Priyadarshi Pulikonda
-
కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా: కోర్ట్ టీమ్పై మెగాస్టార్ ప్రశంసలు
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ కింగ్ అనే విషయం మరోసారి రుజువైంది. ఆ మాటను ఇటీవల విడుదలైన కోర్ట్ మూవీ మరోసారి స్పష్టం చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఊహించిన దానికంటే అధికంగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ మూవీపై పలువురు టాలీవుడ్ అగ్ర సినీతారలు ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ మూవీ టీమ్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కోర్ట్ మూవీ టీమ్ను తన ఇంటికి ఆహ్వానించిన చిరు.. సినిమా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ఉండడంతో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావించానని అన్నారు. కానీ ఈ కథను చాలా స్ట్రైట్గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారని మెగాస్టార్ కొనియాడారు. ఈ సినిమాలో శివాజీ చాలా క్రూయల్గా నటించారని.. రోషన్, శ్రీదేవి అద్భుతంగా చేశారని చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవితో ప్రియదర్శి కాసేపు సినిమా కాన్సెప్ట్ గురించి వివరించారు. ఠాగూరు మూవీ తర్వాత అంతలా చర్చించుకున్న సినిమా ఇదేనని ప్రియదర్శి అన్నారు. కాగా.. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఈ -
గోదారిగట్టు, బుజ్జితల్లి.. ఇప్పుడు ప్రేమలో.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది
కొన్ని సాంగ్స్ వింటే పదే పదే వినాలనిపిస్తుంది. అంతేకాదు డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అలాంటి పాటలు ఇటీవల తెలుగు సినిమాల్లో అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి గోదారి గట్టు సాంగ్, అలాగే తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి సాంగ్ సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎక్కడ చూసిన ఈ పాటలకు ఆడియన్స్ కాలు కదిరాపు. దీంతో ఈ రెండు పాటలకు ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది కొంతమంది ఏకంగా ఈ పాటలకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలా ఇదే జాబితాలో మరో హిట్ సాంగ్ వచ్చి చేరింది. అదేనండి ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తోన్న కోర్ట్ మూవీ సాంగ్. ఇంకేంటీ మీకోసమే తాజాగా ఫుల్ సాంగ్ కూడా వచ్చేసింది. మరెందుకు ఆలస్యం చూసి ఎంజాయ్ చేయండి.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!)ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం కోర్ట్(Court: State Vs Nobody). కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్టాక్తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 28.9 కోట్లు రాబట్టింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ వల్ల బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
విజయవాడలో సందడి చేసిన ‘కోర్ట్’ చిత్ర బృందం (ఫొటోలు)
-
బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ఓ చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు సైతం రెండు, మూడు రోజులకే ఢీలా పడుతున్నవేళ..ఈ చిన్న చిత్రం మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్ని పెంచుకుంటూ రికార్డు దిశగా పరుగులు తీస్తోంది. ఆ చిత్రం పేరే ‘కోర్ట్’ (Court: State Vs Nobody). నాని (Nani) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్టాక్తో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మొత్తంగా రిలీజైన నాలుగు రోజులకే రూ. 28.9 కోట్లను రాబట్టి.. నానికి కాసుల వర్షం కురిపించిదీ చిత్రం. ఒక్క నాలుగో రోజునే 4.50 కోట్ల గ్రాస్ సాధించిదంటే.. ఈ చిన్న చిత్రం సత్తా ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్లోనూ ఈ సినిమా బాగా వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్లో ఓవర్సీస్ కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్స్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోర్ట్ విషయానికొస్తే.. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ కీలక పాత్ర పోషించాడు. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టం గురించి ఈ చిత్రంలో చర్చించారు. కోర్ట్రూమ్ డ్రామా బాగా పండడం, ఎమోషనల్ సన్నివేశాలు హృదయాలను హత్తుకునేలా ఉండడం సినిమాకు విజయాన్ని అందించాయి. #CourtTelugu continues its dominance at the box office this week ❤🔥Collects a gross of 28.9+ CRORES WORLDWIDE in 4 days 💥💥Book your tickets for #Court now! ▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️ Presented by Natural Star @NameisNani Starring… pic.twitter.com/AiUSVO3RCD— Wall Poster Cinema (@walpostercinema) March 18, 2025 -
'కోర్ట్' మూవీ కలెక్షన్స్.. ఫస్ట్ డే కంటే మూడో రోజే ఎక్కువ
హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించారు. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలైంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలిరోజే భారీ రెస్పాన్స్ రావడంతో ఎక్కడ చూసిన వీకెండ్లో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి.కోర్టు సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 24.40 కోట్లు రాబట్టింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.11 కోట్లతో తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే, మొదటిరోజు రూ. 8.10 కోట్లు, రెండో రోజు రూ. 7.80 కోట్లు, మూడోరోజు రూ. 8.50 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. కోర్టు సినిమా ఫస్ట్డే నాడు ప్రీమియర్స్ షోలతో కలిపి వచ్చిన కలెక్షన్స్ కంటే మూడోరోజు ఎక్కువ రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ మధ్య కాలం వచ్చిన సినిమాల్లో కోర్టు చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా మరో రెండు కోట్లు ఈ చిత్రానికి వచ్చాయని అంచనా వేస్తున్నారు. కోర్టు సినిమా హీరో నానికి భారీ లాభాలు తెచ్చిపెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ లాంగ్ రన్లో రూ. 50 కోట్ల క్లబ్లో ఈ చిత్రం చేరవచ్చని అంచనా వేస్తున్నారు. -
స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను: నాని
నాని(Nani) తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై నిర్మించిన తాజా చిత్రం 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలిరోజే హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో టీం సెలబ్రేషన్ అఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. నేను ఈ రోజుదాక స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీంని గెలిచింది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. ఈ సినిమా విషయంలో, టీం విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీలౌతున్నాను. ఈ వీకెండ్ ఒక పండగలా గడిచింది. రానున్న రోజుల్లో కోర్ట్ పేరు మారుమ్రోగుతుంది. సినిమాని ముందుకు తీసుకెలుతున్న అందరికీ పేరుపేరునా థాంక్ యూ’ అన్నారు.హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. బలగం హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నపుడు రామ్ జగదీశ్ ఈ కథ చెప్పారు. ఈ కథ విని చాలా గొప్పగా ఫీలయ్యాను. మాకు సపోర్ట్ గా దీప్తి అక్క, ప్రశాంతి గారు వచ్చారు. మేమంతా రాకెట్ లో కూర్చుంటే మమ్మల్ని చుక్కల దాక తీసుకెళ్ళారు. ఆయన నమ్మకపోయుంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అన్నారు.యాక్టర్ శివాజీ మాట్లాడుతూ... 25 ఏళ్ళుగా మంగపతి లాంటి క్యారెక్టర్ కోసం ఎదురుచూశాను. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కల వుంటుంది. ఒక రోజు మొత్తం ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలని. అది ఈ సినిమాతో తీరింది. మంగపతి లాంటి పాత్ర లైఫ్ లో ఒకేసారి వస్తుంది. ఆ కిక్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఇకపై సినిమాలు చేస్తాను'అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ జగదీశ్, నటులు హర్షవర్దన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘కోర్ట్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
‘కోర్ట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అక్కా తమ్ముళ్లు సెట్స్లో ఉండకూడదు: దీప్తి గంటా
‘‘కోర్ట్’ సినిమా నచ్చకపోతే, తాను హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమా చూడొద్దని నానిగారు వేదికపై మాట్లాడినప్పుడు మేం షాక్ అయ్యాం. కానీ నాని అలా అన్నారంటే.. ‘కోర్ట్’ సినిమాపై నమ్మకం ఉంది కాబట్టే అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగారు. పైగా రెండు (కోర్ట్, హిట్ 3) సినిమాలకూ నానీయే ఓ నిర్మాత... సోప్రాబ్లమ్ లేదు’’ అని అన్నారు దీప్తి గంటా.ప్రియదర్శి ప్రధాన పాత్రలో, రోషన్, శ్రీదేవి, శివాజీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. రామ్ జగదీశ్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంటా సహనిర్మాత.కాగా ఈ సినిమా విడుదలకు రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో ఈ ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా చెప్పిన విశేషాలు.‘‘నాని, ప్రశాంతిగారు స్క్రిప్ట్ విని ఈ సినిమాను ఓకే చేశారు. ఈ కథ నాకూ నచ్చింది. దర్శకుడు జగదీశ్ రాసిన ‘కోర్ట్’ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాకు నేను ఆన్సెట్ ప్రోడ్యూసర్గా జాయిన్ అయ్యాను. సెట్స్కు రోజూ వెళ్లేదాన్ని. జగదీశ్ చాలా పరిశోధన చేసి, ఈ సినిమా చేశారు. అందుకే నేచురల్గా వచ్చింది.పోక్సో చట్టం గురించి ఆయన చాలా వివరంగా స్క్రీన్పై ప్రజెంట్ చేశారు. ఇక మంగపతి క్యారెక్టర్లో శివాజీగారు అద్భుతంగా నటించారు. ఇంకా ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి... ఇలా ప్రతి పాత్రకు సినిమాలోప్రాముఖ్యత ఉంది. ‘మీట్ క్యూట్’ తర్వాత నేను యూఎస్కి వెళ్లిపోయాను. ఈ సినిమా కోసం మళ్లీ వచ్చాను.కొన్ని కథలు ఉన్నాయి. భవిష్యత్లో మళ్లీ దర్శకత్వం వహిస్తాను’’ అన్నారు దీప్తి. నాని ‘వాల్పోస్టర్ సినిమా’ బ్యానర్లోనే మీ డైరెక్షన్ మూవీ ఉండొచ్చా? అన్న ప్రశ్నకు– ‘‘నేను సినిమా చేస్తే నానితో చేయను. అక్కాతమ్ముళ్లు సెట్స్లో ఉండకూడదు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు దీప్తి.నానిగారు పెద్దగా లెక్కలు వేయరు: ప్రశాంతి తిపిర్నేని‘‘కోర్ట్’ సినిమా ప్రీమియర్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మేం అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ తరహా జానర్లోని మూవీని ఆడియన్స్ ఆదరించి, సక్సెస్ చేయడం కూడా మంచి పరిణామం. ప్రస్తుతానికి ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం.నాని, నేను ఇద్దరం కథలు వింటాం. మా నమ్మకం అంతా నానిగారి జడ్జిమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. నానిగారు పెద్దగా లెక్కలేమీ వేయరు. జానర్ ఏదైనా కథలో నిజాయితీ ఉండి, డైరెక్టర్లో క్లారిటీ ఉంటే చాలు ముందుకు వెళ్తాం. ఒక కథ థియేటర్స్లో చూడాలనిపించేలా ఉంటే చాలు... సినిమా చేసేందుకు నానిగారు ఒప్పుకుంటారు. నానిగారి సినిమాలు థియేటర్స్కు ముందే ఓటీటీ డీల్స్ను పూర్తి చేసుకుంటున్నాయంటే అది కథలపై తనకు ఉన్న జడ్జిమెంటే కారణం. ఇక ‘కోర్ట్’లో పోక్సో చట్టం ఎలా దుర్వినియోగం కావొచ్చనే పాయింట్ను దర్శకుడు జగదీశ్ అద్భుతంగా చూపించారు’’ అని ప్రశాంతి చెప్పారు. -
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
టైటిల్:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2025హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్’. ‘‘కోర్ట్’ నచ్చకపోతే నా ‘హిట్ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్.దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్గా ఆ టాపిక్ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము(హర్ష వర్ధన్) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్ యాక్టింగ్తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నాని కాన్ఫిడెన్స్కి కారణం ఇదే : ‘కోర్ట్’ డైరెక్టర్
‘కోర్ట్’ కథ నానికి చెప్పడానికి దాదాపు 8 నెలల వెయిట్ చేశాను. ఫైనల్గా ఓ రోజు ఆయన నుంచి పిలుపొచ్చింది. దాదాపు రెండున్నర గంటల కథని సింగిల్ సిటింగ్ లో విన్నారు. కథ మొత్తం విని నిల్చుని షేక్ హ్యాండ్ ఇచ్చి 'వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా' అన్నారు. అది నా జీవితంలో హై మూమెంట్’ అని అన్నారు డైరెక్టర్ రామ్ జగదీష్. ఆయన ఆయన దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఈ కథ ఫోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నిజజీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా కూడా ఉంటుందా అని సందేహంగా అనిపించింది. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది. ఆ కేసులు అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేశాను. ఏపీ తెలంగాణలో వందల కేసులు ఉన్నాయి. ఇవన్నీ స్క్రీన్ మీద అడ్రస్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఈ కథ కోసం చాలా కేసు ఫైల్స్ చదివాను. అన్ని కేస్ ఫైల్స్ లో ఉన్న మెటీరియల్ తో ఒక మంచి కథ చెప్పొచ్చు కదా అనిపించింది. అవన్నీ ఒక కథగా చేసి స్క్రీన్ పై చూపించడం జరిగింది.⇢ ఇది పర్టికులర్ ఒక పర్సన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన కథ కాదు. చాలా సంఘటనల స్ఫూర్తి ఉంది. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ కథ. చదివిన కేసుల ఎసెన్స్ తో ఒక ఫిక్షనల్ స్టోరీ చేయడం జరిగింది.⇢ మనం గతంలో చాలా కోర్ట్ రూమ్ డ్రామాలు చూసాం. కానీ ఒక లవ్ స్టోరీ ని కోర్ట్ రూమ్ డ్రామాగా ఎప్పుడు చూడలేదని భావిస్తున్నాను. ఇందులో లవ్ స్టోరీ, కోర్ట్ రూమ్ డ్రామా చాలా ప్రత్యేకంగా ఉంటాయి.⇢ ఫోక్సో చాలా ముఖ్యమైన ఆక్ట్. నిజానికి ఆ చట్టం గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తే బాగుంటుందని అనిపించింది. అది ఈ సినిమాలో చూస్తారు.⇢ ఈ సినిమాలో అన్ని పాత్రలని ఆడిషన్స్ చేసి తీసుకున్నాం. చందు పాత్ర ప్లే చేయడానికి రోషన్ చాలా తపనపడ్డాడు. సెలెక్ట్ అయిన తర్వాత తను చేసిన ఫాలోఅప్ అద్భుతం. చాలా ఫ్యాషన్ చూపించాడు. చందు పాత్రని త్వరగానే క్లోజ్ చేసాం కానీ జాబిల్లి పాత్ర కోసం చాలా సెర్చ్ చేసాం. ఒక తెలుగు అమ్మాయి కావాలి, కొత్తగా ఉండాలి, సరైన ఏజ్ కావలి, నటన తెలిసి ఉండాలి ఇలాంటి కాంబినేషన్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నప్పుడు ఒక దశలో దొరకదేమో అనుకున్నాం. అలాంటి సమయంలో నా ఫ్రెండ్ ఒక ఇన్స్టా ప్రొఫైల్ పంపించాడు. అందులో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ లో తను జాబిల్లిలా కనిపించింది. అడిషనల్ చేసాం. ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది, ⇢ ఈ సినిమా ఐడియా మొదటగా ప్రియదర్శికే చెప్పాను. ఆయనకి చెప్పిన తర్వాత ఈ సినిమాని నేనే చేస్తాను. ఇంకా ఎవరికీ చెప్పొద్దు అన్నారు. ఆయనకే చెప్పాను. ఆయనతోనే చేశాను. ప్రియదర్శితో నాకు చాలా క్లోజ్ అసోషియేషన్. చాలా ఫ్రెండ్లీ గా ఉంటాం. తనతో అన్నీ షేర్ చేసుకోగలను.⇢ శివాజీ గారు మంగపతి క్యారెక్టర్ లో కనిపిస్తారు. ప్రతి ఫ్యామిలీలో అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు మంగపతి అవుతారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ లా ఉంటుంది.⇢ నాని గారు సినిమా చూశారు. అందుకే ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుందని చెబుతున్నాడు. సినిమాపై ఆయనకి ఉన్న కాన్ఫిడెన్స్ అది. ఆయన కాన్ఫిడెన్స్ అంతా సినిమా ఇచ్చిందే. నాని గారు సినిమా చూసి 'ప్రౌడ్ అఫ్ యూ జగదీశ్' అన్నారు. అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లీమెంట్⇢ ఇది కమర్షియల్ సినిమానే. సినిమా చూసి ఒకతను చుక్క రక్తం లేకుండా కమర్షియల్ సినిమా చూపించావ్ అన్నారు. ఆ మాట నాకు చాలా నచ్చింది.ఈ సినిమా మనందరి జీవితం. మనం తెలుసుకోవాల్సిన నిజం. స్క్రీన్ మీద మన జీవితమే ఉంటుంది. మనల్ని మనం తెరపై చూసుకోవడానికి సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. -
ఆరెంజ్ సినిమా నా ఫేవరేట్.. ఎందుకు ఫ్లాఫ్ అయిందో తెలియదు: ప్రియదర్శి
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కోర్ట్. విభిన్నమైన పాత్రలతో అభిమానులను మెప్పించే మరో కొత్త కథలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించనున్నారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రియదర్శి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి.. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ప్రియదర్శి మాట్లాడుతూ..' రామ్ చరణ్ నటించిన బెస్ట్ ఫిల్స్మ్లో ఆరెంజ్ అంటే ఇష్టం. ఆ సినిమా నాకు ఇన్స్పైరేషన్. అప్పుట్లో ఆ సినిమా అంత కలెక్షన్స్ వచ్చి ఉండవు. కానీ మొన్న రిలీజైనప్పుడు సూపర్గా ఆడింది. ఆ సినిమా ఎప్పుడొచ్చినా నేను, మా చెల్లి చూసేవాళ్లం. మీరు ఆరెంజ్ సినిమాలో సూపర్గా చేశారన్న అని చెప్పేవాన్ని. ఆ సినిమా నాకు ఇప్పుడిచ్చిన చేస్తా. నాకు ఇష్టమైన డైరెక్టర్ ఆయన. అప్పుడు ఎందుకు ఆడలేదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. రెండోసార్లు థియేటర్లలో చూశా. ఓటీటీలో వచ్చినప్పుడు కూడా చూశా. ముఖ్యంగా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అంటే చాలా ఇష్టం' అని అన్నారు.కాగా.. కోర్ట్ సినిమాను పోక్సో కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి లాయర్గా అభిమానులను అలరించనున్నారు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే కోణంలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
25 రోజులు షూటింగ్ చేస్తే.. 2 నిమిషాలు కూడా ఉంచలేదు: ప్రియదర్శి
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). ఈ సంక్రాంతికి థియేటర్స్లో రిలీజైన ఈ చిత్రం భారీ అపజయాన్ని మూటగట్టుకుంది. శంకర్ దర్శకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భారీ బడ్జెట్ తీసుకొని.. సినిమాను దారణంగా తీశాడని మండిపడ్డారు. అయితే ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువ పెరగడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. వాటిలో ఆరిస్టుల ఎంపిక కూడా ఒకటని చెప్పొచ్చు. చిన్న చిన్న పాత్రలకోసం మంచి గుర్తింపు ఉన్న నటీనటులను పెట్టాడు. పోనీ ఆ పాత్రలకు అయినా న్యాయం చేశాడా అంటే అదీలేదు. చాలా మంది నటీనటులను ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. అలాంటి వారిలో ప్రియదర్శి కూడా ఒకడు. ఆ సినిమాలో హీరో స్నేహితుడిగా నటించాడు. మొదటి పాట ఫస్ట్ షాట్, పెళ్లిలో డిన్నర్ సీన్ దగ్గర కొద్దిసేపు కనిపించే ప్రియదర్శి తర్వాత ఎక్కడా కనిపించడు. ‘బలగం’ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రియదర్శి కేవలం రెండు సీన్లలో వచ్చివెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా దీనిపై ప్రియదర్శి స్పందించాడు.ఆయన నటించిన కోర్టు సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’లో తను అంత చిన్న పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ‘బలగం’ కథ వినకముందు ఓకే చేశాను. అప్పుడు నేను హీరో ఫ్రెండ్ పాత్రలు చేస్తుండేవాడిని. గేమ్ ఛేంజర్లో కూడా అలాంటి పాత్రే. 25 రోజుల పాటు నేను కాల్షిట్లు ఇచ్చాను. షూటింగ్ చేశారు. కానీ ఎడిటింగ్లో ఆ సీన్లు మొత్తం తొలగించారు. నాది చిన్న పాత్ర అని తెలిసినా.. ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం శంకర్. అలాంటి డైరెక్టర్తో పని చేసే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. అందుకే చిన్న పాత్ర అయినా చేశాను. 25 రోజుల పాటు షూటింగ్ చేస్తే.. 2 నిమిషాలు కూడా తెరపై చూపించలేదు. శంకర్గారితో పని చేశాననే తృప్తి మాత్రం నాకు ఉంది. దానికోసమే ఆ సినిమా చేశాను’అని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు. -
నానిగారు సలహాలు ఇచ్చేవారు: ప్రియదర్శి
‘‘కోర్ట్’ కథ నానిగారికి బాగా నచ్చింది. దీంతో నిర్మాణంలో ఏది కావాలన్నా ఏర్పాటు చేయమని నిర్మాతలు దీప్తి, ప్రశాంతిగార్లకు చెప్పారు. వారిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీప్తిగారు సెట్స్లో ఉండేవారు. నానిగారు మాత్రం అప్పుడప్పుడు మా సినిమా రషెస్ చూసి ఏౖవైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారు’’ అని ప్రియదర్శి తెలిపారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోర్ట్’.నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ–‘‘2022లో నేను, రామ్ జగదీష్ ‘కోర్ట్’ మూవీ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో లాయర్ పాత్రని ఓ పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుందనుకున్నాడు జగదీష్. కానీ, నేనే చేస్తానని చెప్పడంతో సరే అన్నాడు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అని చాలా పరిశోధన చేసి, ఈ మూవీ తీశాడు జగదీష్.ఈ చిత్రంలో నేను లాయర్ పాత్ర చేశాక వారిపై నాకు గౌరవం పెరిగింది. ‘కోర్ట్’ సినిమాపై ఉన్న నమ్మకంతోనే ‘ఈ చిత్రం నచ్చకపోతే నా ‘హిట్ 3’ చూడొద్దు’ అని నానిగారు చెప్పారు. నా లాంటి నటులు మంచి కథలు చేస్తేనే జనాలు థియేటర్స్కి వస్తారు.. లేదంటే రారు. ఏ సినిమా అయినా మంచి వసూళ్లు సాధిస్తే అది కమర్షియల్ హిట్టే.అలా ‘కోర్ట్’కి మంచి వసూళ్లు వస్తే నేను కమర్షియల్ హీరోనే(నవ్వుతూ). శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ కేఐ వరప్రసాద్గారి బయోపిక్ చేయాలని ఉంది. నేను నటించిన ‘సారంగపాణి జాతకం’ మూవీ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ‘ప్రేమంటే..’ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తాను’’ అని చెప్పారు. -
అందుకే బతిమాలుతున్నా: నాని
‘‘నా కెరీర్లో ఎప్పుడూ దయచేసి ఓ సినిమా చూడండి అని అడగలేదు. కానీ ‘కోర్టు’( Court Movie) లాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు మిస్ కాకూడదని చెబుతున్నాను.. అందరూ చూడాలని బతిమాలుతున్నాను’’ అని హీరో నాని(Nani ) చెప్పారు. ప్రియదర్శి ప్రధాన ΄ాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్టు’. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవ కట్టా అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ–‘‘కోర్టు’ సినిమాకి వెళ్లాక నా మాటలు మీ అంచనాలకి సరిపోలేదనిపిస్తే... రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా ‘హిట్ 3’ సినిమాని ఎవరూ చూడొద్దు’’ అని కోరారు. ‘‘బలగం’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ‘కోర్టు’ చేయమని నాని అన్న చెప్పారు’’ అని ప్రియదర్శి తెలిపారు. ‘‘ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగ్ అశ్విన్, శ్రీకాంత్ ఓదెల. ‘‘నానీగారు వాల్ పోస్టర్ సినిమా ద్వారా నన్ను డైరెక్టర్గా పరిచయం చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి’’ అని ప్రశాంత్ వర్మ ఆకాంక్షించారు. ‘‘కోర్టు’ ట్రైలర్ చూశాక సినిమా అద్భుతంగా వచ్చిందనిపిస్తోంది’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘ఈ సినిమాని ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని దేవ కట్టా తెలిపారు. ‘‘కోర్టు’ చాలా అందమైన సినిమా’’ అన్నారు నిర్మాత దీప్తి. ‘‘కోర్టు’ మనందరికీ జీవితం. అందరూ థియేటర్స్కి రండి’’ అన్నారు రామ్ జగదీశ్. ‘‘ఈ సినిమా ప్రోమోస్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. అందరూ థియేటర్స్లో చూడాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. నటీనటులు శ్రీదేవి, రోహిణి, సురభి ప్రభావతి, హర్ష రోషన్, శ్రీనివాస్ భోగిరెడ్డి, శివాజీ, డైరెక్టర్ శౌర్యువ్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, లిరిక్ రైటర్ పూర్ణాచారి తదితరులు మాట్లాడారు. -
'కోర్ట్' సినిమా నచ్చకుంటే.. నా 'హిట్ 3'ని చూడొద్దు: నాని
ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. ఇందులో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది. హీరో నాని ప్రోడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో నానితో పాటు నాగ్ అశ్విన్, మోహనకృష్ణ ఇంద్రగంటి, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, శైలేశ్ కొలను, శౌర్యువ్ తదితరులు పాల్గొన్నారు.'కోర్ట్' సినిమా సమర్పకుడు నాని ట్రైలర్ను విడుదల చేసిన అనంతరం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16ఏళ్లు దాటింది. దయ చేసి ఈ సినిమా చూడండి అని నేనెప్పుడూ అడగలేదు. తొలిసారి ఈ మాట ప్రేక్షకులను అడుగుతున్నాను. ఈ సినిమా నిర్మాతగా చెప్పడం లేదు, నా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా మిస్ అవ్వొద్దని కోరుకుంటున్నా. దయచేసి కోర్టు చిత్రాన్ని ఇంటిల్లిపాది చూడండి. కోర్టు చిత్రం చూసిన వారంతా గర్వంగా థియేటర్ల నుంచి బయటికి వస్తారు.'కోర్టు' సినిమా కంటే హిట్ 3పై పది రెట్లు ఖర్చుపెట్టాను. ఈ చిత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోకపోతే నా నెక్స్ట్ మూవీ 'హిట్3'ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా మీకు చెప్పలేను. ఈ సినిమాతో మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలోని పాత్రలతో ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్తో కనెక్ట్ అయిపోతారు. ఆ పాత్రలతో పాటుగా మీరు కూడా నవ్వడమే కాకుండా ఏడిపించేస్తారు.' అని నాని అన్నారు. -
'కోర్ట్' ట్రైలర్ రిలీజ్.. సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్!
యాక్షన్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరో నాని.. నిర్మాతగానూ ఓ మూవీని విడుదలకు సిద్ధం చేశాడు. అదే 'కోర్ట్'. ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ డార్క్ కామెడీ)ట్రైలర్ బట్టి చూస్తే.. తన కూతురితో ప్రేమలో ఉన్నాడనే కోపంతో ఓ తండ్రి.. ఓ కుర్రాడిపై కేసు పెడతాడు. ఏకంగా పోక్సో కేసు బనాయిస్తాడు. అలా 78 రోజుల పాటు జైల్లో మగ్గుతాడు. పోక్సో లాంటి సెన్సిటివ్ కేసు కావడంతో లాయర్స్ ఎవరూ ముందుకు రారు. అలాంటిది ప్రియదర్శి ఈ కేసు వాదించేందుకు సిద్ధమవుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ అనిపిస్తుంది.నాని నిర్మాత అంటే కాస్త వైవిధ్యభరిత చిత్రాలే వస్తుంటాయి. 'కోర్ట్' ట్రైలర్ చూస్తుంటే సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ అనేలానే ఉంది. కోర్ట్ రూమ్ డ్రామాలు ఈ మధ్య కాలంలో తెలుగులో ఏం రాలేదు. రామ్ జగదీశ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు) -
సమ్మర్లో సారంగపాణి
ప్రియదర్శి, రూపా కొడవయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను గత ఏడాది డిసెంబరులోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో తాజాగా ‘సారంగపాణి జాతకం’ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.‘‘మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతను చేతలతో చేసే పనులతో ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ మూవీని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాం’’ అని ఈ సినిమాను ఉద్దేశించి మేకర్స్ తెలిపారు. ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, నరేశ్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్. -
కోర్ట్లో హీరో ఎవరో చెప్పడం కష్టం: నాని
‘‘కోర్ట్’ చాలా అందమైన సినిమా. ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి అద్భుతంగా నటించారు. డైరెక్టర్ జగదీష్ బాగా తీశారు. ఈ సినిమా చూశాను... ఇందులో హీరో ఎవరో చెప్పడం కష్టం. ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను’’ అని హీరో నాని చెప్పారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో నాని మాట్లాడుతూ– ‘‘ఈ కథ సున్నితమైనది. చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాం. జగదీష్ చాలా పరిశోధన చేశారు. ఇది అద్భుతమైన కోర్టు రూమ్ డ్రామా. గొప్ప సందేశం ఉంటుంది. ఈ సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు నిలబడి క్లాప్స్ కొడతారు... ఇందుకు నాదీ గ్యారెంటీ.ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఒక అడుగు ముందుకేసినట్లే’’ అన్నారు. ‘‘నాని అన్న బ్యానర్లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రియదర్శి చెప్పారు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నానీగారికి థ్యాంక్స్. ఒక్క డౌట్ లేకుండా స్క్రిప్ట్ని నమ్మి ఆయన సినిమా నిర్మించారు’’ అని రామ్ జగదీష్ తెలిపారు.‘‘నాని, ప్రశాంతి ప్రోడక్షన్ హౌస్లో కథ నచ్చితే ఎంత అయినా ఖర్చు పెడతారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు సహ నిర్మాత దీప్తి గంటా. ‘‘ఇలాంటి మంచి సినిమాలో చాన్స్ ఇచ్చిన దర్శక– నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని రోషన్, శ్రీదేవి పేర్కొన్నారు. -
‘ప్రేమంటే?’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
థియేటర్లలో రిలీజ్కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. దీంతో సినీ ప్రియులంతా కుటుంబంతో కలిసి మూవీ వీక్షించేందుకు సరికొత్త వేదికగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త చిత్రాలు ఓటీటీల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో కొన్ని థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీకి వస్తే.. మరికొన్ని చిన్న చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.అయితే ఈ సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సినిమాలు రిలీజ్కు ముందే ఓటీటీ ఫ్లాట్ఫామ్ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ప్లిక్స్ వెల్లడించింది. ఇంతకీ ఆ సినిమాలేవో మీరు ఓ లుక్కేయండి.గతంలో విడుదలైన మ్యాడ్ మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో ఇంకా విడుదల కాలేదు. రిలీజ్ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.దీంతో పాటు డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ నటిస్తోన్న తాజా చిత్రం జాక్. ఈ సినిమా కూడా నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. మరో టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటిస్తోన్న కోర్టు మూవీ కూడా ఈ ఓటీటీలోనే రానుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న అనగనగా ఒక రాజు, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రాల హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ రివీల్ చేసింది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/zUpUbt2SdV— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 The truth is on trial, and one lawyer is determined to prove it. ⚖️ Court: State vs A Nobody, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/HzHtBdITgc— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 No plan, no limits, only guts 💥 Jack, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/90hJsZEYKd— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
ఓటీటీలో తెలుగు సినిమా.. తిరుమల సీన్స్పై వివాదం!
ఇటీవల తిరుమల కొండపై వివాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే బిగ్ బాస్ ప్రియాంక మెట్లమార్గంలో ప్రాంక్ వీడియో చేయగా.. మరో యువతి పుష్ప సాంగ్ రీల్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వీరిద్దరు క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా తిరుమలలో మరో వివాదం చోటు చేసుకుంది.నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35 చిన్నకథకాదు. ఈ మూవీ అంతా దాదాపుగా తిరుపతిలోనే తెరకెక్కించారు. అయితే కొన్ని సీన్స్ తిరుమలలో కూడా రూపొందించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద హీరో కూర్చొని ఉన్నట్లు దర్శకుడు చూపించారు. అంతేకాకుండా తిరుమల ఘాట్ రోడ్ సీన్లు కూడా తెరపై కనిపించాయి. కానీ తిరుమల కొండపై షూటింగ్లపై ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. ఎవరు కూడా తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు నడకదారి, ఘాట్ రోడ్లలో కూడా షూటింగ్స్ చేయడానికి అనుమతులు కూడా లేవు. దీంతో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కనిపించడంతో అది మరో వివాదానికి దారితీసింది.ఓటీటీలో స్ట్రీమింగ్..అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అందుబాటులో ఉంది. తన కుమారుడి చదవు కోసం ఓ తల్లి పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. -
9 నెలల తర్వాత ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పుడు తాజా ట్రెండ్ ప్రకారం థియేటర్లలో సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. పెద్ద సినిమాలైతే కనీసం వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద నిలబడుతున్నాయి. కంటెంట్తో మరికొన్ని సినిమాలు రెండు, మూడు వారాలపాటు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా తెలుగులోనూ అలా వచ్చి ఇలా వెళ్లిన సినిమాలు చాలానే ఉన్నాయి.అలా ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో చాలామందికి తెలియదు. ప్రియదర్శి, శ్రీద, మణికందన్ లాంటి టాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో దర్శనమిచ్చింది. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 23న తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ టాలీవుడ్లో పెద్దగా ఎక్కడా టాక్ వినిపించలేదు. రిలీజైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీకి రావడంతో ఇదేప్పుడు తీశారంటూ ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో మూవీ రిలీజైనట్లు ఎవరికీ తెలియలేదు. కాగా.. ఓ బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే కథాంశంగా నారాయణ చెన్న దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాకు వివేక్ రామస్వామి సంగీతమందించారు. -
'సారంగపాణి జాతకం'లో ఫుల్ కామెడీ (టీజర్)
ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తిగా నవ్వులు పూయించేలా టీజర్ ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ తెరకెక్కింది. తాజాగా విడుదలైన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. -
భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా?
ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది.ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఓ పరిపూర్ణ హాస్యభరిత చిత్రంగా ‘సారంగపాణి జాతకం’ ఉంటుంది. ఈ నెల 21న టీజర్ను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
‘35: చిన్న కథ కాదు’ చిత్రానికి పిల్లలే హీరోలు: నిర్మాత
‘‘కన్నడలో ‘కాంతార’, మలయాళంలో ‘మంజుమ్మల్ బాయ్స్, తమిళంలో ‘మహారాజా’ తరహాలో తెలుగులో ‘35: చిన్న కథ కాదు’ సినిమా కూడా విజయం సాధిస్తుంది. బాపు, కె. విశ్వనాథ్, బాలచందర్గార్ల సినిమాలను గుర్తు చేస్తుంది’’ అన్నారు నిర్మాత సృజన్ యరబోలు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘35: చిన్న కథ కాదు’. నంద కిశోర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సృజన్ మాట్లాడుతూ– ‘‘ఓ స్కూల్ పిల్లవాడికి లెక్కలు రాకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయొచ్చని ఓ తండ్రి ఏం ఆలోచించాడు? అన్నదే కథ. ఈ చిత్రకథ తిరుపతి నేపథ్యంలో జరుగుతుంది. చెప్పాలంటే... కథలో తిరుపతి అనే ప్లేస్ కూడా ఓ క్యారెక్టర్లా ఆడియన్స్కు అనిపిస్తుంది. సినిమాలో మంచి మదర్ సెంటిమెంట్ ఉంది. మదర్ సెంటిమెంట్ను మించిన కమర్షియల్ అంశం ఏం ఉంటుంది? ఇంకా తండ్రీకొడుకులు, అన్నాచెల్లెళ్లు... ఇలా చాలా రిలేషన్స్ సినిమాలో ఉన్నాయి. స్కూల్ ఎపిసోడ్స్ బాగుంటాయి. ఓ విధంగా పిల్లలే ఈ సినిమాకు హీరోలనుకోవచ్చు. ప్రస్తుతం ‘గతం 2’, తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బా కాంబినేషన్లోని సినిమాలు ఉన్నాయి. ‘మహారాజా’ తరహాలో ఓ థ్రిలర్ మూవీ కూడా ఉంది. రమ్యకృష్ణగారిని అనుకుంటున్నాం’’ అని అన్నారు. -
'ఇది చిన్న కథ కాదు'.. రిలీజ్ ఎప్పుడంటే?
నివేదా థామస్, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం '35-చిన్న కథ కాదు'. నంద కిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ మూవీని రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో రానా ట్విటర్ ద్వారా షేర్ చేశారు.ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానున్నట్లు వెల్లడించారు. ప్రియదర్శి బర్త్ డే కావడంతో రిలీజ్ తేదీతో పాటు స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ చూస్తే ఈ సినిమాను ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమెషన్స్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. Get ready to experience the heartwarming Story of every household ❤️ ✨️ "Chinna Katha Kaadu"#35Movie in Theatres on SEPTEMBER 6th!#35CKK @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @gautamitads #NandaKishore @nikethbommi #VivekSagar @siddharthr87 @srujanyarabolu1… pic.twitter.com/aanB0IcZq5— Rana Daggubati (@RanaDaggubati) August 25, 2024 -
జాతకాలు చెబుతానంటోన్న టాలీవుడ్ హీరో..!
ఇటీవలే డార్లింగ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ. నభా నటేశ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సారంగపాణి జాతకం'. ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.ఇవాళ ప్రియదర్శి బర్త్డే కావడంతో సారంగపాణి జాతకం ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ రివీల్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయిచండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ… 'నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే సారంగపాణి జాతకం. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే హాస్య చిత్రమని' అన్నారు.ఇప్పుడే మొదలైంది, త్వరలో మీకే తెలుస్తుంది 🤩😉Taking you on a jam-packed comedy ride with our #SarangapaniJathakam 🖐🏻🔍@krishnasivalenk #MohanKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore #AvasaralaSrinivas @harshachemudu… https://t.co/80Zwnf84Fv— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) August 25, 2024 -
డార్లింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి అనుకున్న తరుణంలో డార్లింగ్ సినిమా వచ్చింది. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శి హీరోగా నటించగా నభా నటేష్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ జూలై 19న విడుదలైంది.ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 13 నుంచి హాట్స్టార్లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది చూసిన ప్రియదర్శి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.డార్లింగ్ కథేంటంటే?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యను హనీమూన్కు పారిస్ తీసుకోవాలని కలలు కంటూనే పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయి(అనన్య నాగళ్ల)ని పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ఇంతలో ఆమె ప్రేమించినవాడితో పారిపోతుంది. తన పెళ్లి పెటాకులైందన్న బాధతో రాఘవ్ చనిపోవాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆనంది (నభా నటేష్) పరిచయమవుతుంది. తనతోనే ఇతడి పెళ్లి జరుగుతుంది. అసలు ఆనంది ఎవరు? అపరిచితురాలిగా ఒక్కో సమయంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది? తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఓటీటీలో డార్లింగ్ చూడాల్సిందే! Gear up for a MADMAX Marriage Entertainer 🔥💯#DarlingonHotstar Streaming from 13th August only on #DisneyPlusHotstar@PriyadarshiPN @NabhaNatesh @dir_aswin @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #VivekSagar @GNadikudikar @NareshRamadurai @PradeepERagav @seethu77in… pic.twitter.com/mYSJYVlH7Q— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 2, 2024 చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్ -
చాణక్య మాస్టారు
పిల్లలకు లెక్కలు చెప్పడానికి నీట్గా రెడీ అయి స్కూల్కి వెళ్లారు లెక్కల మాస్టారు చాణక్య వర్మ. ఒక విద్యార్థి హాయిగా నిద్రపోతుంటే గుర్రున చూశారు మాస్టారు. మరో ఇద్దరు బాలురు నేచురల్ కాల్ అంటూ చిటికెన వేలు చూపిస్తారు. ఇలా చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఈ విద్యార్థుల లెక్కలు ఎలా తేల్చాలా అన్నట్లు ముఖం పెడతారు మాస్టారు.చాణక్య వర్మగా ప్రియదర్శి నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. గురువారం విడుదల చేసిన ఈ పాత్ర తాలూకు వీడియో గ్లింప్స్లో పైన చెప్పిన దృశ్యాలు కనిపించాయి. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో రూపొందిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
'డార్లింగ్' సినిమా రివ్యూ
కమెడియన్గా ఇండస్ట్రీలోకి వచ్చి 'మల్లేశం', 'బలగం' సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ గట్టిగానే చేసిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉంది? హిట్ కొట్టిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?రాఘవ్ (ప్రియదర్శి).. పెళ్లి చేసుకుని భార్యని హనీమూన్కి పారిస్ తీసుకెళ్లాలనే ధ్యేయంతో పెరిగి పెద్దవుతాడు. తల్లిదండ్రులు చూపించిన నందిని(అనన్య నాగళ్ల)తో పెళ్లికి రెడీ అవుతాడు. కానీ ఈమె, ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. పెళ్లి పెటాకులైందని రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా అక్కడ ఆనంది (నభా నటేష్) కలుస్తుంది. పరిచయమైన ఆరు గంటల్లోనే రాఘవ్ ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఇంతకీ ఆనంది ఎవరు? ఆమె ఒక్కో టైంలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఒకే మనిషి ఒక్కో సమయంలో ఒక్కోలా ప్రవర్తించడం.. దీన్నే ఇంగ్లీష్లో స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. గతంలో 'అపరిచితుడు' మూవీని ఇదే కాన్సెప్ట్తో తీశారు. కాకపోతే అది పూర్తిగా ఎమోషనల్ వేలో సాగుతుంది. ఒకవేళ ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీ అమ్మాయికి ఉందని తెలిస్తే ఏమైందనేదే 'డార్లింగ్' సినిమా.ట్రైలర్, ప్రచార చిత్రాలు చూస్తే ఈ మూవీ కథేంటనేది తెలిసిపోతుంది. ఇందులో పెద్దగా దాపరికాలు లేవు. ఫస్టాప్ అంతా హీరో... పెళ్లి ధ్యేయమన్నట్లు పెరిగి పెద్దవడం, పెళ్లి నిశ్చయమైన తర్వాత అమ్మాయి మరో వ్యక్తితో లేచిపోవడం, సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఊహించని పరిస్థితుల్లో ఊరు పేరు తెలియని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. మధ్యమధ్యలో కామెడీ.. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్కి పర్వాలేదనిపించే ట్విస్ట్.సెకండాఫ్లో భార్యకు ఎందుకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకోవడానికి భర్త చేసే ప్రయత్నాలు, మొదట్లో కామెడీ కామెడీగా ఉండే సినిమా.. చివర్లో ఎమోషనల్గా ఎందుకు ఎండ్ కావాల్సి వచ్చిందనేది మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ పరంగా ఇది మంచి లైనే. కానీ డైరెక్టర్ చాలాసార్లు తడబడ్డాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అని ఫస్టాప్ అంతా నవ్వించాడు. ఇంటర్వెల్కే కథని ముగించిన ఫీలింగ్ తెప్పించాడు.అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చి హీరోయిన్కి మల్టీపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని చెప్పి, మరోసారి ఇదే కాన్సెప్ట్పై నవ్వించాలనుకున్నాడు. కానీ సెకండాఫ్లో ఇది సరిగా వర్కౌట్ కాలేదు. స్టోరీ అంతా ఒకే పాయింట్ దగ్గర తిరిగిన ఫీలింగ్ వస్తుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్లు పడటంతో మరీ సూపర్ కాకపోయినా పర్లేదు అనిపించే సినిమా చూశాంలే అనే అభిప్రాయంతో థియేటర్ బయటకు వస్తాం.హీరోయిన్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ప్రేక్షకుడికి ఎక్కవు, నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్ అంతో ఇంతో కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది వదిలేస్తే.. సీన్లు సీన్లుగా చూస్తే మాత్రం కొన్ని చోట్ల బాగానే పేలాయి. ఎవరెలా చేశారు?'డార్లింగ్' స్టోరీని హీరోయిన్ బేస్డ్గా రాసుకున్నారు. కానీ నభా నటేష్ని ఆ పాత్ర కోసం తీసుకుని పొరపాటు చేశారు! ఎందుకంటే ఈమె పాత్రతో ప్రేక్షకులు అస్సలు కనెక్ట్ కాలేకపోతారు. కొన్ని సీన్లలో పర్లేదనిపిస్తుంది కానీ కొన్నిచోట్ల విసిగిస్తుంది. హీరోగా చేసిన ప్రియదర్శి.. తనకు అలవాటైన కామెడీ ప్లస్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఓ పాటలో డ్యాన్స్ కూడా చేశాడు. హీరో తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్, మామగా చేసిన రఘబాబు, పిన్నిగా చేసిన నటి బాగా నటించారు. బ్రహ్మానందం, సుహాస్, నిహారిక లాంటి స్టార్స్ అతిథి పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా వర్కౌట్ కాలేదు.టెక్నికల్ టీమ్ 'డార్లింగ్' కోసం బాగానే కష్టపడ్డారు. పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ గుడ్. నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అశ్విన్ రామ్.. స్క్రిప్ట్ని ఇంకాస్త బెటర్గా రాసుకుని ఉండాల్సింది. అలానే 2 గంటల 41 నిమిషాల నిడివి ఎక్కువైపోయింది. 15-20 నిమిషాలు తగ్గించి, సెకాండాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా ఎంటర్ టైనింగ్గా ఉండేది. జస్ట్ ఫన్ కోసమే థియేటర్కి వెళ్లాలనుకునే ప్రేక్షకులకు 'డార్లింగ్' మంచి ఆప్షన్.రేటింగ్: 2.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
ఆ నాలుగు సినిమాల్లో ‘డార్లింగ్’ ఉంటుంది: ప్రియదర్శి
ఏడాదికి వందకు పైగా కామెడీ సినిమాలు వస్తే.. థియేటర్స్లో చూసి గుర్తు పెట్టుకునే సినిమాలు నాలుగైదు మించి ఉండవు. వాటిలో ఈ ఏడాది ‘డార్లింగ్’ కూడా ఉంటుంది. ఇందులో కావాల్సినంత కామెడీ ఉంది. మంచి మ్యూజిక్ ఉంది. ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’ అన్నారు హీరో ప్రియదర్శి . ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్’. నభా నటేష్ హీరోయిన్. ఆశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. కొత్త కథలు, వినూత్నమైన ఆలోచనలని ఇష్టపడుతున్నారు. మల్లేశం, బలగం, సేవ్ ది టైగర్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే... ఫ్యామిలీ డ్రామాకి ఎప్పుడూ స్పేస్ ఉందని నిరూపించాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇండియన్ సొసైటీలో ఎవర్ గ్రీన్. నటుడిగా నేర్చుకోవడానికి ఎంతో అవకాశం దొరుకుతుంది. రిలేట్ చేసుకునే కథలు చెప్పడంలో మజా వేరుగా ఉంటుంది.→ డార్లింగ్ సినిమాలో విమన్ క్యారెక్టర్కి స్ప్లిట్ పర్షనాలిటీ అనే స్పెషల్ కండీషన్ ఉంటుంది. దిన్ని ప్రజెంట్ చేసిన తీరు చాలా వైవిధ్యంగా ఉంటుంది. రెండు క్యారెక్టర్ లు సీరియస్ గా బాధపడుతుంటే ప్రేక్షకుడికి నవ్వొస్తుంది. డార్క్ కామెడీలో వున్న మ్యాజిక్ ఇది. డార్లింగ్ లో అది చాలా అద్భుతంగా ఎక్స్ ఫ్లోర్ చేశాం.→ నభా లాంటి యాక్టర్ తో నేనెప్పుడూ పని చేయలేదు. నాలాంటి యాక్టర్ తో తనూ ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా ఇద్దరి పెయిరింగ్ చాలా ఫ్రెష్ గా ఉందని చాలా మంది అన్నారు. ఆనంద్ సామి అనే యాక్టింగ్ ట్రైనర్ తో ఒక వర్క్ షాప్ చేశాం.15 రోజుల పాటు ప్రతిరోజు స్కూల్ కి వెళ్లి నేర్చుకున్నట్లుగా మంచి ఎక్స్ పీరియన్స్ అది. ఇందులో నా క్యారెక్టర్, నభా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.→ డైరెక్టర్ అశ్విన్ రామ్ని సందీప్ కిషన్ 'ఏ వన్ ఎక్స్ ప్రెస్' షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం కలిశాను. తను ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. అశ్విన్ మంచి లీడర్ షిప్ క్యాలిటీస్ , కమ్యునికేషన్ స్కిల్, క్లియర్ విజన్ ఉన్న దర్శకుడు. రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.→ డార్లింగ్ లో డ్యాన్సులు కూడా చేశాను. నేను కూడా డాన్స్ చేస్తానాని నాకే తెలియదు(నవ్వుతూ).ఈ క్రెడిట్ అంతా వివేక్ సాగర్, విజయ్ పోలాకి మాస్టర్, సెట్ డిజైన్ చేసిన గాంధీ కి దక్కుతుంది. → ఆగస్ట్ 15న నేను నటించిన 35 ‘చిన్న కథ కాదు’ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఓ సినిమా చేస్తున్నా. వైజయంతి మూవీస్ లో రోషన్ తో ఓ సినిమా ఉంది. సేవ్ టైగర్స్ సీజన్ 3 కూడా చేయాలి. -
ఈ దశాబ్దంలో నా ఫేవరేట్ మూవీ అదే: హీరో నాని కామెంట్స్
టాలీవుడ్ హీరో నాని గతేడాది హాయ్ నాన్నతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ నటుడు ఎస్జే సూర్య, సాయికుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలోకి రానుంది.అయితే తాజాగా హైదరాబాద్లో జరిగిన డార్లింగ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలోనే తనకిష్టమైన సినిమా బలగం అని నాని అన్నారు. బలగం హీరో ఫ్యాన్గా ఈవెంట్కు వచ్చానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. డార్లింగ్ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని.. నీ కెరీర్లో ఒక మైల్స్టోన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.అనంతరం ప్రియదర్శి సైతం నాని గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో నాలాంటి వారికి నాని అన్ననే ఆదర్శమని అన్నారు. ఎలాంటి బ్యాగ్గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. సినిమాల్లో నువ్వు కృష్ణుడు అయితే.. నేను అర్జునుడిని అంటూ నానిపై ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన డార్లింగ్ మూవీ ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. Grandfather time lo #SrNTR Inspiration,Nanna time lo #Chiranjeevi Inspiration,Aa tarwtha #RaviTeja Inspiration.Ma generation ki @NameisNani Inspiration.#Nani Anna, A Genuine Person❤️.Can’t wait for #SaripodhaaSanivaaram @DVVMovies #VivekAthreya pic.twitter.com/PPf7HhxjEP— Saikumar Devendla (@saidevendla) July 16, 2024#Nani About #Balagam and #Darling Film 💥💥💥💥pic.twitter.com/fH1HSAhYrG— GetsCinema (@GetsCinema) July 15, 2024 -
Darling Movie Pre Release Event: ప్రియదర్శి ‘డార్లింగ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తున్నాం: నాని
‘‘ఈ మధ్య సినిమాల్లో యాక్షన్ ఎక్కువైపోయి ప్రేమకథలు, వినోదం చాలా మిస్ అవుతున్నాం. చిన్నప్పుడు అన్నిరకాల జానర్స్ మూవీస్ వచ్చేవి.. అన్నింటినీ ఎంజాయ్ చేసేవాళ్లం. థియేటర్స్కి వెళ్లడానికి ఎక్కువ కారణాలుండేవి. కానీ, ఇప్పుడు మనకు తెలియకుండానే ఒకే జానర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తున్నాం. అందరం కామెడీ, లవ్స్టోరీ, ఎమోషనల్, యాక్షన్.. ఇలా అన్ని జానర్స్ టచ్ చేయాలి. ప్రియదర్శిలాంటి ప్రతిభ ఉన్న నటుడు వైవిధ్యమైన జానర్స్ ఎంచుకోవడం గర్వంగా ఉంది’’ అని హీరో నాని అన్నారు.ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనన్య నాగళ్ల కీలక పాత్ర చేశారు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ–‘‘డార్లింగ్’ మూవీ టీజర్, ట్రైలర్ చాలా వినోదాత్మకంగా ఉంది. సినిమా పెద్ద బ్లాక్బస్టర్ కావాలి. ‘హను–మాన్’ మూవీ స్థాయిలో ‘డార్లింగ్’ విజయం సాధించాలి.వివేక్ సాగర్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే అశ్విన్ రామ్ ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తోంది. నభా నటేశ్.. ప్రమాదం తర్వాత నీ కొత్త అధ్యాయం ‘డార్లింగ్’ తో ప్రారంభమైంది. దర్శి అంటే నాకు చాలా ఇష్టం. తన నటన, చేసే పాత్రలు ఇష్టం. అందుకుని ‘డార్లింగ్’ ఈవెంట్కి రాలేదు. నాకు ఇష్టమైన ‘బలగం’ మూవీ హీరో అని, ‘బలగం’ మూవీ అభిమానిగా వచ్చా. ‘బలగం’ స్థాయిలో ‘డార్లింగ్’ విజయం సాధించాలి.ఈ మూవీ తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలవాలి. నా వాల్పోస్టర్ ప్రొడక్షన్లో నేను నిర్మించనున్న తర్వాతి సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తాడు. జగదీశ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తాడు’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ నరేశ్ రామదురై, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, వివేక్ కూచిభొట్ల, అనన్య నాగళ్ల, డైరెక్టర్స్ వీఐ ఆనంద్, వేణు యెల్దండి పాల్గొన్నారు. -
తెలుగు సినిమాలపై నాది వన్ సైడ్ లవ్ : డైరెక్టర్ అశ్విన్ రామ్
‘‘చిన్నప్పట్నుంచీ తెలుగు సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నాను. తమిళ దర్శకుడు అట్లీ తీసిన ‘రాజా రాణి’కి దర్శకత్వ విభాగంలో చేశాను. దర్శకుడు మురుగదాస్ ప్రొడక్షన్లోని మూడు సినిమాల్లో భాగమయ్యాను. ధనుష్గారి సినిమాలకూ వర్క్ చేశాను. తమిళంలో ఓ సినిమాకు దర్శకత్వం వహించాను. తెలుగు సినిమాలపై నాది వన్ సైడ్ లవ్ (నవ్వుతూ). ఇప్పుడు తెలుగులో ‘డార్లింగ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు అశ్విన్ రామ్. ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘డార్లింగ్’. కె. నిరంజన్రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్ రామ్ మాట్లాడుతూ– ‘‘భార్యాభర్తల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ‘డార్లింగ్’. ఈ అనుబంధం నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ మా ‘డార్లింగ్’ కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ మా సినిమాను చూసిన నలభైమంది ఈ కొత్తదనాన్నే ఫీలయ్యారు. ఈ సినిమా ట్రైలర్ చూసి నభా ΄ాత్రలో స్లి్పట్ పర్సనాలిటీ ఉంది కాబట్టి కొందరు ‘అపరిచితుడు’తో ΄ోల్చుతున్నారు. ‘డార్లింగ్’, ‘అపరిచితుడు’ సినిమాల మధ్య ఉన్న కామన్ ΄ాయింట్ స్లి్పట్ పర్సనాలిటీ మాత్రమే’’ అన్నారు. -
డార్లింగ్ విజయం సాధిస్తుంది: విశ్వక్ సేన్
‘‘డార్లింగ్’ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ అద్భుతంగా తీశారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. యూనిట్కి ఆల్ ది బెస్ట్’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ను విశ్వక్ సేన్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సమయంలో నన్ను వేదికపైకి ఆహ్వానించి సైకో వివేక్గా పరిచయం చేశాడు ప్రియదర్శి. ‘మల్లేశం, బలగం’ లాంటి సినిమాలు అందరికీ పడవు.. రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు తను ‘డార్లింగ్’ తో రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శి గెలిస్తే నేను గెలిచినట్లు అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డార్లింగ్ అనగానే ప్రభాస్అన్న పేరు గుర్తొస్తుంది. అలాంటి టైటిల్ పెట్టుకోవాలంటే భయంగా ఉండేది. అయితే కథని నమ్మి ‘డార్లింగ్’ టైటిల్ పెట్టుకున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘నేను ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అని ఆలోచిస్తున్నపుడు ‘డార్లింగ్’ అవకాశం వచ్చింది’’ అన్నారు నభా నటేష్. ‘‘మూడేళ్ల ప్రయాణం ‘డార్లింగ్’. వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది’’ అన్నారు అశ్విన్ రామ్. ‘‘కథని నమ్మి తీసిన ఈ మూవీకి ప్రేక్షకుల ్రపోత్సాహం కావాలి’’ అన్నారు చైతన్య. -
యాక్సిడెంట్తో ఓ రకమైన మైండ్సెట్లోకి వెళ్లా: నభా నటేష్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నభా నటేష్. అంతకు ముందు పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు కానీ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్తో నభా కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదం నభా భుజానికి తీవ్ర గాయం అయింది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తాజాగా ‘డార్లింగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నభా మీడియాతో మాట్లాడుతూ..యాక్సిడెంట్ జరిగినప్పుడు తన మానసిన పరిస్థితి ఎలా ఉందో వివరించింది. (చదవండి: అందరినీ మెప్పించేలా 'డార్లింగ్'.. ఆసక్తిగా ట్రైలర్)‘నా సినీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఓ రకమైన మైండ్సెట్లోకి వెళ్లిపోయాను. ఆపరేషన్ అయిన పది రోజులకే షూటింగ్లో పాల్గొన్నాను. దీంతో నా హెల్త్ మళ్లీ ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇంకో సర్జరీ జరిగింది. నా శరీరానికి కచ్చితంగా రెస్ట్ ఇవ్వాలనిపించింది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమని ఫిక్స్ అయ్యాను. చాలా కేర్ తీసుకొని 6 నెలల పాటు నా ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. ఫిజికల్గా ఫిట్ లేకుంటే సినిమాలు చేయలేం. అందుకే సమయం తీసుకున్నాను. ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్ అయ్యాకే మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాను. చాలా గ్యాప్ తార్వత ‘డార్లింగ్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇస్మార్ట్ శంకర్ లాంటి కమర్షియల్ సినిమా తర్వాత ‘డార్లింగ్’ లాంటి సినిమా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. బట్ ఆడియన్స్కి తెలుసు..ఇప్పుడు కంటెంట్ అనేది న్యూ కమర్షియల్ అని. డైరెక్టర్ అశ్విన్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమాకి ఒప్పుకున్నాను. నా పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని నభా చెప్పుకొచ్చింది. -
అందరినీ మెప్పించేలా 'డార్లింగ్'.. ఆసక్తిగా ట్రైలర్
ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. హనుమాన్ సినిమా తర్వాత ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై డార్లింగ్ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య విడుదల చేస్తున్నారు.ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రేమ కథతో 'డార్లింగ్' చిత్రాన్ని తెరకెక్కించినట్లు శ్రీమతి చైతన్య తెలిపారు. విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్ ఉన్న యువ జంట కథతో వస్తున్నందున ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని భావించారు.పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం పారిస్కు వెళ్లాలని ఏకైక లక్ష్యంతో హీరో ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యకు స్ల్పిట్ పర్సనాలిటీ అనే జబ్బు ఉందని తేలుతుంది. దీంతో ఆమె ఆపరిచితుడులోని విక్రమ్ మాదిరి పలు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీని గురించి అసలు విషయం తెలియక ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనేదే డార్లింగ్ చిత్రంలో చూపించనున్నారు. నభా నటేశ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. జులై 19న ఈ చిత్రం విడుదల కానుంది. -
హను–మాన్ మాకు ఓ వరం: నిర్మాత చైతన్య
‘‘మా ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ సంస్థలో నిర్మించే సినిమాలకు కథే హీరో. ‘డార్లింగ్’ సినిమాకూ అంతే. ఈ చిత్రంలో ప్రియదర్శి, నభా నటేశ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చైతన్య. ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది.ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెతన్య మాట్లాడుతూ– ‘‘డార్లింగ్ కథను నిరంజన్రెడ్డిగారే ఓకే చేశారు. మాది ప్రేమ వివాహం. దర్శకుడు రామ్ అశ్విన్ది కూడా ప్రేమ వివాహం. సో.. ప్రేమ నేపథ్యంలో రామ్ చెప్పిన ‘డార్లింగ్’ సినిమా పాయింట్కు నిరంజన్ కనెక్ట్ అయ్యారు. సింపుల్గా ఉండే అబ్బాయి పాత్రలో ప్రియదర్శి, కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటూ స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో నభా కనిపిస్తారు.ఇక ‘హను–మాన్’ సినిమా మాకు ఓ వరంలా లభించింది. సంక్రాంతి సమయంలో విడుదల కావడం, అంత పెద్ద హిట్ కావడం అనేది ఆ హనుమంతుడి దయ వల్లే జరిగిందని భావిస్తున్నాం. ‘హను–మాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నావరకైతే ‘జై హనుమాన్’లో చిరంజీవి, రామ్చరణ్గార్లు అయితే బాగుంటుందని అనుకుంటున్నా. సాయితేజ్గారితో ఓ సినిమా ప్రకటించాం. ఇంకో పది సినిమాలుప్రోడక్షన్లో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో మా బేనర్ నుంచి పది సినిమాలు రిలీజ్ అవుతాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రెండు మాస్టర్స్ డిగ్రీలు చేశాను. టెక్నికల్ సపోర్ట్ ఉంది. సో.. బిజినెస్ను నేను బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఇందుకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది’’ అన్నారు. -
‘35’ (చిన్న కథ కాదు) మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'35 చిన్న కథ కాదు'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. -
Darling Movie: ఆకట్టుకుంటున్న నభా నటేశ్ ‘రాహి రే’ సాంగ్
ప్రియదర్శి, నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ‘వై దిస్ కొలవెరి’ అన్నది ట్యాగ్లైన్. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాహి రే...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్ ఆలపించారు. ‘‘యునిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డార్లింగ్’. ‘రాహి రే...’ పాట మెలోడియస్గా సాగుతుంది. నభా నటేశ్ పై సాగే ఈ పాటను సినిమాటోగ్రాఫర్ నరేష్ రామదురై అందంగా చిత్రీకరించారు’’ అన్నారు మేకర్స్. -
చిన్న కథ కాదు!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35– చిన్న కథ కాదు’. ఈ చిత్రానికి నంద కిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సురేష్ ప్రోడక్షన్స్ ఎస్. ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రోడక్షన్స్ పై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి ‘35– చిన్న కథ కాదు’ అనే టైటిల్ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఆగస్ట్ 15న సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా ‘35–చిన్న కథ కాదు’. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా చక్కని వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా నికేత్ బొమ్మి. -
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి నెటిజన్స్కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
‘మై డియర్ దొంగ’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్! అంత మాట అనేసిందేంటి!
టాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నభా నటేశ్. ఆమె ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభూ చిత్రంలో నటిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఓ కథానాయికగా నటిస్తుండగా.. నభా నటేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా నభా నటేశ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ డార్లింగ్ అంటూ చెప్పే డైలాగులతో ఓ వీడియోను పంచుకుంది. ఇది చూసిన ప్రియదర్శి పులికొండ.. వావ్ సూపర్ డార్లింగ్.. కిరాక్ ఉన్నావ్ డార్లింగ్.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే ప్రియదర్శి చేసిన కామెంట్స్పై నభా నటేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మిస్టర్.. ఒకరిని కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త, హద్దులు దాటొద్దు.. అంటూ మండిపడింది. అలాగే పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే లైంగిక వేధింపులకు కిందకే వస్తుందని గతంలో కోల్కతా హైకోర్టు తీర్పునిచ్చిందంటూ దానికి సంబంధించిన వార్త క్లిప్ను నభా నటేశ్ షేర్ చేసింది. ఇది చూసిన ప్రియదర్శి సైతం అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మీరేమో డార్లింగ్ అని పిలవొచ్చు.. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్ అంటూ పోస్ట్ చేశారు. ఇదంతా కేవలం ఫన్నీ కోసమే చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీరిద్దరి మధ్య సంభాషణ మాత్రం నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా.. ప్రియదర్శి ఇటీవల సేవ్ ది టైగర్స్-2 సీజన్తో ప్రేక్షకులను అలరించారు. Ohoo! Why this Kolaveri 😉🙃 https://t.co/r7DZYWTCtB — Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024 WOW Superrrrrr 🤩 Darlinggggg 😍 Kirrrraakkk Unnav Darling😘🤌🏼 https://t.co/fIYSCaCfYo — Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024 -
కడుపుబ్బా నవ్వుకునే మూవీ, చివరి 20 నిమిషాలైతే..
హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు మారుతి ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ దిల్ రాజు మాట్లాడుతూ.. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. థియేటర్కు వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. మంచి ఎంటర్టైనర్ మూవీ ఈ సమ్మర్కు వచ్చింది. అందరూ థియేటర్కు వెళ్లి ఎంజాయ్ చేయండి' అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ... 'ఓం భీమ్ బుష్' ప్రీమియర్ చూశాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్ను కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది' అన్నారు. కష్టే ఫలి హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం. థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలకు మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది అన్నారు. రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. కష్టే ఫలి అంటారు. మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు. (నవ్వుతూ) కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా వుంటుంది. తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతావారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనంద పడుతున్నాం'' అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ... ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయామని చెప్పారు. చదవండి: నటిని నానామాటలన్న అత్త.. ఇప్పుడేమో తెగ పొగిడేస్తోంది! -
‘ఓం భీమ్ బుష్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ
టైటిల్: ఓం భీమ్ బుష్ నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సమర్పణ: యూవీ క్రియేషన్స్ దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి సంగీతం: సన్నీ ఎమ్ఆర్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం ఎడిటింగ్: విజయ్ వర్ధన్ విడుదల తేది: మార్చి 22, 2024 ‘ఓం భీమ్ బుష్’ కథేంటంటే? కృష్ణ కాంత్ అలియాస్ క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మాధవ్ రేలంగి అలియాస్ మ్యాడీ(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వారి కోరిక .పీహెచ్డీ కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. ఐదేళ్లయినా పీహెచ్డీ పూర్తి చేయరు. కాలేజీలో వీళ్లు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ విలుకొండ(శ్రీకాంత్ అయ్యంగార్). ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి, తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. సైంటిస్టుల అవతారమెత్తి ఎ టు జెడ్ సర్వీసెస్ పేరు ఓదుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాంగ్ బ్రోస్(ఈ ముగ్గురి టీమ్ పేరు బ్యాంగ్ బ్రోస్) నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బుకోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్(ఆదిత్యా మీనన్).. ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఊరి చివరన ఉన్న సంపంగి మహాల్లోకి వెళ్లి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంపంగి దెయ్యం ఉన్న ఆ మహాల్లోకి వెళ్లిన తర్వాత బ్యాంగ్ బ్రోస్కి ఎదురైన సంఘటనలు ఏంటి? సంపంగి మహల్ కథ ఏంటి? ఇంతకీ ఆ మహల్ లో నిధి ఉందా లేదా? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘ఓం భీమ్ బుష్’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు వాస్తవానికి విరుద్దంగా, లాజిక్ లెస్గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ ఒకటి. ‘నో లాజిక్ ఓన్లీ మేజిక్ ’అని టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు శ్రీహర్ష.. అందుకు తగ్గట్టే ఓన్లీ స్క్రీన్ప్లేతో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తరహాలో సాగే ముగ్గురు స్నేహితుల కథకి హారర్ని జోడించి.. చివరిలో ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల భయపెడతూనే ఓ డిఫరెంట్, ఎమోషనల్ లవ్స్టోరీని చెప్పాడు. టైటిల్లో చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచే ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మహల్ లో తాంత్రిక పూజ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్ తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చేవరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. భైరవపురంలో బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఊరి ప్రజలతో ఈ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్కి థియేటర్స్లో పగలబడి నవ్వుతారు. అలాగే అర్థరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి చేసే అల్లరి, ప్రియదర్శి, ఆదిత్య మీనన్కు సంబంధించిన సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది.ద్వితియార్థం మొత్తం సంపంగి మహాల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హారర్ సీన్ పెట్టాలి? ఎలాంటి సీన్కి నవ్వుతారు? లాంటివి లెక్కలేసుకొని బలమైన స్క్రీప్ట్ రాసుకున్నాడు. సంపంగి దెయ్యం, ప్రియదర్శిని భయపెట్టే సీన్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూనే నవ్వుతుంటాం. అయితే సంపంగి దెయ్య నేపథ్యం తెలిశాక వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్గా ఉంటాయి. కానీ చివరిలో మాత్రం ఓ కొత్త పాయింట్ని టచ్ చేశాడు. ఇంతవరకు ఎవరూ అలాంటి అంశాన్ని ఇంత డిఫరెంట్గా తెరపై చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్నీ సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. క్రిష్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన చేసే ఇన్నోసెంట్గా కామెడీ నవ్వులు పూయిస్తుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. భయస్తుడు వినయ్ గుమ్మడి పాత్రకి ప్రియదర్శి వందశాతం న్యాయం చేశాడు. సినిమాలో బాగా నవ్వించిన సీన్లలో ఎక్కువగా ప్రియదర్శివే ఉంటాయి.మహల్లో అతనికి, దెయ్యంకి మధ్యవచ్చే సీన్లు హిలేరియస్గా అనిపిస్తాయి. ఇక రాహుల్ రామకృష్ణ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్, కామెడీతో ఆకట్టుకున్నాడు.స్పెషల్ సాంగ్లో ప్రియా వడ్లమాని అందాల అరబోసింది.ప్రీతీ ముకుందన్ , ఆయేషా ఖాన్, రచ్చరవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా ఉన్నతంగా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు బాగుంది. సన్నీ అందించిన బీజీఎం కొన్ని సీన్లను నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్ విజయ్ వర్దన్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘ఓం భీమ్ బుష్’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్ఫెక్ట్ యూత్పుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్లో రాస్తూ..' బ్లాక్బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్ జత చేశారు. కాగా.. ఈ చిత్రంలో నవీన్తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. Today marks 3 years to this joyful blockbuster film #JathiRatnalu. World was in the middle of a pandemic. But despite all challenges this throwback video is a small reminder of the euphoria that we saw in theatres that day. Sometimes I feel emotional to see how you guys have made… pic.twitter.com/Eph3DwnUwq — Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2024 -
మంత్రాన్ని తలపించేలా సినిమా టైటిల్.. ఆసక్తిగా పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండడం చూస్తే థియేటర్లలో ఫుల్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ఓం భీమ్ బుష్ అనే పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. The hilarious trio of @sreevishnuoffl, @PriyadarshiPN & @eyrahul are back 👨🏻🚀👨🏻🚀👨🏻🚀 And they are bringing the 𝐍𝐄𝐖 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐎𝐅 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐌𝐄𝐍𝐓 - #OmBheemBush - No Logic Only Magic 🪄 Directed by @HarshaKonuganti ❤️🔥 Grand Release Worldwide on March 22nd 💫… pic.twitter.com/8x6wMICA3R — UV Creations (@UV_Creations) February 22, 2024 -
'నా బలగం అందరు చూశారు.. ఒక్క ఆయన తప్ప': వేణు ఎమోషనల్ పోస్ట్!
బలగం సినిమాతో అందరినీ ఏడిపించిన డైరెక్టర్ వేణు యెల్దండి. జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత నటుడిగా, కమెడియన్గా రాణించారు. గతేడాది తెలంగాణ పల్లె నేపథ్యంలో బలగం సినిమాను తెరకెక్కించారు. ఎవరూ ఊహించని విధంగా బ్లాక్బస్టర్గా నిలిచింది. అప్పటివరకు కమెడియన్గా తెలిసిన వేణులో ఇంతమంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలిసింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో కనిపించారు. అయితే తాజాగా వేణు యెల్దండి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను తీసిన బలగం సినిమాను అందరు చూశారు.. ఒక్క మానాన్న తప్ప.. మిస్ యూ నాన్న' అంటూ పోస్ట్ చేశారు. దాదాపు 24 ఏళ్ల క్రితమే వేణు తండ్రి మరణించగా.. ఆయనను తలుచుకుని వేణు ఎమోషనలయ్యారు. అంతే కాకుండా తన తండ్రి ఫోటోను షేర్ చేశారు. Naa BALAGAM Cinema andaru choosaaru.. Maa nanna tappa🥲 MISS YOU NAAINA🙏 Late 06/02/2000#father pic.twitter.com/U831rWKRgS — Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 8, 2024 -
చిరంజీవి గారి డాడీ సినిమా లాంటి.. ఎమోషనల్ మూవీ ఇది
-
డైరెక్టర్ గురించి చెప్పాలంటే!
-
నా జీవితాన్ని 'మంగళవారం' మార్చింది: ప్రియదర్శి
‘‘అజయ్ భూపతికథ చెబితే సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. ‘మహాసముద్రం’ కథ వింటూ పదిసార్లు ఉలిక్కిపడ్డా. అయితే డేట్స్ కుదరక నేనా సినిమా చేయలేకపోయా. ఒక్క మాటలో మాట్లాడుకునే పాయింట్తో ‘మంగళవారం’ని రెండున్నర గంటల సినిమాగా నిజాయతీగా చెపారు అజయ్ భూపతి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో అజయ్ భూపతి మాట్లాడుతూ–‘‘పాయల్ పాత్రని అర్థం చేసుకుంటారా? రిసీవ్ చేసుకుంటారా అని కాస్త భయపడ్డా. అయితే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘నా సినిమా అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చని అనుకుంటారేమో... ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. ప్రతి నటుడు శుక్రవారం తన జీవితం మారుస్తుందని వెయిట్ చేస్తాడు. నాకు ఒక 'మంగళవారం' మార్చింది. నా జీవితంలో గుర్తుపెట్టుకునే 'మంగళవారం' ఇది. దీనికి కారణం అజయ్ భూపతి. ఆయన ఆడిషన్స్ అంటే మళ్లీ వెళతా’ అన్నారు. ‘మా సంస్థలో తీసిన తొలి సినిమా ‘మంగళవారం’ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనం’ అన్నారు సురేష్ వర్మ. -
మంగళవారం మూవీ.. ఆ టాలీవుడ్ హీరోను దించేశారుగా!
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఆ తర్వాత ఒక్క సరైనా హిట్ పడలేదు. తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే మళ్లీ జతకట్టింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన మంగళవారం మూవీ నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్100 మూవీతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించారు అజయ్ భూపతి. అయితే ఆ తర్వాత అజయ్ మహాసముద్రం మూవీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో పాయల్తో కలిసి ‘మంగళవారంతో దూసుకొచ్చారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) అయితే ఈ చిత్రం గురించి పాత్రలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చారు. కానీ ఈ సినిమాలోని ఓ లీడ్ క్యారెక్టర్ పేరును మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇంతలా సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో ఓ మెయిన్ రోల్ చేసిన హీరో పేరును బయటకు రాకుండా చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ అజయ్ భూపతి చేసి చూపించారు. ఆ పాత్రలో నటించింది మన టాలీవుడ్ హీరోనే కావడం మరో విశేషం. ఇంతకీ అతనెవరో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. మొత్తానికి ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించింది పాయల్ రాజ్పుత్. కానీ మన తెలుగు హీరో పేరును దాచి ఆడియన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు అజయ్. ఆ హీరో మరెవరో కాదు.. బలగం ఫేమ్ ప్రియదర్శి పులికొండ. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన బలగం సినిమాలో నటించారు. ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ లీక్ అవుతున్నాయి. అలాంటిది ప్రియదర్శి నటించాడనే విషయాన్ని మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటే మంగళవారం చిత్రబృందాన్ని మెచ్చుకోవాల్సిందే. (ఇదీ చదవండి: Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ) #Mangalavaram in Theatres now 💥💐💥💐 pic.twitter.com/8pOArYDuPZ — Moviezupp Entertainment (@moviezupp) November 17, 2023 -
సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్టేక్'... పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి
'రామ్ అసుర్' తర్వాత అభినవ్ సర్దార్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టేక్'. ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించారు. ఏఎస్పీ బ్యానర్పై రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను ప్రముఖ నటుడు, కమెడియన్ ప్రియదర్శి విడుదల చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్!) ప్రియదర్శి మాట్లాడుతూ... "అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూనే నిర్మాతగా మిస్టేక్ సినిమా చేశారు. మంచి కథపై నమ్మకంతో ఆయన నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అవుతుంది. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు. అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. "మంచి పాయింట్ అనిపించగానే 'మిస్టేక్' సినిమా మొదలు పెట్టాం. మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ భరత్ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. సినిమా ఔట్పుట్ బాగా వచ్చింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్కు కనెక్ట్ అయ్యే అంశాలన్నీ ఉంటాయి" అని అన్నారు. డైరెక్టర్ భరత్ కొమ్మాలపాటి మాట్లాడుతూ... "సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంది. ఇక యాక్షన్ సన్నివేశాలను తెలుగు సినిమాల్లో రానటువంటి యూనిక్ స్టైల్లో డిజైన్ చేసి చిత్రీకరించాం. ఆ యాక్షన్ పార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూత్, ఫ్యామిలీ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుంది" అన్నారు. ఈ చిత్రంలో అజయ్ కతుర్వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: ఖరీదైన లగ్జరీ కారు కొన్న 'అత్తారింటికీ దారేది' నటుడు.. కానీ!) -
అతనితో పోల్చడమంటే కించపరిచినట్లే.. రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లతో నటిస్తూ.. బిజీగా ఉన్నారు. ఇటీవల రాహుల్ రామకృష్ణ నటించిన ఇంటింటి రామాయణం సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రామకృష్ణ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సూపర్స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు) ఈ ఏడాది అందరినీ కంటతడి పెట్టించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధానపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాహుల్ నటించిన ఇంటింటి రామాయణం సూపర్ హిట్ కావడంతో నెటిజన్స్ అతన్ని ప్రియదర్శితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరలవుతున్న వాటిపై రాహుల్ రామకృష్ణ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాహుల్ ట్విటర్లో రాస్తూ.. 'నా ప్రాణ మిత్రుడు ప్రియదర్శి హార్ట్ వర్క్తో పాటు మంచి నటుడు. అతనితో నన్ను పోల్చడమంటే మీరు అతన్ని కించపరిచినట్లే. అతను గొప్ప నటుడే కాదు.. మంచి వ్యక్తితమున్న వ్యక్తి. ఇలా పోల్చడం మీ పిరికితనంలా అనిపిస్తుంది. నేను అతని బాటలోనే నడుస్తాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇంటింటి రామాయణం చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించగా..ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) pic.twitter.com/E51s5hGVfw — Rahul Ramakrishna (@eyrahul) July 16, 2023 -
గ్రూప్-4 పరీక్షలో 'బలగం' సినిమాపై అడిగిన ప్రశ్న ఇదే!
చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 'బలగం'. 'పిట్టకు పెట్టుడు' అనే నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు యెల్దండి ఈ చిత్రాన్ని నిర్మించారు.. టాలీవుడ్లో పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు భారీగా ఆదరణను పొందింది. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం. ఇందులోని పాత్రలు ప్రతి ఇంట్లో ఉండేవిగా.. మనుషుల బంధాలను, వారి మధ్య ప్రేమలను తెలిపేదిగా తెరకెక్కడమే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే ► 'బలగం' చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అనే ప్రశ్నకు... A. దర్శకుడు: వేణు యెల్దండి, B. నిర్మాత: దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి, C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, D. కొమరయ్య పాత్రను పోషించినారు: ఆరుసం మధుసుధన్ అనే ఆప్షన్స్ను జోడించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా రావడంతో 'బలగం' మూవీకి ఇలాంటి ప్రాముఖ్యత దక్కింది అని చెప్పవచ్చు. గతంలో 'బలగం' నుంచి అడిగిన ప్రశ్న ఇదే ఇదే ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఒక ప్రశ్న అడిగారు.. ► 2023లో ఒనికో ఫిలిమ్స్ (ONYKO Films) అవార్డులలో 'బలగం' సినిమాకి ఏ విభాగంలో పురస్కారం (Award) లభించింది? అనే ప్రశ్నకు... 1. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగం, 2. ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగం, 3. ఉత్తమ నాటకం చలనచిత్ర విభాగం, 4. ఉత్తమ సంభాషణ చలనచిత్ర విభాగం.. అనే ఆప్షన్స్ను జోడించారు. ఆ సమయంలో ఇదే విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్లో పోస్ట్ చేశాడు. అప్పుడు పలు విమర్శలు కూడా వచ్చాయి. సినిమాను మరో రెండుసార్లు అయినా చూస్తాం. కానీ ఈ పరీక్షకు గానీ, కానిస్టేబుల్ చేసే ఉద్యోగానికి గానీ అక్కడ అడిగిన ప్రశ్నతో ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఎలా ఆలోచిస్తారు? అంటూ దర్శకుడి వాల్పై నెటిజన్లు కామెంట్లు చేశారు. వివాదాలు పక్కనపెడితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసేమో మీరు కూడా చెక్ చేసుకోండి. -
కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?
తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది. ఎప్పుడు తెరపై కనిపించని వారు కూడా ఈ సినిమాలో ఫేమస్ అయిపోయారు. అంతలా ప్రజల ఆదరాభిమానులు సంపాదించుకున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ') అయితే తాజాగా ఈ సినిమాపై తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఈనెల 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు. మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఓ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది అన్న ప్రశ్న అడిగారు. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, వేణు యెల్దండి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సినిమాను పెద్ద తెరలపై ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి) -
Save The Tigers Review: ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్ సిరీస్ రివ్యూ: సేవ్ ద టైగర్స్ నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు నిర్మాతలు : మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి దర్శకత్వం : తేజ కాకుమాను క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం విడుదల తేది: ఏప్రిల్ 27, 2023(డిస్నీ ప్లస్ హాట్స్టార్) ఈ మధ్య కాలంలో ఓటీటీలలో ఎక్కువగా అడల్ట్ కంటెంటే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వెబ్ సీరస్తో బోల్డ్ కంటెంట్ శృతిమించిపోతుంది. ఇలాంటి తరుణంలో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సిరీస్ని తెరకెక్కించాడు తేజ కాకుమాను. అదే ‘సేవ్ ద టైగర్స్. ‘యాత్ర’ఫేమ్ మహి వి. రాఘవ్ ఈ సిరీస్కి షో రన్నర్గా వ్యవహరించాడు. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. గంటా రవి(ప్రియదర్శి). రాహుల్(అభినవ్ గోమఠం), విక్రమ్(చైతన్య కృష్ణ).. ఈ ముగ్గురిని డ్రంక్ డ్రైవ్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలాగే విక్రమ్ కారుని సీజ్ చేస్తారు. అది అతని భార్య పేరుపై ఉంటుంది. కారు కావాలంటే కోర్టు కెళ్లి ఫైన్ కట్టాలని పోలీసులు చెబుతారు. ఈ విషయం తెలిస్తే తన భార్య గొడవ చేస్తుందని భావించిన విక్రమ్.. స్నేహితులు రవి, రాహుల్లతో కలిసి సీఐ(శ్రీకాంత్ అయ్యంగార్)దగ్గరకు వెళ్లి తమ బాధలను తెలియజేస్తూ.. ఎందుకు తాగాల్సి వచ్చిందో వివరిస్తారు. గంటారవి పాల వ్యాపారి. భార్య హైమావతి(సుజాత), పిల్లలలో కలిసి బోరబండలో నివాసం ఉంటాడు. హైమావతి బ్యూటీపార్లర్ రన్ చేస్తుంది. బోరబండను వదిలి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్లాలని తరచు భర్తతో గొడవ పడుతూ ఉంటుంది. విక్రమ్ ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ పని చేస్తుంటాడు. అతని భార్య(దేవియాని శర్మ) లాయర్. ఫెమినిస్ట్. భర్త, కూతురిని పట్టించుకోకుండా ఎప్పుడూ కేసులంటూ కోర్టుల చుట్టే తిరుగుతుంది. ఆమెకు, విక్రమ్ తల్లికి అస్సలు పడదు. ఇక రాహుల్..రైటర్ కావాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఖాలీగా ఉంటాడు. అతని భార్య మాధురి(పావనీ గంగిరెడ్డి) డాక్టర్. మొదట్లో రాహుల్కి మద్దతుగా ఉన్న మాధురి.. కొన్నాళ్ల తర్వాత ఖాలీగా ఉన్నావంటూ విసుక్కుంటుంది. అంతేకాదు తన స్నేహితుడు డాక్టర్ నవీన్(రాజా చెంబోలు)కు క్లోజ్గా ఉంటుంది. ఇది రాహుల్కి నచ్చదు. ఈ ముగ్గురి పిల్లలు ఓకే స్కూల్లో చదువుతారు. దాని కారణంగా గంటా రవి, రాహుల్, విక్రమ్ల మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఓ రోజు ఈ ముగ్గురు కలిసి బార్లో బాగా తాగి రచ్చ చేస్తారు. అది ఓ టీవీ ప్రోగ్రామ్లో టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గంటా రవి మాటతీరు కారణంగా భార్య, పిల్లలకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఓ కమర్షియల్ యాడ్ కారణంగా విక్రమ్, అతని భార్యల మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చాయి? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై రాహుల్ ఎందుకు అనుమానం వ్యక్తం చేశాడు? ఆ అనుమానం ఎక్కడికి దారితీసింది? బార్లో గొడవకి, హీరోయిన్ హంస నందిని మిస్సింగ్కి ఎలాంటి సంబంధం ఉంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. భార్యల వల్ల భర్తలు పడే ఇబ్బందుల నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ కూడా ఆ నేపథ్యంతో తెరకెక్కిన కథే. పెళ్లైన మగవారి కష్టాలను మెయిన్ పాయింట్గా తీసుకొని ఎంటర్టైనింగ్ పంథాలో ఈ సిరీస్ని తెరకెక్కించారు. ఇందులో మొత్తం మూడు జంటలు ఉంటాయి. వీరిలో మగవాళ్లంతా ఆడవారి వల్ల ఇబ్బంది పడుతున్నవారే. గంటా రవికి భార్యతో పాటు కూతురు,తల్లితో కూడా ఇబ్బందులే. ఇక విక్రమ్కు అయితే ఫెమినిస్ట్ అయిన భార్యతో పాటు అత్తగారి చేతిలో కూడా నలిగిపోతాడు. మరోవైపు రైటర్ కావాలని ఉద్యోగం మానేసిన రాహుల్కి భార్యతో పాటు ఇంటి పనిమనిషి కూడా చుక్కలు చూపిస్తుంది. ఈ కష్టాలను ఆరు ఎపిసోడ్లుగా చాలా వినోదాత్మకంగా, సహజసిద్దంగా చూపించారు. అంతేకాదు అంతర్లీనంగా మంచి సందేశాన్ని కూడా చూపించాడు. భార్యభర్తల మధ్య గొడవలు వస్తే కలిసి సాల్వ్ చేసుకోవాలిని కానీ సైకిలాజిస్టుల వద్దకు వెళ్తే పరిష్కారం దొరకదని ఓ సన్నివేశం ద్వారా చూపించారు. అలాగే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏదో తెలియజేసే బాధ్యత తల్లిదండ్రులదే అని మరో సన్నివేశం ద్వారా చూపించారు. చేసే వృత్తిని గౌరవించాలని, పేరెంట్స్ పిల్లల కోసం ఎలాంటి బాధలు పడతారనేది గంటా రవి, అతని కూతురి పాత్ర ద్వారా చూపించారు. రాహుల్, మాధురిల ట్రాక్ చూస్తే.. భార్యను అలా అనుమానించాల్సింది కాదనిపిస్తుంది. అదే సమయంలో విక్రమ్, అతని భార్యల ట్రాక్ చూస్తే.. ఆమె విక్రమ్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందనే బాధ కలుగుతుంది. మొత్తంగా ఈ మూడు జంటలను చూస్తే కొత్తగా పెళ్లైన మగవాళ్లు ఏదో ఒక జంటకు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ మధ్య కాలంలో ఎలాంటి అశ్లీలత(కొన్ని డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా ఉంటాయి) లేకుండా కామెడీగా సాగే ఇలాంటి వెబ్ సిరీస్ రాలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. పాల బిజినెస్ చేసే గంటా రవి పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. తెలంగాణలో యాసలో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించాడు. రైటర్ కావాలనుకుని ఇంట్లోనే ఖాలీగా ఉండే వ్యక్తిగా అభినవ్ తనదైన నటనతో అదరగొట్టేశాడు. పొట్టను తగ్గించే సీన్, యాడ్ కోసం కంటెంట్ రాసే సన్నివేశాలలో అభివన్ నవ్వులు పూయించాడు. ఇక ఇంట్లో భార్య, ఆఫీసులో బాస్ మధ్య నలిగిపోయే విక్రమ్ పాత్రకి చైతన్య కృష్ణ న్యాయం చేశాడు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా జోర్దార్ సుజాత, , పావని గంగిరెడ్డి, దేవయాని తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పనిమనిషిగా రోహిని, గంటా రవి తల్లిగా గంగవ్వ, విక్రమ్ బాస్గా హర్షవర్దన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ'
తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. మానవ సంబంధాలను, ముఖ్యంగా రక్తబంధాన్ని హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఈ సినిమా కన్నీళ్లు పెట్టనివారు లేదంటే ఏ రేంజ్లో హిట్ అయిందో అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన వారిలో ప్రతి ఒక్కరీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నవారే. అలాంటివారిలో కీలక పాత్రధారిగా బలగం సినిమాలో మెప్పించిన కొమరయ్య చెల్లెలు పోచవ్వ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. బలగం చిత్రంలో పోచవ్వ పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె సురభి కళాకారిణి కాగా.. ఈ సినిమాలో పోచవ్వ నటనకు ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. కొమరయ్యకు చెల్లెలుగా.. ఆ కుటుంబానికి మేనత్తగా మెప్పించింది. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ' తాను సురభి కళాకారిణిని. 35 ఏళ్ల పాటు నాటకాలు వేశా, హరికథలు చెప్పా. నంది అవార్డు వచ్చింది. నేను చేసిన తొలి చిత్రం బలగం. నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం దర్శకుడు వేణునే. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డా. నా భర్త చనిపోయాక పిల్లలకు పెళ్లిళ్లు చేశా. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. నా చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో నా కోడలు గర్భవతి. నా జీవితంలో అంతుచిక్కని విషాదం. భర్త చనిపోవడం, నాలుగేళ్లకే కుమారుడిని పోగొట్టుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయా. ఆ సంఘటన నుంచి ఇప్పటికీ బయట పడలేకపోతున్నా.' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె నటించిన తొలి సినిమా అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. -
ఇంత సాహసం ఎవరూ చేయరు.. కానీ చేసి చూపించాడు: పరుచూరి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సంచలనం సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కమెడియన్ వేణు యెల్లండి తెరకెక్కించిన ఈ సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లడించారు. కొత్త సినిమాలను ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషిస్తుంటారు. తాజాగా ఆయన ‘బలగం’ మూవీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమా చూసి తనకు కూడా కన్నీళ్లాగలేదని తెలిపారు. చిత్ర దర్శకుడు వేణు, పాటల రచయిత కాసర్ల శ్యామ్ను ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు. పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమాకు ఏది బలమో అదే ఇందులో ఉంది. ఇదొక వినూత్నమైన ప్రయోగం. నిజానికి సినిమా చేసేటప్పుడు ఇంతటి విజయం సాధిస్తుందని దిల్రాజు కూడా ఊహించి ఉండరు. ఖర్చు పెట్టిన దాని కంటే పదిరెట్లు ఎక్కువే వసూళ్లు రాబట్టింది. అగ్రహీరోలు, దర్శకులు, రచయితలను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. కథను మాత్రమే నమ్ముకోవాలి. చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెటా? అనేది విషయం కాదు. పెద్ద బడ్జెట్ సినిమాతో సమానంగా నిలిచింది ఈ బలగం. వేణులో ఇంత గొప్ప రచయిత ఉన్నాడా అసలు ఇది ఊహించలేదు. ' అని అన్నారు. వేణు గురించి మాట్లాడుతూ.. 'వేణుని ‘జబర్దస్త్’ కమెడియన్గా మాత్రమే చూశా. వేణులో ఇంత గొప్ప రచయిత, ఇంత సృజనాత్మకత ఉందా? అనిపించింది. కామెడీ చేసే కుర్రాడు గుండెలను హత్తుకునే సినిమా తీయగలడా అనేది ఊహకందని అంశం. వేణు చేసిన మాయ ఏంటంటే.. సినిమా మొదటి నుంచి కన్నీళ్లు పెట్టించేలా సినిమా తీయొచ్చు. కానీ అతను అలా చేయలేదు. నవ్విస్తూనే.. చివరకు భావోద్వేగానికి గురి చేశాడు.' అని అన్నారు. (ఇది చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు) నేను కూాడా కన్నీళ్లు పెట్టుకున్నా పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమా చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా అరుదు. ఈ మూవీ చూసి నేను కూడా కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతున్నప్పుడు మనం కన్నీళ్లు పెడతాం. కానీ ఇందులో కుటుంబ సభ్యులు కలిసేటప్పుడు భావోద్వేగానికి గురవుతాం. ఇది ఓ అపురూప దృశ్యకావ్యం. క్లైమాక్స్ పది నిమిషాల్లో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఒక మనిషి చనిపోయాక 11 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సాహసమే అని చెప్పాలి. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయరు. ఇలాంటి సినిమాలు చూస్తారా? అని భయపడతారు. అలాంటి భయాలేమీ లేకుండా వేణు అద్భుతంగా తెరకెక్కించాడు.' అని అన్నారు. -
అలాంటి పాత్రలు చేయడానికి అభ్యంతరం లేదు: బలగం ఫేమ్
ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా బలగం మాటే వినిపిస్తోంది. అంతలా గ్రామీణ ప్రజలను ఆకట్టుకుంది ఈ చిత్రం. పల్లె సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన చిత్రం బలగం. తెలంగాణ పల్లెల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను తెరపై చక్కగా చూపించారు దర్శకుడు వేణు యెల్దండి. చిన్న సినిమా హృదయాలకు హత్తుకునేలా చేశారు. అంతలా విజయం సాధించిన ఈ చిత్రంపై ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన వారిపై టాలీవుడ్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ చిత్రంలో హీరోకు అత్తమ్మగా, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన పాత్రకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కుటుంబ నేపథ్యం గురించి వివరించారు. రూప లక్ష్మి మాట్లాడుతూ..'మా నాన్న రైతు. ఆయనకు ఆరుగురు సంతానం. నన్ను లెక్చరర్కి దత్తత ఇచ్చారు. అయితే ఇప్పటికీ నేను నా కుటుంబ సభ్యులతో చక్కగా కలిసే ఉంటాను.' అని అన్నారు. మీరు తక్కువ వయసులోనే తల్లి పాత్రను పోషించారు. అలాగే రేపు ప్రభాస్ వంటి హీరోలకు తల్లి పాత్ర చేయమని అడిగితే ఏం చేస్తారని ప్రశ్నించగా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'ఒక మహిళగా సంతృప్తినిచ్చే స్థానం అమ్మ. కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నటించటానికి ఎప్పుడు సిద్ధమే. ఇందులో నాకేలాంటి అభ్యంతరం లేదు. 70 ఏళ్ల వ్యక్తికి అమ్మగా నటించాలని అడిగినా నాకేలాంటి ఇబ్బంది లేదు. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించటానికి నేనేప్పుడు సిద్ధమే.' అని అన్నారు. కాగా.. బలగం చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్రామ్లతో పాటు సుధాకర్ రెడ్డి, నర్సింహ, రూప లక్ష్మి, మురళీధర్లకు చాలా మంచి గుర్తింపు దక్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గ్రామాల్లో ప్రజలు ఏకంగా పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని మరీ ఆ సినిమాను చూసేస్తున్నారు. (ఇది చదవండి: అదిరిపోయే లుక్తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్) -
నవ్వుకు బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్!
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కామెడీకి మించిన ఎంటర్టైన్మెంట్ ఏం ఉంటుంది? ఎంత సీరియస్ సినిమా అయినా.. అందులో కాసింత కామెడీ లేకపోతే ఆడియన్స్ సహించరు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కామెడీకీ, కమెడియన్స్కి మన దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. కమెడియన్స్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియస్ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువైయ్యాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మర్చారు. తమదైన హాస్యంతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యే గిలిగింతలు పెట్టిన కమెడియన్స్.. ఇప్పుడు భయపెడుతున్నారు.. ఏడిపిస్తున్నారు. నవరసాలను పండిస్తూ ‘వావ్’ అనిపిస్తున్నారు. నవ్వుకు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మీ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా కామెడీ పండించిన బ్రహ్మీ.. సడెన్గా నవ్వుకు బ్రేక్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్రహ్మానందంలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు. ఇన్నాళ్లు తనదైన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం..‘రంగమార్తాండ’తో ప్రేక్షకులను ఏడిపించాడు. భయపెట్టిన సునీల్ భీమవరం యాసతో అందరిని నవ్విస్తూ స్టార్ కమెడియన్గా ఎదిగాడు సునీల్. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి, తనదైన మార్కు కామెడీకి సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత ‘అందాల రాముడు’తో హీరోగా మారాడు. సిక్స్ఫ్యాక్స్ చూపించాడు. అదరిపోయే స్టెప్పులతో అలరించాడు. కానీ వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. రూటు మార్చి మళ్లీ కమెడియన్గా మారాడు. కానీ లెక్కల మాస్టార్ సుకుమార్ మాత్రం సునీల్ని సీరియస్ ట్రాక్ ఎక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రంలో మంగళం శ్రీనుగా సునీల్ నటన, ఆహార్యం కొత్తగా అనిపించింది. సునీల్ బెదిరిస్తే.. ఆడియన్స్ భయపడ్డారు. దీంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. పుష్ప 2లోనూ సునీల్ సీరియస్ లుక్లో కపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’లోనూ సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ‘సీరియస్’ నరేశ్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా రాణించిన వ్యక్తి ‘అల్లరి’ నరేశ్. తొలి సినిమా ‘అల్లరి’ నుంచి 2021లొ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ వరకు తనదైన కామెడీతో నవిస్తూ హాస్యరస చిత్రాలకు కేరాఫ్గా నిలిచాడు. కానీ ఇప్పుడే ఈ కామెడీ స్టార్ సీరియస్ బాట పట్టాడు. 2021లో వచ్చిన ‘నాంది’ చిత్రంతో సీరియస్ కథలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీసు అధికారిగా నరేశ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది. నవ్విస్తూనే..ఏడిపించిన దర్శి తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అందరిని నవ్విస్తున్న ప్రియదర్శి.. మధ్య మధ్యలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక బలగం సినిమాతో అందరిని నవ్విస్తూనే.. చివర్లో తనదైన నటనతో ఏడిపించాడు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడని ఈ చిత్రంతో నిరూపించాడు. కన్నీళ్లు పెట్టించిన కోవై సరళ టాలీవుడ్లో లేడీ కమెడియన్స్ అనగానే అందరికి గుర్తొంచే పేరు కోవై సరళ. కోవై సరళ, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్లు రాసుకునేవారు మన దర్శకులు. అయితే గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. ఇటీవల ఆమె నటించిన తమిళ మూవీ ‘సెంబి’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో కోవై సరళ తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ బామ్మ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందో బామ్మగా నటించిన కోవై సరళ.. తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. కొన్ని సన్నివేశాల్లో కోవై సరళ నటన చూస్తే.. కన్నీళ్లు ఆగవు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సత్యం రాజేశ్ నట విశ్వరూపం ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించిన సత్యం రాజేశ్.. ‘మా ఊరి పొలిమేర’ వెబ్ సిరీస్తో అందరిని భయపెట్టాడు. ఉత్కంఠగా సాగే ఆ వెబ్ సిరీస్లో ఆటో డ్రైవర్ కొమిరిగా సత్యం రాజేశ్ జీవించేశాడు. క్లైమాక్స్లో ఆయన ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అందరిని భయపెట్టిస్తాడు. త్వరలోనే ‘మా ఊరి పొలిమేర 2’ కూడా రాబోతుంది. ఇందులో సత్యం రాజేశ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. బలగం వేణు జబర్దస్త్ కామెడీ షోతో అందరికి పరిచమైన కమెడియన్ వేణు. చాలా కాలంగా కమెడియన్గా రాణిస్తున్న వేణుకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ మూవీతో వేణు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అని అందరు చర్చించుకునేలా చేసింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ వేణు ప్రతిభ గురించే చర్చిస్తున్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇలా వెండితెరపై నవ్వులు కురిపించే కమెడియన్స్.. నవ్వుకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ ట్రాక్ ఎక్కి మెప్పిస్తున్నారు. -
‘బలగం’ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఊరి జనం.. వీడియో వైరల్
స్టార్ హీరోలు నటించలేదు.. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కించలేదు.. ఐటం సాంగ్స్లేవు.. ఫైట్, రొమాన్స్ అసలేవు. కానీ ఆ సినిమా చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా.. థియేటర్స్కి బారులు తీస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఆగితే టీవిల్లోకి సినిమా వచ్చేస్తుంది. అయినా కూడా ఊరు ఊరంతా రచ్చబండ దగ్గరకు వచ్చి ఆ సినిమాను వీక్షించారు. తెరపై కనిపించిన పాత్రల్లో తమని తాము ఊహించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మన కథ అంటూ ఎమోషనల్ అవుతున్నారు.ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకున్న ఆ సినిమానే ‘బలగం’. తెలంగాణ పల్లె కుటుంబం నేపథ్యంలో చిన్న చిత్రంగా విడుదలైన బలగం.. భారీ విజయం సాధించింది. విడుదలై నెల రోజులు కావొస్తున్నా..ఇప్పటికీ జనాలు ఈ చిత్రం గురించే చర్చిస్తున్నారు. అంతేకాదు పాత కాలంలోలాగా గ్రామాల్లో స్పెషల్ షోలు వేస్తున్నారు. తెలంగాణలోని చాలా పల్లెల్లో రచ్చబండ వద్ద ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓ గ్రామంలో సినిమా చూస్తూ వృద్ధులు, మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. చీరకొంగుతో కన్నీళ్లుతను తుడుచుకుంటూ సినిమాను వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ వీడియోపై బలగం హీరో ప్రియదర్శి స్పందించారు. ‘ఇది నా సినిమానేనా?’అంటూ ట్వీట్ చేశాడు. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్రామ్ కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. Idhi naa cinema na🥲#Balagam https://t.co/yStQ4EaZly — Sailu Priyadarshi #Balagam (@priyadarshi_i) April 2, 2023 -
దూసుకెెళ్తున్న 'బలగం' మూవీ.. అక్కడ కూడా అదే జోరు!
కంటెంట్ బాగుంటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఈ విషయం ‘బలగం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సాధించింది. తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని.. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. బలగం రిలీజై 23 రోజులు పూర్తయ్యేసరికి రూ.23.59 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని తెరపై చక్కగా చూపించారని వేణుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వేణు డైరెక్షన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘బలగం’.. 9వ రోజు రికార్డు కలెక్షన్స్!) ఓటీటీలోనూ అదే దూకుడు ఓటీటీలోకి వచ్చేసిన బలగం సినిమా అక్కడ కూడా అదేస్థాయిలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండగా.. అక్కడ కూడా టాప్-2 లో ట్రెండింగ్లో ఉంది. అయితే ఈ సినిమా తీసేందుకు మొత్తం బడ్జెట్ రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ లెక్కన చూస్తే బలగం కలెక్షన్స్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నయి. చిన్న సినిమా అయినా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. వేణు ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. -
ఓటీటీకి బలగం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జంటగా నటించిన సినిమా 'బలగం'. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 3న విడుదలై హిట్ టాక్ను సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్లు రాబట్టింది. (ఇది చదవండి: బలగం తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అలా పిలవట్లేదు: వేణు) చిత్రబృందం ఊహించిన దానికంటే ఎక్కవ గానే ప్రేక్షకాదరణ లభించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు మేకర్స్. ఈనెల 24 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీ ఫ్లాట్ఫాంలపై వీక్షించవచ్చని చిత్రబృందం ప్రకటించింది. -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘బలగం’.. 9వ రోజు రికార్డు కలెక్షన్స్!
కంటెంట్ బాగుంటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు పట్టించుకోరని ‘బలగం’తో మరోసారి రుజువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఊహించని విజయాన్ని సాధించింది. తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని.. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోవడంతో థియేటర్స్ సంఖ్యని కూడా పెంచుకున్న ఈ సినిమా.. 9వ రోజు ఎవరూ ఊహించనవి విధంగా ఏకంగా రూ.1.77 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. 9 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.9.15 కోట్లను వసూళ్లు చేసి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 5.52 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.63 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 9.15 కోట్లు గ్రాస్తో పాటు రూ. 4.02 కోట్లు షేర్ను వసూలు చేసి సత్తా చాటుకుంది. జబర్దస్త్ వేణు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవగా దిల్ రాజు నిర్మించాడు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్రామ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.