Rahul Sipligunj
-
హైదరాబాద్ : ట్యాంక్ బండ్పై ఎయిర్ షో అదరహో (ఫొటోలు)
-
రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్
‘నాటు నాటు’సాంగ్తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆ ఒక్క పాటతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం రాహుల్లో ఉంది. ఆస్కార్ అవార్డు సాధించినా.. ఆ గర్వాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి చెప్పాడు. నాకు రజకాంత్ అంటే చాలా ఇష్టం. రంగమార్తాండ సినిమా షూటింగ్ సమయంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ గార్లతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ మూవీ షూట్లో ఉన్నప్పుడు.. నేను రజనీ ఫ్యాన్ అని ప్రకాశ్ రాజ్కు చెప్పాను. దీంతో ఓ సారి ప్రకాశ్ రాజ్ నన్ను పిలిచి రజనికాంత్ మూవీ షూటింగ్కి వెళ్తున్నా రమ్మని చెప్పారు. నేను వెంటనే వెళ్లిపోయాను. అప్పుడు అన్నాత్తే షూటింగ్ జరుగుతోంది. విరామం సమయంలో రజనీకాంత్ సర్కి నన్ను పరిచయం చేశారు. అయితే అప్పుడు ఆయన ఆ మూవీ కాస్ట్యూమ్స్లో ఉన్నారు. అయినా కూడా నాకు ఫోటో దిగే అవకాశం ఇచ్చారు. అప్పటికీ ఆ సినిమాకు సంబంధించి తన లుక్ ఇంకా విడుదల కాలేదు. ఈ విషయం నాకు చెప్పి సినిమా రిలీజ్ వరకు ఆ ఫొటో షేర్ చేయొద్దని చెప్పారు. ఓ పది రోజుల తర్వాత ఆనందం తట్టుకోలేక ఒకరోజు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశా. అది వైరల్గా మారింది. హీరో లుక్ బయటకు రావడం వల్ల నిర్మాణ సంస్థ కంగారు పడింది. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. ఒక అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ తర్వాత దానిని డిలీట్ కూడా చేసేశాను. -
ఇప్పటివరకు బిగ్బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్బాస్ 1బిగ్బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్బాస్ 2బిగ్బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్బాస్కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్బాస్ 5బిగ్బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్ఫామ్ అని భావించాడు. బిగ్బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్బాస్ విన్నర్ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్బాస్ నాన్స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్గా పోరాడి బిగ్బాస్ నాన్స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
ఫుడ్ డెలివరీ బాయ్ టాలెంట్కు మెచ్చి సాయం చేసిన రాహుల్ సిప్లిగంజ్
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" స్టార్ మాలో మళ్ళీ ప్రారంభం ప్రారంభమైంది. టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్లతో వడపోసిన స్వరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి కూడా వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ను మెప్పించాడు. కృష్ణార్జున యుద్దం సినిమాలోని 'దారి చూడు మామ దుమ్ము చూడు మామ' అనే పాటతో అక్కడ జడ్జీలను మెప్పించాడు. ఆ పాట పాడిన వెంకటేష్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు స్టేజీ మీద తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ యువకుడి కష్టాన్ని మెచ్చుకున్నాడు. గతంలో తాను కూడా ఒక బార్బర్ షాప్లో పని చేస్తూనే పాటలు పాడటం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని తట్టుకుని ఇలా ముందుకు రావడం అంత సులభం కాదని రాహుల్ చెప్పాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ సంగీతం కోసం కష్టపడుతున్న వెంకటేష్కు లక్ష రూపాయలు సాయం చేశాడు రాహుల్.వాస్తవంగా ఆ యువకుడిలో కూడ మంచి టాలెంట్ ఉంది.అతను పాడిన పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా 'రామ్' చిత్రం నుంచి పాట విడుదల
యదార్థ ఘటనల ఆధారంగా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. రియల్ లైఫ్లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం సిద్దంగా ఉంది. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఓఎస్ఎం విజన్తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. ఇక ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాటను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ పాటను రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'మనతోని కాదురా భై' అంటూ సాగే ఈ పాటకు.. రాము కుమార్ ఏఎస్కే సాహిత్యం, ధనుంజయ్ గాత్రం, ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ఇలా అన్నీ కలిసి వినసొంపుగా మార్చాయి. కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. -
సూపర్ సింగర్.. ఆరోజే ప్రారంభం!
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా నలుగురు ప్రతిభావంతులు న్యాయమూర్తులుగా కంటెస్టెంట్స్ని తీర్చిదిద్దడంతో పాటు పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. ఇంతకీ ఆ నలుగురు మరెవరో కాదు.. గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్. వీరే ఈ సారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాబోతున్న ఈ షోలో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించనుంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఆసక్తిగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే 'స్టార్ మా'లో సూపర్ సింగర్ చూడాల్సిందే. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!: రైతుబిడ్డ -
'మెమొరీస్' సాంగ్.. హీరో సుధాకర్.. మరి హీరోయిన్?
నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ నటుడు సుధాకర్ కోమాకుల 'మెమొరీస్' అనే బహుభాషా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పాటను సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్తో కలిపి చిత్రీకరించారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ సొంతం చేసుకోవడం విశేషం. 'మెమొరీస్' వీడియో సాంగ్ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్.. సైమా అవార్డ్స్లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్గా, సోని మ్యూజిక్లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడనేదే ఈ సాంగ్. ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది. సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసేలా ఉంది. చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. అందుకే టాస్క్లు.. -
రతికతో బ్రేకప్పై రాహుల్ సిప్లిగంజ్ ఫస్ట్ రియాక్షన్
రతిక రోజ్.. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రారంభంలో అందరినీ ఆకట్టుకుంది. సూటిగా, ధైర్యంగా.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ బిగ్బాస్ ప్రియులకు బాగా కనెక్ట్ అయింది. తర్వాత ప్రశాంత్తో పులిహోర కలపడం.. అందరిముందు మాత్రం మొత్తం నువ్వే చేశావ్ అంటూ అతడిని దోషిగా నిలబెట్టడం.. తనను చులకన చేసి మాట్లాడటం.. పదేపదే తన మాజీ ప్రియుడి ప్రస్తావన తేవడం.. ముందు ఒకలా, వెనక ఒకలా ప్రవర్తించడం.. ఇలా వరుస తప్పులు చేస్తూ పోవడంతో తన గ్రాఫ్ అమాంతం పాతాళంలోకి పడిపోయింది. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్ అయింది. కానీ బిగ్బాస్ టీమ్ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చింది. దాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతోంది రతిక. రతిక గురించి తొలిసారి మీడియాతో.. ఇక ఆమె హౌస్లో ఉండగా రతిక తన మాజీ బాయ్ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకవగా పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై రాహుల్ సైతం పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ప్రోగ్రామ్కు హాజరైన రాహుల్.. రతికతో బ్రేకప్పై తొలిసారి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. రతికకు ఆల్ద బెస్ట్ చెప్పిన రాహుల్ ఆమెతో పాటు హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్కు నేను ఆల్ద బెస్ట్ చెప్తున్నాను. బాగా ఆడి కప్పుతో బయటకు రావాలని కోరుకుంటున్నాను. విన్నర్ ఎవరనేది ఇప్పుడే మనం నిర్ణయించలేము. ప్రస్తుతానికైతే భోలె షావళి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. శివాజీ ఇంట్లో పెద్ద వ్యక్తిలా ఉన్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒకప్పుడు బిగ్బాస్ షోను ప్రేక్షకుడిలా చూశాడు. ఇప్పుడు ప్రేక్షకులు ఆయనను బిగ్బాస్ హౌస్లో చూస్తున్నారు' అని మాట్లాడాడు రాహుల్ సిప్లిగంజ్. చదవండి: 10 ఏళ్లకే ఫుల్ క్రేజ్.. 17 ఏళ్లకే తల్లయిన స్టార్ హీరోయిన్.. అర్ధాంతరంగా ముగిసిన కెరీర్.. -
రాహుల్ సిప్లిగంజే ఆ పర్సనల్ ఫోటోలు లీక్ చేశాడు: రతిక సోదరి
బిగ్బాస్ 7లో బాగా ట్రోల్ అయిన కంటెస్టెంట్ రతికా రోజ్.. హౌస్లో పదేపదే తన మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రస్తావిస్తూ.. రైతుబిడ్డను చులకన చేసి మాట్లాడుతూ నెగెటివిటీ పోగొట్టుకుంది. దీంతో జనాలు వెంటనే ఆమె మాకొద్దు బాబోయ్ అని ఎలిమినేట్ చేశారు. కట్ చేస్తే బిగ్బాస్ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే రతిక బిగ్బాస్ హౌస్లో ఉన్న సమయంలో ఆమె రాహుల్తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీనిపై అటు రాహుల్ సైతం గరమయ్యాడు. రాహులే ఫోటోలు లీక్ చేశాడు! రతిక పీఆర్ చీప్గా ప్రవర్తిస్తుందంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా రతిక సోదరి ఈ ఫోటోలు లీక్ అవడంపై స్పందించింది. రతికకు ఎవరి పేరూ వాడుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో మాకే అర్థం కావడం లేదు. రతిక షోలో ఉంది.. తన ఫోన్ కూడా ఆమె దగ్గర లేదు. రాహుల్ దగ్గరి నుంచే ఫోటోలు లీకయ్యాయి అనుకున్నాం. ఎందుకంటే వారి పర్సనల్ ఫోటోలు ఇంకెవరి దగ్గరుంటాయి? ఒక అమ్మాయి తన ఫోటోలు లీక్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? పెళ్లికి ముందే కండీషన్స్ నిజానికి రాహుల్-రతిక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. రతిక ఇంట్లో కూడా చెప్పేసింది. తను సంతోషంగా ఉంటే అంతే చాలని నాన్న కూడా వారి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇంతలో రాహుల్ కొన్ని షరతులు పెట్టాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లకూడదు, అక్కడ పని చేయకూడదు అని చెప్పాడు. ఆ కండీషన్స్ రతికకు నచ్చలేదు. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చాకే బ్రేకప్ చెప్పుకున్నారు. ఎవరి జీవితంలో వారు సంతోషంగానే ఉన్నారు. కానీ ఆ రోజు ఫోటోలు లీక్ అవడం గురించి రాహుల్ ఎందుకలా సీరియస్ కామెంట్స్ చేశాడో నాకూ అర్థం కాలేదు అని చెప్పుకొచ్చింది. చదవండి: ఓ పక్క ట్రోలింగ్.. మరోపక్క ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమా -
రాహుల్ సిప్లిగంజ్తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?
రతికా రోజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. అయితే బిగ్ బాస్తో ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. ఆమె వ్యక్తిగత విషయాలతోనూ అంతేస్థాయిలో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో ప్రేమ వ్యవహారంతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆమెది వికారాబాద్ జిల్లా జనగామ గ్రామం కాగా.. ప్రస్తుతం వీరు తాండూరులో నివాసముంటున్నారు. రతికా రోజ్.. రాములు, అనితలకు రెండో సంతానం కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రతికా రోజ్ తల్లిదండ్రులు ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు) రతికా నాన్న రాములు మట్లాడుతూ.. 'మాది చాలా చిన్న ఊరు. కేవలం 2 వేల జనాభా ఉంది. మొదట మా అమ్మాయికి పటాస్ షో అవకాశం వచ్చింది. అందులో ఏదో నాలుగు ఉంటుందని అనుకున్నా. ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఒకసారి రతికా ఇంటర్ సెకండియర్లో విజయ నిర్మలమ్మ తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా కావాలని ఫోన్ వచ్చింది. కానీ సినిమాల గురించి మాకు పెద్దగా తెలియదు. మహేశ్ బాబు వాళ్ల అమ్మనే ఫోన్ చేసి అడిగింది. మా అమ్మాయి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది.. నేను పోతా పట్టు పట్టింది. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. మాకు ముగ్గురు కుమార్తెలు సంతానం. రతిక రెండో అమ్మాయి. మిగిలిన ఇద్దరికీ పెళ్లి చేశాం. ఇప్పుడు మాకు కొడుకు రూపంలో ఉన్నది రతికనే.' అంటూ చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: బిగ్ బాస్ విన్నర్కు బిగ్ షాక్!) రతికా నాన్న మాట్లాడుతూ..' రాహుల్ సిప్లిగంజ్ వాళ్ల ఇంటికి కూడా పోయినా. మా అమ్మాయితో రెండు, మూడు పాటలు చేసిండు. యూట్యూబ్లో పెడితే పైసలు వస్తాయి కదా అని అనుకున్నాం. మా చిన్నపాప పెళ్లికి కూడా రాహుల్ వచ్చిండు. మా వరకైతే పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే మా పాపకు పెళ్లి కావాలే.. మా అమ్మాయితో ఇలా సినిమా పాటలు తీస్తే ఎలా? అని ఒకసారి రాహుల్ను బెదిరించా. మా ఊర్లో వాళ్లయితే వాడితోనే డ్యాన్స్ చేసి.. వాడితోనే పోతుంది అనేవారు. మేం వాటిని పట్టించుకోలేదు. రాహుల్ కూడా అందరిలాగే పెళ్లికి వచ్చిండు.. కానీ ఇలా జరుతుందని మేం కూడా అనుకోలేదు. రతికా అందరినీ ఫ్రెండ్లాగే భావిస్తుంది. బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్తో ఒక స్నేహితుడిలాగే మాట్లాడింది. బయట కావాలనే కొందరు రూమర్స్ తెచ్చారు.' అని అన్నారు. అనంతరం రతికా తల్లి అనితా మాట్లాడుతూ..' రతికా నాతో కలిసి ఇంట్లో వంటలు కూడా చేస్తుంది. మటన్, పాయసం అంటే ఇష్టం. నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చింది. -
రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని
బిగ్బాస్ సీజన్-7లో సింగర్స్ వెళ్లడం సహజం అలాగే ఈసారి కూడా దామిని భట్ల వెళ్లారు. గతంలో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ అయితే.. గీతా మాధురి టాప్ ఫైవ్లో చోటు దక్కించుకున్నారు. కానీ ఈ సీజన్లో సింగర్ దామిని భట్ల కేవలం మూడు వారాలు మాత్రమే హౌస్లో ఉన్నారు. ఉన్న కొద్దిరోజులే అయినా ఆటలో తన ప్రత్యేకతను చాటుకుంది. అందరిలా కాకుండా తనదైన స్టైల్లో గేమ్ ప్లే చేసింది. ఓట్ల కోసం నటించకుండా తనకు ఏదైతే నచ్చిందో ఆ పని మాత్రమే హౌస్లో చేసేది.. బహుశా ఇది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. ఆమెలోని నెగటివ్ను మాత్రమే ప్రేక్షకులకు చూపించిన బిగ్ బాస్.. దామినిలోని పాజిటివ్ను మాత్రం తెరపైకి చూపించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యలో బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్లో నిలబడాలంటే కంటెంట్ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇతరులపైన సీరియస్ అవ్వాలి. హౌస్లో వారికి చాలామందికి పీఆర్ టీమ్ ఉంది. అలాగే నేను కూడా పీఆర్ టీమ్ను ఏర్పాటు చేసుకునే బిగ్ బాస్లోకి వెళ్లాను. కానీ... నేను హౌస్లోకి వెళ్లే ముందు వారికి ఒక సూచన ఇచ్చా... నన్ను మాత్రమే హైప్ చేయండి. అందుకోసం ఎదుటివారిని కించపరిచేలా ఎలాంటి ప్రమోషన్ చేయకండి అని గట్టిగా చెప్పాను. అందులో తేడా వస్తే సహించనని కూడా చెప్పాను. కానీ నా లక్ బాగాలేదు.. ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాను.' అని దామిని చెప్పింది. రాహుల్తో ప్రేమ గురించి రతికనే చెప్పింది: దామిని బిగ్ బాస్ నుంచి నేను బయటికి రాగానే రాహుల్ సిప్లిగంజ్- రతికా రోజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిని తెలిసింది. అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. అదే సమయంలో నాకు రాహుల్ కాల్ చేసి ఎక్కడున్నావ్ అని ప్రశ్నించాడు... ఇంటి వద్దనే ఉన్నానని చెప్పి లోకేషన్ షేర్ చేస్తే ఇంటికి వచ్చేశాడు. అప్పుడు ఇద్దరం రతిక టాపిక్ గురించి చర్చించాము. ఆమె గురించి వాడు చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ఒకసైడ్ మాత్రమే విన్న నేను తప్పు ఎవరిదని జడ్జ్ చేయలేను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన మొదటి మూడు రోజుల్లోనే నా వద్ద రాహుల్ టాపిక్ రతక తెచ్చింది. తనకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనే అర్థం వచ్చేలా ఆ సమయంలో క్లియర్గా చెప్పింది. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా నిజమే ఉంటుందిలే అని నేను కూడా పెద్దగా సాగతీయలేదు. అని దామిని తెలిపింది. బిగ్ బాస్ విన్నర్ అతనే రతికా రోజ్ను రీ ఎంట్రీ ద్వారా తీసుకోవాలని బిగ్ బాస్ అనుకున్నాడు.. అందుకే ఉల్టాపుల్టా పేరుతో ఎక్కువ ఓట్లు వచ్చిన తమను పక్కన పెట్టి రతికను తీసుకున్నారని దామిని తెలిపింది. తనకు నయని పావని, పూజా, శోభ, ప్రియాంక, అమర్, సందీప్ ఓట్లు వేశారని చెప్పుకొచ్చింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో ఆ అవకాశం దక్కలేదని చెప్పింది. శివాజీ వయసు రిత్యా చాలా అనుభం వుంది. ఆయన మైండ్తో ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు. కానీ బిగ్ బాస్ సీజన్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ కావడం గ్యారెంటీ అని ఆమె తెలిపింది. అతనొక కామన్ మ్యాన్గా గుర్తింపు ఉంది. అతను చాలా మంచి వ్యక్తి నామినేషన్లో మాత్రమే అలా రెచ్చిపోతాడు... ఆ ఒక్క విషయంలో ప్రశాంత్ అంటే తనకు ఇష్టం లేదని దామిని చెప్పింది. ప్రశాంత్ను ఎప్పుడూ ఎవరూ చులకనగా చూడలేదు. వాడు పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మొదట్లో అడ్జెస్ట్ కావడానికి సమయం పట్టింది. వాడికి ఫస్ట్ వారంలో ఏసీ కూడా సెట్ కాలేదు. దాంతో జ్వరం కూడా వచ్చింది. ఆ సమయంలో వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం అని ఆమె చెప్పింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వారి కుటుంబ సభ్యల గురించి కొందరు పీఆర్ టీమ్ వారు బూతులతో కామెంట్లు చేస్తున్నారు. ఇదీ ఏ మాత్రం మంచిది కాదని దామిని తెలిపింది. -
రతిక మాజీ బాయ్ఫ్రెండ్ టాపిక్.. నాగ్ అలాంటి కామెంట్స్!
'బిగ్బాస్' షో.. అప్పుడే మూడో వారం చివరకొచ్చేసింది. తొలి రెండు వారాలు ఓ మాదిరిగా సాగినప్పటికీ.. హౌసులో కొన్ని గొడవలు మినహా చెప్పుకోదగ్గవి అయితే ఏం జరగలేదు. గత రెండు వీకెండ్స్లో హోస్ట్ నాగార్జున.. ఎవరినీ పెద్దగా ఏం అనలేదు. ఇప్పుడు మాత్రం మొహమాటం లేకుండా స్మూత్ కౌంటర్స్ వేశాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు Day-20 హైలైట్స్లో చూద్దాం. మూడో హౌస్మేట్ శనివారం ఎపిసోడ్ కోసం వచ్చిన నాగ్.. శుక్రవారం ఏం జరిగిందనేది స్క్రీన్పై చూపించాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే సంచాలక్ సందీప్కి నాగ్ అక్షింతలు వేశాడు. ఎవరు గెలుచుంటారని అతడిని అడిగాడు. మరోవైపు జుత్తు తీయకుండా బయటకొచ్చేసిన అమరదీప్ని కూడా అడిగితే అతడు కూడా ప్రియాంక పేరు చెప్పాడు. కానీ శోభాశెట్టి.. ఎద్దు పోటీలో 12 సెకన్ల తేడాతో గెలిచింది. మూడో హౌస్మేట్ అయిపోయింది. కొత్త గేమ్ పెట్టారు కానీ ఇక నామినేషన్స్లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పిన నాగార్జున.. తన ముందే ఒక్కో వ్యక్తి వాళ్లకు అనిపించిన గేమ్ ఛేంజర్ ఎవరు? సేఫ్ గేమర్ ఎవరో? చెప్పాలని, వాళ్లకు ఆయా బ్యాడ్జి అతికించాలని చెప్పాడు. ఇప్పటికే హౌస్మేట్స్ అయిన శివాజీ, సందీప్ తప్ప అందరూ తమకు అనిపించిన వారి పేర్లు చెప్పారు. ఆ లిస్ట్ దిగువన ఉంది. చూసేయండి. కంటెస్టెంట్.. గేమ్ ఛేంజర్, సేఫ్ గేమర్ ప్రియాంక - శోభాశెట్టి, శుభశ్రీ శుభశ్రీ - యవర్, తేజ ప్రశాంత్ - యవర్, తేజ గౌతమ్ - ప్రియాంక, తేజ దామిని - యవర్, అమరదీప్ తేజ - ప్రియాంక, అమరదీప్ శోభాశెట్టి - ప్రియాంక, ప్రశాంత్ యవర్ - ప్రశాంత్, దామిని అమరదీప్ - దామిని, రతిక రతిక - యవర్, తేజ ఇందులో భాగంగా నాలుగు బ్యాడ్జిలు సొంతం చేసుకున్న యవర్ గేమ్ ఛేంజర్గా నిలిచాడు. నాలుగు బ్యాడ్జిలతో సేఫ్ ప్లేయర్ అయిన తేజకి మాత్రం నాగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. రాబోయే వారంపాటు ఇంట్లోని పాత్రలన్నీ క్లీన్ చేయాలని ఆర్డర్ వేశాడు. దీంతో తేజ అవాక్కయ్యాడు. సంచాలక్గా సందీప్ ఫెయిల్ సంచాలక్గా వ్యవహరించిన సందీప్.. చికెన్ ముక్కలు తిన్న టాస్క్, ఇతర టాస్కుల్లో భాగంగా కంటెడర్స్కి లేనిపోని సలహాలు ఇచ్చాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తుచేసిన నాగార్జున.. గాలి మొత్తం తీసేశాడు. అతడు సంచాలక్గా ఫెయిలయ్యాడు అనుకున్నవాళ్లు చేతులు పైకెత్తండి అని నాగ్ చెప్పడంతో రతిక, ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్, తేజ చేతులు పైకెత్తారు. అంతకు ముందు శివాజీ కూడా సందీప్ చేసింది తప్పని అన్నాడు. ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలోనే.. 'నువ్వేమైనా పిస్తా అనుకుంటున్నావా?' అని సందీప్కి నాగ్ కౌంటర్ వేశాడు. తప్పు చేసినందుకుగానూ సందీప్ బ్యాటరీ డౌన్ చేస్తున్నా అని చెప్పాడు. దీంతో బ్యాటరీ కాస్త.. గ్రీన్(పచ్చ) నుంచి ఎల్లోకి(పసుపు) పడిపోయింది. అమర్కి అరటిపండు సామెత ఇక మిగిలిన వాళ్లలో గౌతమ్తో మాట్లాడిన నాగ్.. శోభాతో గొడవ విషయంలో నువ్వు చేసిన దానికి కారణం ఏదైనా అయ్యిండొచ్చు కానీ అందరికీ అది షో హాఫ్లానే అనిపించందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. మరోవైపు అమరదీప్.. ఈ వారం ఆటలో ఎక్కడా కనిపించలేదని చెప్పిన నాగ్.. ఆటలో అరటిపండు సామెత చెప్పి మరీ పరువు తీసినంత పనిచేశాడు. ప్రశాంత్తో మాట్లాడుతూ.. నువ్వెందుకు ఏడుస్తున్నావ్? ఓపిక లేదా మరోసారి ఆడలేవా? కన్నీళ్లతో పనిజరగలేదు. బిగ్ బాస్ కరుణించడు అని నాగ్ కాస్త గట్టిగానే సీరియస్ అయ్యాడు. రతిక మాజీ ప్రియుడు టాపిక్ గత వారం పప్పులో రెండు గ్లాసులు అయినా నీరు అయినా వేశావ్, ఈ వారం అది కూడా చేయలేదు, ఆడు నీకు ఆ శక్తి ఉందని అని చెప్పిన నాగ్.. ఆమెని కాస్త ఎంకరేజ్ చేశాడు. 'మాజీ బాయ్ఫ్రెండ్ అంటే గతమే కదా! గతాన్ని ఇక్కడ బుర్రలో పెట్టుకున్నావ్ అనుకో ప్రస్తుతంలో ఉండవు, భవిష్యత్తుకి కూడా వెళ్లవ్. ఎక్స్ అంటే ఎక్సే వదిలేసేయ్.. లెట్స్ లివ్ ఇట్' అని నాగార్జున సుతిమెత్తగా రతికకు సలహా ఇచ్చాడు. అయితే ఈ వారం గేమ్ ఆడకుండా బాయ్ఫ్రెండ్ పేరు చెప్పి రతిక సింపతీ కొట్టేస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అలానే నామినేషన్స్లో సిల్లీ రీజన్స్ చెబుతున్నారని, ఏదో చెప్పాలని చెప్పేస్తున్నారు తప్ప ఓ స్టాండ్ లేదని కంటెస్టెంట్స్కి చురకలు అంటించాడు. ఇక నామినేషన్స్లో ఉన్న ఏడుగురిలో యవర్ సేఫ్ అయ్యాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. -
నా పేరు ఎందుకు వాడుకుంటున్నావు..
-
6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్
బిగ్బాస్ హౌస్లో అతి చేస్తున్న కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారా? అంటే చాలామంది పేర్లు వినిపిస్తాయి. అయితే అంతుచిక్కని ప్రవర్తనతో అపరిచితురాలిగా మారుతూ అందరినీ చిరాకు పెట్టే కంటెస్టెంట్లలో తొలిస్థానంలో ఉంటుంది రతిక. మొదట్లో అమ్మాయి బాగుంది, ఆటాడితే ఇంకా బాగుంటుంది అనుకున్నారంతా! తను కూడా అదే చేసింది.. కానీ బిగ్బాస్ ఇచ్చిన గేమ్ ఆడకుండా హౌస్మేట్స్తో ఆడింది. వారి సహనానికి పరీక్ష పెడుతూ మొండిగా ప్రవర్తిస్తూ ముప్పతిప్పలు పెట్టింది. ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఇప్పుడేమో హౌస్లో లవ్ ట్రాక్లు నడుపుతూ, వెనకాల వెన్నుపోటు పొడుస్తూ డబుల్ గేమ్ మొదలుపెట్టింది. ఇదంతా పక్కనపెడితే రతిక ఆ మధ్య తన మాజీ బాయ్ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పదే పదే అతడి గురించే ప్రస్తావిస్తోంది. అతడు గుర్తొస్తే తన మైండ్ పని చేయడమే ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. అతడు సింగర్ అని కూడా హింటిచ్చింది. చివరకు ఆ సింగర్ మరెవరో కాదు, రాహుల్ సిప్లిగంజ్ అంటూ నెట్టింట ఫోటోలు కూడా లీకయ్యాయి. తాజాగా దీనిపై రాహుల్ స్పందించిన సంగతి తెలిసిందే! ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? కొందరు పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. వారి గుర్తింపు కోసం నా పేరును అవసరానికి మించి వాడుకుంటున్నారు అని మండిపడ్డాడు. ముందే ప్లాన్ చేసుకున్నారా? తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోలు లీక్ అవడంపైనా అనుమానం వ్యక్తం చేశాడు. 'నాకో డౌట్.. ఆరేళ్ల తర్వాత సడన్గా వారి పర్సనల్ ఫోన్లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లోకి ఎలా వచ్చాయి? అంటే.. లోపలికి వెళ్లడానికి ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నారా? సమాధానమేంటో మీకే అర్థమవుతుందనుకుంటా! అక్కడున్నది అబ్బాయైనా, అమ్మాయైనా వారి జీవితాలతో నాకెటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది! అలాంటిది.. ఇలా ఫోటోలు లీక్ చేసి ఇబ్బంది పెట్టేముందు క్షణం ఆలోచించాల్సింది. ఎదుటివ్యక్తి కుటుంబం, స్నేహితులు దీని వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారని ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. అసలేం జరిగిందో తెలియకుండా ఎవరిది తప్పు? ఒప్పు? అని డిసైడ్ చేయకండి. ఇది అర్థం చేసుకున్నవారికి థాంక్యూ.. లేదు, విషాన్ని చిమ్ముతామనుకునేవారికి ఆల్ ద బెస్ట్' అని రాసుకొచ్చాడు. చదవండి: పేరు చెప్పకుండా సీరియస్ అయిన సింగర్ రాహుల్ -
రతిక బండారం బయటపెట్టిన మాజీ బాయ్ఫ్రెండ్!
తెలుగు 'బిగ్బాస్'.. మరీ కాకపోయినా సరే ఓ మాదిరిగా అలరిస్తుంది. తొలి రెండు వారాలు చాలావరకు సైలెంట్గా ఉన్న కంటెస్టెంట్స్.. ఇప్పుడు అంటే మూడో వారం రెచ్చిపోయి మరీ ఫెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. గొడవలే టార్గెట్ అన్నట్లు మాటలతో కొట్లాడుకుంటున్నారు. అయితే హౌసులోని ఓ కంటెస్టెంట్పై.. బిగ్బాస్ విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్.. ఓ సీరియస్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది వైరల్గా మారింది. ఏం జరిగింది? తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొన్నాడు. అద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం సీజన్లో నటి రతిక.. ఓ కంటెస్టెంట్గా వచ్చింది. పర్లేదు అనిపించేలా ఆడుతోంది. ఈమె-రాహుల్ గతంలో ప్రేమించుకున్నారని, పెళ్లికి రెడీ అయిన వీళ్లు కొన్ని కారణాలతో విడిపోయారని సమాచారం. (ఇదీ చదవండి: ప్రిన్స్ ముఖంపై పేడ.. బక్వాస్ రీజన్ అని శోభా సీరియస్) తొలివారం హౌసులో బాయ్ ఫ్రెండ్ ని తలుచుకుని కాస్త బాధపడ్డ రతిక.. మంగళవారం ఎపిసోడ్లోనూ తన మాజీ ప్రియుడు పేరు ఎత్తకుండా అతడి గురించి మాట్లాడుకుంటున్నారని శివాజీ దగ్గరకొచ్చి కాస్త బాధపడింది. అయితే రతిక ఇలా చేయడంపై.. ఆమె పేరు ఎత్తకుండా రాహుల్.. ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టాడు. అదంతా పరోక్షంగా రతిక గురించే అని డౌట్ వస్తుంది. స్టోరీలో ఏముంది? 'ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఎప్పుడూ అందరూ సొంత టాలెంట్తోనే పైకి రావాలనుకుంటారు. కొందరు మాత్రం పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. గుర్తింపు రావడం కోసం నా పేరు అవసరం కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టూ ఇన్నర్ పర్సన్. కంగ్రాచ్యూలేషన్స్ టూ వాళ్ల పైసల్ తీసుకున్న టీమ్' అని రాహుల్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో ఈ స్టోరీ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. (ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?) -
రతిక-రాహుల్ సిప్లిగంజ్ బ్రేకప్ అవ్వడానికి కారణమిదే..
-
రతిక మాజీ బాయ్ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్.. బ్రేకప్కు కారణమిదే!
రతిక రోస్.. హౌస్లో చలాకీగా కనిపిస్తున్న ఈ బ్యూటీ గుండెలో ఎంతో బాధను మోస్తోందని నిన్నటి ఎపిసోడ్ చూస్తేనే అర్థమైపోతుంది. సీజన్ మొదలైన తొలిరోజే తన బ్రేకప్ గురించి ఆరా తీశాడు నాగ్. హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చావా? అని అడిగితే హా అంటూ నవ్వుతూనే 'చేసిందంతా చేసి ఎంత బాగా నవ్వుతూ అడుగుతున్నారో?' అని నాగ్నే నిలదీసింది. మధ్యలో నేనేం చేశానని నాగ్ అంటే.. 'మొత్తం మీరే చేశారు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు హార్ట్ బ్రేక్ అయింది కదా, ఎలా ఉందని అడుగుతున్నారు' అంది. అప్పుడు పునర్నవి కోసం.. ఇప్పుడు రతిక కోసం.. సరే, నేనేం చేశానో చెప్పు అని అడిగితే మాత్రం హౌస్లోకి వెళ్లాక తెలుస్తుందని మాట దాటవేసింది రతిక రోస్. సరే, నీ హార్ట్ బ్రేక్ చేసినవాడిని ఇమిటేట్ చేయు అని అడిగితే.. ఇప్పుడు పాట పాడాలా? అన్నది. అంటే తన మనసు ముక్కలు చేసిన వ్యక్తి సింగర్ అని అర్థమైంది. నిన్నటి ప్రోమో, ఎపిసోడ్తో ఆ సింగర్ మరెవరో కాదు రాహుల్ సిప్లిగంజ్ అని తేలిపోయింది. పిల్లా.. పిల్లా.. భూలోకం దాదాపు కన్నూమూయు వేళా.. అనే పాటను ప్రోమోలో వదిలి హింటిచ్చాడు బిగ్బాస్. అప్పుడే పరిచయం, ప్రేమ అప్పట్లో పునర్నవి భూపాలం కోసం ఈ పాట పాడాడు రాహుల్. ఇప్పుడు రతిక కోసం మరోసారి ఈ పాట ప్లే చేసినట్లు కనిపిస్తోంది. కానీ ఎపిసోడ్లో మాత్రం ఈ సాంగే వేయలేదు. అయితే రాహుల్-రతికల రిలేషన్ నిజమేనంటూ సోషల్ మీడియాలో బోలెడన్ని ఫోటోలు దర్శనమిస్తున్నాయి. రాహుల్ గతంలో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవాడు. హే పిల్ల ఆల్బమ్ షూటింగ్ సమయంలో రాహుల్, రతికల మధ్య పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. బిగ్బాస్ షో వల్లే బ్రేకప్ అయితే రాహుల్.. బిగ్బాస్కు వెళ్లాక పునర్నవితో లవ్ ట్రాక్ నడపడంతో వీరి మధ్య పొరపచ్చాలు వచ్చినట్లు కనిపిస్తోంది. చివరకు వీళ్ల బంధం బ్రేకప్తో ముగిసిందట! బిగ్బాస్ మూడో సీజన్లో రాహుల్- పునర్నవిల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చెప్పింది నాగార్జునే! పదేపదే వీరి మధ్య ఏదో ఉందన్నట్లుగా కామెంట్లు చేశాడు. అందుకే ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్లో చేసిందంతా చేసి ఇప్పుడిలా అడుగుతున్నారా? అని ముఖం మీదే అనేసింది. చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా? -
ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
ప్రముఖ సింగర్, బిగ్బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై రాహుల్ స్పందించాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. నేను ఆర్టిస్ట్ను.. రాజకీయాలకు నో 'నా మీద చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి.. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. రాజకీయ రంగప్రవేశం అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అన్ని పార్టీలలో ఉన్న అందరు నాయకులను నేను గౌరవిస్తాను. నేను ఒక ఆర్టిస్ట్ను.. అందరికీ వినోదం పంచడమే నా పని.. నా జీవితమంతా దానికే ధార పోస్తాను. అసలు నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు. ఇది మరీ టూమచ్.. నేను సంగీతాన్నే నా కెరీర్గా ఎంచుకున్నాను. ఇందులో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏ పార్టీ నాకు ఆహ్వానాలు పంపలేదు. నేను కూడా ఎవరినీ ప్రత్యేకంగా కలవలేదు. దయచేసి ఈ రూమర్స్ను ఇక్కడితో ఆపేయండి..' అని నోట్ షేర్ చేశాడు. 'పుకార్లు రావడం సాధారణమే.. కానీ ఈ పుకారు మాత్రం మరీ టూమచ్గా ఉంది' క్యాప్షన్లో రాసుకొచ్చాడు. దీంతో అతడి రాజకీయ అరంగేట్రం అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) చదవండి: సిగరెట్, గంజాయి.. ఊహించనన్ని చెడు అలవాట్లు, నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని.. కొట్టడం.. -
కాంగ్రెస్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ దరఖాస్తుతో మరింత ఉత్కంఠ
హైదరాబాద్: బీఆర్ఎస్ సీట్ల కేటాయింపులో నగరంలోని రెండు నియోజకవర్గాలను.. అందులోనూ గోషామహల్ను ఎందుకు పెండింగ్లో ఉంచారన్నది నగరంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగింటినే పెండింగ్లో ఉంచారు. ఇందులో రెండు సీట్లు నగరంలోని నాంపల్లి, గోషామహల్వే కావడం తెలిసిందే. ఈసారి గోషామహల్ను ఎలాగైనా దక్కించుకోవాలనే తలంపుతోనే బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ► గోషామహల్ ఏర్పాటుకు ముందు అది మహరాజ్గంజ్ నియోజకవర్గంగా ఉండేది. గోషామహల్గా ఏర్పాటయ్యాక వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ గెలుపొందారు. 2018 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క నియోజకవర్గం అదే. బీజేపీకి కంచుకోటగా మారిన ఆ నియోజకవర్గంలో ఎలాగైనా బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలనే తలంపుతోనే ఆ నియోజకవర్గాన్ని పెండింగ్లో ఉంచినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ► దాదాపు ఏడాది క్రితం రాజాసింగ్ను సస్పెండ్ చేసిన బీజేపీ.. ఇంతవరకు సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఈసారి బీజేపీ మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా.. లేక రాజాసింగే వస్తారా అన్నది వెల్లడి కావాల్సి ఉంది. బీఆర్ఎస్ తొలి జాబితా వెల్లడి కాగానే రాజాసింగ్ స్పందిస్తూ.. గోషామహల్ పెండింగ్లో ఉంచడానికి కారణం ఎంఐఎం అని, ఆ పార్టీ సూచించిన వారికే టికెట్ ఇస్తారని ఆరోపించడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేసేది తానేనని, ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని బహిరంగంగా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కన్ను ► కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి గోషామహల్ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే యోచనలో ఉంది. మహరాజ్గంజ్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1989, 2004లలో రెండు పర్యాయాలు, గోషామహల్గా రూపాంతరం చెందాక 2009లో కాంగ్రెస్ నుంచి ముఖేశ్గౌడ్ గెలుపొందారు. కాంగ్రెస్ ఓట్లు గణనీయంగా ఉన్న ఆ నియోజకవర్గాన్ని తిరిగి తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ దృష్టి సారించింది. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం రాహుల్ సిప్లిగంజ్ దరఖాస్తు చేసుకోవడంతో ఆయనకు టికెట్ ఇస్తే యూత్ ఓట్లు గణనీయంగా పడటమే కాకుండా ప్రచారం తిరుగులేని విధంగా ఉండి గెలుపు ఈజీ కానుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ► యూత్లో ఎంతో క్రేజ్ ఉన్న రాహుల్ సిప్లిగంజ్ ఒక సీజన్లో బిగ్బాస్ విన్నర్గా గెలుపొందడంతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పాటతో ఆస్కార్ దాకా వెళ్లడం తెలిసిందే. పార్టీయే ఆయనను ఆహ్వానించి ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. మంగళ్హాట్కు చెందిన రాహుల్ తన నివాసాన్ని అక్కడి నుంచి మార్చినప్పటికీ అక్కడి బస్తీల్లో అభిమానించేవారు భారీగా ఉన్నారు. అటు మాస్.. ఇటు క్లాస్ రెండు వర్గాల్లో ఎంతో గుర్తింపు ఉన్న సిప్లిగంజ్కు టిక్కెట్ ఇస్తే గత వైభవం తిరిగి పొందవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేచి చూసే ధోరణిలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ తొలుత గోషామహల్ టిక్కెట్ను నందు బిలాల్కు కేటాయిస్తుందని భావించినప్పటికీ, అంతకంటే బలమైన అభ్యర్థి కోసమే వేచి చూస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎలాగైనా గోషామహల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు చివరి దాకా వేచి చూసి.. మిగతా పార్టీలకంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలనేది బీఆర్ఎస్ యోచనగా తెలుస్తోంది. అందుకు తగిన అభ్యర్థిని అన్వేషిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ఖరారయ్యాకే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘గోషామహల్’ కోసం రాహుల్ సిప్లిగంజ్ దరఖాస్తు!
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఇవాళ కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవాళ చివరిరోజు కాగా.. దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. గోషామహాల్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో రాహుల్ రాజకీయ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇక దరఖాస్తుల పరిశీలన తర్వాత.. ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని పీసీసీ ఎంపిక చేస్తుంది. ఇప్పటి వరకు 900 దరఖాస్తులు దాటినట్లు తెలుస్తోంది. చివరి రోజు కావడంతో సాయంత్రం వరకు దరఖాస్తుల సంఖ్య వేయి దాటుతుందని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూట్యూబర్గా లోకల్ సాంగ్స్తో పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్, ఆపై టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్గా అలరిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 50కిపైగా చిత్రాల్లో పాడారు. రాహుల్ సిప్లిగంజ్ తెలుగు రియాలిటీ షో బిగ్బాస్-3 విజేతగానూ నిలిచారు. రాజమౌళి ట్రిపుల్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్కుగానూ ఆస్కార్ దక్కగా.. ఆ సాంగ్ సింగర్ అయిన రాహుల్కు ఆస్కార్ ఆ వేదికపైనా పాడి అలరించే అవకాశం దక్కింది కూడా. -
నేను చాలా అదృష్టవంతుడిని అక్క
-
అనసూయ అందాలు.. ఫరియా చిందులు
► థాయ్లాండ్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తుంది అనసూయ. అక్కడ సముద్రం ఒడ్డున దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ►తమ్ముడి వివాహ వేడుకలో ఫ్యామిలీతో కలిసి ఉన్న దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్ ►రామ్తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ►పింక్ జాకెట్లో దీపికా పిల్లి పరువాల విందు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. (ఫొటోలు)
-
రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి..
-
రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్బాస్ విన్నర్ నుంచి ఆర్ఆర్ఆర్ నాటునాటు సాంగ్తో స్టార్ అయిపోయాడు. హైదరాబాద్లోని బస్తీ నుంచి ప్రపంచం మెచ్చేస్థాయికి ఎదిగాడు. అంతలా పేరు సంపాదించుకున్నారు మన తెలుగు కుర్రాడు. సింగర్గానే కాకుండా పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి నెలకొంది. తన తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహా వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ రాజకీయ నాయకులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. రాహుల్ దగ్గరుండి తమ్ముడి పెళ్లి పనులు చూసుకున్నారు. తమ్ముడి పెళ్లిలో దిగిన ఫోటోలను రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పెళ్లికి తెలంగాణ మంత్రులు, భాజపా నాయకులు హాజరయ్యారు. (ఇది చదవండి: బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
పునర్నవి ప్రెగ్నన్సీ పై, అషు తో ప్రేమ పై క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
-
పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్.. ఛీ ఛీ నన్నెందుకు ఇరికిస్తారు?
బిగ్బాస్ షోతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పునర్నవి భూపాలం. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పున్ను ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా వర్కవుట్ కాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టిందో అప్పుడే యూత్ క్రష్గా మారిపోయింది. ఈ రియాలిటీ షోలో పునర్నవి- రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ బాగా క్లిక్కయింది. కానీ బయటకు వచ్చాక మాత్రం ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. పునర్నవితో రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న పునర్నవి గర్భం దాల్చిందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై పున్నూ ఘాటుగా స్పందిస్తూ పిచ్చిరాతలు రాయకండి. నేను ప్రెగ్నెంట్ ఏంటి? అని సీరియస్గానే కౌంటరిచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అషూ రెడ్డితో రాహుల్ ఈ విషయంపై రాహుల్ మాట్లాడుతూ.. 'ఛీ ఛీ.. నన్నెందుకు ఇరికిస్తారు? జీవితంలో ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం. బిగ్బాస్ తర్వాత ఎన్నో హిట్ పాటలు పాడా. బిజినెస్ మొదలుపెట్టా. తన కెరీర్లో తను బిజీగా ఉంది. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుంటామంతే! అషూ విషయానికి వస్తే తను నా బెస్ట్ ఫ్రెండ్. తను ఎంత మంచిదంటే.. చుట్టూ ఉన్న ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం మాకు తెలుసు. ప్రతిసారి అందరికీ వివరించి చెప్పలేను' అని చెప్పుకొచ్చాడు. -
ఆ సినిమాలో చేస్తే అవకాశాలు రావన్నారు: శివాత్మిక రాజశేఖర్
జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారామె. శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది. -
రామ్చరణ్ బర్త్డే స్పెషల్.. ఆస్కార్ విజేతలకు చిరు సన్మానం
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్చరణ్కు ఈ బర్త్డే మరింత ప్రత్యేకం. ఆస్కార్ విజయంతో పాటు త్వరలోనే చరణ్ తండ్రిగా ప్రమోట్ కానున్నాడు. దీంతో ఈ పుట్టినరోజు ఉపాసన మరింత స్పెషల్గా నిర్వహించింది. ఈ పార్టీకి రాజమౌళి కుటుంబం, నాగార్జున, వెంకటేశ్, కాజల్ అగర్వాల్, అడివి శేష్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక కొడుకు పుట్టినరోజును పురస్కరించుకొని చిరంజీవి ఆస్కార్(నాటు నాటు)విజేతలను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి,నిర్మాత డీవీవీ దానయ్య,సంగీత దర్శకుడు కీరవాణి, నాటునాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరలతో పాటు ఆర్ఆర్ఆర్ టీంలోని రమ, శ్రీవల్లి, ఎస్ఎస్ కార్తికేయలకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజున అయినవాళ్లు, ఆత్మీయుల సమక్షంలో ఆస్కార్ విజేతలను సన్మానించడం నిజంగా ఓ వేడుకలా జరిగిందంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
‘రంగమార్తాండ’ చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: కృష్ణ వంశీ
‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్. -
Oscar Naatu Naatu: రాహుల్.. ధూల్పేట్ నుంచి లాస్ ఎంజిల్స్ వరకు(అరుదైన ఫోటోలు)
-
స్టార్ డాటర్తో రాహుల్ సిప్లిగంజ్.. వీడియో సాంగ్ విడుదల
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తున్న చిత్రం రంగమార్తాండ.కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్కు జోడీగా శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన మూవీ టీం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ను విడుదల చేసింది. ‘పొదల పొదల గట్ల నడుమ లగోరంగ లగోరే..పొడుస్తుంటే చందమామ లగోరంగ లగోరే’ అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించాడు. -
ధూల్పేట్లో పుట్టి.. దుమ్ము లేపుతున్నాడు..
తెలుగు సినీ చరిత్ర పుటల్లో ఆర్ఆర్ఆర్ నాటు.. నాటు పాట నూతన అధ్యాయాన్ని లిఖించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి ఎంపికైహైదరాబాద్ మహా నగరం పేరును విశ్వ వ్యాప్తం చేసింది. సిటీకి చెందిన గాయకులు పాడిన పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో నవయువ విజయాల భాగ్య ‘నగ’రి మణిహారంలో మరో ఆణిముత్యం జత చేరింది. టాలీవుడ్ రాజధానిగా.. సినిమాల తయారీకి చిరునామాగా ఉన్న నగర ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ ఆస్కార్ పురస్కారం వరించడం సిటిజనులకు గర్వకారణంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమా రూపకర్తలు, కథా నాయకులు, నృత్య దర్శకుడు... అందరూ మన సిటిజనులే కాగా నాటు నాటు పాడిన ఇద్దరు యువ గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇక్కడే పుట్టి పెరిగిన వారు కావడంతో సంతోషం ద్విగుణీకృతమైంది. ధూల్పేట్లో పుట్టి.. దుమ్ము లేపుతున్నాడు.. నగరంలోని ధూల్పేట్కు చెందిన ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. ఖండాంతర ఖ్యాతి సొంతం చేసుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఇంట్లోని గిన్నెలు, స్టీలు ప్లేట్ల మీద దరువేసిన నాటి అల్లరి కుర్రోడు ఆస్కార్ ను ఇంటికి తెచ్చేసుకున్నాడు. నిన్నా మొన్నటి దాకా మన మధ్యనే ఆడి పాడిన రాహుల్ సిప్లిగంజ్ అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రముఖుల మధ్య పాడి ఆడించాడు. చిన్నవయసులో గజల్ మాస్టర్ దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేసిన రాహుల్.. మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్లో పని చేశాడు. ఏడేళ్ల శిక్షణలో గజల్స్పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే సినిమాల్లో కోరస్గా అలా అలా నాగ చైతన్య తొలి చిత్రం జోష్లో ‘కాలేజీ బుల్లోడా’ పాటతో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తను పాడిన పాటల సీడీని తీసుకు వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించి, ఆయన సంగీత దర్శకత్వంలో ‘వాస్తు బాగుందే’ అనే పాడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘ఈగ’లో టైటిల్ సాంగ్, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు.. వంటి వరుస హిట్ సాంగ్స్తో స్టార్ సింగర్గా ఎదిగిపోయాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా స్వయంగా రూపొందిస్తూ.. మంగమ్మ, పూర్ బాయ్, మాకీ కిరికిరి’, ’గల్లీకా గణేష్’, ’దావత్’.. ఇలా నగర సంస్కృతీ సంప్రదాయాలకు తనదైన గానాన్ని జతచేసి సక్సెస్ సాధించాడు. గత 2019లో బిగ్బాస్ సీజ న్–3లో గెలిచి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కాలభైరవ.. గాన వైభవ.. ప్రముఖ సంగీత దర్శకుడు, నాటు నాటు పాటకు స్వరాలద్దిన కీరవాణి తనయుడు కాలభైరవ.. గత కొంత కాలంగా గాయకుడిగా రాణిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పాడుతున్నాడు. గాయకుడిగానే కాకుండా మత్తు వదలరా, కలర్ ఫొటో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి సత్తా చాటాడు. బాహుబలి 2లో దండాలయ్యా...పాటతో సూపర్ హిట్ కొట్టాడు. నాటు నాటు పాటలో సహ గాయకుడు రాహుల్తో కలిసి స్వరం కలిపి ఏకంగా ఆస్కార్నే అందుకున్నాడు. కాలభైరవ,రాహుల్ సిప్లిగంజ్ సిటీ కుర్రాళ్లే విశ్వ సినీ చరిత్రలో మన నగరానికి ఖండాంతర ఖ్యాతి ఇరువురు గాయకులపై అభినందనల వెల్లువ -
బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా
ధూల్ పేట్లో పుట్టిన కుర్రాడు.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఉన్న ఇష్టంతో గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ సాంగ్స్ పాడేవాడు. అతని టాలెంట్ను గుర్తించిన తండ్రి కుమారుడికి సంగీతం నేర్పించాలని ఓ గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకున్న ఆ కుర్రాడు చిన్న చిన్న సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్గా మారాడు. అలా ఓ వైపు సంగీతంలో ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్లో పనిచేశాడు. తన సింగింగ్ టాలెంట్తో శ్రోతలను మైమరిపించేవాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదలైన అతని ప్రయాణం ఈరోజు ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా ఎదిగాడు.. అతడే రాహుల్ సిప్లిగంజ్. ధూల్ పేట్ టూ లాస్ ఎంజిల్స్ వరకు సాగిన అతడి ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. గల్లీ బాయ్ పేరుకు తగ్గట్లుగానే వివాదాలు అతనితో ముడిపడి ఉన్నాయి. ఆనాటి నుంచి ఇప్పుటిదాకా సాగిన రాహుల్ విజయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. రాహుల్ సిప్లిగంజ్ బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన రాహుల్కు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేదట. స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్సాంగ్స్ పాడేవాడట. ఇది గమనించిన రాహుల్ తండ్రి, ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో సాయం చేసేవాడు. సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని గజల్స్పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే కోరస్ పాడే అవకాశాలు తలుపుతట్టాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడట.రాహుల్ ప్రతిభను చూసిన కీరవాణి అతనికి దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ అనే టైటిల్ సాంగ్ ను పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు ఇలా పలు సినిమాల్లో సింగర్గా రాహుల్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. మంగమ్మ,పూర్ బాయ్, మాకి కిరికిర', 'గల్లీ కా గణేష్', 'దావత్'.. ఇలా హైదరాబాదీ సంస్కృతి, సంప్రదాయాలకు తన జోష్ మిక్స్ చేసి రాహుల్ పాటలు కంపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే 2019లో తెలుగు బిగ్బాస్ సీజన్-3లో పాల్గొనడంతో రాహుల్ దశ తిరిగిందని చెప్పొచ్చు. పునర్నవితో లవ్ట్రాక్, తన పాటలు, ఎనర్జీ, శ్రీముఖితో గొడవలు ఇలా ఒకటేమిటి అన్ని షేడ్స్ చూపించి యూత్లో మాంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సీజన్ విన్నర్గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకుళ్లాడు. గల్లీబాయ్ పేరుకు తగ్గట్లేగానే రాహుల్ పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాడు. బిగ్బాస్ టైటిల్ గెలిచిన కొన్ని వారాలకే ఓ పబ్లో జరిగిన గొడవలో రాహుల్పై బీరు సీసీలతో దాడి చేసిన సంఘటన అప్పట్లో హాట్ టాపిక్గా నిలిచింది. ఎమ్మెల్యే బంధువులపై రాహుల్, అతని స్నేహితులకు మధ్య జరిగిన గొడవలో బీరుసీసాలతో గొడవ, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వరకు వెళ్లింది. కట్చేస్తే.. కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్లో బంజారాహిల్స్ రాడిసన్ పబ్లో డ్రగ్స్ వాడారనే సమాచారంతో అర్థరాత్రి పోలీసులు జరిపిన రైడ్లో రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 150మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకోగా పలువురు సెలబ్రిటీలతో పాటు రాహుల్ కూడా విచారణను ఎదుర్కున్నాడు. ఇలా వివాదాలతో సావాసం చేసిన రాహుల్ తనను విమర్శించినవాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు. విశ్వవేదికపై తెలుగోడి సత్తా సగర్వంగా నిరూపించాడు. ఆర్ఆర్ఆర్లోని రాహుల్ పాడిన నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆ బస్తీ పోరడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. -
ఆస్కార్ అవార్డు గెల్చిన నాటు నాటు సాంగ్... సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అమ్మ నాన్న ఎమోషనల్
-
ప్రియాంక చోప్రా పార్టీలో సందడి చేసిన రాహుల్ సిప్లిగంజ్
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ హంగామానే కనిపిస్తుంది. ఈనెల 12న జరగనున్న ఆస్కార్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని నాటునాటు పాట ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అంతార్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ పాట ఆస్కార్ పురస్కారానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. తెలుగు వారితో పాటు భారతీయులంతా ఈసారి మనకు ఆస్కార్ కశ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రామ్చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సహా ఆర్ఆర్ఆర్ టీం అమెరికాకు పయనమయ్యారు. ఆస్కార్ 95వ అకాడమీ వేడుకల్లో రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ నాటునాటు సాంగ్ లైవ్ ఫర్మార్మెన్స్ ఇవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే వీరు కూడా యూఎస్లో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ప్రియాంక చోప్రా నిర్వహించిన ప్రీ ఆస్కార్ పార్టీకి రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యాడు. ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ మీ పార్టీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రియాంక చోప్రాజీ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
ఆస్కార్ స్టేజ్పై నాటు నాటుకు చరణ్, తారక్ డాన్స్? ఎన్టీఆర్ క్లారిటీ
అకాడమీ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉంది ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కాటగిరిలో ఆస్కార్కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ వస్తుందా? లేదా? అనేది ఒక్క రోజులో తేలనుంది. మార్చి 12న అమెరికాలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. దీంతో అందరి చూపు ఆర్ఆర్ఆర్పైనే ఉంది. అంతేకాదు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నాటు నాటు సాంగ్ పర్ఫామెన్స్ కూడా ఉండనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కీరవాణిలు స్టేజ్ఈ పాట పాడుతుండగా.. తారక్, చరణ్లు కాలు కదపనున్నారని సమాచారం. తాజాగా దీనిపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో నేపథ్యంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు వరుసగా పలు హాలీవుడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లాస్ ఏంజిల్స్కు చెందిన KTLA ఛానల్తో తారక్ ముచ్చటించాడు. చదవండి: శ్రీవారి సేవలో దిల్ రాజు ఫ్యామిలీ.. వారసుడిని చూశారా? ఎంత క్యూట్గా ఉన్నాడో.. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు వేదికపై నాటు నాటు పాట పర్ఫామెన్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి తాను ఆస్కార్ అవార్డుల రెడ్ కార్పెట్పై పూర్తి ఇండియన్గా నడిచి వస్తానని చెప్పుకొచ్చిన తారక్, వేదికపై నాటు నాటు సాంగ్కు పర్ఫామెన్స్ చేయడం లేదని తేల్చి చెప్పాడు. కానీ, కీరవాణితో పాటు ఈ పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్లు స్టేజ్పై నాటు నాటు పాటను పాడనున్నారని స్పష్టం చేశాడు. కాగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గొల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ వంటి అవార్డులను గెలుచుకుంది. -
ఆస్కార్ లైవ్లో నాటునాటు పాట.. అగ్గిరాజేసుడే ఇగ!
మరికొద్ది రోజుల్లో ప్రపంచమే ఎదురు చూస్తున్న ఆస్కార్ సినీ వేడుక జరుగబోతోంది. ఈసారి అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ మీదే ఉంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులతో మోత మోగించిన ఈ మూవీ ఆస్కార్ను ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ నుంచి నాటునాటు పాట బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్కు నామినేట్ అయిన విషయం తెలిసిందే! తాజాగా ఫ్యాన్స్కు మరో గుడ్న్యూస్ చెప్పింది ఆస్కార్ టీమ్. ఈ నెల 12న జరగబోయే 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాటను లైవ్లో పాడనున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంకేముంది... మన సింగర్లు స్టేజీపై అగ్గిరాజేయడం ఖాయం. వీరి పాటకు అక్కడున్నవాళ్లకు ఊపు రావడమూ తథ్యం. అంత పెద్ద వేదికపై పాడటం, అది కూడా తెలుగు పాట కావడం గర్వించదగ్గ విషయం. ఈ విషయంపై రాహుల్ సిప్లిగంజ్ స్పందిస్తూ.. 'ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫామెన్స్.. కచ్చితంగా ఇవి నా జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా మిగిలిపోతాయి' అని సంతోషం వ్యక్తం చేశాడు. Rahul Sipligunj and Kaala Bhairava. “Naatu Naatu." LIVE at the 95th Oscars. Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/8FC7gJQbJs — The Academy (@TheAcademy) February 28, 2023 This is going to be unforgettable moment in my life🔥🔥😎 https://t.co/Me1sCKSMxY — Rahul Sipligunj (@Rahulsipligunj) February 28, 2023 చదవండి: మా నాన్న కంటే నా భార్యకే ఎక్కువగా భయపడతా: మంచు విష్ణు -
‘నాటు నాటు’ ఆస్కార్కి నామినేట్ అవ్వడం గర్వంగా ఉంది: రాహుల్ సిప్లిగంజ్
తాను ఆలపించిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్కి నామినేట్ అవ్వడం ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట అస్కార్కి నామినేట్ అయిన సందర్భం రాహుల్ సిప్లిగంజ్ను షేడ్ స్టూడియోస్ సీఈవో దేవీప్రసాద్ బలివాడ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ఖ్యాతిని గౌరవాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట ఆస్కార్ బరిలో నిలవడం గర్వంగా ఉందన్నారు. ‘మా స్టూడియోస్తో ఎంతో అనుబంధం ఉన్న కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ మరియు లిరిక్ రైటర్ చద్రబోస్ ఈ పాటకి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ టీమ్తో కలిసి ఎన్నోసార్లు మ్యూజికల్ జర్నీ లో మా షేడ్ స్టూడియోస్ భాగమైనందుకు మేము అదృష్టం గా భావిస్తున్నాం’నఅ్నారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. ‘నా పాట ఆస్కార్కి నామినేట్ అయిందన్న విషయం తెలిసి నా తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారు. ఈ సంతోషానికి మూల కారణమైన దర్శకధీరుడు రాజమౌళి గారు, ఎమ్.ఎమ్. కీరవాణి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నాటు నాటు సాంగ్ తప్పకుండ ఆస్కార్ లో గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతలు నాకు ఎంతో సంతోషంగా ఉంది. -
రాహుల్కు కంగ్రాట్స్ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్ రూమర్స్
ప్రస్తుతం నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఈ పాటకు బెస్ట్ ఓరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ క్యాటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి అందుకున్నారు. ఆస్కార్ తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు పొందిన అవార్డు మన ఇండియన్ మూవీకి రావడం ఇదే తొలిసారి. దీంతో ఆర్ఆర్ఆర్ టీం, డైరెక్టర్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణిలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు నీరాజనాలు పలుకుతున్నారు. చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఉపాసన, ట్వీట్ వైరల్ ఇక ఈ పాట పాడిన సింగర్ రాహుల్ సిప్లగంజ్ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు. ఇంటర్నేషనల్ స్టేజ్పై కీరవాణి రాహుల్ పేరు చెప్పడం, ఈ అవార్డు విన్నింగ్ క్రెడిట్ ఇవ్వడంతో అనందంలో తేలిపోతున్నాడు. ఇక ఈ గ్రేట్ సక్సెస్ మూమెంట్ను తన స్నేహితులు, సన్నిహితుల మధ్య బుధవారం సాయంత్రం సెలబ్రెట్ చేసుకున్నాడు రాహుల్. అందులో రాహుల్ స్నేహితురాలు, అతడి రూమర్డ్ గర్ల్ఫ్రెండ్ అషురెడ్డి కూడా పాల్గొంది. ఈ పార్టీలో రాహుల్తో క్లోజ్గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ అతడికి శుభాకాంక్షలు తెలిపింది. దీంతో వీరిద్దరి ఎఫైర్ రూమార్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. చదవండి: అందుకే మీరు దళపతి అయ్యారు!: విజయ్పై షారుక్ ట్వీట్ బిగ్బాస్ అనంతరం చట్టాపట్టేసుకుని తిరిగిన వీరిద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని అంతా అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అషు, రాహుల్ను కౌగిలించుకుని అంత సన్నిహితంగా కనిపించడంతో ‘మళ్లీ కలిసిపోయారా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారి రిలేషన్ గురించి అడిగనప్పుడల్లా అషు, రాహుల్ తాము స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. కానీ వారిద్దరు అతిసన్నిహితం చూసి నెటిజన్లు వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు..నా ఆనందానికి హద్దులు లేవు
-
ఈ గల్లిబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్పై వినిపించింది
-
ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్పై వినిపించింది: రాహుల్ ఎమోషనల్
ఆర్ఆర్ఆర్ మూవీకి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దీనికి ఎమ్ఎమ్ కీరవాని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీకి కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. నాటు నాటు పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా పని చేశారు. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటి ముందుకు మీడియా, అభిమానుల భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా, ఫ్యాన్స్ మధ్య రాహుల్ కేక్ కట్ చేసి ఈ గ్రేట్ మూమెంట్ను సెలబ్రెట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావాడం చాలా హ్యపీగా ఉంది. ఆ రేంజ్లో పాటకు గుర్తింపు వస్తుందని అనుకోలేదు. నన్ను నేను ఎప్పుడు గల్లీబాయ్గా పోల్చుకుంటా. కానీ ఇప్పుడు ఈ గల్లీబాయ్ పేరు అంతర్జాతీయ స్టేజ్పై వినిపించింది. స్టేజ్పై కీరవాణి గారు నా పేరు చెప్పడం గర్వంగా అనిపిస్తుంది. మళ్లీ ఇలాంటి మూమెంట్ వస్తుందో రాదో తెలియదు. నా వాయిస్ను అంగీకరించిన ఆర్ఆర్ఆర్ టీం, కీరవాణి సార్, రాజమౌళి సార్, రమ మేడమ్ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: గోల్డెన్ గ్లోబ్ అవార్డు: ఆర్ఆర్ఆర్ టీంకి చిరు, ఏఆర్ రెహమాన్ శుభాకాంక్షలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్... అవార్డ్ వచ్చేసింది! -
టికెట్ టు ఫినాలే గెలిస్తే ఓటమి ఖాయమేనా?
బిగ్బాస్ షోలో ముఖ్యమైన ఘట్టం టికెట్ టు ఫినాలే. నిజంగానే టికెట్ టు ఫినాలే గెలవడం అవసరమా? ఇది గెలవకుండా ఫినాలేలో అడుగుపెట్టలేరా? ఇది గెలిచినవారు ఇంతకుముందు ఎవరైనా కప్పు కొట్టారా? లేదా? ఈ వివరాలన్నీ ఓసారి చదివేద్దాం.. బలమైన కంటెస్టెంట్కు భారీ అభిమానగణం తోడైతే వారికి టికెట్ టు ఫినాలే అవసరమే లేదు. అది లేకుండానే ఈజీగా ఫినాలేకు వెళ్లొచ్చు. కానీ రిస్క్, టెన్షన్ లేకుండా టాప్ 5లో చోటు దక్కించుకోవాలంటే మాత్రం టికెట్ టు ఫినాలే గెలుచుకోవాల్సిందే! నిజానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన మొదటి సీజన్లో టికెట్ టు ఫినాలే ప్రస్తావనే లేదు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్లో సామ్రాట్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫినాలేలో మొదటగా అడుగుపెట్టాడు. కానీ విజేతగా అవతరించలేకపోయాడు. నాగార్జున హోస్ట్గా చేసిన మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని మొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. అంతేకాకుండా ఆ సీజన్ విజేతగానూ అవతరించాడు. ఈ టికెట్ గెలిచి కప్పు కొట్టిన మొట్టమొదటి వ్యక్తిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. నాలుగో సీజన్లో టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ సార్థక్ రన్నరప్గా నిలిచాడు. ఐదో సీజన్లో శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే సాధించాడు. కాకపోతే ఓ టాస్క్లో శ్రీరామ్ కాళ్లు సహకరించకపోవడంతో అతడి తరపున సన్నీ, షణ్ముఖ్లు టాస్క్లు పూర్తి చేసి అతడిని గెలిపించడం విశేషం. ఈ ఐదు సీజన్స్ గమనిస్తే టికెట్ టు పినాలే గెలిచినవారిలో రాహుల్ సిప్లిగంజ్ మినహా ఎవరూ విజేతలుగా నిలవలేకపోయారు. అఖిల్ ఒక్కడే కనీసం రన్నరప్ దాకా వచ్చి ఆగిపోయాడు. మరి ఈ సీజన్లో శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరి అతడు విన్నర్ లేదా రన్నర్ అవుతాడా? ప్రస్తుతం అనధికారిక పోల్స్ చూస్తే రేవంత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఉన్న కొద్ది రోజుల్లో తన గ్రాఫ్ పెంచుకుని శ్రీహాన్ విన్నర్ అవుతాడా? కనీసం రన్నరప్గా అయినా నిలుస్తాడా? అనేది చూడాలి! చదవండి: మహేశ్బాబుతో మాట్లాడా, ఆయన అలా అనేసరికి కన్నీళ్లొచ్చాయి ఆ ముగ్గురూ వేస్ట్, అంత భయముంటే బిగ్బాస్కు రావొద్దు: రేవంత్ -
పోరీల ఎంటపోకు ఫ్రెండూ అని పాడుతున్న అల్లు శిరీష్
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ బ్యానర్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ "ఊర్వశివో రాక్షసివో". అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలో ‘మాయారే’ అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటను కాసర్య శ్యామ్ రచించారు. అనూప్రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. చదవండి: ఒంటరిగా రమ్మన్నాడు, కొలతలు అడిగి నీచంగా -
కొత్తింట్లోకి రాహుల్ సిప్లిగంజ్, ఫొటో వైరల్
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అభిమానులతో గుడ్న్యూస్ పంచుకున్నాడు. కొత్తింటి కల సాకారమైందని, గృహ ప్రవేశం కూడా పూర్తయిందని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పాడు. అభిమానుల సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదన్నాడు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు విశ్వ, అషూ, శిల్ప, మెహబూబ్ దిల్సే, రోల్ రైడా, అరియానా గ్లోరీ రాహుల్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాహుల్ తన నూతన గృహంలో దిగిన ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్గా మారాయి. కాగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్బాస్ తెలుగు మూడో సీజన్ విన్నర్గా నిలిచిన విషయం తెలిసిందే! ఈ సింగర్ పలు సినిమాల్లో పాడటంతో పాటు ఓ చిత్రంలో నటిస్తున్నాడు కూడా! View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) చదవండి: -
'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా' సాంగ్ విన్నారా?
యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి 'దోస్త్ అంటే నువ్వేరా.. ఫ్రెండ్ అంటే నువ్వేరా..' అనే లిరికల్ సాంగ్ను నిజజీవితంలో మంచి మిత్రులు అయిన హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి విడుదల చేశారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో మున్నా ఎస్డీ సాహిత్యాన్ని అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో టాలీవుడ్ రియల్ ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ గోపీచంద్, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్, ఎన్టీఆర్ రామ్ చరణ్, మహేష్ బాబు వంశీ పైడిపల్లి ఇలాంటి వారిని చూపిస్తూ స్నేహం గొప్పదనం తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. పాడుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. దోస్త్లందరికీ ఇది ఒక ఆంథమ్ సాంగ్ అవుతుందని నా నమ్మకం. ఈ పాట నాకు ఇచ్చిన మ్యూజిక్ దర్శకుడు గిఫ్టన్ కి దర్శకుడు గురు పవన్ కి థ్యాంక్స్ అన్నారు. చదవండి: అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్! 'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? -
రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ను రిలీజ్ చేసిన హీరో నిఖిల్
ప్రియాంక డే టైటిల్ రోల్లో సాయి తేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీన. నవీన్ ఇరగాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటను యంగ్ హీరో నిఖిల్ విడుదల చేశారు విడుదల చేశారు. ఈ పాటకు షారుక్ షేక్ ట్యూన్ను అందించగా.. ప్రసాద్ నల్ల అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. యంగ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘ఈ పాటను చూస్తుంటే.. కొత్త వాళ్లు చేసినట్టుగా లేదు. ఎంతో అద్భుతంగా ఉంది. ఇలాంటి కొత్త జానర్లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలి. టీజర్, ట్రైలర్ కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నేను కూడా ఈ సినిమా చూస్తాను. కొత్త వాళ్లను, కొత్త జానర్లను అందరూ ఎంకరేజ్ చేయాలి. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సాయి తేజకు శుభాకాంక్షలు’ అన్నారు. డైరెక్టర్ నవీన్ ఇరగాని మాట్లాడుతూ.. ‘మా సినిమా పాటను హీరో నిఖిల్ గారు రిలీజ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. మా లాంటి కొత్తవాళ్లకు నాని గారు, నిఖిల్ గారు, రవితేజ గారు ఇన్స్పిరేషన్గా ఉంటారు’ అన్నారు. నటుడు సాయి తేజ మాట్లాడుతూ.. ‘నిఖిల్ అన్న వచ్చి మా సాంగ్ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయన ఈ పాటను రిలీజ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. నా బర్త్ డే సందర్భంగా ఈ పాటను ఆయన రిలీజ్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది’ అని అన్నారు. చదవండి: Jr NTR ధరించిన టీషర్ట్ అంత ఖరీదా? రవితేజకు భారీ షాక్! -
'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా'.. పూజాతో వెంకీ, వరుణ్ స్టెప్పులు..
F3: Pooja Hegde Life Ante Itta Vundaala Lyrical Song Released: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ అని తెలిసిన విషయమే. మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటించిన 'ఎఫ్ 3' మే 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేకాకుండా అంతకుముందు రిలీజైన రెండు సింగిల్స్ ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా మూడో సింగిల్ను వదిలారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ సాగే లిరికల్ సాంగ్ను మంగళవారం (మే 17) విడుదల చేశారు. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. పూజాతోపాటు వెంకటేశ్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ కలిసి చిందేసారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పార్టీ నంబర్గా పేర్కొన్న ఈ పాట పార్టీల్లో, వేడుకల్లో మారుమోగనుంది. చదవండి: ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్పై స్పందించిన అనిల్ రావిపూడి -
నన్ను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు : రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన
బంజారాహిల్స్ ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పటికీ హాట్టాపిక్గానే ఉంది. టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకోగా వీరిలో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉండటం మరింత సెన్సేషన్గా మారింది. ఇక ఈ లిస్ట్లో ప్రముఖ సింగర్, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ఉన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని రాహుల్ స్పష్టం చేసినా అతనిపై ఆరోపణలు ఆగడం లేదు. రెగ్యులర్గా పబ్కు వెళ్లే అలవాటు ఉండటంతో రాహుల్ని నిందిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా రాహుల్ ఓ వీడియోను విడుదల చేశాడు. ‘నన్ను నమ్మడానికి, నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అయినప్పటికీ నా మీద నాకు నమ్మకం ఉంది. నిజం ఏంటో నాకు తెలుసు’ అంటూ ఇన్స్టాలో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు కొందరు ‘నిన్ను నమ్ముతున్నాం రాహుల్.. వి ఆర్ విత్ యూ’ అంటూ సపోర్ట్గా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
బంజారాహిల్స్ రేవ్ పార్టీ: వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj Talks With Media Over Drugs Case: బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ రేవ్ పార్టీ టాలీవుడ్లో సంచలనం రేపుతుంది. ఈ పార్టీలో ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం హాట్ టాపిక్గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన.. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సాక్షి టీవీతో మాట్లాడాడు. డ్రగ్స్ వ్యవహరంతో తనకు సంబంధంలేదని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగిన ఈ పార్టీకి తl కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యానని, తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ జరిగినట్లు తెలిపాడు. చదవండి: రామ్ చరణ్ గొప్ప మనసు, ఆర్ఆర్ఆర్ టీం ఒక్కొక్కరికి తులం బంగారం.. ఈ పార్టీలో తను అసలు డ్రగ్స్ తీసుకోలేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. ఎవరో ఇద్దరి ముగ్గురి వల్ల అందరికి చెడ్డ పేరు వచ్చిందని పేర్కొన్నాడు. అలాగే లేట్నైట్ వరకు పబ్ నిర్వహిస్తుంటే యాజమాన్యాన్ని నిలదీయాలి, కానీ ఇలా మమ్మల్ని పలిచి ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచిన వెళ్తానని, ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం లేనప్పడు తాను భయపడాల్సిన అవసరం లేదని రాహులు పేర్కొన్నాడు. -
రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్
-
ఏద్దాం గాలం, సేసేద్దాం గందరగోళం.. ముగ్గురు సింగర్లు పాడిన ఈ పాట విన్నారా?
తాప్సీ ముఖ్య తారగా స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘ఏద్దాం గాలం.. సేసేద్దాం గందరగోళం.. లేసేలోగా ఏసేద్దాం రా ఊరిని వేలం..’ అంటూ సాగే మొదటి పాటను బుధవారం విడుదల చేశారు. మార్క్ కె. రాబిన్ స్వరపరచిన ఈ పాటకు దర్శకుడు హసిత్ గోలీ సాహిత్యం అందించగా శ్రీరామ్ చంద్ర, రాహుల్ సిప్లిగంజ్, హేమచంద్ర పాడారు. రిలీజ్కు రెడీ అవుతున్న ఈ చిత్రానికి కెమెరా: దీపక్ యెరగరా, అసోసియేట్ ప్రొడ్యూసర్: ఎన్ ఎం పాషా. -
బిగ్బాస్ నాన్స్టాప్లోకి బోల్డ్ బ్యూటీ !.. రాహుల్ ఇలా కన్ఫర్మ్ చేశాడా ?
Ashu Reddy Bigg Boss Non Stop Entry Confirm By Rahul Sipligunj: బుల్లితెరపై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్బాస్ ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ వేదికగా వినోదం పంచేందుకు సిద్ధమైంది. ‘బిగ్బాస్ నాన్స్టాప్’ పేరుతో 'డిస్నీ ప్లస్ హాట్స్టార్'లో ప్రసారం కానున్న ఈ షోకు నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుండగా.. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. తెలుగులో మొదటిసారిగా 24 గంటలు పాటు ప్రసారం కానున్న ఈ షోలో కంటెస్టెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే పులువురు సెలబ్రిటీలు, మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్లు ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నట్లు వార్తలు విన్నాం. అయితే తాజాగా ఒక మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ ఈ ఓటీటీ షోలో కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. బోల్డ్ బ్యూటీ అషు రెడ్డీ బిగ్బాస్ నాన్స్టాప్లో సందడి చేయనున్నట్లు బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అయితే బిగ్బాస్ నాన్స్టాప్ తొలి సీజన్లో అషు రెడ్డి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ఒక్క కంటెస్టెంట్ పేరు ప్రకటించలేదు. ఈ క్రమంలో రాహుల్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. 'ఆల్ ది బెస్ట్ అషు.. దేనికి చెప్పానో నువే ఆలోచించుకో' అంటూ పోస్ట్ చేశాడు రాహుల్. దీంతో అందరూ అషు రెడ్డి బిగ్బాస్ నాన్స్టాప్లో ఎంట్రీ ఇస్తుందని చర్చించుకుంటున్నారు. -
ముంబై వీధుల్లో ఆటో నడిపిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj Rides Auto On Streets In Mumbai Video Viral: బిగ్బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ముంబై వీధుల్లో ఆటో నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది తన జీవితంలో లంబోర్ఘిని అని, దీని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానంటూ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలె ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ ముంబై వెళ్లాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎంతగానో పాపులర్ అయిన నాటు నాటు సాంగ్ని రాహుల్ పాడిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జనవరి7న ఈ సినిమా విడుదల కానుంది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలో కొమురమ్ భీమ్గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రలు పోషించారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ క్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
డేటింగ్ యాప్లో ఓ అమ్మాయిని కలిశా: సన్నీ
Bigg Boss 5 Telugu, Five Time Fun Before The Grand Finale: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ కథ రేపటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్తో ముగియనుంది. ఈ కథలో ఎవరు హీరో అయ్యారు? కాదు కాదు ప్రేక్షకులు ఎవరిని హీరో చేశారన్న ప్రశ్నకు రేపు సమాధానం దొరకనుంది. దానికన్నా ముందు ఫైనలిస్టులను సరదాగా నవ్వించేందుకు ప్లాన్ చేశాడు బిగ్బాస్. గత సీజన్ల కంటెస్టెంట్లను పంపించి ప్రస్తుతం ఉన్న హౌస్మేట్స్ను ఓ ఆటాడుకోమన్నాడు. ఈ క్రమంలో రాహుల్ సిప్లిగంజ్, శివజ్యోతి ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. బెలూన్లలోని గాలిని పీల్చుకుని దాన్ని బయటకు వదలకుండా మాట్లాడాలన్నారు. దీంతో కంటెస్టెంట్ల గొంతులు మారిపోవడంతో అందరూ పగలబడి నవ్వారు. ఇక అఖిల్ సార్థక్.. మీరెప్పుడైనా డేటింగ్ యాప్లో ఎవర్నైనా కలిశారా? అని అడిగాడు. దీనికి సన్నీ ఆన్సరిస్తూ.. 'ఒకసారి ఓ అమ్మాయిని కలిశాను. కానీ ఆమె నా ముచ్చట వదిలేసి తన బాయ్ఫ్రెండ్ గురించి చెప్తూ పోయింది' అని చెప్పడంతో హౌస్మేట్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. మరి ఈ సరదా ఎపిసోడ్ను చూడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
బిగ్బాస్ షోలో వార్ వన్సైడ్ అయిందంటున్న రాహుల్
Bigg Boss Telugu 5, Rahul Supports Sunny!: బిగ్బాస్ షో ముగింపు చేరుకుంటోంది. ఎవరు విన్నర్ అవుతారు? ఎవరు రన్నర్ అవుతారు? అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ షోపై స్పందించని సెలబ్రిటీలు కూడా ఇప్పుడిప్పుడే తమ అభిమాన కంటెస్టెంట్లకు మద్దతు తెలుపుతున్నారు. బిగ్బాస్ షో తర్వాత కనిపించకుండా పోయిన తమన్నా సింహాద్రి తాజాగా ప్రియాంక సింగ్కు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. ప్రియ హౌస్లో ఉన్నంతవరకు ఆమెకు మద్దతు తెలిపిన అఖిల్ సార్థక్ ఇప్పుడు శ్రీరామచంద్రకు అండగా నిలిచాడు. షో చూసి ఎంజాయ్ చేస్తున్నా, కానీ ఎవరికీ సపోర్ట్ చేయనన్న బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు మాట మార్చాడు. సన్నీకి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. సన్నీ గేమ్కు ఫిదా అయినట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వార్ వన్సైడ్ అయిందంటూ హార్ట్ సింబల్ షేర్ చేశాడు. సగటు ప్రేక్షకుడిగా నా అభిప్రాయాన్ని సోషల్ ప్లాట్ఫామ్లో షేర్ చేశాను. నన్ను ఫాలో అయ్యేవారిలో ఏ ఒక్కరిని కూడా నేను ఇన్ఫ్లూయెన్స్ చేయడం లేదు. మీకు నచ్చిన కంటెస్టెంట్కు సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తాను అని చెప్పుకొచ్చాడు. -
బిగ్బాస్ షోలో ఎవరికి సపోర్ట్ చేస్తానంటే?: రాహుల్ సిప్లిగంజ్
Bigg Boss Telugu 5, Rahul Sipligunj: బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్పై గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో అందరూ ఎవరి సత్తా వారు చూపిస్తున్నారన్నాడు. హౌస్లో మనుషులు తక్కువయ్యేకొద్దీ ఎవరు బెస్ట్ అని చెప్పడం కష్టమన్నాడు. తను షో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానని, కానీ ఎవరికీ సపోర్ట్ చేయడం లేదన్నాడు. బిగ్బాస్ షో మంచిగున్నా, మంచిగ లేకపోయినా చూస్తానని చెప్పుకొచ్చాడు. పక్కింట్లో పంచాయితీ జరిగిందంటే అందరికీ ఆసక్తే అని, ఆ ఆసక్తే షోను చూసేలా చేస్తుందని పేర్కొన్నాడు. గతంలో తను పాల్గొన్న మూడో సీజన్కు మంచి టీఆర్పీ వచ్చిందని, కానీ తర్వాత వచ్చిన సీజన్లు ఎప్పటికప్పుడు టీఆర్పీని పెంచుకుంటూ పోతున్నాయన్నాడు. కాగా ప్రస్తుతం బిగ్బాస్ షోలో తొమ్మిది మంది మిగిలారు. వీరిలో ఒకరు నేడు ఎలిమినేట్ అవనున్నారు. అయితే బిగ్బాస్ను వీడేది యానీ మాస్టర్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
దుమ్మురేపుతున్న రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చాస్ కా గణేశ్’ పాట
సాక్షి, వెబ్డెస్క్: వినాయక చవితి సందర్భంగా పలు సంస్థలు, గాయకులు కొత్త పాటలు విడుదల చేశారు. తాజాగా ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత లక్ష్మణ్ రాసిన పాటకు ప్రముఖ గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్ విడుదలైంది. మధుప్రియ కూడా ఓ పాట రూపొందించి విడుదల చేసింది. ఇక తాజాగా ‘బిగ్ బాస్ 3’ విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఓ జబర్దస్త్ పాటతో వచ్చాడు. వేంగి సుధాకర్ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్ కా గణేశ్’ పాటకు రాహుల్ దుమ్ములేపేలా పాడాడు. నిఖిల్, హరిణ్య రెడ్డి కోటంరెడ్డి సమర్పించిన ఆ పాట గణపతి మండపాల్లో మార్మోగుతోంది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అయితే ఈ పాటలో రాహుల్కు బిగ్బాస్లో దోస్తీ అయిన అలీ రెజా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి ధూమ్ధామ్గా డ్యాన్స్ చేశారు. శిరీశ్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్ విడుదల చేసిన ‘గల్లీకా గణేశ్’ పాట మాదిరి ఈ పాట కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. -
జాన్వీ వయ్యారాలు, రాహుల్ తీన్మార్ స్టెప్పులు
♦ వైట్ డ్రెస్లో ఏంజెల్లా మెరిసిపోతున్న కియారా అద్వానీ ♦ అద్దం ముందు జాన్వీ కపూర్ వయ్యారాలు ♦ బోనాల జాతరలో రాహుల్ సిప్లిగంజ్ తీన్మార్ స్టెప్పులు ♦ ఎక్స్, ప్రజెంట్స్ను పరిచయం చేసిర యాంకర్ రష్మీ ♦ టామీగాడి బర్త్డే అంటూ స్టెప్పులేసిన దీప్తి సునయన ♦ బర్త్డే వీడియోను షేర్ చేసిన మెహబూబ్ View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
వైరల్: ట్రయాంగిల్ లవ్స్టోరీపై క్లారిటీ ఇచ్చిన అషూ..
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి ఆ తర్వాత బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఇక అదే షోతో పొల్గొన్న రాహుల్ సిప్లిగంజ్తో బిగ్బాస్ అనంతరం ప్రేమలో పడ్డట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట పునర్నవితో లవ్ ఎఫైర్ నడిపిన రాహుల్ షో అనంతరం అషూకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని పార్టీలకు వెళ్లడం, ఆ ఫోటోలను షేర్ చేయడంతో వీరి మధ్యా ఏదో ఉందనే గాసిప్ మొదలైంది. దీనికి తోడు అషూను ఎత్తుకొని ఫోటోకు ఫోజివ్వడం, ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పోస్టులకు ప్రేమ సందేశాలు పంపుకోవడం, ఆ వెంటనే రాహుల్ లవ్ అనౌన్స్మెంట్ అంటూ అషూతో ఫోటో షేర్ చేయడం వంటివన్నీ రూమర్స్కు మరింత బలం చేకూర్చాయి. దీంతో వీరిదరూ ప్రేమ మైకంలో మునిగిపోయారని కొందరు నెటిజన్లు పబ్లిక్గానే కామెంట్స్ చేశారు. అయితే ఇటీవలె ఓ షోలో పాల్గొన్న అషూ ఎక్స్ప్రెస్ హరి అనే కమెడియన్తో క్లోజ్గా ఉండటంతో ఇది ట్రయాంగిల్ లవ్ అవుతుందేమోన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అటు హరి సైతం అషూ కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నాడు. దీంతో రాహుల్-అషూ మధ్యలో హరి అంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్లో అభిమానులతో ముచ్చటించిన అషూకు ఇదే ప్రశ్న ఎదురైంది. హరి-రాహుల్లలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలంటూ ఫ్యాన్స్ కోరారు. దీంతో 'కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా అని అడిగితే ఏం చెప్పాలంటూ' అషూ ఫన్నీగా బదులిచ్చింది . అంతేకాకుండా ఈ ఇద్దరిలో ఒకరిని తాను ఇష్టపడుతుంటే, మరొకరు తనని ఇష్టపడుతున్నారంటూ చిన్న హింట్ కూడా ఇచ్చేసింది. దీంతో మొత్తానికి ఈ లవ్కహానీ ట్రయాంగిల్ స్టోరీ అని అర్థమయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్ప్రెస్ హరి తన పేరుపై వేసుకున్న టాటూ గురించి స్పందిస్తూ..అది ఒకషో కోసమని, షోలో చాలా జరుగుతుంటాయని చెప్పింది. దీంతో ఆ టాటూ ఫేక్ అని తేలిపోయింది. -
వైరల్ : అషూ పేరు పచ్చబొట్టు.. చెంప చెళ్లుమనిపించిన బ్యూటి
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే. ఇక డబ్ స్మాష్తో ఫేమస్ అయిన ఆమె బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నిత్యం ఫొటోషూట్లతో, ఫన్నీ వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే అషూ ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. బిగ్బాస్ సీజన్-3లో తనతో పాటు పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్తో అషూ లవ్ ట్రాక్ నడిపింస్తుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యే రాహుల్.. సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అంటూ అషూను హత్తుకున్న ఫొటోను షేర్ చేసి దానికి లవ్ సింబల్ యాడ్ చేసి రూమర్స్కి మరింత బలం చేకూర్చాడు. అయితే తాజాగా కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి-అషూ మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అషూ కోసం హరి కూడా బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి అషూపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. తన గుండెలపై అషూ పేరును పచ్చబొట్టు వేసుకున్నానని, ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 'నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే..ఎప్పటికీ నువ్వు నా గుండెలపై నిలిచిపోయేంత' అంటూ హరి తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాడు. దీంతో ఇది నిజమైన పచ్చబొట్టా? లేదా స్కిట్ కోసం చేశావా అని అడగ్గా..నిజంగానే పచ్చబొట్టు వేయించుకున్నానని హరి చెప్పాడు. దీంతో ఎందుకిలా చేశావ్ అంటూ అషూ..హరి చెంప పగలకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాహుల్-అషూ మధ్యలోకి హరి ఎంటర్ అయ్యాడు అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. టీఆర్పీ రేటింగుల కోసమే ఈ డ్రామాలంటూ మరొకొందరు కామెంట్ చేస్తున్నారు. -
Trishanku: హీరోగా రకుల్ సోదరుడు.. ఫస్ట్ సాంగ్ విడుదల
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా నటిస్తోన్న చిత్రం `త్రిశంకు`. ప్రాచి తెహ్లాన్ , రష్మీ గౌతమ్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, మహేష్ ఆచంట, నవీన రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ కృష్ణ గొర్లె దర్శకత్వంలో గణేశ్ క్రియేషన్స్, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హరి అయినీడి కో ప్రొడ్యూసర్. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ని స్టార్ హీరో రానా దగ్గబాటి విడుదల చేశాడు. ‘ఏడు రంగుల ఓ ఇంద్రధనస్సులా’ అంటూ సాగే ఈ పాటకి భాష్యశ్రీ లిరిక్స్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. సునీల్ కశ్యప్ చక్కటి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి పాత్ర ఎంతో చక్కగా రూపుదిద్దుకుంది. అడగ్గానే ఈ చిత్రంలోని పాటను విడుదల చేయటానికి ఒప్పుకున్న హీరో దగ్గుబాటి రానా గారికి ధన్యవాదాలు అని అన్నారు. నిర్మాతలు లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీ కృష్ణ చెప్పిన పాయింట్ ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. చిత్రం ఎంతో బాగా వచ్చింది. మా చిత్రంలోని తొలి పాటను విడుదల చేసిన రానా గారికి కృతజ్ఞతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తాం అన్నారు. -
హల్చల్ : సెలబ్రేషన్స్లో శిల్పా.. సెట్స్లో సన్నీలియోన్
♦ ఆ మూడ్ శాశ్వతం అంటోన్న జాన్వీ ♦ బర్త్డే సెలబ్రేషన్స్లో శిల్పా శెట్టి ♦ దానిపైనే నమ్మకం ఉంచుతానంటున్న సోనమ్ ♦ ఫోటో షూట్లతో షెహ్నాజ్ ♦ సెట్లో ఎలా ఉంటుందో చూపించేసిన సన్నీ ♦ నో క్యాప్షన్ అంటోన్న రాహుల్ సిప్లిగంజ్ ♦ బాడీతో పాజిటివ్గా ఉండాలంటోన్న సమీరా రెడ్డి ♦ బేబీ పింక్లో అందంగా ముస్తాబైన మెహ్రీన్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by manasa varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) View this post on Instagram A post shared by Nititaybawa (@nititaylor) View this post on Instagram A post shared by Ananya Nagalla Fans (@ananyanagalla.official) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) -
Rahul Sipligunj: సర్ప్రైజ్ లవ్ అనౌన్స్మెంట్
ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ప్రేమలోకంలో మునిగితేలుతున్నాడు. బిగ్బాస్లో కలిసిన నటితో రాహుల్ సిప్లిగంజ్ లవ్లో పడ్డాడు. ఈ విషయాన్ని ‘సర్ప్రైజ్ అనౌన్స్మెంట్’ అంటూ లవ్ సింబల్ పెట్టి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అతడు ప్రేమిస్తున్నది ఎవరినో కాదు బిగ్బాస్ 3 కంటెస్టెంట్ అషూ రెడ్డినే. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన బిగ్బాస్ 3 షోలో రాహుల్, అషూ కంటెస్టెంట్లు. అయితే అదే షోలోని పునర్నవి భూపాలంతో రాహుల్ ప్రేమలో పడ్డాడని.. దానికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొట్టాయి. పైగా షో తర్వాత కూడా వారిద్దరూ కలిసి చాలా చోట్ల కనిపించడంతో అది నిజమేనని అందరూ నమ్మారు. కానీ అందరి ఊహలకు భిన్నంగా రాహుల్ అషూ రెడ్డితో ప్రేమలో పడ్డానంటున్నాడు. అయితే ఇది ప్రేమా? ప్రమోషనా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అషూ రెడ్డి మోడల్, నటి. డబ్స్మాష్తో జూనియర్ సమంతగా గుర్తింపు రావడంతో ఆమెకు బిగ్బాస్ షోలో అవకాశం వచ్చింది. అనంతరం చల్ మోహన్రంగ సినిమాలో ఓ పాత్రలో నటించింది. అమెరికాలోని డల్లాస్లో పుట్టిన ఈ భామ బిగ్బాస్ అనంతరం పలు షోలతో పాటు యూట్యూబ్ ఛానల్తో బిజీగా ఉంది. ఇక రాహుల్ విషయానికొస్తే తెలుగు బిగ్బాస్-3 విజేతగా నిలిచి ఎంతోమంది ఆదరాభిమానాలు పొందాడు. ఈ షో ద్వారా రాహుల్ కెరీర్ ఒక్కసారిగా టర్నయ్యింది. అంతకుముందు సొంత ఆల్బమ్స్ చేసుకుంటూ యూట్యూబ్లో హల్చల్ చేసిన ఈ సింగర్ తర్వాత సినిమా పాటలు పాడుతూ ఫుల్ బిజీగా మారాడు. ఇటీవల వస్త్ర వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. అయితే అషురెడ్డి, రాహుల్ మధ్య బిగ్బాస్ షోలోనే ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోనున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అందుకే సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అంటూ రాహుల్ పోస్టు చేశాడని అభిప్రాయపడుతున్నారు. రాహుల్ హీరోగా ‘చిచా’ సినిమా కూడా చేస్తున్నాడు. -
ఏడుపొస్తోంది రాహుల్.. నువ్వు ఎప్పటికీ స్పెషల్: అషూ
బిగ్బాస్ చాలామందికి లైఫ్ ఇస్తుందంటారు. కానీ కొందరికి మాత్రం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కేవలం షోలో కనిపించినప్పుడు మాత్రమే పాపులారిటీని తెచ్చిపెడుతుందే తప్ప తర్వాత అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే టాలెంట్ ఉన్న చాలామందిని జనాలకు మరింత దగ్గర చేస్తుంది. అలా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్బాస్ మూడో సీజన్లో అడుగు పెట్టి టైటిల్ విజేతగా నిలిచాడు. కానీ హౌస్లో 'ఉయ్యాల జంపాల' ఫేమ్ పునర్నవి భూపాలంతో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ షో పూర్తయ్యాక పరిస్థితి తలకిందులైంది. నెమ్మదిగా వీరి మధ్య దూరం పెరిగింది. అనూహ్యంగా రాహుల్.. జూనియర్ సామ్ అషూరెడ్డికి క్లోజ్ అయ్యాడు. కలిసి పార్టీలు చేసుకోవడం, ఒకరి కోసం ఇంకొకరు పోస్టులు పెట్టడం చూసి వీళ్లు ప్రేమలో ఉన్నారా? ఏంటి? అని అభిమానులు తలలు గోక్కోవడం మొదలు పెట్టారు. ఈ ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ అషూను ఎత్తుకున్న రాహుల్ ఫొటో వైరల్ కావడంతో వీరి రిలేషన్ ఏంటనేది హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. అషూ రెడ్డి తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు. ఆమె చూపించే కేరింగ్ ఇష్టమని పేర్కొన్నాడు. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని స్పష్టం చేశాడు. ఈ మధ్య ఓ సారి డబ్బులు అవసరమై అషూను రూ.10 వేలు అడిగానని, ఆమె క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పంపించిందని చెప్పాడు. కానీ వేరే వాళ్ల దగ్గర ఇలా నిర్మొహమాటంగా అడగలేనని పేర్కొన్నాడు. ఇతడి ఇంటర్వ్యూ చూసిన అషూ ఎమోషనల్ అయింది. థాంక్యూ రాహుల్.. నాకు ఏడుపొస్తోంది.. నువ్వు ఎప్పటికీ ఎంతో స్పెషల్.. అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రాసుకొచ్చింది. చదవండి: తొక్కేశారు, రాహుల్ కాలికి రక్తస్రావం -
రాహుల్ సిప్లిగంజ్ పాడిన రాజా హే రాజా..
మిత్రాశర్మ హీరోయిన్గా నటిస్తూ నిర్మించిన చిత్రం 'బాయ్స్'. గీతానంద్ హీరోగా నటించాడు. ఈ సినిమాలోని రాజా హే రాజా అంటూ సాగే ఓ యూత్ఫుల్ కాలేజీ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను శ్రీమణి రచించగా, బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. స్మరన్ సంగీతం అందించాడు. మిత్రా శర్మ మాట్లాడుతూ.. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. రాహుల్ సిప్లిగంజ్కు ఉన్న క్రేజ్, ట్యూన్లో ఉన్న కిక్ 'రాజా.. హే రాజా..' పాట పెద్ద హిట్టవ్వడానికి కారణమయ్యాయి. మా దర్శకుడు దయా చాలా చక్కగా చిత్రీకరించాడు. సినిమాలోని పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. మా చిత్రం సహనిర్మాత పడవల బాలచందర్ ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. సినిమా విడుదల తేదీ, ఇతర వివరాలను త్వరలో చెబుతాం అని చెప్పారు. చదవండి: మార్చి 26 న ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ విడుదల -
మార్చి 26 న ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ విడుదల
‘ఎంతో కష్టపడాలి అప్పుడే విజయం వరిస్తుందని చిరంజీవి చెప్పారు. అది చేయడానికి ఎంతో కష్టపడతాను. సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను.. ఇప్పుడు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ద్వారా హీరోగా వస్తున్నాను. నన్ను నమ్మి ఇంత మనీ ఇన్వెస్ట్ చేసిన నిర్మాత కి ప్రత్యేక కృతజ్ఞతలు’అన్నారు హీరో పవన్ తేజ్. పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజేష్ నాయుడు నిర్మాతగా మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్కి, సాంగ్స్కి, టీజర్కి మంచి స్పందన రాగా సినిమా పై మంచి అంచనాలు పెరిగాయి. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లిరిసిస్ట్ చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు.. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.. అంబర్ పేట్ శంకరన్న మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కృతజ్ఞతలు.. నా మిత్రుడు ఆహ్వానం మేరకు ఈ ఫంక్షన్ కి వచ్చాను..ఈ సినిమాకి, రాజేష్ నాయుడు కి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూసి పెద్ద వాళ్ళు మెచ్చుకున్నారు. పూరి జగన్నాధ్ కి ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.. సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల మాట్లాడుతూ.. ఈ సినిమా ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. చంద్రబోస్ గారితో కలిసి పనిచేయడం ఎంతో గొప్పగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అభిరామ్ గారికి థాంక్స్.. నిర్మాత రాజెశ్నాయుడు గారికి స్పెషల్ థాంక్స్.. పాటలు అందరికి నచ్చాయని అనుకుంటున్నాను.. ఈ పాటలు ఇంత బాగా రావటానికి కారణం సినిమా విజువల్స్.. విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాని అందరు చూసి ఆశీర్వదించండి.. అన్నారు. సింగర్ నోయెల్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు ధన్యవాదాలు.. చిన్న సినిమాలకు గుర్తింపు ఉంటుందంటే అందుకు కారణం మీడియా.. మీ సపోర్ట్ కు చాల థాంక్స్.. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులకు స్పెషల్ థాంక్స్.. ఈ సినిమా లో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇద్దరు మంచి ఫ్యాషన్ తో సినిమా చేశారు. హీరో పవన్ తేజ్ కొణిదెల డెడికేషన్ చాలా బాగుంది. హీరోయిన్ ఎంతో ఫ్యాషన్ తో ఇంతదూరం వచ్చింది. ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.. అభిరామ్ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్.. అందరు ఈ సినిమా ని చూసి పెద్ద హిట్ చేయాలి అని కోరుకున్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి..మాలాంటి వాళ్ళను ప్రోత్సహించండి. మాకు ఇది ఎంకరేజ్ లాగా ఉంటుంది. ఈ సినిమా టీం కి అల్ ది బెస్ట్.. పాటలు బాగున్నాయి.. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. నన్ను ఈ ఫంక్షన్ కి ఆహ్వానించినా అంబర్ పేట్ శంకర్ అన్నకి కృతజ్ఞతలు.. అన్నారు.. నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు.. నేను సినిమా నేపథ్యం కలిగిన వాడిని కాదు.. కానీ పవన్ తేజ్ కొణిదెల ఓ డైరెక్టర్ ని తీసుకొచ్చి చెప్పిన కథ ఎంతో ఆకట్టుకుంది. అభిరామ్ పై నమ్మకం అప్పుడే వచ్చింది. ఇప్పుడు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. లాక్ డౌన్ లో కష్ట సమయంలో అందరు నన్ను సపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బోరబండ సత్యమన్న కి, అంబర్ పేట్ శంకరన్న కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు... దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. స్టేజి మీద ఉన్న ముఖ్య అతిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా కోసం చాల కష్టపడ్డాను.. అందరు మంచి సపోర్ట్ ఇచ్చారు.. మెగా ఫ్యామిలీ లో ఓ హీరో మంచి సబ్జెక్టు కోసం చూస్తున్నారు అని విన్నాను.. వెళ్లి కథ చెప్పాను.. ఆయనకు కథ విపరీతంగా నచ్చేసింది. వెంటనే ప్రొడ్యూసర్ ని కలిస్తే సినిమా ఓకే అయ్యింది.అయన ఇప్పటికీ స్క్రిప్ట్ కూడా వినలేదు. నన్ను నమ్మిన ఆయనకు కృతజ్ఞతలు.. ఈ సినిమా టైటిల్ కూడా అయన ఇచ్చిందే.. ఈ సినిమా కి పనిచేసిన అందరికి థాంక్స్.. అన్నారు. ముఖ్యంగా మాటలరచయిత సయ్యద్ గారికి, డీఓపీ గారికి థాంక్స్.. మల్లేష్ గారి ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి..మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారితో వర్క్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా కి ఇంత కష్టపడ్డా ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు.. నటీనటులు అందరు మంచి సపోర్ట్ చేశారు.. పవన్ తేజ్ కొణిదెల గారితో ఎన్ని సినిమాలు చేసినా చేయాలనిపిస్తుంది. మేఘన గారిని చూడగానే హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయాను. మార్చి 26 న సినిమా రిలీజ్ అవుతుంది.. అందరు థియేటర్లలో ఈ సినిమా ను చూడండి..అన్నారు. గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం శంకరన్న.. అయన ద్వారా నిర్మాత రాజేష్ గారు నన్ను ఆహ్వానించారు. వేరే వాళ్ళు పాటలు రాసిన సినిమా కి నేను ముఖ్య అతిధిగా రావడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. రాహుల్ , నోయెల్ లు మంచి మిత్రులు.. ఈ ఇద్దరు పైకి రావాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రంలోని పాటలు అందరికి నచ్చాలి. ప్రజాదరణ పొందాలి. మంచి ఛాన్స్ లు కార్తీక్ గారికి రావాలని కోరుకుంటున్నాను. దర్శకుడుకి మంచి సక్సెస్ రావాలి. ఈ చిత్రంలో నటించిన అందరికి, సాంకేతిక నిపుణులు అందరికి ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటున్నాను అన్నారు. హీరోయిన్ మేఘన మాట్లాడుతూ.. ఇక్కడకి వచ్చిన మెగా అభిమానులకు అందరికి స్వాగతం.. ముఖ్య అతిధులకు ప్రత్యేక ధన్యవాదాలు.. నా ఫ్యాషన్ ని సపోర్ట్ చేసిన ఇంత దూరం వచ్చేలా చేసిన నా తల్లిదండ్రులకు థాంక్స్.. నాకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అభిరామ్ గారికి, నిర్మాత రాజేష్ నాయుడు గారికి స్పెషల్ థాంక్స్.. నా ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్ గా ఉంది. ఈ ఈవెంట్ కి వచ్చి మా సినిమా ని ఆశీర్వదించడానికి వచ్చిన నా మిత్రులకి థాంక్స్.. పవన్ తేజ్ కొణిదెల గారితో నటించడం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చింది. అన్నారు. -
రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చా’పై హరీశ్రావు కామెంట్
బిగ్బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ షో తర్వాత వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇటు సింగర్, అటు నటుడిగా రాహుల్ ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రాహుల్ కృష్ణవంశీ 'రంగమార్తాండ'లో నటిస్తున్నాడు. అలాగే సోలో హీరోగా కూడా చేయబోతున్నాడు. పాటలు, నటనతో పాటు వ్యాపారంపై కూడా రాహుల్ సిప్లిగంజ్ దృష్టి పెట్టాడు. ఊకో కాక అనే బ్రాండ్ పేరుతో వ్యాపారాన్ని మొదలెట్టాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఊకో కాక బ్రాంచ్లను ప్రారంభిస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో తన కొత్త బ్రాంచ్ను ప్రారంభించారు రాహుల్. సిద్దిపేట ఊకో కాక మెన్స్ వేర్ బ్రాంచ్ను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా తాను హీరోగా నటించబోతున్న ‘చిచ్చా’మూవీ పోస్టర్, టైటిల్ సాంగ్ని మంత్రి హరీశ్రావు లాంచ్ చేశారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ‘సినిమా టైటిల్ బాగుంది. చిచ్చా తెలంగాణ బ్రాండ్ను ప్రమోట్ చేసేలా ఉంది. రాహుల్ మన తెలంగాణ బిడ్డ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మొదటి సినిమాకు ఎలాంటి సాయం కావాలన్నా కూడా నేను చేస్తాను. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్కు ఎదగాలి. బిగ్ బాస్ షోను ఎలా హిట్ చేశాడో.. సినిమాను కూడా అలాగే హిట్ చేయాలి’ అని కోరుకున్నారు. ఇక చిచ్చా సినిమా సాంగ్ విషయానికొస్తే.. బచ్చా, లుచ్చా అనే పక్కా తెలంగాణ పదాలతో మాస్ ట్యూన్గా సాగే పాట ఇది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను సంగీత దర్శకుడైన వేంగి రాసి కంపోజ్ చేశారు. ఆర్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్పై రాబోతోన్న ఈ మూవీని మల్లిక్ కందుకూరి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలన్నీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. View this post on Instagram A post shared by rahul_sipligunj_fan (@rahul_sipligunj_fan) -
తొక్కేశారు, రాహుల్ కాలికి రక్తస్రావం
బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అందరి నోళ్లలో నానేలా తన స్టోర్కు ఊకోకాకా అని నామకరణం చేశాడు. హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో ఇప్పటికే ఈ స్టోర్లను లాంఛనంగా ప్రారంభించగా ఆదివారం సాయంత్రం వరంగల్లోని హన్మకొండలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రాహుల్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో వారిని ఆపడం అక్కడున్నవాళ్లకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో రాహుల్ తనను ముందుకెళ్లనివ్వకుండా పైపైకి వస్తున్నవారి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు రాహుల్ చిచా ఇలా ప్రవర్తించాడేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే అతడి తీరును తప్పుబట్టారు. సెలబ్రిటీ అయ్యావని పొగరు చూపిస్తున్నావా? అంటూ కొందరు విమర్శలు చేశారు. దీంతో రాహుల్ తన కోపం వెనక ఉన్న బాధను బయట పెట్టాడు. "పొద్దున్నే నా కుడి కాలి చిటికెన వేలుకు ఆరు కుట్లు పడ్డాయి. అయినా ఓ 20 మంది నా కాలిని తొక్కేశారు. ఆ కుట్ల నుంచి రక్తం కారిపోతుంది. దీంతో ఎక్కడ కుట్లు ఊడిపోతాయో అని భయపడ్డాను. అంతే, కానీ మీ అందరికీ నా కోపం మాత్రమే కనబడుతుంది. ఏదేమైనా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఓరుగల్లు జనాల వల్ల స్టోర్ వైభవంగా ప్రారంభించాం" అని తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) చదవండి: ఆమెను అమాంతం ఎత్తుకున్న రాహుల్! 'ప్యాన్ ఇండియా’ను టార్గెట్ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్ -
రాహుల్ సిప్లిగంజ్ ‘లడిలడి’ సాంగ్.. వైరల్
రోహిత్ నందన్, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నో ఐడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకం ‘లడిలడి’ అనే పాట రూపొందింది. శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించగా, ‘బిగ్ బాస్ 3’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటకు రఘు మాస్టర్ డ్యాన్స్ సమకూర్చారు. ఈ పాటని ఇటీవల విడుదల చేశారు. రోహిత్ నందన్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుని డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకున్నాను. లాక్ డౌన్ సమయంలో నా స్నేహితుడు శ్రీచరణ్ పాకాలతో కలిసి ఈ ‘లడిలడి’ అనే పాట చేయాలనుకున్నాను. ఈ పాట ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆమె ఈ పాటలో డ్యాన్స్ చేయడమే కాదు.. పాడటం విశేషం. తొలిసారి నేను చేసిన ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం, యూట్యూబ్లో మిలియన్కిపైగా వ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను త్వరలోనే హీరోగా ఓ ప్రముఖ దర్శకుడితో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అన్నారు. -
ఆమెను అమాంతం ఎత్తుకున్న రాహుల్!
బిగ్బాస్ రియాలిటీ షో తర్వాత దశ తిరిగిపోయినవాళ్ల లిస్టులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ముందు వరుసలో ఉంటాడు. బిగ్బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచిన ఆయనకు ఆ షో నుంచి అడుగు బయటపెట్టిన మరుక్షణమే ఎన్నో ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ క్రమంలో రంగమార్తాండ చిత్రంలో నటించే అవకాశమూ రావడంతో సింగర్ రాహుల్ కాస్త యాక్టర్ రాహుల్గా పరిణామం చెందాడు. ఈమధ్యే బిజినెస్మెన్గానూ అవతరించాడు. తెలంగాణ యాసలో పాటలు పాడుతూ ఫేమస్ అయిన రాహుల్ ఇప్పుడు అదే యాసలోని పేరుతో కొత్త బిజినెస్ ప్రారంభించాడు. "ఊకో కాకా" పేరుతో బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ మధ్యే కరీంనగర్లో మొదటి షోరూమ్ను ప్రారంభించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే జోష్లో నేడు సాయంత్రం హైదరాబాద్లో కూడా స్టోర్ తెరుస్తున్నాడు. ఈ కార్యక్రమానికి బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ అషూ రెడ్డి కూడా వచ్చేస్తోంది. ఈ విషయాన్ని రాహుల్ తన అభిమానులకు సోషల్ మీడియాలో వెల్లడించారు. (చదవండి: అభిమానులకు షాకిచ్చిన పున్నూ బేబీ) "నీ బలహీనతలు తెలిసినా కూడా బలాన్ని మెచ్చుకునేవాళ్లే నిజమైన స్నేహితులు.. ఊకో కాకా స్టోర్ ప్రారంభించేందుకు విచ్చేస్తున్న అషుకు స్వాగతం. మజాక్ కాదు, కాకా ఫ్రెండ్ అంటే ఇట్లుండాలె. ఇప్పుడు నాకింకా ధైర్యం వచ్చింది" అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. అంతా బానే ఉంది కానీ ఈ పోస్టుకు అషును ఎత్తుకున్న ఫొటోను జత చేశాడు. ఇంకేముందీ, అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. 'నిజంగా స్నేహితురాలైతే అలా ఎత్తుకుంటారా? మీది ఫ్రెండ్షిప్ అంటే ఒప్పుకోము, ఏదో తేడా కొడుతోంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది..' అంటూ కొందు పబ్లిక్గానే గుసగుసలు పెడుతున్నారు. వీళ్ల వాలకం చూస్తుంటే కుచ్ కుచ్ హోతా హై అనిపిస్తోందని మరికొందరు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. 'ఎహె.. ఫ్రెండ్ను ఎత్తుకోవడం కూడా తప్పేనా? దానికే ఏదో అయిపోయినట్లు తెగ ఫీల్ అవుతారేంటి? మా రాహుల్ అన్నను ప్రశాంతంగా ఉండనివ్వరా?' అని ఆయన వీరాభిమానులు గరమవుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే తమది ఫ్రెండ్షిప్పే అన్నట్లుగా పోస్ట్ పెట్టాడు రాహుల్. చూడాలి మరి.. మున్ముందు కూడా అది స్నేహంగానే ఉంటుందా? కొత్త పుంతలు తొక్కుతుందా? అని! (చదవండి: సినిమా రివ్యూ: ఈ అల్లుడు బెదుర్స్!) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
మాస్ డ్యాన్స్తో ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాష్
మాలయాళ చిత్రం ‘ఒరు అడార్ లవ్’లో కన్ను గీటే సన్నివేశంలో నటించి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది నటి ప్రియా ప్రకాష్ వారియర్. అలా సోషల్ మీడియాల్లో సెన్సేషనల్ అయిన ప్రియా మాలయాళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ ప్రైవేటు ఆల్బమ్లో కూడా ఆడిపాడింది. లడి లడి అంటూ సాగే ఈ పాటలో ప్రియా తన మాస్ డ్యాన్స్తో ఆకట్టుకుంటోంది. కొత్త నటుడు రోహిత్ నందన్తో కలిసి ఆమె చిందులేసిన ఈ పాటకు రఘు మాస్టర్ కోరియోగ్రాఫి అందించగా.. బిగ్బాస్ 3 ఫేం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. పాకాల శ్రీచరణ్ సంగీతం సమకూర్చగా.. విస్పాప్రగడ లిరిక్స్ అందించారు. ఈ సంక్రాంతి సందర్భంగా మ్యాంగో సంస్థ వారు ఈ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో దుమ్మురేపుతోంది. మాస్ బీట్లో రాహుల్ సిప్లిగంజ్కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా ఫీమెల్ వాయిస్ను ప్రియా అందించారు. (చదవండి: సింగర్ అవతారమెత్తిన ‘కన్ను గీటు’ భామ) ఇప్పటి వరకు ఈ పాటకు ఒక మిన్యన్ వ్యూస్ రావడంతో ప్రియా ప్రకాష్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పంచుకున్నారు. ‘లడి లడి పాట ఒక మిలియన్ వ్యూస్ను అందుకుంది. ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని నేనే గ్రహించలేదు. ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్న. ఈ సందర్భంగా నా టీంకి కూడా ధన్యవాదాలు. ఇది నా ఒక్కదాని బలం కాదు, రఘు మాస్టర్ టీంతోనే సాధ్యమైంది. దానికి నేను న్యాయం చేయగలిగాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక పాట చిత్రీకరణ సమయంలో ఆమె చాలా సార్లు గాయపడినట్లు పేర్కొంది. రిహార్సల్స్లోనూ చాలా ఇబ్బంది పడ్డానని, కానీ ఈ పాటకు ఇంతమంచి రెస్పాన్స్ రావడంతో ఆ బాధ మొత్తం పోయి చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం ప్రియా తెలుగులో నితిన్ సరసన చెక్ మూవీ నటిస్తున్నారు. (చదవండి: చెక్ మాస్టర్) -
ఆ ఒక్కరికే రాహుల్ సిప్లిగంజ్సపోర్ట్!
బిగ్బాస్ నాల్గో సీజన్లో టాప్ 5 గురించే చర్చ నడుస్తోంది. ఈ వారంలో ఎవరు ఫైనల్కు వెళ్లే అవకాశానికి దూరం కానున్నారనేది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు కంటెస్టెంట్ల బలాబలాను చూపించిన బిగ్బాస్ ఈ వారం మాత్రం వారిని అన్ని రకాలుగా పరీక్షించాడు. ఇంటిసభ్యుల ఓపికకు పరీక్ష పెడుతూనే ఏకాగ్రతను అంచనా వేశాడు. వారిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ను కూడా 'అధికారం' టాస్కు ద్వారా బయటపడేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ టాస్కుల్లో ఎన్నడూ లేనంత రచ్చ చోటు చేసుకుంది. ఇంకో వారంలో షో ముగిసే సమయంలో పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. మోనాల్, అరియానా మధ్య మొదలైన ఈ గొడవ అరియానా, సోహైల్ దగ్గర అగ్గి రాజుకుంది. (చదవండి: ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే అఖిలే విన్నర్!) అగ్రిమెంట్ రాసుకున్నానా? వీళ్ల లొల్లితో అగ్నిగుండంలా మార్చిన హౌస్ను చల్లార్చడం కేవలం నాగార్జున వల్లే అవుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే గత సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఈ టామ్ అండ్ జెర్రీలను సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట అభిజిత్కు మద్దతు తెలిపినప్పటికీ తర్వాత అరియానా, సోహైల్కు ఓటేయమండంటూ యూటర్న్ తీసుకోవడంతో అభి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేశారు. దీంతో మండిపడ్డ రాహుల్ ఒక్కరికే సపోర్ట్ చేస్తానని అగ్రిమెంట్ రాసుకున్నానా? అని విరుచుకుపడ్డాడు. అభి ఎలాగో సేవ్ అవుతాడు కాబట్టే మిగతావాళ్లకు సపోర్ట్ చేస్తున్నా అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వారం జరిగిన గొడవతో రాహుల్ మళ్లీ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరికి బదులుగా సోహైల్కు ఒక్కడికే సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్టు కూడా పెట్టాడు. (చదవండి: బిగ్బాస్లోకి రామ్ గోపాల్ వర్మ.. కండీషన్స్ అప్లై) కారణం లేకుండా కోపం రాదు "బిగ్బాస్ హౌస్లో సోహైల్ నిజమైన ఎంటరైనర్. ముక్కసూటిగా మాట్లాడతాడు, శక్తిమేర కష్టపడతాడు, పాజిటివ్గా ఆలోచిస్తాడు, ముఖ్యంగా తన స్నేహితులను ఎప్పుడూ ఎంకరేజ్చేస్తుంటాడు. హౌస్లో ఎవరైనా బాధపడుతుంటే చూడలేడు, వాళ్లను సముదాయించేందుకు ప్రయత్నిస్తాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించేందుకు ఎప్పుడూ ముందుంటాడు. అతడికి షార్ట్ టెంపర్ ఉంది. కానీ ఏ కారణం లేకుండా ఊరికే కోపం రాదు, అలా అని వచ్చిన కోపాన్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించడు. ఎలాంటి ముసుగు ధరించకుండా నిజాయితీగా ఉంటాడు. మనందరిలో ఒకడిగా మెదులుతాడు" అని సోహైల్ గురించి చెప్పుకొచ్చాడు. ఇది కేవలం తన అభిప్రాయమని పేర్కొన్నాడు. షో ముగింపుకు ఇంకా కొన్ని రోజులే ఉన్నందున బాగా ఆలోచించి మీకు బెస్ట్ అనిపించిన కంటెస్టెంట్కే ఓటేయండని బిగ్బాస్ ప్రేమికులకు విజ్ఞప్తి చేశాడు. -
ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే అఖిలే విన్నర్!
బిగ్బాస్ నాల్గో సీజన్లో ఫిజికల్గా స్ట్రాంగ్ ఎవరు? అనగానే మొదట మెహబూబ్, అఖిల్ పేర్లే వినిపిస్తాయి. మెహబూబ్ ఎలాగో వెళ్లిపోయాడు కాబట్టి అఖిల్ గురించి చెప్పుకుందాం. అఖిల్.. టాస్క్ అనగానే తన శ్రమనంతా ధారపోసి ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడతాడు. అలా చాలా టాస్కులను గెలిచాడు కూడా! కానీ ఇప్పుడు గెలవాల్సినవి టాస్కులు మాత్రమే కాదు, ప్రేక్షకులు మనసులు కూడా! చిన్నవాటికి ఎమోషనల్ అయ్యే అఖిల్ గోటితో పోయేవాటిని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నాడు. చిన్నచిన్న గొడవలను కూడా భూతద్దంలో చూస్తాడు. షో ముగింపుకు చేరుకుంటున్న ఈ సమయంలో ఇలాంటివన్నీ పక్కనపెడితేనే మంచిది. మనసు, మెదడును ప్రశాంతంగా ఉంచుకుంటూ గేమ్ ఆడగలిగితే అంతలా విజయానికి చేరువవుతాడు. ముఖ్యంగా అభిజిత్తో గొడవపడకపోతే మరీ మంచిది. లేదంటే అఖిల్ తీరని నష్టాన్ని చవిచూడక తప్పదు. సాధించాలన్న కసితో బిగ్బాస్కు.. ఈ సీజన్లో కొందరు బిగ్బాస్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చారు. మరికొందరు రెండుమూడు వారాలే ఉంటామంటూ ఏదో పిక్నిక్కు వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయారు. అయితే అఖిల్ అలాంటి కోవకు చెందిన వ్యక్తి కాదు. తనేంటో నిరూపించుకుని, ఏదైనా సాధించాలన్న కసి, తపనతో బిగ్బాస్లో అడుగు పెట్టాడు. ఇకపోతే అతడు ఇతర భాషల్లోని బిగ్బాస్ సీజన్లను చూశాడని ఆమె తల్లే చెప్పింది. అందుకే కొన్నిసార్లు ఏది జరుగుతుంది? ఏది జరగదు అనేది ముందుగానే ఊహిస్తూ అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటాడు. అందుకు ఉదాహరణే సీక్రెట్ రూమ్. (చదవండి: సోహైల్, అరియానా టాప్ 2లో ఉండాలి: రాహుల్) లవ్ ట్రాక్ అటకెక్కించాడు ముందుగా అఖిల్ ప్రయాణం మొదటి నుంచి చూసినట్లైతే.. అతడు ప్రారంభంలో మోనాల్తో లవ్ట్రాక్ నడిపి లవర్బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ రానురానూ ఆమె వల్ల తన గేమ్ డిస్టర్బ్ అవుతోందని గ్రహించి మోనాల్ను పక్కనపెట్టాడు. పూర్తిగా గేమ్లో దిగాడు. ఎవరి సపోర్ట్ లేకుండానే గేమ్ ఆడాడు. అయితే ఎప్పుడైతే సీక్రెట్ రూమ్కు వెళ్లాడో అక్కడ అఖిల్ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైంది. హౌస్లో ఉన్న అందరూ వీక్, తనే స్ట్రాంగ్ అని ప్రగల్భాలు పగలడం చాలామందికి కోపం తెప్పించింది. పైగా హౌస్లోకి వెళ్లాక కూడా గొడవలు, వివాదాల్లో మునిగి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ టాస్కులు ఆడుతూ, ఎలాంటి గొడవలో దూరకుండా స్థిరంగా ఉంటున్నాడు. (చదవండి: నీ వల్ల చాలా హర్ట్ అవుతున్నా: అభి) ఫినాలేలో తొలుత అడుగు పెట్టిన రాహుల్ అయితే గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ కూడా సీక్రెట్ రూమ్లోకి వెళ్లాడు. తిరిగి హౌస్లోకి అడుగుపెట్టాక తన గేమ్ ప్లాన్నే మార్చి విజయానికి చేరువయ్యాడు. అంతే కాకుండా టికెట్ టు ఫినాలే సంపాదించి టాప్ 5లోకి మొదటగా అడుగు పెట్టాడు. ఆఖరికి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈ సీజన్లో అఖిల్ సీక్రెట్ రూమ్కి వెళ్లి వచ్చాడు. అలాగే టికెట్ టు ఫినాలే రేసులో అఖిలే గెలిచాడని సోషల్ మీడియా టముకేసి మరీ చెప్తోంది. అదే కనక నిజమైతే అఖిల్ కూడా రాహుల్ లాగే టాప్ 5కి చేరుకునే మొదటి కంటెస్టెంటుగా నిలిచిపోతాడు. సీక్రెట్ రూమ్, టికెట్ టు ఫినాలే సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఈసారి అఖిలే గెలుస్తాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి! (చదవండి: బిగ్బాస్: అఖిల్కు షాకిచ్చిన మోనాల్ తల్లి) -
ఆ ఇద్దరే టాప్ 2లో ఉండాలి: రాహుల్
ఎక్కడ చూసినా బిగ్బాస్ నాల్గో సీజన్ విజేత ఎవరనేదానిపైనే చర్చ నడుస్తోంది. టాప్ 5లో ఉండేదెవరు? టాప్ 2లో నిలిచేదెవరు? చివరగా ట్రోఫీని ముద్దాడేది ఎవరన్న విషయం జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పదహారు మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్లో కొత్తగా మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చేరడంతో మొత్తం కంటెస్టెంట్ల సంఖ్య 19కి చేరింది. పన్నెండు వారాలుముగిసేసరికి హౌస్లో ఏడుగురు మాత్రమే మిగిలారు. అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్, హారిక, సోహైల్, మోనాల్ టైటిల్ రేసులో ఉన్నారు. ఇప్పటికే నేరుగా టాప్ 5లో చోటు దక్కించుకునేందుకు టికెట్ టు ఫినాలే రేసు కూడా మొదలైంది. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే మూడు వారాల్లో ఈ సీజన్కు మంగళం పాడనున్నారు. ఈ తరుణంలో కంటెస్టెంట్ల గెలుపు కోసం అటు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగారు. (చదవండి: బిగ్బాస్: అవినాష్ కొంప ముంచిన అతి తెలివి) కొందరు సీరియల్స్ నటీనటులు అఖిల్కు మద్దతిస్తుండగా, విలక్షణ నటుడు సాయి కుమార్ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్కు ఓటేయమని పిలుపునిచ్చారు. యూట్యూబ్ స్టార్లు అంతా ఏకమై హారికనే గెలిపించమని కోరుతున్నారు. నాగబాబుతో సహా మరికొందరు సెలబ్రిటీలు అభిజిత్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితుడు నోయల్ ఎలిమినేట్ అయ్యాక అభిజిత్కు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో సైతం అభిజితే విన్నర్ అవుతాడని చెప్పుకొచ్చాడు. కానీ ఇంతలోనే ప్లేటు ఫిరాయించాడు. సోహైల్, అరియానా టాప్ 2లో ఉంటే చూడాలనుందని తెలిపాడు. దమ్ముంటే జెన్యూన్గా ఆడేవాళ్లకు సపోర్ట్ చేయండని, పనికి రానోళ్లను బయటకు తోయండంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు. మొన్నటివరకు అభిజిత్ ఫేవరెట్ అంటూ అతడే గెలుస్తాడని చెప్పాడు కదా అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో.. ఫెర్ఫామెన్స్ను బట్టి తన సపోర్ట్ ఉంటుందని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. (చదవండి: బిగ్బాస్ : అఖిల్పై రాహుల్ షాకింగ్ కామెంట్స్) -
బిగ్బాస్ : అఖిల్పై రాహుల్ షాకింగ్ కామెంట్స్
బిగ్బాస్ నాల్గో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ బిగ్ రియాల్టీ షోకు శుభం కార్డు పడటానికి మరో నాలుగు వారాలే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో టాప్ 5 లో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. హౌస్లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు రానున్న రెండు వారాల్లో ఎలిమినేట్ అయి ఐదుగురు మాత్రమే ఫైనల్కి వెళ్తారు. ఇక ఫైనల్కు వెళ్లే టాప్ 5లో అభిజిత్, సోహైల్, మోనాల్, అవినాష్, అఖిల్ ఉంటారని కొంతమంది అంచనా వేయగా.. మరికొంత మంది హారిక, అరియానా కూడా టాప్ 5లో ఉంటారని చెబుతున్నారు. (చదవండి : బిగ్బాస్ : ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్!) ఇలాంటి తరుణంలో అఖిల్పై బిగ్బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఆయన ఓ న్యూస్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ బిగ్బాస్ నాల్గో సీజన్కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేత ఎవరు? అఖిల్ ఎందుకు టాప్ 5 లో ఉండడు అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ సీజన్లో అభిజిత్, సొహైల్లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విజేత కావొచ్చు. అరియానాకి కూడా ఛాన్స్ ఉంది. అఖిల్ సీక్రెట్ రూంకి వెళ్లిన తరువాత ఒక డైలాగ్ (స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఇక్కడ పెట్టుకొని వీక్ కంటెస్టెంట్స్తో ఏం చేస్తారు)అన్నాడు. ఆ డైలాగ్ బిగ్బాస్కే కాదు నాగ్ సర్కి కూడా కోపం వచ్చింది. అందుకే బయటకు పొమ్మని.. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని అన్నారు. అలాగే అభిజిత్తో కూడా మేక ప్రోటీన్స్ తిని పులిలా బయటకి వచ్చింది.. బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అయ్యింది అని చెప్పడం కూడా కొంచెం మైనస్ అయింది’ అని చెప్పుకొచ్చారు. అయితే అఖిల్ కూడా నీలాగే చివరి వారాల్లో పుంజుకొని టైటిల్ విన్నర్ అయ్యే చాన్స్ ఉంది కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి... ఆ సమయం దాటిపోయింది అంటూ తన మన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అఖిల్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. -
హిమజ
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘జ’. జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై సైదిరెడ్డి చిట్టెపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మించారు. హిమజ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా హాజరై ‘జ’ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదల చేశారు. సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ – ‘‘జ’ అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘నేను డాక్టర్ని. దర్శకుడు సైదిరెడ్డి చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాను’’ అన్నారు ఉపేందర్. ‘‘సైదిరెడ్డి నాలుగేళ్లు కష్టపడి మంచి సబ్జెక్ట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు గోవర్థన్ రెడ్డి. ‘‘ఇందులో నాది నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర. నటిగా మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది’’ అన్నారు హిమజ. ‘‘ఈ చిత్రంలో నాలుగు డిఫరెంట్ పాటలు ఉన్నాయి’’ అన్నారు సంగీత దర్శకుడు వెంగీ. -
అభిమానులకు షాకిచ్చిన పున్నూ బేబీ
బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొన్న భామ పునర్నవి భూపాలం 'ఎట్టకేలకు ఇది జరుగుతోంది' అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తన వేలికి ఉంగరం ఉండటంతో పెళ్లి కబురు చెప్పేసిందోచ్ అంటూ రెండురోజులుగా ఆమె అభిమానులు కేరింతలు కొడుతున్నారు. కానీ ముందుగా ఊహించనట్టుగానే వారందరికీ పున్నూ పెద్ద షాకే ఇచ్చింది. అదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పకనే చెప్పింది. ఈ మేరకు తాను చేస్తున్న వెబ్ సిరీస్ పోస్టర్ను పంచుకుంది. ఉద్భవ్తో కలిసి "కమిట్ మెంటల్" వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఆహా'లో నవంబర్ 13 నుంచి ఇది ప్రసారం కానుంది. "తప్పలేక ఒప్పుకున్నాను. ఇంకా ముందుంది అసలైన క్రేజీ రైడ్. మీరు కూడా ఇందులో భాగస్వాములు కండి" అని పిలుపునిచ్చింది. (చదవండి: చికాగో సుబ్బారావుతో పున్నూ బేబీ..) కాగా బిగ్బాస్ మూడో సీజన్లో రాహుల్, పునర్నవిల లవ్ట్రాక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. అయితే బయటకు వచ్చాక మా మధ్యలో ఏమీ లేదు, ఫ్రెండ్షిప్ తప్ప అని రూమర్లకు చెక్ పెట్టారు. కొంతకాలం స్నేహితులుగానైనా కలిసి కనిపించిన ఈ జోడీ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయినా సరే రాహుల్ అభిమానులు మాత్రం ఇప్పటికీ పునర్నవిని స్పెషల్గా ట్రీట్ చేస్తారు. ఈ క్రమంలో ఆమె రెండు రోజుల క్రితం ఎంగేజ్మెంట్ జరిగిందన్న అనుమానాలను రేపుతూ చేసిన ట్వీట్తో అందరూ రాహుల్ మీద పడ్డారు. పున్నూ బేబీ.. చిచాకు అన్యాయం చేసిందని ఆక్రోశం వెల్లగక్కారు. దీనిపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. "ఎవరిదో ఎంగేజ్మెంట్ అయితే నన్నెందుకు ట్యాగ్ చేస్తుర్రురా బై, ఉన్న పోరీలతోనే సరిపోతలేదు నాకు. ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగులు నాకెందుకురా నాయనా " అంటూ దండం పెడుతున్న ఎమోజీ పెట్టాడు. (చదవండి: చివరకు.. ఇది జరుగుతుంది: పునర్నవి) Tappaleka oppokunanu. Inka mundu undi asalaina crazy ride! 😍 Join us on the crazy ride called #Commitmental very soon… Premieres November 13 on @ahavideoIN. Super excited for this one! 🔥@itsudbhav @pavansadineni @TheViralFever @TheQtiyapaGuy @uncle_sherry pic.twitter.com/T9d6yvU48V — Punarnavi (@PunarnaviBHU) October 30, 2020 -
నోయల్ తర్వాత ఆమెకే..: రాహుల్
బిగ్బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఎలాగో ఇంటిసభ్యుల్లో ఒకరు ఆదివారం బిగ్బాస్ హౌస్ నుంచి బ్యాగ్ సర్దేయనున్నారు. అయితే వారిని నేరుగా ఇంటికి పంపించకుండా హౌస్మేట్స్పై వారి అభిప్రాయాలను, అనుభవాలను పంచుకునేందుకు బిగ్బాస్ బజ్ ఉండనే ఉంది. ఈ కార్యక్రమానికి రాహుల్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే కంటెస్టెంట్లతో మాటామంతీ జరపాలంటే వారి గురించి అంతో ఇంతో తెలిసే ఉండాలి. ఇందుకోసం రాహుల్ ప్రతిరోజూ బిగ్బాస్ షోను ఫాలో అవుతున్నాడట. (చదవండి: కంటెస్టెంట్ల ఎంపిక బాగోలేదు: కౌశల్) టాప్ 5లో ఎవరుంటారో ఇప్పుడే చెప్పలేం ఈ మేరకు ఓఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. షో చూస్తున్నాను, కానీ ఎవరు టాప్ 5లో ఉంటారనేది చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ మంచివాళ్లు.. చెడ్డవాళ్లుగా, చెడ్డవాళ్లు.. మంచివాళ్లుగా మారిపోయే ఆస్కారం ఉంటుందన్నాడు. కంటెస్టెంట్లలో తనకు నోయల్ తప్ప ఎవరూ పెద్దగా పరిచయం లేదని పేర్కొన్నాడు. కాకపోతే బిగ్బాస్ ఇంట్లోకి యూట్యూబర్లను తీసుకురావడం వారికి దక్కిన గొప్ప అవకాశం అని తెలిపాడు. అందరూ ఊహించినట్టుగానే తన జిగిరీ దోస్త్ నోయల్కే సపోర్ట్ చేస్తానని తెలిపాడు. నోయల్ తర్వాత గంగవ్వపై మంచి అభిప్రాయం ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వయసులో ఆమె బిగ్బాస్ షోలో పాల్గొని యువతతోపాటు చాలామందిని ఇన్స్పైర్ చేస్తుందన్నాడు. ప్రోమోలు కూడా ఆమె మీదే ఎక్కువ వస్తున్నాయని, అటు ట్విటర్లోనూ గంగవ్వ హ్యాష్ట్యాగ్లు చాలానే ఉంటున్నాయని చెప్పుకొచ్చాడు. (చదవండి: అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా: మోనాల్) -
‘రాహుల్ లిప్లాక్ సీన్ వైరల్..’
రాహుల్ సిప్లిగంజ్ పెద్దగా పరిచం అక్కర్లేని పేరు. బిగ్బాస్ తెలుగు సీజన్ 3 తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అటు సింగర్గా, నటుడిగా, ప్రయివేట్ ఆల్బమ్స్తో చాలా బిజీ అయిపోయాడు. అంతేకాకుండా తరుచూ వార్తల్లో నిలిచే రాహుల్ తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఓ పాత వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై రాహుల్లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆరేళ్ల కిందట బిగ్బాస్-2 భామ నందినీ రాయ్తో కలిసి రాహుల్ ఓ ప్రయివేట్ ఆల్బమ్ చేశాడు. ఈ పాటలో నందినీతో రోమాన్స్ చేయడంతో పాటు లిప్ లాక్ సీన్ చేశాడు. అయితే అప్పుడెప్పుడో నందినీ రాయ్తో ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియోను రాహుల్ తన ఇన్స్టాలో తాజాగా పంచుకున్నాడు. ఈ వీడియోలో ఇద్దరు లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న సీన్ చూసుకుని నవ్వుకున్న వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన మరో బిగ్బాస్ భాం అషూ రెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'వావ్ ఇది నేను చూడలే' అని కామెంట్ చేయగా.. దీనికి రాహుల్.. 'అబ్బో ఇక నేను చచ్చిపోతా' అంటూ రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దీనికి మళ్లీ స్పందించిన అషూ.. 'మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్లో' అంటూ స్మైలీ ఎమోజీ జత చేసింది. ఇక మరికొంత మంది నెటిజన్లు పున్ను(పునర్నవి భూపాలం) ఈ వీడియో చూస్తే రాహుల్ పరిస్థితేంటో అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. View this post on Instagram With this pretty lady @nandini.rai #throwbackmemories😍 #enduke #musicvideo #myfavorite A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on Apr 14, 2020 at 5:32am PDT చదవండి: ‘వి’ డైరెక్టర్తో చైతూ చిత్రం? ‘మా కోసం గడపదాటి వచ్చావయ్యా!’ -
ప్రభుత్వ చీఫ్ విప్తో ప్రకాశ్రాజ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: బిగ్బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్తో కలిసి సినీ నటుడు ప్రకాశ్రాజ్ సోమవారం అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత పని నిమత్తం వినయ్ భాస్కర్ను కలిసేందుకు వచ్చినట్టు చెప్పారు. రాహుల్పై ఇటీవల జరిగిన దాడికి, ఈ భేటీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. రాహుల్పై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. పబ్కు వెళ్లడం తప్పుకాదని, దాడి జరగడం సరికాదని వ్యాఖ్యానించారు. గొడవలు, భిన్నాభిప్రాయాలు ఉంటే మాట్లాడుకోవాలని.. సినిమా ఇండస్ట్రీ వాళ్లను ఎవరు పడితే వాళ్లు కొడతారా అని ప్రశ్నించారు. రాహుల్ పక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. కాగా, ప్రకాశ్రాజ్తో భేటీకి సంబంధించి వినయ్ భాస్కర్ కూడా స్పందించారు. ఒక సినిమా వేడుకకు సంబంధించిన అంశంపై మాత్రమే తమ మధ్య చర్చ జరిగిందని, సినిమా షూటింగ్కు సంబంధించిన పనిమీద ప్రకాశ్రాజ్, రాహుల్ సిప్లిగంజ్ తనను కలిశారని వెల్లడించారు. రాహుల్తో పబ్లో జరిగిన గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. -
రాహుల్కు మద్దతుగా రంగంలోకి ప్రకాష్ రాజ్
సాక్షి, హైదరబాద్ : సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మద్దుతగా నిలిచారు. ఇటీవల గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో రితేశ్రెడ్డితోపాటు మరికొందరు రాహుల్పై బీర్ సీసాలతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తనకు న్యాయం చేయాల్సిందిగా రాహుల్.. సోషల్ మీడియా వేదికగా ఇదివరకే మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. పలువురు సింగర్లు కూడా రాహుల్కు న్యాయం జరగాలని సోషలో మీడియాలో పోస్ట్లు చేశారు. తాజాగా రాహుల్ను ప్రకాష్ రాజ్ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వద్దకు తీసుకువచ్చారు. సోమవారం అసెంబ్లీలో వినయ్భాస్కర్తో ప్రకాష్ రాజ్, రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పబ్లో రాహుల్పై జరిగిన దాడి గురించి ప్రకాష్ రాజ్.. వినయ్ భాస్కర్తో చర్చించినట్టుగా సమాచారం. అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్కు అన్యాయం జరిగిందన్నారు. రాహుల్ వెంట తను ఉంటానని చెప్పారు. పబ్లో జరిగిన గొడవలో రాహుల్ తప్పేమీ లేదని.. ఇందుకు సంబంధించి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని అన్నారు. రాహుల్ తప్పేమీ లేనప్పుడు కాంప్రమైజ్ ఎందుకు కావాలని ప్రశ్నించారు. తన వ్యక్తిగత పని మీద వినయ్ భాస్కర్ను కలవడానికి వచ్చానని తెలిపారు. పబ్కు వెళ్లడం తప్పు కాదని.. పబ్లిక్ ప్లేస్లో 10 మంది కలిసి ఒక్కరిని కొట్టడం దారుణం అన్నారు. సినిమా వాళ్లయితే చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రాహుల్పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 324, 34 రెడ్విత్, 354 సెక్షన్ల కింద రితేష్రెడ్డితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేసిన రాహుల్ వైరల్ : పునర్నవితో రాహుల్ సందడి -
సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేసిన రాహుల్
హైదరాబాద్ : తనకు న్యాయం చేయాలని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. తనపై పబ్లో జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రాహుల్.. తనపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని పేర్కొన్నారు. తను టీఆర్ఎస్ పార్టీ కోసమే నిలిచానని, టీఆర్ఎస్కి ఓటు వేశానని అన్నారు. కేటీఆర్పై ఎంతో నమ్మకం ఉందని.. ఆయన తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తనకు నిష్పాక్షిక న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ‘నాపై జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు చూడండి. ఆ గ్యాంగ్ నన్ను ఏవిధంగా రెచ్చగొట్టిందో, దాడి చేసిందో తెలుస్తోంది. ఈ వీడియో చూసి నిజం వైపు నిలబడండి. కేటీఆర్ సార్, నేను ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేశాను. నేను ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశాను. నేను బతికి ఉన్నంతకాలం తెలంగాణకు సేవ చేస్తాను. సార్ మేము నమ్మి నాయకులను ఎన్నుకుంటాం.. కానీ వాళ్లు ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. మన సొంత టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరులు పబ్లిక్లో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి షాక్ అయ్యాను. వాళ్ల సోదరుడికి అధికారం ఉందని దాడికి పాల్పడ్డారు. (చదవండి : ‘బిగ్బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?) సారు ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలి. నాకు న్యాయం జరగాలి. ఈ ఘటనపై మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఎదురు చూస్తున్నాను. ఈ కేసును పరిశీలించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఈ ఘటనకు సంబంధించి నా తప్పు ఉంటే నాపై కూడా చర్యలు తీసుకోండి. కానీ నేను( లేదా కామన్ మ్యాన్) ఒకవేళ ఆ తప్పు చేసి ఉండకపోతే అలాంటి పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాలి?. మీరు నాకు, మాకందరికీ నాయకుడు. నేను నిష్పాక్షిక న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాను. ఎంతో నమ్మకంతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి క్రూరమైన వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపాల్సిన సమయం వచ్చింది. మీరు కచ్చితంగా సరైన పనే చేస్తారని నేను నమ్ముతున్నాను. థాంక్యూ సార్’ అని రాహుల్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నాడు. కాగా, గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో బుధవారం రాత్రి రితేష్రెడ్డితోపాటు మరికొందరు రాహుల్పై బీరు సీసాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 324, 34 రెడ్విత్, 354 సెక్షన్ల కింద రితేష్రెడ్డితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. (చదవండి : రాహుల్ సిప్లిగంజ్పై దాడి) -
సీసీటీవీ ఫుటేజ్ షేర్ చేసిన రాహుల్
-
‘బిగ్బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?
-
‘బిగ్బాస్’పై దాడి; అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: పబ్లో జరిగిన గొడవపై బిగ్బాస్ తెలుగు సీజన్-3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై జరిగిన దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీసులను కోరాడు. గురువారం తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. పబ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీడియోలు ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి ఐపీసీ 324, 34 రెడ్ విత్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి బంధువు రితేశ్రెడ్డితో పాటు మరో ఐదుగురు దాడి చేశారని వెల్లడించారు. అసలేం జరిగింది? రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్కు వెళ్లాడు. రాహుల్ ఇద్దరు స్నేహితురాళ్ల పట్ల రితేశ్రెడ్డి, అతడి స్నేహితులు అనుచితంగా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. అభ్యంతరం తెలిపిన రాహుల్ను పక్కకు తోసేశారు. ఎందుకు కామెంట్ చేశారని ప్రశ్నించిన రాహుల్పై రితేశ్రెడ్డి, అతడి స్నేహితులు కలిసి మూకుమ్మడిగా బీరు సీసాలతో దాడి చేశారని సిప్లిగంజ్ చెబుతున్నారు. పబ్ నిర్వాహకులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగకుండా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాహుల్ ముఖానికి గాయమైంది. (రాహుల్ సిప్లిగంజ్పై దాడి) కాంప్రమైజ్ కాను: రాహుల్ తనపై దాడి చేసిన కేసులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో తన తప్పు ఏమిలేదని స్పష్టం చేశారు. తన స్నేహితురాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని వెల్లడించారు. రాజకీయ పలుబడి ఉందన్న గర్వంతో తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిప్పుడు తనతో రాజీకి ప్రయత్నించినా కాంప్రమైజ్ కానని స్పష్టం చేశారు. రితేశ్రెడ్డి గతంలోనూ దౌర్జన్యాలకు దిగిన సందర్భాలు ఉన్నాయని తెలిసిందన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, పబ్లోని వీడియో ఫుటేజీని సేకరించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
బిగ్బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్పై దాడి
-
రాహుల్ సిప్లిగంజ్పై దాడి
సాక్షి, హైదరాబాద్: గాయకుడు, బిగ్బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్పై హైదరాబాద్లోని ఓ పబ్లో దాడి జరిగింది. బీరు సీసాలతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్కు బుధవారం రాత్రి వచ్చారు. కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిసింది. రాహుల్ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. రాహుల్పై బీరు సీసాలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి బంధువులతో రాహుల్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారు రాహుల్పై దాడి చేసినట్లు సమాచారం.. గచ్చి బౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం రాహుల్ డిశ్చార్జ్ అయ్యారు. తనకు ఏమీ కాలేదని.. చిన్న గాయమే అయిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా రాహుల్ వెళ్లిపోయారు. పబ్లో గొడవపై సుమోటోగా కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. -
‘ప్రెజర్ కుక్కర్’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రెజర్ కుక్కర్ జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: సాయి రోనక్, ప్రీతి అస్రాని, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, సంగీత, నరసింహారావు, తదితరులు సంగీతం: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్ దర్శకత్వం: సుజోయ్, సుశీల్ నిర్మాతలు: సుశీల్ సుభాష్, అప్పిరెడ్డి నిడివి: 134.53 నిమిషాలు సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా దర్శకద్వయం సుజోయ్, సుశీల్ తెరకెక్కించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. చిత్ర యూనిట్ టైటిల్ను అనౌన్స్మెంట్ చేసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టి ఈ సినిమాపై పడింది. అంతేకాకుండా టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. క్రిష్, నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్లు వంటి ప్రముఖులు ఈ చిన్న సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయింది. ఇన్ని అంచనాల మధ్య ‘ప్రెజర్ కుక్కర్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్యమైన కథాంశం, డిపరెంట్ టైటిల్తో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టిందా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. కథ: సిద్దిపేటకు చెందిన నారాయణ (సీవీఎల్ నరసింహారావు) బంధువులు అందరూ అమెరికాల్లో ఉన్నతంగా స్థిరపడ్డారు. దీంతో తన కొడుకు కిశోర్ (సాయి రోనక్)ను కూడా అమెరికాను పంపించాలని ఆరాటపడతాడు. అందుకు అనుగుణంగా కిశోర్కు చిన్నప్పట్నుంచే అమెరికా గొప్పతనాలను వివరిస్తూ పెంచుతాడు. అలా ఇంజనీరింగ్ పూర్తి చేసిన కిశోర్ అమెరికా కోసం వీసా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్కు బయల్దేరతాడు. ఈ క్రమంలోనే స్వతంత్ర భావాలు కలిగిన అనిత (ప్రీతి అస్రాని)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇక వీసా ప్రయత్నాల్లో భాగంగా కిశోర్కు చందు(రాహుల్ రామకృష్ణ) సహాయం చేస్తుంటాడు. అయితే వరుసగా మూడు నాలుగు ప్రయత్నాల్లో వీసా రిజెక్ట్ కావడంతో వివిధ ప్రయత్నాలు చేస్తుంటాడు కిశోర్. ఈ సందర్భంలోనే అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. అయితే ఆ ఆపద నుంచి రావు (తనికెళ్ల భరణి) రక్షిస్తాడు. ఇంతకి రావుకు, కిశోర్ల మధ్య ఉన్న సంబంధం ఏంటి? కిశోర్ తన తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లాడా? కిశోర్, అనితల ప్రేమ చివరికి ఏమైంది? ఈ సినిమాతో దర్శకులు ఏం చెప్ప దల్చుకున్నారో తెలుసుకోవాలంటే ‘ప్రెజర్ కుక్కర్’ సినిమా చూడాల్సిందే. నటీనటులు: ఈ చిత్రంలో హీరోగా నటించిన సాయిరోనక్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. సినిమా మొత్తం అతడి చుట్టే తిరుగుతుండటంతో నటనకు మంచి స్కోప్ దొరికింది. అయితే వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేదు. హావభావాలు అంత గొప్పగా పలికించలేకపోయాడు. అయితే కొన్ని చోట్ల ఫర్వాలేదనిపించాడు. నటుడిగా ఇంకా పరిపక్వత చెందాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హైలైట్గా నిలిచింది హీరోయిన్ ప్రీతి అస్రాని. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారును కట్టిపడేస్తుంది. పలు సీన్లలో ఎంతో అనుభవమున్న నటిగా ప్రీతి కనిపిస్తుంది. దీంతో ఈ యువ హీరోయిన్కు సినీ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉండే అవకాశం ఉంది. ఇక తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన సీనియార్టీతో రావు గారి పాత్రను అవలీగా చేశాడు. ఇక రాహుల్ రామకృష్ణ, సంగీత, నరసింహారావు, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: విదేశాలకు వెళ్లి చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి.. అదొక ప్రెస్టేజ్ సింబల్ అనుకునే తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఎంతటి ఒత్తిడికి లోనవుతున్నారు, అమెరికా వెళ్లిన వాళ్లు నిజంగా సంతోషంగా ఉన్నారా? పిల్లలు అమెరికా వెళ్లాక తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అనే స్టోరీ లైన్తో ‘ప్రెజర్ కుక్కర్’ను తెరకెక్కించారు దర్శకులు సుజోయ్, సుశీల్. కాన్సెప్ట్ కొత్తగా ఉందని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమైంది. అయితే ట్రైలర్ వరకయితే కాన్సెప్ట్తో మెప్పించారు. కానీ రెండు గంటలకు పైగా సాగే సినిమాను కేవలం కాన్సెప్ట్తో నడిపించలేరు. కాన్సెప్ట్కు తగ్గట్టు అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా బలమైన పూర్తి స్క్రిప్ట్ ఉండాలి. ఈ విషయంలో దర్శకులు విఫలమయ్యారనే చెప్పాలి. సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే అసలు కథలోకి నేరుగా ప్రవేశిస్తుంది. తన కొడుకు అమెరికా ఎందుకు వెళ్లాలని తండ్రి అనుకుంటున్నాడు, దాని కోసం హీరో పడిన కష్టాలు, ఎదుర్కొన్న అడ్డంకులు, కొన్ని కామెడీ సీన్స్, హీరోయిన్ ఎంట్రీ, హీరోకు అమెరికా దారులు మూసుకపోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అయితే తొలి అర్థభాగం ముగిసే సరికి ఓకే ఫర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ వచ్చే సరికి సినిమా ఏటో వెళ్లిపోతోంది అనే భావన కలుగుతుంది. సాగదీత సీన్లు, సెంటిమెంట్ సీన్లు అంతగా వర్కౌట్ కాలేదు. అయితే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగుంటాయి. అయితే దర్శకులు తాము చెప్పాలనుకున్న పాయింట్ను బలంగా చెప్పలేకపోయారని సగటు ప్రేక్షకుడి కూడా అరథమవుతుంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. నలుగురు సంగీత దర్శకులు ఈ చిత్రానికి పనిచేసినప్పటికీ వావ్ అనిపించే సాంగ్స్ లేవు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓ మోస్తారుగా ఉంటుంది. క్లైమాక్స్లో రాహుల్ సిప్లిగంజ్ వచ్చి పాడే పాట బాగున్నా.. సినిమాకు అంతగా ఉపయోగపడలేదు. మాటల రచయిత తన కలానికి ఇంకాస్త పదును పెడితే బాగుండేది. స్క్రీన్ప్లే పర్వాలేదు. సినిమాటోగ్రఫి బాగుంది. హీరోయిన్ అందాలను, కొన్ని పాటలను తమ కెమెరాతో మ్యాజిక్ చేశారు సినిమాటోగ్రాఫర్స్. ఎడిటింగ్పై కాస్త దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: కాన్సెప్ట్ హీరోహీరోయిన్ల లవ్ సీన్స్ మైనస్ పాయింట్స్: హీరో నటన సాగదీత, బోరింగ్ సీన్లు సినిమా నిడివి - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్డెస్క్ -
ఆ మాట వినగానే నాన్న షాక్ అయ్యారు
‘‘నచ్చావులే’ సినిమా నుంచి నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘సవారి’ పాటల్ని పెద్ద హిట్ చేశారు. ముఖ్యంగా ‘నీ కన్నులు..’ పాట ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ పాటతో టిక్ టాక్లో కొన్ని లక్షల వీడియోలు చేశారు. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, రాసిన కాసర్ల శ్యామ్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర. ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం ‘వలయం’ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదల చేసిన ‘నిన్ను చూశాకే..’ పాటకి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా శేఖర్ చంద్ర చెప్పిన విశేషాలు. ►మా నాన్నగారు (హరి అనుమోలు) కెమెరామేన్. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అన్నప్పుడు ఆయన షాకయ్యారు. సినిమాటోగ్రఫీ అంటే ఫర్వాలేదు కానీ మ్యూజిక్ డైరెక్టర్గా అంటే చాలా రిస్క్ అన్నారు. కొన్ని సినిమాలు చేశాక వాటికి వచ్చిన స్పందన చూసి ఆయనకి నమ్మకం కుదిరింది. ►నేను సంగీత దర్శకుడు కావడానికి స్ఫూర్తి కీరవాణి, ఏ.ఆర్.రెహమాన్గార్లు. నేను చిత్రపరిశ్రమకి వచ్చి 14 ఏళ్లు అయింది. ఇప్పటి వరకూ దాదాపు 35 సినిమాలు చేశాను. నా కెరీర్ చాలా కూల్గా వెళ్తోంది. నా పాటలకు మంచి స్పందన వస్తోంది. వాటిని ఎక్కువగా టిక్ టాక్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగులో సాధించాల్సింది చాలా ఉంది. ఆ తర్వాత ఇతర భాషల గురించి ఆలోచిస్తా. ►నేను ఇప్పటి వరకూ చేసిన పెద్ద సినిమా కల్యాణ్ రామ్గారి ‘118’ . అందులో ఒకే ఒక్క పాట ఉంటుంది.. అది పెద్ద చాలెంజ్. ఆ సినిమాలో ఉన్న ఆ ఒక్క పాటకి న్యాయం చేయగలనా? అని భయం వేసింది. అందులోనూ అది థ్రిల్లర్ సినిమా. అయితే ‘చందమామే..’ అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. నా కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాట అని కల్యాణ్ రామ్గారు అభినందించడం మరచిపోలేను. ►పెద్ద హీరోల సినిమాలు చేయడం లేదనే భావన ఉంది. నేను చేసేవి చిన్న సినిమాలు అయినప్పటికీ.. కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు. దీంతో ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాను. పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు కదా? ప్రేమ కథా చిత్రాలు చేయడం వల్ల మంచి మెలోడీస్, థ్రిల్లర్స్ చేయడం వల్ల చక్కని నేపథ్య సంగీతం ఇచ్చే అవకాశం ఉంటుంది. -
ఆలోచింపజేసే 14
‘కుమారి 21 ఎఫ్’ నోయల్ ప్రధాన పాత్రలో రతన్, విశాఖ జంటగా నటించిన చిత్రం ‘14’. లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో రాయల్ పిక్చర్స్ పతాకంపై సుబ్బారావ్ రాయన, శివకృష్ణ నిచ్చెన మెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ‘బిగ్ బాస్’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ మోషన్ పోస్టర్ చాలా కొత్తగా, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది. ఈ పోస్టర్లాగే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. నోయల్కి ‘కుమారి 21ఎఫ్’ సినిమాకన్నా ‘14’ చిత్రంతో ఎక్కువ పేరు రావాలి’’ అన్నారు. ‘‘వైవిద్యభరితమైన కథతో రూపొందిన చిత్రమిది. కొత్త పాయింట్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు లక్ష్మి శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కామిరెడ్డి బాబురెడ్డి. -
‘అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా?’
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ1 ఎక్స్ప్రెస్’. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో మూవీ ప్రమోషన్లను ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఈ చిత్రంపై పాజిటీవ్ వైబ్ క్రియేట్ అయింది. అంతేకాకుండా హాకీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అందరిలోనూ అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా సినిమాలోని ఫస్ట్ సాంగ్ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ‘సింగిల్ కింగులం’ అంటూ సాగే ఈ పాట యూత్కు బాగా కనెక్ట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ఈ పాట వైరల్గా మారింది. ఈ పాటను హిప్ హాప్ తమిళ కంపోజ్ చేయగా.. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. సామ్రాట్ లిరిక్స్ అందించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ‘అయ్యో పాపం చూడే పాపా.. నీ సొమ్మేంపోద్దే నునా చేప అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా? మా హీరో కన్నా నువ్వేం గొప్పా.. హేయ్ సింగిల్ కింగులం.. తెల్ల తెల్లాగున్న తాజ్మహల్కి రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం మేమే సింగిల్ కింగులం’అంటూ సాగే పాట యూత్ను ముఖ్యంగా సింగిల్గా ఉన్నవారిని ఊర్రూతలూగిస్తోంది. రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. చదవండి: ‘లూసిఫర్’ బాధ్యతలు సుకుమార్కు? తల్లిదండ్రులకు సందీప్ కానుక -
బిగ్బాస్: రాహుల్ కల నెరవేరింది!
బిగ్బాస్లో అడుగుపెట్టినవాళ్లకు ఉన్న కాస్త గుర్తింపు కూడా పోతుందనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదన. కానీ బిగ్బాస్ 3 తెలుగులో మాత్రం ఇది రుజువు కాలేదు. దీనికి భిన్నంగా బిగ్బాస్ 3 చాలామందికి కలిసొచ్చింది. ఈ షోతో పలువురు పార్టిసిపెంట్లు సెలబ్రిటీలుగా మారిపోయారు. అందులో మొదటి వ్యక్తి విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. అతని గురించి చెప్పాలంటే బిగ్బాస్ ముందు, బిగ్బాస్ తర్వాత అని చెప్పాల్సి వస్తుందేమో. అంతలా అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గతంలో ప్రైవేట్ ఆల్బమ్స్తో గుర్తింపుకు ఆరాటపడ్డ రాహుల్ బిగ్బాస్ అందించిన స్టార్డమ్తో సింగర్గానూ నిలదొక్కుకుంటున్నాడు. ఇప్పటికే రాహుల్ ఆలపించిన పలు సాంగ్స్ బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఏదైతేనేం 2019 రాహుల్కు బాగానే కలిసొచ్చింది. ఇక బిగ్బాస్ హౌస్లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి బద్ధ శత్రువుల్లా అస్తమానం గొడవపడుతుండేవారు. కానీ రాహుల్ విజయాన్ని అందుకోడానికి ఇది కూడా ఒకింత ప్లస్ అయిందనేవారు లేకపోలేరు. అయితే బిగ్బాస్ ముగిసిన తర్వాత తాను కాల్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తలేదని వాపోయిన రాహుల్ తర్వాతి కాలంలో శ్రీముఖితో బాగానే కలిసిపోయాడు. ఇక నుంచి కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుందంటూ వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను పంచుకోగా అప్పట్లో ఇది వైరల్గా మారిన సంగతి తెలిసిందే. స్నేహం కన్నా ఎక్కువ అని చెప్పుకున్న పునర్నవిని బిగ్బాస్ తర్వాత కూడా వదిలిపెట్టలేదు. తనను గెలిపించిన అభిమానుల కోసం ఫ్రీ లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేయగా అందులో పునర్నవి సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచిన విషయం గుర్తుండే ఉంటుంది. బిగ్బాస్ హౌస్లో కానీ, పలు ఇంటర్వ్యూల్లో కానీ రాహుల్ ఎప్పుడూ ఓకే ఒక కోరికను చెప్తుండేవాడు. తన కుటుంబం ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటుందని ఎప్పటికైనా ఓ కొత్తిల్లు కొనుక్కోవాలన్నదే తన డ్రీమ్గా చెప్పుకొచ్చేవాడు. దానితోపాటు అధునాతన బార్బర్ షాప్ పెట్టుకోవాలన్నది కూడా తన కలగా పేర్కొన్నాడు. అయితే రాహుల్ ఈ మధ్య బెంజికారు కొన్నాడు. సెలబ్రిటీ హోదా రాగానే కలలు మారిపోయినట్టున్నాయని కొందరు అతన్ని విమర్శించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ కారు కన్నా ముందే ఫ్లాట్ కొనేశానని వెల్లడించాడు. అది పూర్తిగా సిద్ధమవడానికి ఇంకో ఏడు నెలలు పడుతుందని సమాధానమిచ్చాడు. దీంతో చిచ్చా(రాహుల్) సొంతింటి కల నెరవేరనుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సవారికి సిద్ధం పునర్నవితో కలిసి రాహుల్ డ్యాన్స్ -
సవారికి సిద్ధం
నందు, ప్రియాంక శర్మ జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవారి’. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాలను ఆకట్టుకునే లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, శేఖర్ చంద్ర సంగీతానికి మంచి స్పందన రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘నీ కన్నులు..’ లిరికల్ సాంగ్కి ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్ దక్కాయి. అదేవిధంగా ‘ఉండిపోయా..’ పాటకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్ మా సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు.. నైజాంలో వారు విడుదల చేయనున్నారు’’ అన్నారు. శ్రీకాంత్ గంట, శివ, మది తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ సందడి
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశారు. బిగ్బాస్ సీజన్ 3లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో రాహుల్, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్, పునర్నవి లవ్లో ఉన్నారనే ప్రచారం జరగగా.. వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్, పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘రంగమార్తాండ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ప్రకాశ్రాజ్.. రంగమార్తాండ చిత్ర బృందానికి ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాహుల్, పునర్నవి, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా రాహుల్.. ‘ఏమై పోయావే నీవెంటే నేనుంటే.. ’ పాటు పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, ఫొటోలను రాహుల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని పేర్కొన్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ డ్యాన్స్
-
రెట్టింపైన క్రేజ్; రాహుల్కు అవార్డు
తెలంగాణ యాసతో పక్కింటి కుర్రాడిలా అనిపించే రాహుల్ సిప్లిగంజ్కు ప్రత్యేక గౌరవం దక్కింది. పలు రంగాల్లో విశేష సేవలందించే వ్యక్తులకు సాత్విక్ ఫైర్ సర్వీసెస్ పురస్కారాలను అందిస్తుంటుంది. శుక్రవారం రెడ్హిల్స్లోని ఫెడరేషన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సంగీత రంగంలో రాహుల్కు ‘రాష్ట్రీయ గౌరవ్ అవార్డు’ను అందించింది. ఈ కార్యక్రమంలో రాహుల్ తన పాటలతో అక్కడికి విచ్చేసిన జనాలను ఉర్రూతలూగించారు. కాగా బిగ్బాస్ తర్వాత రాహుల్ క్రేజ్ రెట్టింపైంది. చేతినిండా ప్రాజెక్ట్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇక షోలో బద్ధ శత్రువుల్లా ఉన్న రాహుల్, శ్రీముఖి వారి గొడవలన్నీ షోలోనే వదిలేస్తాం అని చెప్పినప్పటికీ దాన్ని నిజం చేసిన దాఖలాలు లేవు. ఇక బిగ్బాస్ రీయూనియన్ పార్టీకి పీవీవీఆర్(పునర్నవి,వితిక, వరుణ్, రాహుల్) బ్యాచ్లో రాహుల్ మిస్సవగా అటు శ్రీముఖి కూడా రాలేదు. ఆ తర్వాత రాహుల్.. తన చిచ్చాస్ (అభిమానుల) కోసం హైదరాబాద్లో లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేశాడు. దీనికి శ్రీముఖిని పిలుద్దామని కాల్ చేస్తే కనీస స్పందన కరువైంది. ఇక వీళ్లు కలవడం కష్టమేమో అన్న సమయంలో అందరికీ షాక్నిస్తూ రాహుల్, శ్రీముఖిలు కలిసిపోయారు. అసలైన రిలేషన్షిప్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందంటూ కలిసి ఫొటోలకు ఫోజులిస్తూ డ్యాన్స్లు చేశారు. దీంతో వాళ్లిద్దరూ కలిసిపోయారోచ్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. శ్రీముఖి మాట మర్చిపోయిందా.. బిగ్బాస్ 3 తెలుగు షో కొతమందికే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. ఇందులో పాల్గొన్నవారిలో బాగా పాపులర్ కంటెస్టెంట్ శ్రీముఖి. కానీ ఈ భామ బిగ్బాస్ పాపులారిటీని షో తర్వాత సరిగా ఉపయోగించుకోలేకపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. బిగ్బాస్ పూర్తవగానే శ్రీముఖి ఎవరికీ చిక్కకుండా మాల్దీవులు వెళ్లిపోయి రిలాక్స్ అయింది. అక్కడ నుంచి రాగానే అభిమానులను కలుస్తానంటూ మాట కూడా ఇచ్చింది. తిరిగొచ్చి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ దీనిపై పెదవి విప్పట్లేదు. దీంతో శ్రీముఖిపై ఆమె అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. రాహుల్ అభిమానుల కోసం లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేస్తే కనీసం శ్రీముఖి అభిమానులను కలవడానికి ఇంకా ఏదీ ప్లాన్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్బాస్ కోసం పటాస్ను వదిలేసిన శ్రీముఖి ఆ తర్వాత కూడా అటువైపు అడుగులు వేయదల్చుకోలేదు. అయితే ఈ మధ్యే ప్రారంభమైన ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. View this post on Instagram What an honour to receive “Rashtriya Gourav Award” in association with Department of Language and culture of Telangana for my contributions to music and arts. Thanks to all the Chichaas❤️ who supported me in this journey.. Everything I am, is because of you..!! A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on Dec 7, 2019 at 8:42am PST -
అసలు రిలేషన్షిప్ మొదలైంది: శ్రీముఖి
రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్-3 రన్నరప్ శ్రీముఖి తన అభిమానులకు స్వీట్ షాకిచ్చారు. బిగ్బాస్ విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. దానికి... ‘గతం గతః.. అసలు రిలేషన్షిప్ ఇప్పుడే మొదలైంది’ అంటూ క్యాప్షన్తో పాటుగా హార్ట్ సింబల్ను జత చేశారు. అంతేకాదు రాహుల్ సైతం శ్రీముఖి షేర్ చేసిన ఫొటోను రీపోస్ట్ చేయడం విశేషం. ఈ క్రమంలో శ్రీముఖి- రాహుల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. మీరిద్దరు ఇలా కలిసిపోవడం బాగుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా... మరి పున్ను సంగతి ఏంటి రాహుల్ అంటూ మరికొందరు తమదైన శైలిలో రాహుల్కు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా బిగ్బాస్లో మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న శ్రీముఖి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫేక్ ఎలిమినేషన్కు గురై... చివరి సమయంలో పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ను దక్కించుకుని సత్తా చాటాడు. రాహుల్ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్ అనుకున్న శ్రీముఖి రన్నరప్కే పరిమితమవడాన్ని ఆమెతో సహా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో బిగ్బాస్ షో ముగింపు సందర్భంగా ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. హోస్ట్ నాగార్జున రాహుల్ను విజేతగా ప్రకటించగానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు. శ్రీముఖి మాట్లాడుతూ.. ‘ఓటమిని ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా నేను’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నానందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. షో అనంతరం ఫ్రెండ్స్తో కలిసి టూర్ వెళ్లిన శ్రీముఖి.. తన దృష్టిలో బాబా భాస్కరే నిజమైన విజేత అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాహుల్తో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో నెటిజన్లు తికమకపడుతున్నారు. View this post on Instagram #Repost @sipligunjrahul @get_repost . . . Gatham Gathaha! Asalu relationship ipudu modalaindi! @sreemukhi ❤️ A post shared by Sreemukhi (@sreemukhi) on Dec 6, 2019 at 2:55pm PST -
రాహుల్కు సినిమా చాన్స్
బంజారాహిల్స్: నిన్నామొన్నటి దాకా తన స్నేహితులతో కలిసి పాతబస్తీ వీధుల్లో తిరిగిన ఓ గల్లీబాయ్కి బిగ్స్క్రీన్పై నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తొలుత ప్లేబ్యాక్ సింగర్గా చిత్ర సీమకు పరిచయమైన ఈ కుర్రాడు బిగ్బాస్ తెలుగు సీజన్–3 విజేతగా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. దాంతో నాలుగైదు వారాల నుంచి యూట్యూబ్ స్టార్గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ రాహుల్ను వెండి తెరకు పరిచయం చేస్తూ సంచలనానికి కేంద్రబిందువయ్యారు. పక్కా లోకల్ బాయ్గా అభిమానులకు దగ్గరైన రాహుల్కు ఈ అవకాశం నిజంగా వరమనే చెప్పాలి. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అగ్రనటులు ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నిన్నటిదాకా బుల్లితెరపై సందడి చేసిన రాహుల్ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుని అశేష అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. స్వతహాగా గాయకుడైన ఇతడు ఇప్పుడు నటుడిగా మారుతుండటంతో అటు పాతబస్తీతో పాటు ఇటు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ట్విట్టర్లోనూ ఇటు ఇన్స్ట్రాగామ్లోనూ ఆయన అభిమానులు ఈ ఆరందార్రి పంచుకుంటున్నారు. రెండురోజుల నుంచి రాహుల్ సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాడు. రమ్యకృష్ణ, ప్రకాష్రాజ్ లాంటి సీనియర్ నటులతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా రాహుల్ పేర్కొన్నాడు. View this post on Instagram I feel very honoured to be a part of this amazing movie with impeccable cast,A big thanks to @krishnavamsiofficial Garu I feel very lucky and super excited for the shoot. My debut as an actor,I need all your blessings chichas! 🙏🏻 #rangamarthanda A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on Nov 30, 2019 at 9:36am PST సంతోషంగా ఉంది కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇన్స్ట్రాగామ్ వేదికగా రాహుల్ అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ అవకాశం రావడం నిజం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని, నటుడిగా వెండితెరకు పరిచయం అవ్వడం నిజంగానే ఆనందంగా ఉందని మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరాడు. తన పాటలతో యువత మనసు దోచుకున్న నేను నటుడిగా మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడంటూ పేర్కొన్నాడు. ఒక్కసారిగా స్టార్డమ్.. బిగ్బాస్–3 విజేతగా నిలిచిన రాహుల్ రాత్రికిరాత్రే స్టార్గా మారిపోయాడు. గాయకుడిగా ఉన్నప్పుడు కొంతమంది అభిమానులను కలిగివున్న ఇతడు బిగ్బాస్ తర్వాత లక్షలాదిగా వ్యూవర్స్ సొంతమయ్యారు. యూట్యూబ్లో అత్యధికంగా సెర్చ్ చేస్తున్న వారిలో రాహుల్ ఇప్పటికే అందరికంటే ముందున్నాడు. నిన్నామెన్నటిదాకా ఓ సాధారణ గల్లీబాయ్గా తిరిగిన రాహుల్ ఇప్పుడు సెలబ్రిటీగా అందరి మన్ననలు పొందాడు. గత నెల 29న పీపుల్స్ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో తన పాటలతో అదరగొట్టగా ఆ కార్యక్రమానికి వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో రాహుల్ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో రాహుల్ నటుడిగా తననుతాను చూపించుకుంటే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అంటున్నారు. ఇప్పటివరకు వెండితెరపై వెలిగిపోయే ఛాన్సు పక్కా హైదరాబాదీకి దక్కడం చాలా అరుదుగా లభించింది. ‘ఒక్క ఛాన్స్’ అంటూ అవకాశాల కోసం ఫిలింనగర్లో చెప్పులరిగేలా ఎంతోమంది తిరుగుతున్నారు. అలాంటిది రాహుల్కు మాత్రం ఈ అవకాశం వెతుక్కుంటూ రావడం గమనార్హం. -
నా అభిమానుల కోసం నిర్వహిస్తున్నా: రాహుల్
సాక్షి, గచ్చిబౌలి : తనకు ఓట్లేసి గెలిపించిన వారి కోసం ప్రత్యేకంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు బిగ్ బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. సోమవారం కొండాపూర్లోని సౌండ్ గార్డెన్ కేఫ్లో ‘లైవ్ కన్సర్ట్’ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న పీపుల్స్ ప్లాజాలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత విభావరి ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని, తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఓట్లేసిన వారు, అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. పునర్నవి, శివ జ్యోతి, శ్రీముఖితో పాటు బిగ్ బాస్–3లోని సభ్యులను ఆహ్వానించానని చెప్పారు. తాను ఓ సాధారణ కామన్ మ్యాన్ను అన్నారు. సినిమాలకు పాటలు పాడితే వచ్చే ఆదాయం సరిపోక...2013 నుంచి మ్యాజిక్ వీడియోస్ తీశానన్నారు. లక్షలు ఖర్చు చేస్తే ‘మాకీ కిరికిరి’ అనే పాటకు మొన్నమొన్న గుర్తింపు వచ్చిందన్నారు. సంగీత విభావరిలో పెద్ద స్టేజిపై టాలీవుడ్కు చెందిన ఓ సింగర్ సొంత పాటలు సోలోగా పాడబోతున్నాడని చెప్పారు. టాలెంట్ సింగింగ్తో థ్యాంక్స్ తెలియజేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు బాగా ఆదరించారని చెప్పారు. బిగ్బాస్–3లో తన వ్యక్తిత్వాన్ని పాజిటివ్గా ప్రజెంట్ చేసినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. -
గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన ‘గ్రీన్ చాలెంజ్’కు బిగ్బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు బాధ్యతగా మొక్కలు నాటాను. మీరూ కూడా నాటండి’ అంటూ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గ్రీన్ చాలెంజ్లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇటీవల మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో రాహుల్ కూడా ఉన్నారు. సుమ కనకాల చాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటినట్లుగా రాహుల్ పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: రాహుల్కు సుమ గ్రీన్ చాలెంజ్) -
మిస్ యూ రాహుల్ : పునర్నవి
బిగ్బాస్ తెలుగు 3.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎంతగానో క్రేజ్ తెచ్చిపెట్టింది. చాలామందికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక రాహుల్ చేజారిన రాములో రాములా పాట మరోసారి అతనితో పాడించాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాహుల్.. ఆర్ఎక్స్100 ఫేమ్ హీరో కార్తీకేయ నటిస్తున్న 90 ఎమ్ఎల్ చిత్రంలో ‘సింగిల్ సింగిల్’ పాడారు. దీనికి యూట్యూబ్లో మంచి ఆదరణే లభిస్తోంది. అలా బిగ్బాస్ విజేత రాహుల్ వరుస ఇంటర్య్వూలు, పాటలతో బిజీ అయిపోయాడు. కాగా మరోవైపు బిగ్బాస్ పార్టిసిపెంట్లు రీయూనియన్ పేరిట గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కలర్ఫుల్ డ్రెస్సులతో మాంచి కిక్ ఇచ్చే పార్టీ నిర్వహించుకున్నారు. ఇందులో హిమజ, మహేశ్, పునర్నవి, వరుణ్, వితిక, అలీ, అతని భార్య మసుమా హాజరయ్యారు. కేక్ కటింగ్లు, డ్యాన్సులు, ఫొటోలకు ఫోజులు.. అబ్బో చాలానే ఎంజాయ్ చేశారు. వరుస ఫొటోషూట్లు చేస్తున్న బిగ్బాస్ జంట బిగ్బాస్ పూర్తయ్యాక వరుణ్, వితికలు వరుస ఫొటో షూట్లతో అభిమానులను ఏదో విధంగా అలరిస్తూనే ఉన్నారు. బిగ్బాస్తో బాగా ఫేమస్ అయిన పునర్నవి తన తదుపరి సినిమాలపై దృష్టి సారించింది. మరోవైపు రాహుల్.. తనను గెలిపించిన అభిమానుల కోసం నగరంలో లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేయనున్నాడు. ఈ నలుగురి గ్రూప్కు బయట మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రీ యూనియన్ పార్టీలో ఒకరు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో పార్టీ ఎంజాయ్ చేసినప్పటికీ మనసులో ఉన్న వెలితిని పునర్నవి సోషల్ మీడియాలో బయటపెట్టింది. మిస్ యూ రాహుల్ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పార్టీకి చాలామందే డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బిగ్బాస్ గ్యాంగ్ మాత్రం రచ్చరచ్చ చేసింది. రాహుల్, పునర్నవి మధ్య ఏముంది? రాహుల్, పునర్నవిలను ఎన్నో వెబ్సైట్లు, టీవీ చానళ్లు మొదటగా అడిగే ప్రశ్న.. మీ మధ్య ఏముంది అని? దీనికి పునర్నవి కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వారిపై వచ్చే రూమర్స్ను కొట్టిపారేసేది. రాహుల్ మాత్రం పునర్నవి తనకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పేవాడు. పైగా అప్పట్లో వీరి పెళ్లి జరగబోతుంది అంటూ బయటకు వచ్చిన వార్తలు సంచలనాన్ని సృష్టించాయి. తాజాగా ఓ ప్రముఖ టీవీ షోకు వీరిద్దరూ కలిసే వెళ్లారంటే బయట వీళ్లకున్న క్రేజ్ ఏపాటిదో అర్థమవుతోంది. ఇక బిగ్బాస్ పూర్తయ్యాక పీవీవీఆర్ బ్యాచ్ కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. -
రాహుల్ చేజారిన రాములో రాములా సాంగ్..
హైదరాబాద్ : అల వైకుంఠపురములో మూవీ నుంచి విడుదలైన రెండో సాంగ్ రాములో రాములా..విశేషంగా అలరిస్తూ మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. అనురాగ్ కులకర్ణితో ఈ పాట పాడించే ముందు బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ను చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. రాహుల్తో ఈ పాట పాడించాలని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ప్రయత్నించారు. ఈ పాట రఫ్ ట్రాక్ను తాను పాడానని రాహుల్ సైతం చెప్పుకొచ్చారు. అంతలోనే రాహుల్ బిగ్బాస్ తెలుగు 3 సీజన్ కోసం హౌస్లో ఎంటరవడం మూడు నెలలకు పైగా అక్కడే గడపడంతో అన్ని రోజులు వేచిచూడటం సాధ్యం కాక అనురాగ్ కులకర్ణితో రాములో రాములాను పాడించేశారు. ఈ పాట యూట్యూబ్లో యువతను ఓ రేంజ్లో ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్లో ఈ పాట వీడియోను వీక్షించిన కొందరు సంగీత ప్రియులు ఈ సౌండ్ట్రాక్కు రాహుల్ పరిపూర్ణంగా న్యాయం చేసేవారని బదులిచ్చారు. ఈ పాటకు రాహుల్ గొంతు చక్కగా సరిపోయేదని కామెంట్స్ చేశారు. రాహుల్తో ఈ పాటను తిరిగి పాడించాలని, అప్పుడు మరింత పెద్ద హిట్ అవుతుందని తమన్కు వారు సలహా కూడా ఇచ్చేశారు. -
మంత్రిని కలిసిన రాహుల్ సిప్లిగంజ్
సాక్షి, సిటీబ్యూరో : అశేష ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్గా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. శనివారం మసబ్ట్యాంక్లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో మంత్రి తలసానితో రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనూహ్యరీతిలో రాహుల్ బిగ్ బాస్ టైటిల్కు సొంతం చేసుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాతబస్తీ యాస, బాషతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశేషంగా ఆకట్టుకున్న సిప్లిగంజ్కు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం తరపున పూర్తి సహయ సహకారాలు ఉంటాయని రాహుల్కి హామీ ఇచ్చారు. ఇక వంద రోజులకు పైగా ఉత్కంఠగా సాగిన బిగ్బాస్ తెలుగు సీజన్-3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నర్గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా రాహుల్ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. -
ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్
రాహుల్ సిప్లిగంజ్.. మొన్నటి దాకా సినీ నేపథ్య గాయకుడు. మరి నేడు.. బిగ్బాస్–3 విజేత.అత్యంత సాధారణ యువకుడిగా ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లోకి అడుగుపెట్టినఈ కుర్రాడు.. ప్రారంభంలో అంతంత మాత్రం ప్రదర్శన ఇచ్చినా.. రోజులు గడుస్తున్న కొద్దీ చక్కటి ప్రతిభతో పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో అంతిమ లక్ష్యాన్నిచేరుకున్నాడు. అంతేనా.. లక్షల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ట్రోఫీని అందుకుని రూ.50 లక్షల విజేతగా నిలిచాడు. పాతబస్తీ గల్లీల్లో చక్కర్లు కొట్టే ఈ కుర్రాడు ఇప్పుడు స్టారైపోయాడు. దాదాపు 105 రోజుల పాటు బిగ్బాస్ హౌస్లో ఉన్న ఇతడిపై బోలెడు ‘ప్రేమ కథలు’ పుట్టుకొచ్చినా అవన్నీ ‘ట్రాష్’ అంటూ కొట్టిపారేశాడు. రాహుల్ ‘సాక్షి’తో పంచుకున్న మరిన్ని ముచ్చట్లు బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్–3 విజేతగా నిలిచి తెలుగు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సంచలనం సృష్టించారు. 105 రోజుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ షోతో ప్రేక్షకుల మనసు దోచారు ఆయన. పక్కా లోకల్ బాయ్ విజయంతో నగర యువత ఉత్సాహానికి హద్దులే లేకుండా పోయాయి. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా రూ.50 లక్షలనగదుతో పాటు ట్రోఫీ అందుకోవడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని.. తన జీవితంలో ఇదే పెద్ద అచీవ్మెంట్ అని రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. గత జూలై 21న ప్రారంభమైన సీజన్– 3 చివరిదాకా ఎంతో ఉత్కంఠగా సాగింది. ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టిన రాహుల్ ప్రారంభంలో అంతంతమాత్రంగానే ప్రదర్శన ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక్కో వారం గడిచేకొద్దీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. అభిమానులను పెద్ద సంఖ్యలో పెంచుకుంటూ తన సన్నిహితురాలు పునర్నవితో స్నేహాన్నీ కొనసాగించారు. వీరిద్దరి ఫ్రెండ్షిప్ ఎన్నో మలుపులు తిరిగింది. ఎన్నో రూమర్లూ వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో పడ్డారని కూడా అంతా భావించారు. ఇది ఒకరకంగా రాహుల్కు కూడా పబ్లిసిటీ పరంగా కలిసొచ్చింది. 105 రోజుల పాటు బిగ్బాస్ హౌస్లో ఉండి చివరకువిజేతగా నిలిచిన పాతబస్తీ కుర్రోడు రాహుల్ బుధవారం ‘సాక్షి’తోముచ్చటించారు. తన అనుభవాలు, అనుభూతులు, పునర్నవితో స్నేహం, భవిష్యత్ ప్రణాళికలపై ఇలా మనసు విప్పి మాట్లాడారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి ఆ రోజు ఏడ్చేశా.. ‘‘పునర్నవి నాకు వెరీ స్పెషల్. మా ఇద్దరిదీ జాన్ జిగిరీ దోస్తాన్. మాటల ద్వారా ఇష్టాల ద్వారా మేమిద్దరంబాగా దగ్గరయ్యాం. మా ఇద్దరి అభిప్రాయాలు బాగాకలిశాయి. ఇద్దరం ముఖం మీదనే మాట్లాడుతూ ముక్కుసూటిగా చెబుతుండేవాళ్లం. మనలాగే ఆలోచించే వ్యక్తి మన స్నేహితులైతే ఎంత బాగుంటుందో అలాగే మేమిద్దరం ఉన్నాం. ఆమెతో ప్రేమలో ఉన్నానని వచ్చిన రూమర్లు సరైనవి కావు. మా ఇద్దరిదీ స్నేహం మాత్రమే. మా పరిచయం హౌస్లో ఉన్నప్పుడే జరిగింది. బయటికొచ్చాక కూడా ఆ స్నేహాన్ని కొనసాగిస్తాం. మాది విడదీయలేని బంధం. హౌస్లో ఆమెను అందరూ పున్ను అని పిలిచేవారు. నేను ‘నవీ’ అని ప్రేమగా పిలిచేవాణ్ని. ఆమె ఎలిమినేట్ అయిన రోజున బాగా ఏడ్చాను. రెండు మూడ్రోజుల తర్వాత ఒంటరి వాణ్నయ్యానని ఫీలింగ్ వచ్చింది.టాస్క్లతో, స్నేహితుల ముచ్చట్లతో మామూలు మనిషినయ్యా.’’ మలైపాయ.. ఇరానీ చాయ్ ఇష్టం.. పాతబస్తీలోని బిస్మిల్లా హోటల్లో మలైపాయ తినడం అంటే బాగా ఇష్టం. వారంలో నాలుగైదుసార్లు అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లి నా స్నేహితులు భాస్కర్, చందు, సొహైల్, నోయల్, జోయల్తో కలిసి మలైపాయ తింటాను. అది తింటుంటే ఆహా.. ఏమిరుచి.. అన్న ఫీల్ కలుగుతుంది. ఇక మల్లేపల్లి డైమండ్ హోటల్లో ఇరానీ చాయ్ తాగుతూ బాతాఖానీ కొట్టడం బాగా ఇష్టం. నేను ఎక్కువగా ఇరానీ హోటల్లోనే ఫ్రెండ్స్తో కలిసి చాయ్ తాగుతాను. నా కెరీర్ ఇలాప్రారంభమైంది.. యూట్యూబ్ ద్వారా గాయకుడిగా కెరీర్ ప్రారంభించాను. సంగీతం కంపోజ్ చేస్తూనే పాటలు పాడేవాడిని. 2009లో వచ్చిన జోష్ సినిమాతో గాయకుడిగా మారాను. అదే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించాను. అనంతరం దమ్ము, ఈగ, లై, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా, రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాల్లో పాటలు పాడాను. నాకంటూ ఓ గుర్తింపు లభించింది. బిగ్బాస్ హౌస్కు ఎంపికయ్యా. పాతబస్తీలో పుట్టి పెరిగా.. నేను పుట్టి పెరిగింది పాతబస్తీలో. పదో తరగతి వరకు లయోలా స్కూల్లో, ఇంటర్ నారాయణ కాలేజీలో చదివా. దూర విద్యద్వారా డిగ్రీ పూర్తి చేశాను. నాన్న రాజ్కుమార్ హెయిర్ స్టైలిస్ట్. అబిడ్స్లోని ఓ హోటల్లో షాపు ఉంది. హలో బ్రదర్ సినిమా ఈ హోటల్లోనే ఓ సీన్ జరిగిన విషయాన్ని హౌస్లో ఉండగా నాగార్జునతో చెప్పాను. అమ్మ సుధారాణి గృహిణి. చెల్లెలికి వివాహమైంది. ముంబైలో ఉంటోంది. తమ్ముడు నిఖిల్ అమెరికాలో చదువుకుంటున్నాడు. మెగాస్టార్ ప్రశంసించారు.. బిగ్బాస్–3 విన్నర్గా చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాను. ఆయన బర్త్డే ఆగస్టు 22. నా బర్త్డే కూడా ఆగస్టు 22. ఇదే విషయాన్ని చిరంజీవితో చెప్పాను. ఆయన వెరీగుడ్ అంటూ ప్రశంసించారు. రూ.50 లక్షలు గెలిస్తే ఏం చేస్తావని వ్యాఖ్యాత నాగార్జున ప్రశ్నించినప్పుడు నా కులవృత్తి సెలూన్ పెట్టుకుంటానని చెప్పాను. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్న తర్వాత సెలూన్ పెట్టుకుంటాను. తప్పనిసరిగా సెలూన్ పెట్టుకోవాలనేది నా లక్ష్యం. టెన్షన్కు గురయ్యాను.. బిగ్బాస్– 3 హౌస్లోకి వెళ్లినప్పుడు నేను సాధారణ కంటెస్టెంట్ని. బయట ఏం జరుగుతోందో తెలియదు. 105 రోజుల ప్రయాణం తర్వాత వచ్చిన ఓటింగ్ శాతం చూస్తే నాకు ఇంతమంది అభిమానులున్నారా? అని ఆశ్చర్యపోయాను. నా ప్రదర్శన ఇంతమందికి నచ్చుతుందన్న విషయం లోపలున్న నాకసలే తెలియదు. విన్నర్ అని ప్రకటించేవరకూ టెన్షన్కు గురయ్యాను. హౌస్లో నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. బిగ్బాస్ టాస్క్లు పెట్టడంతో మనుషుల్లోని రియాల్టీ బయటపడుతుంది. ఎమోషన్స్ అన్నీ వెలికివస్తాయి. ప్రయత్నంలో ఫైటింగ్ ఉండాలి.. యూత్ చేసే పనిలో జెన్యూనిటీ ఉంటే తప్పనిసరిగా విజయం వరిస్తుంది. ప్రయత్నంలో ఫైటింగ్ ఉండాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుగానే సంసిద్ధులు కావాలి. ఏమాత్రం వెనకడుగు వేయొద్దు. ధైర్యం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే విజయాలు వరిస్తాయని బిగ్బాస్– 3 విజేతగా రుజువు చేశా. పాతబస్తీ అందాలు మస్త్.. మీకో విషయం చెప్పాలి. హైదరాబాద్లాంటి సిటీ దేశంలో ఎక్కడా ఉండదు. ముఖ్యంగా పాతబస్తీ అందాలు అన్నీ ఇన్నీ కావు. నాకు హైదరాబాద్తో అనుబంధం ఎక్కువ. మిగతా ఏ నగరానికి వెళ్లినా ఈ అనుభూతులు, ఆనందాలు ఉండవు. నేను ఫ్రెండ్స్తో రాత్రిపూట ఎక్కువగా పాతబస్తీలోనే చక్కర్లుకొడుతుంటా. గోడ దూకి బయటపడ్డా.. బిగ్ బాస్– 3 విజయంతో నాకు దిమాక్ ఉందని మా ఇంట్లో వాళ్లకు అర్థమైపోయింది. ఈ విషయంలో రవి కూడా అన్నాడు.. నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యానని. ఇందుకు తమన్నా సింహాద్రి ఇష్యూనే పేర్కొనవచ్చు. దాంతో పాటు హేమా ఇష్యూ సైతం అందరికీ తెలిసిందే. చెప్పాలంటే మా అయ్యకే భయపడం.. బయట వాళ్లకి ఏం భయపడతాం. పాతబస్తీ పోరగాడుగా రియాల్టీ షో విన్నర్ కావడంతో మా ఇంట్లో వాళ్లు చాలా ఆనందపడుతున్నారు. మా ఇంటికి అభిమానులు పోటెత్తుతున్నారు. ఒక దశలో గోడ దూకి బయటపడాల్సి వచ్చింది. తెలుగులో పాప్ ఆర్టిస్ట్గా ఎదగాలని ఉంది. పునర్నవి విషయానికి వస్తే ఆమెదీ నాదీ మంచి క్యూట్ థింక్స్. ఆమెతో నేను ప్రేమలో ఉంటే చెప్పేంత «ధైర్యం ఉంది. శ్రీముఖి కంగ్రాట్స్చెప్పిందో లేదో గమనించలేదు.. నేను విన్నర్నయ్యాయని తెలియగానే శ్రీముఖి నన్ను అభినందించలేదనే విషయం మీరడిగేదాకా నాకు తెలియదు. గెలిచిన ఆనందంలో నా మైండ్ బ్లాంక్ అయింది. ఏం జరుగుతోందో అర్ధగంటదాకా తేరుకోలేకపోయాను. అందుకే శ్రీముఖి నన్ను కంగ్రాట్స్ చేసిందా.. లేదా? గమనించలేదు. నేనా.. హీరోగానా..? నాకు ప్రభాస్ అంటే బాగా ఇష్టం. తమిళంలో రజనీకాంత్, సూర్యను బాగా ఇష్టపడతా. అయితే.. నన్ను ప్రేక్షకులు హీరోగా చూస్తారని అనుకోవడం లేదు. ఇప్పటికైతే పాటలు పాడుతుంటా. ఒకవేళ హీరోలకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ వస్తే మాత్రం చేస్తా. ప్రేమలో పడ్డాను..పేరు చెప్పలేను.. ప్రేమలో పడ్డమాట వాస్తవమే. ఎవరన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేను. తప్పనిసరిగా ప్రేమ వివాహమే చేసుకుంటాను. -
త్వరలో పున్నుతో లైవ్లోకి వస్తా: రాహుల్
రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు ఈ పేరు ప్రతీగల్లీలో మారుమోగుతోంది. బిగ్బాస్ తెలుగు 3 విజేతగా తన పేరు లిఖించుకున్న రాహుల్ మొదటిసారి లైవ్లోకి వచ్చాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు. అందరూ ఓట్లు వేసి గెలిపించడం వల్లే తన లైఫ్ మారిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ట్రోఫీని సాధించిన రాహుల్ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఓ అభిమాని కోరిక మేరకు రాహుల్.. ‘వెన్నెలవే వెన్నెలవే..’ పాట పాడి అందరినీ సంతోషింపజేశాడు. రాహుల్, పునర్నవిల గురించి మరో అభిమాని ప్రస్తావించగా పున్నుతో కలిసి త్వరలోనే లైవ్లోకి వస్తానని చెప్పాడు. తాను గెలుస్తానని ఊహించలేదని, ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులు తోపులని రాహుల్ అభివర్ణించాడు. బిగ్బాస్ హౌస్లో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వరుణ్ గురించి చెప్తూ అతను చాలా మంచోడని చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులందరికీ టాస్క్ల్లో బేధాభిప్రాయాలు వచ్చాయే తప్ప అందరూ మంచివాళ్లేనని పేర్కొన్నాడు. ‘నోయెల్ అన్న నీ పక్కన ఉన్నంతవరకు నిన్నెవరూ ఏం చేయలేర’ని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి రాహుల్ స్పందిస్తూ.. తనకు ఎంతో మద్దతునిచ్చిన నోయెల్, ఫలక్నుమాదాస్ హీరో విశ్వక్సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. పున్ను తనను ఘోరంగా సపోర్ట్ చేసిందని, వినకపోతే తిట్టి మరీ చెప్పేదని గుర్తు చేసుకున్నాడు. పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) లేకపోయుంటే నేనింత కష్టపడకపోయేవాడినని, నా గెలుపుకు వాళ్లు కూడా ఓ కారణమని పేర్కొన్నాడు. -
వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్ పేరెంట్స్
బిగ్బాస్ హౌస్లో రాహుల్-పునర్నవిల రిలేషన్షిప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీకెండ్లో వచ్చే నాగార్జున వారి మధ్య అలకలను, ప్రేమను గుర్తుచేస్తూ సెటైర్లు విసిరేవాడు. ఇక పునర్నవి రాహుల్కు గోరుముద్దలు తినిపించడం, అదే సమయంలో తప్పుచేస్తే అతన్ని చెడామడా తిట్టడం.. ఇంట్లో ఏం జరిగినా ఇద్దరు కలిసే ఉండటం ప్రేక్షకులను మెప్పించింది. ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసిన రాహుల్.. డేటింగ్కు వస్తావా అని పునర్నవిని సరదాగా అడగడం అప్పట్లో హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. టాస్క్లు ఆడటం చేతకాదని పేరు తెచ్చుకున్న రాహుల్.. పునర్నవి కోసం 20 గ్లాసుల కాకర జ్యూస్ను గటగటా తాగి ఆమెను నామినేషన్ నుంచి తప్పించాడు. దీంతో ఆనందం పట్టలేని పునర్నవి.. రాహుల్ను హత్తుకుని ముద్దులు కూడా ఇచ్చింది. ఇక పునర్నవి ఎలిమినేట్ అయినపుడు రాహుల్ వెక్కివెక్కి ఏడ్వటంతో ఆమెపై ఉన్న ప్రేమ మరోసారి బయటపడింది. పదకొండోవారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన పునర్నవి.. రాహుల్తో కలిసి ఫేస్బుక్ లైవ్ చేస్తానని అభిమానులకు మాటిచ్చింది. అటు గ్రాండ్ ఫినాలే స్టేజిపై రాహుల్ను విజేతగా ప్రకటించిన తర్వాత పునర్నవి తనను ఎంకరేజ్ చేసిందని ఆమెను పొగడ్తల్లో ముంచెత్తాడు. అటు రాహుల్, ఇటు పునర్నవి.. మేం ఇద్దరం ప్రాణస్నేహితులమంటూ ఎప్పటికప్పుడు మాట దాటవేస్తూనే ఉన్నారు. అయితే రాహుల్ తల్లిదండ్రుల మాటలు ప్రేక్షకులను చిక్కుల్లో పడేశాయి. వారిది స్నేహమా? ప్రేమా అన్న అనుమానం వీక్షకుల్లో మరోసారి తలెత్తుతోంది. అటు రాహుల్ తల్లిదండ్రులు అతనికి లైఫ్ సెట్ చేసే పనిలో పడ్డారు. పనిలో పనిగా పెళ్లి విషయం గురించి కూడా మాట్లాడారు. అయితే బిగ్బాస్ వాళ్లు రాహుల్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ నడుస్తుందన్న భావన కలిగించారని చెప్పుకొచ్చారు. కానీ అది బిగ్బాస్ హౌస్ వరకే ఉంటుందనుకుంటున్నామని తెలిపారు. రాహుల్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలన్నారు. వారికి ఇష్టమైతే పెళ్లి చేస్తామని ప్రకటించారు. ‘వాళ్లు నిజంగా లవ్ చేసుకుంటే వాళ్ల ఇష్టమే మా ఇష్టం.. వాళ్ల నిర్ణయమే మా నిర్ణయం.. పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని వెల్లడించారు. ఇక బిగ్బాస్ ముగిసిందో లేదో అప్పుడే పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) కలిసి పార్టీ చేసుకున్నారు. -
బిగ్బాస్ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్
అతిరథ మహారథుల సమక్షంలో బిగ్బాస్ 3 తెలుగు షో విజేతను ప్రకటించారు. 105 రోజుల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాహుల్ సిప్లిగంజ్ బిగ్బాస్ టైటిల్ సాధించాడు. ‘ఈసారి మహిళను గెలిపిద్దాం’ అంటూ ప్రచారం చేసిన శ్రీముఖి మాటలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె రన్నరప్గా నిలిచింది. బిగ్బాస్ కప్పు కొట్టకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసిన బాబా భాస్కర్ మూడో స్థానంలో నిలిచాడు. షో మొదటి నుంచి టైటిల్ గెలవడానికి ఎక్కువగా ఆస్కారం ఉందనుకున్న వరుణ్ సందేశ్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. టాస్క్ల్లో విజృంభించే అలీ రెజా అయిదవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బిగ్బాస్ ఫెయిల్ అయింది.. ఇక షో ముగిసినప్పటికీ రాహుల్ను విజేతగా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రాహుల్ గెలుపుతో చిచ్చా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతుంటే శ్రీముఖి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఒక బద్ధకస్తుడిని గెలిపించి బిగ్బాస్ 3 ఫెయిల్ అయిందని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాహుల్ గెలుపు ఏకపక్షమని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిగ్బాస్ 2,3 ఫలితాలు బిగ్బాస్ షో ప్రతిష్టను దిగజార్చాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బహుశా ఆ ఫలితాలు జనాల అభిప్రాయం కావచ్చని అసహనం వ్యక్తం చేశాడు. రాహుల్ గెలిచాడు.. కానీ బిగ్బాస్ ఓడిపోయిందని పేర్కొన్నాడు. రాహుల్ గెలవడం స్త్రీ జాతికే అవమానం.. మహేశ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖిని రన్నరప్గా ప్రకటించడంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక సోమరిపోతు, అహంకారిని బిగ్బాస్ విన్నర్గా చూడగలగడం.. ఆడపడుచుని అహంకారంగా అవమానపరిచిన వాడిని ఆమె ముందే విన్నర్ అనడం స్త్రీ జాతికే అవమానం’ అంటూ దుయ్యబడుతున్నారు. బిగ్బాస్ షోపై నమ్మకం పోయందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇకమీదట వచ్చే బిగ్బాస్ 4 చూడమంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శపథం చేస్తున్నారు. బిగ్బాస్ 1లో పాల్గొన్న కత్తిమహేశ్ గతంలోనూ బిగ్బాస్ రియాలిటీ షోపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. -
బిగ్బాస్: అతను శ్రీముఖిని ఓడించడం నచ్చింది
డబ్బు, ఐశ్వర్యం, అవకాశాలు కల్పించగల కుటుంబ నేపథ్యం... ఇవి ఉన్నవారు విజేతలు కావడంలో పెద్ద విశేషం లేదు. కాని ఒక పక్కింటి కుర్రాడు, మన గల్లీ కుర్రాడు విజేత కావడం చాలా పెద్ద విశేషం. బిగ్బాస్-3 రియాలిటీ షోలో చాలా గట్టి కంటెస్టెంట్లను దాటి గెలిచిన రాహుల్ ఇటీవలి యువతకు ఇన్స్పిరేషన్గా నిలవవచ్చు. బిగ్బాస్ హౌస్లో సినిమా హీరో వరుణ్ ఉన్నాడు. సిక్స్ప్యాక్ అందగాడు అలీ రజా ఉన్నాడు. తన యాసతో ఆకట్టుకునే మహేష్ విట్టా ఉన్నాడు. ఇంకా అమ్మాయిలలో అయితే సావిత్రక్కగా ఫేమస్ అయి తెలంగాణ బిడ్డగా అభిమానం పొందిన శివజ్యోతి ఉంది. హుషారు శ్రీముఖి ఉంది. తన మంచితనంతో ఆకట్టుకున్న బాబా భాస్కర్ ఉన్నాడు. ఇంకా ప్రతి ఒక్కరూ గట్టి పోటీదారులే. అయినప్పటికీ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. తను తనలాగే ఉండటం, తన ప్రవర్తనతోనే ఆకట్టుకోవడం, పాటగాడిగా తన ప్రతిభ, పెద్దగా మతలబులు చేయకపోవడం ఇవన్నీ అతనికి లాభించాయని చెప్పవచ్చు. విజయనగర్ కాలనీలో రాహుల్ ఇల్లు వృత్తిరీత్యా బార్బర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ ప్రాథమికమైన రెండు కోరికలతో బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. ఒకటి: మంచి సొంత సెలూన్ తెరవడం. రెండు: ఒక సొంత ఇల్లు సంపాదించుకోవడం. బిగ్బాస్ విజేతగా ఈ రెండు కోరికలు తీర్చుకోవడం అతనికి ఇక కష్టం కాకపోవచ్చు. రాహుల్ది హైదరాబాద్ ధూల్పేటలోని మంగళ్హాట్. అతని కుటుంబం ప్రస్తుతం విజయ నగర్ కాలనీలోని ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. రాహుల్ ఫోక్ సింగర్గా, సినిమా గాయకునిగా మారకముందు తండ్రితో కలిసి నాంపల్లిలోని శ్రీ సాయి కిరణ్ సెలూన్లో పని చేసేవాడు. వచ్చిన కస్టమర్లను తన మాటలతో పాటలతో అలరించేవాడు. విజయనగర్ కాలనీలో కూడా చుట్టుపక్కల వారికి అతడు ఆత్మీయుడు. ‘రాహుల్ మమ్మల్ని చాలా ప్రేమగా పలకరిస్తాడు’ అని అనిల్ సింగ్ అనే అతని స్నేహితుడు తెలిపాడు. ‘దీపావళి వస్తే చాలా సందడి చేస్తాడు. నాంపల్లిలో రాహుల్ పని చేసిన సెలూన్ ఇదే! ఈసారి పండగ సమయానికి అతడు హౌస్లో ఉండటంతో మేమంతా కొంచెం నిరాశ పడ్డాం’ అని మరో స్నేహితుడు శ్రీవత్స చెప్పాడు. హౌస్లో ఉన్న రోజుల్లో తోటి కంటెస్టెంట్ శ్రీముఖితో తనకి సఖ్యత కుదరలేదు. అదే శ్రీముఖిని రాహుల్ ఫైనల్స్లో ఓడించడం అభిమానులకే కాదు, ఎక్కువమందికి నచ్చినట్టు కనపడుతోంది. రాహుల్ తన నేపథ్యాన్ని, వృత్తిని దాచకుండా గౌరవంతో సొంతం చేసుకోవడం చాలా మందికి నచ్చి ఉండవచ్చు. నాంపల్లిలోని సాయికిరణ్ హెయిర్ సెలూన్లో తండ్రి రాజ్కుమార్తో బార్బర్గా పని చేసిన రాహుల్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, దర్శకుడు రాజమౌళి వంటి వారికి హెయిర్ కట్ చేసేవాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఇప్పుడు తమ స్నేహితుడే సెలబ్రిటీగా మారడంతో ఇంటి దగ్గర కోలాహాలం ఏర్పడింది. షో ముగిశాక నిబంధనల ప్రకారం ఇంకా జనంలోకి రాని రాహుల్ త్వరలో ఇల్లు చేరి తమతో దావత్ చేసుకుంటాడని మిత్రులు ఎదురు చూస్తున్నారు. – జెమిలిప్యాట వేణుగోపాల్, సాక్షి, హైదరాబాద్ -
బిగ్బాస్: రాహుల్ గెలుపునకు కారణాలివే..
జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్బాస్-3 నవంబర్ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. టైటిల్ గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన శ్రీముఖి విజయానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది. రాహుల్ గెలుపునకు గల కారణాలు ఓసారి పరిశీలించినట్టయితే... శ్రీముఖితో వైరం రాహుల్కు సానుభూతి తెచ్చిపెట్టగా.. అది ఓట్ల రూపంలో కనిపించింది. దాంతోపాటు పునర్నవితో రిలేషన్షిప్ ప్రేక్షకులను అలరించింది. పున్నూ ఫ్యాన్స్ కూడా రాహుల్కే జై కొట్టారు. ఇంటి సభ్యులు రాహుల్ను నామినేట్ చేసిన ప్రతీసారి అతని బలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన రాహుల్ చివరాఖరికి ఇంటి సభ్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. పాటల మాంత్రికుడు.. బద్ధకస్తుడు అన్న పేరును తెచ్చుకున్న రాహుల్ మొట్టమొదటగా ‘టికెట్ టు ఫినాలే’ సాధించి తనేంటో రుజువు చేసుకున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే చెప్పడం.. ఎలాంటి భేషజాలానికి పోకుండా తప్పు చేస్తే సారీ చెప్పడం.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక రాహుల్ హైదరాబాదీ యాసతో ఇంటి సభ్యులు కొన్నిసార్లు నొచ్చుకున్నారు. రాహుల్ తమను తిడుతున్నాడని హోస్ట్ నాగార్జునకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగ్ సైతం రాహుల్ను జాగ్రత్తగా మాట్లాడాలని సూచించాడు. అయితే, ప్రేక్షకులు మాత్రం రాహుల్ బోల్డ్ రియాక్షన్స్కి ఫిదా అయ్యారు. వీటన్నిటికీ తోడు రాహుల్ కొత్తకొత్త బాణీలతో, తన గాత్రంతో అటు ఇంటి సభ్యులను, ఇటు ప్రేక్షకులను అలరించాడు. ఫేక్ ఎలిమినేషన్, రీఎంట్రీ రాహుల్ క్రేజ్ను రెట్టింపు చేశాయి. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ సమయంలో పునర్నవీ, పున్నూ ఎలిమినేషన్ సమయంలో రాహుల్ ఎమోషన్స్ను ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యారు. సింగర్, నటుడు నోయెల్.. రాహుల్కు అండగా నిలవటం అతనికి మరింత ప్లస్ అయ్యింది. మిడిల్ క్లాస్+వృత్తికి గౌరవం మరీ ముఖ్యంగా రాహుల్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడని, అతను లైఫ్లో ఇంకా సెటిల్ అవాల్సి ఉందని కూడా జనాలు గెలిపించేందుకు ఓ కారణమైంది. తన బార్బర్ వృత్తికి గౌరవం ఇవ్వడం కూడా అతని విలువను రెట్టింపు చేసింది. గల్లీ సింగర్ నుంచి ఎదిగిన తీరును దగ్గరుండి చూసిన జనం అతనికి జై కొట్టారు. వీటన్నింటి వల్ల రాహుల్కు గెలుపు ఖాయమైంది. ఒక్కసారి కూడా కెప్టెన్ అవని రాహుల్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. అయితే అతని గెలుపును శ్రీముఖి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బద్ధకస్తుడిని గెలిపించి బిగ్బాస్ 3 ఫెయిల్ అయిందని తిట్టిపోస్తున్నారు. రాహుల్ గెలుపు.. శ్రీముఖి వేసిన భిక్షగా అభివర్ణిస్తున్నారు. -
బిగ్బాస్ : ‘మిడిల్ క్లాస్ వ్యక్తిని గెలిపించారు’
తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్బాస్ సీజన్ 3 నిన్నటి (ఆదివారం) ఎపిసోడ్తో ఘనంగా ముగిసింది. ముందుగా ఊహించినట్టుగానే రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఆయన ట్రోఫీని అందుకున్నాడు. షో ముగిసిన అనంతరం బిగ్బాస్ కంటెస్టెంట్లు ఇంటి బాట పట్టారు. వారికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విజేతగా నిలిచిన రాహుల్, రన్నరప్తో సరిపెట్టుకున్న శ్రీముఖికి దారి పొడవునా జనాలు నీరాజనం పలికారు. వారితో ఫొటోలు తీసుకోడానికి ఎగబడ్డారు. పాతబస్తీ పోరడు రాహుల్ గెలుపుతో అభిమానులు రాత్రంతా తీన్మార్ డాన్సులు వేశారు. షో నుంచి బయటకు వచ్చిన రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు లెజెండ్స్ చేతులమీదుగా టైటిల్ తీసుకోవడం అదృష్టంగా అనిపిస్తుంది. నా లైఫ్ చేంజ్ అవుతది అనిపిస్తుంది. కోట్లాది మంది ఓట్లేసి గెలిపించినందుకు నా సంతోషానికి హద్దులు లేవు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన.. అలాంటి నన్ను వేరే లెవల్కు తీసుకెళ్లారు. స్ట్రాటజీతో కన్నా నిజాయితీగా ఆడినా.. టాస్క్ల్లోనూ ప్రయత్నించినా.. అదే నా సక్సెస్కు కారణమయింది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. తనను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అతని అభిమానులు రాహుల్కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం రాహుల్ వారితో కాసేపు ముచ్చటించాడు. ఇక శ్రీముఖి టైటిల్ గెలవకపోయినా కోట్లాది మంది హృదయాలు గెలుచుకుందని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే షో నుంచి వచ్చాక అభిమానులు తనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న శ్రీముఖి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
బిగ్బాస్ విజేతగా రాహుల్
-
బిగ్బాస్–3 విజేత రాహుల్
సాక్షి, హైదరాబాద్ : 3 నెలల క్రితం ప్రారంభమై వివాదాలు, సంవాదాలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్బాస్–3 షో విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. దీంతో ఆయన రూ.50 లక్షల నగదు బహుమతిని దక్కించుకున్నారు. అండర్డాగ్గా బిగ్హౌస్లోకి ఎంటర్ అయిన రాక్స్టార్ రాహుల్ .. విన్నర్గా కాలర్ ఎగరేశాడు. దీంతో టైటిల్ ఫెవెరెట్గా హౌస్లో సందడిచేసిన పటాకా శ్రీముఖి రన్నరప్తో సరిపెట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని, బిగ్బాస్ ట్రోఫిని రాహుల్ అందుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేశారు. ఈ విజయం తనను పది మెట్లు పైకి ఎక్కించాయని, ఇక నుంచి తన లైఫ్ కొత్తగా ఉండబోతుందని చెప్పారు. తన గెలుపు కోసం తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారని రాహుల్ అన్నారు. తన విజయంలో పునర్నవి, వరుణ్, వితికల కష్టం కూడా ఉందన్నారు. (చదవండి : బిగ్బాస్ తర్వాత కనిపించకుండా పోయారు) ఇక పునర్నవి గురించి మాట్లాడుతూ.. ‘ఫస్ట్ నేను టాస్కులు ఆడకపోతుండే. పెద్ద లేజీగాడు లెక్కుండే. మంచిగజెప్పింది ఇన్లేదు. టాస్కులు ఆడరా అని జెప్పింది. అయినా ఇన్లేదు. అరె ఎదవ ఆడరా టాస్కులు అని జెప్పింది. అయినా ఇన్లేదు. ఒకరోజు ఫాట్ అని బైరిబెట్టింది. అయినా ఇన్లేదు. ఆఖరికి నామినేట్ జేసింది. తీస్కపోయి ముఖానికి రంగు పూసింది’ అని చెప్పాడు. టాస్క్ల వల్లే శ్రీముఖికి, తనకు బేదాభిప్రాయాలు వచ్చాయి తప్ప వ్యక్తిగతంగా ఏమి లేదన్నారు. ఇక నుంచి తన లైఫ్ కొత్తగా మారుతుందని చెప్పారు. ‘ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మా అమ్మనాన్న కడుపులో పుట్టాను’అంటూ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. కాగా, బిగ్బాస్ సీజన్ త్రీకి గ్రాండ్గా ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్ పోటీని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన బుల్లితెర ప్రేక్షకులు సుమారు మూడు గంటల పాటు ఇంట్లో టీవీలకు అతుక్కుపోయారు. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరించారు. సీరియల్ యాక్టర్స్, పలువరు సెలబ్రిటీలు, బిగ్బాస్ కంటిస్టెంట్లు ధూమ్ధామ్గా సందడి చేశారు. ప్రతిరోజు పండగే టీమ్ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లి హంగామా చేసింది. హీరోయిన్స్ అంజలి, కేథరిన్, నిషా అగర్వాల్ ఫర్మామెన్స్లతో గ్రాండ్ ఫినాలే స్టేజీ దద్దరిల్లింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాప్5లో ఉన్న కంటెస్టెంట్స్లో మొదటగా అలీ రెజా, తర్వాత వరుణ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో ఎమిలినేషన్గా బాబా భాస్కర్ బయటకు వచ్చారు. చివరకి హౌజ్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్ దగ్గరకి స్వయంగా హోస్ట్ నాగార్జునే వెళ్లాడు. వారితో కాసేపు సరదాగా మాట్లాడాడు. వారి జర్నీలకు సంబంధించిన వీడియోలను ప్లే చేసి చూపించాడు. వంద రోజులకు పైగా కష్టపడి టాప్2లోకి వచ్చిన రాహుల్, శ్రీముఖిలకు చివరగా నాగ్ ఓ ఆఫర్ను ఇచ్చాడు. ప్రైజ్ మనీ యాభై లక్షలని, ఇద్దరికీ చేరో రూ.25లక్షలు ఇస్తానని డీల్ మాట్లాడాడు. కానీ దాన్ని వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. దీంతో వారిద్దరిని నాగ్ స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. చిరు కోసం పాట పాడమని నాగ్ రాహుల్ను కోరగా.. అబీఅబీ అనే పాటతో రాహుల్ స్టేజిని ఉర్రుతలూగించాడు. ఇక రాహుల్, శ్రీముఖి ఇద్దరిలో రాహుల్ను విన్నర్గా నాగ్ ప్రకటించేశాడు. అనంతరం చిరంజీవి ట్రోఫీని అందజేశాడు. శ్రీముఖి డల్ అయిపోవడంతో చిరంజీవి ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చారు. అలా ఉంటే తాను చూడలేనని సరదాగా అన్నారు. ఆ తరవాత తనతో చిరు సెల్ఫీ తీసుకున్నారు. ఈ సమయంలో చిరు బుగ్గపై శ్రీ ముద్దపెట్టింది. దీంతో చిరంజీవి షాకయ్యాడు. మొత్తంగా 8కోట్ల 52లక్షల ఓట్లు పోలైనట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. దీంతో బిగ్బాస్ 3కి ఎండ్కార్డు పడింది. -
బిగ్బాస్లోకి మెగాస్టార్.. హీటెక్కిన షో!
బిగ్బాస్ సీజన్ టూ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సైరా సినిమాతో సూపర్హిట్ అందుకున్న చిరంజీవి సైరా బ్యాక్గ్రౌండ్ పాటతో అదరిపోయేలా గ్రాండ్ ఫినాలెకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్బాస్ -3 విజేత ఎవరు అనేది మెగాస్టార్ చిరంజీవి ప్రకటిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాబా భాస్కర్ ఎలిమినేట్ కావడంతో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య తుదిపోరు నెలకొంది. ఈ ఇద్దరిలో ఎవరూ విన్నరో మరికాసేపట్లో తెలిపోనుంది. హోస్ట్ నాగార్జునతో కలిసి చిరంజీవి బిగ్బాస్ గేమ్ షోలో సందడి చేశారు. శ్రీముఖి, రాహుల్లో ఎవరు గెలుస్తారంటూ హోస్ట్ నాగార్జుననే అడిగి.. చిరు ఇరకాటంలో నెట్టారు. మీరు అడగమన్నారా అంటూ హౌజ్లోంచి బయటకొచ్చిన కంటెస్టెంట్లను అడుగుతూ నాగార్జున సరదాగా దాటవేశారు. నాగార్జున హౌజ్లోకి వెళ్లి ఫైనలిస్టులైన ఇద్దరు కంటెస్టెంట్లను వేదిక మీదకు తీసుకొచ్చారు. ఇక ఇస్మార్ట్ భామ నిధి అగ్వరాల్ తన దుమ్మురేపే డ్యాన్సులతో గ్రాండ్ ఫినాలెకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. -
బిగ్బాస్: బాబా ఔట్.. విజేత ఎవరంటే!
బాస్బాస్ సీజన్ 3 తుదిపోరు రసవత్తరంగా మారింది. టాప్-5లో ఉన్న ఐదుగురి కంటెస్టెంట్లలో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అలీ రెజా, వరుణ్ సందేశ్ ఇప్పటికే ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా ఊహించినట్టే బాబా భాస్కర్ కూడా హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. దీంతో తుది అంకానికి చేరుకున్న ఫైనల్ పోరులో టాప్-2 కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మిగిలారు. టాప్-2లో ఈ ఇద్దరే ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీముఖి, రాహుల్లలో విజేత కానుండగా.. మరొకరు రన్నరప్ కానున్నారు. బిగ్బాస్-3 గ్రాండ్ ఫినాలెలో మూడో కంటెస్టెంట్ ఎలిమినేషన్ కూడా నాటకీయంగా సాగింది. ఈ ఎలిమినేషన్ కోసం అంజలి హౌజ్లోకి వెళ్లారు. ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేసి.. తన వద్దకు తీసుకువచ్చే బాధ్యతను నాగార్జున ఆమెకు అప్పగించారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి కూడా రూ. 25 లక్షల ఆఫర్ను నాగార్జున ఇచ్చారు. నమ్మకం లేనివారు రూ. 25 లక్షలు తీసుకొని రావొచ్చునంటూ ఊరించారు. అయినా ఎవ్వరూ ఆఫర్ను స్వీకరించలేదు. దీంతో బాబా భాస్కర్ను ఎలిమినేట్ చేస్తున్నట్టు అంజలి ప్రకటించి.. నాగార్జున వద్దకు తీసుకొచ్చారు. ఇక, మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లలో ఎవరు విన్నర్ అవుతారని బాబా భాస్కర్ను అడుగగా.. శ్రీముఖి విజేతగా నిలుస్తారని, రాహుల్ రన్నరప్ అవుతారని బాబా తన అభిప్రాయం చెప్పారు. ఇక, గ్రాండ్ ఫినాలె షోలో భాగంగా వితిక, పునర్నవి, రవికృష్ణ, శిల్పా చక్రవర్తి తమ డ్యాన్సులతో అదరగొట్టారు. -
బిగ్బాస్ : 50 లక్షలు ఎవరివి?
తెలుగువాళ్లు రెండుగా విడిపోయారు. ఐదేళ్ల క్రితమే ‘ప్రత్యేక తెలంగాణ’ పేరుతో విడిపోయారుగా.. ఇప్పుడేమిటి మళ్లీ విడిపోవడం? అప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది తెలుగు ప్రజలు. ఇప్పుడు విడిపోయింది రెండు రాష్ట్రాల్లోని తెలుగు వీక్షకులు. వీళ్లను విడదీసింది నాయకులు కాదు.‘బిగ్బాస్–3’ టీవీ షోలోని నటీనటులు. నటీనటులు కూడా కాదు. కంటెస్టెంట్లు. ఈ వంద రోజులూ ఒకరితో ఒకరు ఆడి, పాడి, పోట్లాడి.. పోటీలో చివరికి ఐదుగురు మిగిలారు. ఆ ఐదుగురిలో ప్రధానంగా ఇద్దరిపైనే అందరి చూపు ఉంది. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్. వీళ్లిద్దరిలో ఎవరు విజేత అవుతారన్నదానిపైనా తెలుగు టీవీ వీక్షకులు రెండుగా విడిపోయారు! బిగ్బాస్ 3 షోలో యాభై లక్షల ప్రైజ్మనీని శ్రీముఖి కొట్టేస్తుందని సగం మంది. కాదు కాదు.. ఆ యాభై లక్షలు రాహుల్నే వరిస్తాయని మిగతా సగం మంది! మరి మిగిలిన ముగ్గురిలో అలీకి ఏం తక్కువైంది? బాబా భాస్కర్కి ఏం ఎక్కువైంది? వరణ్ సందేశ్కి ఎక్కువ తక్కువలు ఏం ఉన్నాయి? వాళ్లెందుకు మొదటి ఇద్దరిలో స్థానం సంపాదించుకోలేక పోయారు? సంపాదించుకోలేదని ఎవరన్నారు? ఈ ఐదుగురి స్థానం గత కొన్ని రోజులుగా వెనుకా ముందు, ముందూవెనుక అవుతూ.. ప్రయారిటీ లిస్ట్లోకి ప్రధాన పోటీదారులుగా శ్రీముఖి, రాహుల్ వచ్చేశారు. పందేలు ప్రధానంగా వీళ్లిద్దరి మధ్యే నడుస్తున్నాయి. చెప్పలేం. ఈ సాయంత్రం లోపు రాతలు తారుమారవచ్చు. వీక్షక ఓటర్లు పైకొకటి చెప్పి, లోపల ఇంకొరికి ఓటేస్తూ తమ సెల్ఫోన్ బటన్ నొక్కొచ్చు. అప్పుడు శ్రీముఖీ, రాహుల్ కాకుండా వేరెవరైనా విజేతలవచ్చు. వీళ్లయిదుగురి స్పెషాలిటీ ఏంటి? వీళ్లలో మళ్లీ ఆ ఇద్దరి ప్రత్యేకతలేంటి? చూసే ఉంటారుగా. రాహుల్ సిప్లిగంజ్ గాయకుడు. శ్రీముఖి యాంకర్. వరుణ్ సందేశ్ నటుడు. బాబా భాస్కర్ కొరియోగ్రాఫర్. అలీ (అలీ రెజా).. ఇతనూ యాక్టరే. ఇతడి తొలి సినిమా ‘గాయకుడు’. రాబోయే సినిమా ‘సినీ మహల్’. వీళ్ల గురించి ఇంతవరకు చాలు. మిగతా 12 మంది కంటెస్టెంట్ల పేర్లు కూడా ఒకసారి ఏకబిగిన చెప్పేసుకుందాం. పాపం ఇన్ని రోజులు మనల్ని ఎంటర్టైన్ చేశారు కదా. బిగ్బాస్ హౌస్లో ఆటాడింది మొత్తం 17 మంది. అంతమంది ఉన్నారా! ఉన్నారు. మీరు చూశారు. ఈ పదిహేడు మందిలో పదిహేను మంది ఒరిజినల్ కంటెస్టెంట్లు. రాహుల్, శ్రీముఖి. వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ, శివజ్యోతి, వితిక, మహేశ్, పునర్నవి, రవికృష్ణ, హిమజ, అశురెడ్డి, రోహిణీరెడ్డి, జాఫర్ బాబు, హేమ.. వీళ్లు ఒరిజినల్. మిగిలిన ఇద్దరు.. శిల్పా చక్రవర్తి, తమన్నా సింహాద్రి.. వైల్డ్ కార్డ్తో హౌస్లోకి ఎంటర్ అయినవాళ్లు. ప్రస్తుతం మిగిలిన ఐదుగురు తప్ప అంతా ఎలిమినేట్ అయ్యారు. రాహుల్ కూడా ఎలిమినేట్ అయ్యాడు కానీ.. అది ఫేక్ ఎలిమినే షన్. అతడిని సీక్రెట్ రూమ్లో ఉంచారు. ఇదంతా ఆటలో భాగం. బిగ్బాస్ మొదటి సీజన్లో విజేత శివబాలాజి. రెండో సీజన్లో విజేత కౌశల్. మొదటి రెండు సీజన్లలోనూ మగవాళ్లకే ప్రైజ్ మనీ రావడంతో ఈసారి కచ్చితంగా శ్రీముఖే గెలుస్తారని ఒక అంచనా. మొన్నటి వరకు ఆమెకు పోటీగా శివజ్యోతి ఉంటుందని భావించారు కానీ, శివజ్యోతి కూడా ఎలిమినేట్ అయిపోవడంతో మిగిలిన ఐదుగురు ఫైనలిస్ట్లలో ఏకైక మహిళ అయిన శ్రీముఖికే ఎక్కువ చాన్స్ ఉందని వీక్షకులు ఊహిస్తున్నారు.అయితే శనివారం సాయంత్రం వరకు అందుబాటులో ఉన్న వీక్షకుల ఓటింగ్ అంచనాల ప్రకారం విజేతగా రాహుల్ మొదటి స్థానంలో ఉండగా, వరుణ్ సందేశ్, శ్రీముఖి.. రెండు, మూడు స్థానాలలో ఉన్నారు. ‘యాభై లక్షల ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తావు? అనే ప్రశ్న వచ్చినప్పుడు రాహుల్ చెప్పిన సమాధానం కూడా వీక్షకుల గుండెల్లో హత్తుకుపోయింది. ‘ఆ డబ్బుతో బార్బర్ షాపు’ పెడతాను అని రాహుల్ అన్నాడు. కులవృత్తి మీద అతడికున్న గౌరవానికి ఆ క్షణమే బిగ్బాస్ వీక్షకులు ఫ్లాట్ అయిపోయి ఉంటారు. దాంతో అతడి గెలుపుపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక అతడికి ప్రధాన పోటీదారు అనుకుంటున్న శ్రీముఖి తరఫున పెద్ద సైన్యమే బయటి నుంచి పని చేస్తోంది. టాప్ యాంకర్గా ఆమెకున్న ఫాలోయింగే ఆమెను గెలిపిస్తుందని ధీమాగా చెబుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. శ్రీముఖికి ‘బుల్లితెర రాములమ్మ’ అని పేరు. సెలబ్రిటీలు సైతం ఆమెను గెలిపించమని ప్రతి వేదికపై పోస్టింగ్లు పెడుతున్నారు. చూద్దాం ఏమౌతుందో. విజేతలు ఎవరైనా.. స్టార్ మా చానెల్లో ఈ సాయంత్రం జరిగే ‘లైవ్’ ముగింపు కార్యక్రమం మాత్రం మూడు గంటలపాటు ఓ మహోత్సవంగా జరగబోతోంది. మొత్తం పదిహేడు మంది కంటెస్టెంట్లూ మళ్లీ ప్రత్యక్షం అవుతారు. ‘షో’ హోస్ట్లు నాగార్జున, రమ్యకృష్ణ ఎలాగూ ఉంటారు. స్పెషల్ ఎట్రాక్షన్గా స్టార్ హీరో చిరంజీవి కనిపించినా ఆశ్చర్యం లేదు. ‘షో’ని హిట్ చేసిందెవరు? సందేహమే లేదు.. కంటెస్టెంట్లే! ప్రతి కంటెస్టెంటూ వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. అల్లరితో, కన్నీళ్లతో, ఇతరత్రా ఎమోషన్లతో అత్యంత సహజంగా బిగ్బాస్ పెట్టిన టాస్క్లన్నీ పూర్తి చేశారు. ఒకరిద్దరు ఓవర్ రియాక్ట్ అయ్యారు. వాళ్లను నాగార్జున మందలించారు. సీరియస్గా తీసుకోవద్దని చెప్పారు. కొందరిని అభినందించారు. ‘షో’ బిగి తగ్గకుండా నడుపుతూ హోస్ట్ చేసిన నాగార్జున కూడా హిట్కు ప్రధాన కారకులే. రమ్యకృష్ణ కూడా హోస్ట్గా ఉన్న కొద్ది రోజులూ డీసెంట్గా, ప్లెజెంట్గా బిగ్బాస్ హౌస్ను చక్కబెట్టారు. -
బిగ్బాస్: లెక్క తేలింది. రాహుల్ గెలిచాడు!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ వందరోజులకు పైగా సాగింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్తో రికార్డులను తిరగరాస్తూ విజృంభించినప్పటికీ అదే దూకుడును షో ఆసాంతం కొనసాగించలేకపోయింది. అయితే బిగ్బాస్ అప్పుడప్పుడు ఇచ్చిన ట్విస్ట్లు, సర్ప్రైజ్లు.. రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ షోను గట్టెక్కించాయి. ఇన్నినాళ్ల బిగ్బాస్ జర్నీలో ఇంటి సభ్యులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మరెన్నో మధురానుభూతులను మిగుల్చుకున్నారు. కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. ఉన్న స్నేహితులు మరింత క్లోజ్ అయ్యారు. ఒకరినొకరు తెలుసుకున్నారు. అంతకుమించి వ్యక్తిగతంగా వారి బలాబలాలేంటో వారే క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఓటింగ్ ఇక బిగ్బాస్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. అందరినీ దాటుకుంటూ, ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ అయిదుగురు ఇంటి సభ్యులు టాప్ 5లోకి అడుగుపెట్టారు. ఓట్లు వేయడానికి డెడ్లైన్ ముగియడంతో తీర్పు ఈపాటికే ఖరారైపోయింది. దీంతో లీకువీరులు విన్నర్ ఎవరో తేలిపోయింది.. అంటూ ఓ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఓటింగ్లో దుమ్ము లేపిన రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ చివరాఖరకు వచ్చేసరికి మాత్రం రాహుల్కు విపరీతంగా ఓట్లు పోలయ్యాయని వారు అభిప్రాయపడ్డారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ను ఎగరేసుకుపోయాడని దండోరా వేస్తున్నారు. కౌశల్, రాహుల్.. సేమ్ టు సేమ్ రాహుల్ గెలిచాడన్న విషయం తెలుసుకున్న చిచ్చా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రాహుల్ షో మొదటి నుంచి బద్దకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాస్క్లు సరిగా ఆడడని, ప్రతీదానికి గీవప్ అంటాడంటూ ఇంటి సభ్యులు 11సార్లు నామినేట్ చేశారు. విచిత్రంగా నామినేషన్లోకి వెళ్లిన ప్రతిసారీ రాహుల్దే పైచేయి అవుతూ వచ్చింది. దీంతో ఇంటి సభ్యులకు రాహుల్కు ఉన్న ఫాలోయింగ్ అర్థమైంది. పునర్నవితో పులిహోర కలుపుతున్నాడు అన్నవాళ్లే పున్ను ఎలిమినేట్ అయ్యాక రాహుల్ పూర్తిగా ఆటపైనే దృష్టిపెట్టి ఆడిన తీరు చూసి అతనికి ఓట్లు గుద్దేశారు. కాగా గత సీజన్లో విజేతగా నిలిచిన కౌశల్ కూడా 11 సార్లు నామినేట్ అవడం విశేషం. రన్నర్గా శ్రీముఖి..? మొన్నటివరకు టైటిల్ ఫేవరెట్గా ఉన్న శ్రీముఖి.. రాహుల్కు వచ్చిన ఓట్ల సునామీలో కొట్టుకుపోయిందని లీకువీరులు జోస్యం చెప్తున్నారు. అయితే షో ప్రారంభం నుంచి వాళ్లు చెప్పేవి దాదాపుగా నిజమవుతూ వచ్చినప్పటికీ కొన్నిసార్లు బొక్కబోర్లా పడ్డ సందర్భాలూ లేకపోలేదు. పైగా బిగ్బాస్ టీంలో శ్రీముఖిని సపోర్ట్ చేసేవారు ఉన్నారని, కనుక ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి బిగ్బాస్ 3 విజేత ఎవరో అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూద్దాం. (చదవండి: బిగ్బాస్కు గుడ్బై చెప్పిన కంటెస్టెంట్లు) -
పున్నును ఎత్తుకున్న రాహుల్, మొదలుపెట్టారుగా
రేపటితో బిగ్బాస్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. హలో యాప్ నిర్వహించిన కాంటెస్ట్లో విజేతలుగా నిలిచిన ఇద్దరు వ్యక్తులను బిగ్బాస్ టాప్ 5 కంటెస్టెంట్లను కలుసుకునే అవకాశం ఇచ్చాడు. అయితే వారు ఆకస్మాత్తుగా ఇంట్లోకి రావటంతో ఇంటి సభ్యులు మొదట షాకింగ్కు గురయ్యారు. అనంతరం తేరుకున్న హౌస్మేట్స్ వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వారు వెళ్లిపోయిన తర్వాత బిగ్బాస్ ఇంట్లోకి ప్రత్యేక అతిథులను పంపించారు. వాళ్లను చూడగానే ఇంటి సభ్యులు ఆనందంతో ఎగిరి గంతేశారు. మొదటగా రవి హౌస్లో అడుగుపెట్టగా అలీ వెళ్లి గట్టిగా హత్తుకున్నాడు. ఇంటి సభ్యులందరూ రవికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తిరిగి బిగ్బాస్ హౌస్లోకి ప్రవేశిండంతో ఇల్లు కళకళలాడింది. వారి అల్లరితో మళ్లీ పాత రోజులు గుర్తుకు చేశారు. ఇక పునర్నవి ఇంట్లోకి అడుగుపెట్టగానే శ్రీముఖి చంటిపిల్లలా ఎత్తుకుని ‘కరెక్ట్ ప్లేస్లో దింపుతా’నంటూ రాహుల్ దగ్గర వదిలిపెట్టింది. దీంతో రాహుల్ పునర్నవిని ఎత్తుకుని స్వాగతం పలికాడు. అనంతరం రాహుల్.. ‘బయట ఎలా ఉంద’ని ఆరా తీశాడు. ‘రెండువారాల్లో కొత్త బెస్ట్ఫ్రెండ్స్ అయ్యారు కదా.. నేనేం చెప్పినా ఫేక్ అనిపిస్తది, ఎందుకంటే నేను ట్రూ బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా’ అని పునర్నవి వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ‘ఈ మధ్య ఇంగ్లీష్ మాట్లాడుతున్నావ్..’ అని పునర్నవి అనగా ‘నీతో తిరిగి తిరిగి వచ్చింది’ అని రాహుల్ పంచ్ వేశాడు. ‘సెన్స్ కూడా నాలా వస్తే బాగుండేది’ అని పున్ను రివర్స్ కౌంటర్ వేసింది. ఇక పొట్టి డ్రెస్తో ఎంట్రీ ఇచ్చిన తమన్నాను ‘రంభలా రెడీ అయి వచ్చిందే’ అంటూ బాబా కామెంట్ చేశాడు. తన స్నేహితుడైన జాఫర్పైనా బాబా పంచ్లు విసిరాడు. అందరూ ఒకేచోటికి చేరడంతో బిగ్బాస్ ఇల్లు.. ఆనందాల హరివిల్లుగా మారింది. కంటెస్టెంట్ల కోసం బిగ్బాస్ ఓ వీడియోను ప్లే చేశాడు. వారి ఆటపాటలు, అల్లరి జ్ఞాపకాల మేళవింపుతో చేసిన వీడియో చూశాక తమన్నా కాస్త ఎమోషనల్ అయింది. బాధపెట్టినందుకు క్షమించమంటూ రవి చేయి పట్టుకుని కన్నీళ్లతో అర్థించింది. పర్వాలేదు అంటూ రవి ఆమెను ఊరడించాడు. అనంతరం బిగ్బాస్ ఇంట్లో పార్టీ జరుగుతోంది. దీనికోసం ఇంటి సభ్యులు అందంగా ముస్తాబయ్యారు. ఈ పార్టీలో అవార్డుల ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అవార్డుల ఎంపికకోసం ఇంటి సభ్యుల సమాధానాలను బిగ్బాస్ అడిగి తెలుసుకున్నాడు. మరి ఈ పార్టీలో రచ్చ ఏరేంజ్లో ఉండబోతుందో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
బిగ్బాస్ టైటిల్ తన్నుకుపోయే ఆ ఒక్కరు?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్3 తెలుగు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో తెలుగునాట అందరూ బిగ్బాస్ జపం చేస్తున్నారు. ఆయా కంటెస్టెంట్ల అభిమానులు పక్కవాళ్ల ఫోన్లు లాక్కుని మరీ ఓట్లు గుద్దుతున్నారు. అంతేనా, ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం తమ ఫేవరెట్ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్ సమరంలో ఎవరు నెగ్గుతారు? ఎవరు ఏ స్థానానికి పరిమితమైపోతారు అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ప్రశ్నకు వీకెండ్స్లో సమాధానం దొరకనుండగా.. ఇప్పటినుంచే జనాలు టీవీలకు అతుక్కుపోయారు. ఇక శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. అయితే అలీ రెజా, బాబా మాత్రం ఓటింగ్లో చాలా వెనుకబడిపోయారు. దీంతో వీళ్లు టైటిల్ రేసు నుంచి తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక వరుణ్కు అభిమానుల మద్దతు గట్టిగానే ఉన్నప్పటికీ టైటిల్ గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు మాత్రం రాబట్టుకోలేకపోతున్నాడు. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ఒకరిని మించి మరొకరు ఓటింగ్లో దుమ్ము లేపుతున్నారు. గత రెండు రోజుల్లో ఓట్లరేసులో కాస్త వెనుకబడ్డ రాహుల్ ప్రస్తుతం శ్రీముఖిని అధిగమించినట్లు సమాచారం. అయితే నేడు కూడా ఓటింగ్కు అవకాశం ఉండటంతో ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. మరి టైటిల్ను అందుకుని గెలుపును ముద్దాడేది ఆమెనా, అతడా? అన్నది ఆదివారం తేలనుంది. -
‘రాహుల్ను గెలిపించండి’
-
బిగ్బాస్: ‘రాహుల్ను గెలిపించండి’
బిగ్బాస్ 3 టైటిల్ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టైటిల్ రేసులో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్లు ఉన్నారు. అయితే ప్రధాన ఫైట్ మాత్రం రాహుల్, శ్రీముఖి మధ్యలోనే ఉంది. ఓట్లు వేయడానికి రేపు ఆఖరి రోజు కావటంతో అభిమానులు తమతమ ఫేవరెట్ కంటెస్టెంట్లకే ఓట్లు గుద్దండంటూ ప్రచారంతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్’తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అది ప్రేక్షకులపై ఏపాటి ప్రభావం చూపిస్తుందో గ్రాండ్ ఫినాలేనాడు తేలనుంది. మరోపైపు రాహుల్ సిప్లిగంజ్ కోసం ప్రముఖ సింగర్ నోయెల్ గట్టి ప్రచారమే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇంకాస్త డోస్ పెంచుతూ రాహుల్ తల్లి రంగంలోకి దిగింది. ఇంతకు మునుపు బిగ్బాస్ హౌస్లోకి వచ్చిన రాహుల్ తల్లి ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకుల మనసులనూ గెలుచుకుంది. హౌస్ను వీడి వెళ్లేముందు రాహుల్కు టాస్క్లు బాగా ఆడమని సూచించింది. అమ్మ మాట రాహుల్కు టాబ్లెట్లా పనిచేసిందేమో! తర్వాతి టాస్క్ల్లో తానేంటో నిరూపించుకుని టికెట్ టు ఫినాలే అందుకున్న ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచి రాహుల్.. అమ్మ మాట నిలబెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఏకంగా బిగ్బాస్ టైటిల్ కావాలని ఆమె రాహుల్ అభిమానులను కోరుతోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. రాహుల్ మంచితనం, నిజాయితీ, ముక్కుసూటి మాటలను మెచ్చి ఇక్కడిదాకా తీసుకొచ్చారు. మిగిలిన రెండురోజుల్లోనూ మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్ను గెలిపించమని కోరింది. మరి చిచ్చా(రాహుల్) ఫ్యాన్స్ అమ్మ మాట నెరవేరుస్తారో లేదో చూడాలి! -
బిగ్బాస్ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి
మూడు రోజుల్లో బిగ్బాస్ షోకు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే వంద రోజులు పూర్తవడంతో ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగిన జర్నీని వీడియో ద్వారా చూపించాడు. మొదటగా వరుణ్ను యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్బాస్ అతని గ్రాఫ్ను, ప్రేక్షకుల అభిప్రాయాలను క్షుణ్ణంగా వివరించాడు. బిగ్బాస్ ఇల్లు ఆనందంగా ఉండేందుకు వరుణ్ ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. ప్రేక్షకులు వరుణ్ను ‘మిస్టర్ కూల్, ప్రాబ్లమ్ సాల్వర్, మిస్టర్ పర్ఫెక్ట్’ అని ప్రేమగా పిలుస్తారని బిగ్బాస్ తెలిపారు. మీ మానసిక శక్తే మీ బలం అని చెప్తూ హౌస్లో ఇప్పటివరకు సాగిన జర్నీని చూపించాడు. వీడియో చూస్తూ వరుణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. రాహుల్ను చూసి గర్వించిన బిగ్బాస్.. అనంతరం రాహుల్ వెళ్లగా.. ఇంట్లో మీ ప్రయాణం ఎలాంటి అంచనాలు లేకుండా సాగింది అని పేర్కొన్నాడు. ‘టాస్క్ల్లో మొదట నిరుత్సాహంగా ఆడటంతో నిన్ను ఇంటి సభ్యులు చాలాసార్లు నామినేట్ చేశారు. బహుశా.. మిగతా వాళ్లలా మీ మనసుకు గేమ్ ఆడటం తెలియదేమో.. అందుకే ఆటలో వెనుకబడ్డార’ని చెప్పుకొచ్చాడు. మీ స్నేహితుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచారని ప్రశంసించాడు. అన్నింటికీ మించి పెద్ద ఊరట కలిగించింది మీ స్నేహమని తెలిపాడు. ప్రేక్షకులకు మీరేంటో తెలుసు, ఏం చేయగలరో తెలుసు. అందుకే నామినేషన్లో ఉన్న ప్రతీసారి మీకు అండగా నిలిచారని గుర్తు చేశాడు. బిగ్బాస్ హౌస్లో మీరు ఎదిగిన తీరు చూసి గర్వపడుతున్నానని బిగ్బాస్ పేర్కొన్నాడు. కాస్త ఎమోషనల్ అయిన రాహుల్ వెంటనే తేరుకుని బిగ్బాస్కు కృజ్ఞతలు తెలిపాడు. కన్నీళ్లు పెట్టుకున్న బాబా భాస్కర్.. ఆ తర్వాత బాబా భాస్కర్ యాక్టివిటీ ఏరియాలోకి ప్రవేశించాడు. ‘బాబా భాస్కర్.. ఈ పేరు వింటే డాన్స్ మాత్రమే గుర్తొచ్చేది.. కానీ ఇప్పుడు వినోదం గుర్తుకు వస్తుంది. మీరు ప్రతీ ఇంటి సభ్యుల మనసు గెలుచుకున్నారు. మీరు చేసిన వంటలు, పంచిన నవ్వులు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. చిన్నపిల్లాడిలా అల్లరి చేసినప్పటికీ ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు పెద్ద మనిషి పాత్ర పోషించి అందరి బాగోగులు చూసుకున్నారు. బిగ్బాస్ను గురువుగారు అని సంభోధించిన తీరు బిగ్బాస్ మనసు గెలుచుకుంది. అందరినీ నవ్వించే మీరు కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. గుండెలో బాధ ఉన్నా పైకి చిరునవ్వుతోనే ఇంతదూరం వచ్చారు’ అని అభినందనలు తెలిపాడు. కాగా బిగ్బాస్.. బాబాకు ‘సూపర్స్టార్ ఆఫ్ ద హౌస్’ బిరుదు ఇచ్చాడు. తన జర్నీ వీడియో చూసిన బాబా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఎమోషనల్ అయితే ఇంటి సభ్యులు తప్పుపడుతున్నారని దిగులు చెందాడు. తాను చాలా సెన్సిటివ్ అని చెప్పుకొచ్చాడు. ఇక మిగతా హౌస్మేట్స్ జర్నీ వీడియోలు నేటి ఎపిసోడ్లో ప్రసారం కానున్నాయి! -
బిగ్బాస్ : ‘పునర్నవి చేసింది ఎవరికీ తెలీదు’
బిగ్బాస్ తెలుగు సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి లవ్ ట్రాక్ గురించి తెలియని వారుండరు. టాస్క్లు ఆడటం చేతకాదు అని పేరు తెచ్చుకున్న రాహుల్.. పునర్నవిని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగి తనపై ఉన్న ప్రేమను నిరూపించుకున్నాడు. ఇక పదకొండో వారం.. పునర్నవి ఎలిమినేట్ అయినపుడు రాహుల్ వెక్కివెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి మధ్య ప్రేమరాగాల్ని గుర్తు చేయడానికి ఓ కారణముంది. నిన్నటి (ఆదివారం)ఎపిసోడ్లో ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయ దేవరకొండ బిగ్బాస్ షోలో సందడి చేశాడు. ఈ క్రమంలో కన్ఫెషన్ రూమ్లో ఉన్న విజయ్ దగ్గరకు ఒక్కో ఇంటి సభ్యుడు వచ్చి ‘రహస్య భేటీ’లో పాల్గొన్నారు. ఈ టాస్క్ ఉద్దేశం.. బిగ్బాస్ హౌజ్లో ఇంతవరకు ఎవరితో షేర్ చేసుకోని ఒక రహస్యాన్ని కంటెస్టెంట్లు విజయ్తో పంచుకోవాలి. దాదాపు ఇంటి సభ్యులంతా సీక్రెట్స్ చెప్పలేక దాటవేసే సమాధానాలే ఇచ్చారు. కానీ, రాహుల్ మాత్రం నిర్మొహమాటంగా ఓ సీక్రెట్ను బయట పెట్టాడు. కెమెరాలకు కూడా చిక్కని రహస్యాన్ని నిన్నటి ఎపిసోడ్లో విజయ్తో చెప్పాడు. రాహుల్ మాట్లాడుతూ.. ‘తనకోసం కాకరకాయ జ్యూస్లు తాగినపుడు పునర్నవి నన్ను ముద్దుపెట్టుకోవడమే అందరికీ తెలుసు. మీకు తెలియని విషయమేంటంటే ఒకసారి కోపంలో ఆమె నా చేయి కొరికి, పారిపోయింది’ అని ఆ రహస్యాన్ని బహిర్గతం చేశాడు. దీనికి నాగార్జున కౌంటర్ వేశాడు. ‘వితిక.. కితకితలు పెడితే గిల్లిందని రాద్ధాంతం చేశావు. కానీ, పునర్నవి చేయి కొరికినా కూడా ఏమీ అనలేదు’ అని రాహుల్ను ఆటపట్టించాడు. ఇక రాహుల్, పున్నూ మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. -
షాకింగ్, రాహుల్ బండబూతుల వీడియో
రాహుల్ సిప్లిగంజ్.. నోటి దురుసుతో ఫేమస్ అయిన వ్యక్తి. అతని నోటికి అడ్డూఅదుపు ఉండదు. ఇంట్లో రాహుల్తో గొడవపడని వ్యక్తి లేడంటే అర్థం చేసుకోవచ్చు. అతని కోపం వల్ల స్నేహితులతోనే వైరాలు ఏర్పడ్డ సంఘటనలు కోకొల్లలు. ఇక హౌస్లో ముందు నుంచీ టాస్క్ల్లో పెద్దగా కష్టపడకపోయినా. ఫైనల్ దగ్గరపడుతుండటంతో ఇప్పుడిప్పుడే ఆటలో తానేంటో నిరూపించుకుంటున్నాడు. టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్గా తన పేరును లిఖించుకున్నాడు. బయట సింగర్గా ఉన్న పేరు కన్నా.. బిగ్బాస్ హౌస్లో అందరూ రాహుల్ను కార్నర్ చేయడంతో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్బాస్ చివరి వారంలో ప్రేక్షకులు వేసే ప్రతీ ఓటు వారి గెలుపుకు దారులు నిర్మిస్తాయి. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ ఇమేజ్ను దెబ్బతీసే షాకింగ్ వీడియో బయటకొచ్చింది. ఇందులో రాహుల్.. బిగ్బాస్ 1 సీజన్ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ పాడిన మంగమ్మ పాటను బిగ్బాస్ హౌస్లో నిర్వాహకులు ప్లే చేశారు. అయితే, ఇదేం పాట అంటూ కొంతమంది ఇంటి సభ్యులు చులకనగా మాట్లాడారు. దీనిపై రాహుల్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. హౌస్మేట్స్ను బండబూతులు తిట్టాడు. తన పాటను కించపరిచిన వాళ్లను ఉద్దేశిస్తూ.. ఒకసారి వెళ్లి అద్దంలో మొహం చూసుకోండి అని వ్యంగ్యంగా విమర్శించాడు. ‘నా సాంగ్ను చిల్లర పాట అంటున్నారు.. వారి జీవితంలో అలాంటి అచీవ్మెంట్ ఉందా’ అని వెటకారంగా మాట్లాడాడు. ప్రతీ వాక్యంలో బూతులను జోడిస్తూ అసభ్యంగా మాట్లాడాడు. బండబూతులతో నిండిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటువంటి వ్యక్తికి బిగ్బాస్ విన్నర్గా నిలిచే అర్హతా ఉందా అంటూ నెటిజన్లు రాహుల్ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఫైనల్కు సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉన్న సమయంలో ఈ వీడియో రాహుల్ ఓట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది. మరి దీన్ని రాహుల్ అభిమానులు ఏ విధంగా ఖండిస్తారో చూడాలి! Ilanti vaadu Bigg boss winner aithey votes vesey vaallanu emanalo. Idhi kooda edho okati cheppi cover cheskuntara ? 😠😠🤔 Please retweet to share about this sadistic guy. #BiggBoss3Telugu #biggbosstelugu3 #RahulSipligunj #BabaBhaskar #VarunSandesh#srimukhi #BiggBossTelugu pic.twitter.com/Ny4b1lzI2j — Manoj Kumar (@ManojKu49243561) October 26, 2019 -
చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్
బిగ్బాస్ నామినేషన్ ప్రక్రియలో ‘టికెట్ టు ఫినాలే’ ట్విస్టులతో కొనసాగింది. ఇక ఇంటి సభ్యులు నువ్వా నేనా అన్న రీతిలో తలపడ్డప్పటికీ గెలుపు రాహుల్ సొంతం అయింది. ఇది మిగతా ఇంటి సభ్యులకు మింగుడు పడటంలేదు. టాస్క్లు ఆడడు.. అన్న అపనింద తెచ్చుకున్న రాహుల్ ఈ దెబ్బతో తనేంటో నిరూపించుకున్నాడా! , అసలు ‘టికెట్ టు ఫినాలే’ రాహుల్కు పొరపాటున వచ్చిందా? ఈ గెలుపు కొద్దిపాటిదేనా, లేక అదే ఊపుతో టైటిల్ కొట్టేయడానికి పావులు కదుపుతాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. గేమ్లో అప్పటివరకూ ఆధిక్యతను కనబర్చిన అలీని.. టాప్ 5 అంటూ ఆటపట్టించిన ఇంటి సభ్యులకు రాహుల్ విజయంతో నోటమాట రాలేదు. ఈ గేమ్లో రాహుల్ ప్రదర్శన చూసినట్టయితే.. టాస్క్ ప్రారంభంలోనే అదృష్టం అతనికి కలిసొచ్చింది. అతను ఎంచుకున్న కార్డులో 50 శాతం అని రాసి ఉండగా దానితోనే ఆటను మొదలుపెట్టాడు. మొదటగా.. వరుణ్, రాహుల్ టాస్క్ ఆడాల్సి రాగా వాళ్లు కొట్టుకుంటున్నారేమో అన్నట్టుగా వీరోచితంగా పోరాడారు. కానీ విజయం రాహుల్నే వరించింది. ఈ టాస్క్లో తన బ్యాగు కూడా రాహుల్కే ఇస్తూ వరుణ్ మరోసారి ఫ్రూట్ అని నాగార్జున చెప్పిన మాటలను నిజం చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అలీ, బాబా ఆడిన పూల టాస్క్ ఎంత హింసాత్మకంగా మారుతుందో బిగ్బాస్ హెచ్చరిస్తూనే వచ్చాడు. అయినప్పటికీ అలీ బాబాపై అదును చూసి దాడి చేయడం, తోయడం వంటి హింసకు పాల్పడటంతో అతన్ని రేస్ నుంచి తప్పిస్తున్నట్టు బిగ్బాస్ ప్రకటించాడు. దీంతో అలీ విజయానికి అడుగుదూరంలో ఆగిపోయాడు. అలీ అనర్హుడిగా తేలడంతో రాహుల్కు టికెట్ గెలుచుకునే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. దీంతో రాహుల్ మరీంతగా శ్రమించాడు. మరో టాస్క్లో బద్ధ శత్రువైన శ్రీముఖితో రాహుల్ తలపడ్డారు. దీంతో శ్రీముఖి పెట్టిన కార్డ్లు గాలికి కూలిపోగా రాహుల్ పెట్టిన కార్డ్లు నిటారుగా ఉండటంతో అతను విజేతగా నిలిచాడు. ఒకవేళ అలీ పూల టాస్క్లో గెలుచుంటే రాహుల్ ఫినాలే టికెట్ దక్కించుకోవటం కష్టతరమయ్యేది. ఎలాగైతేనేం.. రాహుల్ గెలుపును ముద్దాడాడు. ఈ సీజన్లో ఫైనల్కు వెళ్లిన మొదటి కంటెస్టెంట్గా తన పేరును లిఖించుకున్నాడు. దీంతో చిచ్చా(రాహుల్) ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అమ్మ మాట నిలబెట్టాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టైగర్ టైమ్ స్టార్టయింది అంటూ పంచ్ డైలాగ్లు విసురుతున్నారు. టాస్క్లు ఆడడు.. లేజీ అంటూ మూకుమ్మడిగా దాడి చేసిన వారికి మీమ్స్తో తగిన సమాధానమిస్తున్నారు. కింద ఇచ్చిన కొన్ని మీమ్స్పై మీరూ ఓ లుక్కేయండి. -
బిగ్బాస్: ఫైనల్కు రాహుల్, అలీకి బిగ్ షాక్
బిగ్బాస్ ప్రవేశపెట్టిన నామినేషన్ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠకరంగా సాగింది. టికెట్ టు ఫినాలే రేసులో గెలుపు కోసం ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. ఇక పూల టాస్క్లో అలీ రెజా, బాబా భాస్కర్ల ఫైట్ సినిమాల్లోని పోరాట ఘట్టాలకు ఏమాత్రం తీసిపోనిదిగా ఉంది. టాస్క్లో భాగంగా.. అలీ బాబాను తోసెస్తూ మట్టి పాత్ర దరిదాపుల్లోకి కూడా రానీకుండా విశ్వప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిని ఒకరు తోసుకుంటూ బల ప్రదర్శన చూపించారు. దీంతో బిగ్బాస్ హింసకు తావలేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అయినప్పటికీ వినిపించుకోని అలీ.. బాబాను తలతో గుద్దుతూ కిందపడేశాడు. దీంతో బిగ్బాస్ ఈ టాస్క్ను రద్దు చూస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హింసకు పాల్పడ్డ అలీని టికెట్ టు ఫినాలే రేసుకు అనర్హుడిగా ప్రకటించాడు. దీంతో వీరోచితంగా పోరాడిన అలీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. అప్పటివరకూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన అలీకి బిగ్ షాక్ తగిలినట్టయింది. చిచా గెలుపు... అనంతరం బెల్ మోగించిన రాహుల్, శ్రీముఖి తలపడ్డారు. వారికిచ్చిన డామినోస్ (కార్డ్స్)లను వరుస క్రమంలో నిలబెట్టాల్సి ఉంటుందని బిగ్బాస్ తెలిపాడు. ఈ టాస్క్లో రాహుల్కు అలీ సహాయం చేయగా శ్రీముఖి ఒంటరి పోరాటం చేసింది. కానీ వీరి ఆటకు గాలి ఆటంకం కలిగించడంతో శ్రీముఖి పెట్టిన కార్డ్స్ అన్నీ పడిపోగా రాహుల్వి మాత్రం నిటారుగా ఉండటంతో అతను గెలిచాడు. ఓటమితో శ్రీముఖి తీవ్ర నిరాశ చెందినట్టు కనిపించింది. అనంతరం బజర్ మోగినపుడు గంట కొట్టిన శ్రీముఖి, శివజ్యోతిలకు క్యూబ్స్తో పిరమిడ్లు నిర్మించాల్సిన టాస్క్ ఇవ్వగా ఇందులో రాములమ్మ విజయం సాధించింది. కాగా అప్పటికే ఆధిక్యంలో ఉన్న రాహుల్ను ఇంటి సభ్యులెవరూ అందుకోలేకపోయారు. నామినేషన్ టాస్క్లో అలీ, వరుణ్ 0, శివజ్యోతి, శ్రీముఖి.. 10, బాబా భాస్కర్.. 20, రాహుల్.. 40 శాతం బ్యాటరీని సాధించారు. అధిక బ్యాటరీతో ముందంజలో ఉన్న రాహుల్ నామినేషన్ నుంచి సేఫ్ అవడంతోపాటు ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నాడు. మిగిలిన అయిదుగురు ఇంటి సభ్యులు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. కాగా ఈ సీజన్లో మొదటి ఫైనలిస్టు అయిన రాహల్ కోసం బిగ్బాస్ చాక్లెట్లు పంపించి పండగ చేసుకోమన్నాడు. -
రాహుల్ది ఫేక్ రిలేషన్షిప్ : వితికా
పదమూడో వారానికిగానూ వితికా ఎలిమినేట్ అవడంతో వరుణ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక్కడో చిన్న ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వితికా హౌస్ను వీడేముందు జాగ్రత్తగా మాట్లాడమని చెప్తూ శ్రీముఖి ఆమె చెవిలో గుసగుసలాడింది. అనంతరం బయటకు వచ్చిన వితికాతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్మేట్స్ ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొట్టి వారికి చెప్పాలనుకునేటివి ఏమైనా ఉంటే చెప్పాలన్నాడు. ఈ సమయంలో వితికా తన మనసులో ఉన్న భావాలన్నింటినీ నిర్మొహమాటంగా వెల్లడించింది. తను బయటకు రావడానికి కారణం శివజ్యోతి అని బల్లగుద్ది చెప్పింది. లేకపోతే షో చివరిదాకా ఉండేదాన్నేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. శివజ్యోతి తనకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వితికా అంగీకరించింది. ‘నాకన్నా ఒక స్టెప్పు ఎక్కువే నువ్వు. అది నేను ఒప్పుకుంటున్నా’నంటూ శివజ్యోతికి తెలిపింది. కాగా వరుణ్.. శివజ్యోతి కన్నా వితికా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ నామినేషన్లో తన స్థానాన్ని భార్యకు ఇచ్చేసిన విషయం తెలిసిందే! అయితే ఇప్పుడు వితికా.. శివజ్యోతే తనకన్నా స్ట్రాంగ్ అని ఒప్పుకోవటం గమనార్హం. ఇక ఎవరి గురించి చెడుగా చెప్పాలనుకోడవం లేదంటూనే రాహుల్కు చురకలంటించింది. ‘నామినేషన్ తర్వాత నుంచి మాతో దూరంగా ఉంటున్నావు. మాతో నువ్వు ఫేక్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నావేమో’ అని అనుమానంగా ఉందని చెప్పుకొచ్చింది. దూరంగా ఉన్నంతమాత్రాన ఫేక్ రిలేషన్ కాదని రాహుల్ తిరుగు సమాధానమిచ్చాడు. అనంతరం ‘అలీ ఉండాలి, నేను వెళ్లిపోవాలనుకున్నాను’ అన్న విషయాన్ని వితికా వెల్లడించింది. ‘ఎలిమినేట్ అయి వెళ్లిపోవటం, తిరిగి రావటం నీ తప్పు కాదు’ అంటూ అలీకి ధైర్యం నూరిపోసింది. బాబా భాస్కర్తో.. మా ఆయనను జాగ్రత్తగా చూసుకోండి, తనకు ఒక దోసె కూడా ఎక్కువగా ఇవ్వండి అని ఆర్డర్ వేసింది. చివరగా వరుణ్, శ్రీముఖిల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొట్టడానికి చాలాసేపు తటాపటాయించింది. వరుణ్ ఏడ్చినందుకుగానూ అతని బెలూన్ను పగలగొట్టింది. శ్రీముఖిని కరెంట్తో పోల్చుతూ ఆమె అసలు అలసిపోదని ఎప్పటికీ ఎనర్జెటిక్గా ఉంటుందని వితికా ప్రశంసించింది. -
బిగ్బాస్: ఫైనల్కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?
భీమవరం అమ్మాయి వితికను పంపించడంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. బిగ్బాస్ షో ముగింపుకు వస్తుండటంతో హౌస్లో టాస్క్లు మరింత కఠినతరం కానున్నాయి. దీంతో ఇంటి సభ్యుల మధ్య రసవత్తర పోరు సాగనుంది. మరోపైపు పద్నాలుగో వారానికి ఎవరు నామినేట్ అవుతారు అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి బిగ్బాస్ నామినేషన్ ప్రక్రియను కాస్త భిన్నంగా చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిగ్బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్బాస్ షో ఫైనల్కు ఇంటి సభ్యుల్లో ఒకరిని నేరుగా పంపే అవకాశాన్ని ఇచ్చాడు. దీనికోసం ఇంటి సభ్యులతో టాస్క్ ఆడించనున్నాడు. ఇందులో గెలిచే ఏకైక వ్యక్తికి టికెట్ టు ఫినాలే దక్కనున్నట్లు బిగ్బాస్ ప్రకటించాడు. ఫైనల్ బెర్తు కోసం వరుణ్, రాహుల్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ‘నా గేమ్ కూడా నువ్వే ఆడు’ అంటూ వెళ్లేపోయే ముందు వితిక ఇచ్చిన సలహాను వరుణ్ ఆచరణలో పెట్టినట్లు కనిపిస్తోంది. టాస్క్లో భాగంగా వరుణ్.. రాహుల్తో తలపడుతున్నాడు. ఈ క్రమంలో టాస్క్ హింసాత్మకంగా మారినట్టు కనిపిస్తోంది. ఫైనల్గా టికెట్ ఎవరు గెలుచుకున్నారు? అందుకోసం ఇంటి సభ్యులకు ఎలాంటి టాస్క్ ఇచ్చారు? టాస్క్ హింసాత్మకంగా మారిందా అన్న విషయాలు తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే! "Ticket To Finale" evaru geluchukuntaru??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/srVrxbrxGn — STAR MAA (@StarMaa) October 21, 2019 -
బిగ్బాస్: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్
బిగ్బాస్ షో రంజుగా మారింది. లీకువీరులు చెప్పినట్టుగానే తొంభై రోజుల భార్యాభర్తల బంధాన్ని బిగ్బాస్ విడగొట్టాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటూ ట్విస్ట్ ఇచ్చినప్పటికీ ఎపిసోడ్కు వచ్చేసరికి అది ఉసూరమనిపించింది. నాగార్జున ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్లు ఆడించాడు. మీకు సూటబుల్ అనిపించే పాటలను డెడికేట్ చేసుకోమని నాగ్ సూచించగా.. ఇంటి సభ్యులు దొరికిందే చాన్స్ అన్నట్టుగా రెచ్చిపోయారు. అలీ బిల్లా టైటిల్ సాంగ్తో, శ్రీముఖి.. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, వితిక.. అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను, రాహుల్.. ఈ పేటకు నేనే మేస్త్రిని, బాబా భాస్కర్.. జులాయి టైటిల్ సాంగ్, వరుణ్.. ఘర్షణ చిత్రంలోని రాజాది రాజా పాటలతో వాళ్లను పరిచయం చేసుకుంటూ స్టెప్పులేశారు. అందరికన్నా హైలెట్గా శివజ్యోతి డాన్స్ నిలిచింది. చందమామ ఒకటే సరదాగా అన్న పాటకు చిందేసిన శివజ్యోతికి ఇంటి సభ్యులతోపాటు నాగార్జున సైతం ఫుల్ మార్కులు వేశాడు. అనంతరం శివజ్యోతి సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. తర్వాత హౌస్మేట్స్తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. కళ్లకు గంతలు కట్టి వరుణ్, వితికలను బంతులతో ఒకరినొకరిని కొట్టుకోమన్నారు. వితిక తన కసితీరా భర్తను కొట్టింది. శివజ్యోతికి కళ్లకు గంతలు కట్టి గాడిద బొమ్మకు తోక పెట్టమంటే సునాయాసంగా దాన్ని అతికించేసింది. రాహుల్, అలీ రెజాలకు బాక్సింగ్ గ్లౌజ్లు ఇచ్చి కళ్లకు గంతలు కట్టి కొట్టుకోమని ఆదేశించాడు. వాళ్లు తెగ కొట్టుకుంటున్నట్టుగా బాగా నటించారు. శ్రీముఖి చుట్టూ నీళ్లగ్లాసులు పెట్టి డాన్స్ చేయమని టాస్క్ ఇచ్చాడు. అయితే తను కళ్లకు గంతలు కట్టుకుని డాన్స్ చేస్తుండగా మిగతా హౌస్మేట్స్ ఆమెకు మరింత దగ్గరగా గ్లాసులు జరపడంతో కష్టపడి చేసిన డాన్స్ అంతా నీటిపాలు అయింది. బాబా కళ్లకు గంతలు కట్టుకున్న సమయంలో ఇంటి సభ్యులు అతన్ని గిచ్చాలి. అయితే బాబా.. శ్రీముఖి తప్ప మిగిలిన గిచ్చిన వ్యక్తుల పేర్లను సరిగ్గా చెప్పలేకపోయాడు. అనంతరం అలీ సేవ్ అయినట్టుగా నాగ్ ప్రకటించాడు. చివరగా నాగార్జున వితిక ఎలిమినేటెడ్ అని ప్రకటించగానే తను మా ఆయన సేఫ్ అంటూ కేరింతలు కొట్టింది. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఎంతో సేపు దాచలేకపోయింది. వరుణ్ కూడా భార్యను పట్టుకుని బోరున ఏడ్చాడు. మా ఆయన జాగ్రత్త అంటూ ఇంటి సభ్యులకు ఒకటికి పదిసార్లు చెప్తూ వీడ్కోలు తీసుకుంది. వరుణ్ తన అర్ధాంగిని కన్నీళ్లతో సాగనంపాడు. స్టేజిపైకి వచ్చిన వితికతో నాగ్ ఆసక్తికర టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా ఇంటి సభ్యుల ఫొటోలు ఉన్న బెలూన్లను పగలగొడుతూ వారికి సూచనలు ఇచ్చింది. కానీ శ్రీముఖిని చూడగానే మన మొహంలో నవ్వు వస్తుంది అంటూ ఆమె ఫొటో ఉన్న బెలూన్ పగలగొట్టలేదు. తను ఎలిమినేట్ అవడానికి శివజ్యోతే కారణమని చెప్పుకొచ్చింది. ఇక చివరగా బిగ్బాస్ ఆపమని చెప్పేవరకు ఒక్కరే బాత్రూంలు కడగాలన్న బిగ్బాంబ్ను రాహుల్పై వేసింది. -
బిగ్బాస్: ఆ ముగ్గురు సేఫ్..!
బిగ్బాస్ ఇంట్లో చూస్తుండగానే తొంభై రోజులు గడిచిపోయాయి. ఇక వీకెండ్లో వచ్చిన నాగార్జున ఇంటిసభ్యుల గొడవలను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అనంతరం వారితో.. చిచ్చు రేపిన నామినేషన్ టాస్క్నే మళ్లీ ఆడించడం ఆసక్తి రేపింది. ఇంట్లో తమ స్థానాలను తెలిపే నెంబర్స్ను ఎంచుకోమనగా శ్రీముఖి, శివజ్యోతి 1, అలీ రెజా..2, బాబా భాస్కర్, వితిక..3, రాహుల్..4, వరుణ్ 7 స్థానాలను ఇచ్చుకున్నారు. ఇక శ్రీముఖి, రాహుల్ల లొల్లి మళ్లీ మొదలైంది. బిగ్బాస్ షోకు తనను శ్రీముఖే రికమెండ్ చేసిందని చెప్పుకుంటోందని రాహుల్ నాగార్జున దగ్గర వాపోయాడు. వితిక తనకీ విషయం చెప్పిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ‘రికమెండ్ చేయడానికి నేనెవర్ని.. అసలు ఆ మాటే అనలేదు’ అని శ్రీముఖి కరాఖండిగా చెప్పింది. దీనిపై నాగార్జున వితికను ప్రశ్నించగా తాను అలా చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ విషయంపై రాహుల్ ఎంతకూ వెనక్కు తగ్గలేదు. తాను చెప్పింది అబద్ధం అని తేలితే తక్షణమే షో నుంచి వెళ్లిపోతానంటూ శపథం చేశాడు. మీ మధ్య మిస్ కమ్యూనికేషన్ జరిగింది అంటూ నాగ్ ఈ విషయాన్ని పక్కన పెట్టేశాడు. ఇక ఇంటి సభ్యులతో కాకుండా వారి కుటుంబ సభ్యులతో నాగ్ టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా వచ్చిన వాళ్లు ఇంట్లో ఎవరు చివరి స్థానాల్లో ఉన్నారని చెప్పమనగా మెజారిటీ సభ్యులు అలీ, వితికలు వెళ్లిపోవాలనుకుంటున్నట్టుగా ప్రకటించారు. వచ్చిన బంధువులు ఇంటి సభ్యుల కోసం గిఫ్ట్లు తీసుకుచ్చారు. శ్రీముఖి తండ్రి రామకృష్ణ రాములమ్మను బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు. ఆమె కోసం తెచ్చిన టెడ్డీబేర్ గిఫ్ట్ను రాహుల్ ఓపెన్ చేయగా.. అతని చేతుల మీదుగా శ్రీముఖి సేవ్ అయింది. శివజ్యోతి అక్క స్వప్న నాగార్జునను చూసి సర్ప్రైజ్ అయింది. ఇక వితిక తల్లి తన అల్లుడే ఎక్కువ మంచోడంటూ వరుణ్కు ఓటు వేసింది. వితికను చూడగానే ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు. బిగ్బాస్ అయిపోయాక ఇంటికి వస్తే అందరికీ భీమవరం వంట చేసిపెడతానని ఆఫర్ ఇచ్చింది. అనంతరం అలీ స్నేహితుడు యాంకర్ రవి షోలో పంచ్లు పేల్చుతూ ఎంటర్టైన్ చేశాడు. శ్రీముఖిని బాగా మిస్ అవుతున్నానని రవి చెప్పుకొచ్చాడు. రాహుల్ మిత్రుడు.. సింగర్ నోయెల్ వచ్చి అతనిలో కొత్త హుషారును నింపాడు. ఇక నుంచి రాహుల్ 2.0 చూడాలని కోరాడు. బిగ్బాస్ టైటిల్ కొట్టాలంటూ రాహుల్ కోసం ఉరకలెత్తించే పాట పాడాడు. అనంతరం ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ అక్క శోభన కాస్త ఎమోషనల్ అవుతూనే, బాబా మంచివాడంటూ చెప్పుకొచ్చింది. అనంతరం అలీ చేతుల మీదుగా బాబా సేవ్ అయ్యారు. షోకు వచ్చిన గెస్ట్లు ఎక్కువమంది అలీ, వితికలు టాప్ 5లో ఉండే అర్హత లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. శ్రీముఖి, రాహుల్ ,బాబా భాస్కర్ సేఫ్ అయ్యారు. మరి మిగిలిన నలుగురిలో బయటకు వెళ్లేది వితికేనా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
బాబా భాస్కర్ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్
బిగ్బాస్ ఇంట్లోకి ఏడుగురు అతిథులు వచ్చారు. ఇంటి సభ్యులు వారికి సకల మర్యాదలు చేసి ఏడు స్టార్లను సంపాదించుకున్నారు. అయితే వచ్చిన అతిథుల్లో మెజారిటీ జనాలు వరుణ్ బామ్మ అదుర్స్ అంటున్నారు. తన కామెడీ టైమింగ్తో, పంచులతో హుషారెత్తించింది అంటూ బామ్మకు జై కొడుతున్నారు. ఇక రాహుల్ తల్లి సుధారాణి.. తన కొడుకుకు, శ్రీముఖికి మధ్య ఉన్న గొడవలను ఏమాత్రం పట్టించుకోకుండా రాములమ్మ అల్లరి ఎంతో ఇష్టమని పాజిటివ్గా మాట్లాడింది. ఇక చివరగా శ్రీముఖి.. తన తల్లిని కలుసుకోడానికి ఆమెను బిగ్బాస్ మూడు చెరువుల నీళ్లు తాగించాడు. శ్రీముఖి తల్లి లత ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోగా శ్రీముఖి గుండె పగిలేలా రోదించింది. ఇన్ని ట్విస్టుల మధ్య మళ్లీ ఆమె ఇంట్లోకి ప్రవేశించగా రాహుల్ను కాస్త సున్నితంగానే హెచ్చరించింది. మరోవైపు శ్రీముఖి లేనిదే బిగ్బాస్ హౌస్ లేదంటూ ఆమెను ఆకాశానికి ఎత్తింది. రాహుల్ తల్లి అంత పాజిటివ్గా మాట్లాడితే శ్రీముఖి తల్లి మాత్రం అలా రాహుల్ను వేలెత్తి చూపడం ఏం బాగోలేదంటూ కొంతమంది ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే నిన్నటి ఎపిసోడ్లో బాబా భాస్కర్ ప్రవర్తించిన విధానం ఏమీ బాగోలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అతని తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. శ్రీముఖి తల్లి లతను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఆమెను హగ్ చేసుకోడానికి అన్నట్టుగా బాబా భాస్కర్ దగ్గరికెళితే శివజ్యోతి ఆయనను పక్కకు లాక్కెళ్లింది. సిగ్గులేదా అంటూ బాబాను శివజ్యోతి తిట్టిపోసింది. పైగా బాబా శ్రీముఖి తల్లిని ఉద్దేశించి.. సేమ్ జిరాక్స్.. జై రామకృష్ణ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆమె కోసం వస్తా నీ వెనక.. అని పాటలు పాడటం వెగటు పుట్టించిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆమెకు మోకాళ్లపై కూర్చుని టీ ఇస్తూ అతిగా ప్రవర్తించడం చిరాకు పుట్టించదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. శ్రీముఖి ఆమె తల్లిని ఎత్తుకున్న సమయంలోనూ ‘ఏమైనా హెల్ప్ చేయాలా..’ అంటూ వెకిలిగా మాట్లాడటం ఆయన దిగజారిన కామెడీకి అద్దం పట్టాయని విమర్శిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో బాబా ప్రవర్తనను చూసిన నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అలాగే బాబా ప్రవర్తనకు ఇంటి సభ్యులు సైతం షాకైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు బాబా అభిమానులు మాత్రం ఇదంతా కేవలం కామెడీయే అని వెనకేసుకొస్తున్నారు. -
‘బిగ్బాస్ గారు.. మా ఇంటికి రండి’
బిగ్బాస్ పదమూడోవారం ఎమోషనల్ జర్నీగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు హౌస్మేట్స్ మిగిలారు. వీరు టీవీ, ఫోన్లను వదిలేసి, బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ 85 రోజులు కావస్తోంది. ఉన్నదల్లా హౌస్లో ఉన్నవారితోనే ఆటలు, పాటలు, అల్లరి పనులు, గొడవలు, వగైరా! ఏ ఎమోషన్ అయినా బిగ్బాస్ హౌస్లో ఉన్నవారితోనే పంచుకోవాలి, వారితోనే తెంచుకోవాలి. ఇక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ఇంటి సభ్యులకు బిగ్బాస్ స్వాంతన కలిగించారు. వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించారు. దీంతో కొద్ది నిమిషాలైనా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపే అవకాశం దక్కిందని హౌజ్మేట్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అదే సమయంలో వారు వచ్చి వెళ్లిపోతుంటే కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఇప్పటికే వితిక, అలీ రెజా, శివజ్యోతి, బాబా భాస్కర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వచ్చి పలకరించి వెళ్లిపోయారు. మా వాళ్లెప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్న రాహుల్, శ్రీముఖి, వరుణ్ల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. తాజా ప్రోమో ప్రకారం కన్ఫెషన్ రూమ్లో నుంచి రాహుల్ తల్లి అతన్ని పిలుస్తోంది. గతంలో అమ్మ గుర్తుకు వచ్చిందని ఏడ్చిన రాహుల్.. ఇప్పుడు అమ్మ కళ్లెదుటే ఉండటంతో సంతోషిస్తాడో, కన్నీటిపర్యంతం అవుతాడో చూడాలి. అలాగే వరుణ్ బామ్మ కూడా ఇంట్లోకి అడుగుపెట్టి సందడి చేసినట్టు కనిపిస్తోంది. అందరూ బామ్మ చుట్టూ చేరగా.. ఆమె బోలెడు కబుర్లను ఇంటి సభ్యులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ‘బిగ్బాస్.. మా ఇంటికి రావాలి’ అని ఇన్వైట్ చేయడంతో ఇంటి సభ్యులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఈ సరదా కబుర్లు చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! #Rahul & #Varun family visit to #BiggBossHotel#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/YwIButaZCU — STAR MAA (@StarMaa) October 17, 2019 -
ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్ ఇచ్చిన బిగ్బాస్!
బిగ్బాస్ ఇంట్లో పన్నెండోవారం ముగిసింది. మహేశ్ విట్టా ఎలిమినేట్ అవటంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. కాగా పదమూడోవారానికిగానూ జరిపిన నామినేషన్ ప్రక్రియ ‘టాపర్ ఆఫ్ ద హౌస్’ ఇంట్లో బీభత్సాన్ని సృష్టించింది. టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులు.. వారు తీసుకున్న చిట్టీలో ఉన్న నెంబర్ల స్థానంలో నిలబడాలని బిగ్బాస్ ఆదేశించాడు. అయితే వారు చర్చలు జరుపుకుని తమతమ స్థానాలను మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. బజర్ మోగిన తర్వాత చివరి నాలుగు స్థానాల్లో ఉన్నవారు నామినేట్ అవుతారని ప్రకటించాడు. మొదటగా.. బాబా భాస్కర్, రాహుల్, వరుణ్, అలీ రెజా, శివజ్యోతి, వితిక, శ్రీముఖిలు వరుసగా 1 నుంచి ఏడు స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం ఎందుకు టాప్ స్థానాల్లో ఉండాలనుకుంటున్నారో చెపుతూ ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. మొదట శ్రీముఖి.. రాహుల్పై ఫైర్ అయింది. ‘నువ్వు బాగా ఆడిన టాస్క్ ఒక్కటి చెప్పు’ అంటూ రాహుల్ను ప్రశ్నించింది. ‘అసలు నువ్వు ఏ టాస్క్ ఆడినవ్’ అంటూ రాహుల్.. శ్రీముఖికి ఎదురు తిరిగాడు. దీంతో చర్చ కాస్త రచ్చరచ్చగా మారింది. ఇక శ్రీముఖి.. రాహుల్తో పెట్టుకుంటే అయ్యే పని కాదని వదిలేసి బాబాను కాకాపట్టడానికి వెళ్లింది. అయితే అప్పటికే శ్రీముఖికి తన స్థానాన్ని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్న బాబా తన మొదటి స్థానాన్ని ఆమెకు కట్టబెట్టి వెళ్లి ఆఖరి స్థానంలో నిలుచున్నాడు. రాహుల్.. తనకన్నా అలీ బెస్ట్గా పర్ఫార్మ్ చేస్తాడని ఒప్పుకుంటూ అతనికి రెండో స్థానాన్ని ధారధత్తం చేశాడు. ఇక వరుణ్.. అతని మూడో స్థానాన్ని వితికకు ఇవ్వడంపై శివజ్యోతి అభ్యంతరం వ్యక్తం చేసింది. కంటెస్టెంట్లుగా గేమ్ ఆడండి.. భార్యాభర్తలుగా కాదంటూ.. శివజ్యోతి ఆవేశంతో విరుచుకుపడింది. ఏదైతే అది అవుతుందంటూ వితిక సాధించుకున్న 3వ స్థానంలోకి వెళ్లి నిలబడింది. ఇక వరుణ్ కూడా కంట్రోల్ తప్పి శివజ్యోతిపై మాటల దాడి చేశాడు. ‘కంత్రీ ఆటలు ఆడకు.. నువ్వు కూడా నీ భర్త గంగూలీని తెచ్చుకోవాల్సింది’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో ఇంటి సభ్యుల చర్చ ఎంతకూ తెగేలా లేదని భావించిన బిగ్బాస్ అందరినీ నామినేట్ చేశారు. కాగా ఈ సీజన్లో ఇంటి సభ్యులు అందరూ నామినేషన్లో ఉండటం ఇదే మొదటిసారి. మరి నామినేషన్ హీట్ ఇంట్లో అలాగే కొనసాగుతుందా.. నేటి ఎపిసోడ్లో చల్లారిపోతుందా అనేది చూడాలి! -
ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: పునర్నవి
‘రాహుల్ సిప్లిగంజ్ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహబంధం. నేను రాహుల్తో ప్రేమలో ఉన్నానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. మా గురించి బయట వేరేలా మాట్లాడుకోవడం చూసి చాలా బాధేసింద’ని చెప్పింది బిగ్బాస్–3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన పునర్నవి శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ రెండున్నర నెలలు కుటుంబం, స్నేహితులను బాగా మిస్ అయ్యానని తెలిపింది. వైల్డ్కార్డు ఎంట్రీ అవకాశం వస్తే మాత్రం మళ్లీ ఆనందంగా వెళ్తానని పేర్కొంది. ఒకవేళ హౌస్లో ఉండి ఉంటే తప్పకుండా విన్నర్ అయ్యేదాన్నని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంది. ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు.. పదకొండు వారాలు.. పరిచయం లేని ముఖాల మధ్య ఉండటం.. ఫోన్ లేదు.. పుస్తకాల్లేవ్.. టీవీ లేదు.. కుటుంబ సభ్యులను కలవడానికి వీల్లేదు.. బిగ్బాస్–3 హౌస్లో ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వమున్న ఆమె రెండున్నర నెలల పాటు తన హావభావాలు, అందచందాలు, మాటతీరు, ఆటపాటలతో వీక్షకులను కట్టిపడేసింది. బిగ్బాస్ టాప్–5లో నిలుస్తానని భావించింది. ఓట్లు రాకపోవడమో, మాటతీరో, ముక్కుసూటితనమో తెలియదు గానీ మూడు వారాల ముందే ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్కార్డ్ ఎంట్రీ వస్తే మాత్రం మళ్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది బిగ్బాస్– 3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం. ఆమె ఇటీవల హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. బిగ్బాస్ హౌస్లో తన అనుభవాలు.. తోటి కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్తో స్నేహం తదితర అంశాలను ‘సాక్షి’తో పంచుకుంది. అవి ఆమె మాటల్లోనే.. - పురుమాండ్ల నరసింహారెడ్డి కుటుంబాన్ని మిస్సయ్యా.. రెండున్నర నెలలపాటు నా కుటుంబాన్ని, స్నేహితుల్ని బాగా మిస్సయ్యా. వచ్చేశావా అంటూ ఆనందంగా అంతా ఆలింగనం చేసుకున్నారు. నువ్వుండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్వని అన్నారు. వైల్డ్కార్డ్ ఎంట్రీ ఉండదేమోనని అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఆనందంగా వెళ్తాను. మూడు వారాల్లో ముగిసే సమయంలో ఎంట్రీ వస్తే నేను వెళితే మిత్రులు హ్యాపీగా ఫీలవుతారు. టైటిల్ విన్నర్ అయ్యేదాన్నేమో.. అలాగే ఉండి ఉంటే టైటిల్ విన్నర్ అయ్యేదాన్నేమో. టాప్– 5లో మాత్రం ఉండేదాన్నని అనుకుంటున్నా. ఇదొక జీవితానుభవం. 11 వారాలు 23 ఏళ్ల వయసులో అంతమంది మైండ్సెట్తో కలిసి ఉండటం గొప్ప విషయమే. వరుణ్, వితిక నామినేట్ చేసినప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాను. నామినేట్ చేసినా సరే నాకు కోపం రాలేదు. ఇప్పటికీ వారిద్దరిపై స్నేహభావమే ఉంది. ఎలిమినేట్ అయ్యేదాకా ఆ ముగ్గురితో స్నేహం బలంగా ఉండేది. నా కోసం రాహుల్ త్యాగం చేయడం బాధ కలిగించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. రెండున్నర నెలల బిగ్బాస్ షోలో ఉండటం ఓ చాలెంజ్. బయటికి రాగానే ముందుగా డేట్.. ఆ రోజు ఏమిటని అడిగా. ఫోన్ చూడగానే పాస్వర్డ్ మరిచిపోయా. ఆ తర్వాత మెసేజ్లు చూశా. చాలా మెసేజ్లు వచ్చాయి. బయటికి రాగానే ముందుగా డేట్ అండ్ టైమ్ అడిగాను. నా బాడీ, మైండ్ చెక్ చేసుకున్నా. ఇన్స్ట్రాగామ్లో చాలా సపోర్ట్ వచ్చింది. వరుణ్, వితిక, రాహుల్, నేను మంచి స్నేహితులం. బిగ్బాగ్ హౌస్లోకి వెళ్లాక మూడు వారాలు చాలా ఇబ్బందిపడ్డాను. రిజర్వ్గా ఉండేదాన్ని. మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. నా మైండ్సెట్కు తగినట్లుగా ప్రవర్తించడం మొదలెట్టాను. అందరితో సన్నిహితంగా మెలిగాను. ఒక కుటుంబంగా భావించి అందరితో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకున్నాను. అందులో ఈ ముగ్గురితో బాగా అనుబంధం ఏర్పడింది. అందులో పుస్తకాలు ఉండవు. ఫోన్లు ఉండవు. టీవీ ఉండదు. పత్రికలు ఉండవు. ఉండేదల్లా కథలు చెప్పుకోవడం, టాస్క్ల గురించి ఆలోచించడం. తప్పితే ఇంకో వ్యాపకం ఉండేది కాదు. చాలా ఎడిట్ చేసి గంట మాత్రమే ప్రసారం చేస్తారు. ఆ ముగ్గురు టాప్– 5లో ఉంటారు.. బిగ్బాస్– 3 టాప్– 5లో రాహుల్తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు హౌస్లో ప్రవర్తించిన తీరు, వారి హావభావాలు, కదలికల్ని దగ్గర్నుంచి చూశాను. ప్రస్తుతం చదువు, సినిమాలే.. నేను తెనాలిలో పుట్టి పెరిగాను. హైదరాబాద్లో చదువు పూర్తి చేశాను. విల్లామేరీ కాలేజీలో సైకాలజీ, జర్నలిజం చేశా. చదువులో ఉండగానే ‘ఉయ్యాల..జంపాల’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి నా సినిమా జర్నీ మొదలైంది. అమెరికాలో మా అక్క వద్ద ఉన్నప్పుడే బిగ్బాస్ సీజన్– 2లో అవకాశం వచ్చినా కుదరలేదు. ఆ తర్వాత బిగ్బాస్– 3లో అవకాశం వచ్చింది. ఇప్పుడు నా దృష్టంతా చదువు, సినిమాలపైనే. పెళ్లి ఆలోచన లేదు. ఒకవేళ నాకు నచ్చిన వ్యక్తి దొరికితే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారిని ఒప్పించి చేసుకుంటా. వారు వద్దంటే ఊరుకుంటా. వారు చూసిన సంబంధం కూడా ఇష్టమే. అయితే పెళ్లికి మరో ఐదారేళ్ల సమయముంది. అవకాశాలు వస్తున్నాయి.. ప్రస్తుతం సైకిల్, చిన్న విరామం సినిమాల్లో నటిస్తున్నాను. అర్జున్రెడ్డి డైరెక్టర్తో ఓ సినిమా అవకాశం వచ్చింది. కథలు వింటున్నాను. ప్రస్తుతం యాక్టింగ్, చదువుపైనే దృష్టి కేంద్రీకరించా. -
రాహుల్తో రిలేషన్షిప్.. పునర్నవి క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: బిగ్బాస్ హౌజ్లో సింగర్ రాహుల్తో తనకు ఉన్న అనుబంధంపై నటి పునర్నవి భూపాలం మరోసారి స్పందించారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ వస్తున్న రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు. ‘ బిగ్బాస్ హౌజ్లో రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్. నేను అతనితో ఎక్కువగా గొడవపడి ఉండాల్సింది కాదు. అందుకు బాధపడుతున్నా’ అని తెలిపారు. ‘మాది ప్యూర్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. కానీ, మొదట్లో కొన్ని వారాలు నేను రాహుల్తో అంత కంఫర్ట్బుల్గా లేను. అందుకే అతన్ని తిట్టేదానిని. నాకు దూరంగా ఉండమని చెప్పేదాన్ని. బయట ప్రపంచం మా ఫ్రెండ్షిప్ను ఎలా చూస్తుందోనని వర్రీ అయ్యేదానిని. కానీ, దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదని తర్వాత అర్థం చేసుకున్నా. ఆ తర్వాత మేం మరింత క్లోజ్ అయ్యాం’ అని పునర్నవి పేర్కొన్నారు. బిగ్బాస్ హౌస్లో లేడీ మోనార్క్గా పేరు తెచ్చుకున్న పునర్నవి గత వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె బయటకు రాగానే తన టీమ్ పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితిక, రాహుల్) ఫ్యాన్స్ అందరూ వరుణ్, రాహుల్కు ఓట్లు వేయాలని ప్రచారం చేపట్టారు. రాహుల్, తాను క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనని, ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా తాము మంచి మిత్రులని చెప్పారు. రాహుల్ టాప్ 5లో ఉండాలని తన కోరికను బయటపెట్టారు. ఇక, పునర్నవి కంటే రెండు వారాల ముందే ఎలిమినేట్ అయిన హిమజ.. తాజాగా పునర్నవి ఎలిమినేట్ కావడంతో ఎగిరిగంతేశారు. పునర్నవి ఎలిమినేట్ అయిందని నాగార్జున ప్రకటించగానే హిమజ టీవీ ముందుకు వచ్చి స్టెప్పులేశారు. ఈ మేరకు ఓ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. -
బిగ్బాస్: ‘బాబా సైకో.. రాహుల్ వేస్ట్’
బిగ్బాస్ పుట్టినరోజు వేడుకలు ముగింపుకు చేరుకున్నాయి. బిగ్బాస్ బర్త్డే సందర్భంగా.. బిగ్బాస్ నిద్రపోయే సమయంలో ఇంటి సభ్యులు నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు. పైగా బిగ్బాస్ ఇంటి సభ్యులకు కొన్ని టాస్కులను ఇస్తూ అవి కూడా సైలెంట్గా కానిచ్చేయాలని పేర్కొన్నాడు. అందులో భాగంగా అలీ, శ్రీముఖిని వీపుపై ఎత్తుకుని గార్డెన్ ఏరియాలో 20 రౌండ్లు తిరగాలి. వితిక, రాహుల్లు బెలూన్లకు షేవింగ్ ఫోమ్ రాసి క్లీన్గా షేవ్ చేయాలి. వరుణ్, శివజ్యోతిలకు ఇంటి సభ్యులు కితకితలు పెట్టాలి. మహేశ్ తలపై ప్లేట్ పెట్టుకుని గోడ కుర్చీ వేయాలి. బాబా భాస్కర్.. చేతులకు, కాళ్లకు వాక్స్ చేసుకోవాలని బిగ్బాస్ ఆదేశించాడు. ఇక వీటన్నింటిని చేసే సమయంలో ఎంత నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించినా కొందరు సఫలీకృతం కాలేకపోయారు. వితిక, మహేశ్, శ్రీముఖి, శివజ్యోతిలు బిగ్బాస్ నిద్రకు భంగం కలిగించినందున టాస్క్లో ఫెయిల్ అయినట్టుగా ప్రకటించాడు. అనంతరం ఇంటి సభ్యులకు మరో పరీక్ష పెట్టాడు. బిగ్బాస్ ఊహాచిత్రాన్ని గీయమని ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యులు వారి ఆలోచనలకు పదును పెడుతూ ఎవరికి తోచినట్టుగా వాళ్లు బిగ్బాస్ చిత్రాన్ని గీశారు. అన్ని చిత్రాల్లో కల్లా మహేశ్ గీసిన బిగ్బాస్ ఊహాచిత్రం హైలెట్గా నిలిచింది. దొరికిందే చాన్స్ అన్నట్టుగా మహేశ్.. బిగ్బాస్ను దేవుడు, అంతరాత్మ అంటూ పెద్ద పెద్ద పదాలను వాడుతూ కాకా పట్టడానికి ప్రయత్నించినట్టు కనిపించింది. బిగ్బాస్ ఇంట్లో కేకుల గోల ఇంకా తగ్గలేదు. ఇప్పటికే నాలుగు కేకులు తిని పొట్ట పగలిపోయేలా ఉందన్న ఇంటి సభ్యుల మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా మళ్లీ 2 కేకులు పంపించాడు. ఈ దెబ్బతో ఇంటి సభ్యులకు కేకులంటేనే వెగటు పుట్టింది. బిగ్బాస్ నిద్రకు భంగం కలిగించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూశాడు. రకరకాల శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యుల నిద్ర చెడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. అలీ విలన్లా, మాస్టర్ సైకోలాగా, రాహుల్ వేస్ట్ సాలే, చిచోరలా కనిపిస్తాడని శ్రీముఖి కామెంట్ చేసింది. తనకైతే రాహుల్ బఫూన్లాగా కనిపిస్తాడంటూ వితిక సెటైర్ వేసింది. అయితే ఈ విషయాన్ని రాహుల్ లైట్ తీస్కున్నాడు. కాగా రాహుల్ రాసి, పాడిన పాటకు బాబా డైరెక్షన్లో తీసిన ఇంటి సభ్యుల వీడియో అదిరిపోయింది. టీవీలో వారి వీడియో చూసుకుని మురిసిపోయారు. ఎట్టకేలకు బిగ్బాస్ బర్త్డే ముగియడంతో కేకుల గోల తప్పిందని ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
బిగ్బాస్: అందరి బండారాలు బయటపడ్డాయి!
బిగ్బాస్ ఇంట్లో సరదాలకు బ్రేక్ పడింది. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి బిగ్బాస్ రెడీ అయిపోయాడు. ఇప్పటికే 80వ రోజులోకి అడుగు పెట్టిన బిగ్బాస్ హౌస్ ఇంటి సభ్యుల గొడవలతో నేడు హీటెక్కనుంది. హౌస్మేట్స్కు వారి వెనక మాట్లాడుకున్న వీడియో క్లిప్పింగ్స్ను చూపించాడు. వీడియో చూసిన తర్వాత వారి రియాక్షన్స్ పూర్తిగా మారిపోయాయి. ఇంటి సభ్యులు కోపంతో ఊగిపోతున్నారు. బాబా భాస్కర్.. ఇక నుంచి రాహుల్నే టార్గెట్ చేస్తానంటూ సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో చూసి బయటకు వచ్చిన అలీని తన ప్రకోపాన్ని అంతా కుండపై చూపించాడు. ఏ కర్ర సహాయం తీసుకోకుండా చేతితో కుండను పగలగొట్టాడు. ఇక శ్రీముఖి.. మహేశ్కు ఆల్ ద బెస్ట్ చెప్తూనే అతని పోస్టర్ ఉన్న కుండను బద్దలు కొట్టింది. కాగా వీడియో క్లిప్పింగ్స్ ఇంటి సభ్యులందరికీ చూపించారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎలాగోలా నిజాలైతే బయటికి వచ్చాయి. మరి దీనితోనైనా ఇంటిసభ్యుల నిజస్వరూపాలు వెలికి వస్తాయా అన్న సందేహం ప్రేక్షకులకు కలుగుతోంది. ఈ ప్రోమోపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రోమో చూస్తే సీరియస్గా ఉంటుంది.. ఎపిసోడ్ చూస్తేనేమో కామెడీగా ఉంటుంది అని ప్రోమోలవర్స్ పెదవి విరుస్తున్నారు. మరికొంతమందేమో.. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ప్రోమో మాత్రం అదిరిపోయింది, ఎపిసోడ్ కూడా అంతకు మించి ఉంటుందని నేటి ఎపిసోడ్ కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మరి నేటి ఎపిసోడ్లో ఎవరి బండారాలు బయటపడ్డాయి? దానిపై ఇంటిసభ్యులు ఎలా స్పందించారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే! Kunda baddalakottinattu nijam bayatapadindi #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/KVpnuSDWUE — STAR MAA (@StarMaa) October 10, 2019 -
నామినేట్ అయింది ఆ ముగ్గురే
బిగ్బాస్ తెలుగు సీజన్-3 పన్నెండో వారం నలుగురు నామినేట్ అయ్యారు. ఇంటి సభ్యులందరికి బిగ్బాస్ సోమవారం పార్కింగ్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో భాగంగా గూడ్స్ ట్రాలీని నిర్దేశిత ప్రాంతంలో పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నేరుగా నామినేట్ అవుతారు. తొలుత హౌజ్లో ఉన్న ఎనిమిది మంది ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ట్రాలీ ఇచ్చి.. ఏడు పార్కింగ్ స్థలాలు మాత్రమే అందుబాటులో ఉంచారు. అలా నాలుగుసార్లు పార్కింగ్ స్థలాలు తగ్గిస్తూ ఉండటంతో నలుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. మొదటగా వరుణ్, తర్వాత వితిక, అటు తర్వాత మహేశ్, చివరగా రాహుల్ పార్కింగ్లో చోటు దక్కించుకోలేదు. దీంతో ఈ నలుగురు నామినేట్ అయినట్టు బిగ్బాస్ ప్రకటించాడు. అయితే, పోయిన వారం జరిగిన టాస్క్లో వితిక బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్తో వితికకు ఒక వారం ఎలిమినేషన్ తప్పించుకునే అవకాశం దక్కింది. ఇక సోమవారం జరిగిన టాస్క్లో వితిక ట్రాలీ పార్కింగ్ చేయడంలో విఫలం కావడంతో నామినేట్ అయింది. అయితే, ఈవారం మెడాలియన్ను వాడుకుని సేవ్ అవుతారా..? లేదంటే నామినేషన్లో ఉంటారా..? అని బిగ్బాస్ అడగ్గా.. వితిక మెడాలియన్తో సేవ్ అవుతానంది. దీంతో మిగిలిన ముగ్గురే నామినేట్ అయినట్టు బిగ్బాస్ ప్రకటించాడు. ఆసక్తికరంగా.. ఉత్కంఠగా టాస్క్..! ఇక ట్రాలీ పార్కింగ్ టాస్క్ ఆసక్తికరంగా.. కాస్త ఉత్కంఠగా సాగింది. ఓ సమయంలో రాహుల్, బాబా భాస్కర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. తనను బాబా బ్యాచ్ టార్గెట్ చేసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. బాబా కావాలనే అందర్నీ ఆపేసి.. శ్రీముఖి, శివజ్యోతి వెళ్లేందుకు సహాయం చేస్తున్నాడని ఆరోపించాడు. బాబా తన దారికి అడ్డు రావడం వల్లే కింద పడ్డానని రాహుల్ చెప్పుకొచ్చాడు. అయితే, తన దృష్టంతా పార్కింగ్ చేయడంపైనే ఉందని, తాను కావాలని ఎవరినీ అడ్డుకోలేదని బాబా స్పష్టం చేశాడు. మరి టాస్క్ మొదలైనప్పుడు తనకు అలీకి మధ్యన ఉన్న శివజ్యోతి.. మూడో రౌండ్ తర్వాత బాబావైపునకు ఎలా వెళ్లిందని ప్రశ్నించాడు. బాబా కావాలనే శివజ్యోతిని సేవ్ చేయాలని ప్లాన్ చేశాడని ఆరోపించాడు. అందువల్ల మిగతావారికి ఇబ్బంది కలిగిందని చెప్పాడు. గేమ్ స్టార్టింగ్ లైన్లో మూడో స్థానంలో ఉన్న తాను బాబా వల్ల చివరకు వెళ్లాల్సి వచ్చిందని రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై బాబా స్పందిస్తూ.. శివజ్యోతి అప్పటికే తన పక్కన నిలబడ్డానికి వచ్చిందని.. ఆడపిల్ల కావడంతో ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక సరే అన్నానని చెప్పాడు. రాహుల్ను.. మరెవరినీ టార్గెట్ చేసే ఉద్దేశం తనకు లేదని సమాధానమిచ్చాడు. అందరి తప్పులకు దేవుడే సాక్షి అని బాబా పేర్కొన్నాడు. ఇక టాస్క్ చివరి రౌండ్ (నాలుగు)లో కిందపడటంతో శివజ్యోతి కాలు బెనికింది. దీంతో ఆమెను మెడికల్ రూమ్కు తీసుకెళ్లాలని బిగ్బాస్ సూచించాడు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
బిగ్బాస్: గాయపడిన శివజ్యోతి
పన్నెండో వారానికి గాను నామినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోల ప్రకారం నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా సాగేలా ఉంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్బాస్ ఇంటి సభ్యులకు ‘సేఫ్ పార్కింగ్’అనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఎనిమింది మంది ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ట్రాలీ ఇచ్చి.. ఏడు పార్కింగ్ స్థలాలు మాత్రమే ఇచ్చాడు. అయితే సేఫ్గా పార్కింగ్ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నేరుగా నామినేట్ అవుతారు. అలా పార్కింగ్ స్థలాలను తగ్గిస్తూ ఉండటంతో.. ఒక్కొక్కరు నామినేట్ అవుతారు. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలను పరిశీలిస్తే వరుణ్, వితికా, మహేశ్ విట్టాలు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. తొలి రౌండ్లోనే రాహుల్, మహేశ్లు ఓకే పార్కింగ్ స్థలంలోకి వెళ్లడానికి పోటీ పడ్డారు. అయితే మహేశ్ విఫలం కావడంతో నేరుగా నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక టాస్క్లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ కిందపడ్డాడు. దీంతో అలిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బాబా భాస్కర్ కావాలనే కొంతమందిని అడ్డుకుంటున్నారని ఆయనపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే బాబా భాస్కర్ తన స్టైల్లో సర్ధి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. కాగా, టాస్క్లో శివజ్యోతి కాలికి దెబ్బతగిలినట్టు తెలుస్తోంది. గాయంతో శివజ్యోతి విలవిలాడుతుండటంతో ఇంటిసభ్యులందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే అలీ రెజా వెంటనే శివజ్యోతిని ఎత్తుకొని కన్ఫెషన్ రూమ్కు తీసుకెళ్లాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్పై బిగ్బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం నామినేట్ అయ్యేది ఎవరో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. Trolley task lo #Rahul disappointed#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/hQ7gsWGZUi — STAR MAA (@StarMaa) October 7, 2019 Trolley parking task lo hurt aina #ShivaJyothi.. #Ali comes for rescue #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/oAhQgc3aQX — STAR MAA (@StarMaa) October 7, 2019 -
బిగ్బాస్: ఈ వారం నామినేషన్లో ఉండేదెవరో..
హౌస్మేట్స్ పండించిన నవరసాలు ఎలా ఉన్నాయి? పునర్నవి ఎలిమినేట్ కావడానికి కారణాలు అవేనా? ఈ వారం నామినేషన్లో ఉండేది వారేనా? బిగ్బాస్ అప్డేట్స్ కోసం కింది వీడియోని క్లిక్ చేయండి. -
బిగ్బాస్: ఈ వారం నామినేషన్లో ఉండేదెవరో..
-
నామినేషన్లో ఉన్నదెవరంటే..?
బిగ్బాస్ హౌస్లో రాళ్లే రత్నాలు అనే టాస్క్.. రెండో రోజూ రసవత్తరంగా సాగింది. ఈ టాస్క్లో భాగంగా రాళ్లు ఏరుకునేప్పుడు వితికాపై మిగతా హౌస్మేట్స్పడటంతో వారిపై ఫైర్ అయింది. ఈ టాస్క్లో అలాగే అవుతుందని.. వరుణ్కూడా తిరిగి ఫైర్ అయ్యాడు. చివరకు మళ్లీ కూల్ చేసేందుకు వితికాను బుజ్జగించసాగాడు. రెండో బజర్ మోగే సరికి మహేష్ దగ్గర తక్కువ రాళ్లు ఉండటంతో నామినేషన్లోకి వచ్చాడు. ఎండలో లభించే విటమిన్ ఏంటని ఇంటి సభ్యులంతా డిస్కషన్ పెట్టుకున్నారు. హౌస్మేట్స్ రాళ్ల కోసం అగచాట్లు పడుతూనే ఉన్నారు. అయితే మూడో బజర్మోగే సరికి పునర్నవి దగ్గర తక్కువ విలువైన రాళ్లు ఉండటంతో పునర్నవి నామినేషన్లోకి వెళ్లింది. ఇక చివరి బజర్ మోగేసరికి వరుణ్-బాబా భాస్కర్కు సరి సమానం వచ్చాయని.. వితికా ఇచ్చిన రాళ్లతో ఇద్దరూ సరిసమానం అయ్యారు. అయితే కెప్టెన్ అయిన శ్రీముఖి వారిద్దరిలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుందని వితికా చెప్పుకొచ్చింది. అయితే చివరగా.. కురిసిన వర్షంతో వరుణ్ తక్కువగా సంపాదించుకోవడంతో నామినేషన్లోకి వచ్చాడు. దీంతో రాహుల్, వరుణ్, పునర్నవి, మహేష్ నామినేట్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. -
ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!
పదకొండో వారంలో బిగ్బాస్ ఇచ్చిన రాళ్లే రత్నాలు.. అనే టాస్క్ ఉత్కంఠగా సాగింది. రాళ్ల వర్షం కురిసినప్పుడల్లా.. హౌస్మేట్స్ వాటిని సంపాదించడం కోసం పరిగెత్తడం.. తీరా వాటిని చేజిక్కించుకున్నాక కాపాడుకోవడం కోసం తంటాలు పడటం హైలెట్గా నిలిచింది. రాళ్ల వర్షం కురిసే సమయానికి రాహుల్ అందుబాటులో లేకపోయే సరికి.. అతను వెనకబడిపోయాడు. అయితే రాళ్లను సంపాదించడం కోసం శివజ్యోతి దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పున్ను వద్ద నుంచి లాక్కుందామని ప్రయత్నించగా.. రాహుల్ చేతిని కొరికేసింది. వారు సంపాదించుకున్న రాళ్లను గంపలో దాచుకున్నారు. రెండో సారి రాళ్ల వర్షం కురవగా.. వాటిని ఏరుకోవడం అందరూ బిజీ అయ్యారు. మహేష్ దగ్గరి నుంచి లాక్కోవడానికి రాహుల్ ప్రయత్నించడంతో.. అతను ఫైర్ అయ్యాడు. ఆవేశంతో తన దగ్గరున్న రాళ్లను విసిరిపారేశాడు. ఎవరికేం కావాలో తీసుకోండని కోపంగా అన్నాడు. అయితే రెండు వందలు విలువచేసే రాయిని పునర్నవికి మహేష్ ఇచ్చాడు. అయితే చివరకు తన తప్పును తెలుసుకున్న మహేష్.. తన రాళ్లను తనకివ్వమని బతిమిలాడాడు. అయితే పున్ను మాత్రం తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఫన్ క్రియేట్ అయ్యేలా చేసింది. మొదటి బజర్ మోగేసరికి రాహుల్ దగ్గర తక్కువ విలువ రాళ్లు ఉండటంతో అతను నేరుగా నామినేట్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. కానీ వారంతా నిత్యావరసరాలను తీర్చుకోడానికి చాలా కష్టపడ్డాల్సి వచ్చింది. ఉప్పు ధర ఐదు వేలు, ఒక్క ఉల్లిగడ్డ ధర రూ.500, పసుపు వెయ్యి రూపాయలని చెప్పేసరికి వారి గుండె బద్దలైంది. అయినా ఉప్పు లేకుండా వంట ఉండదు కాబట్టి తలా ఇంత వేసుకుని వంట చేసుకున్నారు. అయితే ఈ టాస్క్ పూర్తయ్యే సరికి తిండి కోసం తిప్పలు పడేట్టు కనిపిస్తోంది. టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు ఇంటి లోపలకి అడుగు పెట్టకూడదనే కండీషన్పెట్డాడు. రేపటి ఎపిసోడ్లో ఈ టాస్క్ మరింత ఆసక్తికరంగా మారనున్నట్లు కనిపిస్తోంది. -
బిగ్బాస్.. డోస్ పెంచిన నాగ్
బిగ్బాస్ హౌస్లో పదోవారం గడిచేందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన గొడవలపై ఇంటి సభ్యులను నాగార్జున కాస్త గట్టిగానే మందలించాడు. రాహుల్-వరుణ్ మధ్య జరిగిన గొడవను నాగ్ సద్దుమణిగేలా చేశాడు. పాత విషయాలను తవ్వడం తన తప్పేనని వరుణ్ క్షమాపణలు చెప్పాడు. తనది కూడా తప్పేనని రాహుల్కూడా సారీ చెప్పాడు. గొడవ జరుగుతూ ఉంటే.. చూస్తూ కూర్చున్నావ్ టాస్క్ ఆడలేదని ఎంపైర్లా పక్కన ఉన్నావంటూ పునర్నవికి చురకలంటించాడు. రాహుల్-పున్నులు మాట్లాడకపోయే సరికి వరుణ్ నీతో ఉన్నాడంటూ శ్రీముఖితో వితికా చెప్పిన మాటలను ప్రస్తావించాడు. పునర్నవి గురించి బాబా, శ్రీముఖి దగ్గర చెప్పడం తప్పు కదా అని వితికాను మందలించాడు. పునర్నవి తిట్లదండకానికి సంబంధించిన వీడియోను ప్లే చేసి ఆమెపై సెటైర్ వేశాడు. బయటకు వెళ్లాక తిట్ల కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చని అన్నారు. బాబా భాస్కర్ మాస్క్ తీసేశాడని, శ్రీముఖి, వరుణ్తో జరిపిన సంభాషణలకు సంబంధించిన వీడియోలను చూపించాడు. నామినేషన్ విషయంలో పునర్నవితో మాట్లాడిన విధానంపైనా ఫైర్ అయ్యాడు. ప్రతీది కామెడీ చేస్తున్నాడని బాబాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిత్రబేధాన్ని వాడుకుంటోందని శ్రీముఖికి చురకలంటించాడు. రాహుల్-వరుణ్ మధ్య వచ్చిన గొడవను వాడుకుంటున్నావని శ్రీముఖినుద్దేశించి నాగ్ పేర్కొన్నాడు. (ఎలిమినేట్ అయింది అతడే!) బ్రోకెన్ హార్ట్ అంటూ ఆట ఆడించాడు... హౌస్మేట్స్ అందరికీ హార్ట్ షేప్ థర్మకోల్ షీట్లను ఇచ్చాడు. ఎవరి వల్ల హార్ట్ బ్రేక్ అయిందని హౌస్మేట్స్ భావిస్తున్నారో.. వారి వద్దకు వెళ్లి.. ఆ హార్ట్ను విరగొట్టి కారణం చెప్పాలనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా మహేష్ మొదటగా ఆటను ప్రారంభించాడు. బాబా భాస్కర్ వల్ల తన హార్ట్ బ్రేక్ అయిందని బాబా ఎదుటకు వెళ్లి థర్మకోల్ హార్ట్ షేప్ను మహేష్ విరగొట్టాడు. రాహుల్కు శివజ్యోతి వల్ల, శివజ్యోతికి రాహుల్ వల్ల, రవి, వితికాలకు పున్ను వల్ల, బాబాకు మహేష్ వల్ల, శ్రీముఖికి బాబా వల్ల, అలీకి బాబా వల్ల, పున్నుకు వరుణ్ వల్ల హార్ట్ బ్రేక్ అయినట్లు తెలిపారు. ఇక నామినేషన్లో ఉన్న శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, రవిలోంచి వరుణ్ సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించేశాడు. అయినా.. రవి ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తోంది. ఇక రేపు రవి ఎలిమినేషన్తో శివజ్యోతి ఏం చేస్తున్నది చూడాలి. -
బిగ్బాస్: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!
బిగ్బాస్ ఇచ్చిన ఏ టాస్క్ అయినా గొడవ జరగకుండా ముందుకు వెళ్లడం అసాధ్యం. ప్రస్తుతం ఇచ్చిన ఫన్నీటాస్క్ కూడా అదే కోవలోకి వస్తుంది. అత్తగా నటిస్తున్న శివజ్యోతికి ముగ్గురు కొడుకులు కోడళ్లు వరుణ్-వితిక, రవి-శ్రీముఖి, రాహుల్-పునర్నవిలను జంటలుగా విడగొట్టారు. వీరిలో ఏ జంట ఎక్కువ ఇటుకలతో గోడ నిర్మిస్తే వారు కెప్టెన్సీ టాస్క్కు అర్హులన్న విషయం తెలిసిందే. వీరితో పాటు వీలునామా చేజిక్కించుకున్న వారు కూడా కెప్టెన్సీ కోసం పోరాడుతారు. అయితే ఇటుకలను సంపాదించడానికి వితిక, శ్రీముఖి.. శివజ్యోతిని బాగానే కాకా పట్టారు. వితిక అత్తను అందంగా ముస్తాబు చేయడం, శ్రీముఖి శివజ్యోతికి గోరుముద్దలు తినిపించడం.. ఇలా అడగకముందే కోడళ్లు అన్ని సపర్యలు చేస్తూ అత్తను బుట్టలో వేసుకోడానికి ప్రయత్నించారు. ఇక ఇప్పటివరకు జరిగిన పర్ఫార్మెన్స్ ఆధారంగా వితిక జంటకు 22 ఇటుకలు లభించగా మిగిలిన రెండు జంటలకు 20 మాత్రమే లభించాయి. టాస్క్లో భాగంగా రాహుల్.. వరుణ్ దగ్గర ఇటుకలు కొట్టేసే ప్రయత్నం చేశాడు. ఎన్ని ఇటుకలు సంపాదించుకున్నాం అనేదానికన్నా ఎన్ని లాక్కున్నాం అనేదానిపైనే రాహుల్ ప్రధానంగా దృష్టి సారించాడు. దీంతో ఇటుకలు పట్టుకొస్తున్న వరుణ్ను కట్టడి చేసి అతని దగ్గర నుంచి ఇటుకలు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాహుల్, వరుణ్, వీరిద్దరినీ ఆపేందుకు ప్రయత్నించిన వితికకు గాయాలయ్యాయి. దీంతో వారిమధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. కూల్గా ఉండే వరుణ్ సహనాన్ని కోల్పోయాడు. ఏంటి? కొడతావా అంటూ రాహుల్పై సీరియస్ అయ్యాడు. గతంలో జరిగిన వాటిని తవ్వి తీస్తూ.. ‘అలీ చేసిన తప్పే నువ్వూ చేస్తున్నావని, హిమజ విషయంలోనూ ఏం జరిగిందో అందరూ చూశారు’ అని రాహుల్ను తప్పుబట్టాడు. తాను ఏ తప్పూ చేయలేదంటూ రాహుల్ కూడా గొడవకు దిగాడు. అందరూ ప్రశాంతంగా ఆడండని శివజ్యోతి చెప్పిన మాటలను పెడచెవిన పెడుతూ ఇద్దరూ కయ్యానికి కాలు దువ్వారు. ఒకవైపు హోరాహోరీగా వీరికి గొడవ జరుగుతుంటే మరోవైపు రవి-శ్రీముఖిలు మాత్రం ఇటుకలు జారవేస్తూ వారి పని పూర్తి చేశారు. ఇక అగ్నికి ఆజ్యం పోయడానికా అన్నట్టు శ్రీముఖి.. వరుణ్ దగ్గరకు వెళ్లి రాహుల్ గురించి నెగెటివ్గా చెప్పింది. అప్పటివరకు సరదాగా సాగిన టాస్క్.. వీరి గొడవలతో హీటెక్కింది. కాగా ‘రాహుల్- వరుణ్ల ఫ్రెండ్షిప్ ఇంతేనా..?’ అని పునర్నవి షాక్కు గురయింది. అయితే ఇదంతా ఉత్తుత్తే అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. మరి నిజంగానే వారిద్దరూ గొడవపడ్డారా? లేక ఇది బిగ్బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కా? అన్న ప్రశ్న ప్రస్తుతం అందరి మెదళ్లను తొలుస్తోంది. దీనికి సమాధానం దొరకాలంటే నేటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే! -
బిగ్బాస్: ఏంటి? కొడతావా అంటూ వరుణ్ ఫైర్!
ఎలిమినేషన్ ప్రక్రియతో శ్రీముఖి, బాబా భాస్కర్ల మధ్య కాస్త దూరం పెరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇంటి సభ్యులందరూ శ్రీముఖితో అంటీఅంటనట్లుగా మెదులుతున్నారు. ఇక ప్రతి ఉదయాన్ని డాన్స్తో హుషారుగా ప్రారంభించే శ్రీముఖి తాజా ఎపిసోడ్లో డాన్స్కు దూరంగా ఉంది. ఇప్పటికే ఒంటరిగా ఫీలైన శ్రీముఖి కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందనుకున్నప్పటికీ టాస్క్లో హుషారుగా పార్టిసిపేట్ చేసింది. పునర్నవి నామినేషన్ ప్రక్రియ గురించి వరుణ్తో మాట్లాడుతూ రవిపై వీరలెవల్లో సీరియస్ అయింది. వాడో పెద్ద వెధవ అంటూ నోటికొచ్చిన తిట్లు తిట్టింది. ఇలా ఇంటి సభ్యులందరూ ఒకరిపై ఒకరు గుర్రుగా ఉండటంతో బిగ్బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చివారు కెప్టెన్సీ టాస్క్కు అర్హులని ప్రకటించారు. ఇక టాస్క్ మొదటి రోజు అతి వినయం, అతి ప్రేమలతో సరదాగా సాగగా ముగ్గురు కోడళ్ల ముద్దుల అత్తగా శివజ్యోతి అలరించింది. అయితే ఎందుకైనా మంచిదని, అందరినీ ఓ కంట కనిపెట్టమంటూ అసిస్టెంట్ మహేశ్కు ఆర్డర్లు జారీ చేసింది . కాగా నేటి ఎపిసోడ్లో ఇంట్లో మళ్లీ గొడవలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్-రాహుల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్ సీరియస్ అవగా రాహుల్ కూడా తన నోటి దురుసును ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన వితిక.. గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించింది. అయితే గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తారు తప్పితే అక్కడ ఏమీ ఉండదని ప్రోమో లవర్స్ అంటున్నారు. మరి వీరి గొడవ టాస్క్ కోసమేనా లేక తర్వాత కూడా కొనసాగుతుందా అనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది! -
శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి
పదో వారం నామినేషన్ ప్రక్రియ రచ్చబండ కార్యక్రమంగా మారిపోయింది. మాటల యుద్దంతో బిగ్బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా కెప్టెన్ను మినహాయించి.. మిగతా వారిని జంటలుగా విడగొట్టాడు. శివజ్యోతి-శ్రీముఖి, బాబా భాస్కర్-పునర్నవి, వితికా-రవి, వరుణ్-రాహుల్ అంటూ విడగొట్టారు. ఇక వీరందరికీ మూడు ప్రశ్నలను ఇచ్చి.. తమ తరుపున వాదించుకోమన్నారు. ఫైనల్గా ఇంటి సభ్యులందరూ వేసిన ఓట్ల ఆధారంగా నామినేట్ అవుతారని తెలిపాడు. ఈ క్రమంలో శివజ్యోతి-శ్రీముఖిల చర్చ హైలెట్గా నిలిచింది. ఇద్దరి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. ఎమోషన్లోగా వీక్ అంటూ శ్రీముఖి అనగా.. అందరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసేదంటూ.. ఫిజికల్ టాస్క్లు చేయదు, తనను ముట్టొద్దు అంటుందని కానీ తాను అలా చేయలేదని ఫిజికల్ టాస్కుల్లో కూడా వందశాతం ఎఫర్ట్ పెడతానని శివజ్యోతి చెప్పుకొచ్చింది. చివరకు ఇంటి సభ్యుల ఓటింగ్తో శ్రీముఖి నామినేషన్లోకి వెళ్లింది. తరువాత వచ్చిన వితికా-రవిల్లో తక్కువ ఓట్లు రావడంతో రవి నామినేట్ అయ్యాడు. వరుణ్-రాహుల్ సరదాగా చర్చించుకుంటూ.. తన ఓటు రాహుల్కే వేస్తానని వరుణ్ చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులు దాదాపు అందరూ రాహుల్కు ఓటు వేశారు. దీంతో ఓట్లు తక్కువ రావడంతో వరుణ్ నామినేషన్లోకి వచ్చాడు. చివరగా వచ్చిన పున్ను-బాబా భాస్కర్లో బాబా నామినేట్ అయ్యాడు. దీంతో పదోవారానికిగానూ శ్రీముఖి, రవి, వరుణ్, బాబా భాస్కర్లు నామినేట్ అయినట్లు ప్రకటించాడు. ఎగిరి గంతేసిన పున్ను.. రాహుల్ది ఫేక్ ఎలిమినేషన్ అని ప్రేక్షకులకు తెలుసు. కానీ.. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు తెలీదు. అయితే రాహుల్ తిరిగి ఎంట్రీ ఇస్తున్నాడని తెలియడంతో హౌస్మేట్స్ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక వితికా, పునర్నవి, వరుణ్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కోర్ట్యార్డ్లో కూర్చొని రాహుల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. తన సోదరి(వితికా) రుచికరమైన భోజనం ఎలా మిస్ అవుతానంటూ, బాబా భాస్కర్ బ్లాక్ షీప్ అని ర్యాప్ పాడుతూ.. పున్ను కోసం పాట పాడుకుంటూ గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లోకి వచ్చిన తరువాత పున్నును గట్టిగా హత్తుకున్నాడు. సీక్రెట్ రూమ్లో ఉంటూ అందర్నీ గమనిస్తూ ఉన్నానని, అందరు మాట్లాడిన మాటలు విన్నానని, బాబా భాస్కర్ ఇంకా మాస్క్ తీయలేదంటూ చెప్పుకొచ్చాడు. నామినేషన్లోకి వచ్చిన శ్రీముఖి, రవి, వరుణ్, బాబా భాస్కర్లోంచిఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇక ఈ వారానికి గానూ బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ ఫన్ క్రియేట్ చేసేలానే ఉంది. పదో వారంలో కెప్టెన్గా ఎవరు ఎన్నికవుతారు? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. -
బిగ్బాస్: రాహుల్ ఈజ్ బ్యాక్
నిన్నటి ఎపిసోడ్లో ఇంటిసభ్యులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.. ఒకవైపు వారి డాన్స్లతో షోను హోరెత్తించగా మరోవైపు గద్దలకొండ గణేష్ ఎంట్రీతో ఎపిసోడ్ మరింత హుషారుగా సాగింది. అతిథిగా వచ్చిన వరుణ్తేజ్ హిమజ ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించగా ఆమె కన్నీటితో వీడ్కోలు పలికింది. ‘మళ్లీ నీకు బిగ్బాస్ ఇంట్లోకి వెళ్లే అవకాశం వస్తే ఏం చేస్తావు’ అని కింగ్ నాగార్జున అడిగిన ప్రశ్నకు వెళ్లే ప్రసక్తే లేదని హిమజ నిర్మొహమాటంగా చెప్పింది. ‘ఒక్కసారి బయటకు వచ్చాక మళ్లీ ఇంట్లోకి వెళ్లడం ఫేర్ కాదు, అది వన్టైమ్ డ్రీమ్ మాత్రమే’ అని ముక్కుసూటిగా సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ అందర్నీ షాక్లోకి నెట్టేసిన నాగార్జున అది తూచ్ అని చెప్పటంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా శనివారం రాహుల్ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ఎలిమినేట్ అయ్యాడని నమ్మించి గేమ్ ఆడించి ఆఖరి క్షణంలో అబద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఒకానొక దశలో రాహుల్ లేకపోతే బిగ్బాస్ చూడటమే ఆపేస్తానని కొందరు అభిమానులు శపథం పూనారు. కానీ రాహుల్ ఈజ్ బ్యాక్ అని తెలియడంతో ఎగిరిగంతేస్తున్నారు. ఇక ఈ విషయం ఇంటిసభ్యులకు తప్ప అందరికీ తెలుసు. మరి రాహుల్ రీ ఎంట్రీని ఇంటిసభ్యులు ఎలా స్వీకరిస్తారో! ఇక రాహుల్ను సీక్రెట్ రూంలోకి పంపించి అతను లేకుండానే ఆదివారం ఎపిసోడ్ కంటిన్యూ చేశారు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం నేటి ఎపిసోడ్లో రాహుల్ రీఎంట్రీతో ఇంటిసభ్యులకు షాక్ ఇచ్చాడు. రాహుల్ గొంతు వినగానే మొదట షాకైన పునర్నవి.. తర్వాత పట్టరాని సంతోషంతో గెంతులేసింది. రాహుల్ గ్రాండ్ ఎంట్రీతో ఇరగదీసాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో ఇదే బెస్ట్ ప్రోమో అంటూ రాహుల్ అభిమానులు అంటున్నారు. ఎలిమినేషన్ వరకు వెళ్లి వెనుదిరిగి రావటం అంటే మామూలు విషయం కాదు.. మరి ఈ గోల్డెన్ చాన్స్ను రాహుల్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి!