Reddy
-
విక్రాంత్రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, అమరావతి: కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో యర్రంరెడ్డి విక్రాంత్రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రలోభపెట్టడం, భయపెట్టడం చేయరాదని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు.తనను బెదిరించి పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందంటూ సీఎం చంద్రబాబు సన్నిహితుడు, పోర్టు ప్రమోటర్ కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విక్రాంత్రెడ్డి డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విక్రాంత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, కేవీ రావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. నాలుగున్నరేళ్ల తర్వాత ఫిర్యాదా? ‘నాలుగున్నరేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ ఆలస్యంపై ఫిర్యాదుదారు కేవీ రావు నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. జాప్యానికి బెదిరింపులే కారణమని, ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేశానంటూ ఆయన చేసిన వాదన ఆమోదయోగ్యం కాదు. అయన్ని బెదిరించి ఉంటే, కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేయలేదో వివరణ లేదు. కేవీ రావును బెదిరించడం వల్లే ఆయన వాటాలను నామమాత్రపు ధరకు అరబిందో రియాలిటీకి బదిలీ చేశారన్నదే పిటిషనర్ విక్రాంత్రెడ్డిపై ఉన్న ప్రధాన నేరారోపణ. పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఆడిట్ సంస్థతో విక్రాంత్ కుమ్మక్కయి ఆడిట్ రిపోర్ట్లో సంఖ్యలను పెంచి చూపారని, దీన్ని అడ్డంపెట్టుకునే కేవీ రావును బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఆడిట్ సంస్థతో కలిసి విక్రాంత్రెడ్డి సంఖ్యలను పెంచి చూపారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. దీనిద్వారా విక్రాంత్ లబ్ధి పొందారని సీఐడీ కూడా చెప్పడంలేదు. ఎఫ్ఐఆర్లోనూ ఆడిట్ కంపెనీని విక్రాంత్ కలిసినట్లు లేదు. అంతేకాక అరబిందో కొన్న వాటాల ద్వారా విక్రాంత్రెడ్డి ఆర్థికంగా లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆరోపణలు లేవు. రిపోర్ట్ను ఆడిట్ సంస్థే తయారు చేసిందని కేవీ రావే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఈ నివేదిక విషయంలో విక్రాంత్పై నేరారోపణలు చేయడానికి వీల్లేదు. దానిని విక్రాంత్రెడ్డి ఫోర్జరీ చేశారన్న ప్రశ్నే తలెత్తదు. ఫోర్జరీ చేశారని సీఐడీ, ఫిర్యాదుదారు కూడా చెప్పడం లేదు. విక్రాంత్రెడ్డి ఆ నివేదికను తారుమారు చేయడం, మార్చడం, మోసపూరితంగా సంపాదించడం చేయలేదు. అందువల్ల ఆయనకు సెక్షన్ 464 వర్తించదు’ అని జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఫిర్యాదు లేకుండానే ప్రాథమిక విచారణ జరపడమా! ‘2024 సెపె్టంబర్లో తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారని కేవీ రావు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే.. 2024 డిసెంబరు 2న కేవీ రావు ఫిర్యాదు చేశారు. అంటే అంతకు ముందు ఎలాంటి ఫిర్యాదు లేదు. ఫిర్యాదు లేకుండానే పోలీసులు ఎలా ప్రాథమిక విచారణ జరిపారో తెలియడంలేదు. నాలుగున్నరేళ్ల జాప్యంతో ఫిర్యాదు చేసినప్పుడు, పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి తీరాలి. కానీ, ఇక్కడ ఫిర్యాదు ఇవ్వకపోయినా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. దీనినిబట్టి పోలీసులు దర్యాప్తును ఏ తీరున సాగించారన్న దానిపై ఎలాంటి సందేహం అక్కర్లేదు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
రెడ్ బుక్ దెబ్బ జీవీ రెడ్డి అవుట్
-
ఫైబర్ నెట్లో తారస్థాయికి చేరిన రచ్చ
-
ఎమ్మెల్యేల రహస్య భేటీ.. అనిరుథ్రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల రహస్య భేటీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే భేటీ.. రహస్య భేటీ కాదంటూ వ్యాఖ్యానించారు. ‘‘కోహినూర్ హోటల్లో లంచ్ చేశాం. తాను ఏ ఫైల్ కూడా మంత్రుల దగ్గరకు తీసుకెళ్లలేదని అనిరుథ్ స్పష్టం చేశారు. ‘‘నా నియోజకవర్గ సమస్యలపై సమావేశంలో మాట్లాడా. బీఆర్ఎస్ హయాంలో భూముల ఆక్రమణకు గురయ్యాయి. భూముల అన్యాకాంతంపై విచారణ చేయాలని కోరా. భూముల అన్యాక్రాంతం ఎవరూ చేశారో విచారణలో తేలుతుంది’’ అని అనిరుథ్ వ్యాఖ్యానించారు.తెలంగాణలో ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సీరియస్ అయ్యారు. సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని.. మ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందంటూ మున్షీ వ్యాఖ్యానించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ మున్షీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కులగణన, ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో చేసినా, అనుకున్న స్థాయిలో ప్రచారం చేయడం లేదన్న మున్షీ.. పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ వేదికలపై మాట్లాడితే చర్యలు తప్పవన్నారు.ఇదీ చదవండి: దీపాదాస్ మున్షీ సీరియస్.. ఎమ్మెల్యేలకు వార్నింగ్ -
ఏసీబీకి చిక్కిన ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి..
ఏలూరు టౌన్: నాణ్యత లేని గోలి సోడాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన ఏలూరు ఫుడ్సేఫ్టీ అధికారి, ఆఫీస్ అటెండర్ను ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏలూరు అభివృద్ధి నిరోధక శాఖ డీఎస్పీ వి.సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన సాయి సుందర్ గోకుల్ అదే ప్రాంతంలో ఊప్స్ గోలీ సోడా కంపెనీ పేరుతో గోలీ సోడాను తయారు చేస్తున్నాడు. గోలి సోడా తయారీలో అధికంగా రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామనీ ఏలూరు ఫుడ్సేఫ్టీ అధికారి దొండపూడి కావ్యరెడ్డి, కార్యాలయ అటెండర్ పుల్లారావు గోకుల్కు ఫోన్ చేసి చెప్పారు. గోలీ సోడా విక్రయాలు సాఫీగా సాగాలంటే రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఫుడ్సేఫ్టీ అధికారికి రూ.20 వేలు, సహాయకుడికి రూ.2 వేలు ఇచ్చేందుకు గోకుల్ సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫుడ్సేఫ్టీ అధికారులు డబ్బులు కోసం వేధించటంతో గోకుల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో లంచం సొమ్మును ఫుడ్సేఫ్టీ అధికారి డి.వెంకట కావ్య రెడ్డికి, అటెండర్ పులపా పుల్లారావుకు గోకుల్ కార్యాలయంలో అందించాడు. అప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని ఉండటంతో వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి, అటెండర్ పుల్లారావు నుంచి రూ.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్సేఫ్టీ అధికారి వినియోగిస్తున్న కారును తనిఖీ చేయగా లెక్కలు లేకుండా ఆరు కట్టలుగా కట్టి ఉన్న మరో రూ.87 వేల నగదును గుర్తించారు. మొత్తంగా రూ.లక్షా 9 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. అలాగే ఫుడ్సేఫ్టీ అధికారి, అటెండర్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వీ.సుబ్బరాజు, సీఐలు ఎన్.బాలకృష్ణ, కే.శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఏసీబీ అధికారి వాసుకృష్ణ ఉన్నారు. -
అమెరికా అండర్–19 క్రికెట్ జట్టు కెప్టెన్ అనిక రెడ్డి
బ్రూమ్ఫీల్డ్ (కొలరాడో): వచ్చే ఏడాది జనవరిలో మలేసియా వేదికగా జరిగే మహిళల అండర్–19 ప్రపంచకప్ టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి కొలన్ అనిక రెడ్డి కెప్టెన్గా వ్యవహరిస్తుంది. తెలుగు సంతతికి చెందిన పగిడ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మలేసియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా జట్లకు గ్రూప్ ‘ఎ’లో చోటు కల్పించారు. గ్రూప్ ‘బి’లో అమెరికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్... గ్రూప్ ‘సి’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియా, సమోవా... గ్రూప్ ‘డి’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్ జట్లున్నాయి. అమెరికా అండర్–19 జట్టు: కొలన్ అనిక రెడ్డి (కెప్టెన్), అదితిబా చుదసమ (వైస్ కెప్టెన్), పగిడ్యాల చేతన రెడ్డి, చేతన ప్రసాద్, దిశ ఢింగ్రా, ఇసాని మహేశ్ వాఘేలా, లేఖ హనుమంత్ శెట్టి, మాహి మాధవన్, నిఖర్ పింకూ దోషి, పూజా గణేశ్, పూజా షా, రీతూప్రియా సింగ్, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని, సుహాని థదాని. -
రాష్ట్ర స్క్వాష్ టోర్నీ విజేత తనూజ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘గేమ్ పాయింట్’ తెలంగాణ రాష్ట్ర స్క్వాష్ చాంపియన్షిప్లో అండర్–13 బాలుర సింగిల్స్ విభాగంలో పులి తనూజ్ రెడ్డి చాంపియన్గా అవతరించాడు. ఫైనల్లో కొండపర్తి ప్రభాస్పై తనూజ్ రెడ్డి విజయం సాధించాడు. తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిది విభాగాల్లో కలిపి మొత్తం 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు బాబూరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, గేమ్పాయింట్ తెలంగాణ స్క్వాష్ చాంపియన్షిప్ చైర్మన్ ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు. అండర్–13 బాలుర సింగిల్స్: 1. పులి తనూజ్ రెడ్డి, 2. కొండపర్తి ప్రభాస్. అండర్–15 బాలికల సింగిల్స్: 1. అర్ణా ద్వివేది, 2. గంజి ధృతి. అండర్–17 బాలుర సింగిల్స్: 1. రాజ్వీర్ గ్రోవర్, 2. రోహన్ అరిగల. పురుషుల సింగిల్స్: 1. కరణ్ వశిష్్ట, 2. రణ్వీర్ గ్రోవర్. మహిళల సింగిల్స్: 1. ఆర్యా ద్వివేది, 2. శాన్వీ శ్రీ. పురుషుల సింగిల్స్ (ప్లస్ 35): 1. సర్వేశ్ చౌహాన్, 2. సోలీ కొలా. పురుషుల సింగిల్స్ (ప్లస్ 40): 1. ప్రియతోశ్ దూబే, 2. మయాంక్ మల్హాన్. పురుషుల సింగిల్స్ (ప్లస్ 45): 1. దానం భరత్, 2. బత్తుల రామ్. -
ఒక గృహిణి.. 4 సర్కారీ నౌకరిలు
చేవెళ్ల /మొయినాబాద్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగ సాధన కత్తిమీద సాము లాంటిదే. కానీ పట్టుదలకు శ్రమ తోడైతే సాధించలేనిది ఏదీ లేదని పలువురు నిరూపిస్తున్నారు. మొయినాబాద్ మండలం చిలుకూరుకు చెందిన గడ్డం సౌమ్యారెడ్డి ఏడాది కాలంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంది. గురుకుల టీజీటీ, పీజీటీ, జేఎల్తో పాటు గత బుధవారం విడుదలైన ఫలితాల్లో గెజిటెడ్ హోదా కలిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్గా ఎంపికై ంది. 2014లో వివాహం జరిగిన అనంతరం భర్త శ్రీధర్రెడ్డితో కలిసి చిలుకూరులో ఉంటూ డిగ్రీ, పీజీ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసింది. 2022లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ సాధించింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల పోషణను చూసుకుంటూనే పట్టుదలగా చదివి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.ఉద్యోగం చేస్తూనే..చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన సుదర్శన్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2018లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించిన ఆయన.. ప్రస్తుతం గచ్చిబౌలి పీఎస్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ ఫ్రొఫెసర్ కావాలనే తల లక్ష్యాన్ని మరవలేదు. జాబ్ చేస్తూనే చదువు కొనసాగిస్తూ 2022లో ఉస్మానియా యునివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నాడు. ఈక్రమంలో తెలంగాణ సాహితీవేత్తలు, హృదయ ఘోష, స్వాతంత్య్ర సమరయోధుడు అడ్డూరి అయోధ్య రామయ్య అనే పుస్తకాలు రచనలు చేశాడు. గెజిటెడ్ అధికారిగా ఎదగాలనే ఆలోచనతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసిన జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాసి, జేఎల్గా ఎంపికయ్యాడు. సామాన్య పేద కుటుంబానికి చెందిన తనను తల్లిదండ్రులు జంగమ్మ, పర్మయ్య చాలా కష్టపడి చదివించారని తెలిపాడు. లెక్చరర్గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని, ప్రొఫెసర్ కావాలనే తన కల సాకారానికి మొదటి అడుగు పడిందని చెప్పాడు. -
‘రిమాండ్’ను కొట్టివేయలేం
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి జిల్లాకోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పట్నం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని.. తామిచ్చిన ఉత్తర్వుల ప్రభావం ఉండబోదని ఆదేశించింది. మెరిట్స్ ఆధారంగా తీర్పు వెలువరించాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. పిటిషన్ను కొట్టివేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు డాకెట్(రిమాండ్) ఆర్డర్ను క్వాష్ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గత నెల తీర్పు రిజర్వు చేశారు. పిటిషన్ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అయితే, బెయిల్ పిటిషన్పై వికారాబాద్ కోర్టు చేసిన వ్యాఖ్యలను నరేందర్రెడ్డి న్యాయవాది జస్టిస్ కె.లక్ష్మణ్ దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్లు తమ పరిధిలోకి రావని స్పెషల్ కోర్టు చూస్తుందని వెల్లడించిందన్నారు. దీంతో స్పెషల్ కోర్టు వివరాలు తెలపాలని న్యాయమూర్తి నరేందర్రెడ్డి న్యాయవాదిని ఆదేశించారు. గత నెల 13న నరేందర్రెడ్డిని అరెస్టు చేయగా, ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. -
AP: ఐపీఎల్ రేసులో చిన్నదోర్నాల మనీష్రెడ్డి
పెద్దదోర్నాల: ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ రేసులో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన గొలమారు మనీష్రెడ్డి ఉన్నారు. గొలమారు ఉమామహేశ్వరరెడ్డి కుటుంబం వ్యాపార రీత్యా విశాఖపట్నంలో స్థిరపడింది. ఉమామహేశ్వరరెడ్డి తండ్రి గొలమారు పెద్దతాతిరెడ్డి గతంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలోని అఖిల భారత రెడ్ల సత్రం ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తించారు. ఉమామహేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు మనీష్రెడ్డి చిన్ననాటి నుంచి క్రికెట్పై ఆసక్తి పెంచుకుని, ఆంఽధ్ర తరఫున రంజీ మ్యాచ్లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేలానికి సిద్ధమయ్యారు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో ఐపీఎల్ వేలం రిజిస్టర్ చేసుకున్నారు. పలు ఐపీఎల్ జట్లు కొత్త కుర్రాళ్ల వైపు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో మనీష్రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కాగా సోమవారం కూడా నిర్వహించనున్న ఐపీఎల్ వేలంలో మనీష్రెడ్డికి అవకాశం దక్కవచ్చని భావిస్తూ మనీష్రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. -
త్వరలోనే సీఎం పాపం పండుతుంది
కుషాయిగూడ: శిశుపాలుడి పాపాల మాదిరి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాపాలను ప్రజలు లెక్కబెడుతున్నారని.. తొందరలోనే ఆయన పాపం పండుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ శనివారం చర్లపల్లి జైల్లో ములాఖత్ అయ్యారు.నరేందర్రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు ఆవరణలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి కక్షపూరితంగా చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్న నరేందర్రెడ్డి ధైర్యంగా ఉన్నారన్నారు. తనలాగే చేయని తప్పునకు ప్రభుత్వం జైల్లో పెట్టిన 30 మంది పేద, గిరిజన, దళిత రైతులకు అండగా ఉండాలని, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని నరేందర్రెడ్డి కోరారని కేటీఆర్ తెలిపారు. రైతన్నలకు అండగా కేసీఆర్ ఉన్నారని.. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి సొంతూరులో ఆయన సోదరులు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి తోవ లేకుండా గోడ కట్టడంతో క్షోభతో ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం ఉందని సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకొనేలా ఒత్తిడి తెచ్చిన సీఎం సోదరుడు నుముల గురువారెడ్డి చేస్తున్న అరాచకాన్ని ప్రజలు గమనించాలన్నారు. రేవంత్రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. -
అరెస్టు నోటీసులు భార్యకు ఇవ్వకుండా.. సలీమ్కు ఎందుకు ఇచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటి వద్దే అరెస్టు చేస్తే పిటిషనర్ (నరేందర్రెడ్డి) భార్యకు నోటీసులు ఇవ్వకుండా, సలీమ్ అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని హైకో ర్టు పోలీసులను ప్రశ్నించింది. విచారణకు సహకరించని, పరారీలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అరెస్టు చేయడం సరికాదని చెప్పింది. ఇతర నిందితుల వాంగ్మూలం, కాల్ డేటా ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. నరేందర్రెడ్డి పేరు వెల్లడించినట్లు చెబుతున్న లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాల కాపీలను అనుమతిస్తున్నట్లు పేర్కొంటూ.. తీర్పు రిజర్వు చేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్ విచారణార్హం కాదు.. న్యాయమూర్తికి పెన్డ్రైవ్ అందజేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ‘సీఎం రేవంత్రెడ్డి, కలెక్టర్ ఎవరొచి్చనా కూడా దాడి చేయాలని పిటిషనర్ (నరేందర్రెడ్డి) ప్రేరేపించారు. లగచర్లలో అధికారులపై దాడికి ముందు, తర్వాత ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోల పెన్డ్రైవ్ ఉంది. పిటిషనర్ రెచ్చగొట్టకుంటే దాడి జరిగేదే కాదు. పిటిషనర్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారం సాగుతోంది. వరుసగా పిటిషన్లు వేస్తూ విచారణను ముందుకు సాగకుండా చేస్తున్నారు. కేసీఆర్ నుంచి రూ.10 కోట్లు పిటిషనర్కు అందినట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ విచారణార్హం కాదు.. కొట్టివేయాలి’అని అన్నారు. అయితే సెక్షన్ 482 కేసులో పెన్డ్రైవ్ ఎలా సమరి్పస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందస్తు పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పడానికి అందులోని వివరాలే సాక్ష్యమని పీపీ బదులిచ్చారు.అరెస్టు ఫొటోలను న్యాయమూర్తికి అందజేసిన గండ్ర వాదనలు వినిపిస్తూ.. ‘15 మంది సివిల్ డ్రస్లో వచ్చి బలవంతంగా అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. పిటిషనర్తో పలు పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. అందులో ఏముందో చూసుకునే అవకాశం ఇవ్వలేదు’అని చెప్పారు. సంతకాలు అభ్యంతరకరం వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘చట్టపరమైన అవకాశం ఉన్నప్పుడు పిటిషన్లు వేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదు. నివేదికలపై సంతకాలు కూడా అభ్యంతరకరం’అని అన్నారు. గాయపడిన వారి వివరాల్లో ప్రశ్నార్థకాలు ఎందుకున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రాథమిక సమాచారం తీసుకునే క్రమంలో అలా పేర్కొన్నారని పీపీ బదులిచ్చారు. ఈ సందర్భంగా విచారణ తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేశారు. కాగా, లగచర్ల ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చటవిరుద్ధమంటూ నరేందర్ రెడ్డి భార్య శ్రుతి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ కె.లక్ష్మణ్ ముందు విచారణకు రానుంది. -
ఆయనేమన్నా టెర్రరిస్టా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆయన ఏమైనా టెర్రరిస్టా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు వద్ద ఉదయం వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను బహిరంగ ప్రదేశంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ఆయన పరారీలో లేరు కదా.. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చట్టప్రకారం అరెస్టు చేయొచ్చు కదా అని పేర్కొంది. గాయపడ్డ వారి వివరాల పక్కన ప్రశ్నార్థకం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే వైద్యుడికే స్పష్టత లేదా అని అడిగింది. నరేందర్రెడ్డి మరో నిందితుడికి రెండు నెలల కాలంలో 84 సార్లు ఫోన్ చేశారన్న పోలీసుల వాదనపై ఆక్షేపించింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు నేరపూరిత కుట్రపైనే మాట్లాడుకున్నారని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది.నరేందర్రెడ్డికి ప్రమేయం ఉందంటూ నిందితులు చెప్పిన వాంగ్మూలాల కాపీలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్రెడ్డి హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు, ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం: పీపీ ‘నరేందర్రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారు. నవంబర్ 11న రిమాండ్ డైరీలో ఆయన పేరు లేదు. నవంబర్ 13 నాటి డైరీలో చేర్చారు. ఆయనపై పెట్టిన సెక్షన్లలో ఒకటి తప్ప అన్నీ ఐదేళ్లలోపు శిక్ష పడే కేసులే. ఇతర నిందితులు నరేందర్రెడ్డి పేరు చెప్పారంటూ చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఘటన జరిగిన రోజున ఆయన నుంచి మరో నిందితుడి (ఏ–4)కి ఒకే ఒక్క కాల్ వెళ్లింది. అలాంటప్పుడు ఘటన వెనుక ఆయన ఉన్నట్లు ఎలా చెబుతారు? రాజకీయ కోణంలోనే మాజీ ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమీ చెప్పకున్నా.. కేటీఆర్ పేరు చెప్పినట్లు, నేరాన్ని అంగీకరించినట్లు తప్పుడు నివేదికను ట్రయల్కోర్టుకు అందజేశారు. తోపులాటలో జరిగిన చిన్న గాయాలను రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు’అని గండ్ర మోహన్రావు వాదనలు వినిపించారు. ‘ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్రెడ్డి మాట్లాడారు. దీని కోసమే మరో నిందితుడికి రెండు నెలల్లో 84 సార్లు కాల్ చేశారు. నరేందర్రెడ్డిని ఇంటి వద్దే అరెస్టు చేశాం. విచారణ సాగుతోంది. ఈ దశలో పిటిషన్ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. ఆయన పిటిషన్ను కొట్టివేయాలి. నరేందర్రెడ్డిని పోలీసుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్పై వికారాబాద్ కోర్టు విచారిస్తోంది’అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.ప్రాథమిక విచారణ చేశారా?వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఇంటి వద్దే అరెస్టు చేస్తే, విచారణ సమయంలో సలీమ్ అనే వ్యక్తి సమాచారం ఎందుకు ఇచ్చారు? సొంత పార్టీ వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన అరెస్టు చేస్తారా? ఇతర నిందితుల స్టేట్మెంట్లు కాకుండా నరేందర్రెడ్డి పాత్రపై ప్రాథమిక విచారణ చేశారా? మీరు చెబుతున్నట్లు కుట్ర కోణం ఉంటే ఘటన జరిగిన రోజున ఇద్దరి మధ్య ఒకే కాల్ ఎందుకు ఉంటుంది? లగచర్ల ఘటనలో అధికారులకు పెద్దగా గాయాలు కాలేదని నిమ్స్ వైద్యుల నివేదిక చెబుతోంది. లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాలను అందజేయండి’అంటూ తీర్పు రిజర్వు చేశారు. అయితే తమ వాదనలకు కొంత సమయం కావాలని పీపీ విజ్ఞప్తి చేయడంతో గురువారానికి వాయిదా వేశారు. -
మెజార్టీ నిందితులకు భూముల్లేవు
వికారాబాద్: తమ వద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నందునే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్రెడ్డిని ఏ–1గా చేర్చి అరెస్టు చేశామని ఐజీ సత్యనారాయణ చెప్పారు. బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్తో భేటీ అయిన ఆయన, ఆ తర్వాత ఎస్పీ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్రెడ్డితో పాటు మరో 20 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. కోర్టులో హాజరుపర్చిన సమయంలో జరిగిన వాదనల సందర్భంగా సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర ప్రాథమిక ఆధారాలు సమరి్పంచామని వెల్లడించారు. కలెక్టర్తో పాటు అధికారులపై జరిగిన దాడిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముందుగా 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ప్రశ్నించిన తర్వాత ఘటనతో సంబంధం లేని 40 మందిని విడుదల చేశామని చెప్పారు. దాడిలో పాల్గొన్నవారిలో 42 మందిని గుర్తించామని, అయితే ఇందులో 19 మంది ఏ సంబంధం లేకుండానే దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. మెజార్టీ నిందితులకు అక్కడ భూములు లేవని, ముందస్తు కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా ఆధారాలున్నాయని ఐజీ చెప్పారు. మిగిలిన నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు. తొలుత ఏ–1గా సురేశ్ ఉండగా దర్యాప్తు తర్వాత లభ్యమైన సాక్ష్యాధారాలతో నరేందర్రెడ్డిని ఏ–1గా చేర్చామని వివరించారు. దాడిలో సురేష్, మహేశ్, దేవదాస్, గోపాల్నాయక్, విఠల్, రాజు, విజయ్ ప్రధాన భూమిక పోషించారన్నారు. ఈ కేసులో ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉందన్నారు. గతంలో సురేష్ పై కేసులున్నాయని, రేప్ కేస్ ఉంటే మేనేజ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. రిమాండ్కు తరలించింది వీరినే..ఏ1 పట్నం నరేందర్రెడ్డి, ఏ 21 బోగమోని మహేశ్, ఏ 22 బ్యాగరి విశాల్, ఏ 24 నీరటి సాయిలు, ఏ 27 నీరటి రమేశ్ (వీరిని బుధవారం అరె స్టు చేశారు), ఏ 3 ఎ.శివకుమార్, ఏ 11 మైలారం విష్ణువర్ధన్రెడ్డి, ఏ 14 హీర్యానాయక్, ఏ 15 పతీవత్ శ్రీను, ఏ 16 పతీవత్ ప్రవీణ్, ఏ 17 పతీవత్ వినోద్, ఏ 18 రాథోడ్ వినోద్, ఏ 19 జర్పాల హీర్యానాయక్, ఏ 20 బాస్యానాయక్, ఏ 23 బ్యా గరి యాదయ్య, ఏ 25 దోరేమోని రమేష్, ఏ 26 కావ లి రాఘవేందర్, ఏ 28 లక్ష్మయ్య, ఏ29 నీలి రవి, ఏ 30 శ్రీశైలం, ఏ 31 బాలకిష్టయ్య (వీరిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు). -
సజ్జల భార్గవ్ కేసు వివరాలేవీ?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని కృష్ణా జిల్లా గుడివాడ రెండో పట్టణ పోలీసులను హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.మొసాద్ ఏజెంట్లలా మోహరించి ఉన్నారు..ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని భార్గవ్ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ను కోరారు. అంత అత్యవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. భార్గవ్ కోసం పోలీసులు మొసాద్ ఏజెంట్ల మాదిరిగా మోహరించారని తెలిపారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణ జరిపారు.ఎప్పుడో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పోస్టులు పెట్టారంటూ ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని పొన్నవోలు తెలిపారు. సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్ని నిందితుడిగా చేర్చారని తెలిపారు. జూలై 1కి ముందు పెట్టిన పోస్టులపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ కింద కేసులు పెట్టారని, వాస్తవానికి అప్పటికి ఈ చట్టాలేవీ అమల్లోకి రాలేదని తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీ కింద మాత్రమే కేసులు పెట్టాలన్నారు. భార్గవ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇదే వ్యవహారంలో మరో నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను కూడా న్యాయమూర్తి 14కి వాయిదా వేశారు.అర్జున్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఓ. మనోహర్రెడ్డి వాదనలు వినిపించారు.కాగా ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోరుతూ భార్గవ్రెడ్డి హైకోర్టులో మంగళవారం పిటిషన్లు దాఖలు చేశారు. -
అత్త, వారి బంధువుల వేధింపులు తాళలేక క్షోభ అనుభవిస్తున్నా
పంజగుట్ట: గత 10 నెలలుగా అత్త, అత్త తరపు బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తమ సమీపబంధువు గౌతంరెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త ఆదాల దామోదర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని గ్రీన్పార్క్, మారీగోల్డ్, ఆవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనా రెడ్డి వాపోయారు. ఇంట్లో ఉన్న తనను ఈ నెల 6న 15మంది బౌన్సర్లు వచ్చి దాడిచేసి కిడ్నాప్ చేసేందుకు యతి్నంచారన్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదని ఆమె ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తన సోదరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయ్యిందని అప్పటినుండి కొద్దికాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాటవింటున్నాడు కానీ తన అత్త పార్వతి భర్తనుండి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీపబంధువు గ్రీన్పార్క్, మారీగోల్డ్ హోటల్స్ సీఈఓ గౌతంరెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన భర్తనుండి విడాకుల నోటీసు ఇప్పించడంతో గత కొంతకాలంగా తాను ఇల్లు వదిలి వెల్లిపోయానని తిరిగి కోర్టు ఆదేశాలతో గత నెల ఫిల్మ్నగర్ లోని తన భర్త ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి తనను ఇంట్లోవేసి తాళం వెయ్యడం, గదిలో బంధించడం తీవ్రమానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. తన అత్త పార్వతి, భర్త దామోదర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రచనా రెడ్డి వాపోయారు. -
రామ రామ.. ఏమిటీ డ్రామా!
సాక్షి టాస్క్ ఫోర్స్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ శ్రీరాములోరి రథం దగ్ధం కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారు. రథానికి నిప్పు పెట్టిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ సానుభూతిపరులేనంటూ సర్వత్రా కోడై కూస్తున్నా.. పోలీసులు మాత్రం ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీపై నెట్టేస్తున్నారు. అధికార పార్టీ పెద్దల సూచనలకు అనుగుణంగా పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని బుధవారం అనంతపురంలో మీడియా ఎదుట హాజరు పరిచారు. రథానికి నిప్పు పెట్టడంలో ఈశ్వర్రెడ్డి పాత్ర ఉందని, ఇతను వైఎస్సార్సీపీకి చెందిన వాడని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రకటించారు. వాస్తవంగా ఈశ్వర్రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీకి పని చేశాడని, ఆ విషయాన్ని పోలీసులు దాచి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రథం దగ్ధం తర్వాత పోలీసులు ఆధారాల సేకరణ కోసం డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. పోలీసు జాగిలాలు గ్రామంలోని నలుగురి ఇళ్ల వద్దకు వెళ్లాయి. ఆ నాలుగిళ్లూ టీడీపీ సానుభూతిపరులవే కావడం గమనార్హం. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ టీడీపీకి చెందిన వారే ఈ పని చేసినట్లు తేలినప్పటికీ వారెవ్వరినీ నిందితులుగా చూపలేదు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం. అన్ని వేళ్లూ వారి వైపే.. హనకనహాళ్ గ్రామంలో శ్రీరాములోరి రథం పట్ల ముందు నుంచీ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది టీడీపీ వారే కావడం గమనార్హం. ఈ విషయం గ్రామస్తులందరూ చెబుతున్నప్పటికీ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన మూలింటి ఎర్రిస్వామిరెడ్డి బ్రదర్స్ 2022లో రూ.19 లక్షల సొంత నిధులతో రథాన్ని తయారు చేయించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులే ఈ రథాన్ని తయారు చేయించినప్పుడు అదే పార్టీకి చెందిన వారు ఎందుకు నిప్పు పెడతారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ వారే రథానికి నిప్పు పెట్టి.. ఆ నెపం వైఎస్సార్సీపీ మద్దతుదారులపై నెట్టేలా వ్యూహం పన్నినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామంలో ఇలాంటి సంఘటనలెన్నడూ జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీఎం చెప్పిందొకటి..జరిగింది మరొకటి..కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు చెప్పినప్పటికీ, మరోవైపు అందుకు భిన్నంగా జరుగుతోంది. దోషులు టీడీపీ వారేనని తేలినప్పటికీ, ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే ప్రభుత్వానికి మచ్చ రావడం ఖాయమని, వైఎస్సార్సీపీపైకి నెపం నెట్టాలని టీడీపీ పెద్దలు చెప్పడంతో పోలీసులు జీ హుజూర్ అన్నట్లు సమాచారం. సీఎం వ్యాఖ్యలకు అర్థం ఇదేనని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసు యంత్రాంగం ఈశ్వర్రెడ్డిని అరెస్ట్ చేసి, అతను వైఎస్సార్సీపీ అని చెప్పడం గమనార్హం. పోలీసుల తీరు పట్ల గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.రథానికి నిప్పు ఘటనలో ఒకరి అరెస్ట్: ఎస్పీ జగదీష్అనంతపురం: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథానికి నిప్పంటించిన కేసులో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఈశ్వరరెడ్డిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హనకనహాళ్లో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలను పగులగొట్టి మండపంలోకి ప్రవేశించి.. రథంపై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టారని తెలిపారు. వెంటనే గ్రామస్తులు మంటలు ఆర్పారని, అప్పటికే రథం ముందు భాగం కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై కణేకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారన్నారు. ఘటనా స్థలంలో ఆధారాల సేకరించామని చెప్పారు. రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయించారని తెలిపారు. గ్రామంలో ఏ ఒక్కరి సహాయ సహకారాలు తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయించారన్నారు. దీంతో గ్రామస్తుల్లో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలియడంతో అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. పోలీస్ కస్టడీలోకి తీసుకుని, ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే అంశంపై విచారిస్తామన్నారు. -
సాయికార్తీక్ ఖాతాలో ఏడో డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు టోర్నమెంట్లలో ఫైనల్ చేరి... రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్న హైదరాబాద్ యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయికార్తీక్ రెడ్డి ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబుల్స్ టైటిల్ను జమ చేసుకున్నాడు. ఇండోనేసియా ఆ«దీనంలోని బాలి ద్వీపంలో జరిగిన ఐటీఎఫ్ ఎం25 టోరీ్నలో సాయికార్తీక్ రెడ్డి (భారత్)–బొగ్డాన్ బొబ్రోవ్ (రష్యా) జోడీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సాయికార్తీక్–బొగ్డాన్ ద్వయం 6–2, 6–4తో మాథ్యూ స్కాగ్లియా (ఫ్రాన్స్)–జాకుబ్ వోచిక్ (అమెరికా) జంటపై గెలిచింది. సాయికార్తీక్ »ొగ్డాన్ జోడీకి 1,550 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) ప్రైజ్మనీ లభించింది. ఓవరాల్గా సాయికార్తీక్ కెరీర్లో ఇది ఏడో డబుల్స్ టైటిల్కాగా, ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్. 24 ఏళ్ల సాయికార్తీక్ 2023లో నాలుగు డబుల్స్ టైటిల్స్ను, 2022లో రెండు డబుల్స్ టైటిల్స్ను సాధించాడు. ఈ ఏడాది సాయికార్తీక్ మొత్తం 22 ఐటీఎఫ్ టోరీ్నలలో పాల్గొన్నాడు. ఐదు టోర్నీల్లో డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచి, ఒక టోరీ్నలో టైటిల్ గెలిచాడు. -
మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అల్కాజర్ వాచెస్, డీక్యూయూఈ సోప్ ఆధ్వర్యంలోని మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటాన్ని తెలంగాణకు చెందిన వర్షారెడ్డి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో గెలుచుకున్న టైటిల్తో సందడి చేశారు. తెలంగాణ నుంచి కోయంబత్తూర్ వెళ్లి లే మెరిడియన్ వేదికగా టైటిల్ నెగ్గడం సంతోషంగా ఉందని తెలిపారు. 2012లో మిస్ సౌత్ ఇండియా పోటీలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాను, అప్పుడు మిస్ కన్జెనియాలిటీ టైటిల్ను సంపాదించానని గుర్తు చేసుకున్నారు. ఫ్యాషన్ రంగంతో పాటు యూఎస్ఐటీ సిబ్బంది, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, చలనచిత్ర నిర్మాణం వంటి ఐదు విభిన్న కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తున్నానని తెలిపారు. విజేతకు పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జెబితా అజిత్ కిరీటాన్ని అందించారు. మిసెస్ సౌత్ ఇండియా 2024 అందాల పోటీల్లో కేరళకు చెందిన రేవతి మోహన్ మొదటి రన్నరప్ స్థానాన్ని పొందగా, కేరళకు చెందిన దృశ్య డినాయర్ రెండో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మిసెస్ సౌత్ ఇండియా పోటీకి దక్షిణ భారత రాష్ట్రాల నుండి 12 మంది పోటీదారులు ఎంపికయ్యారు. మిసెస్ సౌత్ ఇండియా విజేతలకు పరక్కత్ జ్యూయలర్స్కు చెందిన ప్రీతి పరక్కత్ రూపొందించిన బంగారు కిరీటాన్ని బహూకరించారు. -
సరదా.. సరదాకే..
ఎంచుకున్న రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువేంకాదు.. ఇది ఒకప్పటి మాట.. టెక్నాలజీ రాకతో, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నేటి తరం యువత కలలు నెరవేర్చుకుంటున్నారు. సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలా తాను అనుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టిన వ్యక్తే హర్షిత్ రెడ్డి మల్గి...సరదాగా డబ్స్మాలతో మొదలై ప్రభాస్ కల్కి సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. చిన్నతనం నుంచి తనకు నటనపై ఉన్న సరదా.. అందులోనే నిలదొక్కుకునేందుకు చేసిన తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు.. తెలుసుకుందాం.. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే. బిటెక్ ఇక్కడే పూర్తి చేశాను. చిన్నతనం నుండే స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్లో ఉత్సాహంగా సింగింగ్, యాక్టింగ్లలో సరదాగా పాల్గొనేవాడిని. 2018లో డబ్స్మాష్లను నేను సరదాగా చేసి ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చే«శాను. దీంతో ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. అలా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చాయ్బిస్కట్లో యాక్టర్గా కొన్ని స్కెచ్ విడియోస్ చేశాను. అలా మొదలైన నా ప్రస్థానం.. నేడు ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తున్న ప్రభాస్ కలి్క–2898 చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నా అని తెలిపారు హర్షిత్రెడ్డి మల్గి. లాక్డౌన్లో యాక్టింగ్పై మరింత ఆసక్తి... లాక్డౌన్లో వందలాది సినిమాలు చూశాను. అలా నటనపై మరింత ఆసక్తితో పాటు పలు మెళకువలు నేర్చుకున్నాను. అనంతరం ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. అలా ఆహాలో నటుడు ప్రియదర్శితో కలిసి ‘మెయిల్’ సినిమాలో మెయిన్ రోల్ చేశాను. థియేటర్లో కాకుండా ఆహాలో విడుదలయింది. తరగతిగదిదాటి, అర్థమైందా అరుణ్కుమార్, లూసర్ వెబ్సీరిస్లను చేశాను. అలా నటుడిగా మంచి మార్కులు సాధించి పలు అవార్డులను అందుకున్నాను. మెయిల్ చిత్రంలో నటనకు చాలా మంది మెచ్చుకున్నారు. కల్కిలో అవకాశం... సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ మంచి క్యారెక్టర్స్ రాలేదు. ఓ డిఫరెంట్ రోల్లో చేయాలనుకునే సమయంలో మెయిల్ చిత్రం ప్రొడ్యూసర్ స్వప్నదత్ ప్రభాస్తో కల్కి 2898 చిత్రాన్ని చేస్తున్నారు. ఓ మంచి రోల్ ఉంది చేస్తావా అని చిత్ర టీం అడగటంతో ఖచి్చతంగా చేస్తానని చెప్పాను. దర్శకుడు నాగ్అశి్వన్ మెయిల్ చిత్రం చూసి ఎటువంటి ఆడిషన్స్ లేకుండా సెలెక్ట్ చేశారు. హీరో ప్రభాస్తో కలిసి ఓ డిఫరెంట్ రోల్లో నటించడం చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో రిలీజ్ అయ్యే నా మొదటి సినిమా పాన్ వరల్డ్ సినిమా అవ్వడం మరింత గర్వంగా ఉంది. చిత్రంలో నా క్యారెక్టర్ పేరుకూడా కొత్తగా ఉంటూ చిత్రంలోని బుజ్జి క్యారెక్టర్తో ఆద్యతం ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోగా రాణిస్తా... ప్రేక్షకులను అలరిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ హీరో, నటుడిగా రాణించాలని ఉంది. తెలుగులో పుష్ఫ చూశాక అల్లు అర్జున్ బాగా నచ్చారు. అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. నా డ్రీమ్రోల్ సూపర్హీరో రోల్ చేయాలని ఉంది. ఫ్రెండ్స్తో సరదాగా గడపడం ఇష్టం. హైదరాబాద్తో నాకు విడదీయలేని బంధం. ఇక్కడే నా లైఫ్ ప్రారంభమై సెలబ్రిటీ హోదాను తీసుకొచి్చంది. ఇండియన్ వంటకాలు ఇష్టం. హెల్తీ ఫుడ్ తీసుకొని తరచూ జిమ్ చేస్తుంటా. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండటానికే ఇష్టపడతా... -
నాన్న ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నా..
పాలకుర్తి: నా జీవిత ప్రయాణంలో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్న హైదరాబాద్లో బీటెక్ వరకు చదివించారు. వివాహం తర్వాత అమెరికాలో మేనేజర్గా పనిచేశా. మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇందులో మా నాన్న మామిడాల తిరుపతిరెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్న వెన్నంటి ఉండి నడిపించారు. ఆయన ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొన్నా. ఘన విజయం సాధించా. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.– మామిడాల యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి -
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు. -
షా డీప్ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్ఫేక్గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్రెడ్డి డీప్ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.సృష్టించి.. సర్క్యులేట్ చేసి..మెదక్లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..షా డీప్ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేడు మరో అరెస్టుకు అవకాశం..వీడియో సృష్టికర్త అరుణ్రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు. -
కోవూరులో బెడిసికొడుతున్న టీడీపీ వ్యూహాలు
డబ్బుతో ఏమైనా చేసేయొచ్చనే కొందరి అంచనాలు తారుమారవుతున్నాయి. నగదును వెదజల్లి తద్వారా గెలవొచ్చనే టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంచనాలు ప్రజాక్షేత్రంలో తలకిందులవుతున్నాయి. తన విజయం అంత సులభం కాదనే విషయం బోధపడటం.. పైగా వ్యూహాలు బెడిసికొడుతుండటంతో ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకోవడం ఆమె వంతవుతోంది. కోవూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కోవూరు నియోజకవర్గంలో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నగదు ప్రలోభాలతో నేతలను టీడీపీలో చేర్చుకోవడం.. దురాయి పేరుతో మత్స్యకార గ్రామాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలను వేమిరెడ్డి దంపతులు ప్రకటించడం.. ఈ విషయాలు బయటకు పొక్కడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికెళ్లినా సమస్యల స్వాగతం ప్రచారంలో భాగంగా ప్రశాంతిరెడ్డి ఎక్కడికెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఓ వైపు వర్గపోరు.. మరోవైపు నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఆమె చేతులెత్తేశారు. ఆత్మీయ సమావేశాలు.. ప్రచారాలు.. పార్టీ కార్యాలయాల ప్రారంభం.. ఇలా సందర్భమేదైనా గొడవలు మాత్రం కామన్గా మారుతున్నాయి. కోవూరు టీడీపీ సీటును ఆశించి భంగపడిన పోలంరెడ్డి దినేష్రెడ్డి.. ప్రశాంతిరెడ్డి విజయానికి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవమో అర్థం కాని పరిస్థితి. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న కుమ్ములాటలకు వెన్నుపోటు రాజకీయాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. అడుగడుగునా ప్రతికూలతలే.. క్షేత్రస్థాయిలో టీడీపీకి అనుకూల వాతావరణం లేదు. చంద్రబాబు గత పాలనను ప్రజలు నేటికీ మర్చిపోలేదు. రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల ను గతంలో ఆయన మోసగించారు. తాజాగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మడం లేదు. మరోవైపు వలంటీర్ల సేవలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకోవడం బూమరాంగ్ అయింది. చంద్రబాబు వ్యూహాలు, గత పాలన టీడీపీ అభ్యర్థులకు శాపంగా మారాయి. ఆడియో కలకలం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్రెడ్డితో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆడియో బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. తాము గెలిస్తే ప్రజల్లో ఉంటామని.. ఓటమిపాలైతే వ్యాపారాలు చూసుకుంటామని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే వేమిరెడ్డి దంపతులు గెలిచినా.. ఓడినా ప్రజల్లో ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడియో దుమారంతో వీరిపై నమ్మకం మరింత సన్నగిల్లింది. -
అసైన్డ్ భూమిని ఎలా కొట్టేయాలనుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని బుద్వేల్లో ఉన్న 26 ఎకరాల అసైన్డ్ భూమిని కాజేసిన వ్యవహారంలో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి బుధవారం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల ఎదుట హాజరయ్యారు. అధికారులు శివానందరెడ్డిని దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఆయన నుంచి కొంత సమాచారం సేకరించిన పోలీసులు వచ్చే వారం మరోసారి సీసీఎస్లో హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివానందరెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్్క, ప్రశాంత్రెడ్డినీ సీసీఎస్ పోలీసులు గత వారం ప్రశ్నించిన విషయం విదితమే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని తొలుత ప్రయత్నించిన రియల్టర్లు టీజే ప్రకా‹Ù, గాం«దీ, రామారావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ 2021లో మిమ్మల్ని ఎందుకు సంప్రదించారంటూ పోలీసులు శివానందరెడ్డిని ప్రశ్నించారు. బుద్వేల్లోని ఆ భూమికి సంబంధించిన పూర్వాపరాలు తెలిసినప్పటికీ పోలీసు అధికారిగా ఉన్న పరిచయాలు, పలుకుబడి వినియోగించి అసైన్డ్ ల్యాండ్ను కాజేయాలని ప్రయత్నించడంపై శివానందరెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ భూములు సొంతం చేసుకునే ఉద్దేశంతో 2021–22 మధ్య కాలంలో అసైనీలకు శివానందరెడ్డి తన సంస్థ ద్వారా చెక్కుల రూపంలో చెల్లించిన మొత్తం వివరాలను సీసీఎస్ పోలీసులు అడిగారు. ఇంకా మీ వెనుక ఎవరున్నారు? ఆ అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం 2022–23 మధ్య ఎవరెవరి ద్వారా? ఎక్కడెక్కడ లాబీయింగ్ చేశారు? ఈ వ్యవహారంలో ఎవరు కీలకంగా వ్యవహరించారు? అనే వివరాలను శివానందరెడ్డి నుంచి రాబట్టడానికి సీసీఎస్ పోలీసులు ప్రయత్నించారు. అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు మె మో జారీ అవడం వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశా న్నీ పోలీసులు ప్రశ్నించారు. గత ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ జరగ్గా.. ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీస్లకు వారిపై రిజిస్టర్ చే యడం పైనా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అసైనీలను భయపెట్టి ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములు లాక్కోవడానికి కుట్ర ప న్న డం ఉద్దేశపూర్వకంగా చేసిందా? అనే అంశాన్నీ పోలీ సు లు పరిగణనలోకి తీసుకుని శివానందరెడ్డిని ప్రశ్నించా రు. ఆయన నుంచి సేకరించిన సమాచారాన్ని సరిచూడాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం మరోసారి రావాలని స్పష్టం చేశారు. -
పథకం ప్రకారమే మాపై దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచి పథకం ప్రకారం మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్న ఆధారం దొరికితే దానిచుట్టూ కట్టుకథ అల్లుతున్నారు. అలాంటి కట్టుకథే ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని జైలుకెళ్లి బెదిరించానని చెప్పడం’.. అని వైఎస్సార్సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్రెడ్డి తనయుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని శంకర్ ఆసుపత్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలుకెళ్లి దస్తగిరిని బెదిరించానని, రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చామని చెబుతున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవంలేదన్నారు. కడప సెంట్రల్ జైలులో మెడికల్ క్యాంపు నవంబరులో నిర్వహించారని.. అది అంతకు మూడు నెలల ముందు ఖరారైందన్నారు. క్యాంపు ప్రారంభం నుంచి జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, పది మంది జైలు అధికారులు తమతోనే ఉన్నారని, సహచర వైద్యులు ఖైదీల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని చికిత్స అందించాక తాము బయటికి వచ్చేశామన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఓ పెద్ద కట్టుకథ అల్లారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సెంట్రల్ జైలులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. జైలు అధికారులు ఉంటారు.. అంత పటిష్ట రక్షణ ఉన్న ప్రాంతంలోకి బుద్ధి ఉన్నవారు ఎవరైనా వెళ్లి బెదిరిస్తారా? అలాచేస్తే రెడ్హ్యాండెడ్గా దొరికిపోరా? వెంటనే ఫిర్యాదుచేస్తే సీసీ ఫుటేజీ అధారంగా చర్యలు తీసుకుంటారు కదా.. నేను నిజంగానే బెదిరించి ఉంటే దస్తగిరి అప్పుడే జైలు అధికారులకుగానీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారికిగానీ, ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రిమాండ్ ఖైదీగా పలుమార్లు కోర్టుకు హాజరైన దస్తగిరి న్యాయమూర్తులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మూడునెలల తర్వాత మీడియా ముందుకు రావడమేమిటి? ఇంకొన్నినెలలు గడిస్తే సీసీ ఫుటేజీ దొరకదని పక్కా క్రిమినల్ మైండ్తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్ వేయగానే.. ఇక ఈ దుష్ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. మా నాన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ వేయగానే తెరపైకి కట్టుకథలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే సీబీఐ అధికారి డ్రైవర్ను బెదిరించినట్లు కుట్ర చేశారు. పోలీసు అధికారులు విచారిస్తే అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ప్రస్తుతం హైకోర్టులో బెయిల్ పిటిషన్ నడుస్తున్నందున దాన్ని అడ్డుకోవడానికే ఇలా కొత్త కారణాలు సృష్టిస్తున్నారు. దస్తగిరి ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆ వెంటనే నర్రెడ్డి సునీత కోర్టులో అఫిడవిట్ వేయడం క్రమం తప్పకుండా జరుగుతోంది. నర్రెడ్డి సునీత డైరెక్షన్లో అప్రూవర్ దస్తగిరి యాక్షన్ చేస్తున్నాడు. ఏకంగా ఎంపీ, సీఎం స్థాయి వారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడంటే అతని దురుద్దేశం అర్థమవుతోంది కదా. అప్రూవర్గా మారడమే వింత.. నిజానికి.. నేరానికి పాల్పడిన వ్యక్తి అప్రూవర్గా మారడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి ఈ కేసులోనే చోటుచేసుకుంది. తాను చేసింది తప్పు అని పశ్చాత్తాపం పడినప్పుడే ఒక వ్యక్తి అప్రూవర్గా మారతాడు. కానీ, కేసులో తనకెలాంటి సంబంధంలేదని దస్తగిరి ముందే ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేశాడు. అందుకు నర్రెడ్డి సునీతగానీ, సీబీఐ వారుగానీ అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చిన వెంటనే దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు. కానీ, వాస్తవాలు పరిశీలిస్తే.. అంతకుముందు ఆగస్టులోనే వివేకానందరెడ్డిని నరికి చంపామని మీడియాతో దస్తగిరి మాట్లాడుతాడు.. ముందస్తు బెయిల్ పిటిషన్లో తనకేమి తెలీదని కోర్టుకు చెబుతాడు.. అయినప్పటికీ నర్రెడ్డి సునీత అభ్యంతరం చెప్పరు. దీన్నిబట్టి.. సీబీఐ, సునీత, దస్తగిరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకే ఆరోపణలు చేస్తున్నారని అర్థమవుతోంది. హత్యచేసిన వ్యక్తి అప్రూవర్గా మారడం సరైంది కాదని మేం పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది. కరెక్ట్ పర్సన్ వచ్చి ఈ పిటిషన్ వేయాలని జడ్జి అభిప్రాయపడ్డారు. సునీత, దస్తగిరి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంవల్లే దానిని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలేదు. ఇంత ఘోరంగా ఈ హత్య కేసులో నర్రెడ్డి సునీత, దస్తగిరి కుమ్మకై వ్యవహరిస్తున్నారు. రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా.. ఇక వాచ్మన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగురిని గుర్తుపట్టి వారి పేర్లు చెప్పాడు. అయినప్పటికీ నలుగురిలో ఒకరిని అప్రూవర్గా తీసుకొస్తారు. ఇదంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది. హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్తే సీబీఐ నో అబ్జెక్షన్ చెబుతోంది. కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయ్యే నర్రెడ్డి సునీత, దస్తగిరి ముందస్తు బెయిల్పట్ల మౌనం వహిస్తుంది. అప్రూవర్ ముసుగులో అత్యున్నతస్థాయి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలకు మసిబూసి..మరోవైపు.. ఘటన స్థలంలో లెటర్ ఉందని పీఏ కృష్ణారెడ్డి చదివి వినిపిస్తే దాచిపెట్టమని వారే చెబుతారు. రక్తగాయాలు ఉన్నాయని చెప్పినా, హార్ట్ అటాక్ కారణంగా కింద పడినప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయని ఊహించామని ఆమె చెబుతోంది. అసలు హార్ట్అటాక్ అనే ప్రచారం నర్రెడ్డి సునీత కుటుంబం నుంచే మొదలైంది. అలాగే, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి మొదట మీడియా ముందుకొచ్చి చెబుతారు. మరోవైపు.. హత్యచేసిన వ్యక్తులు పరారీ కాకుండా డాక్యుమెంట్ల కోసం వెతికామని దస్తగిరి స్వయంగా వెల్లడించాడు. వీటన్నింటినీ నిగ్గు తేల్చాల్సిందిగా నర్రెడ్డి సునీత కోరకపోవడంలోనే అసలు కుట్ర దాగి ఉంది. చివరి ఛార్జిషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతున్నా.. ఈ కేసు చివరి ఛార్జీషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతోంది. మోస్ట్ ఎఫెక్టెడ్గా ఉన్న మా కుటుంబం ఏనాడు మీడియా ముందుకురాలేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉండగా, కొత్తగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టే రావాల్సి వచ్చింది. మరోవైపు.. నర్రెడ్డి సునీత గూగుల్ టేకౌట్ గురించి, ఎంపీ వాట్సాప్ గురించి చెబుతోంది. నెట్ ఆన్లో ఉంటే వాట్సాప్ ఆటోమేటిక్గా యాక్టివ్గా ఉంటుంది కదా.. ముందు గూగుల్ టేకౌట్ పేరుతో మభ్యపెడుతూ వచ్చారు. తర్వాత పొరపాటు పడ్డామని స్వయంగా సీబీఐ కోర్టుకు విన్నవించారు. గూగుల్ టేకౌట్ అనేది కిలోమీటర్ పరిధిలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించి దుష్ప్రచారం చేశారు. ఎంపీ కాకముందు, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ అవినాష్రెడ్డి, మా నాన్న ఇద్దరూ ప్రతిరోజు కలిసి తిరగడమే కాక నిత్యం ఫోన్లో టచ్లో ఉంటారు. ఆ రోజు మాత్రమే ఫోన్లో మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. అసలు.. వివేకా హత్యతో అవినాష్రెడ్డి కుటుంబానికి, మా కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదు. కాకపోతే పథకం ప్రకారం పన్నిన కుట్రలో ఇరుక్కున్నాం. చెయ్యని తప్పుకు మా నాన్న జైల్లో ఉన్నారు. -
Rayachoty: ఔను ఆయనకు టికెట్ లేదు !
సాక్షి ప్రతినిధి, కడప : రాయచోటి టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి పార్టీ వీడనున్నారా..? కుటుంబ సభ్యుడే అన్యాయానికి ఒడిగట్టారని విశ్వసిస్తు న్నారా.. చంద్రబాబు నియంతృత్వ, ఏకపక్ష ధోరణిపై ప్రతీకారం తీర్చుకునేందుకు రగిలిపోతున్నారా? అని ప్రశ్నిస్తే విశ్లేషకులు ఔను అనే సమాధానం ఇస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే రమేష్కుమార్రెడ్డి వ్యవహారశైలి కన్పి స్తోంది. సోమవారం లక్కిరెడ్డిపల్లె కేంద్రంగా కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. టికెట్ లేదంటూ తేల్చి చెప్పిన అధిష్టానంపై ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆరు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచర ప్రకటించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇరువైఏళ్లుగా పార్టీనే అంటిపెట్టుకున్నాం, నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చిత్తశుదిత్ధో చేపట్టాం. అయినప్పటీకీ టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఎవరి విజయం కోసం పనిచేయాలని చెబుతోంది. ఇక పార్టీలో ఉండలేం, మనదారి మనం చూసుకోవాలని సన్నిహితులతో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఆదివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రీజనల్ ఇన్చార్జి దీపక్రెడ్డిలు మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డిని పిలిపించుకొని మాట్లాడారు. ఈమారు ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు ప్రత్యామ్నాయంగా మీకేమి పదవి కావాలో చెప్పండి, అధినేత చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడం మినహా మరే పదవి వద్దని రమేష్ కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం. ఒక్కసారి అధినేత చంద్రబాబుతో మాట్లాడించండి, తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినా నిష్ప్రయోజనమే అయినట్లు తెలుస్తోంది. కాగా సోమవారం మండలాల వారీగా కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత లక్కిరెడ్డిపల్లె మండల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన రమేష్ నియోజకవర్గంలో అభివృద్ధి చేపట్టలేదని వివరిస్తూనే, ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. సోదరుడు శ్రీనివాసులరెడ్డిపై గుర్రు.. చంద్రబాబు టికెట్ నిరాకరణకు సోదరుడు, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కారకుడని మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి టికెట్ మా అన్నకు ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయలేనంటూ టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పలేదనే ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తల ఊపి వచ్చాడని, ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ మేరకే శ్రీనివాసులరెడ్డి మౌనం వహించారని తెలుస్తోంది. కుటుంబం, సోదరుడు కంటే శ్రీనివాసులరెడ్డికి పదవే ముఖ్యమైందా? ఇక తనతో కూడా తెగదెంపులు చేసుకోవాలనే దిశగా రమేష్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రెడ్డెప్పగారి కుటుంబ సభ్యులు, బంధువులంతా మాజీ ఎమ్మెల్యే రమేష్ నిర్ణయానికే అనుగుణంగా నిలిచేందుకు సంసిద్ధులైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫొటో ఎత్తేశారు సోమవారం సాయంత్రం లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ కేడర్తో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలో లేకుండా ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు, తన తండ్రి మాజీ మంత్రి రాజగోపాల్రెడ్డి ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీలో వాడుకున్నారు. ఎక్కడ కూడా టీడీపీ జెండా ఏర్పాటు చేయలేదు. పైగా తన సోదరుడు పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీలో లేదు. ఇవన్నీ రమేష్కుమార్రెడ్డి టీడీపీ వీడేందుకు చిహ్నాలుగా స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆరు మండలాలకు చెందిన కేడర్తో సమావేశం పూర్తయిన తర్వాత టికెట్ విషయమై బహిర్గత పర్చనున్నట్లు సమాచారం. ఇరువై ఏళ్లుగా మీకు తోడు నీడగా ఉంటున్నా, ఇప్పుడేమి చేయాలో మీరే చెప్పాలని కార్యకర్తల అభిప్రాయాలు కోరనున్నట్లు తెలుస్తోంది. కలిసివచ్చే వారందరీతో టీడీపీ పార్టీ పదవులకు రాజీనామా చేయాలనే ఆలోచన దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. -
అనూహ్యంగా వచ్చి మంత్రినే ఓడించిన యశస్విని
జనగామ/తొర్రూరు/దేవరుప్పుల: రాజకీయాలతో ప్రత్యక్షంగా అనుభవం లేని యువతి అసెంబ్లీ ఎన్ని కల్లో విజయ దుందుభి మోగించారు. తొలి ఎన్నికలోనే 66 ఏళ్ల రాజకీయ నేత ఎర్రబెల్లిని 26 ఏళ్ల యశస్వినిరెడ్డి మట్టి కరిపించి.. విజయకేతనం ఎగురవేశారు. పాలకుర్తి నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన మామిడాల యశస్వినిరెడ్డి వివాహం అనంతరం అమెరికాకు వెళ్లారు. అక్కడ కొంతకాలం అత్తామామలకు సహకారంగా సొంత వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు. వాస్తవానికి పార్టీ అధిష్టానం తొలుత యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. పౌరసత్వం విషయంలో అడ్డంకులు రావడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనూహ్యంగా ఆమె కోడలు యశస్వినిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆమె స్థానంలో కోడలు యశస్వినిరెడ్డికి అవకాశమివ్వాలని ఝాన్సీరెడ్డి పార్టీని కోరడంతో అధిష్టానం టికెట్ ఇచ్చింది. పాలకుర్తి అసెంబ్లీ చరిత్రలో తొలిసారి 26 ఏళ్ల పిన్న వయస్కురాలిగా యశస్విని గెలుపొందారు. పాత చెన్నూరు ప్రస్తుత పాలకుర్తి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రెండో మహిళగా యశస్వినిరెడ్డి నిలిచారు. నాడు 26.. నేడూ 26 పాలకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నిక చిత్రవిచిత్రాలకు నెలవుగా మారింది. గెలిచినా, ఓడినా అభ్యర్థులకు 26 సంఖ్యతో అనుబంధం ఉంది. 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది 40 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా దయాకర్రావు రాజకీయం నడిపారు. ఆయనపై 26 ఏళ్ల యువతి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 66 ఏళ్ల రాజకీయ ఉద్ధండుడు 26 ఏళ్ల యువతి చేతిలో ఓడడం, ఏ వయసులో రాజకీయం ప్రారంభించాడో అదే వయసు యువతిపై ఓటమి పాలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ
పాలకుర్తి/పాలకుర్తి టౌన్/కొడకండ్ల/పెద్దవంగర : ఆడబిడ్డగా మీ ముందుకొచ్చాను.. ఆశీర్వదించి గెలిపించండి.. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది అభివృద్ధి మార్క్ చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా సోమవారం కొడకండ్ల మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. మా అత్త మామ హనుమాండ్ల రాజేందర్రెడ్డి ఝాన్సీరెడ్డి ముప్పై ఏళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం.. దోచుకొవడానికి దాచుకొవడానికి కాదు.. అది మా కుటుంబ నైజం కాదు.. దగాకోరు దయాకర్రావు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుయాయులకే కట్టబెట్టారు.. తనను గెలిపిస్తే అర్హులందరి కీ అందేలా చూస్తానన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకురాలి గా పనిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేతనాన్ని కూడా ప్రజల అభివృద్ధికే వెచ్చిస్తానని అన్నా రు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను రూపొందించింద ని, అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలి పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది.. ప్రజలు అండగా నిలిచి పాలకుర్తిలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ప్రవీణ్కుమార్, పార్టీ మండల కోఆప్షన్ సభ్యుడు నసీరుద్దీన్, నాయకులు అబ్దుల్లా, పులి గణేష్, వెంగల్రావు, సురేష్నాయక్, రాజేష్నాయక్, ఉప్పల చిన్నసోమయ్య, వనం మోహన్, మనోహర్, వంశీకృష్ణ, సోమనర్సయ్య, భిక్షపతి, యాకేష్ పాల్గొన్నారు. కేసీర్ కుటుంబమే బాగుపడింది పాలకుర్తి మండల పరిధి అయ్యంగారిపల్లి, గోపాలపురం, రాఘవాపురం, కిష్టాపురంతండా, పెద్దతండా, బమ్మెర గ్రామాల్లో యశస్వినిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం యశస్వినిరెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల బీఎస్ఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి, దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు వంటి పేర్లు చెప్పి కేసీఆర్ ప్రజలను వంచించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, తిరుమలగిరి, సర్పంచ్లు బక్క పుల్లయ్య, జలగం నాగభూషనం, మంద కొమురయ్య, సోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని టీపీసీసీ సభ్యురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. సోమవారం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ బొమ్మెర స్వరూప, 10వ వార్డు సభ్యులు రాంపాక లావణ్య, బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ జలగం ప్రభాకర్ తదితరులు యాసారపు కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సంర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. ఇక నుంచి కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేంది లేదని హెచ్చరించారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్వినిరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అశోక్, శేఖర్, యాకయ్య, రంజాన్, రజిత, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాపై పోటీకి అభ్యర్థులే లేరు
రాయపర్తి: ‘నాపై పోటీకి అభ్యర్థులే కరువయ్యారు.. అమెరికా నుంచి టూరిస్టులను తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిండ్లు’ అని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. శుక్రవారం మండలంలోని తిర్మలాయపల్లి, రాయపర్తి, గన్నారం, కొండూరు, బురహాన్పల్లి, కాట్రపల్లి, మొరిపిరాల, కిష్టాపురం, మహబూబ్నగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలినడకన ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ అని తేల్చిచెప్పారు. తాను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశా రు. సేవ చేశానే తప్ప అవినీతి పేరు తెచ్చుకోలేదు.. దయాకర్రావు హామీ ఇచ్చాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశాను.. కొత్తగా చేర్చిన హామీల ప్రకారం ప్రతి గ్రామంలో వంద డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా.. పదివేల మంది మహిళలకు కుట్టుశిక్షణ ఇప్పించి సంగెం టెక్స్టైల్ పార్కులో ఉద్యోగ అవకాశం కల్పిస్తా.. తిర్మలాయపల్లి, తొర్రూరులో ఆయిల్పాం మిల్లు పెట్టిస్తున్నాను.. అందులో వెయ్యిమందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేశాను.. కొడకండ్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయించాను.. గ్రామాల్లో ఉన్న కోతులను పట్టించి ఏటూరునాగారం అడవుల్లో వదలడమే కాకుండా అక్కడ కోతులకోసం పండ్ల మొక్కలను నాటించానని వివరించారు. ఆదరించి గెలిపిస్తే మీముందుకు వచ్చి మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్రావు, బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జ్ గుడిపూడి గోపాల్రావు, మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్రావు, పూస మధు, వనజారాణి, ఎండీ.నయీం, గబ్బెట బాబు, సర్పంచ్, ఎంపీటీసీలు గారె నర్సయ్య, గజవెల్లి అనంత, రాధిక, ఐత రాంచందర్, కర్ర సరితరవీందర్రెడ్డి, కుక్కల భాస్కర్, గాదె హేమలత పాల్గొన్నారు. పద్మశాలి సంఘం మద్దతు కొడకండ్ల: బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావుకు మండల పద్మశాలి సంఘం మద్దతు తెలిపింది. అధ్యక్షుడు పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో శుక్రవారం కులస్తులు మంత్రిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సొంత గూటికి చేరిన కార్యకర్తలు పాలకుర్తి : మండలం నుంచి కాంగ్రెస్లో చేరిన పలువురు కార్యకర్తలు కళాకారుడు చిరుపాటి ఎల్ల్ల స్వామి, రాజు మరో 20 మంది తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు శుక్రవారం వారిని మంత్రి దయాకర్రావు సతీమణి, ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదేవి స్వాగతించి కండువాలు కప్పారు. పాలకుర్తి వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు, ముదిరాజ్ సంఘం నాయకుడు మామిండ్ల శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు దేవరుప్పుల : పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు విజయం సాధించాలని కోరుతూ.. కామారెడ్డిగూడెం మసీదులో శుక్రవారం ముస్లింలు మతగురువు ఇనాయత్ రసూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఖాసీం, జాకీర్, ఖలీల్, షబ్బీర్, మీరాన్, అర్జుమాన్, మౌలానా, పాషా, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కార్పొరేటర్ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు
బోడుప్పల్: కాంగ్రెస్ పార్టీ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనిత ఇంటికి సోమవారం బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు చామకూర ప్రీతిరెడ్డి వచ్చారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన దానగల్ల అనిత బీఆర్ఎస్లో చేరగా, వారం రోజుల క్రితం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ప్రీతిరెడ్డి కలిసి మళ్లీ బీఆర్ఎస్లో చేరాలని కోరారు.. తమను బీఆర్ఎస్లో చాలా ఇబ్బందులకు గురి చేశారని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఇంటికి వచ్చి ఎన్నికల సమయంలో ప్రలోభపెడుతున్నారని వాదించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డి కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారికి ఓట్లు వేయవద్దంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి ప్రీతిరెడ్డి కారులో వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. అడ్డుకున్న వారిలో కాంటెస్ట్డ్ కార్పొరేటర్ రాపోలు ఉపేందర్, నాయకులు చెంచల నర్సింగ్రావు, గోపు రాము, జయేందర్రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. -
విలువలకు నిదర్శనం రావి జీవితం
కుటుంబం కోసం కాకుండా జీవితాంతం ప్రజల కోసం పరితపించిన తన తాత రావి నారాయణరెడ్డి జీవితం తనకు ఆదర్శమని ఆయన మనవరాలు రావి ప్రతిభారెడ్డి తెలిపారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా హరిజనులు, సామాన్యుల అభ్యున్నతి కోసం తపిస్తూ సాధారణ జీవితాన్ని గడిపారని.. ఎంపీగా పొందిన పింఛన్ను సైతం ప్రజల అవసరాల కోసం ఖర్చు చేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. విలువలు, దార్శనికత కలిగిన రావి నారాయణరెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి ప్రభావం తనపై ఎంతో ఉందని ప్రతిభారెడ్డి చెప్పారు. తాత చూపిన మార్గంలో పయనించాలని ఉద్యోగాన్ని వదిలేశానని, ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాటం.. అందులో పాల్గొన్న వీరుల చరిత్ర తెలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నెహ్రూకన్నా ఎక్కువ ఓట్లు.. అయినా నిగర్వి.. రావి నారాయణరెడ్డి ఓ నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు. నీతి, నిజాయతీ కోసం ప్రాణం ఇచ్చేవారు. విలువలకు ఆయన ప్రాధాన్యతను ఇచ్చే వారు. ఆయన 1952 ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా, ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారంటేనే ఆయన నీతి నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంపీగా నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్న గర్వం ఆయనలో ఎప్పుడూ కనిపించేది కాదు. హరిజనులను ప్రేమించే వారు.. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ తాత సాధారణ జీవితం గడిపే వారు. తనకున్న 500 ఎకరాల భూమిని హరిజనులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇంట్లో కార్లు కూడా ఉండేవి కాదు. ఆయనకు రెండు, మూడు జతల దస్తులే ఉండేవి. నానమ్మ బంగారు నగలను గాంధీజీ హరిజన సేవా సంఘానికి ఇచ్చారు. హిమాయత్నగర్లో మా ఇంటికి ఎప్పడూ భువనగిరి నుంచి వచ్చే వారికి నానమ్మ అన్నం పెట్టేది. తినకుండా ఎవరినీ వెళ్లనిచ్చే వారుకాదు. తాత చివరి దశలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి చూడటానికి వచ్చి నీకు ఏమైనా కావాలా అని అడిగితే కుటుంబం కోసం కాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయం చేయాలని అడిగారు. తాతయ్యతో ఎంతో అనుబంధం .. చిన్నతనం నుంచి హిమాయత్నగర్లోని మా ఇంట్లో తాతయ్య రావి నారాయణరెడ్డి దగ్గరే పెరిగాను. నాపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. నేను 8, 9 తరగతులు చదువుతున్న వయసులో హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలు, సమావేశాలతోపాటు రెడ్డి హాస్టల్కు నన్ను ఎప్పుడూ తీసుకెళ్లేవారు. నిజాయితీగా ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని నాకు చెప్పేవారు. ఆడపిల్లలకు చదువు అవసరమనేవారు. నన్ను కూడా బాగా చదువుకోమనే వారు. ఇంట్లో నానమ్మ రావి సీతాదేవి, మేనేత్త రావి భారతి, అమ్మానాన్నలు రావి ఉర్మిల, సంతో‹Ùరెడ్డిలు ఉండేవారు. అప్పుడున్న పరిస్థితులను చర్చించే వారు. స్త్రీలకు సమాన హక్కులు, విద్య, రైతాంగ సమస్యలు, సామాజిక విప్లవం, రాజకీయ చైతన్యం గురించి చెప్పేవారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, విద్యా, వైద్యసౌకర్యాలపై చర్చించే వారు. ఆయా అంశాలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. తాతయ్య ఆశయాల సాధన కోసం 17 సంవత్సరాలు చేసిన ఉద్యోగం వదిలి ఆయన చూపిన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నా. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనుంది.. తాత కోరుకున్న సమ సమాజం కోసం పనిచేస్తా. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 4 వేల కుటుంబాలకు ఏదైనా మంచి చేయాలన్న తాత ఆలోచనలను ముందుకు తీసుకెళ్తా. బొల్లేపల్లిలోని పాఠశాలతో నాకు అనుబంధం ఉంది. దానికోసం నాకు ఏమైనా చేయాలని ఉంది. గత సంవత్సరం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. జూన్ 4న తాత జయంతి సందర్భంగా టెన్త్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నగదు బహుమతులు అందజేశాం. బొల్లేపల్లిలో శిథిలావస్థలో ఉన్న తాత పుట్టిన ఇంటిని బాగు చేసి సంక్షేమ సెంటర్గా తీర్చిదిద్దుతా. అక్కడ స్త్రీల సాధికారత కోసం కంప్యూటర్ విద్య, కుట్టు పనులు నేర్పిద్దామనుకుంటున్నా. నేటి రాజకీయం డబ్బుమయం.. ప్రస్తుతం రాజకీయాలు డబ్బులమయమయ్యాయి. తాత లాగా ముక్కుసూటిగా మాట్లాడే వారు ఇప్పుడు రాజకీయాల్లో నెగ్గలేరు. ప్రస్తుతం నాయకులు పార్టీలు మారడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. ప్రజలు సంక్షేమ పథకాలకు, డబ్బులకు అలవాటుపడ్డారు. ఓట్ల కోసం నాయకులు ఇస్తున్న డబ్బుతో చిన్నచిన్న అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకునికి ఐదేళ్ల కాలానికి చేసే అభివృద్ధి విజన్ ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలిసి ఉండాలి. అలాంటి వారినే ప్రజలు ఎన్నుకోవాలి. - యంబ నర్సింహులు -
బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇంజినీరు భరత్రెడ్డి మృతి
కర్ణాటక: ఓవర్టేక్కి తోడు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక యువకుడు నిండు ప్రాణం పోగొట్టుకున్న సంఘటన యలహంక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సివిల్ ఇంజినీరు కమ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్న భరత్రెడ్డి (26) మృతుడు. బుధవారం సాయంత్రం భరత్రెడ్డి అట్టూరు వైపు నుంచి స్కూటర్పై వెళ్తూ ముందు వెళ్తున్న బీఎంటీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సును ఢీకొని కిందపడిపోయాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా భరత్రెడ్డి మీద నుంచి బస్సును పోనివ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తల పూర్తిగా ఛిద్రమైపోయింది. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ బస్సు వదిలి పరారయ్యాడు. రోడ్డు ఇరుకుగా ఉండడం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. యలహంక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భరత్రెడ్డి స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా కాగా, బెంగళూరులోనే కత్రిగుప్పెలో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్ను శిక్షించాలని డిమాండ్ భరత్రెడ్డి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బీఎంటీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని, అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుని చిన్నాన్న నారాయణరెడ్డి మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు యలహంకలో జరుగుతున్న ఒక నిర్మాణ పని చూడడానికి వెళ్లాడు. బస్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడుపుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు అని ఆయన వాపోయారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సొంతూరికి తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం యలహంక పోలీసులు గాలింపు చేపట్టారు. -
కేబుల్రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
రాజ్యంకోసం మహిళ పోరాటం
మోనికా రెడ్డి ప్రధాన పాత్రలో రాకేష్ రెడ్డి యాస దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయింది. సుధ క్రియేషన్స్పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, షేడ్స్ స్టూడియో ఫౌండర్ దేవీ ప్రసాద్ బలివాడ క్లాప్ ఇచ్చారు. మోనికా రెడ్డి మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ మైథలాజికల్గా రూపొందనున్న చిత్రమిది. కథ అంతా నా పాత్ర చుట్టూ తిరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజ్యం కోసం ఓ మహిళ ధైర్యసాహసాలతో ఎలా పోరాడింది? అన్నదే ఈ చిత్రం కథాంశం’’ అన్నారు రాకేష్ రెడ్డి యాస. ‘‘నయనతార, అనుష్కగార్లలా మోనికకు మంచి పేరు రావాలి’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి. -
Rajampeta : పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న ప్రవాసాంధ్రుడు
కడప: దృష్టి.. జీవన ప్రయాణంలో అత్యంత కీలకం. కళ్లు సరిగా ఉంటే.. ఏ పనయినా చేసుకోవచ్చు. కానీ కొందరు కళ్లను సరిగా పట్టించుకోకపోవడం వల్ల అది దృష్టి లోపానికి దారి తీస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కంట్లో శుక్లాలకు దారి తీస్తుంది. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలిచారు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు వల్లూరు రమేష్ రెడ్డి.ఆకేపాడు గ్రామంలోని అమర్నాథరెడ్డి నివాసంలో చెన్నై శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 రోజులపాటు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రవాణా సదుపాయంతో పాటు ఉండేందుకు వసతి కల్పించారు. ఈ శిబిరం ద్వారా ఏకంగా 238 మంది కంటి శస్త్రచికిత్సలు చేయించుకోవడం నిజంగా గొప్ప విషయం. శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నివేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలనే ఉద్దేశంతో పట్టణాన్ని సైతం వదిలి స్వగ్రామంలోనే నివాసం ఉంటూ నిత్యం వివిధ రకాల సేవలను పేదలకు అందిస్తున్న జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి సేవా తత్పరుడని కడప మేయర్ సురేష్ బాబు తెలిపారు. అలాగే వైఎస్సార్సిపి అమెరికా కన్వీనర్ వల్లూరు రమేష్ రెడ్డి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం 30 లక్షల రూపాయలు వెచ్చించి ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించి 238 మందికి కంటి చూపు తెప్పించడం చాలా అదృష్టమని అన్నారు. ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరవకుండా బడుగులకు సేవలు అందిస్తోన్న వల్లూరు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 12 రోజులు పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 1032 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 238 మందిని ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. పూర్తిగా ఉచితంగా ఈ చికిత్స అందించడంతో పాటు అద్దాలు, మందులను కూడా పంపిణీ చేశారు. ఎప్పుడో ఓసారి ఎక్కడో ఓ చోట ఏవైనా కార్పొరేట్ ఆసుపత్రులు ఒక్కరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారని కానీ 12 రోజులు పాటు ఏకతాటిగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని సురేష్బాబు కొనియాడారు. రమేష్ రెడ్డి చేసిన సేవకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరూ ఆకేపాటి అమర్నాథరెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారి వారి స్వగ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పుట్టిపెరిగిన గడ్డ అమ్మకు సమానమని, ఆ మాతృభూమికి ఎంతో కొంత సేవ చేసే అవకాశం నిజంగా అదృష్టమన్నారు రమేష్ రెడ్డి వల్లూరు. వైఎస్సార్ కడప జిల్లా నుంచి మూడు దశాబ్దాల కింద అమెరికా వెళ్లిన రమేష్ రెడ్డి ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి.లో స్థిరపడ్డారు. ఇటీవలే తన తల్లితండ్రుల స్మృతిలో భాగంగా శంకర నేత్రాలయ ద్వారా ఈ ఉచిత కంటి శిబిరానికి తన వంతుగా చేయూత నిచ్చారు. 👁️ Proud to share that I've made a my contribution to a health camp that provided free eye check-ups for 1000+ patients and free surgeries for 238 people. We’re making a difference in improving lives! 🙏 💪❤️ #HealthcareForAll #CommunityImpact #GivingBack #CMJagan #AndhraPradesh — Ramesh Valluru Reddy (@YSRDist_RameshR) September 7, 2023 ఈ శిబిరానికి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు గజేందర్ కుమార్ వర్మ, డాక్టర్ సురభి, డాక్టర్ శంకర్ హాజరై శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశారు. వీరికి శంకర నేత్రాలయ నుంచి అరుల్ కుమార్, రంజిత్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, వైసీపీ నాయకులు పోలి మురళి, దాసరి పెంచలయ్య, డీలర్ సుబ్బరామిరెడ్డి, మహర్షి, రమేష్ నాయుడు పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నారు. యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని టీ–హోప్ కార్యాలయంలో ఆదివారం అజహరుద్దీన్ ఆ సంస్థ చైర్మన్ ఉపేందర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ... స్థానికంగా ఉపేందర్రెడ్డి ఇప్పటికే ఎన్నోమార్లు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారని, ప్రజాభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. అలాంటి నాయకుడు తమకు సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపితే ఇక్కడ కాంగ్రెస్ విజయం తధ్యమవుతుందని అజహరుద్దీన్ స్పష్టం చేశారు. ఉపేందర్రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందించదగ్గవని ఆయన పేర్కొన్నారు. ఇక్కడకు వచి్చన మహిళల ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, ఇక కాంగ్రెస్ తిరుగులేదని అనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలందరికీ మంచి జరగాలని తపన పడుతున్న ఆయనకు భవిష్యత్లో మంచే జరుగుతుందన్నారు. టికెట్ అనేది త్వరలోనే తెలుస్తుందని, అయితే ప్రతి ఒక్కరూ కలిసి పార్టీకి విజయం చేకూర్చాలనే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ... టీ–హోప్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకుని కాంగ్రెస్ నాయకులందరూ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైమ్ కథనాలే స్ఫూర్తి!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు (టీఎస్–నాబ్) చిక్కిన ‘ఫిల్మ్ ఫైనాన్షియర్’కారుమూరి వెంకట రత్నారెడ్డికి సంబంధించి మరో వ్యవహారం బయటపడింది. క్రైమ్ కథనాలే స్ఫూర్తిగా నకిలీ ఐఆర్ఎస్ అధికారం ఎత్తాడని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీ కేసులో ఇతడిని కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు. ఆ తర్వాతే నిందితులు ఎందరనే అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వెన్నెముక విరగడంతో కథ అడ్డం... గుంటూరు నగరానికి చెందిన కె.వెంకట రత్నా రెడ్డి అలియాస్ రత్నారెడ్డి అలియాస్ కేవీఆర్ రెడ్డి బీఎస్సీ పూర్తి చేశాడు. ఆపై కొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా చేసి బిల్డింగ్ ఎలివేషన్స్ డిజైనర్ గా స్థిరపడ్డాడు. 2007 లో ఓ బిల్డింగ్ వర్క్ చేస్తుండగా... ప్రమాద వశాత్తూ జారి పడటంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. ఈ గా యంతో చాలా కాలం పాటు మంచం పట్టిన రత్నారెడ్డి అప్పట్లో వార్తా పత్రికలు, చానళ్లలో వచ్చే క్రైమ్ కథనాలను ఆసక్తిగా చూసేవాడు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుంటూ అమాయకులను మోసం చేసి భారీగా దండుకుంటున్న వైనంపై వెలువడిన కథనాలు ఇతన్ని ఆకర్షించాయి. ఆ స్ఫూర్తితోనే తానూ అదే రకంగా మోసాలు చేసి తేలిగ్గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కేవీఆర్ రెడ్డిగా అవతారం... అనుకున్నదే తడవుగా మోసాలు ప్రారంభించేందుకు అవసరమైన సరంజామా సిద్ధం చేసుకున్నాడు. కేవీఆర్ రెడ్డి పేరుతో ఐఆర్ఎస్ అధికారిగా పేర్కొంటూ ఓ బోగస్ గుర్తింపుకార్డు తయారు చేశాడు. ఇదే పేరు, హోదాలతో కొన్ని విజిటింగ్ కార్డులు సైతం రూపొందించుకున్నాడు. తనకు తానే హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లోని కమిషనర్స్ ఫర్ డిపార్ట్మెంట్ ఎక్వయిరీస్లో సూపరెంటెండెంట్గా హోదా క్రియేట్ చేసుకున్నాడు. నగరంలోని కృష్ణనగర్ ప్రాంతానికి చెందిన నర్సింహ నుంచి రూ.6 వేలు వెచ్చించి ఓ బొమ్మ పిస్తోలు కొనుగోలు చేశాడు. గుంటూరులోని ఓ షోరూమ్లో ఫైనాన్స్పై కారు కొన్నాడు. దానిపై ప్రభుత్వ చిహ్నం ఏర్పాటు చేయడంతో పాటు నెంబర్ ప్లేట్లపై గవర్నమెంట్ వెహికిల్ అని రాయించడం ద్వారా ఉన్నతాధికారిగా ‘కలర్’ఇచ్చాడు. వీటి సాయంతో తాను ఐఆర్ఎస్ ఆఫీసర్ అని నమ్మిస్తూ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉందని, అనేక ప్రాజెక్టులు ఇప్పిస్తానని మోసాలకు తెరలేపాడు. వరుస పెట్టి నేరాలు... తాను ఐఆర్ఎస్ అధికారినంటూ నగరానికి చెందిన పి.వెంకటరామ్ అలియాస్ భీష్మాజీతో పరిచయం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆన్ లైన్’ అనే ప్రాజెక్టు ఇప్పిస్తానని, దీని విలువ రూ.5 కోట్లకుపైగా ఉంటుందని నమ్మబలికి ఆయన నుంచి రూ.11 లక్షలు వసూలు చేశాడు. వరంగల్కు చెందిన బాల్కిషోర్రెడ్డికి, ఆయన సంబందీకులతో ఉన్న సివిల్ వివాదాన్ని సెటిల్ చేయడానికి రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఓ ఆర్థిక వివాదంతో కూకట్పల్లికి చెందిన గోపి అనే వ్యక్తిని బెదిరించాడు. తాను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారినంటూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పైరవీలు చేయడం ప్రారంభించాడు. -
ఆ భూకేటాయింపు సమర్థనీయమేనా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇవ్వడం ఎలా సమర్థనీయమో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బుద్వేల్ సర్వే నంబర్ 325/3/2లో 5 ఎకరాల భూమిని 2018 సెప్టెంబర్ 9న రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 195ను కూడా వెలువరించింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్కు చెందిన కె.కోటేశ్వర్రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. జీవో జారీ చేసిన సర్కార్ దాన్ని రహస్యంగా ఉంచడంవల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. -
వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గంలో తదుపరి గెలుపు ఎవరిది..?
కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పట్నం నరేంద్రరెడ్డి, కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డిపై 9319 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న నరేంద్ర రెడ్డిని టిఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొడంగల్లో పోటీకి దించింది. ముఖ్యమంత్రి కెసిఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే రేవంత్ రెడ్డినియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన టిడిపి పక్షాన రెండుసార్లు ఎన్నికయ్యారు. తదుపరి ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉంటూ, ఆ పార్టీని వదలి కాంగ్రెస్ ఐలో చేరి వర్కింగ్ అద్యక్షుడు అయ్యారు. నరేంద్ర రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి సోదరుడు అవుతారు. నరేంద్ర రెడ్డికి 80754 ఓట్లు రాగా, రేవంత్ రెడ్డికి 71435 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీచేసిన బాలకిషోర్కు నాలుగువేల ఓట్లు వచ్చాయి. కాగా రేవంత్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికలలో మల్కాజిగిరి నుంచి పోటీచేసి గెలుపొందడం విశేషం. తదుపరి రేవంత్ పిసిసి అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2014లో ఐదుసార్లు గెలిచిన సీనియర్ నేత గురునాధరెడ్డిని 14614 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన గురునాధ రెడ్డి 2014లో టిఆర్ఎస్లో చేరి పోటీచేశారు. అయినా ఫలితం దక్కలేదు. 2014లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్.పి విఠల్రావు 36304ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికే పరిమితం అయ్యారు. రేవంత్రెడ్డి ఒకసారి శాసనస మండలికి కూడా ఎన్నికయ్యారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి తమ్ముడికి అల్లుడు. కొడంగల్లో గురునాధ రెడ్డి ఐదుసార్లు 1978, 1983, 1989, 1999, 2004లలో గెలుపొందారు. కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి ఐదుసార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. కొడంగల్లో నందారం వెంకటయ్య ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు టిడిపి తరుపున గెలవగా ఆయన మరణం తర్వాత 1996లో జరిగిన ఉపఎన్నికలో వెంకటయ్య కుమారుడు సూర్య నారాయణ గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.అచ్యుతరెడ్డి కొడంగల్లో రెండుసార్లు గెలిచారు. కొడంగల్లో ఇంతవరకు పన్నెండుసార్లు రెడ్లు గెలుపొందితే, నాలుగుసార్లు వైశ్య సామాజికవర్గం గెలవడం విశేషం. అచ్యుత్ రెడ్డి కొంతకాలం పి.వి.నరసింహారావు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1952లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి వీరాస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బోల్సాలో కలెక్టర్ పర్యటన!
నిర్మల్: భారీ వర్షం, వరదలకు ముంపునకు గురైన బోల్సా గ్రామంలో కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి శుక్రవారం పర్యటించారు. నీట మునిగిన ఇళ్లను, కొతకు గురైన రోడ్లను పరిశీలించారు. వరదలతో నష్టపోయిన బాధితుల వివరాలు సేకరించి వారికి పరిహారం అందేలా చూస్తామన్నారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. ముంపు బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ కొతకు గురైన రోడ్లుకు మరమ్మతు చేపట్టేలా చూస్తామని తెలిపారు. సంబంధిత అధికారులతో పంట నష్టం సర్వే నిర్వహించి బాధితులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. వారివెంట డీఎల్పీవో శివకృష్ణ , మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, నాయకులు పోతారెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోపీనాథ్, గ్రామస్తులు ఉన్నారు. భారీ వాహనాలను అనుమతించొద్దు అర్లి వంతెన నుంచి భారీ వాహనాలను అనుమతించొద్దని కలెక్టరు వరుణ్రెడ్డి సూచించారు. హవర్గ గ్రామ సమీపంలోని అర్లి వంతెనను శుక్రవారం పరిశీలించారు. వంతెనకు వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. సుద్దవాగు పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఎంపీడీవో సోలమాన్రాజ్, విద్యుత్ ఏఈ శివకుమార్, ఆర్ఆండ్బీ డీఈ కొండయ్య, స్థానిక సర్పంచ్ భూజంగ్రావు ఉన్నారు. -
గుండెపోటుతో కాదు..గాయాల వల్లే.. భర్త వల్లభ్రెడ్డి అరెస్టు
హైదరాబాద్: హిమాయత్నగర్కు చెందిన వివాహిత లహరి మృతి వివాదాస్పదంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఆమె గుండెపోటుతో మృతిచెందిందని లహరి తండ్రి జైపాల్రెడ్డికి సమాచారం అందింది. తాజాగా ఆమె గుండెపోటుతో కాదని.. తలపై, శరీరంపై గాయాలవ్వడం వల్లే మృతి చెందిందంటూ వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంలో మొదట నుంచి అనుమానంగా ఉన్న ఆమె భర్త వల్లభ్రెడ్డిని నారాయణగూడ పోలీసులు బుధవారం నల్లగొండలో అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...హిమాయత్నగర్కు చెందిన జైపాల్రెడ్డి పెద్ద కుమార్తె లహరికి గత ఏడాది నల్లగొండ జిల్లాకు చెందిన వల్లభ్రెడ్డితో వివాహం జరిగింది. ఈ నెల 15వ తేదీన లహరి గుండెపోటుకు గురై మృతిచెందినట్లు జైపాల్రెడ్డికి సమాచారం అందింది. దీనిపై అదేరోజు తన కుమార్తె మరణంపై అనుమానం లేదంటూనే..తన కుమార్తె మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ జైపాల్రెడ్డి నారాయణగూడ పోలీసులకు రెండు విధాలుగా ఫిర్యాదు చేశాడు. దీనిపై 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లహరి తలకు బలమైన గాయాలయ్యాయని, అందువల్లే మృతిచెందిందని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో లహరి భర్త వల్లభ్రెడ్డిని పోలీసులు బుధవారం నల్లగొండలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. అనంతరం రిమాండ్కు పంపినట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు -
పెళ్లైన 15 నెలలకే విషాదం.. గుండెపోటుతో లహరి మృతి
నల్గొండ: నిడమనూరు మండలం తుమ్మడము గ్రామానికి చెందిన యడవెల్లి లహరి (28) గుండె పోటుతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో మృతి చెందింది. తుమ్మ డం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు , మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయి రెడ్డి తనయుడు వల్లభ్ రెడ్డి భార్య లహరి. హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం అందరూ టిఫిన్ చేశారు. టిఫిన్ చేసిన కొద్ది సేపటికి వేరే రూమ్ కు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడి పోయింది. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా డిండి మండలం నేరెడుకొమ్ము గ్రామానికి చెందిన లహరి కు యడవెల్లి వల్లభ్ రెడ్డి తో గత సంవత్సరం ఏప్రిల్ లో వివాహం జర్పించారు. వివాహం జరిగి 15 నెలలకే లహరి మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు లహరి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. లహరి అంత్యక్రియలు నిడమానూరు మండలం తుమ్మడం గ్రామంలో శనివారం ఉదయం 10-12 గంటల మధ్య నిర్వహించనున్నారు. -
చంద్రయాన్–3లో తెలుగు రక్షణ కవచం!
సాక్షి, అమరావతి: జాబిలిపై అన్వేషణకు బయల్దేరిన చంద్రయాన్–3 ఉపగ్రహానికి రక్షణ కవచం తొడిగారు బెజవాడకు చెందిన ఇంజినీరు బొమ్మారెడ్డి నాగభూషణరెడ్డి (బీఎన్ రెడ్డి). ఉపగ్రహంలో గుండెకాయ వంటి అత్యంత కీలకమైన బ్యాటరీలను కాపాడే రక్షణ కవచాన్ని, మరికొన్ని విడిభాగాలను బీఎన్ రెడ్డి స్థాపించిన ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీనే అందించింది. ఉపగ్రహాల్లో బ్యాటరీలకు రక్షణ కవచాల తయారీలో ఈ సంస్ధ దేశంలోనే పేరెన్నికగన్నది. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఈ కంపెనీ ఇప్పటివరకు 50 శాటిలైట్లకు విడి భాగాలను అందించింది. తాజాగా చంద్రయాన్–3లో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్లో బ్యాటరీలను అమర్చే అల్యూమినియం స్టాండ్స్, నాసిల్స్, స్లీవ్స్ను సమకూర్చింది. గతంలో చంద్రయాన్–1, చంద్రయాన్–2తో పాటు ఇస్రో నిర్వహించిన అనేక ప్రయోగాల్లో ఈ సంస్థ భాగస్వామి అయ్యింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో కలిసి పని చేయడంతో పాటు ఏరో స్పేస్, యుద్ధ విమానాల విడిభాగాలను కూడా వివిధ విమాన తయారీ సంస్థలకు సమకూరుస్తోంది. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తును ఊహించి.. బీఎన్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి విజయవాడ, గన్నవరంలో రైల్వే ఇంజినీరుగా పని చేసేవారు. ఈ క్రమంలోనే బీఎన్ రెడ్డి విద్యాభ్యాసం కేబీఎన్, సిద్థార్థ ఇంజినీరింగ్ కాలేజీల్లో సాగింది. 1982లో హైదరాబాద్ వెళ్లిన ఆయన ఓ చిన్న పరిశ్రమలో ఉద్యోగిగా చేరారు. అనంతరం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్, డిజైనింగ్స్లో మెకానికల్ ఇంజినీరింగ్లో ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత అల్విన్ లిమిటెడ్లో ఉద్యోగంలో చేరారు. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గ్రహించి 1994లో సొంతంగా ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. తొలినాళ్లలో లైట్ ఎయిర్క్రాఫ్ట్ పరికరాలను తయారు చేసేవారు. 1998 నుంచి ఇస్రో ప్రయోగాలకు అవసరమైన వివిధ ఉపకరణాలను అందించడంపై దృష్టి పెట్టారు. బీఎన్ రెడ్డి పనితీరు, నైపుణ్యాన్ని ఇస్రో ఉన్నతాధికారులు 6 నెలల పాటు పరీక్షించారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత అవకాశం కల్పించారు. అల్యూమినియం ప్లాంటు ఏర్పాటుకు విశేష కృషి ఒకప్పుడు శాటిలైట్లో విడి భాగాల తయారీకి ఉపయోగించే ప్రత్యేక అల్యూమినియాన్ని ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇది అధిక సమయం, ఖర్చుతో కూడుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్లోనే నాణ్యమైన అల్యూమినియం ప్లాంటు ఏర్పాటు జరిగింది. ఈ ప్లాంటు ఏర్పాటుకు బీఎన్ రెడ్డి విశేష కృషి చేశారు. దీని ద్వారా ఖర్చు, సమయం ఆదా అవుతున్నాయి. ఇస్రో, నాసాతో భాగస్వామ్యమే లక్ష్యం ‘‘ఇస్రో, నాసాల శాటిలైట్ ప్రయోగాల్లో నా కంపెనీ భాగస్వామ్యం ఉండాలన్నదే నా లక్ష్యం. స్వదేశీ పరిజ్ఞానంతో పరికరాల తయారీ ద్వారా ప్రయోగాల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చంద్రయాన్–3ని కూడా తక్కువ ఖర్చుతోనే చేపట్టారు. ప్రయోగంలో శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అని బీఎన్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
పుష్పారెడ్డికి నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా, ట్రాపిక్, అడ్మిన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేస్తున్న కర్రి పుష్పారెడ్డికి శుక్రవారం ప్రభుత్వం నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. 2012 గ్రూప్–1 బ్యాచ్కి చెందిన పుష్పారెడ్డి 2014 నుంచి హైదరాబాద్ సీఐడీ, సైబర్ క్రైమ్ డీఎస్పీగా, 2018లో కల్వకుర్తి డీఎస్పీగా, 2019 నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2020లో సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేశారు. ఈ మేరకు పుష్పారెడ్డికి సీపీ రంగనాథ్తోపాటు పలువురు పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. -
అదిగదిగో రామాయపట్నం పోర్ట్ 851 ఎకరాల్లో కళ్ళు చెదిరేలా నిర్మాణం
-
తొలగిన ఉత్కంఠ.. నారా భరత్రెడ్డి టికెట్ ఖరారు
సాక్షి,బళ్లారి: నగర, సిరుగుప్ప నియోజకవర్గాల కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. శనివారం ఆ పార్టీ ప్రకటించిన మూడో జాబితాలో జిల్లాకు చెందిన నగర నియోజకవర్గం నుంచి నారా భరత్రెడ్డి, సిరుగుప్ప నుంచి మాజీ ఎమ్మెల్యే బీ.ఎం.నాగరాజు పేర్లను ఖరారు చేశారు. మొదటి జాబితాలోనే గ్రామీణ నుంచి నాగేంద్ర, సండూరు నుంచి తుకారాం, కంప్లి నుంచి గణేష్ల పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నగర నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండటంతో పార్టీ హైకమాండ్ దృష్టికి నారా భరత్రెడ్డితో పాటు జే.ఎస్.ఆంజనేయులు పేర్లు చేరాయి. వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలన్న దానిపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా చర్చలు జరిపి ఎట్టకేలకు మాజీ జెడ్పీ మెంబరు నారా భరత్రెడ్డి పేరును ఖరారు చేశారు. సిరుగుప్ప నుంచి కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలైన మురళీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే నాగరాజు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేయగా, చివరికి నాగరాజుకే టికెట్ దక్కింది. నారా భరత్రెడ్డికి టికెట్ దక్కిందని తెలియగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నగరంలో బాణసంచా కాల్చారు. నగరంలో గాంధీనగర్లోని తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందడి నెలకొంది. గత 10 రోజులుగా తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూసిన నారా అభిమానులకు పార్టీ ప్రకటించిన జాబితాలో భరత్రెడ్డి పేరు ఉండడంతో హర్షం వ్యక్తం చేశారు. -
గడప గడపకు.. కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు
-
Doctor Preeti Reddy: తనను తాను చెక్కుకున్న శిల్పం!
‘విద్య... వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి’ డాక్టర్ ప్రీతి తనకు తానుగా నిర్దేశించుకున్న లక్ష్యం ఇది. ఆమె లక్ష్యసాధనకు భరోసాగా నిలిచింది అత్తిల్లు. ఉచితంగా పురుడు పోసి డెలివరీ కిట్ ఇస్తోంది. ఆడపిల్లను కన్న... తల్లికి ప్రోత్సాహకం ఇస్తోంది. యోగసాధన... నాట్యసాధనతో... తనను తాను పరిపూర్ణం చేసుకుంటోంది. ఒక డాక్టర్ యోగసాధన చేస్తే యోగాసనం వల్ల దేహం ఏ రకంగా ప్రభావితమవుతుందో అధ్యయనం చేయగలుగుతారు. అలాగే ఓ డాక్టర్ శాస్త్రీయ నాట్యసాధన చేస్తే ఒక్కో నాట్య భంగిమ ఏరకంగా ఆరోగ్యకారకమో అవగాహన చేసుకోగలుగుతారు. ఈ రెండూ సాధన చేస్తున్నారు డాక్టర్ ప్రీతీరెడ్డి. వైద్యం చేసే డాక్టర్ ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండాలి, అలాగే నిత్యచైతన్యంతో ఉత్సాహంగానూ ఉండాలి. అప్పుడే పేషెంట్లు ఆ డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడతారు. పేషెంట్ మనసు చూరగొనడమే డాక్టర్ అంతిమలక్ష్యం కావాలి. అందుకే డాక్టర్లకు యోగసాధన చాలా అవసరం అంటారామె. ఇక భరతనాట్యం ప్రాక్టీస్ గురించి చెబుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. సినీగీతాల భరతనాట్యం! ‘‘మాది కర్నాటకలోని హుబ్లి. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్. ఇద్దరికీ పూనాలో ఉద్యోగం. నా ఎల్కేజీ నుంచి పీజీ వరకు పూనాలోనే. మా అమ్మకు భరతనాట్యం ఇష్టం. నాను చిన్నప్పటి నుంచి శిక్షణ ఇప్పించింది. ప్రాక్టీస్తోపాటు నాక్కూడా ఇష్టం పెరిగింది. కానీ మా పేరెంట్స్కి సమాజానికి ఉపయోగపడే సర్వీస్లనే వృత్తిగా ఎంచుకోవడం ఇష్టం. వారి జీవితలక్ష్యం అలాగే ఉండేది. శాస్త్రవేత్తగా పరిశోధనలు చేసినా, డాక్టర్గా వైద్యం చేసినా సమాజానికి సర్వీస్ ఇచ్చే రంగాలే. నాక్కూడా డాక్టర్ కావాలనే కోరిక స్థిరపడింది. కళాసాధనను అభిరుచిగా అయినా కొనసాగించాలనే ఆకాంక్ష అమ్మకి. నా డాన్స్ ప్రాక్టీస్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేది. ఆమె ఆరోగ్యం దెబ్బతిని ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా నా డాన్స్కు అంతరాయం రానిచ్చేది కాదు. నాకు పద్నాగేళ్లున్నప్పుడు అమ్మ ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. అమ్మకు ఇష్టమైన కళ కాబట్టి భరతనాట్యం కొనసాగించాను. సంప్రదాయ భరతనాట్యంలో ప్రయోగాలు కూడా చేస్తున్నాను. తెలుగు సినిమా పాటలను భరతనాట్యంలో కంపోజ్ చేయడం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయోగం. నభూతో అని చెప్పగలను. మా యూనివర్సిటీకి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారొచ్చినప్పుడు ప్రదర్శన ఇచ్చాను. ఆయన పాటల్లో బాగా ఆదరణ పొందిన 29 పాటలను ఎంచుకుని చేసిన ఫ్యూజన్ అది. ఆ రోజు అక్టోబర్ 29. అందుకే 29 పాటల థీమ్ తీసుకున్నాను. 20 నిమిషాల్లో పూర్తయ్యేటట్లు పాటల పల్లవులను మాత్రమే తీసుకున్నాను. ఆ నాట్యసమ్మేళనాన్ని చిరంజీవిగారికి అంకితం చేశాను. ఆ పెర్ఫ్మార్మెన్స్ చిరంజీవి గారు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నాకది గొప్ప ప్రశంస. అమ్మాయి పుడితే బహుమతి! డాక్టర్గా వైద్యం చేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, ఇంకా ఎక్కువగా ఏదైనా చేయాలనిపించింది. భగవంతుని దయ వలన వెసులుబాటు కూడా వచ్చింది. నా ఆలోచనలు, ఆశయాలను మా గ్రూప్లోని టీచింగ్ హాస్పిటళ్లలో ఒక్కటోక్కటిగా చేరుస్తూ వచ్చాను. అలా వచ్చినవే... ఫ్రీ ట్రీట్మెంట్, అమ్మాయి పుడితే ఐదువేలు నగదు బహుమతి. కరోనా సమయంలో మేము ఉచితంగా వైద్యం చేశాం. డెంటల్ హాస్పిటల్లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతోపాటు 750 బెడ్లున్న టీచింగ్ హాస్పిటళ్లలో కూడా వైద్యం ఉచితమే. అలాగే తల్లీబిడ్డలకు అవసరమయ్యే వస్తువులతో కిట్ ఇవ్వడం కూడా. విద్యాసంస్థల డైరెక్టర్గా ఒక మహిళ ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా ఉమెన్ ఫ్రెండ్లీగా ఉంటాయనడానికి నిదర్శనం నేనే. ప్రతి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనే నానుడి నూటికి నూరుశాతం నిజం. నా సక్సెస్లో తొలి అడుగులు వేయించింది మా అమ్మ. తెలుగింటి కోడలిగా హైదరాబాద్కి వచ్చిన తర్వాత అత్తమ్మ నాకు అమ్మయింది. నన్ను, నా బిడ్డలను తన బిడ్డల్లాగా చూసుకుంటూ నాకు ప్రతి విషయంలోనూ కొండంత అండగా ఉన్నారు. కెరీర్ పరంగా నన్ను నేను మలుచుకోవడానికి తగిన భరోసా ఇచ్చారు’’ అన్నారు డాక్టర్ ప్రీతి. సమాజానికి తిరిగి ఇవ్వాలి! గ్రీన్ ఇండియా మూవ్మెంట్లో కూడా చురుగ్గా ఉంటారు డాక్టర్ ప్రీతి. పచ్చటి భారతావని కోసం మొక్కలు నాటడం సంతృప్తినిస్తుందన్నారు. వైద్యరంగానికి ఆమె అందిస్తున్న విశిష్టసేవలకు గాను డాక్టర్ ప్రీతి ‘బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు’ అందుకున్నారు. ‘ప్రతి ఒక్కరూ తమవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలి, అప్పుడే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భారతదేశాన్ని చూడగలం’ అన్నారామె. –వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోహనాచారి వైద్యయోగం! యోగసాధన దేహాన్ని, మైండ్ని కూడా శక్తిమంతం చేస్తుంది. సింపథిటిక్ నెర్వస్ సిస్టమ్తోపాటు పారాసింపథిటిక్ నెర్వస్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మైండ్కి రిలాక్సేషన్నిస్తూ కామ్గా ఉంచుతుంది. పని ఒత్తిడితో వచ్చే పర్యవసానాలను నియంత్రిస్తుంది. ఇది మా డాక్టర్లకు మరీ ముఖ్యం. వైద్యం చేసే వృత్తిలోకి రావడమే ఒక యోగం. ఈ వృత్తికి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి ఉపయోగపడే దివ్యౌషధం యోగసాధన అని నా నమ్మకం. నేను యోగసాధన చేస్తాను. యోగ ఆవశ్యకతను తెలియచేస్తుంటాను. మా అమ్మానాన్నల ఆశయాలకు, అత్తమామల అభిరుచికి తగినట్లుగా నన్ను నేను మలుచుకోవడంలో నాకు యోగ చాలా దోహదం చేసింది. – డాక్టర్ ప్రీతీరెడ్డి, డైరెక్టర్, మల్లారెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్ -
పవన్ పై రెక్కీ నిర్వహించింది చంద్రబాబు కు చెందిన వ్యక్తులే : ఏపీ రెడ్డి, కమ్మ ,కాపు కార్పొరేషన్ చైర్మన్లు
-
ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం జగన్
-
తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
డాక్టర్. కర్రి రామారెడ్డి కి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
అమర జవాన్ జశ్వంత్ రెడ్డి ఫ్యామిలీకి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
లీకైన కౌశిక్రెడ్డి మరో ఆడియో క్లిప్
-
సుకుమార్రెడ్డిపై దాడికి యత్నం
కావలి: కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి వ్యవహారశైలిపై ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు నిజమయ్యాయి. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కావలి నియోజకవర్గంలో ఆ పార్టీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మన్నెమాల సుకుమార్రెడ్డిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మండల కేంద్రమైన అల్లూరులో గ్రామదేవత పోలేరమ్మ తల్లి సాక్షిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి అనుచర నేర గ్యాంగ్ దాడి చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ కావలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణు అనుచర నేర గ్యాంగ్కు సంబంధించిన 25 మంది ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలాగే శనివారం రాత్రి కావలిరూరల్ మండలం అన్నగారిపాలెం మాజీ సర్పంచ్, మత్స్యకార నాయకుడు నరసింహంను కాళ్లు విరగ్గొడతామని విష్ణువర్ధన్రెడి కుమారుడు హెచ్చరించారు. వివరాలు.. ఆదివారం అర్ధరాత్రి అల్లూరులో పోలేరమ్మ గుడి పక్కవీధిలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం చుట్టూ విష్ణువర్ధన్రెడ్డికి చెందిన నేర గ్యాంగ్ చిత్తుగా మద్యం సేవించి ద్విచక్రవాహనాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఆ సమయంలో పార్టీ నాయకులతో కలిసి అటుగా కారులో వెళుతున్న మన్నెమాల సుకుమార్రెడ్డిని గమనించిన సదరు గ్యాంగ్, పోలేరమ్మ గుడి ఎదురుగా ద్విచక్రవాహనాన్ని కారుకు అడ్డంగా పెట్టి ఆపేశారు. ఎవరు మీరు.. ఎందుకు వచ్చారని.. మాటలు కలిపి కారులో ఉన్న సుకుమార్రెడ్డిని కిందకు దిగేలా చేశారు. వెంటనే సుకుమార్రెడ్డి చేతిలో ఉన్న సెల్ఫోన్ బలవంతంగా లాగేసుకున్నారు. అడ్డుకోయిన ఆయన వ్యక్తిగత సహాయకుడైన యువకుడిపై కూడా దాడి చేశారు. ఇంతలో కారులో ఉన్న పార్టీ నాయకులు కిందకు దిగి వారితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో కర్రలు తీసుకురండి అంటూ కేకలు వేసిన నేర గ్యాంగ్తో మన్నెమాల సుకుమార్రెడ్డి, పార్టీ నాయకులు సౌమ్యంగా మాట్లాడడంతో వారు వెనక్కి తగ్గి వెళ్లిపోయారు. నరసింహానికి బెదిరింపులు ఇదిలా ఉండగా శనివారం రాత్రి కావలిరూరల్ మండలం అన్నగారిపాలెం మాజీ సర్పంచ్, మత్స్యకారుల నాయకుడు నరసింహం మండలంలోని మత్స్యకారులను వెంటపెట్టుకొని అల్లూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేర్చారు. అనంతరం వెనుదిరిగి కావలికి తన బుల్లెట్ వాహనంపై నరసింహం వస్తుండగా అల్లూరులో విష్ణువర్ధన్రెడ్డి కుమారుడు విక్రమాదిత్యరెడ్డి అడ్డుకొని బుల్లెట్ తాళం లాగేసుకున్నాడు. కావలి వాళ్లకు అల్లూరులో ఏం పని.. ఈ సారి కావలి వాళ్లు అల్లూరులో కనిపిస్తే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించాడు. ఈ ఘనటలపై మన్నెమాల సుకుమార్రెడ్డి సోమవారం అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి చేసిన నేరపూరితమైన చర్యగా పరిగణిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు వక్రభాష్యం చెబుతూ టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, మున్ముందు ఇంకా చాలా ఉందని, తాను ఎంత దూరమైనా పోతానని ఎమ్మెల్యేను బెదిరించారు. విష్ణు గ్యాంగ్ దుశ్చర్యలను చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆందోళన చెందుతున్నారు. నేనేంటో మున్ముందు చూపిస్తా ... ఎమ్మెల్యేకు విష్ణు వార్నింగ్ కావలి: ‘నా సంగతి తెలియదేమో.. చెప్తా.. ఇంకా టైముంది.. ఎంత దూరం చెప్పాలో అంత దూరం చెప్తా.. పిచ్చి వాగుడు వాగొద్దు.. నేనేందో చూపిస్తా.. నా సంగతి అందరికీ తెలుసు.. చిన్నచిన్న వాళ్లను పెట్టుకొని పిచ్చి వాగుడు వాగుతూ ప్రచారం చేయవద్దు.. ఇదే ఆఖరి వార్నింగ్.. టీడీపీ అధ్యక్షుడు నన్ను గౌరవించి నాకు కావలి టిక్కెట్ ఇచ్చాడు’ అంటూ ఎమ్మెల్యే, కావలి వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డికి టీడీపీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి వార్నింగ్ ఇచ్చి తన నైజాన్ని బయటపెట్టేశాడు. అసాంఘికశక్తులకు అంటకాగుతారని, ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి కుయుక్తులు పన్నుతున్నారని కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి గురించి నియోజకవర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని దగదర్తిలో సోమవారం మీడియా ఆయనను ప్రశ్నించగా వైఎస్సార్సీపీ నాయకులు గ్రామాల్లోకి, ఇళ్లల్లోకి ఎందుకుపోతున్నారని తన అహంభావాన్ని చాటుకున్నారు. రౌడీయిజాన్ని ప్రజలు హర్షించరు కావలి నియోజకవర్గ ప్రజలు రౌడీయిజాన్ని అంగీకరించరు. కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి ముఠా మా పార్టీ నాయకులపై రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అలాగే అల్లూరులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులను రానివ్వకూడదని, వారితో తిరగవద్దని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాలనీల్లోని గిరిజనులు వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తే మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి ఇలాంటి చర్యల ద్వారా ప్రజల నుంచి ఓట్లు వేయించుకోవాలనుకోవడం అవివేకం. – కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి -
తొలి ఎన్నికల 'కుల గోత్రాలు'
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత వద్దనుకున్నా, కులం, మతం ప్రభావం ఎక్కువే. తెలుగు రాష్ట్రాలూ అందుకు అతీతం కాదు. అయితే ఏయే సామాజిక వర్గాలు రాజకీయంగా ఆధిపత్యం సాధించాయి? వాటిలో ఏవి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి? ఏ వర్గం మొదట రాజకీయంగా పట్టు కలిగి.. ఆపై కోల్పోయిందనే అంశాలు ఆసక్తికరం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీటికి సంబంధించిన విశ్లేషణలకు సహజంగానే ప్రాధాన్యం ఉంటుంది. గత అరవై ఐదేళ్ల రాజకీయాలకు సంబంధించి సామాజిక వర్గాల వివరాల సేకరణ, విశ్లేషణ క్లిష్టమైనదే అయినా ఒక ప్రయత్నం.. ఎక్కడైనా ఆయా నేతల కులాల వివరాల్లో పొరపాట్లు దొర్లవచ్చు. అవి ఉద్దేశపూర్వకంగా కాదని గమనించగోరుతున్నాము. ముందుగా 1952 నాటి పరిస్థితులు అప్పటి రాజకీయాలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి విశ్లేషణ.. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఒక భాగంగా ఉండేది. కర్ణాటక, మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాలతో హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న భద్రాచలం నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో సాయుధ పోరాటం కారణంగా, తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండేది. తర్వాత కమ్యూనిస్టులు పోరాట పంథా వీడి బయటకు వచ్చినా, నిషేధం కొనసాగింది. దాంతో కమ్యూనిస్టులు పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరుతో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని నియోజకవర్గాలను లెక్కలోకి తీసుకుంటే 43 చోట్ల కాంగ్రెస్.. పీడీఎఫ్ 35 చోట్ల గెలుపొందాయి. సోషలిస్టులు 12 చోట్ల గెలుపొందారు. అప్పట్లో షెడ్యూల్ కులాల సమాఖ్య పేరుతో వివిధ రాష్ట్రాలలో అభ్యర్థులు నిలబడేవారు. వారు ముగ్గురు గెలిచారు. అప్పట్లో ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. అంటే ఒక నియోజకవర్గంలో జనరల్ అభ్యర్థి, మరొకరు షెడ్యూల్ కులాలు లేదా తెగల అభ్యర్థి ఉండేవారు. రిజర్వుడు అభ్యర్థికి కనుక జనరల్ అభ్యర్థికన్నా ఎక్కువ ఓట్లు వస్తే అతనినే విజేతగా ప్రకటించేవారు. అలా కొందరు, మరికొన్ని చోట్ల జనరల్ స్థానాలో ఎస్సీ నేతలు గెలుపొందిన చరిత్ర ఉంది. పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు రెండుచోట్లా పోటీచేసి గెలుపొందారు. తొలి ఎన్నికల్లో రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గాల వారు అత్యధికంగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో అప్పట్లో బ్రాహ్మణుల హవా బాగా నడిచేది. తర్వాత కాలంలో వారి ప్రభ తగ్గుతూ వచ్చింది. కానీ రెడ్డి సామాజికవర్గం రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతోంది. ఆ తర్వాత వెలమ వర్గం ప్రాధాన్యం పొందింది. సంఖ్య రీత్యా తక్కువే అయినా కరీంనగర్ జిల్లాలో వారి ప్రభావం కనిపిస్తుంది. 1952 ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం 24 చోట్ల గెలిస్తే, బ్రాహ్మణులు 26 చోట్ల గెలిచారు. వెలమలు నాలుగు చోట్ల, ముస్లింలు, బీసీలు ఎనిమిది చొప్పున స్థానాల్లోనూ గెలిచారు. తొలి ఎన్నికలో 24 మంది రెడ్లు.. తెలంగాణలో తొలి నుంచీ రెడ్డి సామాజిక వర్గానికి రాజకీయంగా గట్టి పట్టుండేది. కాంగ్రెస్లో కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి ప్రముఖులు ఉంటే, పీడీఎఫ్ (కమ్యూనిస్టులు)లో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల కమలాదేవి వంటి ప్రముఖులు ఉండేవారు. 1952 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం వారు కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది గెలిస్తే, పీడీఎఫ్ నుంచి పది మంది విజయం సాధించారు.ప్రస్తుత రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో రెడ్ల ప్రాబల్యం అప్పటి నుంచే ఉన్నట్లు ఈ ఫలితాలను విశ్లేషిస్తే అర్ధమవుతుంది. ఇంకా సోషలిస్టు పార్టీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లుగా ముగ్గురు రెడ్డి సామాజిక వర్గీయులు నాటి ఎన్నికల్లో గెలుపొందారు. బ్రాహ్మణులు 26 మంది.. తెలంగాణలో స్వాతంత్య్రోద్యమ సమయం నుంచే బ్రాహ్మణులు గట్టి పాత్ర పోషించారని చెప్పాలి. బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, పి.హనుమంతరావు, ముందుముల నరసింగరావు, గోపాలరావు ఎక్బోటే వంటి ప్రముఖులది రాజకీయాల్లో కీలకపాత్ర. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. నాడు కాంగ్రెస్ నుంచి 14 మంది బ్రాహ్మణులు ఎన్నికైతే, పీడీఎఫ్ నుంచి 11 మంది, సోషలిస్టు పార్టీ నుంచి ఒకరు ఈ సామాజిక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వెలమలు: ప్రభావం ఎక్కువే సంఖ్యాపరంగా తక్కువైనా.. వెలమ సామాజిక వర్గానికి తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీల గెలుపోటములను వారు నిర్దేశించే స్థాయిలో ఉంటారు. 1952 ఎన్నికల నుంచీ ఇది కొనసాగుతోంది. 1952లో నలుగురు వెలమ ఎమ్మెల్యేలు ఎన్నికైతే వారిలో ఇద్దరు పీడీఎఫ్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్గా మరొకరు గెలుపొందారు. ముస్లింలు ఎనిమిది మంది.. హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉంటుంది. నిజాం రాజ్యంలో వారికి ఎనలేని ప్రాముఖ్యత ఉండేది. స్వాతంత్య్రానంతరం పరిస్థితులు మారాయి. అయినా తెలంగాణ ప్రాంతం నుంచి ముస్లింలు గణనీయ సంఖ్యలోనే గెలుస్తుంటారు. 1952లో కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది ముస్లింలు గెలిచారు. అప్పట్లో మజ్లిస్ పార్టీ ఇంకా పుంజుకోలేదు. మతపరమైన విభజనతో ఓట్లు వేయడం కూడా అప్పట్లో తక్కువే అని చెప్పాలి. మొత్తంగా ఎనిమిది మంది ముస్లింలు తొలి ఎన్నికల్లో విజయం సాధిస్తే.. వీరిలో ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు పీడీఎఫ్, ఒకరు ఇండిపెండెంట్. ఈ ఎన్నికల్లోనే మాసూనా బేగం, నవాబ్ జంగ్ వంటి ప్రముఖులు గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారు. బీసీ వర్గాల నుంచి 8 మంది.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అన్ని సామాజిక వర్గాలలో రాజకీయ చైతన్యం పెద్దగా ఉండేది కాదు. ప్రత్యేకించి బీసీ వర్గాలలో సంఖ్యాపరంగా ప్రజలు ఎక్కువగానే ఉన్నా, వారి నుంచి అసెంబ్లీకి ఆ నిష్పత్తిలో ఎన్నికవడం తక్కువగానే ఉండేది. దీనికి కారణం బీసీలలో అనేక సామాజిక వర్గాలు ఉండటమే. పైగా వారు సంఘటితం కావడం కూడా తక్కువగానే ఉండేది. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ, సంగం లక్ష్మీబాయి, జి.రాజారాం వంటి ప్రముఖులు రాజకీయాల్లో రాణించి వన్నె తెచ్చారు. మొత్తం ఎనిమిది మంది బీసీలు ఎన్నిక కాగా ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు పీడీఎఫ్, ఇద్దరు సోషలిస్టు పార్టీల నుంచి, మరొకరు ఇండిపెండెంటుగా గెలిచారు. వీరిలో మున్నూరు కాపులు ముగ్గురు, పద్మశాలి, యాదవ, గౌడ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఎస్సీలు 24 మంది.. తెలంగాణ ప్రాంతంలోని వివిధ ద్విసభ్య, జనరల్ నియోజకవర్గాల నుంచి 24 మంది షెడ్యూల్ కులాల నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 9, పీడీఎఫ్ నుంచి ఏడుగురు, సోషలిస్టు పార్టీ నుంచి నలుగురు, షెడ్యూల్ కులాల సమాఖ్య నుంచి ముగ్గురు, ఇండిపెండెంట్గా ఒకరు నెగ్గారు. అరిగే రామస్వామి, జేబీ ముత్యాలరావు వంటి ప్రముఖులు కాంగ్రెస్ నుంచి, ఉప్పల మల్సూర్ పీడీఎఫ్, కోదాటి రాజమల్లు సోషలిస్టు పార్టీ నుంచి గెలుపొందారు. పెద్దపల్లి, ఖమ్మం, మంథనిల నుంచి జనరల్ సీట్లలో ఎస్సీ అభ్యర్థులు గెలిచారు. గిరిజనులు ఇద్దరు విజయం సాధించారు. -
మా కులమే అనర్హతా?
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఉన్నత కులంలో పుట్టడమే మా తప్పా.. మా కులమే మాకు అనర్హతా... అగ్రకులాల్లో పేదలు కనిపించడం లేదా..’’అని రెడ్డి జేఏసీ నాయకులు పాలకులను ప్రశ్నించారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని, వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్తో రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాలకు వెళ్లే విదార్థులకు రూ.20 లక్షల సహాయం అందించాలని, గురుకులాల్లో ప్రవేశం కల్పించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్లోని రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ప్రాంగణంలో రెడ్ల సమరభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. సభకు రెడ్లు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించగా.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వాటిని తిప్పికొట్టారు. ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి: నాయిని అగ్ర కులాల్లో చాలామంది పేదలు ఉన్నారని, సీఎంను ఒప్పించి ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హోంమంత్రి నాయిని చెప్పారు. పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అగ్ర కులాల పేదలకు కూడా అందాల్సిన అవసరం ఉందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా సమస్యలు పరిష్కాం కావన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో ద్వారా రేవంత్రెడ్డి నాయకుడు కాగలడేమోగానీ సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. దొరల పెత్తనాన్ని అడ్డుకోవాలి: రేవంత్రెడ్డి తెలంగాణ పోరాటంలో రెడ్ల పాత్ర కీలకమని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెడ్ల పాత్రను తక్కువ చేసే యత్నం జరిగిందని, రెడ్డి అనే కారణంగా కోదండరాంను పక్కన పెట్టారని విమర్శించారు. దొరల పెత్తనానికి ఎదురొడ్డి నిలవకుంటే మన ఉనికికే ప్రమాదమని అన్నారు. వారిని ఓడించే శక్తి రెడ్లకు ఉందని, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు. రెడ్లకు ప్రత్యేక కార్పొరేషన్ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని ఎమ్మెల్యేలు డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ నవల్గ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సినీనటి జయప్రద, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అసోసియేట్ చైర్మన్ అప్పమ్మగారి రాంరెడ్డి, కొలను వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మే 27న రెడ్ల సమరభేరి
సాక్షి, హైదరాబాద్: రెడ్డి కులస్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్న డిమాండ్తో మే 27న 10 లక్షల మంది రెడ్లతో సమరభేరి నిర్వహించనున్నట్లు రెడ్డి జేఏసీ చైర్మన్ నవల్గ సత్యనారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో గౌరెల్లి, ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్–10 వద్ద ఈ సభ నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం 500 మంది రెడ్లతో బహిరంగ సభ నిర్వహించే స్థలంలో భూమిపూజ చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, రెడ్ల కోసం ప్రత్యేక గురుకులాలు, స్టడీ సర్కిళ్లు, పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్, రైతు సంక్షేమం, ఆరోగ్య పథకాల సమాన వర్తింపు, స్వయం ఉపాధి, సహకార రంగాల్లో ప్రభుత్వ చేయూత తదితర పది ప్రధాన డిమాండ్ల సాధన కోసం సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి మద్దతు ప్రకటించారు. -
పేద రెడ్డి కుటుంబాలను ఆదుకుంటాం
కీసర:పేద రెడ్డి కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. ఆదివారం కీసరగుట్టలో నిర్వహించిన కుషాయిగూడ రెడ్డి సంక్షేమ సం ఘం 5వ వార్షికోత్సవం, 2018 క్యాలెం డర్ ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సంక్షేమ సంఘాలన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి రెడ్డి కులస్థుల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పేద రెడ్డి పిల్లల ఉన్నత చదువుల కోసం ఇతర కులస్తులకు ఇస్తున్నట్లుగానే రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ సముఖంగా ఉన్నారన్నారు. రెడ్డి సంక్షేమ సంఘాలను బలోపేతం చేసుకొని సామా జిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహి ంచాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి, కుషాయిగూడ రెడ్డి సంక్షేమం అధ్యక్షుడు చిటుకుల నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి నరేందర్రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నేతలు ఎల్లారెడ్డి, వసంతరెడ్డి, సంతోష్రెడ్డి, రాజిరెడ్డి, రాంరెడ్డి, వల్లారెడ్డి, కందాడి హనుమంత్రెడ్డి, శివరాంరెడ్డి, హరిప్రసాద్రెడ్డి, బలవంత్రెడ్డి, గోపాల్రెడ్డి, కొండల్రెడ్డి, విజయ్కుమార్రెడ్డి, వెంకట్రెడ్డి, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు రైతులను నిండా ముంచేశారు
-
వెనుకబడిన రెడ్లకు చేయూతనివ్వాలి
హైదరాబాద్: రెడ్లందరూ ఐక్యంగా ఉండి ఆర్థికంగా వెనుకబడినవారికి చేయూతనివ్వాలని, రెడ్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సుకు నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చాలామంది రెడ్లు దయనీయ స్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రెడ్డి సామాజిక వర్గంపై ఉందన్నారు. రాజ్ బహదూర్ వెంకట్రాంరెడ్డి వందేళ్ల క్రితమే భవిష్యత్ తరాల కోసం రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తాజాగా రెడ్డి హాస్టల్కు ముఖ్యమంత్రి కేసీఆర్ 15 ఎకరాల స్థలం ఇచ్చి నిధులు కేటాయించారని తెలిపారు. పిల్లలను బాగా చదివిస్తేనే రెడ్డి సమాజం ఉన్నతమవుతుందన్నారు. గ్లోబల్ రెడ్డి కన్వెన్షన్ కన్వీనర్, మాజీ చీఫ్ సెక్రటరీ పి.రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్లను ఆహ్వానిస్తూ గ్లోబల్ రెడ్డి కన్వెన్షన్ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో చదువుకు తగిన ఉద్యోగాలు, వృత్తి నైపుణ్యం, ఉచిత న్యాయ సలహాలు, సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇవ్వటం, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించటం, తదితర అంశాలపై చర్చించటం జరుగుతుందన్నారు. ప్రభుత్వ మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం మాట్లాడుతూ రెడ్లు పరస్పరం సహకారంతో ఉంటూ అవకాశాలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశ్యాప్తంగా అనేక మంది రెడ్లు అనైక్యతతో నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ రెడ్డి సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు వసుంధర రెడ్డి, ఎడ్ల రఘుపతి రెడ్డి, నల్ల భాస్కర్ రెడ్డి, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సినారె సాహిత్యం ఇతరభాషలలోకి అనువాదం కావాలి
రాజమహేంద్రవరం కల్చరల్: ‘తెలుగు సాహిత్యం ఇతర భాషలలోకి అనువాదం కాకపోవడం వలనే జాతీయ స్ధాయిలో తెలుగువారికి రావలసినంత గుర్తింపు రావడం లేదు. పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం ఇతర భాషలలోకి అనువాదం కావాలి’ అని కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి అన్నారు. కళాగౌతమి ఆధ్వర్యంలో దానవాయిపేటలోని శుభోదయా ఇన్ ఫ్రా కార్యాలయంలో ఆదివారం జరిగిన సినారె సంస్మరణసభలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో నేటి వరకు ఏడుగురు కవులు జ్ఞానపీఠ అవార్డును అందుకోగా, తెలుగులో ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారన్నారు. సినారె రాసిన కర్పూర వసంతరాయలు చదివిన ఎన్టీఆర్ ఆయనకు ‘గులేబకావళికథ’ సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చారని తెలిపారు. సినారె విశ్వంభరలో రాసిన ‘అడుగు సాగుతున్నది–అడుసులో నక్కిన ముళ్లను తొక్కేస్తూ’ అన్న కవితను వినిపించారు. ఓఎన్జీసి విశ్రాంత జనరల్ మేనేజర్ గుంటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కవులకు ‘ప్రాంతీయస్టాంపులు’ వేయడం బాధాకరమన్నారు. ‘కొందరు కవులను మద్రాసుకు, కొందరిని హైదరాబాద్కు మనం అప్పగించామని’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఇంగ్లిష్ ఉపన్యాసకుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ అక్కినేని, సినారెలు లేని రవీంద్రభారతి వేదికను ఊహించుకోలేమన్నారు. ఉపాధ్యాయుడు సుదర్శన శాస్త్రి మాట్లాడుతూ ఆరుద్ర, దాశరథి, ఆత్రేయ వంటి కవులకోవలో చివరివారు సినారె అన్నారు. మూడు వేల పైచిలుకు సినీపాటలను రాసిన సినారె సుమారు 8 వేల పుస్తకాలకు ముందుమాట రాశారని తెలిపారు. పాత్రికేయుడు సన్నిధానం శాస్త్రి మాట్లాడుతూ సినారె రాసిన అక్షరాల గవాక్షాలులోని కవితలు ఆయనలోని దేశభక్తికి నిదర్శనాలని అన్నారు. నాట్యాచార్యుడు సప్పా దుర్గాప్రసాద్, నిమ్మలపూడి గోవిందు, వి.కృష్ణమోహన్, జి.శ్యామలాకుమారి తదితరులు ప్రసంగించారు. శుభోదయమ్ఇన్ఫ్రా అధినేత కె.లక్ష్మీప్రసాద్ అధ్యక్షత వహించారు. ముందుగా సినారె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
పేద రెడ్డి విద్యార్థులకు ఉచిత విద్య
– ‘పది’ టాపర్ల అభినందన సభలో విద్యాసంస్థల అధినేతలు కర్నూలు (అర్బన్): జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు తమ సహకారం అందజేస్తామని నగరంలోని పలు విద్యా సంస్థల అధినేతలు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం స్థానిక హర్ష రిజెన్సీలోని సమావేశ భవనంలో రెడ్ల యువజన సంక్షేమ సంఘం, రెడ్ల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల్లో 9.5 నుంచి 10కి 10 పాయింట్లు సాధించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల అభినందన సభ జరిగింది. కార్యక్రమానికి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు కశిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కేవీఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత డా.కేవీ సుబ్బారెడ్డి, నారాయణ విద్యాసంస్థల సీఈఓ లింగేశ్వరరెడ్డి, ప్రతిభ స్కూల్ అధినేత అరుణాచలరెడ్డి, ఎన్ఎంఆర్ కళాశాల అధినేత మల్లికార్జునరెడ్డి, సాయియుక్త కళాశాల అధినేత భోగేంద్రనాథ్రెడ్డి తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఆర్థికస్థోమత లేక పది తరువాత చదువును ఆపేస్తున్నారని, అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. జీ పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం 122 మంది విద్యార్థులను సన్మానించారు. రెడ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులకుర్తి నరసింహారెడ్డి, యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొనపాటి యల్లారెడ్డి, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు బిర్రు ప్రతాపరెడ్డి, శివసేన జిల్లా అధ్యక్షుడు తూముకుంట ప్రతాపరెడ్డి, నాయకులు మనోహర్రెడ్డి, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేరాల దర్యాప్తు వేగవంతంగా కొనసాగించాలి
నార్త్జోన్ ఐజీపీ నాగిరెడ్డి కరీంనగర్ క్రైం : వివిధ రకాల నేరాల దర్యాప్తులను వేగవంతంగా కొనసాగించాలని నార్త్జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వై నాగిరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాల పునర్వీజన అనంతరం నార్త్జోన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో బుధవారం కరీంనగర్ కమిషనరేట్లోని హెడ్క్వార్టర్లో ఐజీపీ నాగిరెడ్డి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడా రు. క్రమ శిక్షణతో మెదులుతూ అంకితభావంతో విధు లు నిర్వహించాలని సూచించారు. సమర్థవంతమైన సే వల ద్వారానే పోలీస్శాఖకు గుర్తింపు లభిస్తుందన్నారు. పకడ్బందీగా దర్యాప్తులను కొనసాగించినట్లరుుతే వేగవంతంగా కేసులు పరిష్కారం అవుతాయని తెలిపారు. నేరాల నియంత్రణకు ముందస్తు ప్రణాళికలు రూపొం దించి అమలు చేయాలని సూచించారు. వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు వెలుబుచ్చిన అభిప్రాయాలు, ఎదురవుతున్న సమస్యలను పరిష్కారానికి పలు సూచనలు చేశారు. కరీం నగర్ ఇన్చార్జి డీఐజీ రవివర్మ, కరీంనగర్, రామగుండం కమిషనర్లు వీబీ.కమలాసన్రెడ్డి, విక్రమ్జిత్ దుగ్గల్, రాజన్న సిరిసిల్లా, జ గిత్యాల, అదిలాబాద్, కొము రం భీం, నిర్మల్, అచార్య జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జిల్లాలకు చెందిన ఎస్పీలు విశ్వజిత్ కంపాటి, అనంతశర్మ, ఎం. శ్రీ నివాస్, సన్ప్రీత్సింగ్, విష్ణు ఎస్ వారియర్, బాస్కరన్, మురళీధర్, అంబర్కిషొర్ఝూ పాల్గొన్నారు. -
మరో రెండు ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో
-
ఆరని జ్యోతిలా.. ఆత్మీయ స్మృతిలా..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి..ఆ పేరు వింటేనే నిరుపేదల హృదయాలు పులకిస్తాయి. పేదల గుండె చప్పుడును ఆలకించిన నాయకుడు కాబట్టే అనితర సాధ్యమైన అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీతో లక్షల ప్రాణాలు నిలబెట్టారు. వైఎస్ అమితంగా ఇష్టపడే జిల్లాల్లో తూర్పు గోదావరికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన దివంగతులై ఏడేళ్లయినా ఇప్పటికీ ప్రతి పేదవాని గుండెల్లో గూడుకట్టుకునే ఉన్నారు. ‘తూర్పు’ సెంటిమెంట్ను బలంగా విశ్వసించే వైఎస్ అధికారం చేపట్టాక తన మానసపుత్రిక అయిన ‘ఇందిరమ్మ’ పథకానికి 2006 ఏప్రిల్ 1నlకపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే వైఎస్ ప్రారంభించారు. డెల్టా రైతులకు వరప్రదాయినిలాంటి డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. జిల్లాకు రూ.1,697.24 కోట్లు కేటాయించారు. తూర్పు, మధ్య డెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్లో సాగునీటి కాలువల ఆధునికీకరణకు రూ.1,170.21 కోట్లు, మురుగునీటి కాలువలకు రూ.486.45 కోట్లు కేటాయించారు. 2008లో ఆరంభమై హయాంలో శరవేగంగా సాగిన ఆధునికీకరణ పనులను ఆయన మరణానంతరం పాలకులు అటకెక్కించారు. పొలాలకీ, గళాలకూ నీరు.. ఏటిగట్ల అభివృద్ధికి రూ.540 కోట్ల వ్యయంతో 31 ప్యాకేజీలుగా నిర్ణయించి 2007లో పనులను ప్రారంభించి 2010 లోపు పూర్తి చేయాలని వైఎస్ తలపోశారు. 2009 వరకూ వేగంగా జరిగిన ఏటిగట్టు పనులు ఆయన హఠాన్మరణం తరువాత నిలిచిపోయాయి. జలయజ్ఞంలో భాగంగా మహానేత చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎడమకాలువ 11 ఏళ్లు అవుతున్నా 60.4 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.10 కోట్లతో పథకం నిర్మించి తమ దాహార్తి తీర్చిన వైఎస్ను జన్మజన్మలకు మరిచిపోలేమని రాజోలు ప్రాంతవాసులంటున్నారు. 2009లో రామచంద్రపురం వాసులకు గుక్కెడు నీరందించేందుకు రూ.21 కోట్లతో రక్షిత మంచినీటి పథకానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. కానీ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు మంచినీటి కొరతతో అల్లాడుతున్నారు. రాజానగరం నియోజకవర్గం కలవచర్ల వద్ద రూ.18 కోట్లతో పుష్కరలిఫ్ట్ను ఏర్పాటు చేసింది కూడా మహానేతే. 2003 మేలో వైఎస్ జరిపిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలోనే ‘ఉచిత విద్యుత్తు’ పథకానికి బీజం పడింది. తీవ్ర అస్వస్థతతో యాత్రకు విరామమిస్తూ బూరుగుçపూడిలో ఆగిపోయిన వైఎస్ వద్ద మెట్టరైతులు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో చలించిన ఆయన సీఎం కాగానే ఉచిత విద్యుత్తు ఫైల్పైనే తొలి సంతకం చేశారు. మెట్టకు వరం పుష్కర పథకం మెట్టలో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు అంది సస్యశామలమైంది. జలయజ్ఞంలో భాగంగా మెట్టప్రాంతానికి రూ.600 కోట్లు కేటాయిచారు. 2008లో సోనియా చేతుల మీదుగా పుష్కర పథకాన్ని వైఎస్ ప్రారంభింపచేసి మెట్ట రైతులకు అపర భగీరథుడయ్యారు. రాజమండ్రిరూరల్లో రూ.100 కోట్లతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(నేక్)ను తీసుకువచ్చింది ఆ మహానేతే. రూ.800 కోట్లతో గోదావరిపై నాలుగో వంతెనకు అంకురార్పణ చేసిందీ ఆయనే. ఏజెన్సీలో గిరిజనుల భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో వైఎస్ ముసురుమిల్లి, భూపతిపాలెం ప్రాజెక్టులను మంజూరు చేశారు. కాకినాడలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు సుమారు రూ.50 కోట్లతో వైఎస్ హయాంలో పేర్రాజుపేట రైల్వే క్రాసింగ్పై వైఎస్ఆర్ వారధి పేరుతో ఒక ఫ్లై ఓవర్ను, సాంబమూర్తినగర్ రైల్వే క్రాసింగ్పై మల్లిపూడి శ్రీరామసంజీవరావు వారధి పేరుతో మరో ఫ్లై ఓవర్ను నిర్మించారు. ఆయన హయాంలోనే కొండయ్యపాలెం, పోర్టు ప్రాంతంలో మరో రెండు ఫ్లై ఓవర్ల కోసం శంకుస్థాపన చేసినప్పటికీ ఆకస్మిక మరణంతో పురోగతి లేకపోయింది. కాకినాడ డెయిరీ ఫారం సెంటర్లో సుమారు రెండువేల రాజీవ్గృహకల్ప సముదాయాలను పూర్తి చేసి ఎంతో మంది పేదల సొంతింటి కల నెరవేర్చారు. జీవితంలో వెలుగులు నింపిన ఆ మహనీయుని ప్రాణజ్యోతి మలిగిపోయినా.. ఆయన స్మతి ఆరనిజ్యోతిగా సదా ప్రజ్వలిస్తూనే ఉంటుంది. -
'నాకేం.. మా రాజశేఖరరెడ్డి ఉన్నాడన్నాడు'
-
అపార్ట్మెంట్ వివాదంలో 'టీడీపీ ఎమ్మెల్యే'
-
గ్రేటర్ ఎన్నికలు : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
-
ఇదేమి రాజ్యం..!
-
దమ్ముంటే నిజాలు చెప్పండి
-
విద్యార్థులకు సంఘీభావం తెలిపిన సిపిఐ నేత ’సురవరం’
-
'ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర'
-
ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
‘ఆసరా’ మొదలైంది..
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పింఛన్ల పంపిణీ జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది. రవాణా మంత్రి మహేందర్రెడ్డి చేతుల మీదుగా జిల్లాలోని పలు చోట్ల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఆసరా’ పేరిట వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర వర్గాల లబ్ధిదారులకు పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు అర్హుల గుర్తింపులో మార్గదర్శకాలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో గతంలో పింఛన్లు పొందిన లబ్ధిదారులకు మొండిచేయి ఎదురైంది. అంతేకాకుండా కొన్నిచోట్ల లబ్ధిదారుల ఎంపికలో శాస్త్రీయత పాటించకపోవడంతో అర్హులకు కూడా పింఛన్లు అందని పరిస్థితి తలెత్తింది. ఇబ్రహీంపట్నం మండలం పోచారం, ఉప్పరిగూడ గ్రామాల్లో వృద్ధులు, వికలాంగులు పంచాయతీ కార్యాలయాల ముందు ధర్నాకు దిగగా, కుల్కచర్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారుల తుది జాబితాలో కూడా చాలా పేర్లు గల్లంతయినట్లు తెలిసింది. మరోవైపు ఈనెల 11 నుంచి గ్రామాల వారీగా పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించిన నేపథ్యంలో.. దరఖాస్తుదారుల్లో టెన్షన్ మొదలైంది. ‘ఆసరా’ ఎంతమందికి ఎసరు తెచ్చిందోననే గందరగోళం ఏర్పడింది. జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుండగా, అడ్డగోలుగా లబ్ధిదారులను ఏరివేశారనే ప్రచారం నేపథ్యంలో అధికారపార్టీ నష్టనివారణ చర్యలకు దిగింది. అర్హత సాధించని దరఖాస్తుదారులు మరోసారి అర్జీ ఇస్తే పరిశీలించి న్యాయం చేస్తామనే భరోసా ఇస్తున్నారు. -
33 శాతం అసెంబ్లీ సీట్లు మనమే ఇద్దాం.. సిద్ధమేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ సవాల్ హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే వెనుకబడిన తరగతుల వారికి (బీసీలకు) రాష్ట్ర శాసనసభలో 33 శాతం సీట్లు ఇవ్వడానికి సిద్ధం కావాలని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సవాల్ విసిరారు. ‘‘చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయడం కొత్తేమీ కాదు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇపుడు కూడా అసెంబ్లీలో అదే తీర్మానం చేశారు. ఇలా చేస్తే వచ్చే లాభమేంటి? నిజంగా బీసీలకు మేలు జరగాలంటే నేనొక సలహా ఇస్తా.. తెలుగుదేశం పార్టీ వారికి దమ్మూ ధైర్యం ఉంటే చెప్పమనండి. తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు (టీడీపీ), మేము (వైఎస్సార్ సీపీ) రెండే పార్టీలు ఉన్నాయి. బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ వారే పోటీ చేసే విధంగా 33 శాతం సీట్లు ఇచ్చేద్దాం. పార్టీ పరంగా నేను అలా చేయడానికి రెడీగా ఉన్నా.. వాళ్లు కూడా సిద్ధమేనేమో చెప్పమనండి. పోటీ బీసీ వర్సెస్ బీసీ (బీసీ అభ్యర్థిపై బీసీ అభ్యర్థే) గానే ఉండాలి. బీసీ అభ్యర్థుల మీద బాగా డబ్బున్న షావుకార్లను తెచ్చి పోటీకి పెట్టకూడదు. అంతేగానీ.. ఇలా ఊరికే రాసి కేంద్రానికి పంపితే వచ్చే ప్రయోజనమేంటి?’’ అని జగన్ ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో బీసీ తీర్మానంపై ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, వెంటనే సభ వాయిదా పడటంతో.. ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు నిజంగా బీసీలపై ప్రేమ లేదని.. ఎన్నికలు వచ్చినపుడల్లా బీసీలకు వంద సీట్లు ఇస్తానని ఆయన మాటలు చెప్పడం తప్ప ఆచరణలో అమలు చేయలేదని జగన్ తూర్పారబట్టారు. జగన్ ఎమన్నారో ఆయన మాటల్లోనే... ‘‘ప్రతిసారీ ఎన్నికలకు ముందు బీసీలకు వంద సీట్లు అని చంద్రబాబు చెప్తున్నారు. 2004, 2009 చివరకు 2014 ఎన్నికల ముందు కూడా ఈ మాటలు నేను విన్నాను. అయితే ఆయన ఎపుడూ వారికి అన్ని స్థానాలివ్వలేదు. 2008లో వరంగల్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ గర్జన సభలో బీసీలకు వంద సీట్లు ఇస్తామని తీర్మానం చేశారు. ఈ సభలో ఏకంగా 93 బీసీ కులాల పేర్లు చదివి తమకు (టీడీపీ) తప్ప మరెవ్వరికీ బీసీల మీద పేటెంట్ లేదన్నట్లుగా ఆ రోజు చంద్రబాబు మాట్లాడారు. 2009 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్లో జరిగిన చేతి వృత్తుల వారి సదస్సులో కూడా సీపీఎం నేత బి.వి.రాఘవులు, సీపీఐ నేత కె.నారాయణ, టీఆర్ఎస్ నాయకుడు నాయిని నరసింహారెడ్డిల సమక్షంలో బీసీలకు వంద సీట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ తీరా ఎన్నికల్లో టీడీపీ బీసీలకు ఇచ్చిన సీట్లు కేవలం 44 మాత్రమే. టీడీపీ మిత్రపక్షాలను కూడా కలుపుకొని 66 మంది బీసీలకే టికెట్లు ఇచ్చారు. అదే ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒక్కరే బీసీలకు 73 సీట్లు ఇచ్చారు. 2004లో కూడా చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 59 సీట్లే. 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు ఏ రోజూ బీసీలకు 50, 60 కంటే ఎక్కువ సీట్లు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఎన్నికలొచ్చిన ప్రతిసారీ వంద సీట్లని అంటారు. బీసీలకు తానే పేటెంట్ అని కూడా అంటారు’’ అని జగన్ ఎండగట్టారు. తన తల్లి విజయమ్మ గత అసెంబ్లీలో వంద సీట్లు బీసీలకు కేటాయిద్దామని ప్రతిపాదించినా చంద్రబాబు అప్పట్లో స్పందించలేదని గుర్తుచేశారు. మొన్నటి (2014) ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున 54 మంది బీసీలకు టికెట్లు ఇస్తే టీడీపీ మాత్రం 58 సీట్లు ఇచ్చిందని జగన్ వివరించారు. ‘‘చంద్రబాబు మా కన్నా నాలుగు సీట్లు ఎందుకు ఎక్కువ ఇచ్చారు అంటే దానికి కారణం మా అభ్యర్థుల జాబితా ముందుగా విడుదలైంది కాబట్టి. మా జాబితాను ఆయన (చంద్రబాబు) చూసుకుని, మేమెంత మందికి ఇచ్చామో చూసుకుని, మా కన్నా నాలుగు సీట్లు ఎక్కువగా ఉండాలని అలా చేశారు. ఒకవేళ మేం కనుక అభ్యర్థుల జాబితాను తరువాత ఇచ్చి ఉంటే ఆయన ఇంకా నాలుగు తగ్గించి ఉండేవారు. ఇలా బీసీలను రాజకీయావసరాలకు వాడుకోవడం నెనెక్కడా చూడలేదు’’ స్పీకర్గారు వాళ్ల మనిషి అన్నట్లుగా... శాసనసభ నిబంధన పుస్తకాన్ని జగన్ చూపుతూ.. ‘‘సాధారణంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి అంటే.. ఒక శాసనసభ్యుడు గాని, మంత్రి గాని ఒక అంశంపై తీర్మానం సభలో పెట్టాలి అంటే.. పది రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలి. అయితే స్పీకర్ గారు వాళ్ల (టీడీపీ) మనిషి అన్నట్లుగానే ఆయన ద్వారానే ‘బుల్డోజ్’ చేయించారు. స్పీకర్ తల్చుకుంటే తన విచక్షణతో తీర్మానాన్ని పది రోజుల వ్యవధి కన్నా తక్కువ నోటీసుతోనే అనుమతించవచ్చన్న అంశాన్ని అడ్డం పెట్టుకుని హడావుడిగా పొద్దున పెట్టి గంటలోపు తీర్మానం తీసుకొచ్చారు. తీర్మానం అంటే చర్చ తరువాత ఓటింగ్ జరగాలి. అలాంటిది.. ఈ రోజు (శనివారం) బీసీల అంశంపై చర్చ జరుగుతుందని పొద్దున పదకొండు గంటల వరకూ తెలియదు అనంటే.. అసెంబ్లీ ఏ తీరులో నడుస్తోంది? నిజంగా బీసీల సంక్షేమం మీద మాట్లాడాలనా? మాట్లాడకూడదనా? కేవలం వాళ్లు మాత్రమే బీసీ సంక్షేమం గురించి నాలుగు మాటలు మాట్లాడుకుని, వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారిని తిట్టి.. అంతే ఇక, బీసీ సంక్షేమం అయిపోయిందని చెప్పడమేనా!’’ ప్రతిపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వరా? ‘‘తీర్మానంపై చర్చ జరుగుతున్నపుడు గంటన్నర సేపు నేనక్కడే కూర్చుని ఉన్నా... చంద్రబాబు ఒక్కరే సుదీర్ఘంగా 45 నిమిషాలు మాట్లాడారు. ఆయన టీడీపీ మొత్తం మేనిఫెస్టోను అక్కడ చదివారు. ఆ తరువాత తన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో తిట్టించారు. మా పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులను మాత్రమే వాళ్లు మాట్లాడమన్నారు. వాళ్లు కాస్తో కూస్తో మాట్లాడారు. ఆ తరువాత నేను చేతిని పెకైత్తి.. నేను మాట్లాడతానని అడుగుతున్నా.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వేలెత్తి చూపినా అవకాశం ఇవ్వరు. బటన్ నొక్కితే గ్రీన్ బల్బ్ వెలుగుతుంది. ఎన్నిసార్లు నేను బటన్ నొక్కినా కూడా ఆ వైపు చూడరు. కావాలనే నిర్లక్ష్యం, అసలు పట్టించుకోరు. వాళ్లే మాట్లాడేసుకుని తీర్మానం ఆమోదం పొందింది అని ప్రకటించుకోవడం చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ప్రతిపక్ష నాయకుడు బీసీ సంక్షేమం మీద మాట్లాడాలనుకుంటే కూడా వీళ్లు వినే పరిస్థితిలో లేరు. బీసీ సంక్షేమం కోసం గతంలో ఏం జరిగింది.. మీరేం చేశారు.. ఏం చేస్తే బీసీలకు మేలు జరుగుతుంది.. అనేది ప్రతిపక్షం చెప్పాలనుకున్నా అనుమతించరు. ఆవేదనతో ఇవాళ నిజంగా తొలిసారిగా నేనీ మాట చెప్తున్నా.. కౌరవసభ ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ ఈ అసెంబ్లీ మాత్రం కౌరవ సభను మరిపించింది. వారి (అధికారపక్షం) సంఖ్య కూడా సరిగ్గా 101 మందే.. కౌరవులతో సమానంగానే ఉంది. నిజంగా వీళ్లు మనుషులా..? వీళ్లలో మానవత్వం ఉందా..? లేదా..? అనేది కూడా ఒకసారి నాకనిపిస్తుంది’’ వైఎస్ బీసీలకు చేసినవేవీ సభలో చెప్పరు... ‘‘దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి 2008లో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపారు. ఆ విషయాలు మాత్రం ఎపుడూ చెప్పను కూడా చెప్పరు. వైఎస్ హయాంలో బీసీలకు ఎలాంటి మేళ్లు జరిగాయో రెండు మూడు విషయాలు చెప్తాను. ఎవరూ ఊహించని విధంగా ప్రవేశ పెట్టిన ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం వల్ల సంవత్సరానికి దాదాపుగా 27 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదవాలి అనంటే 35 వేల రూపాయలు ఫీజు కట్టాల్సిన పరిస్థితి. డాక్టర్ చదవాలి అనంటే వైఎస్ హయాంలోనే అప్పట్లోనే 50 వేల రూపాయల ఫీజు ఉండేది. అంత సొమ్ము కట్టి చదివించలేని పరిస్థితుల్లో చాలా మంది చదువుకోలేక పనులు చూసుకునే పరిస్థితి ఉండేది. ఆ చదువుల కోసం అయ్యే ఫీజును ప్రభుత్వమే చెల్లించి.. బీసీలకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖరరెడ్డే అని గర్వంగా చెప్పొచ్చు. 27 లక్షల మందిలో దాదాపు 14 లక్షల మంది ప్రతి సంవత్సరం బీసీ విద్యార్థులే ఫీజు రీఇంబర్స్మెంట్ వల్ల ప్రయోజనం పొందింది. చంద్రబాబుకు ఏ రోజూ ఇలాంటి ఆలోచన తట్టలేదు’’ ఇళ్ల నిర్మాణంలోనూ ‘‘బీసీ సంక్షేమానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలంటే వైఎస్ హయాం నుంచి ఇళ్ల విషయాలు కూడా చెప్పాలి. 1984 నుంచి 2004 వరకూ అంటే 20 ఏళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వాలు పేదల కోసం మొత్తం నిర్మించి ఇచ్చిన ఇళ్లు 27.5 లక్షలైతే.. అందులో బీసీలకు కేవలం 6.32 లక్షల ఇళ్లు.. అంటే 32 శాతం మాత్రమే లభించాయి. వైఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే ఆ దివంగత నేత మన ఒక్క రాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు నిర్మించారు. అందులో 19.88 లక్షల ఇళ్లు అంటే 42 శాతం బీసీలకే వెళ్లాయి. ఇలాంటివేవీ చెప్పాలన్న ఆలోచన చంద్రబాబుకు రాదు. గొర్రెల కాపరులకు బీమా పథకం తెచ్చింది కూడా రాజశేఖరరెడ్డే. ఏ రోజూ ఇలాంటిది చంద్రబాబునాయుడు చేయలేదు. అంతెందుకు? అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్సీలు, బీసీల కోసం ఎన్.టి.రామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చారు. ఎన్టీఆర్ ఆ పథకం తెచ్చినపుడు ఆ రోజు (1983) ఇచ్చిన సబ్సిడీ కేజీకి 63 పైసలు మాత్రమే. అప్పట్లో బహిరంగ మార్కెట్లో కేజీ ధర 2.63 రూపాయలుంటే ఎన్టీఆర్ 2 రూపాయలకు ఇచ్చారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు రూపాయలకే బియ్యం ఇచ్చేటపుడు మార్కెట్లో ధర 25 రూపాయలుండేది. అంటే 23 రూపాయల సబ్సిడీని ఇచ్చారు. ఇక ఆరోగ్యశ్రీ పథకం అయితే ఎవరూ ఊహించనిది. ఆలోచించనిది. ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో శ్రీమంతులతో సమానంగా గర్వంగా వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి ఒక్క వైఎస్ వల్లనే సాధ్యమైందని గర్వంగా చెప్తున్నా. ఇవేవీ ఆయన (బాబు) చెప్పడు. చంద్రబాబు జమానాలో నెలకు 70 రూపాయలు ముష్టి వేసినట్లు పెన్షన్ వేసేవారు. అప్పట్లో కేవలం 17 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చి అందరికీ ఇచ్చామని చెప్పేవారు. వైఎస్ పెన్షన్లను ఏకంగా 78 లక్షలకు పెంచి ప్రతి ఒక్కరికీ 200 రూపాయలు ఇచ్చారు. ఈ ఘనత కూడా చంద్రబాబు ఎన్నడూ చెప్పే పరిస్థితి లేదు. సమాజంలో యాభై శాతంగా ఉన్న బీసీలను ఏ రాజకీయ పార్టీ అయినా దగ్గరికి తీసుకోవాల్సిందే. వారికి కచ్చితంగా టికెట్లు ఇవ్వాల్సిందే. అది చాలా అవసరం. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడాలేదు. కానీ మనం బీసీలకు నిజంగా ఏం చేస్తున్నామనేది మన మనస్సాక్షిని మనమే ప్రశ్నించుకోవాలి. బీసీలు, ఎస్సీలు, అట్టడుగు వర్గాలకు చెందిన వారికి ఏం చేస్తున్నామనేది ఆలోచించాలి’’ మేం నిక్కర్లు వేసుకున్నా.. నిజాలే చెప్తాం ‘‘అసెంబ్లీ సమావేశాల్లో మాకెవ్వరికీ ఏమీ తెలియదని వీళ్లంతా (టీడీపీ) అంటూ ఉన్నారు. అంతా కొత్త వాళ్లు, మీరంతా నిక్కర్లేసుకున్నోళ్లు అంటున్నారు. వాస్తవమే.. మేం నిక్కర్లు వేసుకున్న వాళ్లమే.. కానీ ఈ జెనరేషన్లో (ఈ తరానికి చెందిన) ఉన్న వాళ్లం అనేది గుర్తుంచుకోవాలి. బాగా చదువుకునే అసెంబ్లీకి వస్తాం. ఏం జరుగుతుందన్నది తెలుసుకుని వస్తాం. వాళ్ల (టీడీపీ) మాదిరిగా అబద్ధాలు చెప్పం. వాళ్ల మాదిరిగా మోసాలు చేయం. జరుగుతూ ఉన్నదే చెప్తాం.. చూపిస్తాం. ఇవాళ కూడా అదే చెప్పాలనుకున్నాం. కానీ ఇవాళ సభ జరిగిన తీరే భయానకంగా ఉంది. బాబు అబద్ధాలతో తప్పుదోవపట్టిస్తున్నారు? ‘‘శాసనసభ మీద చంద్రబాబుకు ఎక్కువ అవగాహన ఉందా? లేకుంటే మాలాంటి ఏమీ తెలియని వాళ్లకు ఎక్కువ అవగాహన ఉందా? అనేది ఎవరినో అడగాల్సిన పనిలేదు. నిన్న, ఈ రోజు చంద్రబాబు తీరును ఒక్కసారి గమనించండి. 1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధానిపై ఎలాంటి చర్చ, ఓటింగ్ జరుగలేదని చంద్రబాబు చెప్పారు. ఒక రూంలో కూర్చుని, ఒక ఇంట్లో కూర్చుని రాసేసుకున్నారని చెప్పి సభను పూర్తిగా తప్పుదోవ పట్టించారు. (7.6.1953 తేదీన అప్పటి ఆంధ్రప్రభలో ప్రచురితమైన వార్తలను చూపిస్తూ) ఇవన్నీ ఆనాటి న్యూస్ పేపర్ కటింగ్స్. మీరే చూడండి. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు రోజుల పాటు చర్చ జరిగింది. ఓటింగ్ కూడా జరిగింది. చంద్రబాబు ఎందుకీ అబద్ధాలు చెప్పాలి? తెలిసి చెబుతున్నారా? లేక కావాలనే తప్పుదోవ పట్టించాలని చెబుతున్నారా? హిట్లర్ మాదిరిగా చర్చే లేకుండా తాను మొట్టమొదటిగా ప్రకటన చేసేసి తరువాత చర్చించేసి తాను హిట్లర్గా చేసిన తీరును సమర్థించుకునేందుకు సభను దగ్గరుండి తప్పుదోవ పట్టించడం ఎంత వరకు న్యాయం?’’ అని విపక్ష నేత నిలదీశారు. ‘‘ఇవాళ కూడా అంతే.. బీసీలపై తీర్మానం కూడా అలాగే ఆమోదింపజేసుకున్నారు. అదేమంటే స్టేట్మెంట్ ఇచ్చామనిచంద్రబాబు చెప్పారు. అది ప్రకటనో, తీర్మామో ఆయనకే తెలియదు. ప్రతి తీర్మానం చివరిలో ప్రతిపక్ష నేత మాట్లాడతాడు. ఆ తరువాతనే ప్రతిపక్షం కూడా ఓటు వేయాలి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతకు అవకాశమే ఇవ్వలేదు. ప్రతిపక్ష నేత బీసీల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బండారం బయటపడుతుందనుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లులో రుణాల మాఫీ మీద పక్కదోవ పట్టిస్తున్నారు. అలాంటివన్నీ బయటకు వస్తాయి. బీసీలపై ఆయనకున్న దొంగ ప్రేమ బయటకు వస్తుంది. అందుకే అడ్డుపడ్డారు. ఇదా చదువుకోవడం అంటే..? ఇదా అనుభవం అంటే..?’’ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం ‘చంద్రబాబు రైతుల రుణాల మాఫీకి ఎగనామం పెట్టారు.. డాక్రా, చేనేత రుణాల రద్దును పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని.. అలా ఇవ్వలేక పోతే ఇంటింటికీ 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. ఆయన హామీని నమ్మిన ఆంధ్రప్రదేశ్లోని కోటి యాభై లక్షల కుటుంబాలు నిరుద్యోగ భృతి వస్తుందని ఎదురు చూస్తున్నాయి. ఈ కుటుంబాల వారందరికీ చంద్రబాబు ఎగనామం పెట్టాడు. తన వైఫల్యాలన్నీ మరోసారి బయటకు వస్తాయని ఇవన్నీ ‘హైలెట్’ (బహుళ ప్రాచుర్యం) కాకుండా ఉండేందుకే హఠాత్తుగా ఇవాళ, తనకేదో బీసీలపై ప్రేమ ఉన్నట్లుగా బీసీ తీర్మానం అని తెరమీదకు తీసుకొచ్చారు’’ అని జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబును, టీడీపీని నేను అడగదల్చుకున్నది ఒక్కటే.. నిజంగా మీకు బీసీల మీద ఇంత ప్రేమే ఉంటే ముందే ఎందుకు బీసీలకు సంబంధించిన తీర్మానం తీసుకురాలేదు? అసెంబ్లీలో కనీసం రెండు రోజుల పాటు బీసీ సంక్షేమంపై చర్చ జరిగేలా ఎందుకు కార్యక్రమం రూపొందించలేదు? కారణం మీకు అసలు బీసీల మీద ప్రేమ లేదు. అది నామ్కే వాస్తే.. నామ్కే వాస్తేగా తీర్మానం తేవాలి.. రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాలకు ఎగనామం పెట్టారనేది బయటకు రాకూడదని, ఆ వైఫల్యానికి తక్కువ పబ్లిసిటీ రావాలనే ఈ తీర్మానం తెచ్చారు’’ ‘‘ఈ మధ్య కాలంలో చంద్రబాబునాయుడు గారు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. తీర్మానానికి, స్టేట్మెంట్ (ప్రకటన)కు తేడా కూడా ఆయనకు తెలియదు. అవతలి వాళ్లను మాత్రం చిన్నచూపు చూసే విధంగా.. ‘మీకేమీ తెలియదు, మీకు అనుభవం లేదు..’ అని బురద జల్లే కార్యక్రమమే చేస్తున్నారు తప్ప.. తన వీపు తనకు కనిపించడం లేదు. చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు ఇద్దరినీ నేనొకటే అడగదల్చుకున్నా.. అయ్యా మీ నాయకుడు ఎన్.టి.రామారావు 1983లో రాజకీయాల్లోకి వచ్చినపుడు, ఆయన సినిమాల నుంచి వచ్చాడు. మరి ఆయనకు ఏం తెలుసని చెప్పి ఆయన ఇవాళ గొప్ప నాయకుడు అని పొగుడుతూ ఉన్నారు? ఇవాళ మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమని చెప్పి అవతలి వాళ్లకు ఏమీ తెలియదని చెప్పి రోజూ ఒక బండేయడం తప్ప మీరు చేస్తున్నదేమిటి? తీర్మానానికి, స్టేట్మెంట్కు కూడా తేడా ఏమిటో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు’’ బడ్జెట్ పత్రాలూ తప్పుదోవ పట్టించేవే... ‘‘బడ్జెట్ పత్రాలు చూస్తే అన్నీ తప్పుదోవ పట్టించేవే. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఉండవు, సవరించిన అంచాలన్నీ తప్పులే. వాటితోనే బడ్జెట్ను పెట్టడం అంటే పునాదులు లేకుండానే భవనాలు కడతామని చెప్పడమే. గతంలో ఏముందో ప్రజలకు చెప్పకుండా నీ ఇష్టమొచ్చిన కేటాయింపులు చేసేయడం. ఇది మోసం కాక మరేమిటి? మేము గట్టిగా విమర్శిస్తే, గడ్డి పెడితేనే ఇవాళ సవరించి బడ్జెట్ అంచనాల పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టారు. అందులోనూ తప్పులే. బడ్జెట్ ఇస్తున్నారు గానీ.. గత ఏడాదికి సంబంధించిన సవరించిన అంచనాలు లేకుండానే ఈ సంవత్సరంలో నాలుగు నెలలు గడిచి పోయాయి. అవి లేకుండానే ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై మనం మాట్లాడుతున్నాం. అయ్యా పునాదులేమీ తెలియకుండా భవనం ఎలా కడతారయ్యా? అని అడగడం జరిగింది. అపుడు అడిగినందుకు ఈ రోజే కొన్ని పుస్తకాలు ఇచ్చారు. దీంట్లో సవరించిన అంచనాలు అని చెప్పి ఒక చిన్న కాలమ్ పెట్టారు. ఇంతకన్నా అన్యాయం ఇక ఉండదనుకుంటా. ఇవే సవరించిన అంచనాలు చూస్తే మొన్న ఏ విధంగా ఉన్నాయో ఇపుడు అదే విధంగా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు అని వేరుగా శీర్షికలు పెట్టారంతే.. అక్కడున్నవే ఇక్కడ రాశారు. మరి ఎందుకిలా ఎవరికీ తెలియకుండా చేస్తున్నారో అర్థం కావడం లేదు గానీ బడ్జెట్లో ఇదే చేశారు. ప్రొవిజనల్ స్టేట్మెంట్స్ అంటే బడ్జెటెడ్ స్టేట్మెంట్స్.. ఇక ఆడిటర్ సంతకం పెట్టడానికి ముందు ప్రొవిజనల్ స్టేట్మెంట్స్ అంటారు. అవి కూడా వచ్చి ఉండాలి. అవి వచ్చి ఉన్నా కూడా ఏమీ చూపించలేదు. ఈ సవరించిన అంచనాలు చూపించారు. అవి కూడా అన్నీ తప్పుల తడకలే. ఇక్కడి నుంచి కాపీ కొట్టి (రెండు పుస్తకాలుచూపుతూ) మళ్లీ అక్కడికి వేశారు. ఎంట్రీలు చూస్తే ఇందులో ఉన్న అంకెలే మళ్లీ అక్కడా ఉన్నాయి. ఓ చిన్న ఉదాహరణ చెప్పాలంటే రెవెన్యూ రాబడులు బడ్జెట్లో 1,27,772 కోట్లయితే సవరించిన అంచనాల్లో కూడా కరెక్ట్గా అదే 1,27,772 కోట్ల సంఖ్యే చూపించారు. బడ్జెట్ అదే సవరించిన అంచనాలు అవే. ఎందుకిలా మోసం చేస్తూ పోతున్నారో అర్థం కాని విషయంగా ఉంది. రెవెన్యూ మిగులు అంశం కూడా బడ్జెట్లో 1,022 కోట్లు పెడితే సవరించిన అంచనాల్లో కూడా 1022 కోట్లే ఉన్నాయి. ఇక రాష్ట్ర తొలి బడ్జెట్ రెవెన్యూ లోటు ఎంతో తెలియకుండా, ద్రవ్య లోటు ఎంతో తెలియకుండా బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. తొలి బడ్జెట్లో దేశంలో ఇలా ఎక్కడా జరిగి ఉండదు. బడ్జెట్లో రెవెన్యూ లోటు రూ. 6 వేల కోట్లా లేక 25 వేల కోట్లా కూడా తెలియదు. ద్రవ్యలోటు రూ. 12 వేల కోట్లా లేక రూ. 37,910 కోట్లా తెలియదు. ప్రణాళికా వ్యయం కాస్తో కూస్తో తగ్గిందనంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. అది తగ్గించుకోవచ్చు. పెంచొచ్చు. కానీ ప్రణాళికేతర వ్యయం అనేది జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు ఇలాంటి వాటికి సంబంధించిన వ్యయం. అలాంటిది, ఒక్క వృద్ధాప్య పెన్షన్లు తప్పనిచ్చి మిగతావన్నీ కేటాయింపులు తక్కువగానే చూపిస్తూ వచ్చారు. ఇంతకు ముందు బడ్జెట్తో పోలిస్తే ఏకంగా 23 వేల కోట్ల ప్రణాళికేతర వ్యయం ఎక్కువ చేసి చూపించారు. ఇది నిజంగా తప్పుల తడక, తప్పుదోవ పట్టించే పత్రాలు. ప్రజలకు ఏది వాస్తవం? ఎందుకీ మోసం జరుగుతా ఉంది? ఎవరు మోసం చేస్తున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు? అనేది తెలియాలి’’ కాగ్కు, కేంద్రానికి లేఖలు రాస్తాం... ‘‘ఈ వివరాలన్నింటితో మేం కాగ్కు, కేంద్ర ప్రభుత్వానికి, ప్రణాళికాసంఘానికి కూడా లేఖలు రాస్తాం. ‘ఈ లెక్కలు సరైనవా? లేక మేం చెప్తున్నవి సరైనవా? ఎవరు చెప్పేది సరైనవి? ఏది నిజం మీరు చెప్పండి? మొత్తం రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. వాళ్లందరికీ నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది’ అని విజ్ఞప్తి చేస్తాం. వీళ్లకు అపుడైనా బుద్ధొస్తుందేమో చూస్తాం. రైతు రుణాల మాఫీ మొత్తం రూ.87,612 కోట్లుంటే బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ. 5 వేల కోట్లే. రెండేళ్లకు కలిపి లక్షకు రూ.24 వేల అపరాధ వడ్డీ అయితే దాని గురించిన ఊసే లేదు. డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లుంటే కేటాయింపులు సున్నాగా ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏడాదికి రూ.36,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే దానికి అసలు కేటాయింపులే లేవు. ఇక అక్టోబర్ 1 నుంచి వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని లెక్కలైతే వేశారు గానీ సరిపడ కేటాయింపులులేవు. ఇవేవీ ప్రజల దృష్టికి రాకూడదని.. కుటిల రాజకీయాలు చేస్తున్నారు. నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసెంబ్లీలో మాట్లాడటానికి మాకు న్యాయం జరుగలేదు. అందుకే మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఈ అన్యాయాన్ని ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లండి. మీరంతా విజ్ఞత కలిగిన వాళ్లు.. ఈ లెక్కలన్నీ నేను సృష్టించినవి కావు, ఇవన్నీ నగ్న సత్యాలు. మీరు కూడా ఒకసారి అధ్యయనం చేయండి. ఈ ప్రభుత్వానికి మీద్వారా కూడా బుద్ధి వచ్చేట్లు చేయండి. అందరమూ కూడా ఈ కార్యక్రమం చేయాలి. అప్పటికన్నా ఈ దుర్యోధన సభ, ఈ కౌరవ సభలో కాస్తో కూస్తో మార్పు వస్తుందని మనవి చేస్తున్నాను. అసెంబ్లీలో మాట్లాడలేక పోయిన అంశాలను మీ ద్వారా ప్రజల వద్దకు తీసుకె వెళుతున్నాను. గతంలో కూడా నా వాణిని ప్రజలకు వినిపించినందుకు నేను మీడియా సోదరులకు పత్రికా సోదరులకూ ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ -
ఒక రోజు ఆలస్యంగా కాంగ్రెస్ మేధోమథనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ దేశంలోనే తొలిసారిగా ‘మధోమథన సదస్సు’లను మన రాష్ట్రం నుంచి మొదలు పెడుతోంది. ఈ నెల 24,25వ తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని ‘శ్రీ ఇందు కాలేజీ’లో ఈ సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ సదస్సు 23,24వ తేదీల్లో నిర్వహించాలని భావించినప్పటికీ, అనివార్యకారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పలువురు ముఖ్యనేతలు ఇటీవల ఇందు కళాశాలను సందర్శించి.. సదస్సు వేదికను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్ల తయారీలో పార్టీ నిమగ్నమైంది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సహా తాజాగా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజ యానికి దారితీసిన అంశాలు... పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ రెండు రోజుల సమావేశంలో ఖరారు చేయనున్నారు. తొలిరోజు ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్పెలైట్ హాజరుకానుండగా, రెండోరోజు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కాంగ్రెస్వర్గాలు తెలిపాయి. రెండు రోజుల సదస్సుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్, జాతీయ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు, మాజీ మంత్రి జైరాంరమేశ్, కుంతియా తదితరులు రానున్నారు. -
పదిలో పన్నెండు
టెన్త్ ఫలితాల్లో జిల్లాకు 12వ స్థానం జిల్లాలో 90.52 శాతం ఉత్తీర్ణత బాలికలదే పైచేయి జిల్లాలో 47,215మంది ఉత్తీర్ణత పది పాయింట్లు సాధించిన విద్యార్థులు 363మంది జూన్ 16 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు మే 30 తుదిగడవు సాక్షి, విజయవాడ/న్యూస్లైన్ మచిలీపట్నం : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. పదికి పది పాయింట్లు సాధించిన జిల్లాల్లో మూడో స్థానం పొందింది. మొదటి స్థానంలో రంగారెడ్డి, రెండో స్థానంలో గుంటూరు జిల్లాలు నిలవగా మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచి తన ఉనికిని మరోమారు చాటుకుంది. ఉత్తీర్ణత శాతం కూడా గతేడాది కన్నా స్వల్పంగా మెరుగుపడింది. మెత్తంమీద జిల్లాలో 90.52 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 450 ప్రైవేటు, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల నుంచి 52,160 మంది విద్యార్థులు పరీక్షలకు హజరయ్యారు. వీరిలో 47,215 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 27,005 మంది బాలురు పరీక్షలకు హజరు కాగా, 24,378 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 25,155మంది హజరుకాగా, 22,837మంది పాస్ అయ్యారు. ఈఎడాది జిల్లాలో పదికి పది పాయింట్లు 363మంది విద్యార్థులు సాధించారు. స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం గతేడాది కన్నా ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. 2012-13 విద్యా సంవత్సరంలో 90.29 శాతంతో రాష్ట్ర స్థాయిలో పదో స్థానం సాధించిన జిల్లా.. 2013-14 విద్యా సంవత్సరంలో 90.52శాతం ఉత్తీర్ణత సాధించింది. ఉత్తీర్ణత 0.23 శాతం పెరిగినా రాష్ట్రస్థాయిలో 12వ స్థానానికి దిగజారింది. 2011-12 విద్యా సంవత్సరంలో 51,137 మంది పరీక్షలకు హాజరు కాగా, 45,389 ఉత్తీర్ణులయ్యారు. 88.76 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్రస్థాయిలో జిల్లా 12వ స్థానంలో నిలిచింది. 68 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత జిల్లాలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 68 ఉన్నాయి. 95శాతానికి పైగా ఉత్తీర్ణ సాధించిన పాఠశాలలు వందకు పైగా ఉన్నాయి. ఈ ఫలితాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రీ-వెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్, ఫొటోస్టాట్ కాపీలు తీసుకోవాలనుకునేవారు 12రోజులలోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో డి.దేవానందరెడ్డి ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఇందుకోసం ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు చొప్పున చలానా లేదా డీడీ తీయాల్సి ఉంటుందన్నారు. రీ-వెరిఫికేషన్, ఫొటోస్టాట్ కాపీ తీసుకునేందుకు దరఖాస్తు చేసే సమయంలో హాల్టికెట్ జిరాక్స్ కాపీని తప్పనిసరిగా జత చేయాలని డీఈవో సూచించారు. ఈ దరఖాస్తులన్నీ డీఈవో కార్యాలయంలోనే స్వీకరిస్తామని ఆయన చెప్పారు. జూన్ 16 నుంచి 27వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 30వ తేదీపు ఆయా పాఠశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు. ఇంటర్నెట్ సెంటర్ల వద్ద సందడి.. పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో గురువారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సెంటర్ల వద్ద సందడి నెలకొంది. ఫలితాలు తెలుసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. -
మా చావుకు ఆ పోలీసే కారణం!
హైదరాబాద్ క్రైం బ్రాంచ్ అధికారి వేధింపుల వల్లే చనిపోతున్నాం బెంగళూరులో సూసైడ్నోట్ రాసి ఓ కుటుంబం ఆత్మహత్య బెంగళూరు, న్యూస్లైన్: హైదరాబాద్ సిటీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారి ‘రెడ్డి’ వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ రాసి బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయినవారిలో భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలో ఉండే కౌశిక్ శర్మ మూడేళ్ల క్రితం బెంగళూరు వకీల్ గార్డెన్లో భవంతిని నిర్మించుకుని అప్పటినుంచి అందులో భార్య శ్రీలత, కుమారుడు కౌస్తుభ, కుమార్తె శ్రీరక్షలతో నివసిస్తున్నారు. నగరంలోనే ఉండే తన అన్న కుమార్తె సుమేఘకు గురువారం ఫోన్ చేసిన కౌశిక్.. శుక్రవారం ఉదయం తమ ఇంటికి తప్పకుండా రావాలని పిలిచారు. ఆమె శుక్రవారం అక్కడికి వెళ్లి చూడగా, నలుగురూ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన దంపతులు తర్వాత ఉరేసుకున్నారు. ఒక బ్యాగులో రూ.10 లక్షలు, మరో బ్యాగులో కిలోన్నర బంగారు నగలు కూడా పెట్టి ఉంచిన విషయాన్ని సుమేఘ గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి కౌశిక్ రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో '‘హైదరాబాద్ సిటీ క్రైం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న రెడ్డి అనే అధికారి మా ఆస్తులు, నగదు, నగలు స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. నిత్యం వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నాం..’ అని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటిలో గొడలపై సైతం ‘ఏపీ పోలీస్ రెడ్డి, సీసీఎస్, అవర్ మనీ, గోల్డ్, సైట్’ అని రక్తంతో రాసినట్లు గుర్తిం చారు. తమ ఆస్తులతోపాటు నగలు, నగదు మొత్తం సుమేఘకు ఇవ్వాలని కౌశిక్ వీలునామా కూడా రాశారని పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉన్నందున నిందితుడు ‘రెడ్డి’ పూర్తి పేరును చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. అయితే నిందితుడికి కూడా వకీల్ గార్డెన్లో స్థలం ఉందని, తరచూ ఆ స్థలాన్ని చూసుకోవడానికి వచ్చిపోతూ.. కౌశిక్ పూర్తి వివరాలు తెలుసుకున్న ఆయన వారి ఆస్తిని కొట్టేసేందుకు కుట్ర పన్నారని సమాచారం. -
సిట్టింగ్.. షిఫ్టింగ్ !
జిల్లాలోని సిట్టింగ్ ఎంపీలకు స్థానచలనం కేంద్ర మంత్రులిరువురూ మహబూబ్నగర్కు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు తాజా పరిణామాలతో ఆశావహుల్లో కొత్త ఆశలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. లోక్సభ సీట్ల అభ్యర్థుల వ్యవహారం ఆ పార్టీలో సరికొత్త మలుపులకు దారితీస్తోంది. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంట రీ స్థానాలకు ప్రాతినిధ్యం విహ స్తున్న కేంద్ర మంత్రులు సూదిని జైపాల్రెడ్డి, సర్వే సత్యనారాయణ ఇరువురికీ ఈసారి స్థానమార్పిడి తప్పదనే ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ జైపాల్రెడ్డి ఈ ఎన్నికల్లో సొంత జిల్లా (మహబూబ్నగర్) నుంచి పోటీ చేస్తానని సంకేతాలివ్వడంతో అధిష్టానం.. కొత్త అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో 2009 ఎన్నికల్లో మల్కాజ్గిరి జనరల్ సీటు నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించిన సర్వేను కూడా ఈ సారి నాగర్కర్నూలు నుంచి పోటీ చేయమని అధిష్టానం ఒత్తిడి చేస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే సిట్టింగ్ ఎంపీలు.. అందులోనూ కేంద్ర మంతుల్రిరువురూ కాకతాళీయంగా మహబూబ్నగర్ జిల్లాకు షిఫ్ట్ కావడం అనివార్యంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ టికెట్ అనూహ్యంగా దక్కించుకున్న జైపాల్రెడ్డి 18,362 సమీప ప్రత్యర్థి ఏపీ జితేందర్రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత యూపీఏ-2 సర్కారులో కొలువుదీరారు. అయితే, గత ఎన్నికల వేళ కేవలం ఒకసారి మాత్రమే ఇక్కడి నుంచి బరిలో దిగుతానని, వచ్చే ఎన్నికలో పోటీచేయనని అప్పట్లో జైపాల్ సెలవిచ్చారు. ఈ క్రమంలోనే ఈ సీటుపై పలువురు ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. జైపాల్రెడ్డి సైతం చెప్పినట్లుగానే ఈసారి పాలమూరుకు మారేందుకు సన్నాహాలు చేసుకుంటుండడంతో టికెట్ రేసులో ఉన్న నేతలు తాజాగా దూకుడును మరింత పెంచారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్రెడ్డి, రాగం సుజాతయాదవ్, మర్రి శశిధర్రెడ్డి పేర్లు ప్రముఖంగా ఇక్కడి నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు మల్కాజ్గిరి నియోజకవర్గంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సర్వేను నాగర్కర్నూలుకు మార్చాలని ఏఐసీసీ భావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలతో పొసగకపోవడం, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు అంతరంగిక సర్వేల్లో తేలడంతో సర్వే స్థానే కొత్తవారిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్కర్నూలుకు షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీలిద్దరు వేరే నియోజకవర్గాలకు మారడం తథ్యంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అభ్యర్థిత్వంపైనా అనుమానాలు తలెత్తుతుండడం గమనార్హం. ఈ స్థానాన్ని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నట్లు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి స్పష్టం చేయడం, తాను కాకపోతే కోడలు వైశాలి పేరును పరిశీలించాలని సిఫార్సు చేయడం చూస్తే కోమటిరెడ్డికి చెక్ పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఇదే జరిగితే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు స్థానంలో కొత్త అభ్యర్థులు తెరమీదకు వచ్చే అవకాశముంది.