారని చెప్పారు. తక్షణమే తమను రెగ్యులరైజ్ చేయాలని లేదా కాంట్రాక్టు పద్దతిలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీ ఆస్పత్రి ఇన్వార్డులో సమ్మె నోటీస్ అందించినట్లు అవుట్ సోర్సింగ్ స్టాఫ్నర్సుల యూనియన్ ప్రతిని ధులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్లో 200, రెగ్యులర్ స్టాఫ్నర్సులు 150 మంది విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది విధులు బహిష్కరిస్తే కోవి డ్ విధులకు తీవ్ర ఆటంకం కలగవచ్చని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇది చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం -
కరోనా దెబ్బతో ఊడిన ఉద్యోగాలు
సాక్షి, కరీంనగర్: అవును.. వారు రోడ్డునపడ్డారు. కరోనా ప్రభావం.. నిధుల లేమి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారింది. ఈ మేరకు ఉద్యాన శాఖలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే నుంచి విధుల్లోకి రావొద్దని స్పష్టం చేయగా, 15 ఏళ్లుగా సేవలందిస్తున్న సదరు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వయసు పైబడటం.. ఇతర మార్గాలు లేకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఉద్యానశాఖలో అమలయ్యే పథకాలకు సర్కారు ఇచ్చే వార్షిక బడ్జెట్లో 5 శాతం నిధులను ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం.. ఏడాదిగా కొత్త పథకాలు లేకపోవడంతో వీరి సేవలు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. పైగా లాక్డౌన్ తోడవడంతో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మే 1 నుంచి విధులకు హాజరు కానక్కర్లేదని సదరు ఔట్సోరి్సంగ్ ఏజెన్సీకి జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యాన విస్తరణాధికారులు, అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్ ఉద్యోగాలు పోయినట్లే. దశాబ్దానికిపైగా సేవలు.. ఉద్యాన పంటల సాగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తొలి 5 స్థానాల్లో ఉంది. సాధారణ పంటలకు సమీపంగా ఈ పంటలను పండిస్తున్నారు. ఏటా దాదాపు 75 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలతోటలను సుమారు 53 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఎక్కువ మొత్తంలో మామిడి దిగుబడి ఉమ్మడి జిల్లాలోనే ఉంది. ఇతర జిల్లాల ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతటి కీలకమైన విభాగంలో ఉద్యోగులను తొలగించడంతో ఉద్యాన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలో కరీంనగర్ జిల్లాలో జిల్లా అధికారి, ముగ్గురు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఉద్యాన అధికారులు ఒక్కొక్కరూ ఆరేడు మండలాల వ్యవహారాలను చూస్తున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట ఉద్యాన విస్తరణా«ధికారులను ఔట్సోరి్సంగ్ విధానంలో విధుల్లోకి తీసుకున్నారు. వీరు ప్రస్తుతం ఒక్కొక్కరు మూడు, నాలుగు మండలాల పరిధిలో సేవలందిస్తున్నారు. ఉన్నపళంగా వీరిని తొలగించడంతో రైతులకు ఇబ్బందే. ఆరు నెలలుగా అందని వేతనాలు.. ఉద్యాన శాఖకు కేటాయించే నిధులతోనే ఔట్సోరి్సంగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంటారు. బిందు, తుంపర సేద్యం, పందిరి తోటలు, షెడ్నెట్ ఇతరత్ర పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం.. లబి్ధదారులకు సకాలంలో సేవలందేలా చూడటంలో వీరి బాధ్యత గత నవంబర్ నుంచి వీరికి వేతనాలు రాకపోగా ఉద్యోగాల నుంచి తొలగింపు ఉత్తర్వు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో నీటిని పొదుపుగా వాడుకునేలా.. ఉద్యాన పంటలను ప్రొత్సహించేలా చర్యలుంటాయన్న సమాచారంతో తమ ఉద్యోగాలకు భరోసా ఉంటుందని వేతనాల్లేకున్నా విధులు నిర్వహిస్తున్నామని ఔట్సోరి్సంగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని, మే నుంచి విధులకు రావొద్దని ఔట్సోరి్సంగ్ ఉద్యోగులకు చెప్పామని ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. -
అంతా మా ఇష్టం
‘కరీంనగర్ నగరపాలక సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్గా చేరిన ఓ ఒప్పంద ఉద్యోగి తరువాత కమిషనర్ సీసీగా వెళ్లాడు. ఇటీవల కార్యాలయంలో విధులను పక్కకుపెట్టి లైక్ వీడియోలు చేయడం వైరల్గా మారింది. దీంతో తనను బదిలీ చేస్తారని ముందుగానే గమనించిన సదరు ఉద్యోగి ‘కమిషనర్ పేషీ సీసీ’ అని ఓ కొత్త పోస్టును సృష్టించుకుని కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. కాగా వీడియోల వ్యవహారంపై ఇంతవరకు శాఖాపరమైన చర్యలు కానరాలేదు. సాధారణంగా మున్సిపల్ కమిషనర్లకు ఒక్కరే సీసీ పనిచేస్తారు. కరీంనగర్ నగరపాలకలో మాత్రం ఇద్దరు సీసీలు ‘ఇష్టా’రాజ్యం ఏలుతున్నారు.’ సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, ప్రజాసమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు ఔట్సోరి్సంగ్ పద్ధతిన సిబ్బ ందిని నియమిస్తారు. కొన్నేళ్లపాటు కాలపరిమితిని ఏర్పరుచుకుని విధులు అప్పగిస్తారు. కాలపరిమితి పూర్తవ్వగానే తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థంలో ఔట్సోరి్సంగ్ సిబ్బంది రాజ్యమేలుతున్నారు. వీరిని కార్యాలయ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ‘అంతా మాఇష్టం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇష్టారీతిన కొలువులు కేటాయించుకుంటున్నారు. అక్కడ ఇబ్బంది ఏర్పడితే తమకు నచ్చిన పోస్టింగ్లను వారే సృష్టించుకుని విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఒకశాఖలో ఉద్యోగులు పరిమితికి మించి ఉన్నా.. వారికి పదోన్నతి కల్పించాలన్నా.. బదిలీ చేయాలన్నా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత ఉన్నతాధికారులు ఆయా సిబ్బందికి శాఖలు కేటాయించి విధులు అప్పగించాల్సి ఉంటుంది. అయితే కరీంనగర్ నగరపాలక సంస్థలో ఈ నిబంధనలు ఏమీ అమలు కావడం లేదు. అంతా ఔట్సోరి్సంగ్ రాజ్యమే నడుస్తోంది. ఫలితంగా సదరు ఉద్యోగుల కాలపరిమితి ముగుస్తుందని ముందుగానే గ్రహించి, అదే కార్యాలయంలో మరో పోస్టును సృష్టించుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందిస్తున్నారా అంటే అదీ శూన్యమే. ఆడింది ఆట.. పాడింది పాట కరీంనగర్ కార్పొరేషన్లో ఎక్కువగా ఔట్సోరి్సంగ్ ఉద్యోగులే. వీరిలో కొందరు మాత్రమే నిబద్ధతతో పనిచేస్తే.. చాలా మంది ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు కేటాయించిన విధులు నిర్వహించకుండా ‘టైంపాస్’ ఉద్యోగం చేస్తున్నారనే ప్రచారం ఉంది. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో కనీస మర్యాద పాటించకుండా దురుసుగా వ్యవహరిస్తున్నానేది బహిరంగ రహస్యం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపై అజమాయిషి చెలాయిస్తూ.. కిందిస్థాయి సిబ్బందికి వీరే విధులు కేటాయించడం విశేషం. కార్పొరేషన్లో 249మంది ఉద్యోగులు.. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం పోస్టులు 497. 249మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 248పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔట్సోరి్సంగ్ ద్వారా శానిటేషన్లో 857 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 260మంది, టౌన్ ప్లానింగ్లో 30 మంది, మెప్మాలో ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఏళ్లకాలంగా ఒకే విభాగంలో పాతుకుపోయారు. దీంతో బదిలీపై వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను వీరు కంట్రోల్ చేస్తున్నానే ప్రచారం సాగుతోంది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు అంతర్గత బదిలీలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సీసీల బదిలీలు మాకు తెలియకుండా జరగవు. కార్పొరేషన్ ఇతర విభాగాలపై విచారణ చేస్తాం. సిబ్బందిని అవసరమైన చోట వినియోగిస్తాం. కొన్ని విభాగాల్లో అధికంగా సిబ్బంది ఉన్న విషయంపై విచారణ చేస్తాం. – వల్లూరి క్రాంతి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సొంతంగా ఏర్పరుచుకున్న పోస్టులు కొన్ని.. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ సీసీగా ఉన్న వ్యక్తి మొదట కంప్యూటర్ ఆపరేటర్గా ఔట్సోరి్సంగ్ విధానంలో ఉద్యోగంలో చేరాడు. ఆ పోస్టుకు కాలపరిమితి ముగుస్తుందని తెలిసి సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ అనేపోçస్టును సృష్టించుకుని చేరిపోయాడు. అయితే రాష్ట్రంలో ఎక్కడాకూడా సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు లేవు. అదీ ముగుస్తుందని తెలిసి ప్రస్తుతం కమిషనర్ సీసీగా చేరాడు. శానిటేషన్ విభాగంలో కీలకమైన ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ పోస్టుకు డిప్యూటీ ఈఈ క్యాడర్ కేటాయించారు. తాత్కాలిక ఒప్పంద పద్ధతిలో ఓ ఉద్యోగిని తీసుకుని ఎన్విరాల్మెంట్ ఇంజినీర్గా పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఆ స్థానానికి రెగ్యులర్ ఉద్యోగిని కేటాయించారు. అదే పోస్టులో తాత్కాలిక ఉద్యోగి సైతం కొనసాగుతుండం విశేషం. డిప్యూటీ ఈఈ నామమాత్రంగా మారి టెండర్లు పిలవడానికి పరిమితమయ్యాడని ప్రచారం జరుగుతోంది. శానిటేషన్ విభాగంలో కీలకమైన పోస్టుకు అధికారి ఉండగా.. ఒప్పంద ఉద్యోగిని కొనసాగించడం మన కార్పొరేషన్కే చెల్లింది. కార్పొరేషన్ విద్యుత్ విభాగంలో వీధిలైట్లను ఓ ప్రైవేట్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. వీధిదీపాల మేయింటనెన్స్కు ఏఈ, డీఈతో పాటు 13మంది ఔట్సోరి్సంగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగులు సూపర్వైజర్ పోస్టులు సృస్టించుకుని ‘లీడర్షిప్’ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఫిల్టర్బెడ్లో ఒక ఇన్చార్జితో పాటు ఐదుగురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేసేవారు. 15ఏళ్ల నుంచి ఫిల్టర్బెడ్ పనితీరులో ఎలాంటి మార్పులు రాలేదు. ఉద్యోగుల మాత్రం ఐదునుంచి 15కు పెరిగారు. వాటర్బెడ్లో నాలుగు నుంచి ఐదుగురు మాత్రమే విధులు నిర్వహించడానికి అవకాశముంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 12 మంది ఔట్సోరి్సంగ్ సిబ్బంది విధులు నిర్వహించడం విశేషం. -
ఒకటో తేదీనే జీతం
కాంట్రాక్ట్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన వెతలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్తో సంబంధం లేకుండా శాశ్వత ఉద్యోగుల మాదిరి ఒకటో తేదీనే జీతం ఇచ్చేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నాళ్లూ మూడు, నాలుగు నెలలకోసారి జీతం తీసుకునే చిరుద్యోగులు ఇకనుంచి ఒకటో తేదీనే వేతనం అందుకోనున్నారు. సాక్షి, అనంతపురం: ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి వేతన వెతలు తీరుస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో దాదాపు 21,250 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఏ ఒక్క శాఖలోనూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సక్రమంగా జీతాలు తీసుకోలేదు. రెండు నెలలు మొదలుకొని ఆరేడు నెలలకు కూడా జీతాలు మంజూరు కాని పరిస్థితి ఉండేది. దీంతో తక్కువ వేతనంతో పని చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి బాధలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటో తేదీనే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. గతంలో బడ్జెట్ ఉంటేనే జీతం గతంలో వివిధ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే ప్రత్యేక బడ్జెట్ రావాల్సి ఉండేది. బడ్జెట్ వచ్చినప్పుడే వారికి జీతాలు చెల్లించేవారు. దీంతో ఒక్కోసారి ఆరు నెలలైనా జీతం అందక చిరుద్యోగులు అల్లాడిపోయేవారు. కుటుంబ పోషణకు అప్పులు చేసి వాటిని తీర్చేందుకు నానా తిప్పలు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బడ్జెట్తో నిమిత్తం లేకుండా జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారమైతే ఒకటో తేదీ రాగానే జీతాలు చెల్లిస్తారు. బీసీ హాస్టళ్ల కార్మికులకు ఆరునెలల జీతాలు జమ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న నాల్గో తరగతి (కుక్, కమాటి, వాచ్మన్) ఉద్యోగులు ఆరునెలల జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 128 మంది నాల్గో తరగతి ఉద్యోగులుగా పని పనిచేస్తుండగా.. మార్చి వరకు మాత్రమే జీతాలు పడ్డాయి. బడ్జెట్ లేక ఏప్రిల్ నుంచి బకాయిలు పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రెండు రోజుల కిందట ఆరునెలల జీతాల సొమ్మును చెల్లించారు. దాదాపు రూ. 96 లక్షల మేర ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు. చదవండి : కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ -
ఉద్యోగుల ‘వేదన’ బతుకులు
సాక్షి, చిత్తూరు : ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రైవేటు ఉద్యోగులనే తేడా ఉండదు. అందరూ సమానమే. ఎప్పుడు చూసినా వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తుంటారు. విజయవాడలోని ప్రధానశాఖ నుంచి రిపోర్టులు పంపమని ఆదేశాలు జారీచేస్తుంటారు. ప్రభుత్వ పథకాలను టీడీపీకి లబ్ధిచేకూర్చే పథకాలుగా మార్చేస్తుంటారు. వాటిపై ప్రచారాలు చేయాలంటూ చిరుద్యోగులపై ఒత్తిడి పెంచేస్తుంటారు. కాదన్న వారిని నిర్ధాక్షణ్యంగా తొలగించేస్తుంటారు. లేదంటే మానసిక క్షోభకు గురిచేయడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. జిల్లాలో ఈ ఐదేళ్లలో ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు పడ్డ బాధలు అన్నీఇన్నీకావు. ఎవరిని కదిలించినా కష్టాలగాథలే. టీడీపీ పాలనలో చితికిపోయిన తమ బతుకుల గురించి కళ్లల్లో నీళ్లు పెట్టుకుని మరీ చెప్పడం కలచివేస్తోంది. కుటుంబ జీవితాలకు దూరం జిల్లాలో దాదాపు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే.. వీరికి సమానంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ఉద్యోగికీ కనీస పనిగంటలనేవి లేవు. గడిచిన ఐదేళ్లలో ఉద్యోగులు ఎనిమిది గంటలు పనిచేసి ఇళ్లకు వెళ్లిన దాఖలాలులేవు. పైగా సెలవు రోజుల్లో కూడా కార్యాలయాల్లో కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి. వ్యక్తిగత జీవనంతో పాటు కుటుంబ జీవితానికి వారు దాదాపు దూరమైపోయారు. గొడ్డుచాకిరీ చేసినా కాంట్రాక్టు ఉద్యోగుల కనీస వేతనాలు సగటున రూ.15 వేలు కూడా రాలేదు. చాలీచాలని జీతాలతో మూడు పూటలు గడవని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తికాదేమో. ఓ ఆశా వర్కర్కు పారితోషికంతో కలిపి నెలకు రూ.6 వేలు వస్తే ఇద్దరు పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చదివించి, ఇల్లు గడపడానికి ఏటా రూ.50 వేల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి. మరణమే శరణమా? జిల్లా వెలుగు శాఖలో పనిచేసే పది మంది వరకు ఈ ఐదేళ్లలో చనిపోయారు. మితిమీరిన పని ఒత్తిడే ఈ మరణాలకు కారణం. మృతుల్లో మొలకలచెరువుకు చెందిన ఏరియా కో–ఆర్డినేటర్ రమేష్, కార్వేటినగరం ఏరియా ప్రాజెక్టు మేనేజరు గిరిజ, క్లస్టర్ కో–ఆర్డినేటర్ భాస్కర్, చిన్నగొట్టిగల్లు క్లస్టర్ కో–ఆర్డినేటర్ చెంగల్రాయులు ఉన్నారు. ఇదేశాఖకు చెందిన గంగవరం క్లస్టర్ కో–ఆర్డినేటర్ గురుమూర్తి, గుడిపాలకు చెందిన వెంకటేశులు పక్షవాతంతో మంచాన పడ్డారు. మదనపల్లె మునిసిపాలిటీలో 2016లో శ్రీనాథ్ అనే కాంట్రాక్టు ఉద్యోగి చెప్పినపని చేయలేదంటూ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు విధుల్లో నుంచి తొలగించడం.. అతను ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సుల్లో సమాధానాలు చెప్పలేక పుత్తూరు మునిసిపల్ కమిషనర్గా పనిచేసిన సాంబశివరావు పక్షవాతంతో మంచంపట్టిన విషయం మరచిపోలేరు. వేతనాల్లేక విలవిల జిల్లా వైద్యశాఖలో పనిచేసే 3,250 మంది ఆశా వర్కర్లకు పారితోషికం రూ.5,600, గౌరవ వేతనం రూ.3 వేలు ఇస్తామంటూ గతేడాది ఆగస్టులో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వేతనాలు అందాలి. కానీ మూడు నెలలుగా రూపాయి వేతనం ఇవ్వలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి చెల్లించాల్సిన జీతాలను ఇవ్వడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తోంది. చిత్తూరులో పనిచేసే 3 వేల మంది హోంగార్డులకు బడ్జెట్లేదనే సాకుతో ఐదు నెలలుగా జీతాలివ్వలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్న మహిళా సంఘాలకు మూడు నెలలుగా రూ.2.51 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల వెతలు జిల్లా గృహనిర్మాణశాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 400 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే (2014లో) తొలగించింది. ప్రతి మండలంలో ఐదుగురు ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ల స్థానంలో ప్రస్తుతం ఒక్కరే పనిచేయాల్సి వస్తోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో 2005 నుంచి పనిచేస్తున్న 380 మంది ఫీల్డు అసిస్టెంట్లపై పనితీరు నివేదిక బాగాలేదని నాలుగేళ్ల క్రితం వేటు వేశారు. వ్యవశాయశాఖలో పనిచేసిన 2,800 మంది ఆదర్శరైతులు అవసరం లేదంటూ తీసేశారు. ఐదేళ్ల క్రితం వీరిని తొలగించే సమయానికి ఒక్కో ఆదర్శరైతుకు రూ.5 వేలు చొప్పున వేతనాలను ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం కూడా సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్న రిసోర్సుపర్సన్లను, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిపి 3,800 మందిని ప్రభుత్వం తొలగించింది. -
‘ఓటు’ దెబ్బతో దిమ్మతిరగాలి
సాక్షి, అమరావతి: ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో రాజకీయ నాయకులతోపాటే ఉద్యోగ వర్గాలూ తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెంచాయి. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేముందు అనేక హామీలిచ్చిందని, మనం కూడా ఆ హామీలు నెరవేరతాయన్న ఆశతో ఓట్లేశాం...ఇప్పుడేమో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నాయి. ఉద్యోగం చేస్తున్నామేగానీ కనీస భద్రత లేకుండా పోయింది. మన పరిస్థితి ఈ నాలుగేళ్లలో మరీ దారుణంగా ఉంది. వేతనాలు పైసా పెంచకపోగా, ఉన్న ఉద్యోగానికీ ఇబ్బందులు తప్పలేదు, ఈ పరిస్థితుల్లో కలిసికట్టుగా ఓటు వేస్తేగానీ మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు.. అన్న ఆలోచనకు ఆయా ఉద్యోగులు వచ్చారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలు కీలకం కాబోతున్నాయని, ఏమాత్రం పొరపాటు చేసినా మళ్లీ మనకు అన్యాయం జరిగే అవకాశముందన్న భావనకు వారు వచ్చారు. ఇలాంటి అవకాశం మళ్లీ ఐదేళ్లకుగానీ మనకు రాదని, ఇప్పుడే జాగ్రత్త పడాలని చర్చించుకుంటున్నారు. హామీ ఇచ్చి మోసం చేసినందుకు కసి తీర్చుకోవాలన్న అభిప్రాయంతో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు యమునాతీరు కాకుండా ఈ ఏడాది కలసికట్టుగా ఓటు వేద్దామని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లక్ష మంది వరకూ ఉన్నట్టు అంచనా. వీరిలో ఎక్కువగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీళ్లలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక సంఘాలున్నాయి. ప్రతి జిల్లాలోనూ కార్యవర్గాలు ఉన్నాయి. దీని ఆధారంగా ఉద్యోగులు జిల్లాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉద్యోగులెవరైనా తెలియని వారుంటే చేర్చుకోవడం, వారికి అవగాహన కల్పించడం, జరిగిన మోసాన్ని వివరించడం వంటివి ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉద్యోగులతోపాటు బంధువులు, తెలిసిన వారికి కూడా ప్రచారం నిర్వహించి జరుగుతున్న పరిణామాలను వివరిస్తున్నామని పశ్చిమగోదావరికి చెందిన ఒక కాంట్రాక్టు ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు గానీ, మెసేజ్లుగానీ పెట్టకుండా ప్రధానంగా మనకు జరిగిన నష్టాన్ని తెలియజెప్పాలని, అధికారపార్టీ హామీ ఏమిచ్చింది, ఏం చేసింది అనే విషయాన్ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలని ఆయా కార్యవర్గాల్లో నిర్ణయించారు. విధిగా అందరూ ఓటింగ్కు రావాలని వాట్సాప్ ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి.. - 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దశలవారీగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామన్నారు. కానీ చెయ్యలేదు - నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేసి నాలుగున్నరేళ్లపాటు సమావేశాలు నిర్వహించి చివరకు క్రమబద్ధీకరణ కష్టమని చెప్పేశారు - 2010కి ముందు రెగ్యులర్ ఉద్యోగులకు లాగే వేతన సవరణ ఉండేది.. ఇప్పుడు దీన్ని తీసేశారు - కాంట్రాక్టు ఉద్యోగులను కూడా కన్సాలిడేటెడ్ ఉద్యోగులుగా మార్చేశారు - జీవో నంబర్ 27 ద్వారా ఉన్న డీఏ, హెచ్ఆర్ఏ, పీఆర్సీ వంటివన్నీ తొలగించారు - గడిచిన నాలుగున్నరేళ్లలో ఉద్యోగ భద్రత పూర్తిగా లేకుండా పోయింది -
పండుగ జేస్కోవాలంటే పైసలేవీ!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు తెలంగాణ అంతటా పండుగ వాతావరణం.. మరోవైపు ఇంటికొచ్చిన ఆడబిడ్డలను ఆదరించేదెట్లా అనే ఆందోళన. కొత్త బట్టల సంగతేమోగాని పండుగపూట కనీస మర్యాదలు కూడా చేయలేని పరిస్థితి. ఇదీ వైద్య, ఆరోగ్య శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. కీలకమైన ఓపీ సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ధర్నాకు దిగుతుండటంతో ఓపీ సేవలే కాకుండా పలు సర్జరీలు సైతం వాయిదా పడుతున్నాయి. ఇంటి అద్దెలు.. కిరాణాషాపుల్లో బకాయిలు ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ 470 మంది పని చేస్తున్నారు. నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో 120 మంది నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పటికే మూడు నెలల నుంచి వేతనాలు లేక ఇంటి అద్దెలు, కిరాణా షాపుల్లో పెట్టిన బాకీలు భారీగా పెరిగిపోయాయని, పాత బాకీ చెల్లిస్తే కానీ వారు కూడా కిరాణం ఇవ్వడం లేదంటున్నారు. ప్రభుత్వం ఇచ్చినా.. ఇవ్వకపోయినా... నిబంధనల ప్రకారం ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేసినా.. చేయకపోయినా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీ నిర్వాహకులే ప్రతినెలా విధిగా ఆయా సిబ్బంది వేతనాలు చెల్లించాలి. కానీ, ఏజెన్సీ నిర్వాహకులు మూడునెలలుగా వేతనాలివ్వడం లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పని చేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలంటే నెలకు కనీసం రూ.70లక్షలపైనే అవుతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని తాము మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాగలమని ఏజెన్సీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలతో డీఎంఈ చర్చలు ఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలతో చర్చలు జరిపింది. ఏజెన్సీలకు బకాయి పడిన దాంట్లో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా రూ.4 కోట్లకు సంబంధించిన రిలీజింగ్ ఆర్డర్ కూడా ఇచ్చిందని, దసరా పండగ లోపే ఆయా కార్మికులందరికీ వేతనాలు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి చెప్పారు. -
ఉద్యోగులపై మళ్లీ నోరు పారేసుకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు పరుష వ్యాఖ్యలు చేశారు. వారి పనితీరు బాగోలేదంటూ మండిపడ్డారు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సంతృప్త స్థాయి పెంచడంలో దారుణంగా విఫలమయ్యారని ఆక్షేపించారు. మిమ్మల్ని మేము ఎందుకు మేపాలంటూ ఔట్సో ర్సింగ్ ఉద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కలెక్టర్లు, విభాగాధిపతులు, కార్యద ర్శులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. గృహ నిర్మాణాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉందని, దీన్ని మరింత పెంచాలని సూచించారు. పరిష్కార వేదిక ద్వారా రియల్ టైమ్లో సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. అవసరమైనచోటల్లా పీపీపీ రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి దాకా ప్రజా సాధికార సర్వే నిర్వహించామని, భూ సమస్యల పరిష్కారానికి భూధార్ తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక పథకాలు చేపట్టామని, మునిసిపల్ పరిపాలనలో పీపీపీ పద్ధతిలో ముందుకెళ్లామన్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యలొచ్చాయని చెప్పకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పౌర సరఫరాలు, వస్తువుల పంపిణీలో ప్రజల నుంచి మరింత సంతృప్తి వ్యక్తం కావాలన్నారు. 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు లభిస్తోందని చెప్పారు. నాలుగేళ్లుగా ప్రతి సోమవారం వ్యవసాయం, అనుబంధ రంగాలలపై టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మంగళవారం ఇ–ప్రగతి, ప్రతి బుధవారం రాజధాని, సంక్షేమంపై టెలికాన్ఫరెన్సులతో దిశానిర్దేశం చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఆర్నెల్లపాటు సర్కారు ప్రచారోద్యమం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూలై 15కి 1,500 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై వచ్చే ఆరు నెలల పాటు గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమాల ద్వారా ప్రచారోద్యమం చేపట్టాలని సీఎం సూచించారు. సంతృప్తి శాతం పెరగడంలో సర్వీసు ప్రొవైడర్లు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. అక్టోబర్లోగా ఈ ప్రగతి పూర్తి కావాలని ఆదేశించారు. అన్ని సర్వీసులను ఆన్లైన్లో చేర్చి శాఖాధిపతుల్లో కాగిత రహిత పాలన రావాలన్నారు. 75 లక్షలకుపైగా పేద కుటుంబాల ఎదురుచూపులు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం 75 లక్షలకు పైగా పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. నాలుగేళ్లుగా దరఖాస్తులు.. పరిశీలన దశ దాటి ముందుకు కదలడం లేదు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, మంచినీరు, పెన్షన్లు తదితర పథకాల మంజూరు కోసం అందిన 75,17,255 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయినా మంజూరు చేయాల్సి ఉందని వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడైంది. ఆర్థికేతర అంశాలతో కూడిన మరో 3,02,750 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తేలింది. -
వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
జనగామ అర్బన్ : వైద్య, ఆరోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని డీఎం హెచ్ఓ కార్యాలయం ఎదుట తెలంగాణ వైద్య, ఆరోగ్య సంయుక్త కార్యాచరణ సంఘం (జేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్కార్డులను ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు ఎస్టీఓ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఈనెల 8వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ము ట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ ఏ.విష్ణువర్ధన్రెడ్డి, కాంట్రాక్ట్ ఎం పీహెచ్ఏ (ఎం) అధ్యక్షుడు పేర్వారం ప్రభాకర్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు కేథరిన్, ఉమెన్ అసోసియేషన్ నాయకులు పూర్ణకుమారి, ఏరియా ఆస్పత్రి అధ్యక్షుడు లక్ష్మయ్య, సెక్రటరీ ప్రవీణ్, సహాదేవ్, సంపత్, శ్రీరాములు, పాండరి, మనోహర్ పాల్గొన్నారు. కాగా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల శ్రీనివాస్, ఆర్, రాజు, బి. గోపి, ప్రకాష్, ఇర్రి ఆహల్య సంఘీభావం ప్రకటించారు. -
సమస్యలు పరిష్కరించాలి
ఆర్మూర్ : ఏళ్ల తరబడి శ్రమ దోపిడీకి గురవుతున్న వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన పెన్డౌన్, టౌల్ డౌన్ నిరసన కార్యక్రమం బుధవారం కొనసాగింది. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ఆస్పత్రి ప్రాంగణం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించడంతో పాటు అక్కడే వంటావార్పు, భోజనాల కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లను సాధించుకొనే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు రెగ్యులర్ ఉద్యోగులు సంఘీబావం తెలిపారు. -
అస్మదీయులకే కొలువులన్నీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించే నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఔట్ ‘రేటు’పోస్టుల మాదిరిగా మార్చేస్తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో తమకు సంబంధించిన ఏజె న్సీకి అప్పగించి దాని ద్వారా తమ పార్టీకి అనుకూలురనే ‘ఎంపిక’ చేసుకోవాలని తల పోస్తోంది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయవద్దని, జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయిలో ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకుం టామని విద్యాశాఖలో ఇప్పటికే మౌఖిక ఆదే శాలు జారీ అయ్యాయి. ఇతర శాఖల్లోనూ ఇదే రీతిలో చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నా హాలు చేపడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 1.42 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు ఒక్కటీ భర్తీ చేయక పోగా ఉన్నవాటికే ఉద్వాసన పలికేందుకు సిద్ధం కావటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పోస్టుకు రూ. 2 లక్షలు చెల్లించేలా ఏజన్సీతో బేరం! ఔట్సోర్సింగ్ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకూ జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసి వాటి ద్వారా ఉద్యోగులను తీసు కుంటున్నాయి. ఇప్పుడు వీటిని రద్దుచేసి రాష్ట్ర స్థాయిలో తమకు సంబంధించిన ఏజెన్సీకి ఎంపిక కాంట్రాక్టు ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. పీఆర్సీతో ఔట్సోర్సింగ్ వేత నాలు కొంతమేర పెరగడం, భారీగా పోటీ పడుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచు కుని రాష్ట్ర స్థాయిలోఎంపికైన ఏజన్సీ ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలకు పైగా పెద్దలకు చెల్లిం చేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలి సింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఇది అశనిపాతంగా మారనుంది. 12 వేల మందిపై పిడుగు! విద్యాశాఖలో 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా బోధనేతర పోస్టులు కూడా వేలల్లోనే ఖాళీలున్నాయి. సర్వశిక్ష అభియాన్, డీఈఓ ఎంఈవో కార్యాలయాలతో పాటు అనేక విభాగాల్లో వేలాది మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 664 మండల విద్యాధికారి కార్యాలయాల్లో 5,312 వరకు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో 7,392 మంది, జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో 260 మంది, ఎస్ఎస్ఏ పీవో కార్యాలయాల్లో 260 మంది, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు 4,000 వేల మంది వరకు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మొత్తం 17,224 పోస్టుల్లో దాదాపు 12 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు న్నారు. మిగతావి ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులు భర్తీచేయవద్దని మంత్రి గంటా సూచనల మేరకు అధికారులు ఆయా విభాగాలకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాన్ని రాష్ట్రస్థాయిలో ఒకే ఏజెన్సీకి కట్టబెట్టాలని నిర్ణయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పనిచేస్తున్న వారి సర్వీసులు డిసెంబర్తో ముగియనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వీరిని పొడిగించే అవకాశాలు లేకుండా పోయాయి. ఏజన్సీల చుట్టూ నిరుద్యోగుల ప్రదక్షిణ ఔట్సోర్సింగ్ నియామకాలకు సంబంధించి ఏజెన్సీల ఎంపికకు ఆర్థిక శాఖ గతంలో 4271 జీవో ద్వారా విధివిధానాలు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా, ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరక్టర్, జిల్లా లేబర్ ఆఫీసర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి సభ్యులుగా ఉన్న కమిటీ ఏజెన్సీలను గుర్తిస్తుంది. ఆయా సంస్థలు ఈపీఎఫ్, ఈఎస్ఐతో సహా కార్మిక చట్టాల ప్రకారం ఇతర అన్ని అంశాలను పాటిస్తున్నా యో లేదో పరిశీలించి ఎంపిక చేస్తాయి. ఉద్యోగులను ఎంపిక చేసే సంస్థలకు కొంత కమీషన్ను చెల్లిస్తుంది. ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసును ఏడాది మాత్రమే కొనసా గిస్తారు. రెన్యువల్ చేస్తేనే వారికి పోస్టు ఉంటుంది. ఆయా సంస్థలు కూడా ఉద్యోగుల వేతనం నుంచి కొంత మినహాయించుకుం టున్నాయి. శాశ్వత ఉద్యోగాల భర్తీ లేకపోవటంతో నిరుద్యోగులు ఔట్సోర్సింగ్ ఏజన్సీల చుట్టూ క్యూ కడుతున్నారు. -
విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇక నేరుగా వేతనాలు
- నాలుగు కేటగిరీల కింద కొత్త వేతనాల ఖరారు - కనీసం రూ.14 వేల నుంచి రూ.23 వేల వరకు జీతం - ఉత్తర్వులు జారీ చేసిన విద్యుత్ సంస్థలు - లేబర్ కాంట్రాక్టర్ల చేతివాటానికి ఫుల్స్టాప్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇకపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలే నేరుగా వేతనాలు చెల్లించనున్నాయి. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టి చేతివాటం ప్రదర్శిస్తున్న లేబర్ కాంట్రాక్టర్ల దోపిడీకి చెక్పడనుంది. యాజమాన్యాలు విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించనున్నాయి. విద్యార్హతల ఆధారంగా వారిని నాలుగు కేటగిరీలుగా విభజిస్తూ కొత్త వేతనాలను ఖరారు చేశాయి. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ యాజమాన్యాలు తాజాగా ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 20,903 మంది ఔట్ సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గతంలో విద్యుత్ సంస్థలు జారీ చేసిన ఉత్తర్వులను తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అమలు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. లేబర్ కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా వేతనాలు చెల్లించాలని, వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని, కన్సాలిడేటెడ్ వేతనాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణిస్తూ నేరుగా వేతనాలు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. విద్యార్హతలను ప్రామాణికంగా తీసుకుని ఉన్నత నైపుణ్యం గల వారిని ఆర్టిజన్ గ్రేడ్–1, నైపుణ్యం గల వారిని ఆర్టిజన్ గ్రేడ్–2, స్వల్ప నైపుణ్యం గల వారిని ఆర్టిజన్ గ్రేడ్–3, నైపుణ్యం లేని వారిని ఆర్టిజన్ గ్రేడ్–4 సిబ్బందిగా వర్గీకరించారు. హైకోర్టు ఆదేశాలతో క్రమబద్ధీకరణ ఉత్తర్వుల అమలు ఆగిపోయినా, ఈ 4 కేటగిరీల కిందే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగనున్నారు. హైకోర్టు సూచించిన వేతనాలకు అదనంగా విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.వెయ్యి చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు ఈ వేతనాలను ఖరారు చేసినట్లు ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ డి.ప్రభాకర్రావు ‘సాక్షి’కి తెలిపారు. ట్రాన్స్కోలో 4,197 మంది, జెన్కోలో 2,914 మంది, టీఎస్ఎస్పీడీసీఎల్లో 9,459 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 4,333 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగనున్నారు. -
భద్రత లేదు.. భవిష్యత్తూ లేదు!
- ప్రభుత్వ కార్యాలయాల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల దయనీయ స్థితి - ఏళ్లకేళ్లుగా అరకొర వేతనాలే.. ఇందులోనూ కమీషన్ల పేరిట కోతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది.. ప్రభుత్వోద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. ఏళ్లకేళ్లుగా ఉద్యోగంలో కొనసాగుతున్నా.. అరకొర వేతనాలే దిక్కవుతున్నాయి. పీఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సదుపాయాలూ కరువయ్యాయి. వచ్చే జీతంలోనూ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు కమీషన్ల పేరిట కోతలు పెడుతున్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోతున్నారు. కార్మిక చట్టాలకు తూట్లు కేంద్రం ఇటీవల కార్మిక చట్టాల్లో సంస్కరణలను తీసుకొచ్చింది. ప్రతి ఉద్యోగికి ఈఎస్ఐ, పీఎఫ్ను తప్పనిసరి చేసింది. ప్రైవేటు సంస్థలు కూడా ఈ సౌకర్యాలు కల్పించాలి. ఈ లెక్కన ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్ కచ్చితంగా అమలు చేయాల్సి ఉన్నా.. రాష్ట్రంలో అది అమలుకావడం లేదు. రాష్ట్రంలో దాదాపు 22,500 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉండగా.. ఇందులో 1,750 మందికే పీఎఫ్ సౌకర్యం కల్పించారు. 550 మందికే ఈఎస్ఐ సదుపాయం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటి కోసం విజ్ఞప్తి చేసినా స్పందన లేదని మహబూబ్నగర్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఉన్న ఉద్యోగానికే భద్రత లేదు.. ఏడేళ్ల కింద ఇన్సూరెన్స్ కాల్ సెంటర్లో ఉద్యోగంలో చేరా. క్రమబద్ధీకరణ సంగతేమోగానీ ఉన్న ఉద్యోగానికే భద్రత లేదు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలూ కూడా ఉండడం లేదు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఉపాధి కూలీల బీమా పథకాల ఫైళ్లు క్లియర్ చేయడం నా విధి. కానీ నాకు మాత్రం ఇన్సూరెన్స్ లేదు – బి.నర్సింహులు, కంప్యూటర్ ఆపరేటర్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఏజెన్సీలు ఎందుకంటే..? ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి సుదీర్ఘ ప్రక్రియ ఉండడంతో ఆయా పోస్టుల్లో తాత్కాలికంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తున్నారు. దాదాపు 17 ఏళ్లుగా ఇది అమలవుతోంది. తొలుత ఈ తాత్కాలిక ఉద్యోగులను ప్రభుత్వ శాఖలే నేరుగా నియమించుకోగా... కొంతకాలంగా ఈ బాధ్యతలను ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించారు. సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఏదైనా తప్పిదానికి పాల్పడితే ఏజెన్సీ నిర్వాహకులను బాధ్యులుగా చేస్తున్నారు. దీంతో ఏజెన్సీలు ముందుజాగ్రత్తగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విద్యార్హత సర్టిఫికెట్లను తీసుకుని తమవద్దే పెట్టుకుంటున్నాయి. ఇక ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల చెల్లింపు బాధ్యతను కూడా ఏజెన్సీలకే అప్పగించడంతో.. ఆయా ప్రభుత్వ శాఖలపై భారం కూడా ఉండదు. కానీ ఇలా ఉద్యోగుల బాధ్యతంతా ఏజెన్సీలపైనే పెట్టడంతో వాటి నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వేతనాల్లో కోతలు.. చెల్లింపుల్లో జాప్యం.. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతినెలా 5లోపు వేతనాలు అందుతాయి. ఆయా శాఖలు ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలను సైతం ఆలోపే ఏజెన్సీలకు చెల్లిస్తున్నాయి. ఏజెన్సీలు మాత్రం ఔట్సోర్సింగ్ సిబ్బందికి 12 నుంచి 24వ తేదీ మధ్య వేతనాలు ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు కమీషన్ పేరిట వేతనంలో 2% నుంచి 5% వరకు కోత పెడుతున్నాయి. రూ.10 వేలలోపు వేతనమున్న వారికి 5%, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి నాలుగు, మూడు శాతం కోత పెడుతున్నాయి. దీంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రయోజనాలూ కరువే ఏజెన్సీల నిర్వాకంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి పథకాలేవీ అందడం లేదు. ఈఎస్ఐ, ఆరోగ్య బీమాలతో ఉచిత వైద్యసేవలు అందుతాయి. ఇక పీఎఫ్తో ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. ఈ సౌకర్యాలను కల్పించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం శూన్యం. ఉత్తర్వులు అమలు కావడం లేదు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అమలు కావడం లేదు. కంప్యూటర్ ఆపరేటర్కు రూ.18,500 వేతనం ఇవ్వాలని ఆదేశాలున్నాయి. కానీ రూ.15 వేలే ఇస్తున్నారు. ఇది అన్యాయం. – ఉబేద్, కంప్యూటర్ ఆపరేటర్, డీఆర్డీఏ ఆదిలాబాద్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 22,500 వారిలో పీఎఫ్ ఖాతాలున్న ఉద్యోగుల సంఖ్య 1,750 ఈఎస్ఐ ఖాతాలు ఉన్న వారి సంఖ్య 550 -
రణరంగంగా ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి
-
రణరంగంగా ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి
హైదరాబాద్ : ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రి గురువారం రణరంగంగా మారింది. అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని అనురాధ నిన్న మూసాపేటలోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై సీఐటీయూ నేతలు ఇవాళ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో కలిసి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసన తెలుపుతున్న సీఐటీయూ నాయకుడు ఈశ్వర్రావును అదుపులోకి తీసుకోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో ఆస్పత్రి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ మాట్లాడుతూ... సిబ్బందికి జీతాల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమే అన్నారు. ప్రభుత్వం నుంచి బిల్స్ రావడంలో ఆలస్యం కారణంగా వేతనాలు చెల్లింపులో ఆలస్యం జరిగిందన్నారు. -
కటాఫ్ డేట్ 2016 డిసెంబర్ 4
⇒ విద్యుత్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు.. ⇒ టీఎస్పీసీసీలో నిర్ణయించిన విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ⇒ 28లోగా ఔట్ సోర్సింగ్ వివరాల సమర్పణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2016 డిసెంబర్ 4ను కటాఫ్ డేట్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ (టీఎస్పీసీసీ) సమావేశంలో తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు ఈ మేరకు తీర్మానం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కటాఫ్ తేదీలోగా విద్యుత్ సంస్థల్లో నియామకం పొందిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా పరిగణించనున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కటాఫ్ తేదీని విద్యుత్ సంస్థలు ఖరారు చేశాయి. త్వరలో జారీ చేయనున్న క్రమబద్ధీకరణ మార్గదర్శకాల్లో కటాఫ్ తేదీగా చేర్చనున్నారు. 28లోగా ‘ఔట్ సోర్సింగ్’ వివరాలు విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో జోన్లు, డివిజన్లు, పవర్ స్టేషన్ల వారీగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిర్దేశించిన ఫార్మాట్లలో ఈనెల 28 లోగా సమర్పించాలని ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో సుమారు 16,900 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) విభాగాల్లో పని చేస్తున్నారని ట్రాన్స్కో ఇప్పటికే ప్రాథమికంగా నిర్థారించింది. టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు తదితర కేటగిరీల్లో మరికొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ సంబంధించిన బయోడేటా, నివాస ధ్రువీకరణ, స్వీయ ధ్రువీకరణ పత్రాలు, ఔట్ సోర్సింగ్ ఒప్పందం, అనుభవం తదితర వివరాలతో నిర్దేశించిన ఫార్మాట్లలో సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను రూపొందించనున్నారు. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యపై ఈనెల 28 తర్వాత స్పష్టత రానుంది. మార్గదర్శకాలను ప్రతిపాదించిన యూనియన్లు ట్రాన్స్కో యాజమాన్యం సూచన మేరకు ఇప్పటికే కొన్ని ట్రేడ్ యూనియన్లు స్వయంగా క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదిం చాయి. విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిబంధనలతో సంబంధం లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద రిని క్రమబద్ధీకరించాలని దాదాపు అన్ని యూనియన్లు కోరుకున్నాయి. మరోవైపు క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను మార్చి 31లోగా జారీ చేస్తామని, మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. దీంతో గడువులోగా మార్గదర్శకాలు సిద్ధం అవుతాయా, లేదా అనే అంశంపై ట్రేడ్ యూనియన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. -
మీ సమస్యలు పరిష్కరిస్తాం
ఔట్సోర్సింగ్ నర్సులతో లక్ష్మారెడ్డి హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లోని ఔట్సోర్సింగ్ నర్సుల సమస్యలు పరి ష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆ రోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఓ స్వచ్ఛం ద సంస్థ డయాలసిస్ సెంటర్ను ప్రారం భించేందుకు ఆదివారం గాంధీ ఆస్పత్రికి వచ్చిన మంత్రికి నర్సింగ్ అసోసియేషన్ నా యకులు వినతిపత్రం అందించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరగా మంత్రి సాను కూలంగా స్పందించారు. నర్సింగ్ సిబ్బంది ఆందోళన భగ్నం రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది శనివారం ఉదయం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కొంతమంది నర్సులు ఆస్పత్రి ప్రధాన భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఉత్తర మండలం డీసీపీ సుమతి, టాస్క్ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మహిళా పోలీసులు నర్సింగ్ సిబ్బంది ఆందోళనను భగ్నం చేశా రు. అనంతరం వారిని అరెస్టు చేసి కొంత మందిని బొల్లారం, మరికొంత మందిని చిలకలగూడ ఠాణాలకు తరలించారు. మం త్రి హామీతో ఆందోళన విరమించి సోమవారం నుంచి విధులకు హజరవుతున్నట్లు నర్సిం గ్ అసోషియేషన్ నాయకులు తెలిపారు. -
ప్రత్యక్ష నియామకాలే!
విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై సర్కారు యోచన ►వెయిటేజీ మార్కులు 20 నుంచి 40కి పెంచేందుకు చర్యలు ►విధివిధానాల రూపకల్పన బాధ్యత ట్రేడ్ యూనియన్లకు ►ఇదే అదునుగా కొన్ని సంఘాల నేతల వసూళ్ల దందా సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు న్యాయపర చిక్కులు తలెత్తనున్నాయా? వారిని నేరుగా క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి రాష్ట్ర ప్రభు త్వవర్గాలు. నేరుగా క్రమబద్ధీకరిం చేందుకు అవకాశం లేనందున.. ప్రత్యక్ష నియామకాల (డైరెక్ట్ రిక్రూట్మెంట్) ప్రకటన ద్వారా వారికి ఉద్యోగావకాశం కల్పించడం ఒక్కటే మార్గమ ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరిని దశల వారీగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ గత నెలలో అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణ విధివిధా నాలను రూపొందించి వచ్చే ఏడాది మార్చి లోగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో సుమారు 21 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే ఆ ఉద్యోగుల క్రమబద్ధీ కరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అడ్డుగా మారనున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రత్యక్ష నియామకాల ప్రక్రియ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ప్రత్యక్ష నియామక ప్రక్రి య ద్వారా పోస్టుల భర్తీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 20 వెయిటేజీ మార్కు లను ఇచ్చేందుకు కోర్టు తీర్పులు అనుమతి స్తున్నాయి. వెయిటేజీ మార్కులను 20 నుంచి 40కు పెంచాలని, దీంతో పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకే దక్కుతాయని ప్రభు త్వం వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నట్లు తెలి సింది. ఈ మేరకు వేయిటేజీ మార్కుల పెంపు నకు సంబంధిం చిన నిబంధనలను సవరించే అవకాశాలపై పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యక్ష నియామకాల ప్రకటన ద్వారా నిరుద్యోగులందరి నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని, అదనపు వెయిటేజీ మార్కు లతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మాత్రమే భర్తీ చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు సుప్రీం మార్గదర్శకాల ప్రకారం మరో విధానాన్ని అనుసరిస్తే 50 శాతం పోస్టు లను తాత్కాలిక ఉద్యోగులతో భర్తీ చేసేందుకు వీలుందని, మిగిలిన 50 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ 21 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం 42 వేల పోస్టులను భర్తీ చేయాల్సి రానుండడంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసే అవకాశం లేదు. సంఘాల వసూళ్ల దందా.. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాల తయారీ బాధ్యతను ట్రాన్స్కో యాజ మాన్యం ట్రేడ్ యూనియన్లకు అప్పగిం చింది. విధివిధానాలు రూపొందించు కుని రావాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్స్ ఫెడరేషన్(టఫ్)కు లేఖ ఇచ్చింది. దీన్నే అవకాశంగా భావించిన కొన్ని సంఘాలు క్రమబద్ధీకరణ పేరుతో ఔట్ సోర్సింగ్ కార్మికుల నుంచి వసూళ్ల దందాకు తెరలేపాయి. తమ యూనియన్లలో సభ్యత్వం ఉంటేనే క్రమబద్ధీకరణకు అవకాశముందని పేర్కొంటూ కార్మికుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారు. సభ్యత్వ రుసుం పేరుతో కొన్ని యూనియన్లు ఒక్కో కార్మికుడి నుంచి రూ.350 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని 21 వేల మందికి పైగా ఔట్సోర్సింగ్ కార్మికులు ఉండడంతో మొత్తం వసూళ్లు రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటాయని ఓ కార్మిక నేత అభిప్రాయపడ్డారు. -
అచ్చెన్నా... ఆడపడుచుల్లో ఆనందం ఎక్కడా?
‘టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రం సుభిక్షంగా మారిపోయింది. రైతుల ఆత్మహత్య ఘటనల్లేవు. మహిళలంతా ఆనందంగా ఉన్నారు. ఏ ఒక్క ఆడపడుచూ కన్నీరు పెట్టట్లేదు...’ ఇవీ రాష్ట్ర కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి నోటివెంట జాలువారిన మాటలు! సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్ పనులు, సమస్యలపై మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి అచ్చెన్న సమీక్ష నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్తున్న మంత్రుల వద్ద కొంతమంది మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. వారిని చూసిన మంత్రికి ఏం చెప్పాలో కాసేపు అర్థం కాలేదు. ఇంతకీ విషయమేమిటంటే... టీడీపీ ప్రభుత్వమే పట్టణ ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా తమను నియమించిందని... ఇప్పుడు కడుపుకొట్టడం భావ్యం కాదని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కడుపు కాల్చుకొని పనిచేశాం. నిండు గర్భిణులుగా ఇంటింటికీ తిరిగి మాకు అప్పగించిన పని పూర్తి చేశాం. కానీ ప్రభుత్వం కనికరించట్లేదు. కొన్ని నెలలుగా జీతం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఉద్యోగం తీసేస్తామంటే మేమెలా బతికేదీ’ అంటూ పి.విజయలక్ష్మి అనే ఏఎన్ఎం కన్నీరు పెట్టింది. - సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
అడవిలో ఆర్డర్లీ
అటవీశాఖలో ఆటవిక న్యాయం ఔట్సోర్సింగ్ సిబ్బందితో అడ్డగోలు చాకిరీ ► బాత్రూంలు కడిగించడం నుంచి బట్టలు ఉతకడం దాకా అన్నీ వారితోనే.. ► కనీస వేతనం రూ. 12 వేలు ఇవ్వాల్సి ఉన్నా.. ముప్పై ఏళ్లుగా రూ. 6,700 ► పీఎఫ్ సొమ్మునూ బొక్కేస్తున్న కాంట్రాక్టర్లు పశ్నిస్తే పనులకు రావొద్దంటూ బెదిరింపులు సాక్షి, హైదరాబాద్: అడవి తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయదంటారు... తనను కాపాడే వారిని ఒడిలో పెట్టుకుని చూసుకుంటుందంటారు.. నిజమే..మూడు దశాబ్దాలుగా తనను నమ్ముకున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని అడవి కన్నబిడ్డల్లానే చూసుకుంటున్నా అధికార యంత్రాంగం మాత్రం వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటోంది! వారితో బీట్ ఆఫీసర్, ఉన్నతస్థాయి అధికారుల ఇళ్లలో బాత్రూంలు క్లీన్ చే యించడం, వంటలు చేయించడం, బట్టలు ఉతకటం, పిల్లల్ని ఆడించటం వంటి పనులు చేయిస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 14 ప్రకారం రూ.12 వేల కనీస వేతనం ఇవ్వాల్సి ఉన్నా రూ.6,700 మాత్రమే చెల్లిస్తున్నారు. పీఎఫ్ సైతం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తోంది. హైదరాబాద్లోని జూపార్కు, అరణ్యభవన్లో పనిచేస్తున్న వారికి నెలకు రూ.9 వేలు చెల్లిస్తున్నా.. మిగతాచోట్ల కేవలం రూ.6,700 చెల్లిస్తున్నారు. ఫారెస్ట్ రేంజ్ వారీగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు సిబ్బంది నుంచి పీఎఫ్ మొత్తాన్ని సేకరిస్తున్నా.. దాన్ని కార్మికుల ఖాతాలో జమ కూడా చేయకుండా భారీ అవినీతికి తెర లేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నిస్తే.. పనికి రావొద్దంటూ.. తెలంగాణ అటవీశాఖలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,400 మంది బేస్క్యాంప్ వర్కర్లు, స్ట్రైక్ఫోర్స్, యానిమల్ ట్రాకర్స్, యానిమల్ కీపర్లు, వాచర్లు, చెక్పోస్ట్ వాచర్లుగా పనిచేస్తున్నారు. పోలీస్ శాఖలో అర్డర్లీ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం అటవీ శాఖను వదిలేసింది. దీంతో అడవిలో ఆర్డర్లీ వ్యవస్థ పక్కాగా అమలవుతోంది. వెట్టి పనులపై ప్రశ్నించే వారిని.. ‘రేపట్నుంచి పనికి రావొద్దు’ అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. బాత్రూం శుభ్రపర్చటం నుంచి బట్టలు ఉతకటం, పిల్లల్ని ఆడించటం వంటి పనులు చేయిస్తున్నారు. భవన నిర్మాణ పనులు, రంగులు వేయించటం, భూసార పరిరక్షణ తదితర పనులు కూడా అప్పజెప్పుతున్నారు. వాస్తవానికి ఈ పనులను చేసేందుకు ప్రత్యేక బడ్జెట్లు ఉండాలి. టెండర్లు వేయాలి. కానీ రేంజ్ ఆఫీసర్లు.. ఈ పనులన్నింటినీ వాచర్లు, ట్రాకర్లు, స్ట్రైక్ ఫోర్స్తో చేయించి, ఆ మొత్తాలను సొంత ఖాతాలోకి మళ్లించుకుంటున్నట్లు సమాచారం. ఇదిగో సిబ్బంది గోస.. • హైదరాబాద్లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులో బట్టమేకల సోమయ్య(70) ముప్పై ఏళ్లుగా వాచర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇస్తున్న జీతం నెలకు రూ.6,700. పీఎఫ్ మొత్తాన్ని కట్ చేస్తున్నా ఇంత వరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఇక్కడే పనిచేస్తున్న తేలు లింగయ్య సహా ముప్పై రెండు మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. జూ పార్కు, అటవీశాఖ ప్రధాన కార్యాలయం మినహా అన్ని జాతీయ పార్కులు, రేంజ్ల్లో వెట్టి, జీతాల కోత సాధారణంగా మారింది. • కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐదేళ్లుగా యానిమిల్ కీపర్గా పనిచేస్తున్న నిరంజన్రెడ్డి అనే కార్మికుడిని దుప్పి పొడవటంతో ఒక కిడ్నీ తొలగించారు. పీఎఫ్ ఇతరత్రా సాయం ఏదీ అందలేదు. ఇదే తరహాలో మన్ననూరు అటవీప్రాంతంలో స్ట్రైక్ఫోర్స్గా పనిచేస్తున్న రాములుపై ఎలుగుబంటి దాడి చేయటంతో దుర్మరణం పాలయ్యాడు. ఆయన కుటుంబానికి నయాపైసా సహాయం అందలేదు. • ఔట్సోర్సింగ్ సిబ్బందితో నిర్మాణ పనులు, భూ సంరక్షణ తదితర పనులు చేయిస్తున్నారు. ఆ పనులను కాంట్రాక్టర్లతో చేయించినట్లు భారీ బిల్లులతో ప్రభుత్వానికి పంగ నామాలు పెడుతున్నారు ప్రభుత్వం స్పందించాలి అటవీశాఖలో ఆర్డర్లీ, కనీస వేతనాలు చెల్లించకపోటం, పీఎఫ్లో అవినీతిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కార్మికులతో అడ్డగోలు చాకిరీ చేయించడంపై సీఎం విచారణ జరిపించాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అటవీశాఖలో మార్పు కనిపించకపోవటం దారుణం. - అల్వాల్ శివకుమార్, అధ్యక్షుడు, అటవీశాఖ ఉద్యోగ, కార్మిక సంఘం -
ఇదో ‘ఔట్ సోర్సింగ్’ కథ.. బక్కజీవుల వ్యథ!
ఇదీ ఏపీటీడీసీలో ఔట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి పర్యాటక దినోత్సవ వేడుకలపై కార్మికుల ఆగ్రహం పీఎఫ్ మింగేసినవారిపై చర్యలేవీ? మా సొమ్ము మాకిప్పించాలంటున్న కార్మికులు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగం.. పేరు ఏదైనా వెట్టిచాకిరీ తప్పదు. పని బారెడైనా.. జీతం మాత్రం మూరెడే. బక్కజీవుల బతుకులు మారవు.. మారేం దుకు అవకాశం ఇవ్వం అన్నట్లు కొనసాగే పాలకుల వ్యవహారం.. అందుకు తగ్గట్టే యాజమాన్యాల నిర్వాకం. ఏపీటీడీసీలో ప్రస్తుతం కొనసాగుతున్న తంతుఇదే. ఈ సంస్థలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్లుగా పనిచేస్తున్నా తక్కువ జీతంతోనే బతుకీడుస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ కార్మికుల పీఎఫ్ సొమ్ము కు ఎసరు పెట్టినా ఎవరికీ పట్టడంలేదు. విజయవాడ (భవానీపురం) : ‘అతిథులకు ఆతిథ్యమిచ్చి వారి ఆకలి తీరుస్తూ సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాం. అయినా మా కడుపులు కాలుస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వేడుకలు చేసుకుంటారా? అసలే అంతంత మాత్రం వేతనాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాం. పీఎఫ్ సొమ్మును సైతం మింగేసి బోర్డు తిప్పేసిన సంస్థపై ఏం చర్యలు తీసుకున్నారు?. మా పీఎఫ్ డబ్బులు మాకు ఇప్పించేసి మీరు ఏ వేడుకలైనా చేసుకోండి’. ఇదీ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికుల ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డివిజన్లలో ఔట్సోర్సింగ్ కార్మికులతో పని చేయించుకుని వారి పీఎఫ్ సొమ్మును దిగమింగేయటంపై కార్మికులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఏపీటీడీసీ విజయవాడ డివిజన్లో ఎస్ఎస్బీ అనే సంస్థ కింద 51 మంది ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేశారు. ఆ సంస్థ సుమారు 5 నెలలకుపైగా తమకు చెల్లించాల్సిన పీఎఫ్ సొమ్మును ఆ శాఖకు జమ చేయకుండా మింగేసిందని కార్మికులు చెబుతున్నారు. ఈ మొత్తం దాదాపు రూ.50 లక్షలకుపైగానే ఉన్నట్లు తెలుస్తోంది. 2011లో ఏపీటీడీసీలో హైదరాబాద్కు చెందిన ఎస్ఎస్బీ సంస్థ ఔట్సోర్సింగ్ విధానంలో కార్మికులతో పని చేయించుకునేందుకు ఒక ఏడాదికి కాంట్రాక్ట్ తీసుకుంది. ప్రతి ఏడాది ఈ సంస్థ కాంట్రాక్ట్ను పొడిగిస్తూ వస్తున్నారు. అయితే కొద్ది సంవత్సరాలుగా కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు, ఇతర చెల్లింపులకు సంబంధించి సంస్థ ఇబ్బంది పెడుతున్న కారణంగా 2015 మే నెలలో ఏపీటీడీసీ అధికారులు ఆ సంస్థ కాంట్రాక్ట్ను రద్దు చేశారు. కార్మికులకు షాక్ ఇచ్చిన ఎస్ఎస్బీ కనీస వేతనాలకు కూడా నోచుకోని ఔట్సోర్సింగ్ సిబ్బంది పీఎఫ్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాము పనిచేసే ఎస్ఎస్బీ సంస్థను రద్దు చేయడంతో పీఎఫ్ను క్లెయిమ్ చేసుకునేందుకు ఆ శాఖ దగ్గరకు వెళ్లిన కార్మికులు షాక్ అయ్యారు. ఐదు నెలల నుంచి పీఎఫ్ సొమ్మును ఆ శాఖకు సంస్థ జమ చేయడం లేదని, పెండింగ్లో ఉన్న వాయిదాలు చెల్లిస్తేకానీ క్లియర్ చేయలేమని ఆ శాఖ చెప్పడంతో కార్మికులు ఆవాక్కయ్యారు. ఒక్కో కార్మికునికి రూ.లక్షకుపైగా పీఎఫ్ సొమ్ము రావల్సి ఉంటుంది. గతంలో వేతనాలు పెంచాలంటూ కార్మికులు 15 రోజులు సమ్మె చేశారు. సమస్యను పరిష్కరిస్తామని ఏపీటీడీసీ యాజమాన్యం హామీ ఇచ్చినా, వేతనాలను మాత్రం పెంచలేదు. చివరికి పీఎఫ్ విషయంలో కూడా తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. ఏపీటీడీసీ ఈడీ అమరేంద్ర, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్కుమార్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. కాంట్రాక్ట్ సంస్థ, ఉన్నతాధికారులు లాలూచీపడి తమ పీఎఫ్ సొమ్మును దిగమింగేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ మారినా పెరగని వేతనాలు.. ఎస్ఎస్బీ సంస్థ కాంట్రాక్ట్ను రద్దు చేసిన ఏపీటీడీసీ యాజమాన్యం కొత్త కాంట్రాక్ట్ను ఆదిత్య ఎంటర్ప్రైజెస్కు అప్పగించింది. గత ఏడాది జూన్ నుంచి ఇది మనుగడలోకి వచ్చింది. సహజంగా కాంట్రాక్ట్ సంస్థ మారితే కార్మికుల వేతనాలు పెరుగుతాయి. అందుకు భిన్నంగా పాత వేతనాలతోనే కొనసాగించేందుకు ఏపీటీడీసీ యాజమాన్యం నిర్ణయించింది. -
కార్మికుల పొట్టకొట్టే వారికి టీఆర్ఎస్ వత్తాసు
► బిల్ట్ పరిశ్రమపై నోరెత్తని సర్కార్ ► మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క వరంగల్ : రాష్ట్రంలోని కార్మికుల పొట్టకొట్టే యాజమాన్యాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దనసరి అనసూయ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీఎన్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మేడే వేడుకల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు జెండాను అవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ తెలంగాణ వస్తేనే తమ బతుకు మారుతాయని భావించిన కార్మికులకు రెండు ఏళ్లు గడిచినా ఒరిగిందేమి లేదన్నారు. టీ ఆర్ఎస్ ఎన్నికల్లో పార్ట్టైం ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న హామీ నేటికీ అమలు కాలేదు. బిల్ట్ పరిశ్రమ మూతపడి రోడ్డున పడ్డా కార్మికుల కుటుంబాల పరిస్థితిని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో టీఎన్టీయూసీ నాయకులు బాస్కుల ఈశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్, నాయకులు కొండం మధుసూదన్రెడ్డి, తాళ్లపల్లి జయపాల్, కుసుమ శ్యాం, మార్గం సారంగం, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయలేం
♦ బడ్జెట్ చర్చకు సమాధానం సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడి ♦ 20 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటాం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బడ్జెట్ మీద జరిగిన చర్చకు శుక్రవారం శాసనసభలో ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు. 20 వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే చర్యలు చేపట్టామని, త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిధులు ఉండే పీడీ ఖాతాల్లో సొమ్ము వాడుకున్న మాట వాస్తవమేనని అం గీకరించారు. అలా వాడుకోవడం నేరమేమీ కాదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు పీడీ ఖాతాల్లో సొమ్మును వాడుకొని, తర్వాత సర్దుబాటు చేయడం మామూలేనని వివరణ ఇచ్చారు. గత రెండు బడ్జెట్లలో యువతకు పెద్దగా ప్రాధాన్యమివ్వలేదని అంగీకరించారు. త్వరలో ‘యువజన విధానం’ తీసుకురానున్నామని చెప్పారు. యనమల చెప్పిన ముఖ్య విషయాలు.. ► కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా సహకారం అందాల్సి ఉంది. రాబడి ఆశించినంతగా పెరగడం లేదు. అప్పులు చేసైనా స్వర్ణాంధ్రకు బాటలు వేస్తాం. పన్నులు, కేంద్రసాయంతో ప్రభుత్వానికి రాబ డి వస్తుంది. అది సరిపోకపోతే అప్పే దిక్కు. ► 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల్లో అవాస్తవాలున్నాయని ప్రతిపక్షం విమర్శించింది.సవరించిన అంచనాలన్నీ తాత్కాలిక గణాంకాలే. వాస్తవ గణాంకాలు ఆడిట్ తర్వాత వస్తాయి. ► 2016-17లో ప్రణాళికేతర వ్యయం 16 శాతం పెరిగింది. ఈ వ్య యాన్ని 8 శాతం తగ్గించాం.ప్రణాళికా వ్యయం పెరిగిందంటే.. రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉందని అర్థం. ►నష్టాల్లో ఉన్న చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహకాలు ప్రకటించాం. ఫెర్రోఅల్లాయ్స్, స్పిన్నింగ్, చక్కెర పరిశ్రమలకూ ప్రోత్సాహకాలు ఇచ్చాం. ► పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి యత్నిస్తున్నాం. చైనా ప్రతిపాదిస్తున్న సిల్క్రూట్కు కేంద్రం అంగీకరిస్తే.. అమరావతి ‘ఆగ్నేయ ఆసియా ముఖద్వారం’గా మారడం ఖాయం. గాలిలో చేపల ఉత్పత్తి చేయడం లేదు: మంత్రి పుల్లారావు ఫిషరీస్లో 32 శాతం వృద్ధిరేటు సాధించామని తాము చెబుతుంటే, ప్రతిపక్ష సభ్యులు ఎగతాళి చేస్తున్నారని వ్యవసాయ బడ్జెట్పై సమాధానం సందర్భంగా ఆ శాఖ మంత్రి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. తాము గాల్లో చేపలు ఉత్పత్తి చేయడం లేదన్నారు. ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేమని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. బడ్జెట్ చర్చపై మంత్రి శుక్రవారం శాసన మండలిలో సమాధానం ఇచ్చారు. దాదాపు 63 వేల మంది ఔట్సోర్సింగ్, 16 వేల మంది కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేనందున జీతాలు పెంచే ఆలోచన ఉందన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆకలి కేకలు
ప్రతి నెల జీతం ఇస్తేనే బతుకు భారంగా సాగిపోతున్న రోజులివి. అలాంటిది పదిహేను నెలలుగా జీతాలివ్వకపోతే వారెలా బతకాలి?.. కనీస మానవత్వం లేని ప్రభుత్వ వైఖరిని ఏమనాలి? ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కన్నీటి గాధ ఇది. విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టుడుతున్నారు. పదిహేను నెలలుగా జీతాల్లేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. జీతాలు అడిగితే ‘మీకు కొనసాగింపు ఉత్తర్వులు రాలేదు కదా.. ఉద్యోగం మానేయండని’ అధికారులు చెబుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం కరుణించకపోతుందా.. జీతాలు ఇవ్వకపోతారా? అని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదురుచూడటం తప్ప చంద్రబాబు ప్రభుత్వం కరుణించని పాపాన పోలేదు. కేంద్రాస్పత్రి, ఘోషాస్పత్రుల్లో వివిధ స్థాయిల్లో 18 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఎలక్ట్రీషియన్లు ముగ్గురు, ఈసీజీ టెక్నీషియన్లు ఇద్దరు, వార్డుబాయ్లు 13 మంది ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరికి 2014 సంవత్సరం నవంబర్ నెల నుంచి జీతాలు చెల్లించలేదు. కొనసాగింపు ఉత్తర్వులు కూడా లేకపోవడంతో వీరి పరిస్థితి అగమ్య గోచరమైంది. కొనసాగింపు ఉత్తర్వులు ఇప్పించి, జీతాలు మంజూరు చేయాలని వీరంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వినతులిచ్చినా మొర వినేవారే కరువయ్యారు. ఇదే విషయాన్ని డీసీహెచ్ఎస్ కె.సీతారామరాజు వద్ద ప్రస్తావించగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం వాస్తవమేనన్నారు. వారికి కొనసాగింపు ఉత్తర్వులు కమిషనర్ కార్యాలయం నుంచి రాకపోవడం వల్ల చెల్లించలేదన్నారు. -
వాటర్ ట్యాంక్ ఎక్కిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్నగర్లో శనివారం ముగ్గురు జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వాటర్ ట్యాంకెక్కారు. వేతనాలు సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని చెప్పినా మధ్యలో ఏజెన్సీలు రూ.5 వేలు చెల్లిస్తున్నాయని ఉద్యోగులు తెలిపారు. అదేమని ప్రశ్నిస్తే బయటి వారిని పెట్టుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. తమకు న్యాయం జరగకపోతే ట్యాంక్పై నుంచి దూకుతామని హెచ్చరిస్తున్నారు. -
రామయ్యకు వెంకన్న అండ!
కడప కల్చరల్ : నవ్యాంధ్రలో ప్రభుత్వ లాంఛనాలతో నవమి ఉత్సవాలకు ఎంపికైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం నేడు (బుధవారం) తిరుమల-తిరుపతి దేవస్థానాల్లో విలీనం కానుంది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఓ కోలా భాస్కర్, పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్, దాదాపు 40 మంది అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వేద పండితులు ఈ కార్యక్రమ నిర్వహణకు ఉదయం 6.55 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. ఆలయ ప్రస్తుత కార్యనిర్వహణాధికారి, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ టీటీడీ అధికారులకు ఆలయ నిర్వహణ బాధ్యతతోపాటు ఆలయ ఆస్తులన్నింటినీ అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు టీటీడీలో విలీనమైన ఆలయాల పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల నుంచి లడ్డూలు తెప్పించి విక్రయించడం మినహా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. ఒంటిమిట్ట రామాలయం కూడా ఆ జాబితాలో చేరిపోతుందా అనే భయం వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీ మేరకు ఈ ఆలయాన్ని ప్రభుత్వమే అభివృద్ధి చేసి ఉంటే బావుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొర వినరా... జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2006 సెప్టెంబరు 10న టీటీడీ విలీనం చేసుకుంది. అనంతరం వేంపల్లె గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని, జమ్మలమడుగు శ్రీ నారాపురస్వామి దేవాలయం, తాళ్లపాక ఆలయాలను కూడా విలీనం చేసుకున్నారు. అనంతరం ఏడు సంవత్సరాలు అభ్యర్థించగా, అర్చకులకు మాత్రం పే స్కేల్ మంజూరు చేశారు. కానీ, దేవుని కడప ఆలయంలోని 13 మంది, గండి క్షేత్రంలోని 12 మంది దిగువ స్థాయి ఉద్యోగులను మాత్రం సంస్థలో విలీనం చేయలేదు. టీటీడీలో విలీనమైనపుడు వీరితోపాటు ఇతర ఆలయాల్లో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈఓ స్థాయి పదోన్నతులు సాధించి మంచి జీతం తీసుకుంటున్నారు. కానీ, పైన పేర్కొన్న విలీన ఆలయాల్లోని ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ కేవలం రూ.5 వేలు మాత్రమే వస్తోంది. దీంతో ఎలా బతకాలని వారు ఎనిమిదేళ్లుగా మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జీతాలు చాలక గండి క్షేత్రంలోని ఓ చిరుద్యోగి ఆలయ ఆవరణంలోనే 2013లో ఆకలి బాధతో మరణించాడు. దేవుని కడపలో పూర్తి స్థాయి సర్వీసు అందించిన వేద పండితుడు ప్రస్తుతం ఎలాంటి పెన్షన్ బెనిఫిట్ లేకుండానే ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఇదే ఆలయంలో 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులు కూడా ఎలాంటి పెన్షన్ బెనిఫిట్లు లేకుండా రిక్త హస్తాలతో ఉద్యోగ విరమణ చేశారు. దెబ్బ మీద దెబ్బ తమ వేతనం పెంచాలని చిరుద్యోగులు విన్నవిస్తున్న తరుణంలో ఇలాంటి వారందరినీ తొలగిస్తున్నామని జనవరిలో టీటీడీ తేల్చిచెప్పింది. సొసైటీగా ఏర్పడితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటామని చెప్పింది. దీనిపై కోర్టుకెళ్లిన బాధిత ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఫలితం శూన్యం. ఈ దశలో వీరు కాపునాడు నేత నారాయణస్వామి రాయల్ ద్వారా జూన్లో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి తమ బాధను విన్నవించుకున్నారు. ఆయన వీరి వేతనం పెంచడానికి అంగీకరించినా అందుకు సంబంధించి ఆదేశాలు వెలువడలేదు. నేడు ఒంటిమిట్ట రామయ్య సన్నిధిలో మరో సారి ఆయన్ను కలిసి ఈ ఉద్యోగులు వినతిపత్రం అందజేయనున్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై పోరాటం
ఏపీఎస్జీవోఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు విజయవాడ : వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీఎస్జీవోఈఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక రాఘవయ్య పార్కు సమీపంలోని యూటీఎఫ్ హాలులో జిల్లా కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, పీఆర్సీ ఇవ్వాలని కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద ధర్నా చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు వరకు దశల వారీగా ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన కమిటీ జిల్లాలో కేవలం 442 మంది కార్మికులే ఉన్నారని పేర్కొందని తెలిపారు. అన్ని శాఖల్లో కాంట్రాక్టు కార్మికులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.విజయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో 15వేల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారని తెలిపారు. రాజకీయ కారణాలతో కొన్ని శాఖల్లో కార్మికులను తొలగిస్తున్నారని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో సిబ్బందిని ఫెడరేషన్గా ఏర్పాటు చేసి, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ సదస్సులో ఫెడరేషన్ నాయకులు నాంచారయ్య, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులు ఔట్!
సాక్షి, హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ ఉద్యోగులే కాదంటోంది విద్యుత్ సంస్థ. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇది తెలుసుకున్న ఆ ఉద్యోగులు హైదరాబాద్లోని విద్యుత్ సౌధాలో మంగళవారం ఆందోళన చేశారు. ఏపీ జెన్కోలో పనిచేస్తున్న 15 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని తొలగిస్తూ హెచ్ఆర్ అధికారులు ఆదేశాలు సిద్ధం చేశారు. ఇది లీకవడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హెచ్ఆర్ డెరైక్టర్ ఎ.వెంకటేశ్వరరావును ఆయన చాంబర్లోనే నిలదీశారు. తొలగింపు ఆదేశాలు సిద్ధమైనప్పటికీ జెన్కో ఎండీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, కంగారు పడవద్దంటూ ఆయన ఆ ఉద్యోగులకు నచ్చజెప్పారు. ఈ 15 మందిని తెలంగాణ జెన్కోకు పంపించే ప్రయత్నం చేస్తామని ఆయన భరోసా ఇవ్వడంతో ఉద్యోగులు కొంత శాంతించారు. కానీ లిఖితపూర్వక హామీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే, గత కొద్ది రోజులుగా జిల్లాల వారీగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ల్లో ఉన్న ఔట్సోర్సింగ్ సిబ్బంది జాబితాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. వీళ్లను రాజకీయ కోణంలో విభజన చేస్తున్నారని తెలిసింది. టీడీపీ హయాంలో తీసుకోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసివేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నట్టు తెలియవచ్చింది. ఈ క్రమంలో దాదాపు 9 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసివేసే యోచనలో విద్యుత్ సంస్థలున్నట్టు తెలిసింది. -
‘బాబు’కు పవరు.. జాబుకు ఎసరు
మండపేట :గృహ నిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నట్టుండి నిరుద్యోగులుగా మారిపోయారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్న ప్రచారం కేవలం ఎన్నికల లబ్ధి కోసమేనని రుజువు చేస్తూ ఆ శాఖలో 172 మందిని ఒక్క సంతకంతో నిరుద్యోగులుగా మార్చేశారు. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో జిల్లాలోని 172 మందికి హౌసింగ్ శాఖలో ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పిం చారు. వీరిలో 28 మంది కంప్యూటర్ ఆపరేటర్లు కాగా మిగిలినవారు వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు. వీరికి హైదరాబాద్కు చెందిన ఎంకే ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా ఒక్కొక్కరికి జీతాలు అందజేసేవారు. కంప్యూటర్ ఆపరేటర్లు గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఫీడ్ చేయడంలో వీరు కీలక భూమిక పోషిస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్లు కూడా నిత్యం క్షేత్రస్థాయిలో తిరుగుతూ శాఖకు సంబంధించిన పనులు సకాలంలో సక్రమంగా పూర్తి అయ్యేందుకు దోహదపడ్డారు. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వీరిని చంద్రబాబు సీఎం కాగానే ఉద్యోగాలనుంచి తొలగిస్తూ 2014 అక్టోబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నవంబర్ నుంచి హౌసింగ్శాఖలో ఇందిరమ్మ ఇళ్ల జియో టాగింగ్ ప్రక్రియ మొదలు కావడంతో వారిని తాత్కాలికంగా కొనసాగించారు. ప్ర స్తుతం జియో టాగింగ్ పూర్తి కావడం తో వారిని తొలగిస్తూ ఈనెల 26న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగులకు ఆ విషయం ఆన్లైన్ ద్వారా సోమవారం తెలిసింది. దీంతో 172 మంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారిపై ఆధారపడ్డ కుటుంబాలు నడిరోడ్డున పడే దుస్థితి దాపురించింది. ఉన్న ఉద్యోగాలే ఊడగొడతారా? ఎనిమిది సంవత్సరాలుగా అరకొరజీతాలతో ప్రభుత్వానికి సేవలందించిన వారి శ్రమ నిష్పలంగా మిగిలింది. ఇంతకాలం సేవలు చేయించుకున్న ప్రభుత్వ పెద్దలు కనికరం లేకుండా ఉన్నట్టుండి రోడ్డుమీదకు నెట్టేశారని వారు ఆవేదన చెందుతున్నారు. తమపైనే ఆధారపడ్డ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. బాబు వస్తే కొత్త ఉద్యోగాలు రావడం మాట అటుంచితే ఉన్న ఉద్యోగులనే నిరుద్యోగులను చేయడం దురదృష్టకరమని వాపోతున్నారు. ప్రభుత్వం తమ కష్టాలను దృష్టిలో ఉంచుకుని తమ ఉద్యోగాలను తమకు ఇప్పించాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో ఆందోళనబాట పట్టడం తప్ప తమకు మరోమార్గం కానరావడం లేదంటున్నారు. ఈ దిశగా కార్యాచరణకు సోమవారం విజయవాడలో సమావేశ మయ్యారు. -
అంతా మాకు తెలియాలి..!
కేయూ ఉద్యోగుల వివరాలు అడిగిన తెలంగాణ ప్రభుత్వం కేటగిరీల వారీగా జాబితా అందించాలని ఆదేశాలు లెక్కలు అందించిన తర్వాతనే బ్లాక్ గ్రాంట్ మంజూరు వివరాల సేకరణలో ఇన్చార్జి రిజిస్ట్రార్ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో పారదర్శక పాలన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీలో ఎంతమంది పనిచేస్తున్నారనే వి షయంపై వివరాలు అందించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్చార్జి రిజిస్ట్రార్ రంగారావు వివరాల సే కరణలో నిమగ్నమయ్యారు. కాగా, ప్రభుత్వం అడిగిన వివరాలతో ఫిబ్రవరికి సంబంధించిన వేతనాల విడుదలకు బ్రే క్ పడింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కేయూ సమస్యలతో సతమతమవుతుంది. రెగ్యు లర్ వీసీ లేకపోవడంతో యూనివర్సిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతోపాటు దినసరి వేతన ఉద్యోగులను ఇష్టారాజ్యంగా నియమించుకోవడంతో సమస్యలు త లెత్తుతున్నాయి. కాగా, యూనివర్సిటీకి ఏటా రూ.48 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరవుతున్నా అవి పూర్తిగా సరిపోవడంలేదు. ఈ క్రమంలో యూనివర్సిటీలో అసలు ఎంతమంది టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.. పెన్షన ర్లు, కాంట్రాక్ట్, దినసరి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది.. సెల్ఫ్ ఫైనాన్స ద్వారా నిర్వహిస్తున్న కోర్సులు, వా టి ఆదాయం, ఖర్చులు, ఫిక్స్డ్ డి పాజిట్లు, 2014-2015 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఎన్ని నిధులు పొందారనే వివరాలను తెలుపాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించి ఇన్చార్జి రిజిస్ట్రార్కు పంపించింది. అలాగే ప్రస్తుతం కావాల్సిన పో స్టుల మంజూరు, దినసరి వేతన ఉద్యోగులను ఏయే సంవత్సరంలో ఎంతమందిని నియమించుకున్నారో తెలుపాలని కోరింది. కాగా, ప్రభుత్వం అడిగిన వివరాలను స్పష్టంగా తెలియజేస్తేనే బ్లాక్ గ్రాంట్ మంజూరు కానుంది. రూ. 17 కోట్లు బ్లాక్గ్రాంట్ మంజూరు.. కాగా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.17 కోట్లు బ్లాక్ గ్రాంట్ కింద మంజూరు చేసింది. వాస్తవంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్లో పనిచేస్తున్న ఉద్యోగులు విరమణ పొందినా అందుకు సంబంధించిన వివరాలు ప్రభు త్వానికి తెలియజేయకుండా మొత్తం పోస్టుల మంజూరు పేరిట అధికారులు బ్లాక్ గ్రాంట్ను విడుదల చేసుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం గతం లో, ఇటీవల భర్తీ చేసిన పోస్టుల వివరాలను కూడా అడుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా, 2013-2014 కే యూ బడ్జెట్ నివేదిక ప్రకారం అధ్యాపకులకు ఏడాదిపాటు వేతనాలు చెల్లింపులకు రూ 33.86 కోట్లు, నాన్ టీచింగ్ వేతనాలకు రూ.17.80 కోట్లు, పెన్షనర్లకు రూ. 6.50కోట్లు, దినసరి వేతన ఉద్యోగుల్లో కొందరికి యూనివర్సిటీ నుంచి చెల్లించేది రూ. 6.32 కోట్లుగా.. మొత్తంగా రూ. 83.98 కో ట్లు కాగా అప్పటిప్రభుత్వం విడుదల చేసిన బ్లాక్ గ్రాంట్ రూ.48 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో మిగతా లోటు రూ. 36 కోట్ల భారాన్ని దూరవిద్య కేంద్రం, పరీక్షల వి భాగం, అడ్మిషన్ల డెరైక్టరేట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, ఇతర యూనివర్సిటీల కాలేజీల నుంచి వచ్చిన ఆదాయం ద్వారా సమకూర్చుకున్న పరిస్థితి ఉంది. 223 మంది దినసరి ఉద్యోగుల నియామకం.. యూనివర్సిటీ కాలేజీల్లోనూ, వివిధ విభాగాల్లోనూ లం ప్సమ్, దినసరి వేతన ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. కాగా, గత మూడేళ్లలో 223 మంది దినసరి వేతన ఉద్యోగులను ఇష్టారాజ్యంగా నియమించినట్లు సమాచారం. అయి తే వారు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ విభాగాల నుంచే సంబంధిత అధికారులు వేతనాలు ఇస్తున్నారు. ఇంకా కొందరి ఉద్యోగుల లెక్కలు యూనివర్సిటీ అధికారుల వద్దలేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని కేటగిరీల ఉద్యోగుల వివరాలు ఆదాయం, ఖర్చులన్ని ప్రభుత్వం లేఖ ద్వారా అడగడంతో ఇన్చార్జి రిజిస్ట్రార్ వాటిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, యూనివర్సిటీ కాలేజీలకు, క్యాంపస్లోని అ న్ని బ్రాంచ్ల హెడ్లకు లేఖను పంపుతూ మీమీ వద్ద పనిచేస్తున్న కేటగిరీల ఉద్యోగుల వివరాలు, దినసరి, లంప్సమ్ ఉద్యోగులతో సహా కాంట్రాక్ట్, పార్ట్టైం ఉద్యోగుల పేర్లతో ఈనెల 10లోగా తమకు పంపాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. టీచింగ్నాన్, టీచింగ్ ఉద్యోగుల సంఖ్య.. కేయూలో టీ చింగ్ పోస్టులు మంజూరైనవి 382. ఇందులో ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల సంఖ్య 236. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు 146 వరకు ఉన్నాయి. కాగా, నాన్టీచింగ్ ఉద్యోగులు వివిధ కేటగిరీల్లో కలిపి 634 పోస్టులు మంజూరుకాగా, ప్రస్తుతం 488 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతోపాటు దినసరి, లం ప్సమ్ ఉద్యోగులు 450 మంది వరకు పనిచేస్తున్నారు. వేతనాలు ఇచ్చేందుకు ప్రత్నామ్నాయ మార్గాలు.. బ్లాక్ గ్రాంట్ మంజూరు కాకపోవడంతో ఫిబ్రవరి వేతనాలు ఇంకా విడుదల కాలేదు. దీంతోఅధికారులు ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి వేతనాలు చెల్లించాలం టే రూ. 6.50 కోట్ల వరకు అవసరం ఉంది. ఇదిలా ఉండగా, దూరవిద్యా కేంద్రం ద్వారా తమకు రూ. 2కోట్లు కావాలని ఇన్చార్జి రిజిస్ట్రార్ రంగారావు కోరారు. కాగా, దీనిపై దూరవిద్యా కేంద్రం ఇన్చార్జి డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ దినేష్కుమార్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
గుంటూరు : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా ఔట్ సోర్సింగ్లో విధులు నిర్వర్తిస్తున్న వారందరికి రెగ్యులరైజ్ చేయ్యాలని కోరుతూ శాఖ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.భాస్కరరావు, జిల్లా నాయకులు వై.బాలకృష్ణలు ఆ శాఖ కమీషనర్ ఐ.శ్రీనివాసకు వినతి పత్రం అందజేశారు. స్దానిక బ్రాడిపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై్సజ్ శాఖ రాష్ట్ర కమీషనర్ ఐ.శ్రీనివాస విచ్చేసిన సంధర్బంగా శాఖ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ అధ్యక్షులు, జిల్లా నాయకులు గౌరవ పుర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా శాఖ రాష్ట్ర ఔట్సోర్సింగ్ అధ్యక్షులు ఎ.వి.భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఔట్సోర్సింగ్లో 76 మంది విధులు నిర్వర్తిస్తున్న వారందరికి రెగ్యులైజ్ కాని కాంట్రాక్ట్ కింద మంజూరు చేయ్యాల్సిందిగా కోరారు. అలాగే ఔట్సోర్సింగ్ సిబ్బందికి ట్రజరీ ద్వారా జీత భత్యాలు అందేలా చర్యలు తీసకోవాలని ఎజెన్సీల పద్ధతిని రద్దు చేయ్యాలని కోరారు. అదే విధంగా చాలా కాలంగా శాఖలో విధులు నిర్వర్తిస్తున్న వారందరికి కూడా జీత్చాలు పెంచే ప్రక్రియ పై దృష్టి సారించాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. స్పందిచిన కమీషనర్ శ్రీనివాస ఔట్ సోర్సింగ్ సిబ్బంది పై ఇచ్చిన వినతి పత్రం పై పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. -
జీతాల కోసం ట్యాంక్ ఎక్కారు
-
నోటీసులతోనే సరా..!?
నల్లగొండ టుటౌన్ : మెప్మా..కింద నిరుద్యోగులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన శిక్షణ సంస్థలు భంక్షణ సంస్థలుగా మారి అందినకాడికి వెనకేసుకున్నాయి. దీనిపై మెప్మా రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణ జరిపి 14 లక్షల రూపాయలు పక్కదారి పట్టినట్లు తేల్చారు. ఈ అక్రమాలకు ఓ రెగ్యులర్ ఉద్యోగి, ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 16 శిక్షణా సం స్థలు బాధ్యులని నివేదికలో చూపారు. వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది..ఆ తర్వాత చర్యలు తీసుకోవడం మానేశారు. నోటీసులు ఇచ్చి నాలుగు నెలలైంది. నేటికీ దాని ఊసే లేదు. ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా మున్సిపల్ పట్టణాలు, నగర పంచాయతీలలో ఏర్పాటుచేసిన కొన్ని శిక్షణ సంస్థలు ఎలాంటి శిక్షణలు ఇవ్వకుండానే నిధులను బొక్కారనే ఆరోపణలు తీవ్రంగానే వచ్చాయి. దీంతో 2012-13 సంవత్సరంలో విచారణ జరిపారు. మొత్తం 16 సంస్థలకు అక్రమాలలో భాగస్వామ్యం ఉందని తేల్చారు. ఏకంగా 14లక్షల రూపాయల అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. వీటిపై సంబంధిత శిక్షణా సంస్థలకు మెప్మా అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే నోటీసులు ఇచ్చి నాలుగు నెలలైంది. కొన్ని సంస్థలు మాత్రమే వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మిగతావి చడీచప్పుడు లేకుండా ఉన్నాయి. కాగా, అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత సంస్థల నుంచి డబ్బులు రికవరీ చేయకుండా నోటీసులతోనే సరిపెట్టడం ఏమిటనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు నోరు మెదపడంలేదు. 14 లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడిన సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంత ర్యమేమిటో అధికారులకే తెలియాలి. కేవలం ఇద్దరిపైనే చర్యలు తీసుకోని మిగతా వారిని వదిలేయడంపై అనుమానాలకు తావిస్తోంది. అధికారుల చోద్యం.. జిల్లాలోని నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సిన మెప్మా సిబ్బంది, శిక్షణా సంస్థలు అడ్డదారిలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయినా ఈ తతంగాన్ని కొంతకాలం పాటు మెప్మా పీడీలు తొక్కిపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత వచ్చిన ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తించిన అధికారి ఆ ద స్త్రం దుమ్ము దులిపి ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇటీవల విధుల నుంచి తప్పించారు. కానీ దుర్వినియోగం అయిన ప్రభుత్వ నిధులను రికవరీ చేయడంలో సంబంధితశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పై స్థాయి అధికారుల పాత్రపైనా..? మెప్మా ద్వారా ఇచ్చే శిక్షణలో జరిగిన అవినీతి అక్రమాలలో కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారా.. లేక పై స్థాయి అధికారుల పాత్రలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అప్పడు ఇక్కడ పనిచేసిన (ఇప్పుడు బదిలీపై వెళ్లాడు) ఓ అధికారి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చినా దాని గురించి మాత్రం అంత లోతుగా వెళ్లనట్లు తెలుస్తోంది. 2011-12 సంవత్సరంలో ఇచ్చిన శిక్షణల మీద కూడా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయట బడే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. కాగా పై స్థాయి వారిని కాపాడడానికే ఇద్దరిని తొలగించి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికైనా దుర్వినియోగం అయిన డబ్బులను రికవరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంస్థల నుంచి సమాధానం రాలేదు అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న సంస్థలకు నోటీసులు జారీ చేశాం. కానీ వారిలో కొంతమంది మాత్రమే సమాధానం ఇచ్చారు. మెజార్టీ వారు ఎలాంటి సమాధానం పంపలేదు. వీరిపై కలెక్టర్కు నివేదిక పంపిస్తాం. ఆ తరువాత వారిపై చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాసరాజు, మెప్మా ఏఓ -
అవసరంలేని వారిని తీసేస్తున్నాం:యనమల
-
‘తాత్కాలిక’ ఊరట
విజయనగరం క్రైం: జిల్లా గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఊరట లభించింది. ఆరు నెలలుగా వీరి కొనసాగింపు విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ఉద్యోగం ఉంటుందో? ఊడుతుందో తెలియక ఆ ఉద్యోగులు ప్రతిరోజూ బితుకుబితుకు మంటూ విధులు నిర్వహించారు. అయితే వీరిని జియోట్యాగ్ రూపంలో అదృష్టం వరించింది. గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జూన్ నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు జూలై నెలాఖరువరకు జీతం లేకుండా విధులునిర్వహించారు. అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు చేపట్టడంతో ప్రభుత్వం పునరాలోచించి వారిని కొనసాగించింది. ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన గృహాలపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వీరి సేవలు అవసరమయ్యాయి. మళ్లీ మండలానికి ఇద్దరుచొప్పున వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండాలని నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ వర్క్ ఇన్స్పెక్టర్లు 17మంది మాత్రమే ఉండగా మిగతా 51మందిని అవుట్ సోర్సింగ్ ఇన్స్పెక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. జిల్లావ్యాప్తంగా 89మంది ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండగా వారిలో ఎటువంటి రిమార్కులు లేనివారిని, సీనియార్టీ ఉన్నవారిని తీసుకోవాలని మిగతా 2వపేజీలో ఠ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రాజకీయ ఒత్తిళ్లు.. సిన్సియార్టీ, సీనియార్టీ ప్రకారం కొంతమందిఉద్యోగులను విధుల్లోకితీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో రాజకీయ నాయకుల ఒత్తిళ్లుఅధికారులపై వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేలు,ముఖ్యనాయకులవద్దకు వెళ్లి ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డబ్బులు సమర్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. జియోట్యాగ్ అంటే.. ఇందిరమ్మపథకంలో నిర్మాణం జరిగిన ఇళ్లకు ఫొటోలను తీయాలి. గతంలో ఇంటి ఫొటోను మాత్రమే తీశారు. అలాకాకుండా నిర్మాణం జరిగినప్రతి ఇంటితోపాటు ఎవరిపేరున మంజూరైతే వారి ఫొటోను చిత్రీకరించాలి. జిల్లావ్యాప్తంగా జియో ట్యాగ్ చేయడానికి 87టీంలను నియమించారు. టీంకు ఇద్దరుచొప్పున ఉంటారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 20,000ఇళ్లకు జియో ట్యాగ్ చేస్తారు.నిర్మా ణంలో ఉన్నవి పూర్తయినతర్వాత గతంలో నిర్మాణమైనవాటికి జియోట్యాగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఐదుగురు తప్ప.. ‘జిల్లాలో జియోట్యాగ్ విధానం డిసెంబర్ 8నుంచి అమలుచేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆరోపణలు, కేసులు ఉన్న ఐదుగురిని విధుల్లోంచి తొలగిస్తాం. మిగతావారిని కొనసాగిస్తాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యతను మెగ్మా ఏజెన్సీకి ప్రభుత్వం అప్పగించింది’. సీహెచ్యుకె.కుమార్, జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ -
ప్రైవేట్ ఉద్యోగులూ అర్హులే..
రేషన్ కార్డులపై సర్కార్ స్పష్టత వార్షిక ఆదాయ పరిమితి రూ.2 లక్షలకు పెంపు వచ్చే నెలలో కార్డుల జారీ! సిటీబ్యూరో:గ్రేటర్ హైదరాబాద్లో ఆహారభద్రతా (రేషన్) కార్డులకు ప్రైవేటు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అర్హులేనని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా యంత్రాంగాలకు ఆదివారం ఈ ఆదేశాలు అందాయి. ఏడాదికి రూ.2 లక్షల ఆదాయ పరిమితినే ప్రాతిపదికగా తీసుకొని అర్హులకు కార్డులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులు సూచించారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే, వాటిపై పరిశీలనాధికారి పరిశీలించి సంతృప్తి చెందితే కార్డులు జారీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్లో 9,40,437 దరఖాస్తులు రాగా అందులో 56 వేలు, రంగారెడ్డి జిల్లాలో 13,68,039 దరఖాస్తులకు గాను 3,67,775 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. గతంలో పరిశీలన జరిపిన దరఖాస్తులకు కొత్త పరిమితుల మేరకు పునఃపరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆహార భద్రత కార్డుల జారీలో ఎలాంటి అవకతవకలు జరిగినా.. అర్హులకు అందకున్నా, అనర్హులకు అందినా పూర్తిగా పరిశీలనాధికారే బాధ్యుడని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. కార్డుల జారీపై వినతుల స్వీకరణకు గ్రీవెన్స్ సెల్, సీనియర్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సర్కార్ సూచించింది. వచ్చే నెలలో నూతన కార్డులను జారీ చేసే అవకాశం ఉంది. పెరగనున్నబియ్యం కోటా.. ఆహార భద్రత కార్డు కింద యూనిట్కు బియ్యం కోటా పెరగనుంది. ఇప్పటివరకు రేషన్ కార్డులో యూనిట్కు నాలుగు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేసేవారు. ఆహార భద్రత కార్డు కింద ఒక్కో సభ్యుడికి (యూనిట్) ఆరు కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. కార్డుకు ఐదు యూనిట్లు వరకే పరిమితి చేశారు. కార్డుకు గరిష్టంగా 30 కిలోలు అందజేస్తారు. -
ఇదేమి న్యాయం
ప్రొద్దుటూరు క్రైం: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. జిల్లాలో పని చేస్తున్న 90 మంది ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రొద్దుటూరులోని జిల్లా అస్పత్రిలో యూనియన్ నాయకులతో పాటు పలువురు ఉద్యోగులు గదులకు తలుపులు వేసుకుని ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. జిల్లాలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు రాయచోటి, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, లక్కిరెడ్డిపల్లెలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు ఉన్నాయి. కడపలో ఉన్న డీసీహెచ్ఎస్ కార్యాలయం కూడా దీనికిందికే వస్తుంది. ఈ ఆస్పత్రుల్లో సుమారు 163 మందికిపైగా ఉద్యోగులు ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. చాలీచాలని జీతాలు ఇస్తున్నాప్పటికీ భవిష్యత్తులో ఉద్యోగాలు క్రమబద్దీకరణ జరుగుతాయనే ఆశతో 15 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ చివరినాటికే ఔట్సోర్సింగ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆయా ఆస్పత్రుల్లోని సిబ్బంది అందరూ జూలై 1 నుంచి యధావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలలు పూర్తయినా వారికి గడువు పొడిగింపు ఉత్తర్వులు రాలేదు. కాస్త ఆలస్యంగానైనా వస్తాయని అందరూ భావించారు. నాలుగు నెలల జీతం ఇవ్వకపోగా అనూహ్యంగా వారిని తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యూరుు. అన్ని ఆస్పత్రుల్లో నిరసన జ్వాలలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఏపీవీవీపీ ఆస్పత్రుల్లోని ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంతో రగలిపోతున్నారు. తాజాగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ నుంచి అందిన ఆదేశాల మేరకు కడప డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఒక పోస్టు మాత్రమే ఇచ్చారు. అలాగే రాయచోటిలో 8, పులివెందులలో 8, ప్రొద్దుటూరులో 42, రాజంపేటలో 8, లక్కిరెడ్డిపల్లెలో 6 మందికి మాత్రమే అనుమతి లభించింది. అన్ని ఆస్పత్రుల్లో సగం మందికిపైగా ఉద్యోగాలు కోల్పోవడంతో వారు రోడ్డున పడాల్సి వచ్చింది. ప్రొద్దుటూరులో ఆమరణ దీక్షకు పూనుకున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలు గల్లంతయ్యాయని తెలియడంతో ఔట్సోర్సింగ్ కార్మికులు బుధవారం ఉదయం నుంచి విధులకు హాజరు కాలేదు. డీసీహెచ్ఎస్ రామేశ్వరుడుకు ఫోన్ చేసి యూనియన్ నాయకులు సమాచారం తెలుసుకున్నారు. డీసీహెచ్ఎస్ ఆస్పత్రికి వచ్చిన తర్వాత యూనియన్ నాయకులతోపాటు సిబ్బంది కలిశారు. ప్రభుత్వం నుంచి ఇప్పుడే తనకు మెయిల్ వచ్చిందని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రద్దవుతున్నాయని తెలిసి చాలా బాధపడుతున్నానని డీసీహెచ్ఎస్ వారితో అన్నారు. మీ సానుభూతి మాకు అక్కర్లేదు... మీరు మాకు ఇచ్చిన వాగ్ధానాలు ఏమయ్యాయని యూనియన్ నాయకులు ఆయనను నిలదీశారు. ఇది మొదటి జాబితా మాత్రమేనని రెండో జాబితాలో మరికొందరి పేర్లు వచ్చే అవకాశం ఉందని డీసీహెచ్ఎస్ ఉద్యోగులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. యూనియన్ నాయకుడు రామ్మోహన్రెడ్డితోపాటు మరికొందరు ఆస్పత్రి ప్రాంగణంలో కూర్చొని నిరసన తెలిపారు. అలాగే మరో యూనియన్ నాయకుడు శివకృష్ణ, రాజులతోపాటు 20 మంది సిబ్బంది గదిలో తలుపులు వేసుకుని ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఉద్యోగులందరినీ పూర్తిస్థాయిలో విధుల్లో తీసుకునేంత వరకు గదిలో నుంచి బయటికి రామన్నారు. ఒక వేళ ఎవరైనా మమ్మల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పక్కనే పెట్రోలు బాటిళ్లు పెట్టుకుని ఉన్నామని, ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనుకాడమని వారు హెచ్చరించారు. పోలీసులు పలుసార్లు వారి గది వద్దకెళ్లి పరిశీలించారు. ముఖ్యమైన సేవలు కొనసాగేదెలా.. ఆస్పత్రిలో దోబీ, బార్బర్, ఎలక్ట్రీషియన్తోపాటు పలు ఔట్సోర్సింగ్ పోస్టులు రద్దయ్యాయి. ఆపరేషన్ జరగాలంటే బార్బర్, దోబీ అవసరమని వైద్యులు అంటున్నారు. వీరు లేకుంటే ఆపరేషన్ చేయడం చాలా కష్టమని తెలిపారు. అలాగే ఇంత పెద్ద ఆస్పత్రికి ఎలక్ట్రీషియన్ అవసరం ఉందన్నారు. ఉన్న ఒక్క ఎలక్ట్రీషియన్ను తొలగిస్తే ఎలా అని వైద్యులే అంటున్నారు. రెండో రోజుల క్రితం ఉన్నట్టుండి ప్రసూతి వార్డులో విద్యుత్ సరఫరా ఆగిపోగా రాత్రంతా ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఓ డాక్టర్ తెలిపారు. కాగా 106 మందిలో కేవలం 42 మంది ఔట్సోర్సింగ్, 8 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. గురువారం నుంచి దీర్ఘకాలిక సమ్మెకు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వైద్యసేవలు కొనసాగించేది లేదని వారు కరాఖండిగా చెప్పారు. -
కాంట్రాక్టర్ల కర్రపెత్తనం
సాక్షి, రాజమండ్రి :రాజమండ్రి నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం నుంచి అభివృద్ధి పనుల వరకూ అన్నింటిలో వారిదే పెత్తనం. వివిధ విభాగాల్లో దీర్ఘకాలంగా కాంట్రాక్టులు నిర్వహిస్తున్న వారు రింగై కొత్త వారిని రాకుండా చూస్తుంటే.. ఎవరూ రాలేదు కాబట్టి పాత వారికే ఇస్తున్నామని అధికారులు సాకులు చూపుతున్నారు. తిష్ట వేసిన కాంట్రాక్టర్లకు సహకరిస్తున్న కొందరు అధికారులు వారి చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడుతున్నారు. తమపై దాడులు చేస్తున్నా మిన్నకుంటూ, వారికే కొత్త కాంట్రాక్టులు కూడా అప్పగించేస్తున్నారు.ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో 899 మంది, కంప్యూటర్ ఆపరేటర్లుగా 17 మంది, మంచినీటి సరఫరా, విద్యుత్తు దీపాల నిర్వహణా విభాగాల్లో 164 మంది, ప్రధాన కార్యాలయంతో పాటు పలు పాఠశాలల్లో సెక్యూరిటీ గార్డులుగా 20 మంది పని చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకానికి ప్రతి ఏడాదీ టెండర్లు పిలిచి నిబంధనల ప్రకారం ఏజెన్సీలకు అప్పగించాలి. కానీ కాంట్రాక్టర్లు అధికారులను మచ్చిక చేసుకుని, చక్రం తిప్పుతున్నారు. టెండర్లలో ఎవరూ పోటీ రాకుండా చూసుకుంటున్నారు. 2012లో పాలక మండలి రద్దయ్యాక అధికారులు ఇష్టారాజ్యంగా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టును పొడిగిస్తూ వచ్చారు. ఈ వ్యవహారం విమర్శలకు దారితీసినా ఖాతరు చేయలేదు. ఈ ఏడాది జూలై మూడు నుంచి కొత్త పాలక వర్గం రావడంతో పరిస్థితులు మారతాయనుకున్నా..అధికారులు వంకలు చూపుతూ పాత కాంట్రాక్టర్లకే ఎర్ర తివాచీ పరుస్తున్నారు. గత కొనసాగింపుల అనంతరం ఈ ఏడాది జూలై 31తో ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు పూర్తవగా మరోసారి కొనసాగింపు కోసం తీర్మానాలను కౌన్సిల్ ముందు ఉంచారు. తాము 2014-15లో ఔట్ సోర్సింగ్ సేవలకు 2013 డిసెంబరులో టెండర్లు పిలిచినా ఎవరూ రాకపోవడంతో పాత వారినే కొనసాగిస్తున్నామని కౌన్సిల్ కు చెప్పుకొచ్చారు. కౌన్సిల్ కాదన్నా.. ఈ ఏడాది జూలై 27 జరిగిన కౌన్సిల్ తొలి కౌన్సిల్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొత్తగా టెండర్లు పిలిచి నియమించాలని తీర్మానించారు. కాంట్రాక్టు సంస్థలు ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నాయని, ఒక్కో పారిశుధ్య కార్మికుడికి తమ ద్వారా కార్పొరేషన్లో ఉద్యోగం ఇవ్వాలంటే రూ.40 వేల వరకూ వసూలు చేస్తున్నాయని కార్పొరేటర్లు ఆరోపించారు. అప్పట్లో మార్చి 2015 వరకూ వారిని పొడిగించాలనే తీర్మానాన్ని తిరస్కరించి సెప్టెంబర్ వరకూ జీతాలు చెల్లించి తర్వాత టెండర్ల ద్వారా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. కానీ గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా అధికారులు వైఖరి మార్చుకోలేదు. అన్ని విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా వేయలేదని తాజా తీర్మానంలో పేర్కొన్నారు. కార్పొరేషన్ ను గుప్పిట్లో పెట్టుకున్న కాంట్రాక్లర్లు రింగై కొత్త వారిని రానివ్వకపోవడం ఔట్ సోర్సింగ్కే పరిమితం కాలేదు. వారే పదే పదే అన్ని టెండర్లలో పాల్గొంటూ పనులు దక్కించుకుంటున్నారు. కాంట్రాక్టర్ తమ్మయ్యనాయుడు అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుని, అనేక ఏళ్లుగా కార్పొరేషన్ పనులన్నీ తానే దక్కించుకుంటున్నాడని అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు సైతం ఆరోపించడం ఇందుకు నిదర్శనం. ఇటీవల ఇంజనీరింగు విభాగంలో డీఈఈ స్థాయి అధికారితో పాటు, మరో అధికారిణితోనూ దౌర్జన్యంగా వ్యవహరించినా అదే కాంట్రాక్టరుకు గోదావరి ఘాట్ల మరమ్మతు పనులు అప్పగించారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు కానీ, కౌన్సిల్ సభ్యులకు కానీ తెలియకపోవడం విశేషం. దీనిపై గురువారం నాటి కౌన్సిల్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈని ప్రశ్నిస్తే ఎవరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనందున చర్యలు తీసుకోలేదనడం ఆ కాంటాక్టరుకు అధికారులు దాసోహం అంటున్న తీరుకు అద్దం పడుతోందని కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులతో అతడిని బ్లాక్ లిస్టులో పెట్టినా మళ్లీ పనులు కట్టబెట్టడం గమనార్హం. పాత కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు నవంబరు 2013 నుంచి జనవరి 2014 వరకూ నగరపాలక సంస్థలో రూ.5 కోట్ల పనులు జరిగాయి. రింగైన కాంట్రాక్టర్లకు 0.01 శాతం లెస్కు టెండ ర్లు అప్పగించారు. ఆన్లైన్ టెండరింగ్ అయితే 14 శాతం వరకూ లెస్కు చేసే వారు ఉన్నా రు. దీనిపై నేను శాసనమండలిలో మున్సిపల్ మంత్రికి ఫిర్యాదు చేసినా మార్పు రాలేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం నుంచి అభివృద్ధి పనుల వరకు తక్కువకు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు. అయి నా అధికారులు పాత కాంట్రాక్టర్లతో కుమ్మైక్కవుతున్నారు. - ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ -
పని ఒత్తిడి కాదు.. రాజకీయ ఒత్తిడే!
శ్రీకాకుళం పాతబస్టాండ్: తొలగింపునకు గురైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల స్థానంలో తాము సూచించిన వారినే నియమించాలని జిల్లా మంత్రి, ప్రభు త్వ విప్ల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తుండటంతో గృహనిర్మాణ సంస్థ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. ఎవరికి వారు తాము చెప్పిన వారికే పోస్టింగులు ఇవ్వాలని పట్టుపడుతుండటంతో ఏం చేయాలో అర్థంకాక గత 40 రోజులుగా నియామక ప్రక్రియ జోలికే అధికారులు వెళ్లడం లేదు. జాప్యం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. పని ఒత్తిడి సాకుగా చూపి తప్పించుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణాలనుకూడా చేర్చి పేదలకు పెద్ద ఎత్తున ఇళ్లు మంజూ రు చేశారు. దాంతో గృహ నిర్మాణ సంస్థకు పని భారం పెరిగి అదనపు ఉద్యోగులను నియమిం చారు. అవుట్ సోర్సింగ్ విధానంలో వర్క్ ఇన్స్పెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగులను నియమించారు. ఆవిధంగా అవుట్ సోర్సింగ్ విధానంలోనే జిల్లాలో 97 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు పని చేసేవారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ వీరిని తొలగిస్తూ ఆగస్టు లో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు ఉద్యమాలు చేశారు. అధికారులు కూడా.. తొలగింపు వల్ల పనులు కుంటుపడతాయని, సిబ్బంది అవసరం ఉందంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దాంతో దిగివచ్చిన ప్రభుత్వం మండలానికి ఇద్దరు చొప్పున వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించాలని ఆగస్టు నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 38 మం డలాల్లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 76 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు అవసరమవుతారు. ఇప్పటికే 22 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నందున మిగిలిన 54 మందిని అవుట్ సో ర్సింగ్ పద్ధతిలో నియమించాల్సి ఉంది. విద్యార్హతలతోపాటు గుణగణాలు, గతంలో పని చేసి న వారి పనితీరు ఆధారంగా ఈ నియామకాలు జరపాల్సి ఉండగా.. అవన్నీ పక్కన పెట్టి తాము చెప్పిన వారికే పోస్టులు కట్టబెట్టాలని రాజకీ య ఒత్తిళ్లు పెరగడం.. ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని భీష్మించుకోవడంతో గృహనిర్మాణ సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై గృహనిర్మాణ సంస్థ పీడీ పి.ఆర్.నర్సింగరావు వద్ద ప్రస్తావించగా పని ఒత్తిడి వల్ల సకాలంలో నియామకాలు చేయలేకపోయామన్నారు. రాజకీయ ఒతి ్తళ్లు లేవని, మరో పది రోజుల్లో నిబంధనల ప్ర కారం నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. -
రాజకీయ జోక్యం!
విజయనగరం క్రైం : పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న పచ్చచొక్కా నాయకులు పదవి వచ్చిందే తడవుగా డబ్బులు సంపాదించే పనిలో పడ్డారు. జిల్లాలో ఏ శాఖలో ఉద్యోగ నియూమకాలు చేపట్టినా... తమ వారికే నియమించాలని బెట్టు చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఎలక్ట్రికల్ షిప్ట్ ఆపరేటర్ పోస్టులకు ఒకొక్కరి దగ్గర నుంచి నాలుగైదు లక్షల రూపాయలు వసూలు చేశారని స్వయాన టీడీపీ కార్యకర్తలే నాయకులపై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లా గృహ నిర్మాణ సంస్థలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ప్రస్తుతం ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులనే పనితీరు, సీనియార్టీ అధారంగా నియమించాలని గృహ నిర్మాణ సంస్థ రాష్ట్ర మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలు ఇవ్వడం ద్వారా అర్హులకు అన్యాయం జరుగుతుందని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆపరేటర్ ఉద్యోగాల నియూమకంలో రాజకీయ జోక్యం ఎక్కువైందన్న వాదన వినిపిస్తోంది. గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ వర్కు ఇన్స్పెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంట్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో పని చేస్తున్న వారి విధి నిర్వహణ, సీనియార్టీ, విద్యార్హతలను బట్టి తీసుకోవాలని ఆ శాఖ మేనేజింగ్ డెరైక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థలో వర్కు ఇన్స్పెక్టర్లు 86 మంది పని చేస్తుండగా, వీరిలో 54మందిని తీసుకునే అవకాశం ఉంది. 16 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 9 మంది అకౌంట్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో 13 మందిని మాత్రమే సీనియార్టీ, విద్యార్హతలు, పనితీరు బట్టి నియమించాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు. అయితే వీటిలో కూడా రాజకీయ జోక్యం మితిమీరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను నియమించాలని గృహ నిర్మాణశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సీనియార్టీ, ప్రతిభ ఆధారంగా కాకుండా ఎమ్మెల్యేలు అందించిన లేఖల ప్రకారం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎంపిక చేసినట్లు తెలిసింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎంపిక చేసిన ఫైలు కలెక్టర్ వద్ద ఉన్నట్లు సమాచారం. పార్వతీపురం డివిజన్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువగా ఉండడంతో అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు సీనియారిటీ, విద్యార్హతలు, పనితీరును కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చిన వారినే నియమించే అవకాశం ఉందని... అన్ని అర్హతలు ఉన్న వారు ఆందోళన పడుతున్నారు. రాజకీయ నాయకుల జోక్యం వల్ల అర్హతలు ఉన్న వారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇటీవల పార్వతీపురంలోని ఒక లాడ్జిలో క్రికెట్, పేకాట బెట్టింగ్లకు పాల్పడి పోలీసులకు చిక్కి కేసు నమోదు అయిన అకౌంట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్కు అధికార పార్టీ నాయకులు రికమండేషన్ లెటర్ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించాలని హౌసింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇదే కొనసాగితే తమకు అన్యాయం తప్పదని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
8 నెలలుగా పస్తులు
పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుంది.. ప్రభుత్వ తీరు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తారని కొత్త సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. కొన్ని విభాగాల్లో తొలగిం చారు కూడా.. పాలకులు మాత్రం అబ్బే.. అదేం లేదంటూనే చేయాల్సిన పని చేసేస్తున్నారు. తాత్కాలిక సిబ్బందిని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నెలల తరబడి జీతాల బడ్జెట్ విడుదల చేయకుండా వారిని అవస్థలపాల్జేస్తున్నారు. రెవెన్యూ శాఖలోని భూసేకరణ విభాగం సిబ్బం ది గత ఎనిమిది నెలలుగా జీతాల్లేక అలమటిస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ శాఖలో అత్యంత కీలకమైనది భూసేకరణ విభాగం. ఈ విభాగంలో సిబ్బంది కొరత ఉండటంతో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 67 మంది ఉద్యోగులను నియమించారు. తక్కువ జీతాలే అయినా గత కొన్నేళ్లుగా వీరు ఈ విభాగంలో సేవలందిస్తున్నారు. అయితే గత ఎనిమిది నెలలు గా వీరికి వేతనాలు అందడం లేదు. కారణమేమిటంటే బడ్జెట్ విడుదల కాలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. భూసేకరణ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నెలకు జీతాల బిల్లు రూ.6.03 లక్షలు. ఆ ప్రకారం ఎనిమిది నెలలకు సుమారు రూ.48 లక్షలు చెల్లించాల్సి ఉంది. గతంలో వీరికి మూడు నెలలకోసారి ప్రభుత్వం జీతాల బడ్జెట్ విడుదల చేసేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా బడ్జెట్ విడుదల చేయలేదు. కొత్త ప్రభుత్వం కూడా ఈ విషయం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి రెవెన్యూ శాఖలో 160 మంది వరకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరిలో కలెక్టరేట్, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న వారికి జీతాల సమస్య పెద్దగా లేదు. మూడు నెలలకోసారి బడ్జెట్ సర్దుబాటు చేస్తున్నారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంతోపాటు ఇతర ప్రాజెక్టుల భూసేకరణ విభాగాల్లో పని చేస్తున్న 67 మందికి చెందిన జీతాలు మాత్రం విడుదల కాకపోవడంతో వారి కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది. చిరుద్యోగులమైన తమకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే ఎలా బతకాలని ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీల చేతివాటం అసలే చిరుద్యోగాలు.. వచ్చే జీతమే తక్కువ.. అందులోనూ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు చిలక్కొట్టుడుకు పాల్పడుతుండటంతో జీతాలు అందుతున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఆవేదన చెందుతున్నారు. భూసేకరణ విభాగాల్లోని అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు అందక అవస్థలు పడుతుంటే.. జీతాలు అందుకుంటున్న మిగిలిన విభాగాల సిబ్బంది ఈ రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్కు నెలకు రూ.9వేల జీతం చెల్లించాలి. అయితే ఏజెన్సీల నిర్వాహకులు రూ.8,400 మాత్రమే చెల్లిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. వీటిని ఆయా ఏజెన్సీలే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వీరికి బడ్జెట్ విడుదల చేస్తుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు నాలుగు ఏజెన్సీలకు ఉంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను సరఫరా చేసినందుకు ప్రభుత్వం వీరికి వేరేగా కమీషన్ చెల్లిస్తుంది. అది కాకుండా కాంట్రాక్టర్లు ఒక్కో ఉద్యోగి జీతం నుంచి నెలకు రూ.600 మినహాయించుకుంటున్నారు. ఈ రకమైన దోపిడీని అరికట్టాలని పలువురు కోరుతున్నారు. డీఆర్వో వివరణ వేతన బకాయిల గురించి జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) నూర్ బాషా ఖాసీం వద్ద ప్రస్తవించగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల బడ్జెట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. విడుదలైన తక్షణమే పూర్తి జీతం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
విజయనగరం క్రైం : గృహ నిర్మాణ శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఆ ఉద్యోగులు గురువారం ధర్నా చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు నినాదాలు చేశారు. చంద్రబాబు వస్తే ఇంటికొక ఉద్యోగమని చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తొలగిస్తోందని ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జి.అప్పలసూరి విమర్శించారు. గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్లను కొనసాగించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. దర్నానుద్దేశించి మాట్లాడిన ఆయన బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం చేసి నేడు ఉన్న ఉద్యోగులను తొలగించడం సరికాదని విమర్శించారు. ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలిందన్నారు. 146 జీఓ ప్రకారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగింపు ఉత్తర్వులు విడుదల చేసి ఒక్క గృహ నిర్మాణ శాఖలోనే ఉద్యోగులను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. గృహ నిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని ఈ నెల 20 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు పి.సురేష్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అవుట్ సోర్సింగ్ విభాగంలో 2007 నుంచి ఐటీ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వర్కు ఇన్ స్పెక్టర్లు, అకౌంట్స్ అసిస్టెంట్లు, అటెం డర్లు పని చేస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పి ఇప్పుడు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇతర శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ఉద్యోగుల వలె కొనసాగిం పు ఉత్వర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు వై.శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.విష్ణువర్ధన్, కోశాధికారి జి. రాంబాబు, పి.శ్రీహరినాయుడు, జారుుంట్ సెక్రటరీలు ఎస్.రాధాకృష్ణ, ఎస్.వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ నియమించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రిమ్స్ జనరల్ ఆస్పత్రిలో ఇటీవలే తొలగించిన 10 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి నియమించాలని రిమ్స్ సిబ్బంది ఐ.ఉష, సిహెచ్.పద్మ తదితరులు గ్రీవెన్స్సెల్లో కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ను కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పలువురు సమస్యలపై వినతులు ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్, అదనపు జాయింట్ కలెక్టర్ మహ్మద్ హసీం షరీఫ్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు కల్యాణచ క్రవర్తి, తనూజారాణి, తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ సెల్కు అందిన వచ్చిన వినతుల్లో కొన్నింటిని పరిశీలించగా... నరసన్నపేట మండలం కరగాం గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వయం శక్తి సంఘంలో పొదుపు నగదు సభ్యుల ఆమోదం లేకుండా తీసుకున్నారని, ఆ నింద సబ్ ఆర్గనైజర్పై వేశారని, ఆ సొమ్మును తీసుకున్నవారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఆ గ్రూపు సబ్ ఆర్గనైజర్ టెంక ఈశ్వరమ్మ కోరారు. ఆర్టీఐ చట్టం ప్రకారం పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. సోంపేట మండలం బారువ బాలాజీ గోశాలకు గ్రామానికి మద్య రోడ్డు వేయడానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలు మంజూరు చేసిందని, రోడ్డు వేయడంలో జాప్యం జరుగుతుండడంతో ఇబ్బందిగా ఉందని గోశాల నిర్వాహకురాలు బడగల ఆదిలక్ష్మి ఫిర్యాదు చేశారు. మడ్డువలస కాలువ ఫేజ్-2కి సంబంధించి పొందూరు మండలం కేశవరావుపేట గ్రామస్తులు భూములు ఇచ్చారని, అయితే పరిహారం నేటికీ చెల్లించలేదని, 2011 నుంచి ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం కనిపించడంలేదని గ్రామానికి చెందిన ఎం. కార్లయ్య, నేతల రాజు, ఆర్.యర్రయ్య, వి.అప్పారావు, ఎల్.దుర్గయ్యతో పాటు 15 మంది ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని మహలక్ష్మినగర్ కాలనీలో మత్స్యకార సహకార సంఘం భూమి 5 ఎకరాలు ఆక్రమణకు గురైందని సంఘ అధ్యక్షుడు ఎం.నగేష్ ఫిర్యాదు చేశారు. సంతకవిటి మండలం పోతిరాజుపేట గ్రామంలోని ఒట్టి చెరువు, బట్టివాని చెరువుల్లో 5 ఎకరాలు చెరువు గుర్భాలు అక్రమణలకు గురయ్యాయని, దీంతో చెరువుల దిగువ రైతులకు సాగునీరు అందడంలేదని ఎ. అచ్యుతరావు ఫిర్యాదు చేశారు. సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ పిల్లలకు సరిపడే నిష్పత్తిలో ఉపాధ్యాయులు లేరని ఉపాధ్యాయులను నియమించాలని ఆ గ్రామానికి చెందిన పల్లి మల్లేశ్వరరావు కోరారు. ట్రైమెక్స్ను కాపాడండి కలెక్టర్కు ఉద్యోగుల వినతి శ్రీకాకుళం పాతబస్టాండ్: గార మండలం వత్సవలనలో ఉన్న ట్రైమెక్స్ సంస్థ ప్రజలతో మమేకమై ఎందరికో ఉపాధి కల్పిస్తోందని, అయితే కొంతమంది స్వార్థం కోసం సంస్థ మనుగడకు అడ్డుతగులుతున్నారని, వారి బారి నంచి సంస్థను కాపాడాలని ఉద్యోగులు కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ను కోరారు. ఈ మేరకు వారు సోమవారం గ్రీవెన్స్సెల్లో వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందు వారు సంస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ప్రతినిధులు మాట్లాడుతూ ట్రైమెక్స్ సంస్థ కార్మికులు, ఉద్యోగుల పక్షాన నిలుస్తూ సంక్షేమ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఎటువంటి పొరపాట్లు లేకపోయినప్పటికీ వత్సవలస సర్పంచ్ దాసరి కుమారి, దాసరి బొజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యుడు చీకటి చిన్నారావు తదితరులు అసత్య ప్రచారం చేస్తూ సంస్థపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ట్రైమెక్స్ వల్ల గార మండలం వత్సవలస, తోనంగి, తూలుగు తదితర గ్రామాలకు చెందిన 1400 కుటుంబాలు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. కలెక్టర్ను కలిసిన వారిలో ట్రైమెక్స్ డీజీఎం వై.భాస్కరరావు, ఎన్.రామకృష్ణ, మార్పు ప్రసాద్, పాండ్రంకి అశోక్ నాయుడు, నర్సింగరావు, బాలరాజు, వైలపల్లి రాంబాబు, పేర్ల తాతారావు, చీకటి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. -
బాబు వచ్చారు.. జాబు తీశారు
రాయవరం : ‘జాబు కావాలంటే.. బాబు రావా’ లంటూ తెలుగుదేశం ఎన్నికలకు ముందు ఊదరగొట్టింది. తీరా బాబు వచ్చాక ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నారు. హౌసింగ్ శాఖలో సంవత్సరాల తరబడి పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి విధులకు హాజరు కావద్దని వచ్చిన ఆదేశాలతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హతాశులయ్యారు. హౌసింగ్శాఖ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఆ సమయంలో 2006-07 సంవత్సరాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్లతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్ అసిస్టెంట్లు, హౌసింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఎంకేఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా వీరి నియామకం జరిగింది. అప్పటి నుంచి వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం చేయించడం, ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఉన్నతాధికారులకు తెలపడంతో ఆ శాఖలో కీలకంగా మారారు. జిల్లాలో సుమారు 218 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని సోమవారం నుంచి తొలగించారు. వీరిలో 150 మంది వరకు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్టు సమాచారం. పనులెలా నడుస్తాయి.. రాయవరం హౌసింగ్ శాఖలో ఒక ఏఈ, ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. మండలంలో ఇందిర మ్మ ఇళ్ల ప్రగతిని వీరు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తు తం తొలగించిన వారిలో ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండడంతో ఏఈ ఒక్కరే మిగిలారు. డీఈఈ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌం టెంట్ అసిస్టెంట్ పోస్టులను తొలగించడంతో డీఈఈ ఒక్కరే మిగిలారు. మంగళవారం నుంచి తొలగించిన సిబ్బందిని విధులకు హాజరు కావద్దంటూ తెలుపుతూ వారి వద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మంగళవారం నుంచి విధులు ఎలా నిర్వర్తించాలా అని రెగ్యులర్ ఉద్యోగులు మథనపడుతున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వద్ద కీలక సమాచారం ఉండడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆ శాఖ ఏఈలు పేర్కొంటున్నారు. రెగ్యులర్ సిబ్బందిని ఇవ్వకుండా వీరిని తొలగిస్తే పనులు ఎలా జరుగుతాయంటున్నారు. ఉరుములేని పిడుగులా.. ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించడం లేదం టూ రాష్ట్ర మంత్రి చేసిన ప్రకటనతో అందరితో పాటు హౌసింగ్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది కొనసాగింపునకు ఇచ్చిన ఉత్తర్వుల్లో హౌసింగ్ శాఖను చేర్చక పోవడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు వారి తొలగింపు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. సోమవారం ఉదయం ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈ వార్త ఉరుములేని పిడుగులా చేరింది. హౌసింగ్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జూన్ 28 సాయంత్రానికి రెగ్యులర్ ఉద్యోగుల సెల్ఫోన్లకు ఉన్నతాధికారులు మెసేజ్ పంపించారు. చంద్రబాబు వస్తే ఇంటికో జాబు మాట ఎలా ఉన్నా ఉన్న జాబులు తొలగించడంతో రోడ్డున పడుతున్నామని హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు గత నెల 30తో ముగిసిందని హౌసింగ్శాఖ ఇన్చార్జ్ జిల్లా మేనేజర్ విజయ్కుమార్ చెప్పారు. జూలై ఒకటి నుంచి వారిని విధుల్లోకి తీసుకోవద్దంటూ ఆదేశాలు వచ్చాయన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల తరపున పోరాటం
-
కాంట్రాక్టు ఉద్యోగుల తరపున పోరాటం
* వైఎస్ జగన్మోన్రెడ్డి ప్రకటన * బాబు సీఎం అయినప్పటినుంచీ ఉద్యోగుల్లో అభద్రతా భావం సాక్షి, పులివెందుల: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అంబ్లీలోనే పోరాటం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి బాబు వచ్చి జాబు తీసేస్తారన్న అభద్రతా భావం కాంట్రాక్టు ఉద్యోగులలో కనిపిస్తున్నదని అవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని ఐటీఐలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, జెఎన్టీయూలో పనిచేస్తున్న పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చి శుక్రవారం ఉదయం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తమ ఉద్యోగాలను రెగ్యులైజ్ చేసేందుకు కృషి చేయాలని కోరగా.. వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అవసరమైతే న్యాయపరంగా ముందుకెళతామని తెలిపారు. ఈ సమయంలో వైఎస్ జగన్తోపాటు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి ఉన్నారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
కలెక్టరేట్ : తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం పలు గ్రామాల ప్రజలు చేసిన ధర్నాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. గుడ్లవల్లేరు మండలం చంద్రాల, మండవల్లి మండలం కొవ్వాడలంక, ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామాల ప్రజలు వేరువేరు సమస్యల పరిష్కారంకోసం, ఉద్యోగభద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తొలగింపు నిర్ణయాన్ని విరమించాలి తమను తొలగించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొంది స్తోందని, వాటిని ఉపసంహరించుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. 2006 నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతిలో 169 మందిమి విధులు నిర్వర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో ఉన్న తమను తొలగించేందుకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంతో చర్చించాలని, ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంఘం నాయకులు రెడ్డి నాగేంద్రరావు, జి.శ్రీనివాసరావు, ఎ.భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మౌలిక వసతులకోసం.. మౌలిక వసతుల కోసం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామస్తులు దళిత బహుజన పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. గ్రామంలో 90 శాతం మంది కూలి పనులు చేసుకునే వారిమేనని, 2006లో కొల్లేరు ఆపరేషన్ అనంతరం జీవనభృతి లేక అనేక కష్టాల పాలు పడుతూ జీవిస్తున్నామని పేర్కొన్నారు. చేపల చెరువుల కారణంగా నీరు కలుషితమై తాగేందుకు చుక్కనీరు దొరకడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామంలో 210 మంది ఇళ్లస్థలాలు లేక రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని వివరించారు. అధికారులు తమ గ్రామాన్ని పరిశీలించి తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులు కోన శ్రీనివాసరావు, కె.పోలయ్య, ఘంటసాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాల కోసం.. ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామస్తులు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. గతంలో గ్రామస్తుల కోసం ఇళ్లస్థలాలు కేటాయించేం దుకు భూమి సేకరించారని పేర్కొన్నారు. ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించి పంచాయతీలో పేర్లను కూడా ప్రకటించారని తెలిపారు. అయితే ఈ జాబితాలో కొంత మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి మరికొంత మందిని విస్మరించారని ఆరోపించారు. అర్హులు అందరికీ ఇళ్లపట్టాలు ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అనంతరం కలెక్టర్ రఘునందనరావుకు వినతిపత్రం అందజేశారు. చేపల చెరువుగా మార్చొద్దు.. తాగునీటి చెరువును చేపలచెరువుగా మార్చొద్దంటూ గుడ్లవల్లేరు మండలం చంద్రాలలో ప్రజలు ధర్నాచేశారు. గ్రామ తాగునీటి అవసరాల కోసం అడుసుమిల్లి రఘునాయకులు గతంలో మంచినీటి చెరువును విరాళంగా ఇచ్చారని గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఈ చెరువును చేపలచెరువుగా మార్చేందుకు పంచాయతీ పాలకవర్గం తీర్మానాలు కూడా చేసిందని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ రఘునందనరావుకు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో గ్రామస్తులు కె.రాజేంద్రప్రసాద్, ఎ.శ్రీనివాస్, ఎన్.కుటుంబరావు తదితరులు ఉన్నారు. -
బాబూ.. తీయకండి వాళ్ల జాబు
సాక్షి, ఏలూరు: ‘జాబు కావాలంటే.. బాబు రావాలి’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీస్తున్నారంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై శాసనసభలో వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఆయుష్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల వెతలపై ‘ఆయుష్ తీరనుందా..?’ శీర్షికన ఈనెల 21న, ‘అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఎసరు’ శీర్షికన ఈనెల 23న ‘సాక్షి’ పశ్చిమగోదావరి టాబ్లాయిడ్లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఆయూ అంశాలను సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. కొత్తజాబు రావడం మాటలా ఉంచితే ‘బాబు వచ్చాడు.. జాబు పోయేలా ఉంద’ని జగన్ ఆక్షేపించారు. జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి కాంట్రాక్టు ఉద్యోగులు దాదాపు 6వేల మంది ఉన్నారు. వీరిలో ఆయుష్ సిబ్బంది 81 మంది. వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాల్లో వందలాది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. కాగా 18 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాల్సిందిగా ఇటీవల నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాలను సభ దృష్టికి తీసుకువెళ్లిన జగన్మోహన్రెడ్డి దాదాపు 4వేల మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, పారామెడికల్ సిబ్బంది, ఫీల్డ్అసిస్టెంట్ల మెడపై కత్తి వేలాడదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ‘ఎన్ఆర్హెచ్ఎం’ కాల పరిమితి వచ్చే ఏడాది వరకూ ఉంది. మాతాశిశు మరణాలను తగ్గించే ప్రధాన లక్ష్యంతో ప్రా రంభించిన ఈ పథకానికి 2015 వరకూ పంచవర్ష ప్రణాళికలో నిధులు కేటాయించారు. వారి జీతాలను కూడా కేం ద్రమే భరిస్తోంది. అయినప్పటికీ వారిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిం చడం అన్యాయమని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడటంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మా కోసం పోరాడటం సంతోషం పన్నెండేళ్ల క్రితం కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చారు. రెగ్యులర్ ఉగ్యోగికి ఇచ్చే జీతంతో ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమిం చుకోవచ్చని చంద్రబాబు భావించారు. ఏటా వారిని రెన్యువల్ చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ రిలీజ్ చేసి జీతాలు ఇస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో కమిటీ వేసి వీరందరినీ క్రమబద్ధీకరించాల్సిం దిగా సూచించారు. ఈలోగా వైఎస్ దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ మాకోసం పోరాడటం సంతోషంగా ఉంది. ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే కచ్చితంగా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించేవారు. -జి.హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హెల్త్ అసిస్టెంట్స్, సూపర్వైజర్స్ అసోసియేషన్ -
అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ‘ఎసరు’
- జిల్లాలో 6వేల మంది ఉద్యోగుల తొలగింపునకు యత్నం - నెలాఖరుతో ముగియనున్న అవుట్ సోర్సింగ్ గడువు ఏలూరు : జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మీద సుమారు 6వేల కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏ శాఖలోనైనా వీరు లేనిదే పని నడవని పరిస్థితి. నెలనెలా సకాలంలో జీతం అందకపోయినా ఇబ్బందులు పడుతూనే ఉద్యోగాలు చేస్తున్నారు. జీతం ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోరాటాలు చేస్తే నాలుగైదు నెలల జీతం ఒకేసారి ఇస్తున్నారు. తమ ఉద్యోగాలకు మంగళం పాడితే కుటుంబంతో సహా రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికో ఉద్యోగం వంటి హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. వీరి సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో తమను తొలగించడం ఖాయమన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. .దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ దశల్లో ఆందోళనలకు రూపకల్పన చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ సేవలందిస్తున్న ఉద్యోగులు ఇలా గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సుమారు 100 పనిచేస్తున్నారు. రెవెన్యూశాఖలో కలెక్టరేట్ నుంచి ఆర్డీవో, తహసిల్దార్ కార్యాలయాల్లో 43మంది కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిషత్లో ఆరుగురు, జిల్లా నీటి యాజమాన్య సంస్థలో 80మంది ,ఉపాధి హామీ పథకంలో 300 మంది, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 108, 104, జాతీయ ఆరోగ్యమిషన్ లలో 150 మంది ల్యాబ్ టె క్నీషియన్లు, కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. మహిళ శిశు అభివృద్ధి సంస్థలో 40 మంది ,విద్యాశాఖలో కంప్యూటర్ టీ చర్లు, టీఆర్సీలు, డ్రాయింగ్ టీచర్లుగా 2000 మంది, జిల్లాలో ఏలూరు కార్పొరేషన్తో పాటు అన్ని మునిసిపాలిటీల్లో కలిపి సుమారు 1000 మంది సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డేటా ఎంట్రీ, ల్యాబ్ అసిస్టెంట్లు, ఇతర ఆపరేటర్లు 400 మంది, గ్రామాల్లో, పీహెచ్సీల్లో సెకండ్ ఏఎన్ఎంలు 600 మంది, ఇరిగేషన్ శాఖ ,పోలవరం ప్రాజె క్టు పరిధిలో హెల్పర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, 200 మంది, పశుసంవర్థకశాఖలో గోపాలమిత్ర, ఇతర సేవల కింద 100 మంది, రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖల్లో 200 మంది క్షేత్ర స్థాయిలోను సేవలందిస్తున్నారు. ఉద్యాన శాఖలో క్షేత్ర స్థాయిలో 100 మంది, ఇందిర క్రాంతి పథం కింద ధాన్యం కోనుగోలు, భూములు గుర్తింపు పనుల కింద 200 మంది అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారు. వీరందరికి మంగళం పాడితే ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీకాక ఇప్పుడున్న సిబ్బందే నానాపాట్లు పడుతున్నారు. ఇక వీరి కష్టాలు మరింత పెరిగిపోతాయి. ఖాళీలు భర్తీ చేయకపోగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తే ప్రభుత్వ కార్యక్రమాల నివేదికలను అందించటం కష్టం అవుతుందని అన్ని శాఖల్లోను గుబులు రేగుతోంది. క్రమబద్ధీకరించాల్సి వస్తుందని ప్రభుత్వం ఎత్తుగడ! అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలకు పూర్తిస్ధాయిలో మంగ ళం పాడకపోతే వారు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఆందోళన మొదలెడతారని టీడీపీ సర్కార్ ఈ ఎత్తుగడకు దిగిందన్న విమర్శలు వస్తున్నాయి. దశలవారీగా వీరిసేవలకు ఫుల్స్టాప్ పెట్టి, కొత్త వారిని తీసుకుంటారని భావిస్తున్నారు. ఉద్వాసనకు గురయ్యే వారిలో అతి తక్కువ మందికి మాత్రమే తిరిగి ఉద్యోగాలు లభిస్తాయని ప్రస్తుత అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది -
కాంట్రాక్ట్ ఉద్యోగులు.. ఇంటికే!
శ్రీకాకుళం కలెక్టరేట్: ఎన్నికల హామీని తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపేయాలని నిర్ణయించింది. అరకొర జీతాలే అయినా ఏళ్ల తరపడి ఈ ఉద్యోగాలనే నమ్ముకున్న జిల్లాలోని వేలాది ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతమే. ఒక్కో ప్రభుత్వ శాఖలో ఉన్న ఈ తరహా ఉద్యోగలను తొలగించేందుకు ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా జీవోలు సిద్ధం చేస్తోంది, ఇప్పటికే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది, క్షేత్ర సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లను, వ్యవసాయశాఖలో గ్రామస్థాయిలో పనిచేస్తున్న ఆదర్శ రైతులను తొలగిస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల హామీలకు భిన్నంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు జరుగుతున్న యత్నాలపై ఆ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే.. ఇంతవరకు మౌఖిక ఆదేశాలతోనే సరిపెట్టిన ప్రభుత్వం శుక్రవారం మరో అడుగు ముందుకేసింది. గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న వివిధ స్థాయిల ఉద్యోగులను తొలగిస్తూ జీవో విడుదల చేసింది. ఈ జీవో జిల్లా ఉన్నతాధికారులకు చేరినా దాన్ని బయట పెట్టవద్దని ఆదేశాలు ఉండటంతో ఆ శాఖ ఆధికారులు నోరు మెదపడం లేదు, జిల్లా గృహనిర్మాణ శాఖలో ప్రస్తుతం 97 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. గత ఏడేళ్లుగా ఈ ఉద్యోగాలనే నమ్ముకొని జీవిస్తున్న వీరంతా జూలై నుంచి రోడ్డున పడనున్నారు. ఇదే తరహాలో వైద్య ఆరోగ్య శాఖ, రిమ్స్, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన, వాటి అనుబంధ విభాగాలు, 108, 104, ఆరోగ్యశ్రీ, విద్యాశాఖ, సం క్షేమం తదితర శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించనున్నారు. అం దరినీ ఒకేసారి తొలగిస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతోసమ యం, సందర్భం చూసుకొని, దశల వారీగా జీవోలు విడుదల చేయనున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 6500 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరి కుటుంబాల్లో ఇప్పటికే ఆందోళన నెలకొంది. అరకొర జీతాలు లభిస్తున్నా ఎప్పటికైనా పర్మినెంట్ చేస్తారన్న ఆశతో ఏళ్ల తరబడి ఈ ఉద్యోగాలు చేస్తున్నామని, ఇప్పుడు అవి కూడా లేకుండా చేస్తే రోడ్డున పడతామని ఉద్యోగుల కు టుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెం చింది. ప్రస్తుత రెగ్యులర్ ఉద్యోగులకు ఇది ఉపయుక్తమే అయినా.. దీని వల్ల కొత్త నియామకాలు నిలిచిపోవడం, ఉన్న వారికి పదోన్నతులు లభించకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. దీనికితోడు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నందున వారి స్థానంలో ప్రస్తుత ఉద్యోగుల చేత పని చేయించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. -
ఉంటుందా..? ఊడుతుందా?
నల్లగొండ : జిల్లావ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 10వేల మంది ఉన్నారు. దీంట్లో కాంట్రాక్టు ఉద్యోగులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా ఐకేపీ, ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి శాఖలో ఉన్నారు. నాలుగో తరగతి శ్రేణిలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 104, 108, ఆరోగ్యశ్రీ పథకంతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో వెయ్యి మంది వరకు స్వీపర్లుఉంటారు. వీరితోపాటు వైద్యఆరోగ్యశాఖలో ఏఎన్ఎంలు, జీఎంలు, పశు సంవర్థక శాఖలో అంటెండర్లతోపాటు, సంక్షేమ శాఖల హాస్టళ్లలో కుక్లు, కామాటీలు, వాచ్మన్లు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది, ఏపీఎంఐపీ, ఉద్యావనశాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులున్నారు. రాష్ర్టపతి పాలనలో జీఓ 84 జారీ.. రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి జీఓ నెం. 84 జారీ చేశారు. దీని ప్రకారం జూన్ 30వ తేదీ వరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని, అప్పటివరకు ఉమ్మడి రాష్ట్రం ఖజానా ద్వారానే వారి జీతభత్యాల చెల్లింపులు ఉంటాయని జీఓలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం పైనే ఆ ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం జారీచేసిన జీఓ ప్రకారం.. మరి కొద్దిరోజుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఒప్పందం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏజెన్సీలను రెన్యువల్ చేస్తూ ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగిస్తే తప్ప జూలై 1 నుంచి వారు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే జిల్లాలో వేలాది మంది ఉద్యోగుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. వీరికి మినహాయింపు ఇచ్చే అవకాశం... ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉపాధి హామీ పథకం, ఐకేపీలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా నియమితులైన ఉద్యోగులను కూడా మినహాయించి రెగ్యులర్ పోస్టులకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ కోవకు చెందినవారిలో ఎక్కువగా అటెండర్లు, స్వీపర్లు, కుక్లు, కామాటీలు, వాచ్మన్లు, సెక్యూరిటీ గార్డులు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు ఉన్నారు. ఇలాంటివారు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు, పశుసంవర్థక శాఖ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారు. సేవల రద్దుపై ఆదేశాలు... గవర్నర్ జారీ చేసిన జీఓ ప్రకారంగా పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న 56మంది అటెండర్ల సేవలను ఈ నెల 30వ తేదీ తర్వాత వినియోగించుకోవద్దని ఆ శాఖ జాయింట్ డైరక్టర్ డివిజన్స్థాయి ఏడీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఏడీలకు ఈ ఆదేశాలు వె ళ్లాయి. దీంతో అటెండర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇదిలాఉంటే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని నమ్మబలికిన ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి వేల రూపాయలు వసూలు చేశాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఇప్పడా ఆ చిన్నజీవుల పరిస్థితి ఏమిటన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి ఎనిమిదేళ్లుగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ హామీని వెంటనే అమలుచేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ఉద్యోగస్తులు, వారి వయోపరిమితి దాటినందున వేరొక ఉద్యోగాలకు అర్హులయ్యే అవకాశం లేదు. వీరిని పర్మనెంట్ చేయకుంటే వందలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఉంది. - సీహెచ్.సంజీవ్ కుమార్, తెలంగాణ టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఈ ఉద్యో గుల పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. అయితే వీరిని కొనసా గిస్తారా..తొలగిస్తారా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కొత్త రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తా మని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీపైనే ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులను కొనసాగించాలి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి. 2011నుంచి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తే వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. ఉద్యోగులకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. - పి.వేణు, డేటా ఎంట్రీ ఆపరేటర్, పశుసంవర్థక శాఖ ప్రధానశాఖల్లోని సిబ్బంది వివరాలు.. ప్రభుత్వ శాఖ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగులు పశుసంవర్థక శాఖ - 72 డ్వామా 600 150 ఐకేపీ 350 - పంచాయతీరాజ్ - 60 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ - 156 మున్సిపాలిటీలు - 800 సంక్షేమ హాస్టళ్లు - 100 మహాత్మాగాంధీ యూనివర్సిటీ - 123 ఆరోగ్యశ్రీ - 127 రాజీవ్ విద్యామిషన్ - 100 గృహ నిర్మాణ శాఖ - 223 విద్యుత్శాఖ - 1000 -
బాబు రాక.. జాబు పోక..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన ఉపాధి ఎఫ్ఏల తొలగింపునకూ నిర్ణయం వీధిన పడతామంటున్న ఉద్యోగులు సాక్షి, రాజమండ్రి: జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాటలపై చాలీచాలని జీతాలతో, కనీస ఉద్యోగ భద్రత కూడా లేని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆశ పెంచుకున్నారు. ఆయన అధికారంలోకి వస్తే తమ వంటి చిరుద్యోగుల భవిష్యత్తు వెలిగిపోతుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. గృహ నిర్మాణ సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లను తొలగించాలని కూడా నిర్ణయించింది. జలయజ్ఞం భూసేకరణ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించే జీవో నేడో రేపో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణశాఖలో.. గృహ నిర్మాణశాఖలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2,600 మంది ఉద్యోగులున్నారు. వీరు 2006 నుంచి పనిచేస్తున్నారు. ఎప్పటికైనా ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో రూ.15 వేల లోపు జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరిలో సుమారు 60 శాతం మందికి ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి కూడా దాటిపోయింది. ఈ తరుణంలో ఉద్యోగాల నుంచి తొలగించటంతో వారికి దిక్కుతోచడంలేదు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి ఇదీ ఉపాధి హామీ పథకంలో 13 జిల్లాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సుమారు తొమ్మిదివేల మందిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలను నమ్ముకున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ప్రభుత్వం కనికరించకపోవడంపై ఉద్యమించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు సిద్ధమవుతున్నారు. జలయజ్ఞం ఉద్యోగులకు చెల్లుచీటీ జలయజ్ఞం భూసేకరణ కార్యాలయాల్లో పనిచేసే సుమారు 700 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ గతనెల 17నే నిర్ణయం తీసుకున్నారు. ఈనెల రెండో తేదీ నుంచి వారిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీచేశారు. కానీ ఉద్యోగులు ఆందోళన చేయడంతో గవర్నర్ పాలనలోని అధికారులు ఉత్తర్వులను నెలపాటు నిలిపేశారు. ఈ ఉత్తర్వులను మళ్లీ అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ కోణమా.. ఆయా శాఖల్లో వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐటీ మేనేజర్లు, అకౌంటెంట్లు, అటెండర్లు, వాచ్మెన్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నియమితులైన వారే కావడంతో కేవలం రాజకీయ కారణాలతోనే ఉద్యోగుల పొట్ట కొట్టేందుకు టీడీపీ ప్రభుత్వం నడుం కట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. వీధిన పడతాం.. సుమారు ఎనిమిదేళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. పిల్లల చదువులు, పెళ్లిళ్లు.. ఈ ఉద్యోగంపై ఆధారపడే చేయాలి. మా తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. లేకపోతే మా కుటుంబాలు వీధిన పడతాయి. - పి.పోతురాజు, గృహ నిర్మాణసంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి, రాజమండ్రి -
ఇల్లు.. చక్కబెట్టుకుందాం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గత ప్రభుత్వంలో జిల్లా నుంచి రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రిగా వ్యవహరించిన హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రిగా తన నియోజకవర్గ కేంద్రంలో 4వేల ఇళ్లను మంజూరు చేశారు. హుజూర్నగర్లోనే ఓ మోడల్కాలనీ నిర్మించేందుకు భూములు సేకరిం చారు. 4వేల ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు అవుట్సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇంతవరకూ ఎవరికీ ఎలాంటి అభ్యం తరం లేదు. ఎన్నికల కోడ్ వల్ల అటు పనులు, ఇటు నియామకాలు నిలిచిపోయాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోగా, టీఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ కొత్త ప్రభుత్వంలో ఒకవేళ హుజూర్నగర్లోని మోడల్ కాలనీ నిర్మాణం కొనసాగే వీలున్నా, ఇక్కడొక చిక్కుంది. తాము అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కిచెన్, హాలు, సకల సౌకర్యాలతో నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ అమలు మొదలైతే, కొత్తగా ఇళ్లు మంజూరైన వారంతా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకే మొగ్గుచూపుతారు. అలాంటప్పుడు పనులు మొదలు కానీ ఇళ్లన్నీ రద్దయ్యే అవకాశం ఉంది. కానీ, ఇవేవీ గృహనిర్మాణ శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో పాత అనుమతులను అడ్డం పెట్టుకుని ఏకంగా 23 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 17 మందికి వర్క్ ఇన్స్పెక్టర్లుగా ఉద్యోగాలు ఇచ్చారు. అదీ కేవలం ఒకే ప్రాంతానికి చెందిన వారితో భర్తీ చేయడంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాణాలన్నీ ...స్టాప్ వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకూ ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టొద్దన్న నిర్ణయం జరిగినట్లు సమాచారం. బిల్లులు కూడా చెల్లించడం లేదు. జిల్లాలో ఇందిరమ్మ, రచ్చబండ కార్యక్రమాల కింద మంజూరైన 4 లక్షల ఇళ్లలో ఇప్పటికే 2.30లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 40వేల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కాగా, 1.30లక్షల ఇళ్ల నిర్మాణం పనులు మొదలు కానేలేదు. కొత్త మంజూరులు అసలే లేవు. కొత్త ప్రభుత్వంలో, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు రావాల్సి ఉంది. కానీ, గృహనిర్మాణ శాఖ అధికారులు మాత్రం ఇళ్ల నిర్మాణాలే జరగని సమయంలో ఏకంగా నలభై మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకున్నారు. త్వరలోనే బదిలీ అయ్యే అవకాశం ఉందంటున్న ఓ అధికారి పోతూపోతూ సొమ్ము చేసుకోవడంలో భాగంగా హడావిడిగా ఈ నియామకాలు పూర్తి చేసినట్లు గృహనిర్మాణ శాఖ వర్గాలే చెబుతున్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్ల నియామకాల్లో భారీగానే సొమ్ములు చేతులు మారినట్లు ఆరోపణలు అందాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
నెల రాజులేనా?!
ఏళ్ల తరబడి దీన్నే నమ్ముకున్నాం.. వేతనం తక్కువైనా భవిష్యత్తులో రెగ్యులర్ అవుతామన్న ఆశతో పని చేస్తున్నాం.. ఇప్పుడు మా పరిస్థితేంటి?.. నెల రోజుల తర్వాత మా తలరాత ఎలా మారుతుంది??.. ఇవే ప్రశ్నలు వేలాది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలిచేస్తున్నాయి. భవిష్యత్తుపై బెంగటిల్లజేస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరి కొనసాగింపుపై ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జూన్ నెలాఖరు వరకు త్రిశంకు స్వర్గంలోకి నెట్టేయడమే ఈ పరిస్థితికి కారణం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లయ్యింది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. రాష్ట్ర విభజన వారికి అశనిపాతంగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. ప్రస్తుతానికి నెలరోజుల గడు వు ఇచ్చినప్పటికీ వారిని కొనసాగిండంపై మా త్రం మాట దాటవేశా రు. భవిష్యత్తు రాజ కీయ, స్వప్రయోజనాల ను ఆశించే ఇలా చేశార న్న సందేహాలకు బలం చేకూరుతోంది. వేలాది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈ వ్యవహారం కలవరపరుస్తోంది. కొనసాగించమంటే మాట దాటేశారు... రాష్ట్ర విభజన నేపథ్యంలో గవర్నర్ నర్సింహన్ నేతృత్వంలో ఉన్నతాధికారులు ఓ విధాన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇరురాష్ట్రాలకు విభజించారు. కానీ ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత వారి పరిస్థితి ఏమిటన్నది తేల లేదు. నిబంధనల ప్రకారం జూన్ 2లోగా తమను శాశ్వత ప్రాతిపదికన కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు పాక్షికంగానే ఫలించాయి. జూన్ నెలాఖరు వరకు మాత్రమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆ మేరకు జూన్ 30 వరకే బడ్జెట్ కేటాయించారు. జూలైనుంచి వారి పరిస్థితి ఏమిటన్నది మాత్రం స్పష్టం చేయలేదు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో 8వేలమంది జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. డీఆర్డీఏ, డ్వామాలలో దాదాపు 2,500 మంది, వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 500 మంది, రెవెన్యూ శాఖలో దాదాపు 150 మంది, ఆర్ అండ్ బి శాఖలో దాదాపు 150మందితోపాటు ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ వీరు పని చేస్తున్నారు. కాగా జూన్ 30 వరకే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడం వీరంతా ఆందోళన చెందుతున్నారు. దూరాలోచనతోనే... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన కాకుండా జూన్ నెలాఖరు వరకు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించడం వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం తీసుకునేముందు టీడీపీ పెద్దలతో రాష్ట్ర ఉన్నతాధికారులు సంప్రదించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న టీడీపీ అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావించారు. టీడీపీ పెద్దలు ఏం చెప్పారో తెలీదు కానీ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జూన్ నెలాఖరు వరకే పొడిగింపునివ్వడం గమనార్హం. అంటే ఆ తరువాత తాము సూచించినవారికి, తమ అనుయాయులకు అవకాశాలు కల్పించేందుకే టీడీపీ పెద్దలు ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల కాంట్రాక్టులను రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అనంతరం తమ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి తమవారికి అవకాశాలు కల్పించుకోవాలన్న దూరాలోచనతోనే వ్యవహరించినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తమ రాజకీయ ప్రయోజనాలు, తమవారిని అందలం ఎక్కించాలన్న వ్యూహం జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. తమను కొనసాగిస్తారో... వేటు వేస్తారో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు. -
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన
ఆలంపల్లి, న్యూస్లైన్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీజేఏసీ రాష్ట్ర కో చైర్మన్ సీ.విఠల్ అన్నారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో నిర్వహించిన ఉద్యోగుల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రా సచివాలయంలోనే పనిచేయాలని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు పనిచేయకూడదని జేఏసీ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఎన్నికల హడావుడిలో ఉండగా రెండు రాష్ట్రాల విభజనకు 21 కమిటీలు వేశారని, అందులో అందరూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారని ఆరోపించారు. పనికిరాని భవనాలను తెలంగాణ కార్యాలయాలకు, అధునాతన భవనాలు ఆంధ్రా ప్రాంతం వారికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించేందుకు కృషి చేస్తామని, వికారాబాద్ జిల్లా ఏర్పాటు, స్థానికంగా జూనియర్ కళాశాల, ఎస్ఏపీ కళాశాలలో లెక్చలర్ల నియామకం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కోసం జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. సుస్థిరపాలన అందించే పార్టీకి, ప్రజలకు సేవచేసే సమర్థవంతమైన నాయకుడికి ఓటు వేయాలని కోరారు. పోలింగ్ విధుల తర్వాత ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్, టీయూటీఎఫ్ నాయకులు యూ.విఠల్, నాయకులు ప్రతాప్, మారుతీ, దేవదాస్, నందకుమార్, ప్రేం కుమార్, దుర్గప్రసాద్, నర్సింహులు, రామారావుజోషి పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగులు మీకు పట్టరా?
-
‘గ్రేటర్’లో ఆందోళనలకు తెర
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో అటు కార్మికుల సమ్మె.. ఇటు ఇంజినీర్ల నిరసన.. రెండూ ముగిశాయి. శనివారం జీహెచ్ఎంసీ అధికారులు రెండు సంఘాల నేతలతో జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు రెండు సంఘాల నేతలు ప్రకటించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను రూ. 16,500కి పెంచాలనే ప్రధాన డిమాండ్తో గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించిన జీహెచ్ఎంసీ కార్మికులు శుక్రవారం మధ్యాహ్నానికి సమ్మెను విరమించారు. జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్మిట్టల్, అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుధ్యం) వందన్కుమార్.. జనవరి 16లోగా డిమాండ్లను తీరుస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు,గోపాల్ ప్రకటించారు. అంతకుముందు.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించిన కార్మికులనుద్దేశించి జీహెచ్ఎంఈయూ నేతలు మాట్లాడారు. ముగిసిన ఇంజినీర్ల నిరసన ఇటీవలి జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో తమకు జరిగిన అవ మానానికి నిరసనగా, పెన్డౌన్, సామూహిక సెలవులకు దిగిన జీహెచ్ఎంసీ ఇంజినీర్లు తమ నిరసన ను ముగించారు. కమిషనర్ సోమేశ్కుమార్ శుక్రవా రం ఉదయం తగిన హామీ ఇచ్చారని ఇంజినీరింగ్ అసోసియేషన్ నాయకులు ఎం.ఎ.రహ్మాన్, కె.కిషన్, చెన్నారెడ్డి, ప్రభాకర్ విలేకరులకు తెలిపారు. హామీ అమలు కాకుం టే తిరిగి జనవరి 14 నుంచి కార్యాచరణకు దిగుతామన్నారు. కమిషనర్తో చర్చలు జరిపిన వారిలో ఈఎన్సీ ధన్సింగ్, అసోసియేషన్ నాయకులు ఉన్నారు. -
వేతన వెతలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నెలంతా పనిచేసిన వేతన జీవికి మొదటి వారంలో జీతం చేతిలో పడకుంటే ఎన్నో ఇబ్బందులు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, పాలు, కిరాణా... ఇలా ఒక్కటేమిటి.. అన్ని దిక్కుల నుంచి ఒత్తిళ్లు మొదలవుతాయి. వారం.. పది రోజులంటే ఎలాగోలా నెట్టుకురావచ్చు. కానీ నెలల తరబడి అంటే.. కష్టమే. కానీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఈ కష్టం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏకంగా మూడు నెలల నుంచి వారికి జీతాల్లేవు. నెలంతా పనిచేయడం ఒక ఎత్తయితే జీతం కోసం కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరగడం మరో ఎత్తవుతోంది. దాదాపు రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ప్రభుత్వం సకాలంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన నిధులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు సర్కారు నుంచి కమీషన్ పుచ్చుకునే ఏజెన్సీ సైతం ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే వేతనాలిస్తామని తెగేసి చెప్పడంతో ప్రతినెలా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో దాదాపు 110మంది సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, పారామెడికల్, కంప్యూటర్ ఆపరేటర్, హౌస్కీపింగ్ తదితర కేటగిరీల్లో వీరంతా పనిచేస్తున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వీరంతా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం నెలవారీగా ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన వేతన నిధులు సదరు ఏజెన్సీకి విడుదల చేస్తుంది. దీంతో ఏజెన్సీ ఆయా ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంది. అయితే నిధుల విడుదలలో సర్కారు తీవ్ర జాప్యం చేయడంతో వీరికి నెలవారీగా వేతనాలు అందడం కష్టంగా మారింది. మూడు నెలలుగా అందని వేతనాలు వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆగస్టు నెల వరకు వేతనాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో వేతన చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ అంశంపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆయా ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థే సిబ్బందికి నెలవారీ వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యమైనప్పటికీ సదరు సంస్థ వేతనాలు మాత్రం తప్పక చె ల్లించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ప్రభుత్వం ఏజెన్సీకి 3శాతం కమీషన్ చెల్లిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ నిబంధనలను ఏజెన్సీ విస్మరిస్తోంది. నెలవారీగా వేతనాలు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు అందిన తర్వాతే వేతనాలిస్తామంటూ కాలయాపన చేస్తోంది. దీంతో ఇటీవల కొందరు ఉద్యోగులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా త్వరలోనే వేతన నిధులు విడుదలవుతాయని జిల్లా ఆస్పత్రుల కోఆర్డినేటర్ హన్మంతరావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
పండగ పూట పస్తులేనా
సాక్షి, నల్లగొండ :జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆనందోత్సాహాల నడమ పండగ జరుపుకోవడం అటుంచితే... కనీసం కడుపు నిండా భోజనం చేయలేని దుస్థితి దాపురించింది. సుమారు ఐదువేల మంది సిబ్బందికి కొన్నినెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అప్పుతెచ్చి పూట గడుపుతున్నారు. దసరా పండగకైనా జీతాలు వస్తాయని ఎదురు చూస్తున్నవారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందితో సమానంగా పని చేస్తున్నా వేతనాలు అందజేయడానికి ప్రభుత్వానికి మనసొప్పడం లేదు. ఇచ్చే అరకొర వేతనం కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. వెరసి వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది అంటీముట్టనట్లు పండగ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. చితికిపోతున్న కోఆర్డినేటర్లు... సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. సాక్షరభారత్లో జిల్లాలో 59మంది మండల కో ఆర్డినేటర్లు, రెండు వేలకుపైగా గ్రామ కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. గ్రామ కో ఆర్డినేటర్లు గతేడాది సెప్టెంబర్ నుంచి జీతాలకు నోచుకోలేదు. మండల కోఆర్డినేటర్లు ఈ ఏడాదిలో ఇంతవరకు వేతనం అందుకున్న దాఖలాలు లేవు. వేతనాలకుతోడు ఎఫ్టీఏ, టీఏ, డీఏ ఇస్తున్న పాపాన ప్రభుత్వం పోలేదు. దీంతో అప్పుతెచ్చి కుటుంబాలు పోషిస్తున్నారు. పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్ల పరిస్థితి అంతే.. గ్రామీణ పేద విద్యార్థులకు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్ అందించడానికి పార్ట్టైమ్ ఇన్ స్ట్రక్టర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిన ప్రభుత్వం నియమించింది. జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 436 మంది పనిచే స్తున్నారు. ప్రతిఒక్కరికి నెలనెలా రూ.4500 వేతనం ఇవ్వాల్సి ఉంది. అయితే గత జూన్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు జీతాలు ఇవ్వడం మరిచారు. దీంతో బతుకు దుర్భరంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖలో.. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న గ్రామీణ సంచార వాహనాలు 104లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సిబ్బంది రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 104 పరిధిలో అవుట్ సోర్సింగ్ విధానంలో సుమారు 200 మంది ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, వాచ్మెన్లు పనిచేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి వేతనాలు అందాల్సి ఉంది. ఎన్ఆర్హెచ్ఎంలో.... జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం)పరిధిలో జిల్లాలో 450 మంది కాంట్రాక్ట్ పద్ధతిన ద్వితీయ ఏఎన్ఎంలు విధులునిర్వహిస్తున్నారు. వీరికి గత రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. వీరి వేతనం మీదే కుటుంబాలన్నీ ఆధారపడడం, వేతనాలు అందకపోవడంతో సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టు బోధకులకూ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లుగా దాదాపు 130 మంది పనిచేస్తున్నారు. ఒక్కో కాంట్రాక్ట్ లెక్చరర్కు వేతనంగా నెలకు రూ.20,700 చెల్లించాల్సి ఉంది. గతంలో వీరికి రెండు మూడు నెలలకోసారి అందజేసేవారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించిన పాపాన పోలేదు. దీంతో 70మంది లెక్చరర్ల కుటుంబాలు తీవ్ర అవస్థలపాలవుతున్నాయి. గెస్ట్ లెక్చరర్లుగా 60మంది వరకు బోధిస్తున్నారు. వీరికి ఈ ఏడాదిలో జీతాలు ఇచ్చారు. అయితే గత రెండేళ్లకు సంబంధించిన జీతాలు ఇంకా అందలేదు. ‘జూనియర్’లదీ ఇదే పరిస్థితి... ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిన 330మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. సగటున ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేలు వేతనం. ఆర్వీఎంలో... ఆర్వీఎం పరిధిలో దాదాపు 600 మందికి రెండు నెలల నుంచి వేతనాలు అందడంలేదు. 284మంది సీఆర్పీలు, మండలానికి ఒకరు చొప్పున ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఎల్డీఎల్లు, ఐఈఆర్టీలు, మెసెంజర్లు వేతనాలకు నోచుకోలేదు. వీళ్లేగాక వేతనాలు నోచుకోని వారు ఇంకా పలు శాఖల్లో వందల సంఖ్యలో ఉన్నారు. పండగలోపైనా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే పండగ పూట తమకు పస్తులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.