Telangana Municipal Election 2020
-
ఓడించాడని చంపేశారు!
వేములవాడ: రాజకీయ కక్షలకు ఓ రౌడీ షీటర్ బలయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే వెంటాడి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం చోటుచేసుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో తమను ఓడించాడని కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీఐ సీహెచ్ శ్రీధర్ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన ముద్రకోల వెంకటేశ్ కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయాడు. స్థానికంగా వాటర్ ప్లాంటులో డ్రైవర్గా పని చేస్తున్న శివ తనకు మద్దతు ఇవ్వకుండా ప్రత్యర్థి గెలుపునకు సహకరించాడని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తన ఓటమికి కారణమైన అతడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించాడు. కక్షతో రగిలిపోతున్న వెంకటేశ్.. అదను చూసి దెబ్బ కొట్టాలని పథకం రచించాడు. ఈ నేపథ్యంలో ఉదయం బైక్పై వెళ్తున్న శివను తన సన్నిహితుడు శ్రీనివాస్తో కలసి వెంటాడారు. నడిరోడ్డుపై అటకాయించి కత్తులతో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివను చూసిన స్థానికులు.. పోలీసులకు, 108కు సమాచారం అందించారు. వారు శివను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శివ చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా శివపై మూడేళ్ల క్రితం రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రకాంత్ పరిశీలించారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు ముద్రకోల వెంకటేశ్, శ్రీనివాస్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది. -
ఓటు వేయలేదని.. కత్తి దించాడు!
-
వేములవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే కోపంతో ముద్రకోల వెంకటేశ్ అనే మాజీ కౌన్సిలర్ శివ అనే యువకుడిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు..వేములవాడ మున్సిపాలిటీలోని 3వ వార్డు నుంచి వెంకటేశ్ టీఆర్ఎస్ తరపున పోటీచేశాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి దివ్య చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే, తన ఓటమి కారణం శివే అని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తనకు కాకుండా దివ్యకు ఓటు వేసిన శివను చంపుతానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్తో అతనిపై కత్తితో దాడికి దిగాడు. నిందితుడు వెంకటేశ్, అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
కమలం ‘చెయ్యి’స్తే.. గులాబీ ముల్లు గుచ్చింది..!
సాక్షి, నల్గొండ : నల్గొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కమలనాథులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చైర్మన్ ఎన్నిక సమయంలో టీఆర్ఎస్తో చేసుకున్న లోపాయి కారి ఒప్పందం అమలుకాక పోగా.. బీజేపీ నవ్వులపాలైంది. అధికార పార్టీ వైస్ చైర్మన్ ఇవ్వకుండా బీజేపీకి మొండిచేయి చూపింది. దాంతో ముందుగా కాంగ్రెస్కు హ్యాండిచ్చిన కాషాయ నేతలకు ఇప్పుడు ‘గులాబీ’ నేతలు ముల్లు గుచ్చారు. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్గా టీఆర్ఎస్కు చెందిన అబ్బగోని రమేష్ గౌడ్ను సభ్యులు సోమవారం ఎనుకున్నారు. టీఆర్ఎస్-బీజేపీ ఓ వైస్ చైర్మన్..! నల్గొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం ఇక్కడ 48 వార్డులుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరో 20 స్థానాల్లో గెలవగా, బీజేపీ 6 స్థానాలు, ఇండిపెండెంట్ ఒక స్థానం, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో ఛైర్మన్ పదవి దక్కించుకోవాలంటే బీజేపీ కీలకమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ పదవి అని ఒప్పందం జరిగినట్టు తెలిసింది. అయితే, వైస్ చైర్మన్ పదవిని తామే ఇస్తామన్న టీఆర్ఎస్ బీజేపీని తమవైపునకు తిప్పుకోవడంలో సఫలం అయింది. టీఆర్ఎస్ హామీతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజున బీజేపీ తటస్థంగా వ్యవహరించింది. ఒక ఎంఐఎం, ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో టీఆర్ఎస్ బలం బలం 22కు చేరగా.. ఎక్స్ అఫీషియో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఓటుతో పాటు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపు రెడ్డి ఓట్లతో టీఆర్ఎస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చివరికి వైఎస్ చైర్మన్ పదవిని కూడా అధికార పార్టీ దక్కించుకోవడంతో బీజేపీకి మొండి చేయ్యి మిగిలింది. వైస్ చైర్మన్ పదవికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు పల్లారాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపినా వారు అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. మొత్తంగా కాషాయ నేతల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాం.. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగా వెళ్లామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. నల్గొండలో బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఇక్కడికి కేసీఆర్ వస్తారని తెలిపారు. సెక్యులర్ పార్టీగా టీఆర్ఎస్ ఒక రాజకీయ విధానంతో ముందుకు వెళ్తోందని అన్నారు. నల్గొండలో మంచి పాలన చూపిస్తామని పేర్కొన్నారు. -
ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అడ్రస్ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. శంషాబాద్కు చెందిన టీడీపీ కౌన్సిలర్ గణేష్ గుప్తాతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. తొలిస్థానంలో టీఆర్ఎస్ ఉంటే.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఇండిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. 1200 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్లకు బీఫార్మ్ ఇస్తామన్న పోటీ చేసే అభ్యర్థులే లేరని అన్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, పురపాలికల్లో విజయం సాధిస్తే అందులో ఎక్కువ శాతం బడుగు, బలహీనవర్గాలకే కేటాయించామని గుర్తుచేశారు. చైర్మన్, వైఎస్ చైర్మన్లలో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పొత్తుపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారని.. సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయని కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికైనా.. ఢిల్లీ ఎన్నికైనా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిందని అన్నారు. అడ్డిమారిగుడ్డిదెబ్బలా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచిందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అన్యాయం జరిగిందని.. దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. నీతిఆయోగ్ సిఫార్సు చేసిన కేంద్రం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ కొత్త పథకాలతో అభివృద్ధిలో ముందకు వెళ్తుందన్నారు. శంషాబాద్ వరకు మెట్రో రైలు పోడిగిస్తామని తెలిపారు. శంషాబాద్కు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్
-
‘తుక్కుగూడలో ఎంపీ కేశవరావు ఓటు చెల్లదు’
సాక్షి,న్యూఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు టీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు నడుచుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నిబంధనలకు విరుద్ధంగా తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేశారని చెప్పారు. సాంకేతికంగా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని పేర్కొన్నారు. తుక్కుగూడలో ఎంపీ కేశవరావు ఓటు చెల్లదని లక్ష్మణ్ అన్నారు. ఈమేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోవాలని కోరినట్టు లక్ష్మణ్ తెలిపారు. ఉప రాష్ట్రపతిని కలిసినవారిలో ఎంపీలు బండి సంజయ్, అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు,ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. -
ఇక ఆ ఎన్నికలపై టీఆర్ఎస్ కన్ను
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. దాదాపు ఏడాదికాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా ప్రజలను ఆకట్టుకునేందుకు అభివృద్ధి కార్యక్రమాల వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ పనులుపూర్తిచేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు జీహెచ్ఎంసీ జోనల్కమిషనర్లు, తదితర ఉన్నతాధికారులతో శేరిలింగంపల్లి జోన్లో జీహెచ్ఎంసీ పనుల తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రజలకందే సేవలు పెరగాలని, అభివృద్ధి బాగా కనిపించాలని దిశానిర్దేశం చేశారు. ఫుట్పాత్లు, స్కైవేలు, బస్షెల్టర్లు, బస్ బేలు, జంక్షన్ల అభివృద్ధి పనులు, జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు,పార్కుల్లో పబ్లిక్ టాయ్లెట్లు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, శ్మశాన వాటికలు, రోడ్ల నిర్వహణ పనులు తదితరమైన వాటికి సంబంధించిన లక్ష్యాలు.. పురోగతి తదితరవివరాలను అధికారులనుఅడిగి తెలుసుకున్నారు. రోడ్ల పనుల వేగం పెరగాలి.. రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చినప్పటికీ పనులు తగిన వేగంతో జరగడం లేవని అభిప్రాయపడ్డారు. చాలా స్లోగా ఉన్నాయని, ఈ పనుల వేగం పెరగాలని ఆదేశించారు. కొన్ని ఏజెన్సీలు ఇంకా బీటీ మిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోకపోవడం.. పనులు ప్రారంభించకపోవడాన్ని ప్రస్తావించారు. ఈపనుల వేగం పెరగాలని, ఎస్సార్డీపీ పనుల వేగం కూడా పెరగాలన్నారు. ఈ రెండు అంశాలపై శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానన్నారు. మోడల్ మార్కెట్లను త్వరితంగా అందుబాటులోకి తేవాలన్నారు. అక్రమ నిర్మాణాలను త్వరితంగా కూల్చివేసేందుకు ఆధునిక ఉపకరణాలేమేమి ఉన్నాయి.. వాటి ధరలు.. పనితీరు..వాటిని జీహెచ్ఎంసీ సమకూర్చుకోవడానికి సంబంధించి చర్చించారు. గతంలో హైదరాబాద్ స్టాక్ ఎక్సే్ఛంజ్ భవనం కూల్చివేతకు వినియోగించిన యంత్రం ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చింది. అలాంటి ఒక యంత్రం అద్దెకు తీసుకుంటున్నట్లు, భారీ భవంతుల కూల్చివేతలకు దాన్ని వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎఫ్ఓబీల నిర్మాణంలో ఫుట్పాత్లకు భంగం కలుగకుండా స్థలం ఉంటే దాన్ని సేకరించాలని సూచించారు. తక్కువ స్థలంలో చిట్టడవుల పెంపకానికి ‘మియావాకి’ విధానాన్ని అనుసరించాలని సూచించారు. శేరిలింగంపల్లి జోన్లలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి జోనల్ కమిషనర్ హరిచందన పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్లాస్టిక్ రీసైకిల్డ్ టైల్స్ ఫుట్పాత్లు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు తదితరమైనవి బాగున్నాయని, మిగతా అన్ని జోన్లలోనూ వాటిని అమలు చేయాలని సూచించారు. ఖైరతాబాద్ జంక్షన్లో లైటింగ్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. వివిధ పనుల్లో నూతనత్వాన్ని, సృజనాత్మకంగా ఆలోచనలు చేయాలని సూచించారు. దుర్గంచెరువుపై ఏర్పాటు చేసే లైటింగ్ గురించి ప్రస్తావించారు. సమావేశంలో కమిషనర్ లోకేశ్కుమార్, జోనల్ కమిషనర్లు, సీసీపీ, సీఈలు తదితరులు పాల్గొన్నారు. -
మున్సి‘పల్టీలు’!
సాక్షి, మేడ్చల్ జిల్లా: గ్రేటర్ హైదరాబాద్ శివారు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గం కొంగొత్త ఆశలతో కొలువుదీరుతున్న వేళ..తమ సమస్యలకు మోక్షం లభించగలదని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. మున్సిపల్ కొత్త చట్టం ఇందుకు మరింత దోహదం చేయగలదని వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, గ్రేటర్ శివారులో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో పెరుగుతున్న కాలనీలు, జనాభాకు అనుగుణంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించ లేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ పనుల నత్తనడకతో తాగునీరందడం లేదు. అండర్ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. సామర్ధ్యం లేక పైప్లైన్ల లీకేజీలు, మరమ్మతులు లేక అధ్వాన్నంగా ప్రధాన అంతర్గత రోడ్లు, కబ్జాలకు గురైన చెరువులు, కుంటలకు తోడు, డంపింగ్ యార్డులతో విరజిమ్ముతున్న కాలుష్యం వెరసి భూగర్భ జలాలు విషపూరితంగా మారి జీవకోటికి సవాల్ విసురుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పురపాలక సంఘాలకు మేయర్లుగా, చైర్మన్లు, చైర్పర్సన్లుగా పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ప్రధాన సమస్యలపై సాక్షి ఫోకస్... ♦ పీర్జాదిగూడ కార్పొరేషన్ఈ కార్పొరేషన్కు ఏటా రూ.40 కోట్ల ఆదాయం ఉంది. ♦ వర్షాకాలంలో శ్రీరామా ఆర్టీసీ కాలనీ, వినాయకనగర్, శ్రీపాద ఎన్క్లేవ్, గణేష్నగర్, విష్ణుపురి, శంంకర్నగర్, బండి గార్డెన్ తదితర ఏరియాల్లో వర్షాకాలంలో వరద సమస్య ఎదురవుతోంది. ♦ పర్వాతాపూర్, కార్పొరేషన్ కార్యాలయం వెనుక కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ♦ మేడిపల్లి సీపీఆర్ఐ నుంచి పర్వాతాపూర్ వరకు, వరంగల్ జాతీయ రహదారిలోని మైసమ్మ గుడి నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంతర్గత రోడ్లన్నీ గుంతలతో నిండిఉన్నాయి. ♦ కాలుష్యం, పారిశుధ్య సమస్యలతో జనం రోగాలబారిన పడుతున్నారు. ♦ పీర్జాదిగూడలో 80 కాలనీల్లో 30 కాలనీలకు భగీరథ నీరు రావటం లేదు. నాలుగు రోజులు లేదా వారానికి ఒకసారి నల్లా నీరు సరఫరా అవుతున్నది. పీర్జాదిగూడలో 60 పార్కులకుగానూ 40 పార్కులు ఆక్రమణలకు గురయ్యాయి. బోడుప్పల్ .. ♦ ఈ కార్పొరేషన్కు ఏటా రూ.60 కోట్లు పన్నుల రూపేణా ఆదాయం ఉంది. ♦ చెంగిచర్ల వెంకటసాయినగర్, శ్రీసాయి రెసిడెన్సీ తదితర ప్రాంతాల్లో మురికి కాలువలు సరిగా లేక వర్షపు నీటితో వరద నీరు కలిసి రోడ్లన్నీ వరదమయంగా మారుతున్నాయి. ♦ 45 కాలనీల్లో మురికి కాలువలు, అంతర్గత రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ♦ బోడుప్పల్లోని ‘రా’ చెరువు కాలుష్య కాసారంగా మారింది. వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ♦ బోడుప్పల్లో 120 కాలనీలకుగానూ 40 కాలనీలకే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. రెండవ దశ పనులు పూర్తి కాకపోవటం వల్ల వారానికి ఒక సారి నీరు సరఫరా చేస్తున్నారు. లక్ష్మీనగర్ హుడా కాలనీ, ఈస్ట్ బృందావనకాలనీ, అంబేద్కర్ చౌరస్తా, శ్రీనివాస కాలనీ, రాజశేఖర్ కాలనీల్లో, హనుమాన్నగర్, ఉదయ్నగర్లో పైప్లైన్లు పగిలి లీకేజీలవుతున్నాయి. ♦ 270 పార్కులకుగానూ, 150 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. జవహర్నగర్ .. ♦ ఈ కార్పొరేషన్లో దాదాపు రెండు లక్షల జనాభా, 40 వేలకు పైగా గృహాలు ఉన్నప్పటికీ పన్నుల ఆదాయం రూ.7 కోట్లు మాత్రమే వస్తోంది. ♦ జవహర్నగర్లో ప్రధానంగా డంపింగ్ యార్డు కాలుష్యం, దుర్గంధం, ప్రధాన, అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, పారిశుధ్ద్య నిర్వహణ సరిగా లేదు. ఖాళీ స్థలాలు, ఇళ్ల క్రమబద్ధీకరణ చేపట్టాల్సి ఉంది. నిజాంపేట్ .. ♦ ప్రజల నుంచి ఏటా ఈ కార్పొరేషన్కు పన్నుల రూపంలో రూ.40 కోట్లు వస్తున్నా సమస్యలు తీరడం లేదు. ♦ నిజాంపేట్, ప్రగతి నగర్ మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉంది. మిషన్ భగీరథ పనుల్లో జాప్యంతో నీటి ఇబ్బందులు తప్పటం లేదు. చెత్త డంపింగ్ యార్డును విస్తరింపజేసి, ఆధునీకరించాల్సి ఉంది. బండ్లగూడ .. ♦ బండ్లగూడకు ఏటా ప్రజల నుంచి వివిధ పన్నుల ద్వారా రూ.30 కోట్లు సమకూరుతున్నది. అనేక కాలనీల్లో తాగు నీటి సమస్య ఉంది. హైదర్గూడ పీఅండ్టీ కాలనీ మధ్య మూసీపై వంతెన నిర్మించాల్సి ఉంది. పీరం చెరువు కాలుష్యం, డంపింగ్ యార్డుతో భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయి. బడంగ్పేట్ .. ♦ ఏటా ప్రజల నుంచి పన్నుల ద్వారా ముక్కు పిండి రూ.39 కోట్లు వసూలు చేస్తున్నారు. మురికి నీటి వ్యవస్థకు అవుట్ లేకపోవటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన, అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. బస్తీలు, కాలనీల్లో నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. మీర్పేట్ .. ♦ ఈ కార్పొరేషన్కు ఏటా పన్నుల ద్వారా రూ.24 కోట్ల ఆదాయం వస్తుండగా,....ప్రజలు మాత్రం తాగునీరు, తీవ్ర పారిశుధ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెరువుల్లోకి నేరుగా మురికి నీరు కలిసి కాలుష్యంగా మారుతున్నాయి. ప్రధానంగా 60 కాలనీలకు బస్సు సౌకర్యం లేదు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మురికినీరు వ్యవస్థ బాగా లేకపోవటంతో రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తోంది. 21 మున్సిపాలిటీల్లోనూ అంతే.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం, దుండిగల్, పెద్దఅంబర్పేట్, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, తుర్కుయాంజాల్, నార్సింగ్, ఆదిబట్ల, షాద్నగర్, ఆమనగల్లు తదితర మున్సిపాలిటీల్లో ఏటా లక్షలాది రూపాలు పన్నులను ప్రజల నుంచి ముక్కిపిండి వసూలు చేస్తున్న అధికారులు, పాలక వర్గం వారికి మౌలిక వసతులు కల్పించలేక పోతున్నది. నాగారం మున్సిపాలిటీలో ఏటా రూ.12 కోట్లు పన్నుల ద్వారా వస్తుండగా, చిన్న మున్సిపాలిటీలు అయిన తుక్కుగూడకు రూ.1.8 కోట్లు, పోచారానికి రూ.3 కోట్లు, గుండ్ల పోచంపల్లికి రూ.5 కోట్లు, మేడ్చల్కు రూ.2.3 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మున్సిపాలిటీల్లో ప్రజలు తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, మురికి కాలువలు, డంపింగ్ యార్డు, చెరువుల, కుంటల కాలుష్యం, అక్రమ కట్టడాలు, పార్కులు, ప్రభుత్వ భూముల కబ్జా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శశ్మాన వాటికలు, హరితహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న పురపాలికలు ఈ ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎన్నిక ఏదైనా మా ఓటు కారుకే అని నిరూపించారు
-
టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూర్యాపేట: తమ నాయకుడికి వైస్ చైర్మన్ పదవి దక్కలేదన్న బాధతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట పట్టణం ఐదో వార్డు నుంచి స్థానిక టీఆర్ఎస్ నేత బాషా భాయ్ గెలుపొందారు. సూర్యాపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ వశం కావడంతో ఆయనకు వైస్ చైర్మన్ పదవి వస్తుందని భావించారు. అయితే, చివరి నిమిషంలో బాషాకు పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరుడైన యువకుడొకరు ఇంట్లోకి వెళ్లి ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. -
సునీల్ రావును వరించిన మేయర్ పీఠం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మేయర్ పీఠం విషయంలో ఎట్టకేలకు ఉత్కంఠ ముగిసింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి సునీల్రావుకు మేయర్ అధ్యక్ష పదవి దక్కింది. జనరల్ కేటగిరీలో రిజర్వు అయిన కరీంనగర్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు పలువురు కార్పొరేటర్లు ప్రయత్నించినప్పటికీ... సునీల్రావు, రాజేందర్రావు మధ్యనే చివరి వరకూ పోటీ నెలకొంది. అయితే అధిష్టానం సునీల్ రావు వైపే మొగ్గు చూపింది. (కరీంనగర్ పైనా గులాబీ జెండా) కాగా కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి ముఖ్యమైన స్థానాలన్నీ బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారే ఉన్నారు. జిల్లాలో ఉన్నత వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్కుమార్ గత ఎన్నికల్లో ఓటమి చెందగా ప్రస్తుతం ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ మేయర్గా వెలమ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ను ఎన్నుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 33 కార్పోరేషన్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. (ప్రముఖులకు షాకిచ్చిన మున్సిపల్ ఎన్నికలు..) సునీల్ రావుకే దక్కిన పీఠం కార్పొరేషన్ ఎన్నికల్లో 33వ డివిజన్ నుంచి పోటీ చేసిన యాదగిరి సునీల్రావు భారీ మెజా రిటీతో విజయం సాధించారు. ఆయన కరీంనగర్ కార్పొరేషన్ నుంచి కౌన్సిలర్గా, కార్పొరేటర్గా నాలుగుసార్లు విజయం సాధించారు. మంత్రి గంగుల కమలాకర్కు సమకాలీకుడైన సునీల్రావుకు ప్రణాళికాసంఘం వైస్ చైర్మన్ వినోద్కుమార్తో సాన్నిహిత్యం ఉంది. ఇక అదే సమయంలో మంత్రి గంగుల చిన్ననాటి స్నేహితుడైన వంగపల్లి రాజేందర్ రావు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి 56వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా విజయం సాధించారు. ఆయన పోటీ చేస్తున్నప్పటి నుంచే మేయర్ స్థానం రాజేందర్కే అనే ప్రచారం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా మంత్రి గంగుల రాజేందర్రావుకే ప్రాధాన్యత ఇస్తారని పార్టీ నేతలు భావించారు. అయితే నిర్ణయాధికారం అధిష్టానం చేతుల్లోకి వెళ్లడంతో బుధవారం ఉదయం వరకు ఈ సస్పెన్స్ కొనసాగింది. ఆఖరికి పార్టీ అధినాయకత్వం సునీల్ రావు పేరును ఖరారు చేసింది. నేడు మేయర్ ఎన్నిక.. డిప్యూటీ మేయర్గా చల్లా స్వరూపరాణి కరీంనగర్ నగర పాలక మండలికి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం మునిసిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మేయర్, డిప్యూటీ మేయర్లను లాంఛనంగా ఎన్నుకున్నారు. -
బీజేపీలో రచ్చ: ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీలో రచ్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్పై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కలిసి తిరుగుబావుటా ఎగురవేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లను అమ్ముకున్నారని ప్రధాన ఆరోపణ. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో 49 వార్డులు ఉండగా బీజేపీ 11 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. అయితే ఆదిలాబాద్లో మెజార్టీ స్థానాలు గెలుపొందే అవకాశం బీజేపీకి ఉన్నప్పటికీ జిల్లా నాయకులు టీఆర్ఎస్తో కుమ్ముక్కై పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారన్నది ఆరోపణ. అంతకు ముందు జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ పరంగా కోర్ కమిటీలో నిర్ణయం లేకుండానే టికెట్ల పంపిణీ జరిగిందని అంటున్నారు. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే జిల్లా, మండల కమిటీ నాయకులు ముందుకు వచ్చామని పార్టీలోని కొందరు చెబుతుండగా, పాయల శంకర్ అధ్యక్షతనే జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో 11 వార్డుల్లో కౌన్సిలర్లు గెలుపొందారని, అలాంటప్పుడు ఆరోపణలు అసమంజసమని పార్టీకి చెందిన మరికొంత మంది నేతలు జిల్లా అధ్యక్షుడికి వంత పాడుతున్నారు. అంతేకాకుండా త్వరలో జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఉండడంతోనే వ్యూహాత్మకంగా ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి మరి. ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు జరుగుతున్నాయి జిల్లా పార్టీలో ఒక్కడి చేతిలో నిర్ణయాలు జరుగుతున్నాయి. కోర్ కమిటీ కూర్చోకుండానే బీ–ఫామ్ల కేటాయింపు జరుగుతోంది. ఏకపక్షంగా అందజేస్తున్నారు. ఏక వ్యక్తి పాలన.. పార్టీ ఆఫీసు నామమాత్రం.. సమష్టి నిర్ణయాలు లేవు. రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడి వ్యవహారంపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టీపట్టనట్లు వ్యవహారిస్తున్నారని, రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యనేత అండదండలతోనే జిల్లా నాయకుడు పార్టీ అంటే నేనే అనే విధంగా వ్యవహరిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్పై పార్టీ సీనియర్ నేత, జెడ్పీమాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. నాకు అర్థం కావడం లేదు నాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనిపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. ఆదిలాబాద్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నాగురించి తెలుసు. – పాయల శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
‘తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామరక్ష’
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు గగ్గోలు పెట్టినా.. ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. దేశ చరిత్రలో ఇంతటి ఘనవిజయం ఏ పార్టీకి రాలేదని, ఇతంటి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు తమ పార్టీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. చైర్మన్, మేయర్ల ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిందన్నారు. ప్రతిపక్షాలు జీవితంలో ఏ ఒక్క వర్గానికి అవకాశం ఇవ్వకపోగా, అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. పార్టీలను, ప్రభుత్వం తిట్టడం వల్ల ఓట్లు పడవని, అభివృద్ధి పనులు చేస్తేనే అధికారంలోకి వస్తారని హితవు పలికారు. ప్రతి పక్షాలు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని నీచరాజకీయాలు చేయడం ఆపేయాలని సూచించారు. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పూలే వారసుడు టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా లేక జాతీయ పార్టీ లైన కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో అపవిత్ర అవగాహన కుదుర్చుకున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటూ ప్రాంతీయ పార్టీని ఎదుర్కొలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే కులాల మధ్య చిచ్చు పెట్టి.. ఎన్నికల తర్వాత పత్తాలేకుండా పోయారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేయడం మానేసి ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ పూలే వారసుడని, అన్ని వర్గాల ప్రజలను ఆయన న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి నాయకుడు దేశానికి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. -
నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు
-
దేవుడున్నాడు.. నిన్ను వదలడు: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సమావేశానికి కావాల్సిన సరైన కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్కు చెందిన 20 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరవ్వగా. టీఆర్ఎస్, బీజేపీకి చెందిన 28 మంది కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈ విషయంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ప్రకటన ముందే జిల్లా మంత్రులను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో మంత్రులు ఎమ్మెల్యేలు..ఇతర పార్టీలను భయభ్రాంతులకు గురిచేశారని, ఇవి నిజాయితీగా జరిగిన ఎన్నికలు కావని విమర్శించారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో యాదగిరిగుట్టను కాంగ్రెస్ కైవసం చేసుకుందని తెలిపారు. ఆదిభట్లలో తమకు మోజారిటీ వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ను తీసుకుపోయి టీఆర్ఎస్ నుంచి ఛైర్మన్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. (వీడిన సస్పెన్స్: నేరేడుచర్ల టీఆర్ఎస్దే) పెద్ద అంబర్పేటలో తమ కౌన్సిలర్లను చౌటుప్పల్లో ఎత్తుకు పోయారని ఆరోపించారు. గత 25 ఏళ్లలో ఇంత దరిద్రమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదని అన్నారు. రజకార్లకంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని, కేటీఆర్ సిరిసిల్లలో రెబల్స్ పోటీ చేస్తే వారిని సస్పెండ్ చేస్తానని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. నల్లగొండలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్లో చేరిన ఆదిభట్ల, పెద్ద అంబర్పేటకు చెందిన తమ కౌన్సిలర్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు వస్తుందని. వీరు చేసిన స్కాంలపై ఆధారాలతో ఈడీకీ, విజులెన్స్కు ఇస్తానని హెచ్చరించారు. గజ్వేల్లోమునిసిపల్ ఛైర్మెన్ గా 74 ఏళ్ల నారాయణ రెడ్డిని చేస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు. చదవండి : ఆ స్థానాల్లో ఫలించిన టీఆర్ఎస్ వ్యూహాలు ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ దోపిడిని పార్లమెంటులో ఎండగడుతా. నా నియోజకవర్గం పరిదిలో 9 మున్సిపాలిటీ క్లియర్ మోజార్టీ వచ్చింది. కాని రెండే మాకు దక్కాయి. రెండు మూడు రోజుల్లో విద్యుత్తు చార్జీలు పెంచుతారు. చిన్న చిన్న గ్రామాలను మున్సిపాలిటీలు చేసారు. వాటిల్లో పన్నులు పెంచుతారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ కేటీఆర్లకే మాత్రమే. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. నాకు పీసీసీ పదవిస్తే చేస్తా. లేకుంటే కార్యకర్త గా పనిచేస్తా. కేటీఆర్ సిగ్గుందా. నీది నోరా తాటిమట్టానా. గతంలో మా ఎమ్మెల్యేలను తీసుకుంటే నీ బిడ్డ ఓడిపోయింది. పైన దేవుడున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో చేసింది వదిలిపెట్టడు. కేసీఆర్ కేటీఆర్లు సిగ్గు లేకుండా పనిచేస్తున్నారు. మిమ్మల్ని వదిలి పెట్టం..గ్రామ గ్రామాన తిరుగుతాం. మిమ్మల్ని ఎండ గడుతాం.’’ అంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి : వరంగల్ : అన్ని మున్సిపాలిటీలు గులాబీవే -
నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు
సాక్షి, హుజూర్నగర్: ‘ నేను ఇచ్చిన తాయత్తు కట్టుకుంటే కౌన్సిలర్ అవుతావ్. హుజూర్నగర్ ఎమ్మెల్యే కూడా నా తాయత్తు వల్లనే గెలిచాడు’ అంటూ ఓ స్వామిజీ స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థితో జరిపిన మంతనాల ఆడియోటేపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలువడానికి తన తాయెత్తే కారణమని సదరు స్వామిజీ చెప్పడం గమనార్హం. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బెల్లి సత్తయ్య ఎన్నికల్లో తన గెలుపు కోసం ఓ స్వామిజీని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన స్వామిజీతో మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సత్తయ్య ప్రత్యర్ధులైన కాంగ్రెస్ అభ్యర్ధి ఇబ్రహీం, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఏర్పుల పరమేశ్లను కట్టడి చేయడానికి ఒక తాయత్తు ఇస్తానని, ఆ తాయెత్తు ఉంటే గెలుపు తథ్యమని సదరు స్వామిజీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలవడానికి తాను తాయత్తు ఇచ్చానని, ఇప్పటికీ ఆ తాయెత్తు ఆయన వద్ద ఉందని చెప్పారు. తన తాయెత్తుతో గెలిచిన తర్వాత తను అడిగింది ఇవ్వాలని షరతు పెట్టారు. సోషల్ మీడియాలో వైరలైన ఈ ఆడియోటేపుపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలోనూ ఈ మూఢనమ్మకాలేంటని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని నమ్మే నేతులు ప్రజలకు ఏమి మేలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ ఆడియోటేపులో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరు ప్రస్తావనకు రావడం.. ఆయన మెడలో తాయెత్తు ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
కారుకే నేరేడుచర్ల..
సాక్షి, సూర్యాపేట : తీవ్ర ఉత్కంఠ నడుమ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో చెర్మన్గా చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. టీఆర్ఎస్కు ఎక్స్అఫీషియో సభ్యులతో 11 ఓట్ల బలం ఉంటే.. కాంగ్రెస్కు 10 ఓట్లు ఉండటంతో మెజార్టీ సభ్యులు ఉన్న టీఆర్ఎస్కే నేరేడుచర్ల సొంతమైంది. ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డిని ఎక్స్ అఫీషియో ఓటుగా చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని వాకౌట్ చేసింది. కోరం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తంతు పూర్తి చేశారు. సుభాష్రెడ్డి ఓటుతో చైర్మన్ గిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్కు చెందిన కేవీపీ రామచందర్రావు ఓటుపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత మంగళవారం ఎన్నిక ఉంటుం దని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడంతో టీఆర్ ఎస్ మరో ఎక్స్ అఫీషియో ఓటును పెట్టుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఎత్తు ఫలించింది. ఎన్నిక వాయిదాకు ముందు కేవీపీ ఓటుతో కాంగ్రెస్కు 10 ఓట్లు, టీఆర్ఎస్కు 10 ఓట్లు ఉన్నాయి. దీంతో టాస్ వేస్తే ఎవరికి విజయం దక్కుతుందోనని భావించిన టీఆర్ఎస్.. తిరస్కరించిన కేవీపీ ఓటును మళ్లీ ఎలా జాబితా లో పెడతారని వేసిన పాచికతో ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలో ఇరుపార్టీలకు సమానంగా ఓట్లు ఉండటంతో శేరి సుభాష్రెడ్డి ఓటును నేరేడుచర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నమోదు చేయించింది. దీంతో ఆ పార్టీ సభ్యుల బలం 11కు చేరింది. సుభాష్రెడ్డి పేరును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎన్నిక ప్రారంభానికి ముందు చేర్చారు. తొలి జాబితాతోనే ఎన్నిక చేపట్టాలి ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి ప్రారం భిస్తూ ఓటు హక్కు జాబితాలో ఉన్న వారి పేర్లను సమావేశంలో వెల్లడించారు. దీంతో సుభాష్రెడ్డికి ఇప్పుడెలా ఓటు హక్కు కల్పిస్తారని ఉత్తమ్తో పాటు ఆ పార్టీ సభ్యులు పీఓను ప్రశ్నించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్ అఫీ షియో సభ్యుడిగా ఓటు హక్కు పొందిన తొలి జాబితాతోనే చైర్మన్ ఎన్నిక చేపట్టాలని, ఆ తర్వాత నమోదు చేసిన సుభాష్రెడ్డి పేరును జాబితాలో నుంచి తీసివేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభమయ్యే ముందు వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, అందకే సుభాష్రెడ్డి పేరును ఓటు జాబితాలో చేర్చామని పీవో వివరించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈసీ ఆదేశాలనే తాము అనుసరిస్తామని పీఓ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ రాస్తారోకో శేరి సుభాష్రెడ్డికి ఓటు హక్కు కల్పించడాన్ని నిరసిస్తూ ఎంపీలు ఉత్తమ్, కేవీపీలు నేరేడుచర్లలో రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికైన∙మెజార్టీ సభ్యులు బయట ఉన్నా.. ఎన్నిక కాని వారితో చైర్మన్ ఎన్నికను పూర్తిచేశారని విమర్శించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారికే చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని తనకు పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి, ఈసీ చెప్పారన్నారు. ఈ ఎన్నికపై న్యాయ పోరాటం చేస్తామని ఉత్తమ్ తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ దోచుకున్న సొమ్మునంతా మున్సిపల్ ఎన్నికల్లో పంచారని ఆరోపించారు. -
దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సాక్షి, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని మొట్ట మొదటిసారిగా బీసీ మహిళనే వరించింది. అందరి అంచనాలను తలకిందులయ్యాయి. మొదటి నుంచి చైర్ పర్సన్ మహిళకే దక్కుతుంది అనుకున్నప్పటికీ జనరల్ మహిళా స్థానంలో బీసీ మహిళకు కట్టబెట్టారు. వైస్ చైర్ పర్సన్ పదవిని పురుషుడికి అప్పగిస్తారని భావిస్తే అన్యూహంగా వైస్ చైర్ పర్సన్ పదవిని సైతం మహిళకు అప్పగించడం హుస్నాబాద్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో దాదాపు 30ఏళ్ల తర్వాత అతివలు పాలించే అవకాశం దక్కింది. 20 మంది వార్డు మెంబర్లకు ఇందులో 11 మంది మహిళలే కావడం, అందులో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులు మహిళలనే వరించడంతో మున్సిపల్లో మహిళా సాధికారత వెళ్లివిరియనుంది. మున్సిపల్ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇక ముందుగా టీఆర్ఎస్కు చెందిన 9 మంది, కాంగ్రెస్కు చెందిన 6 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యులు, ఇండిపెంటెండెంట్కు చెందిన ముగ్గురు సభ్యులచే ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను ఆర్డీఓ ప్రారంభించారు. ఇంతలోనే బీజేపీ సభ్యులు దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణులు తమకు పూర్తి స్థాయి సంఖ్యా బలం లేదని, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సమావేశాన్ని బహిష్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజిత... మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో భాగంగా కోరం ఉన్నందున ఎన్నికల ప్రక్రియను ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ నుంచి చైర్ పర్సన్ అభ్యర్థిగా ఆకుల రజిత, కాంగ్రెస్ నుంచి చిత్తారి పద్మకు భీపాంలు అందటంతో ఆల్ఫా బెటికల్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి బలం నిరూపించుకునేందుకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థిగా చిత్తారి పద్మను కాంగ్రెస్ సభ్యుడు మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య బలపరిచారు. అనంతరం టీఆర్ఎస్ చైర్ పర్సన్గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్ఎస్ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదించగా, మరో సభ్యుడు పెరుక భాగ్యరెడ్డి బలపరిచాడు. అలాగే ఇండిపెంటెండెంట్ చైర్పర్సన్ అభ్యర్థిగా జనగామ రత్నను కాంగ్రెస్ సభ్యురాలు పున్న లావణ్య ప్రతిపాదించగా, భూక్య స్వరూప బలపర్చారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి చైర్ పర్సన్లుగా కాంగ్రెస్ సభ్యులే ప్రతిపాదించి బలపర్చగా, మొదటగా ప్రతిపాదించిన కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మనే పరిగణనలోకి తీసుకుంటామని ఆర్డీఓ స్ఫష్టం చేశారు. అనంతరం ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజితకు మద్దతుగా టీఆర్ఎస్కు చెందిన 9 మంది, ఇండిపెంటెండెంట్లు ఇద్దరు, ఎక్స్ అఫియోసభ్యుడు ఎమ్మెల్యే సతీష్కుమార్లు మొత్తం 12 సభ్యులు చేతులు లేపి మద్దతు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మకు కాంగ్రెస్కు చెందిన 6గురు, ఇండిపెంటెండెంట్ అభ్యర్థి జనగామ రత్నలు చేతులెత్తి మద్దతు పలికారు. దీంతో రజితకు 12 మంది మద్దతు పలుకగా, పద్మకు 7గురు మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికల అధికారి ఆర్డీఓ అత్యధిక సభ్యులు రజితకు మద్దతు తెలుపడంతో మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజిత ఎన్నికైనట్లు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్గా అయిలేని అనిత మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ముందుగా పార్టీని ఆహ్వానించగా, వైస్ చైర్మన్ అయిలేని అనితను టీఆర్ఎస్ సభ్యురాలు కొంకట నళినీదేవి ప్రతిపాధించగా, బొజ్జహరీశ్ బలపర్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి చైర్ పర్సన్గా కోమటి స్వర్ణలతను మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య బలపరిచారు. అనంతరం ఎన్నిక నిర్వహించగా, టీఆర్ఎస్కు చెందిన అయిలేని అనితకు 9 మంది టీఆర్ఎస్ సభ్యులు, ఇద్దరు ఇండిపెంటెండెంట్ సభ్యులు, ఒకరు ఎక్స్ అఫిషియో సభ్యుడు మొత్తం 12 మంది సభ్యులు చేతులేత్తి మద్దతు పలికారు. కోమటి స్వర్ణలతకు కాంగ్రెస్ 6గురు సభ్యులు, ఇండిపెంటెండెంట్ ఒకరు చేతుతెత్తి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి అయిలేని అనితకు 12 మంది, కాంగ్రెస్ అభ్యర్థి కోమటి స్వర్ణలతకు 7గురు మద్దతు తెలిపారు. అత్యధికంగా సభ్యులు మద్దతు ఉన్న అనిత మున్సిపల్ వైస్ చైర్ పర్సన్గా ఎన్నికైనట్లు ఆర్డీఓ ప్రకటించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్గా ఆకుల రజిత, వైస్ చైర్పర్సన్గా అయిలేని అనితలచే ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. వాల సుప్రజా నవీన్రావును అభినందిస్తున్న ఎమ్మెల్యే సతీశ్బాబు అత్యధిక మెజార్టీ సాధించిన వాల సుప్రజ.. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. ఇక మున్సిపాలిటీలోని 20వ వార్డు అభ్యర్థినిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాల సుప్రజా నవీన్రావు భారీ మెజార్టీ సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థిపై ఏకంగా 84.5 శాతం మెజార్టీ సాధించి సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థినిగా నిలిచారు. టీఆర్ఎస్ చైర్ పర్సన్గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్ఎస్ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదించారు. -
ఆ స్థానాల్లో ఫలించిన టీఆర్ఎస్ వ్యూహాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగిన 17 మున్సిపాలిటీల్లో కేవలం 8 స్థానాల్లోనే స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ మిగతా పీఠాలను సైతం కైవసం చేసుకునేలా వ్యూహాలు రచించింది. ఈ క్రమంలో మెజార్టీ సాధించని భూత్పూర్, కోస్గి, నారాయణపేట, అమరచింత, కల్వకుర్తి, కొల్లాపూర్, అయిజ పురపాలికలపై జెండా ఎగరవేసింది. గులాబీ పార్టీ ఎత్తుగడలతో గెలుపునకు ఆస్కారమున్న భూత్పూర్, నారాయణపేట పీఠాలను బీజేపీ పోగొట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో కేవలం మక్తల్లో మాత్రమే కాషాయం జెండా ఎగిరింది. ఇటు నిన్నటి వరకు కోస్గి పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే పూర్తి ధీమాతో ఉన్న ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలింది. రెండ్రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో కోస్గి పీఠం ‘చే’జారింది. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ అనూహ్యంగా పాగా వేసింది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు తమకున్న సభ్యుల బలగాన్ని రహస్య శిబిరాలకు తరలించి సోమవారం నేరుగా ఆయా మున్సిపాలిటీలకు తరలించారు. ముందుగా గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ప్రమాణాస్వీకారం చేయగా.. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లను ఎనుకున్నారు. కొల్లాపూర్లో ‘గులాబీ’ని గెలిపించారు.. రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిన కొల్లాపూర్ ‘పుర’పోరు కథ సుఖాంతమైంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వర్గీయులు 9 మంది గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలో దిగిన జూపల్లి వర్గీయులు 11 మంది విజయం సాధించారు. దీంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పుర పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తమ ఎక్స్అఫీషియో ఓట్లతో ఆ పుర పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి కొల్లాపూర్కు చేరుకున్నారు. ముందుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు అనూహ్యంగా సమావేశ గది బయటికి వెళ్లిపోయారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ కొల్లాపూర్ పురంపై గులాబీ జెండా ఎగిరింది. మక్తల్లో రభస.. మక్తల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎంపిక ప్రక్రియలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. పట్టణంలో మొత్తం 16 వార్డులు ఉంటే.. టీఆర్ఎస్ 5, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ రెండు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. పుర పీఠంపై పాగాకు వ్యూహం రచించిన బీజేపీ.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరిని జత కలుపుకుంది. ఎన్నిక సమయంలో బీజేపీకి అనుకూలంగా ఓటేస్తే.. వైస్ చైర్పర్సన్ పదవి ఇస్తామని హామీ ఇస్తామని నమ్మించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా చైర్పర్సన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పావనికి అనుకూలంగా అందరూ చెయ్యి ఎత్తారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల వైస్చైర్పర్సన్కు బీజేపీ అభ్యర్థులు సహకరించకపోగా.. తమ పార్టీకి చెందిన అఖిలను వైస్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. తమను నమ్మించి మోసం చేశారని బీజేపీ నాయకత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. ► కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో స్థానిక ఎమెల్యే జైపాల్యాదవ్కు ముఖ్య అనుచరుడిగా ఉన్న షానవాజ్ ఖాన్కు వైస్ చైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ చైర్మన్గా ఎడ్మ సత్యం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత పాలకవర్గంలో వైస్ చైర్మన్గా పని చేసి.. ఈ సారి మరోసారి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి అనుచరుడు షాహీద్ పేరు తెరపైకి వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరూ షాహీద్ వైపే మొగ్గుచూపడంతో అతను వైస్ చైర్మన్గా ఎన్నికయ్యాడు. దీంతో ఎమ్మెల్యే వర్గీయుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోంది. ► పుర ఎన్నికల ఫలితాల తర్వాత అమరచింతలో మారిన రాజకీయ సమీకరణాలు గులాబీ నేతలను కాస్త ఆందోళనకు గురి చేశాయి. అక్కడున్న పది వార్డుల్లో టీఆర్ఎస్ మూడు, సీపీఎం రెండు, బీజేపీ, టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్, స్వతంత్రులు ఒక్కో స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్ కారెక్కారు. ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో పురపీఠం కైవసం చేసుకుందామని భావించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి మద్దతు విషయంలో ఒక అభ్యర్థిపై అనుమానం వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా ఎక్స్అఫీషియో ఓటు వేద్దామనే ఆలోచనతో అమరచింత మున్సిపాలిటీకి చేరుకున్నా.. సదరు అభ్యర్థి సైతం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపడంతో చిట్టెం ఓటు అవసరం లేకుండానే గులాబీ అక్కడ జెండా ఎగరవేసింది. ► భూత్పూర్ మున్సిపల్ పరిధిలో పది వార్డులకు టీఆర్ఎస్, బీజేపీ నాలుగు చొప్పున స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలిచారు. దీంతో రంగంలో దిగిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో గెలిచిన బీజే పీ అభ్యర్థుల్లో ఇద్దరికి గులాబీ కండువా కప్పా రు. దీంతో గులాబీ బలం ఆరుకు చేరింది. సో మవారం ఉదయమే భూత్పూర్కు వచ్చిన బీజే పీ జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి విప్ జారీ చేసి వెళ్లినా.. ఆ పురంపై గులాబీ జెండా ఎగరడాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అయితే.. బీజేపీ నుంచి గెలిచి కారెక్కిన కెంద్యాల శ్రీనివాస్కు వైస్ చైర్మన్ పదవి వరించింది. చేజారుతూ.. చేజిక్కిన ‘కోస్గి’ అధికార పార్టీ అనూహ్యంగా కోస్గి పీఠం పాగా వేసింది. ఆ మున్సిపాలిటీ పరిధిలో 16వార్డులు ఉండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఏడు చొప్పున గెలుచుకోగా.. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల్లో 4వ వార్డు నుంచి గెలుపొందిన జనార్దన్రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) కాంగ్రెస్కు మద్దతివ్వగా.. మరో అభ్యర్థి బెస్త ఎల్లమ్మ టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. దీంతో రెండు పార్టీలకు ఎనిమిది చొప్పున మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అనిత కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో మెజార్టీ సాధించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ తరఫున స్థానిక ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్అఫీషియో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు పుర పీఠం తమదేననే ధీమాతో ఉండిపోయారు. కానీ సోమవారం ఉదయం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ అధికారులు తమను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ల పదవికి ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర పార్టీ నేతలందరూ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. దీంతో పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ నాయకులతో అధికారులు చైర్పర్సన్, చైర్మన్లను ఎన్నుకుని వారితో ప్రమాణస్వీకారం చేయించారు. గెలుపు కోసం వారి ఓట్లు.. హంగ్ ఉన్న పట్టణాల్లో ఎక్స్అఫీషియో ఓట్లు వేసి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ కదిలారు. ముందుగా ఓటు అవసరం లేకుండా.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో లాబీయింగ్ చేసిన నాయకులు ఆ ప్రయత్నాలు ఫలించని చోటుకు వెళ్లి ఓటేశారు. కోస్గిలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కొల్లాపూర్లో నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి, అయిజలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లేశారు. మక్తల్లో ఎమ్మెల్సీ రాంచందర్రెడ్డి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేశారు. నీకొకటి.. నాకొకటి.. ‘పుర’ పీఠాలు కైవసం కోసం స్పష్టమైన మెజార్టీ రాని పార్టీలు కలిసి రెండు చోట్ల పాగా వేశాయి. పది వార్డులు ఉన్న అమరచింతలో టీఆర్ఎస్ 3, సీపీఎం 2, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐ నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. దీంతో ఆ పీఠంపై పాగాకు ప్రయత్నించిన టీఆర్ఎస్.. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్కు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో మంతనాలు జరిపిన స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చైర్పర్సన్ పదవిని టీఆర్ఎస్ అభ్యర్థి మంగమ్మకు ఇచ్చి.. వైస్ చైర్మన్ పదవిని గోపికి ఇచ్చారు. ఇటు 20 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ రెబెల్స్ పది మంది గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐఎఫ్బీ గెలిచిన పదిమంది టీఆర్ఎస్ రెబెల్స్ కావడం.. వారందరూ తాము టీఆర్ఎస్కే మద్దతు ఇస్తామని చెప్పడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 16వ వార్డు అభ్యర్థి దేవన్నకు చైర్మన్.. తొమ్మిదో వార్డు నుంచి ఏఐఎఫ్బీ తరఫున గెలిచిన నర్సింహుడుకు వైస్ చైర్మన్ పదవి వరించింది. -
రాములోరి దర్శనం అయిన తర్వాతే...
సాక్షి, కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత చివరి ఘట్టమైన చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్గా 6వ వార్డు నుంచి గెలుపొందిన కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్గా 2వ వార్డు నుంచి గెలిచిన వేలుపుల దామోదర్ ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సబ్కలెక్టర్ భవేశ్మిశ్రా ప్రకటించారు. చైర్పర్సన్గా సీతాలక్ష్మిని 14వ వార్డు కౌన్సిలర్ అఫ్జలున్నీసా బేగం, 27వ వార్డు కౌన్సిలర్ వేముల ప్రసాద్బాబు ప్రతిపాదించారు. ముందుగా సబ్ కలెక్టర్ 36 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీఆర్ఎస్ సభ్యులు 25 మంది, సీపీఐ సభ్యులు 8 మంది, కాంగ్రెస్ సభ్యుడు ఒకరు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ప్రమాణం చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ సభ్యులంతా ఒకే బస్సులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి భద్రాచలం నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ముందురోజు వీరందిరినీ భద్రాచలం తీసుకెళ్లి అక్కడే బస చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం చేయించుకుని టీఆర్ఎస్ సభ్యులను కొత్తగూడెం తీసుకొచ్చారు. ఆది నుంచి టీబీజీకేఎస్, టీఆర్ఎస్లో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమకారుడిగా కాపు కృష్ణకు పేరుండడంతో ఆయన భార్య సీతాలక్ష్మికి ఎమ్మెల్యే వనమా ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలకు పెద్దపీట వేసే లక్ష్యంతో వేలుపుల దామోదర్కు వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారు. అయితే చైర్పర్సన్ పదవికి పోటీపడిన ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో గొడవ, అలజడి తలెత్తే ప్రమాదం ఉందని భావించారు. కానీ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపాలిటీ వద్ద పటిష్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ్యులు కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వచ్చిన అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్గా 10వ వార్డు నుంచి గెలుపొందిన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్గా 17వ వార్డు నుంచి గెలిచిన ఎస్డీ.జానీ ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు కూడా సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఆర్డీఓ కనకం స్వర్ణలత వీరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. నామినేషన్ల స్వీకారం అనంతరం ఐదు నిమిషాల సమయమిచ్చారు. ఆ తర్వాత దమ్మాలపాటిని చైర్మన్గా ప్రకటించారు. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం నామినేషన్ వేసిన తర్వాత.. చేతులెత్తి మద్దతు ప్రకటించాలని ఆర్డీఓ సభ్యులను కోరగా.. 16 మంది టీఆర్ఎస్ సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతుగా చేతులెత్తారు. వైస్ చైర్మన్ పదవిని ఆశించిన కొక్కు నాగేశ్వరరావు, కొండపల్లి సరిత చేతులెత్తలేదు. ముందుగా కౌన్సిలర్లతో ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. 19 మంది టీఆర్ఎస్ సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, సీపీఐ కౌన్సిలర్ ఒకరు, న్యూడెమోక్రసీ కౌన్సిలర్ ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ రెబెల్గా గెలుపొందిన మడత రమ సమావేశానికి గైర్హాజరయ్యారు. శనివారం ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్ఎస్ సభ్యులు 19 మంది, రెబెల్స్గా గెలుపొందిన మరో ఇద్దరు.. మొత్తం 21 మంది సభ్యులను ప్రత్యేక బస్సులో ఖమ్మం తీసుకెళ్లి, అక్కడి నుంచి విజయవాడ తరలించారు. వీరందరినీ ఎన్నికకు ముందు నేరుగా మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం పట్టణంలో ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. తరువాత పట్టణ సమీపంలోని మామిడితోటలో అభినందన సభ నిర్వహించారు. -
క్యాంపు నుంచి నేరుగా చేరుకుని..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం నూతన పాలక వర్గాలు కొలువు దీరాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ మూడు మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ సొంత పార్టీలోనే అనేకమంది ఆశించడంతో ఎంపికకు తీవ్ర కసరత్తు చేశాక చివరకు అంతా ఏకగ్రీవమయ్యారు. వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూసంపూడి మహేష్, వైస్ చైర్పర్సన్గా అదే పార్టీకి చెందిన తోట సుజలరాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైరా మున్సిపల్ చైర్మన్గా సూతకాని జైపాల్, వైస్ చైర్మన్గా ముళ్లపాటి సీతారాములు, మధిర మున్సిపల్ చైర్పర్సన్గా మొండితోక లత, వైస్ చైర్పర్సన్గా యరమల విద్యాలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నికను అధికారులు నిర్వహించారు. సత్తుపల్లి మినహా మధిర, వైరాల్లో టీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు ఉదయం 11 గంటల సమయంలో క్యాంప్ నుంచి నేరుగా చేరుకుని కౌన్సిలర్లుగా తొలుత పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ పడిన పార్టీ నేతల్లో కొందరు తమకు చేజారిపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్టీ నేతలు వారికి నచ్చచెప్పి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మూడు చోట్లా ఎన్నిక, ప్రమాణ స్వీకారాలు ఇలా.. ► సత్తుపల్లి అధికార పార్టీ కౌన్సిలర్లు క్యాంప్నకు వెళ్లకపోవడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా మున్సిపల్ ఆఫీస్కు చేరుకుని పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12: 30గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పోటీ చేసే జాబితాను ఎన్నికల అధికారి, కల్లూరు ఆర్డీఓ శివాజీకి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందించారు. ► వైరాలో వైరా మున్సిపల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతికి ఎమ్మెల్యే రాములు నాయక్ తమ పార్టీ తరఫున పోటీచేసే చైర్మన్, వైస్చైర్మన్ జాబితాను అందజేశారు. వైరా శాసనసభ్యులు రాములునాయక్, వైరా మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ► మధిరలో మున్సిపల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా రెవెన్యూ అధికారి శిరీషకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అందజేశారు. మధిరలో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను ఎన్నికల పరిశీలకులు, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పర్యవేక్షించారు. ఎక్స్ అఫీషియో ఓటు అవసరం రాలే.. శాసనసభ్యుడి హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యులకు సైతం మున్సిపాలిటీలో ఓటు వేసే హక్కు ఉన్నప్పటికీ వినియోగించుకునే అవసరం రాలేదు. సత్తుపల్లి, వైరాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, మధిరలో కాంగ్రెస్ శాసన సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క వినియోగించుకోనున్నారని ప్రచారం జరిగింది. అయితే సత్తుపల్లి, వైరా, మధిరలో టీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో శాసనసభ్యులు ఎక్స్ అఫీషియో హోదాలో ఓట్లు వేసే అవకాశం లేకుండానే చైర్మన్, వైస్ చైర్మన్లు పూర్తి మెజార్టీతో గెలుపొందారు. మధిరలో కాంగ్రెస్ కూటమికి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసే సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో మల్లు భట్టి విక్రమార్కకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం కలగలేదు. సత్తుపల్లిలో ‘కొత్తూరు’ అలక, సండ్ర కానుక సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని చివరి వరకు ఆశించిన పార్టీ నేత కొత్తూరు ఉమామహేశ్వరరావు తీవ్ర నిరాశకు గురయ్యారు. సదరు నేతకు సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య నచ్చజెప్పి ప్రత్యామ్నాయంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అవకాశం కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్ల సమావేశంలో ప్రకటించారు. అయితే మున్సిపల్ కౌన్సిలర్గా ప్రమాణం చేసిన కొత్తూరు ఉమామహేశ్వరరావు అనంతరం జరిగిన చైర్మన్, వైస్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. -
వరంగల్ : అన్ని మున్సిపాలిటీలు గులాబీవే
సాక్షి, వరంగల్ : వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరోసారి టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అన్ని మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు ఆ పార్టీ సొంతమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి మండల, జెడ్పీ ఎన్నికల వరకు విజయ పరంపర కొనసాగించిన టీఆర్ఎస్... ‘పుర’ ఎన్నికల్లోనూ అదే ఊపు కనబర్చింది. మొత్తం తొమ్మిది మున్సి పాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ను సొంతం చేసుకోవడం ద్వారా అధికా ర టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేష న్ వెలువడిన రోజు నుంచి టీఆర్ఎస్ అధి ష్టానం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసింది. గెలుపే లక్ష్యంగా అమలుచేసిన వ్యూహప్రతివ్యూహా లు, తీసుకున్న జాగ్రత్తలతో ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. కొన్ని మార్పులు మినహా... మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, నామి నేషన్ల ప్రక్రియ మొదలు.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వరకు అంతా ఊహించి నట్లుగానే జరిగింది. ఈ ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటాయని ప్రచారం జరిగినప్పటికీ... టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అనుకూలించాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ముఖ్యులు, ఇన్చార్జీలు ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించగా.. ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ల విషయంలో అక్కడక్కడ ఉత్కంఠ నెలకొన్నా మొదటి నుంచి ప్రయత్నాల్లో ఉన్న వారినే పదవులు వరించాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల మున్సిపల్ చైర్మన్గా సోదా అనిత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా రేగూరి జైపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్ధన్నపేట కొత్త మున్సిపాలిటీ తొలి చైర్మన్గా అంగోతు అరుణ, వైస్ చైర్మన్గా కొమండ్ల ఏలందర్రెడ్డికి అవకాశం దక్కింది. నర్సంపేట మున్సిపల్ చైర్మన్గా మాత్రం మొదటి నుంచి రుద్ర మల్లేశ్వరి, నాగిశెట్టి పద్మ పేర్లు వినపడగా, ఆది నుంచి ఉద్యమంలో కలిసి నడిచిన గుంటి కిషన్ భార్య గుంటి రజనికి ఆ పీఠం అప్పగించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రజనికే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మరోసారి ఉద్యమం నుంచి వచ్చిన నేతగా తన నేపథ్యాన్ని చాటుకున్నారు. వైస్ చైర్మన్గా మునిగాల వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ చైర్మన్ గుగులోతు సింధూర, వైస్ చైర్మన్గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్గా మహ్మద్ ఫరీద్ ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్గా వాంకుడోతు వీరన్న, వైస్ చైర్మన్గా కేశబోయిన కోటిలింగం, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్గా మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్గా జీనుగ సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్గా సెగ్గం వెంకటరాణి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ గండ్ర హరీష్రెడ్డి పేరు వినిపించింది. చివరి నిముషంలో వైస్ చైర్మన్గా కొత్త హరిబాబుకు అవకాశం కల్పించారు. జనగామపై కొంత ఉత్కంఠ నెలకొన్నా.. ఆ మున్సిపాలిటీ నుంచి చైర్మ్న్గా టీఆర్ఎస్కు చెందిన పోకల జమున ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా మేకల రాంప్రసాద్ ఎన్నికయ్యారు. ప్రశంసల జల్లు ఒక్కటి ఓడినా పదవి ఊడుతుంది.. అని హెచ్చరికలు వచ్చినా, ఫలితాల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం నుంచి ప్రశంసలు దక్కాయి. ఒక్క జనగామ మున్సిపాలిటీ వార్డుల ఎన్నికల సందర్బంగా అక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, అందువల్లే ఫలితాలు ‘హంగ్’ దిశగా వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తం చేసిన అధిష్టానం సీనియర్లను రంగంలోకి దింపి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులనుపార్టీ ఖాతాలో వేసుకుంది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వరకు గెలుపు కోసం పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీనియర్ ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో పని చేసిన ఇన్చారి్జలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్కు అభినందన పత్రాలు కూడా పంపిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. కాగా తొమ్మిది మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా సోమవారం పోలీసులు గట్టి బందోబస్తు, భద్రత ఏర్పాటు చేయగా, ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
యాదాద్రి మున్సిపాలిటీలు కారు కైవసం
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీలను, ఐదు వైస్ చైర్మన్లను ఆ పార్టీ గెలుచుకుంది. సీపీఎంకు ఒక చోట వైస్ చైర్మన్ దక్కింది. ఆలేరు, భూదాన్పోచంపల్లి, మోత్కూరులో సొంత బలంతో పదవులను కైవసం చేసుకోగా భువనగిరి, యాదగిరిగుట్టలో ఎక్స్ అఫిషియో, ఇండింపెండెంట్ల ఓట్ల ద్వారా చెర్మన్, వైస్చైర్మన్ పదవులను గెలుపొందారు. చౌటుప్పల్ కాంగ్రెస్ కూటమిలో చీలిక తెచ్చి సీపీఎం కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. సీపీఎంకు వైస్ చైర్మన్ దక్కింది. దీంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి చైర్మన్ ఎంపిక వరకు బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలపైనే మోపడంతో వారు సవాల్గా తీసుకుని విజయం సాధించారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, చౌటుప్పల్లో మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ముందుండి నడిపించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన దిశానిర్దేశంతో క్లీన్ స్వీప్ చేశారు. క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు ఈ నెల 25న ఎన్నికల ఫలితాలు వెలువడగానే గెలిచిన కౌన్సిలర్లను ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలించారు. క్యాంపుల్లోనే కౌన్సిలర్ల అభిప్రాయాలను సేకరించారు. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుని గోప్యంగా ఉంచారు. దీంతో కౌన్సిల్ హాల్ లోకి వచ్చేవరకు ఎవరు చైర్మన్, వైస్చైర్మన్ అవుతున్నారో తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ తరఫున విప్ జారీ చేసి ఎన్నికల అధికారులకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాలను అందజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధికా రులు ప్రకటించిన పేర్లకు మద్దతుగా చేతులెత్తడం ద్వారా తమ సమ్మతిని తెలియజేసి ఎన్నుకున్నారు. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా చైర్మన్, వైస్చైర్మన్ అభ్యర్థులను పోటిలో నిలిపింది. సకాలంలో హాజరుకాని బీజేపీ 22 వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేశ్పై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. భువనగిరిలో పోటాపోటీ.. 35 వార్డులున్న మున్సిపాలిటీలో టీ ఆర్ఎస్ కు ఇండిపెండెంట్లతో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదనంగా ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి ఎక్స్ ఆఫిషియో ఓట్లతో కలిసి టీఆర్ఎస్ బలం 19కి చేరింది. కాంగ్రెస్, బీజేపీల పొత్తుతో వారిబలం 18కి చేరినప్పటికీ బీజేపీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేష్ సకాలంలో హాజరు కాలేదు. దీంతో వారి బలం 17కు పడిపోయింది. టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఎనబోయిన ఆంజనేయులు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోత్నక్ ప్రమోద్కుమార్ పోటీ పడ్డారు. అయితే అంజనేయులకు 19 ఓట్లు రాగా ప్రమోద్కుమార్కు 17 ఓట్లు వచ్చాయి. దీంతో అంజనేయులు చైర్మన్గా గెలుపొందారు. కాగా వైస్ చైర్మన్ కోసం టీఆర్ఎస్ తరఫున చింతల కిష్టయ్య, బీజేపీ తరఫున మాయ దశరథ పోటీ పడ్డారు. అయితే చైర్మన్ తరహాలోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆలేరులో : 12 వార్డులకు గాను టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇండింపెండెంట్లు ఇద్దరు గెలిచారు. ఇండిపెండెంట్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బలం 9కి చే రింది. చైర్మన్గా వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూదాన్పోచంపల్లిలో: 13 వార్డులకు టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒకచోట విజయం సాధించాయి. పూర్తి మెజార్టీ ఉండడంతో టీఆర్ఎస్కు చెందినచిట్టిపోలు విజయలక్ష్మి చైర్మన్గా, బాత్కలింగస్వామి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోత్కురులో ఏకగ్రీవం: మున్సిపాలిటీలో 12 వార్డులకు టీఆర్ఎస్ ఏడుగురు కౌన్సిలర్లను గెలుచుకోగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ బలం 8కి చేరింది. కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య ఐదు మాత్రమే ఉంది. దీంతో చైర్మన్ పదవికి టీఆర్ఎస్ తరఫున తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్ తరఫున గుర్రం కవిత పోటీ పడ్డారు. ఎన్నికల అధికారులు ఓటింగ్ నిర్వహించడంతో టీఆర్ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి స్వాతి చైర్మన్గా విజయం సా«ధించింది. వైస్ చైర్మన్గా బొల్లేపల్లి వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్లో టీఆర్ఎస్ ఏకగ్రీవం: చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. ఎన్ని కను కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ సభ్యులు బహిష్కరించారు. 20వార్డులు ఉండగా టీర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3 ఇండిపెండెంట్లు ఒక చోట విజయం సా«ధించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం కూటమిగా పోటీ చేశాయి. అయితే టీఆర్ఎస్కు సీపీఎం మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి టీఆర్ఎస్, సీపీఎం పొత్తును నిరసిస్తూ ఎన్నికనుఅడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనను పోలీస్ల సహయంతో బయటకు పంపించారు. దీంతో కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయకుండానే బయటకువెళ్లిపోయారు. బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో సమావేశంలో టీఆర్ఎస్, సీపీఎంలకు చెందిన 11 మంది సభ్యుల కోరం ఉండడంతో చైర్మన్గా టీఆర్ఎస్కు చెందిన వెన్రెడ్డిరాజు, వైస్ చైర్మన్గా సీపీఎంకు చెందిన బ త్తుల శ్రీశైలంలను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. యాదగిరిగుట్టలో ఉద్రిక్తత నడుమ.. ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగాయి. ఎక్స్అఫిషియో సభ్యుల బలంలో టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. 12 వార్డులకు టీఆర్ఎస్ 4 చోట్ల గెలువగా, ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు కర్రె ప్రభాకర్, కడియం శ్రీహరి, ఇండిపెండెంట్ సభ్యులతో కలిపి టీఆర్ఎస్ బలం 8 కి చేరింది. అయితే కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు కౌన్సిలర్లతో బలం 7కు చేరింది. టీఆర్ఎస్ తరపున చైర్పర్సన్గా ఎరకల సుధ, కాంగ్రెస్ నుంచి గుండ్లపల్లి వాణి పోటీపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఏడు ఓట్ల వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్గా టీఆర్ఎస్ కూటమిలో ఉన్న ఇండిపెండెంట్ కౌన్సిలర్ కాటంరాజు ఎన్నికయ్యారు. -
సీల్డ్ కవర్లో ఆమె పేరు!
సాక్షి, సూర్యాపేట: నాలుగు మున్సిపాలటీలు గులాబీ ఖాతాలో చేరాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీలను స్పష్టమైన మెజార్టీతో ఆ పార్టీ దక్కించుకుంది. అలాగే సూర్యాపేటలో జనరల్ మహిళకు రిజర్వు అయిన చైర్మన్ పీఠంలో ఎస్సీ మహిళను కూర్చోబెట్టి టీఆర్ఎస్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఎక్కడా ప్రకటించకుండా గోప్యత పాటించి సీల్డ్ కవర్లలో ఆపార్టీ నాలుగు మున్సిపాలిటీల ప్రిసైడింగ్ అధికారులకు అందజేసింది. మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరండంతో టీఆర్ఎస్ శ్రేణులు బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నాయి. ఊహలకు అందకుండా.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని సూర్యాపేట మున్సిపాలిటీ ఏలిక ఎవరోనని ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటి నుంచి అంతా ఉత్కంఠతో ఎదురుచూశారు. జనరల్ మహిళకు రిజర్వు కావడం.. పలువురి పేర్లు చర్చకు రావడంతో పాటు వారు చైర్మన్ పీఠం దక్కించుకుంటారని జోరుగా చర్చలు సాగాయి. అయితే అందరి ఊహలకు అందకుండా చైర్మన్ ఎన్నిక కావడం గమనార్హం. 9వ వార్డు నుంచి విజయం సాధించిన పెరుమాళ్ల అన్నపూర్ణ పేరు సీల్డ్ కవర్లో పీఓకు అందింది. అమెను ప్రతిపాదించడం, బలపరచడం, సభ్యుల ఓట్ల మద్దతుతో.. చైర్మన్గా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ వార్డు సభ్యులతో పాటు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జనరల్ మహిళా స్థానంలో చైర్మన్గా అవకాశం కల్పించడంతో ఆమె కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. మున్సిపాలిటీలో కొత్త సంప్రదాయానికి ఇది దిక్సూచి అవుతుందని మంత్రి మీడియాతో మాట్లాడుతూ కళ్లు చమర్చారు. అన్నపూర్ణ 9 వ వార్డు నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుందమల్ల శేఖర్పై 374 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే వైస్ చైర్మన్గా 22వ వార్డు నుంచి గెలిచిన పుట్టా కిశోర్ విజయం సాధించారు. 24 మంది వార్డు సభ్యులు, మంత్రి ఎక్స్ అఫీషియో ఓటు, ముగ్గురు ఇండిపెండెంట్ వార్డు సభ్యుల మద్దతుతో అన్నపూర్ణ చైర్మన్గా, కిశోర్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. పేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో చేతులెత్తిన మంత్రి జగదీశ్రెడ్డి, కౌన్సిల్ సభ్యులు గులాబీ రెపరెపలు.. ఆపార్టీ గుర్తుపై గెలిచిన వార్డు సభ్యుల మద్దతుతో తొలిసారి కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీలపై టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసింది. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఎక్స్ అఫీషియో ఓటు, 25 మంది వార్డు సభ్యుల బలంతో టీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలపై కూర్చుంది. మున్సిపాలిటీలో 2 వ వార్డు నుంచి గెలుపొందిన వనపర్తి శిరీష చైర్మన్గా, 23వ వార్డు నుంచి విజయం సాధించిన వెంపటి పద్మ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వనపర్తి శిరీష 833 ఓట్లు, పద్మ 237 ఓట్ల మెజార్టీ సాధించారు. హుజూర్నగర్ మన్సిపాలిటీలో 20 వార్డులు టీఆర్ఎస్ గెలవడంతో ఆపార్టీకి చెందిన గెల్లి అర్చనకు చైర్మన్, జక్కుల నాగేశ్వరరావుకు వైస్ చైర్మన్ పదవులు దక్కాయి. ఇక్కడ పార్టీ శ్రేణులు ఊహించిన వారే పుర పీఠంపై కొలువుదీరారు. అర్చన 27వ వార్డు నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 761 ఓట్ల మెజార్టీ, నాగేశ్వరరావు 17 వ వార్డు నుంచి 225 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 11 ఓట్ల బలంతో టీఆర్ఎస్ నుంచి చైర్పర్సన్గా పోతరాజు రజిని, వైస్ చైర్మన్గా సంకేపల్లి రఘునందరెడ్డి ఎన్నికయ్యారు. కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఎక్కువ వార్డులు సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందంలో ఎమ్మెల్యేలు.. తిరుగు లేని విజయంతో నాలుగు మున్సిపాలిటీల ఏలికలు టీఆర్ఎస్ పరం కావడంతో ఆపార్టీ ఎమ్మెల్యేల్లో ఆనందం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక అంతా ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకున్నారు. మెజార్టీ వార్డుల్లో గులాబీ జెండా ఎగరడంతో.. ఇక మున్సిపాలిటీల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు మరింత దృష్టిపెట్టనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉండనుండడంతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ముందుకు తెచ్చిన మేనిఫెస్టోలోని పనులకు నిధుల వేట జరగనుంది. ఈ ఫలితాలతో మళ్లీ సాధారణ ఎన్నికల నాటికి మున్సిపాలిటీల్లో తిరుగులేని శక్తిగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. -
నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక
-
నెరేడుచర్ల: సస్పెన్స్ వీడినట్టేనా!?
సాక్షి, సూర్యాపేట: నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సినిమా ట్విస్టులను తలపిస్తున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసేందుకు వచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కేవీపీ రామచందర్రావును అధికార టీఆర్ఎస్ అడ్డుకోగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుభాష్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కాసేపట్లో నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి ఓటుపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ కేవీపీకి ఎక్స్అఫీషియో ఓటు కల్పించగా.. తాజాగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి కూడా ఓటు కల్పించింది. దీనిలో భాగంగా ఓటరు లిస్టులో కేవీపీ, సుభాష్ రెడ్డిల పేర్లను చేరుస్తూ ఈసీ కొత్త జాబితా విడుదల చేసింది. దీంతో వీరిద్దరు ఈ రోజు జరగబోయే నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటంతో సస్పెన్ వీడింది. సుభాష్రెడ్డి ఓటు చట్టవిరుద్ధం: కాంగ్రెస్ అయితే సుభాష్రెడ్డికి ఓటు కల్పించడంపై కాంగ్రెస్ అభ్యంతర వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల అక్రమాలకు నెరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల, మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఎక్స్అఫీషియో సభ్యుల నమోదుకు ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి వరకే సమయం ఉందని, కానీ గడువు దాటినా శేరి సుభాష్రెడ్డి పేరు నమోదు చేయడం చట్ట విరుద్దమన్నారు. అధికార దుర్వినియోగంతో మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు. కాగా, కేవీపీ, సుభాష్రెడ్డిల ఓట్లతో టీఆర్ఎస్కు 11, కాంగ్రెస్కు 10 మంది సభ్యుల సంఖ్యా బలం ఏర్పడింది. నెరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపును ఏడుగురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ తరుపున 8 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. అయితే టీఆర్ఎస్కు నాలుగు, కాంగ్రెస్కు రెండు ఎక్స్అపీషియో ఓట్లు లభించనున్నాయి. -
బీజేపీకి నల్లగొండ వైస్ చైర్మన్ పోస్టు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పుర ఎన్నికల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. సోమవారం ముగిసిన మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఆ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఆరు చోట్ల మున్సిపల్ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీ మాత్రమే కాంగ్రెస్ పరం కాగా నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఆ పార్టీ గెలుచుకుంది. కాగా, నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రం మంగళవారానికి వాయిదా పడింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం జరిగిన ఎన్నికలు ఉత్కంఠకు తెరలేపగా, మూడు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్కు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లే ఆధారమయ్యాయి. దీంతో మరీ ఎక్కువ నాటకీయ పరిణామాలేం లేకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆయా మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక, నల్లగొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రమే మిగిలి ఉంది. గండం గట్టెక్కించిన ఎక్స్ అఫీషియో ఓట్లు మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ మిర్యాలగూడ, నందికొండ, దేవరకొండలో మాత్రమే స్పష్టమైన మెజారిటీ సాధించింది. హాలియా, నల్గొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో సరిపడా మెజారిటీ రాలేదు. చండూరులో టీఆర్ఎస్కు అసలు అవకాశమే లేకుండా పోయింది. కాగా, మూడు మున్సిపాలిటీల్లో హాలియాలో స్వతంత్ర అభ్యర్ధి (టీఆర్ఎస్ తిరుగుబాటు) మద్దతు కూడగట్టడంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఓటుతో బయట పడింది. చిట్యాల మున్సిపాలిటీలో సైతం ఆరు స్థానాలకు గెలుచుకుని యాభై శాతం మెజారిటీ సాధించిన ఆ పార్టీకి ఒక్క ఓటు అవసరం పడింది. స్థానిక ఎమ్మెల్యే ఓటుతో ఆ మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ తన వశం చేసుకుంది. నల్లగొండలో ఐదు ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగం నల్లగొండ మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో టీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 20 వార్డులు గెలుచుకుని సమానంగా నిలిచాయి. ఆరు స్థానాలున్న బీజేపీ మద్దతు ఏ పార్టీకైనా కీలకం అయ్యింది. టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి ఓటు, ఎంఐఎం ఓటును టీఆర్ఎస్ కూడగట్టింది. ఈ పరిస్థితిలో మున్సిపాలిటీని దక్కించుకోవాలంటే బీజేపీ మద్దతు లేకుండా బయటపడాలంటే మరో ఐదు ఓట్లు అవసరం పడ్డాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఓటుకు తోడు మరో నలుగురు ఎమ్మెల్సీల ఓట్లను టీఆర్ఎస్ ఇక్కడ కేటాయించింది. దీంతో టీఆర్ఎస్కు 27 ఓట్లు సమకూరడంతో ఎన్నికల్లో సమస్యలేకుండా అయ్యింది. కాగా, చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి 32వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పోటీ పడగా, టీఆర్ఎస్ నుంచి 17వ వార్డు కౌన్సిలర్ మందడి సైదిరెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ సభ్యులంతా బుర్రి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా చేతులు ఎత్తి తమ మద్దతు తెలపగా.. టీఆర్ఎస్ అభ్యర్థి మందడి సైదిరెడ్డి అనుకూలంగా 22 మంది సభ్యులతోపాటు ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు చేతులు ఎత్తడంతో 27 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా చైర్మన్ ఎన్నిక సమయంలో బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి నల్లగొండ మున్సిపాలిటీలో తమ ఓటును వినియోగించుకున్నారు. రాత్రికి రాత్రి ప్లేటు మార్చిన బీజేపీ నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, టికెట్ల కేటాయింపు దశ నుంచే కాంగ్రెస్, బీజేపీ అవగాహనతో కలిసి పనిచేశాయి. ఈ మేరకు కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను కూడా పోటీకి పెట్టలేదు. మరికొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి ఉమ్మడిగా మున్సిపల్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం జరిగింది. దీంతో టీఆర్ఎస్ జాగ్రత్త పడి ఎక్స్ అఫీషియో ఓట్లతో బయటపడేలా ప్లాన్ చేసుకుంది. అయితే.. చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీజేపీ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా చేతులు ఎత్తలేదు. అలా అని టీఆర్ఎస్ అభ్యర్థికీ అనుకూలంగా ఎత్తలేదు. ఇలా తటస్థంగా ఉండేందుకు బీజేపీ సభ్యులు కొందరు టీఆర్ఎస్తో ఒప్పందం చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పెద్దమొత్తంలోనే డబ్బు చేతులు మారడంతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ పోస్టును బీజేపీ కేటాయించేలా ఒప్పందం కూడా జరిగిందని సమాచారం. మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యర్థిగా 36వ వార్డు కౌన్సిలర్ బండారు ప్రసాద్ పేరు ప్రచారంలోకి కూడా వచ్చింది. కేవలం కొన్ని సాంకేతిక కారణాలతో వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేయించారని అంటున్నారు. రాత్రికి రాత్రి బీజేపీ ప్లేటు ఫిరాయించి టీఆర్ఎస్ చంకలో చేరడంతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. మొత్తంగా జిల్లాలో నల్లగొండలో ఈ పరిణామం మినహా ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండా ముగిశాయి. ► నీలగిరి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థి మందడి సైదిరెడ్డికి అనుకూలంగా 22 మంది సభ్యులతోపాటు ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులవి కలిపి 27 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి శ్రీనివాస్రెడ్డికి అనుకూలంగా 20 ఓట్లు వచ్చాయి. దీంతో మందడి సైదిరెడ్డిని చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా చైర్మన్ ఎన్నిక సమయంలో బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంది. -మందడి సైదిరెడ్డి, చైర్మన్ (టీఆర్ఎస్) ► హాలియా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి 6 ఓట్ల(ఒకరు టీఆర్ఎస్ రెబెల్)తో పాటు ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఓటుతో కలిసి ఏడు రాగా, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆరు ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి వెంపటి పార్వతమ్మశంకరయ్యను మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. - వెంపటి పార్వతమ్మ, చైర్మన్ (టీఆర్ఎస్) ► మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్గా తిరునగరు భార్గవ్కు 27మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లతోపాటు ఒక బీజేపీ అభ్యర్థిని, ఎక్స్అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే భాస్కర్రావు మొత్తం 29మంది చేతులెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డికి 18 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒక సీపీఎం, ఒక స్వతంత్ర అభ్యర్థి మొత్తం 20 మంది చేతులెత్తారు. దీంతో భార్గవ్ను చైర్మన్గా ఎన్నికైనట్లుగా ప్రకటించారు. - తిరునగరు భార్గవ్, చైర్మన్ (టీఆర్ఎస్) ► నందికొండ (నాగార్జున సాగర్) మున్సిపాలిటీ తొలి చైర్మన్గా కర్ణ అనుషారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్పర్సన్గా కర్ణ అనూషారెడ్డిని బిన్ని ప్రతిపాదించారు. హిరేకార్ రమేష్జీ బలపర్చారు. ఒకటే నామినేషన్ రావడంతో అనూషారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. - కర్ణ అనూష, చైర్మన్ (టీఆర్ఎస్) ► దేవరకొండ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి 16వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ఆలంపల్లి నర్సింహ పేరును మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 5వ వార్డు కౌన్సిలర్ వడ్త్య దేవేందర్ ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్ చిత్రం శ్రీవాణి బలపర్చింది. చైర్మన్ అభ్యర్థిగా నర్సింహ ఒక్కడే పోటీలో ఉండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. - ఆలంపల్లి నర్సింహ, చైర్మన్ (టీఆర్ఎస్) ► చిట్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు హాజరయ్యారు. కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేసిన ఆనంతరం బయటికి వెళ్లి తిరిగి రాలేదు. టీఆర్ఎస్ సభ్యుల బలం ఏడుగురికి చేరడంతో కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. - కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి చైర్మన్ (టీఆర్ఎస్) ► చండూరు మున్సిపాలిటీలో పది మంది సభ్యులకుగాను ఏడు కాంగ్రెస్, ఒక్కటి బీజేపీ, 2 టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ సభ్యులతో బీజేపీ జత కలవడంతో వీరి బలం 8కి చేరుకుంది. వీరందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా చేతులెత్తడంతో చైర్మన్, వైస్చైర్మన్లను గెలుచుకుంది. - తోకల చంద్రకళ, చైర్మన్ (కాంగ్రెస్) -
ఇలా గెలవగానే.. అలా మార్చేశారు
ఎన్నికల ఫలితాలు ఇలా వెల్లడయ్యాయో లేదో.. కొందరు కార్పొరేటర్లు/కౌన్సిలర్లు అలా కండువా మార్చేశారు. అభివృద్ధి కోసమంటూ అధికార పార్టీ పంచన చేరారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్పై కత్తులు దూసిన వారే.. ఇప్పుడు టింగురంగా అంటూ గులాబీ గూటికి చేరిపోయారు. సాక్షి, నిజామాబాద్: ఎన్నికల వేళ విమర్శలు, సవాళ్లు విసిరిన వారే.. చివరకు వెనక్కి తగ్గారు. ఇలా గెలుపొందారో లేదో అలా జంప్ జిలానీలుగా మారారు. ‘అధికారమే’ పరమావధి అంటూ గోడ దూకేశారు. ఆర్మూర్లో అయితే మొన్న కౌంటింగ్ పూర్తి కాక ముందే కండువాలు మార్చడం విస్మయానికి గురి చేసింది. కొందరేమో ప్రమాణ స్వీకారం చేయక ముందే టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. గులాబీ కండువా కప్పుకుని మురిసి పోయారు. మరికొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు. ఎన్నికలకు ముందు కత్తులు దూసి, ఎన్నికవగానే అదే పార్టీలోకి చేరిపోవడం చూసి ఓటర్లు నోరెళ్ల బెడుతున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలకు కాంగ్రెస్ ఓటు.. నిజామాబాద్ కార్పొరేషన్ 40వ డివిజన్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.శివచరణ్.. మేయర్ ఎన్నికకు ముందే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేయర్ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్కు అనుకూలంగా, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతుగా చెయ్యేత్తారు. ఆయనతో పాటు 38వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన గడుగు రోహిత్కుమార్ కూడా మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతుగా నిలిచారు. దీంతో కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ప్రశ్నార్థకంగా మారింది. స్వతంత్ర అభ్యర్థి (బీజేపీ రెబల్)గా యమున కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కౌంటింగ్ పూర్తయి ఫలితం వెలువడిన వెంటనే ఆమె టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి క్యాంపునకు వెళ్లారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలకు మద్దతుగా నిలిచారు. ఆర్మూర్లో.. ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ కౌన్సిలర్గా గెలిచిన మురళీధర్రెడ్డి స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అలాగే, కాంగ్రెస్ కౌన్సిలర్ ఇంతియాజ్ గెలిచిన వెంటనే కండువా మార్చారు. ఇక్కడ మరో ఐదుగురు స్వతంత్ర కౌన్సిలర్లు ఆకుల రాము, వరుణ్ శేఖర్, బద్ధం రాజ్కుమార్, సుంకరి సుజాత, లింగంపల్లి భాగ్య కూడా కారెక్కారు. ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే ప్రజాప్రతినిధులు ఇలా పార్టీ మార్చడంతో ఓటర్లు విస్మయం చెందుతున్నారు. -
సిద్దిపేట 'గులాబీ' పురం
సాక్షి, సిద్దిపేట : మున్సిపల్ ఎన్నికల్లోని చివరి ఘట్టం సోమవారం ముగిసింది. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. దుబ్బాక, చేర్యాల పాలక మండలి ఎన్నిక ఏకగ్రీవం కాగా.. హుస్నాబాద్లో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు టీఆర్ఎస్ అభ్యర్థులకు దక్కాయి. గజ్వేల్లో చివరి నిమిషంలో చైర్మన్ అభ్యరి్థని మార్చడంతో ఆగ్రహించిన అభ్యర్థి ఒంటేరు నారాయణరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పలు నాటకీయ పరిణామాల మధ్య నాలుగు మున్సిపాలిటీల్లోనూ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు టీఆర్ఎస్ అభ్యర్థులు దక్కించుకున్నారు. అన్ని చోట్లా ఉదయం 10 గంటలకు స్థానిక ఎన్నికల అధికారి వార్డు సభ్యలతో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్గా 18వ వార్డులో గెలుపొందిన నేతి చిన్న రాజమౌళిని 14వ వార్డు కౌన్సిలర్ అలువాల బాలేష్ ప్రతిపాదించారు. 1వ వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు మద్దతు తెలిపి బలపరిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ అభ్యరి్థతోపాటు, 12వ వార్డు కౌన్సిలర్ ఒంటేరు నారాయణరెడ్డి ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో మిగిలిన 18 మంది మద్దతుతో చిన్నరాజమౌళిని చైర్మన్గా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్గా 8వ వార్డు నుంచి గెలిచిన జకీరోద్దిన్ను 15వ వార్డు కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి పంబాల అర్చన బలపర్చారు. ఈయనకు కూడా 18 మంది మద్దతు తెలపడంతో వైఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దుబ్బాకలో ఏకగ్రీవం.. దుబ్బాక మున్సిపాలిటీ చైర్మన్గా 18వ వార్డు కౌన్సిలర్ గన్నె వనితను మూడో వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి ప్రతిపాదించగా నాలుగో వార్డు కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ బలపరిచారు. అయితే ఇతర పారీ్టల నుంచి ఎవరూ పోటీ లేకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హుస్నాబాద్లో రసవత్తరం.. హుస్నాబాద్లో మొత్తం 20 వార్డులకు గాను తొమ్మిది టీఆర్ఎస్, ఆరు కాంగ్రెస్, రెండు బీజేపీ, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ చైర్మన్ అభ్యరి్థగా 15వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆకుల రజిత పేరును 20 వార్డు కౌన్సిలర్ వాలా సుప్రజ ప్రతిపాదించారు. 5వ వార్డు కౌన్సిలర్ పెరుక భాగిరెడ్డి బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యరి్థగా ఏడో వార్డు కౌన్సిలర్ చిత్తారి పద్మ పేరును 8వ వార్డు కౌన్సిలర్ మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్ వల్లపు రాజయ్య బలపర్చారు. అయితే టీఆర్ఎస్ కౌన్సిలర్లు 9 మందితోపాటు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన కౌన్సిలర్లులకు తోడుగా స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తన ఎక్స్అఫిషియో సభ్యునిగా ఓటు వేశారు. దీంతో 12 మంది మద్దతు టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి లభించింది. బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు అభ్యర్థులు పోలింగ్లో పాల్గొనలేదు. దీంతో మెజార్టీ ఓట్లు పొందిన టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల రజితను చైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జయచంద్రారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా వైఎస్ చైర్మన్గా టీఆర్ఎస్ అభ్యర్థి నాలుగో వార్డు కౌన్సిలర్ ఐలేని అనిత పేరును ఒకటో వార్డు కౌన్సిలర్ కొంకట నళినీదేవి ప్రతిపాదించారు. 19వ వార్డు కౌన్సిలర్ బొజ్జ హరీశ్ బలపరిచారు. కాంగ్రెస్ వైఎస్ చైర్మన్ అభ్యర్థి మూడో వార్డు కౌన్సిలర్ కోమటి స్వర్ణలత పేరును 8వ వార్డు కౌన్సిలర్ మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్ వల్లపు రాజయ్య బలపరిచారు. టీఆర్ఎస్ అభ్యర్థికి టీఆర్ఎస్ సభ్యులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు లభించింది. వీరికి ఎక్స్అఫీíÙయో ఓటు ఎమ్మెల్యే వేయడంతో మొత్తం 12 మంది మద్దతుతో వైస్చైర్మన్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. చేర్యాలలో ఉత్కంఠకు తెర టీఆర్ఎస్, కాంగ్రెస్లు సముజ్జయిలుగా గెలిచిన చేర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన నిమ్మ రాజీవ్రెడ్డి, జుభేదా ఖతూంలు చైర్మన్ ఎన్నికకు ముందుగానే టీఆర్ఎస్లో చేరినట్లు ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. టీఆర్ఎస్ చైర్మన్ అభ్యరి్థగా ఒకటవ వార్డు కౌన్సిలర్ అంకుగారి స్వరూపారాణి పేరును 12వ వార్డు కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ ప్రతిపాదించగా ఐదవ వార్డు కౌన్సిలర్ ఆడెపు నరేందర్ బలపరిచారు. వైస్ చైర్మన్గా నాలుగో వార్డు కౌన్సిలర్ నిమ్మ రాజీవ్రెడ్డి పేరును 12వ వార్డు కౌన్సిలర్ పచిమడ్ల సతీష్ ప్రతిపాదించగా ఐదో వార్డు కౌన్సిలర్ ఆడెపు నరేందర్ బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనక పోవడంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్వరూపారాణి చైర్మన్గా రాజీవ్రెడ్డి వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రవణ్కుమార్ ప్రకటించారు. ఆఖరి క్షణంలో మార్పు.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థుల పేర్లు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ వచ్చాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైన నాటి నుంచి గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యరి్థగా ఒంటేరు నారాయణరెడ్డి పేరు ప్రచారం జరిగింది. ఊహించినట్లుగానే గజ్వేల్ మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్లు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. వీరికి ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ఒంటేరు నారాయణరెడ్డి చైర్మన్ పదవి ఖాయం అని అందరు భావించారు. అయితే ఎన్నిక జరిగిన సోమవారం మాత్రం అంతా తారుమారైంది. ఒక్కసారిగా చైర్మన్ అభ్యర్థిగా నేతి చిన్న రాజమౌళి పేరు తెరమీదికి వచి్చంది. పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో అందరూ ఆయనకే మద్దతు తెలిపి రాజమౌళిని చైర్మన్గా ఎన్నుకున్నారు. దీంతో ఖంగుతిన్న నారాయణరెడ్డి, ఆయన అనుచరులు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తన కౌన్సిలర్ పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి తన రాజీనామ పత్రాన్ని అందచేశారు. -
కామారెడ్డిలో తొలిసారి గెలిచిన టీఆర్ఎస్
బల్దియాలలో కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఎన్నికయ్యారు. ‘సాక్షి’ ముందే చెప్పినట్లుగా కామారెడ్డి బల్దియా పీఠం నిట్టు జాహ్నవికే దక్కింది. ఎల్లారెడ్డి చైర్మన్గా సత్యనారాయణ ఎన్నికయ్యారు. బాన్సువాడ బల్దియాచైర్మన్గా గంగాధర్కే అవకాశం దక్కింది. సాక్షి, కామారెడ్డి: జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో తొలిసారిగా టీఆర్ఎస్ గెలిచింది. కొత్తగా ఏర్పాటైన బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీ జెండా ఎగరేసింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే గెలుపొందడంతో టీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి. కామారెడ్డిలో.. జిల్లా కేంద్రమైన కామారెడ్డి మున్సిపాలిటీ ఇప్పటివరకు టీఆర్ఎస్ గెలుచుకున్నది లేదు. గత పాలకవర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో వారు టీఆర్ఎస్లో చేరారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సొంతంగా 23 సీట్లు రావడం, మరో ఆరుగురు ఇండిపెండెంట్లు గులాబీ కండువా కప్పుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన వారే గెలిచారు. ముందు మున్సిపాలిటీకి సభ్యులు చేరుకున్న తరువాత అక్షర క్రమంలో ఒక్కొక్కరితో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణం చేయించారు. కామారెడ్డిలో 49 మంది సభ్యులు ఉండడంతో గంటన్నర పాటు సమయం కేటాయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు చేపట్టారు. చైర్పర్సన్ పదవికి టీఆర్ఎస్ తరపున నిట్టు జాహ్నవి పేరును నజీరొద్దీన్ అనే కౌన్సిలర్ ప్రతిపాదించగా ముప్పారపు అపర్ణ బలపరిచారు. కాంగ్రెస్ తరపున చైర్పర్సన్ అభ్యర్థిగా పంపరి లత పేరును కృష్ణమూర్తి ప్రతిపాదించగా వంశీకృష్ణ బలపర్చారు. చేతులెత్తే పద్ధతిన జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జాహ్నవికి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓటుతో కలిపి 30 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి లతకు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో జాహ్నవి గెలుపొందినట్టు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ప్రకటించారు. వైస్ చైర్మన్ పదవికి గడ్డం ఇందుప్రియ పేరును కృష్ణాజీరావ్ ప్రతిపాదించగా.. బూక్య రాజు బలపరిచారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మద్ సయ్యద్ పేరును రవీందర్గౌడ్ ప్రతిపాదించగా, రాణి బలపరిచారు. చేతులెత్తే పద్ధతిన వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా ఇందుప్రియకు 30 మంది, అహ్మద్ సయ్యద్కు 12 మంది ఓటేశారు. దీంతో ఇందుప్రియ గెలుపొందినట్టు జేసీ ప్రకటించారు. బీజేపీ సభ్యులు 8 మంది ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలచుకుంది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో దేవేందర్రెడ్డి కౌన్సిలర్లతో ప్రమాణం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలకు నామినేషన్లను ఆహ్వానించగా చైర్మన్గా కుడుముల సత్యనారాయణ పేరును జీనత్ సుల్తానా ప్రతిపాదించగా ఎరుకల సాయిలు బలపరిచారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం వైస్ చైర్పర్సన్గా ముస్త్యాల సుజాత పేరును అల్లం శ్రీను ప్రతిపాదించగా, జంగం నీలకంఠం బలపరిచారు. ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. బాన్సువాడలో.. బాన్సువాడ బల్దియా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక్కడ 19 మంది కౌన్సిలర్లు ఉండగా సమావేశానికి 18 మంది మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్కు చెందిన కాసుల బాల్రాజు సమావేశానికి రాలేదు. మిగతా 18 మందితో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో రాజేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా జంగం గంగాధర్ పేరును సభ్యులు ప్రతిపాదించారు. పోటీ ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అలాగే వైస్ చైర్మన్గా జుబేర్ పేరును ప్రతిపాదించగా, పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. అనంతరం పాలకవర్గ సభ్యులంతా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చదవండి: పాతికేళ్లకే పాలనాపగ్గాలు! -
మెదక్లో కారు.. హుషారు
సాక్షి, మెదక్ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అన్ని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్చైర్మన్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయా మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులు భారీ ర్యాలీ తీశారు. టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. అయితే ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకుండా ఇటీవల పారీ్టలో చేరిన వారికి అవకాశం ఇచ్చారంటూ కార్యకర్తలు ఆందోళన చేయడంతో పోలీసులు లాఠీచార్జీ చేయడంతో మెదక్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అన్ని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. అయితే ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకుండా ఇటీవల పారీ్టలో చేరిన వారికి అవకాశం ఇచ్చారంటూ కార్యకర్తలు ఆందోళన చేయడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. మెదక్లో ఉద్యమ సమయం నుంచి పారీ్టలో పనిచేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ లేదా అకిరెడ్డి కృష్ణారెడ్డిలకు చైర్మన్ పదవి ఇవ్వాలంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు, మల్లికార్జున్గౌడ్, కృష్ణారెడ్డిల మద్దతుదారులు ఆందోళనలకు దిగడంతో మెదక్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ కౌన్సిలర్లుగా గెలుపొందిన అభ్యర్థులతో క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపు నుంచి ప్రత్యేక వాహనంలో స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కౌన్సిలర్లు మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కృష్ణారెడ్డిలను కాదని, చంద్రపాల్కు ఖరారైనట్లు ముందుగానే విషయం తెలుసుకున్న కార్యకర్తలు, వారి మద్దతుదారులు రాందాస్ చౌరస్తాలో కౌన్సిలర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన ఒకదశలో ఫలితం లేకుండా పోయింది. మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా పెద్ద ఎత్తున తరలివచి్చన కార్యకర్తలు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మంత్రి హరీశ్రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనానికి అడ్డుపడ్డారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపధ్యంలో మల్లికార్జున్గౌడ్, కృష్ణారెడ్డిలు కంటతడిపెట్టుకొన్నారు. రెండు గంటల పాటు ఆందోళన భారీ బందోబస్తు మధ్య కౌన్సిలర్ల వాహనాన్ని పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి తరలించి సభ్యులను లోపలికి పంపించారు. సుమారు రెండు గంటలపాటు ఆదోళనలు జరిగాయి. టీఆర్ఎస్ సభ్యుల వెంట బీజేపీ సభ్యులు సైతం లోనికి వెళ్లడంతో అప్పటికే టీఆర్ఎస్కు కావాల్సిన కోరం ఉంది. కాగా ఆరుబయట రెండుగంటల అనంతరం మల్లికార్జున్గౌడ్, కృష్ణారెడ్డిలు పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు నచ్చజెప్పి ప్రమాణ స్వీకారం చేసేందుకు లోనికి వెళ్లారు. ఈ నేపధ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ లోపల సైతం కంటతడిపెట్టాడు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్గా చంద్రపాల్, వైస్చైర్మన్గా మల్లికార్జున్గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. తూప్రాన్లో.. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్గా బొంది రాఘవేంద్రగౌడ్, వైస్చైర్మన్గా నందాల శ్రీనివాస్లు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా తూప్రాన్ మున్సిపాలిటీలో ఉద్యమ కాలం నుంచి పనిచేసిన రాముని శ్రీశైలంగౌడ్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికవుతారని అక్కడ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఈయన ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్లో చురుకైన పాత్ర పోషించారు. కాని తీరా శ్రీశైలంగౌడ్ను పక్కనబెట్టి బొందిరాఘవెంద్రగౌడ్ను ఎంపిక చేయడంతో శ్రీశైలంగౌడ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. ఈ సందర్భంగా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసిన తనకు మంత్రి హరీశ్రావు అన్యాయం చేశారని, ఇటీవల టీడీపీ నుంచి బొంది రాఘవేంద్రగౌడ్ను చైర్మన్గా ఎంపిక చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. రామాయంపేటలోనూ.. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితెందర్గౌడ్, వైస్ చైర్మన్గా పుట్టి విజయలక్ష్మి ఎన్నికయ్యారు. కాగా రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్గా పుట్టి విజయలక్షి్మకే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పుట్టి యాదగిరి మొదటి నుంచి టీఆర్ఎస్లో చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు కావడంతో పుట్టి విజయలక్షి, యాదగిరికి చైర్మన్ పదవి దక్కుతుందని పార్టీ కార్యకర్తలు ఆశించారు. తీరా అధిష్టానం పల్లె జితెందర్గౌడ్ పేరును తెరపైకి తీసుకొని పదవీ అంటగట్టడంతో విజయలక్ష్మి నిరుత్సాహానికి గురై వైస్చైర్మన్గా మిగిలిపోయారు. నర్సాపూర్లో ప్రశాంతం నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్చైర్మన్ ఎంపిక ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్రావు నర్సాపూర్లో ప్రచారం చేసిన సమయంలో మురళీధర్ యాదవ్ను చైర్మన్గా ప్రకటించారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో మురళీధర్యాదవ్, వైస్చైర్మన్గా నహీమొద్దీన్లను ఎంపిక చేశారు. కాగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్చైర్మన్లు టీఆర్ఎస్ పారీ్టకి చెందినవారే. -
ఆమె వయసు పాతికేళ్లు..
ఆమె వయసు పాతికేళ్లు.. ఎంఏ, బీఈడీ పూర్తి చేసి, న్యాయవిద్య అభ్యసిస్తూనే సివిల్స్ లక్ష్యంగా సాగుతోంది. అంతలోనే మున్సిపల్ ఎన్నికలు రావడం.. చైర్పర్సన్ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చింది. బల్దియా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. అతిచిన్న వయసులోనే కామారెడ్డి బల్దియా చైర్మన్ అయిన నిట్టు జాహ్నవి ప్రస్థానం.. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి బల్దియా చైర్పర్సన్గా ఎన్నికైన నిట్టు జాహ్నవి 1995 ఆగస్టు 13న జన్మించారు. ఆమె తాత నిట్టు విఠల్రావ్ ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్ అయ్యారు. తల్లి కరుణశ్రీ స్కూల్ అసిస్టెంట్గా, ఇన్చార్జీ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. తండ్రి నిట్టు వేణుగోపాల్రావ్ మున్సిపల్ కౌన్సిలర్గా పలు పర్యాయాలు పనిచేశారు. బాబాయ్ కృష్ణమోహన్ కౌన్సిలర్గా, కో ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు జాహ్నవితో పాటు బాబాయ్ కూడా కౌన్సిలర్గా గెలుపొందారు. టార్గెట్ సివిల్స్.... ఎంఏ బీఈడీ పూర్తి చేసిన జాహ్నవి.. ప్రస్తుతం హైదరాబాద్లోని పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయ విద్యనభ్యసిస్తున్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. లా చదువకుంటూనే సివిల్స్కు సిద్ధమవుతున్న జాహ్నవి.. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. జాహ్నవి తండ్రి నిట్టు వేణుగోపాల్రావ్ రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పలుమార్లు కౌన్సిలర్గా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. టీఆర్ఎస్లో చేరిన తరువాత ఏదైనా కార్పొరేషన్ పదవి లభిస్తుందని ఆశించారు. ఇంతలో మున్సిపల్ ఎన్నికలు రావడం, చెర్మన్ పదవి మహిళకు రిజర్వు కావడంతో ఆయన తన కూతురును రాజకీయాల్లోకి రావాలని కోరారు. సివిల్స్ సర్వీసెస్ అంటే ఇష్టంగా ప్రిపేర్ అవుతున్న జాహ్నవి.. తండ్రి కోరిక మేరకు ప్రజా సేవ చేసేందుకు వచ్చారు. 33వ వార్డునుంచి పోటీ చేసి గెలిచారు. చైర్పర్సన్గా ఎన్నికైన జాహ్నవి.. తన లక్ష్యం సివిల్స్ అని, వచ్చే ఏడాది సివిల్స్ రాస్తానని పేర్కొంటున్నారు. నాన్నే స్ఫూర్తి.. నాన్న స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. అమ్మ, తాత, నానమ్మ, బాబాయిల ప్రోత్సాహమూ ఉంది. సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న నాకు ఈ ఐదేళ్ల ప్రజా సేవ కూడా సర్వీస్లాంటిదే.. నాన్న, బాబాయిలు రాజకీయాల్లో ఉన్నారు. చిన్ననాటి నుంచి వారిని గమనిస్తున్నా. రాజకీయాల్లో రాణించడానికి నాన్న రాజకీయ అనుభవం ఉపయోగపడుతుంది. ఆయన సూచనలతో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తా. పట్టణంలో ప్రధాన సమస్య పారిశుధ్యలోపమే.. ప్రజలను చైతన్యపరిచి పారిశుధ్య సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. బల్దియాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. స్వచ్ఛ కామారెడ్డిగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలి. – నిట్టు జాహ్నవి, చైర్పర్సన్, కామారెడ్డి -
‘పుర’ వశంలో గులాబీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని బల్దియా పీఠాలన్నీ టీఆర్ఎస్ వశమయ్యాయి.. దీంతో గులాబీ శ్రేణులు ‘పుర’వశంలో మునిగి తేలాయి.. బోధన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా ఆర్మూర్, భీమ్గల్ పురాధీశుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం ఆయా బల్దియాల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో తొలుత సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్, చైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించారు. దీంతో మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇన్నాళ్లు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న బల్దియాలు ఇకపై ప్రజాప్రతినిధుల ఏలుబడిలో కొనసాగనున్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలోనూ గులాబీ జెండానే ఎగిరింది. నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్ల మద్దతుతో టీఆర్ఎస్ కార్పొరేటర్ దండు నీతుకిరణ్ మేయర్ పదవి దక్కించుకోగా, డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు దక్కింది. నాలుగు మున్సిపాలిటీలూ టీఆర్ఎస్ కైవసం చేసుకుని జిల్లాలో తనకు తిరుగులేదని గులాబీ పార్టీ మరోమారు చాటి చెప్పింది. బల్దియాలన్నీ టీఆర్ఎస్కు దక్కడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగి పోయారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్మూర్ చైర్ పర్సన్గా వినీత ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్గా పండిత్ వినీత ఎన్నికయ్యారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 33వ వార్డు నుంచి గెలిచిన వినీత పేరును 36వ వార్డు కౌన్సిలర్ రమేశ్ ప్రతిపాదించగా, 12వ వార్డు కౌన్సిలర్ కాటి హన్మంతు బలపరిచారు. ఆమెకు పోటీగా ఇంకెవరూ రాకపోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి వినీత మున్సిపల్ చైర్ పర్సన్గా విజయం సాధించినట్లు ఆర్డీవో ప్రకటించారు. వైస్ చైర్మన్గా 20వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్ను కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. భీమ్గల్ చైర్ పర్సన్గా రాజశ్రీ భీమ్గల్: నూతనంగా ఏర్పడిన భీమ్గల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్గా మల్లెల రాజశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన చైర్ పర్సన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 9వ వార్డు నుంచి ఎన్నికైన రాజశ్రీ తొలి చైర్ పర్సన్గా చిరస్థాయిలో నిలిచి పోనున్నారు. వైస్ చైర్మన్గా 4వ వార్డు కౌన్సిలర్ గున్నాల బాల భగత్ ఎన్నికయ్యారు. బోధన్ బల్దియాపై మరోసారి గులాబీ జెండా.. బోధన్టౌన్: బోధన్ బల్దియా చైర్ పర్సన్గా తూము పద్మావతి ఎన్నికయ్యారు. 25వ వార్డు నుంచి గెలిచిన ఆమె టీఆర్ఎస్ చైర్ పర్సన్గా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ నుంచి (24వ వార్డు) కౌన్సిలర్ సంధ్య కూడా పోటీలో నిలిచారు. దీంతో ఎన్నిక నిర్వహించగా టీఆర్ఎస్ (20), ఎంఐఎం(11), బీజేపీ(1), ఎక్స్అఫీషి యో సభ్యుడు సహా పద్మావతికి 33 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ఆరుగురు కౌన్సిలర్ల మద్దతు మాత్రమే లభించడంతో, పద్మావతి చైర్పర్సన్గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. వైస్చైర్మన్గా టీఆర్ఎస్కు చెందిన 34వ వార్డు కౌన్సిలర్ ఎత్తేశాం (సోహైల్) ఎన్నికయ్యారు. -
కొలువుదీరిన కొత్త పురపాలకులు
గ్రేటర్ పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల పర్వం ముగిసింది. 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగ్గా...సోమవారం 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల్లో పాలకులు కొలువుదీరారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు పదవీ స్వీకారం చేశారు. వీరిలో మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పీఠాలు దక్కించుకున్నారు. కొత్త పొత్తులు, జంపింగ్ జిలానీలు, అనూహ్య పరిణామాల మధ్య కొన్నిచోట్ల పదవులు తారుమారయ్యాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక కొత్త పాలకుల ప్రొఫైల్ వివరాలు ఇలా.. ఇబ్రహీంపట్నం చైర్ పర్సన్: కప్పరి స్రవంతి వయస్సు: 29 విద్యార్హత: ఎంబీఏ(హెచ్ఆర్) కుటుంబం: భర్త కప్పరి చందు, ఇద్దరు కూతుళ్లు కుందనిక, వెరొనిక రాజకీయ నేపథ్యం: మామ కప్పరి లక్ష్మయ్య ఇబ్రహీంపట్నం చివరి సర్పంచ్గా పనిచేశారు. అప్పట్లో ఆయన చేసిన అభివృద్ధి గెలుపునకు కలిసొచ్చింది. వైస్ చైర్మన్: ఆకుల యాదగిరి వయస్సు: 59 విద్యార్హత: ఇంటర్ వృత్తి: వ్యవసాయం, రియల్ఎస్టెట్ వ్యాపారం కుటుంబం: భార్య వసంత, ఇద్దరు కూతుళ్లు క్రాంతి, నాగరాణి, కుమారుడు హరికాంత్ రాజకీయ నేపథ్యం: టౌన్ మున్సిపాలిటీగా ఇబ్రహీంపట్నం ఉన్నప్పుడు పెద్దనాన్న ఆకుల చంద్రయ్య కౌన్సిలర్, తదుపరి సొంత అన్నవదినలు శ్రీరాములు, సరోజలు సర్పంచ్లుగా పనిచేశారు. దుండిగల్ చైర్పర్సన్:సుంకరి కృష్ణవేణి పుట్టిన తేది: మే 14, 1990 కుటుంబం: భర్త శంభీపూర్ కృష్ణ, సంతానం: కుమార్తెలు మీనాక్షి, యామిని రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సోదరుడి భార్య కృష్ణవేణి. భర్త, బావలు టీఆర్ఎస్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తుండగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో 25వ వార్డు నుంచి గెలుపొంది మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్: తుడుం పద్మారావు పుట్టిన తేదీ: అక్టోబర్ 8, 1975 కుటుంబం: భార్య అన్నపూర్ణ, సంతానం: ప్రణీత్, ప్రణయ్ విద్యార్హత: పదవ తరగతి రాజకీయ నేపథ్యం: 1994లో బహదూర్పల్లి గ్రామ వార్డు సభ్యుడిగా ఎన్నికై 1999 వరకు ఉప సర్పంచ్గా పని చేశారు. 2014లో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీలో జిల్లా దళిత మోర్చ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మూడేళ్ల క్రితం టీఆర్ఎస్లో చేరారు. నాగారం మున్సిపాలిటీ చైర్మన్:కౌకుట్ల చంద్రారెడ్డి పుట్టిన తేదీ: జూలై 1963 చదువు: 7వ తరగతి. కుటుంబం: భార్య కౌకుట్ల లలిత, రాహుల్రెడ్డి, కొండల్రెడ్డి రాజకీయ జీవితం: 1997లో నాగారం పంచాయతీ వార్డు సభ్యుడు, 2002లో ఉపసర్పంచ్, 2007లో ఇన్చార్జి సర్పంచ్. 2014 నుంచి 2019వరకు నాగారం సర్పంచ్గా పనిచేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్:బండారు మల్లేష్యాదవ్ పుట్టిన తేదీ : 1–7–74 విద్యార్హత : పదో తరగతి కుటుంబం : బి.రమాదేవి సంతానం : శ్రీయా యదవ్, శ్రీజన్ యాదవ్ రాజకీయ నేపథ్యం: కొత్తగా ఏర్పడిన నాగారం మున్సిపాలిటీలో 13వ వార్డు నుంచి 65 ఓట్ల తేడాతో గెలుపొందారు. తూంకుంట మున్సిపల్ చైర్మన్:కారింగుల రాజేశ్వరరావు పుట్టిన తేది: 08/07/1973 విద్యార్హత: 10వ తరగతి కుటుంబం: భార్య సుప్రియ, సంతానం: ప్రణవ్, భసంత్ రాజకీయ నేపథ్యం: ఏమీ లేదు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్: పన్నాల వాణివీరారెడ్డి పుట్టిన తేది: 09/05/1972 విద్యార్హత: 10వ తరగతి కుటుంబం: భర్త పన్నాల వీరారెడ్డి సంతానం: సుష్మరెడ్డి, రిష్మారెడ్డి. రాజకీయ నేపథ్యం: ఏమీ లేదు జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్: అబ్దుల్లా బిన్ హామేద్ సాది. పుట్టిన తేది: 1992 ఫిబ్రరి 21. విద్యాభ్యాసం: బీకాం. కుటుంబ నేపథ్యం: భార్య,కుమారుడు సంతానం రాజకీయ నేపథ్యం: జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికైన అబ్దుల్లా బిన్ హామెద్ సాది స్వయనా రెజ్లర్(మల్లయోధుడు). మజ్లిస్ పార్టీ జల్పల్లి మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న అతడి తండ్రి నుంచి రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. వైస్ చైర్మన్: ఫర్హానా నాజ్. పుట్టిన తేది: 1994 ఆగస్ట్ 7 విద్యాభ్యాసం: డిగ్రీ కుటుంబం: భర్తతో పాటు ముగ్గురు పిల్లలు సంతానం. రాజకీయ నేపథ్యం: గృహిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి వైస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. తన సోదరుడి(సయ్యద్ యూసుఫ్ పటేల్–టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు) రాజకీయాన్ని ఆదర్శంగా తీసుకొని టీఆర్ఎస్ తరపున టికెట్ పొంది మజ్లిస్ను మట్టి కరిపించింది. దమ్మాయిగూడ మున్సిపల్ చైర్ పర్సన్: వసుపతి ప్రణీతాగౌడ్ పుట్టిన తేదీ : 26–12–1988 విద్యార్హత : బీకాం. కుటుంబం: భర్త వసుపతి శ్రీకాంత్గౌడ్, సంతానం: హాసిని, శ్రీతేజ రాజకీయ నేపథ్యం: 2014 నుంచి 2019 వరకు వార్డుసభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి 216 ఓట్ల తేడాతో గెలుపొందారు. మున్సిపల్ వైస్ చైర్మన్: మాదిరెడ్డి నరేందర్రెడ్డి పుట్టిన తేదీ : 22–2–1975 విద్యార్హత : ఇంటర్ కుటుంబం : భార్య పావని రెడ్డి, రితీష్రెడ్డి, తనుష్రెడ్డి రాజకీయ నేపథ్యం: 2007 నుంచి 2012 వరకు ఉపసర్పంచ్గా, 2014 నుంచి 2019 వరకు వార్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడిన దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 16వ వార్డు నుంచి 60 ఓట్ల తేడాతో గెలుపు. ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్: ముల్లి పావనిజంగయ్య యాదవ్ పుట్టిన తేది: 1979 జనవరి 10 విద్యార్హత: ఇంటర్ కుటుంబం: భర్త: జంగయ్యయాదవ్ సంతానం: మేఘన, సౌమ్య, అర్చన రాజకీయ నేపథ్యం: గృహిణి. నూతనంగా ఏర్పడిన ఘట్కేసర్ మున్సిపాలిటీ 16వ వార్డు నుంచి 281 ఓట్ల తేడాతో విజయం సాధించింది. వైస్ చైర్మన్: పలుగుల మాధవరెడ్డి పుట్టిన తేది: 1972 ఏప్రిల్ 4 విద్యార్హత: డిగ్రీ కుటుంబం: భార్య: మమత సంతానం: ప్రణయ్రెడ్డి, రణంత్రెడ్డి రాజకీయ నేపథ్యం: పార్టీలో పని చేసిన అనుభవంతో నూతనంగా ఏర్పడిన ఘట్కేసర్ మున్సిపాలిటీలో 9వ వార్డు నుంచి 270 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. శంషాబాద్ చైర్ పర్సన్ః కొలను సుష్మారెడ్డి వయసుః 45 విద్యార్హతః ఇంటర్ కుటుంబంః భర్త మహేందర్రెడ్డి శంషాబాద్ పీఏసీఎస్ చైర్మన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ కుమార్తె, కుమారుడు రుష్యేందర్రెడ్డి అఖిలారెడ్డి రాజకీయ నేపథ్యంః మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, సిరీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు. భర్త టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. వైస్ చైర్మన్ః బండి గోపాల్యాదవ్ వయసు 33 విద్యార్హత: బీఏ కుటుంబంః భార్య పుష్పలత, కుమారులు సాత్విక్, మనీష్ రాజకీయ నేపథ్యంః ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడిగా.. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశాడు. ఏడాది కిందటే టీఆర్ఎస్లో చేరారు. తుర్కయంజాల్ చైర్ పర్సన్ పేరు:మల్రెడ్డి అనురాధ భర్త పేరు: మల్రెడ్డి రాంరెడ్డి విద్యార్హత: ఇంటర్మీడియట్ (డిస్ కంటిన్యూ) రాజకీయ నేపథ్యం: 1995–2001 వరకు తొర్రూర్ సర్పంచ్గా పనిచేశారు. పిల్లలు: ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు (మల్రెడ్డి సాయితేజ్ రెడ్డి, కావ్య, దివ్య) ఇద్దరు కుమార్తెలు డాక్టర్లు. వైస్ చైర్ పర్సన్: గుండ్లపల్లి హరిత భర్త పేరు: గుండ్లపల్లి ధన్రాజ్గౌడ్ వయస్సు: 42 విద్యార్హత: బీకాం రాజకీయ నేపథ్యం: 2014–2019 వరకు ఎంపీపీగా పనిచేశారు. కుటుంబం: ఇద్దరు కుమారులు(ప్రీతమ్ రాజ్, ప్రణవ్ రాజ్) భర్త ధన్రాజ్గౌడ్ 2008–2013 వరకు ఉప సర్పంచ్గా పనిచేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్: కొత్త ఆర్తిక వయస్సు : 28 సంవత్సరాలు చదువు : బీఎస్సీ భర్త :కొత్త ప్రవీణ్ వృత్తి : గృహిణి రాజకీయ నేపథ్యం : మామ కొత్త యాదగిరిగౌడ్, అత్త ప్రమీల కొంగర్కాలన్ మాజీ సర్పంచ్లు పిల్లలు : ఇద్దరు కుమారులు వైస్ చైర్పర్సన్ :కోరే కళమ్మ వయస్సు : 39 సంవత్సరాలు చదువు : పదవ తరగతి వృత్తి : గృహిణి రాజకీయ నేపథ్యంః ఈమె ఇంతుకుముందు ఆదిబట్ల ఎంపీటీసీగా పనిచేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ :కాంటేకర్ మధుమోహన్ వయస్సు : 32 సంవత్సరాలు తల్లిద్రండులు : జగత్, స్వరూప భార్య : మౌనిక వృత్తి : రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజకీయ నేపథ్యం : రావిర్యాల గ్రామ బీజేపీ పార్టీ సామాన్య కార్యకర్త వైస్ చైర్మన్ : భవాని వెంకట్రెడ్డి వయస్సు : 50 భార్య : ఉదయ శ్రీ వృత్తి : రియల్ ఎస్టేట్ వ్యాపారం పిల్లలు :ఒక కుమారుడు, ఒక కుమారై రాజకీయ అనుభవం : గతంలో తుక్కుగూడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా పని చేశారు. మణికొండ చైర్మన్: కస్తూరి నరేందర్ముదిరాజ్ భార్య: లావణ్య, మాజీ సర్పంచ్ కుటుంబం: ఇద్దరు కుమారులు చదువు: 10వ తరగతి గ్రామం: పుప్పాలగూడ రాజకీయ నేపథ్యంః రాజకీయం (కాంగ్రెస్) వైస్ చైర్మన్: కొండకళ్ల నరేందర్రెడ్డి భార్య: సుమతి పిల్లలు: ఇద్దరు కూతుర్లు చదవు: ఇంటర్ గ్రామం: మణికొండ రాజకీయ నేపథ్యంః రాజకీయం(బీజేపీ) నార్సింగి చైర్పర్సన్: దారుగుపల్లి రేఖ భర్త: డి.యాదగిరి పిల్లలు: ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు చదువు: 6వ తరగతి గ్రామం: గౌలిదొడ్డి రాజకీయ నేపథ్యంః కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం వైస్ చైర్మన్: గొర్ల వెంకటేశ్యాదవ్ భార్య: జి.అరుణజ్యోతి పిల్లలు: ఒక కుమారుడు, ఒక కూతురు చదువు: పదవ తరగతి గ్రామం: నార్సింగి రాజకీయ నేపథ్యంః రాజకీయం, ఒక సారి టీడీపీ నుంచి సర్పంచ్, ఆ తర్వాత టీఆర్ఎస్, రియల్ ఎస్టేట్. శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ : సాత విజయలక్ష్మి వయస్సు: 35 కుటుంబం: భర్త సాత ప్రవీణ్కుమార్. సంతానం: కుమారుడు మణిరుద్రా„Š, కూతురు హన్సిక రాజకీయ నేపథ్యం: మామ సాత ఆత్మలింగం శంకర్పల్లి మాజీ సర్పంచ్, భర్త ప్రవీణ్కుమార్ శంకర్పల్లి మాజీ ఉప సర్పంచ్ పని చేశారు. నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండటం, పేదలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆపదలో ముందుకు రావడం కలిసొచ్చింది. వైస్ చైర్మన్: భానురి వెంకట్రాంరెడ్డి వయస్సు: 64, విద్యార్హత: ఇంటర్ భార్యపేరు: ప్రభావతి సంతానం: శ్రీకాంత్రెడ్డి, శశికాంత్రెడ్డి రాజకీయ నేపథ్యం: శంకర్పల్లి వైస్ ఎంపీపీ, మార్కెట్ కమిటీ వైస్ ఎంపీపీ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించడం, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, నమ్మిన మనుషుల వెంబడి ఉండటం. ఆమనగల్లు చైర్మన్ః నేనావత్ రాంపాల్ వయసుః 42 విద్యార్హతః ఎస్ఎస్సీ కుటుంబంః భార్య నీల, కుమారుడు శివాజీనాయక్, కూతురు నిఖిత రాజకీయ నేపథ్యంః 2013లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమనగల్లు రెండవ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల బీజేపీలో చేరారు. ఆమనగల్లు 3వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ః భీమనపల్లి దుర్గయ్య వయసుః 45 విద్యార్హతః ఇంటర్మీడియట్ కుటుంబంః భార్య శివలక్ష్మి, కుమారులు: పవన్కళ్యాణ్, ప్రణీత్కుమార్ రాజకీయ నేపథ్యంః 2006లో ఆమనగల్లు గ్రామ పంచాయితీ వార్డు సభ్యుడిగా ఎన్నిక, పదిహేనేళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నారు. పద్మశాలీ సంఘంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్:మద్దుల లక్ష్మి పుట్టిన తేదీ: 1974 అక్టోబర్ 15 విద్యార్హత: ఇంటర్మీడియట్ కుటుంబం: భర్త: మద్దుల శ్రీనివాస్రెడ్డి, మద్దుల వికాస్రెడ్డి, మనీష రాజకీయ నేపథ్యం: కొత్తగా ఏర్పడిన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 15వ వార్డు నుంచి కౌన్సిలర్గా 259 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భర్త మద్దుల శ్రీనివాస్రెడ్డి గతంలో గుండ్లపోచంపల్లి సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించారు. వైస్ చైర్మన్: దమ్మన్నగారి ప్రభాకర్ పుట్టిన తేదీ: 1970 అక్టోబర్ 10 విద్యార్హత : ఎస్ఎస్సీ కుటుంబం: భార్య: వీరమణి, కుమారుడు: సందీప్ కూతుళ్లు: స్వాతి, శృతిప్రియ రాజకీయ నేపథ్యం: మేడ్చల్ పీఎస్సీఎస్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి కౌన్సిలర్గా 254 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోచారం మున్సిపల్ చైర్మన్ :బోయపల్లి కొండల్రెడ్డి పుట్టిన సంవత్సరం: 1978 విద్యార్హత: ఇంటర్ (అన్నోజిగూడ) వృత్తి: రియల్ ఎస్టేట్ కుటుంబం: భార్య:శైలజ, కూతురు: జీవిక రాజకీయ నేపథ్యం:2016 నుంచి 2019 వరకు టీఆర్ఎస్ ఘట్కేసర్ మండల అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. మున్సిపల్ వైస్ చైర్మన్:నానావత్ రెడ్యానాయక్ పుట్టిన తేది: 03–03–1979 విద్యార్హత: ఎస్ఎస్సీ (అన్నోజిగూడ) వృత్తి: వ్యాపారం కుటుంబం: భార్య: సరిత సంతానం: కుమారుడు: రిషి కిరణ్, కుమార్తె: భావన రాజకీయ నేపథ్యం: 2013 నుంచి 2018 వరకు పోచారం గ్రామ వార్డు సభ్యుడిగా, 2010–2013 రైతు సహకార సంఘ డైరెక్టర్గా, టీఆర్ఎస్లో గ్రామశాఖ అధ్యక్షుడుగా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా కొంత కాలం పనిచేశారు. పెద్ద అంబర్పేట చైర్పర్సన్:చెవుల స్వప్న వయస్సు: 28 విద్యార్హత:పదవ తరగతి కుటుంబం: ఇద్దరుకుమారులురాజకీయ నేపథ్యం:రాజకీయాల్లోకి కొత్తగా.. వైస్ చైర్పర్సన్: చామ సంపూర్ణరెడ్డి వయస్సు: 35 విద్యార్హత: డిగ్రీ కుటుంబం: ఇద్దరు సంతానం రాజకీయ నేపథ్యం: గత పాలకవర్గంలో కౌన్సిలర్గా, ఆమె భర్త చామ విజయశేఖర్రెడ్డి కో ఆప్షన్, భావ చామ రాంరెడ్డి కుంట్లూర్ సర్పంచ్గా, మరో బావ చామ కృష్ణారెడ్డి సింగిల్ విండో చైర్మన్గా పనిచేశారు. 30 ఏళ్లుగా వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్: కొందూటి నరేందర్ విద్యార్హత: బీఏ వయస్సుః 54 సంవత్సరాలు కుటుంబంః భార్య కొందూటి మహేశ్వరీ, కొడుకు శక్తిసాయి చరణ్, కూతురు భావన రాజకీయ నేపథ్యంః షాద్నగర్ ఎంపీటీసీగా, గ్రామ పంచాయితీ సర్పంచ్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. చిన్న నాటి నుంచి కాంగ్రెస్లో కొనసాగి, 2014లో టీఆర్ఎస్లో చేరారు. చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ః ఎంఎస్ నట్రాజ్ వయస్సుః 50 సంవత్సరాలు విద్యార్హతః ఓపెన్ డిగ్రీ కుటుంబంః భార్య లలిత, కుమారుడు అనంత కౌషిక్ రాజకీయ నేపథ్యంః 32 ఏళ్ల రాజకీయ జీవితంలో 23 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్కు నమ్మిన బంటుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యక్తిగత కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. కొంపల్లి మున్సిపల్ చైర్మన్:సన్న శ్రీశైలం యాదవ్ పుట్టిన తేదీ: 1972 ఫిబ్రవరి 29 విద్యార్హత: ఇంటర్ డిస్కంటిన్యూ(మేడ్చల్) కుటుంబం: భార్య:కవిత, సంతానం:మల్లికార్జున్, మానస. రాజకీయ నేపథ్యం: 1996 నుంచి 2001 వరకు ఎంపీటీసీగా, 2006 నుంచి 2011 వరకు కొంపల్లి గ్రామ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఏర్పడ్డ కొంపల్లి మున్సిపాలిటీలో 3వ వార్డు నుంచి ఒక్క ఓటు తేడాతో గెలుపొంది చైర్మన్గా ఎన్నికయ్యారు. -
సిరిసిల్లలో కొలువు దీరిన కౌన్సిల్
సిరిసిల్ల, వేములవాడ కొత్త మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువు దీరాయి. రెండు పురపాలికల్లోనూ చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ పీఠాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్గా జిందం కళ ఏకగ్రీవం కాగా, వైస్చైర్మన్గా మంచె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అదేవిధంగా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్గా రామతీర్థపు మాధవి, వైస్చైర్మన్గా మధు రాజేంద్రశర్మ విజయం సాధించారు. సిరిసిల్లలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వేములవాడలో కమిషనర్ ప్రవీణ్కుమార్ కొత్తపాలకవర్గాలతో పదవీప్రమాణ స్వీకారం చేయించారు. సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్గా జిందం కళ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా మంచె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో 39 స్థానాలు ఉండగా.. 22 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించి పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేసింది. రాష్ట్రంలో తొలిసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యం చాటుకుంది. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన వారితో ఆర్డీవో, సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్రావు ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం 10 గంటలకే అధికార టీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు జరిగిన సమావేశానికి కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎన్నికల పరిశీలకుడు అ బ్దుల్ అజీమ్ హాజరయ్యారు. వారిసమక్షంలో ఆర్డీవో తెలుగు అక్షర మాల క్రమంలో మెజార్టీ సాధించిన జాతీయ పార్టీల అభ్యర్థులకు తొలిఅవకాశం కల్పించారు. గూడూరి భాస్కర్ తొలుత కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన చొప్పదండి లలిత చి వరగా ప్రమాణ స్వీకారం చేశారు. సీమా బేగం, దూస వినయ్ ఇంగ్లిష్లో ప్రమాణ స్వీకారం చే యగా.. మిగతా 37 మంది కౌన్సిలర్లు తెలుగులోనే కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనేకమంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చే స్తూ.. ఉచ్ఛరణ దోషాలతో ఇబ్బందులు పడగా.. ఆర్డీవో శ్రీనివాస్రావు కవర్ చేస్తూ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్పర్సన్ ఏకగ్రీవం.. వైస్ చైర్మన్కు పోటీ.. కౌన్సిల్ 12.30 గంటలకు చైర్పర్సన్, వైస్ చై ర్మన్ ఎన్నికకు మళ్లీ సమావేశమైంది. టీఆర్ఎస్ విప్ జారీ చేసిందని, మిగతా పార్టీల నుంచి తమకు విప్ రాలేదని ఆర్డీవో ప్రకటించారు. చైర్పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. చైర్పర్సన్గా జిందం కళ పేరును దార్ల కీర్తన ప్రతిపాదించగా.. అన్నారం శ్రీనివాస్ బలపరిచారు. పోటీ లేక జిందం కళ చైర్పర్సన్గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. వైస్చైర్మన్ స్థానానికి మంచె శ్రీనివాస్ పేరును గడ్డం లత ప్రతిపాదించగా.. భూక్యా రెడ్డినాయక్ బలపరిచారు. వైస్చైర్మన్ స్థానానికి బీజేపీ అభ్యర్థి బొల్గం నాగరాజు పేరును గూడూరి భాస్కర్ ప్రతిపాదించగా.. చెన్నమనేని కీర్తి బలపరిచారు. మూజువాణి(చేతులెత్తే) విధానంలో ఎన్నికలు జరుగుతాయని ఆర్డీవో ప్రకటించారు. ముందుగా టీఆర్ఎస్ అభ్యర్థి మంచె శ్రీనివాస్ కు మద్దతుగా 34 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. బీజేపీ అభ్యర్థి బొల్గం నాగరాజుకు మద్దతుగా ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు తటస్థంగా ఉన్నారు. మెజార్టీ కౌన్సిలర్ల మద్దతుతో మంచె శ్రీనివాస్ వైస్ చైర్మన్గా ఎన్నిక అయినట్లు ఆర్డీవో శ్రీనివాస్రావు ప్రకటించారు. మున్సిపల్ చైర్పర్సన్గా జిందం కళ, వైస్ చైర్మన్గా మంచె శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిల్కు శుభాకాంక్షలు.. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్కు కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎన్నికల పరిశీలకుడు అబ్దుల్ అజీమ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పూలమొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించారు. చైర్పర్సన్ జిందం కళకు, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్కు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకుల నుంచి శుభాకాంక్షలు లభించాయి. టీఆర్ఎస్ నాయకుల పర్యవేక్షణలో.. కౌన్సిల్ ప్రమాణ స్వీకారం టీఆర్ఎస్ నాయకుల పర్యవేక్షణలో సాగింది. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జనగామ శరత్రావు, కుంబాల మల్లారెడ్డి, జిందం చక్రపాణి మున్సిపల్ కార్యాలయంలో ఉండి ప్రమాణ స్వీకారాన్ని పర్యవేక్షించారు. సిరిసిల్లలో రెండోసారి టీఆర్ఎస్ పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేసింది. పటిష్టమైన పోలీస్ రక్షణ.. మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు వెంకటనర్సయ్య, సర్వర్, ఐదుగురు ఎస్సైల పర్యవేక్షణలో 50 మంది పోలీసులు రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. సిరిసిల్ల–సిద్దిపేట రహదారిని దిగ్బంధించిన పోలీసులు.. తర్వాత ఒకవైపు వాహనాలు నియంత్రించారు. మొత్తంగా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా ముగిసింది. వేములవాడ చైర్పర్సన్గా మాధవి వేములవాడ: వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్గా రామతీర్థపు మాధవి, వైస్చైర్మన్గా మధు రాజేంద్రశర్మ ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి వారి ఎన్నికతోపాటు కౌన్సిలర్ల పదవీ ప్రమాణ ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. మొత్తం 28 వార్డులు ఉండగా, ఒకటి ఏకగ్రీవమైంది. 27 స్థానాలకు పోలింగ్ నిర్వహించి ఈనెల 25న ఓట్లు లెక్కించారు. రెండు రోజులపాటు హైదరాబాద్లో శిబిరంలో ఉన్న కౌన్సిలన్లు.. సోమవారం ఉదయం నేరుగా ఎమ్మెల్యే రమేశ్బాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక బస్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. జెడ్పీ సీఈవో కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. 28వ వార్డు నుంచి గెలుపొందిన ప్రతాప హిమబిందు గైర్హాజరయ్యారు. టీఆర్ఎస్ విప్ జారీ చేసిందని, ధిక్కరించినవారి సభ్యత్వం రద్దవుతుందని ప్రకటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్పర్సన్, వైస్చైర్మన్ల ఎంపిక చేపట్టారు. ఈలోగా లభించిన కాస్త సమయంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రమేశ్బాబు మంతనాలు జరిపారు. చివరిక్షణం వరకు చైర్పర్సన్ ఎవరననేది తెలియలేదు. ఆఖరి క్షణంలో రామతీర్థపు మాధవిని చైర్పర్సన్, వైస్చైర్మన్గా మధు రాజేంద్రశర్మను ఎన్నుకోవాలని సూచించినట్లు తెలిసింది. చైర్పర్సన్గా రామతీర్థపు మాధవి పేరును గోలి మహేశ్ ప్రతిపాదించగా, నరాల శేఖర్ బలపరిచారు. వైస్చైర్మన్ మధు రాజేంద్రశర్మను ఇప్పపూల అజయ్ ప్రతిపాదించగా, నిమ్మశెట్టి విజయ్ బలపరిచారు. మాధవికి 22 ఓట్లు, రాజేంద్రశర్మకు 23 ఓట్లు వచ్చాయి. వీరు ఎన్నికైనట్లు జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి ప్రకటించారు. చైర్పర్సన్కు 16 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫిషియో మెంబర్ ఎమ్మెల్యే రమేశ్బాబు, ఐదుగురు ఇండిపెండెంట్లు.. మొత్తం 22 ఓట్లు వచ్చాయి. వైస్చైర్మన్కు 16 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫిషియో మెంబర్ ఎమ్మెల్యే రమేశ్బాబు, ఐదుగురు ఇండిపెండెంట్లతోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్ హన్మవ్వ సైతం చేతులెత్తి ఓటేశారు. వైస్చైర్మన్కు 23 ఓట్లు వచ్చినట్లు సీఈవో ప్రకటించారు. రెండు సీట్లకు బీజేపీ పోటీ చేసింది. చైర్పర్సన్, వైస్చైర్మన్లకు ఐదుగురు మాత్రమే ఓటు వేశారు. ఎమ్మెల్యేకు పాదాభివందనం చేసిన చైర్పర్సన్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, చైర్పర్సన్, వైస్చైర్మన్లను ఎమ్మెల్యే రమేశ్బాబు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణలు సన్మానించారు. రామతీర్థపు మాధవి ఎమ్మెల్యే రమేశ్బాబుకు పాదాభివందనం చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వారితో కలసి నృత్యం చేశారు. -
రాయికల్ మినహా నాలుగింట్లో వారే..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నాలుగింట్లో మహిళలకే పట్టాభిషేకం జరిగింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురిలో చైర్పర్సన్లుగా మహిళలు ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క రాయికల్లోనే జనరల్కు రిజర్వ్ కావడంతో మోర హన్మాండ్లు చైర్మన్గా ఎన్నికయ్యారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో బీసీలే చైర్మన్ పీఠాలను అలంకరించారు. వీరిలో నలుగురు మహిళలు ఉండడం గమనార్హం. మెట్పల్లిలో వరుసగా మూడోసారి మహిళలే చైర్పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. రాయికల్లో చైర్మన్ పదవి జనరల్ కాగా.. వైస్ చైర్పర్సన్ పదవి మహిళకు దక్కింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగిత్యాలలో గులాబీ జెండా రెపరెపలాడింది. సాక్షి, జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకున్నారు. జగిత్యాల చైర్పర్సన్గా డాక్టర్ బోగ శ్రావణి, కోరుట్లలో అన్నం లావణ్య, మెట్పల్లిలో రణవేణి సుజాత, రాయికల్లో మోర హన్మండ్లు, ధర్మపురి మున్సిపాలిటీ చైర్పర్సన్గా సంగి సత్తెమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాలలో వైస్చైర్మన్గా గోలి శ్రీనివాస్, కోరుట్లలో గడ్డమీది పవన్, మెట్పల్లిలో బోయినిపల్లి చంద్రశేఖర్రావు, రాయికల్లో గండ్ర రమాదేవి, ధర్మపురిలో ఇందారపు రామన్న మున్సిపల్ వైస్చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. సామాజికవర్గాల వారీగా.. మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్ల పదవులను సామాజికవర్గాల వారీగా సర్దుబాటు చేశారు. జగిత్యాలలో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన డాక్టర్ బోగ శ్రావణికి చైర్మన్ పదవి దక్కగా.. ఓసీ సామాజికవర్గంలోని వైశ్యులు గోలి శ్రీనివాస్ వైస్చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారు. కోరుట్లలో చైర్మన్ పదవి బీసీల్లోని గౌడ సామాజిక వర్గానికి చెందిన అన్నం లావణ్యకు దక్కగా, వైస్చైర్మన్గా బీసీల్లోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గడ్డమీది పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. మెట్పల్లిలో చైర్మన్ పీఠం బీసీల్లోని ముదిరాజ్కు చెందిన రణవేణి సుజాత దక్కించుకోగా, ఓసీకి చెందిన బోయినపల్లి చంద్రశేఖర్రావు వైస్చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. రాయికల్లో బీసీ పద్మశాలి వర్గానికి చెందిన మోర హన్మండ్లు చైర్మన్కాగా ఓసీకి చెందిన గండ్ర రమాదేవి వైస్చైర్పర్సన్ అయ్యారు. ధర్మపురిలో బీసీల్లోని మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన సంగి సత్తెమ్మ చైర్పర్సన్ కాగా ఓసీకి చెందిన ఇందారపు రామన్న వైస్చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. ఊహించినట్లే.. జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ముందుగా ఊహించినట్లుగానే జరిగినా వైస్ చైర్మన్ల విషయంలో కాస్త సస్పెన్స్ ఏర్పడింది. కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ చైర్మన్లను ఎమ్మెల్యేలు ముందుగానే ప్రకటించారు. ధర్మపురి, జగిత్యాలలో చైర్పర్సన్ పీఠానికి పలువురు పోటీలో ఉన్నప్పటికీ ముందు నుంచి ప్రచారంలో ఉన్నవారే చైర్మన్ పదవులను అలంకరించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగిత్యాలలో టీఆర్ఎస్ మొదటి సారిగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కొంగొత్త ఆశలు.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్న రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఇక్కడ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల స్థానంలో చైర్మన్, వైస్చైర్మన్, కౌన్సిలర్లతో కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. నూతనంగా ఏర్పడిన పాలకవర్గాలతో పట్టణాల్లో కొత్త శోభ సంతరించుకుంది. పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే ఆశలు కొత్త పాలకవర్గాలపై పట్టణవాసులు పెట్టుకున్నారు. -
టీఆర్ఎస్ క్లీన్స్వీప్
సాక్షి, పెద్దపల్లి : బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సంపూర్ణమైంది. స్పష్టమైన మెజార్టీ వచ్చిన మూడు మున్సిపాలిటీలతోపాటు, కాస్త వెనుకపడిన కార్పొరేషన్ అధ్యక్ష పీఠాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నాలుగు పురపాలికల్లో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ల ఎన్నిక సోమవారం నిర్వహించారు. ఊహించినట్లుగానే రామగుండం మేయర్గా బంగి అనిల్ ఎన్నికయ్యారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కోడలు మమతారెడ్డి, మంథనిలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు భార్య పుట్ట శైలజ, సుల్తానాబాద్లో చైర్పర్సన్గా ముత్యం సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్యాంపుల నుంచి కౌన్సిల్కు మేయర్, చైర్మన్ ఎన్నికల కోసం క్యాంపుల్లో ఉన్న విజేతలు నేరుగా ఆయా మున్సిపల్ కౌన్సిళ్లకు ఉదయం చేరుకున్నారు. రామగుండంలో టీఆర్ఎస్, ఫార్వర్డ్బ్లాక్, స్వతంత్ర, బీజేపీ కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చారు. ముందే నిర్ణయించిన ప్రకారం మేయర్గా బంగి అనిల్కుమార్, డిప్యూటీ మేయర్గా నడిపెల్లి అభిషేక్రావును సభ్యులు ప్రతిపాదించగా, 18 మంది టీఆర్ఎస్, 9 మంది ఫార్వర్డ్బ్లాక్, ఇద్దరు బీజేపీ, స్వతంత్రులు ఆరుగురుతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కోరుకంటి చందర్ మద్దతు ప్రకటించారు. దీనితో బంగి అనిల్ మేయర్గా, నడిపెల్లి అభిషేక్రావు డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో ప్రమాణస్వీకారం అనంతరం ఎన్నిక నిర్వహించగా, చైర్పర్సన్గా చిట్టిరెడ్డి మమతారెడ్డి, వైస్ చైర్పర్సన్గా నజ్మీన్ సుల్తానా నామినేషన్లు మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక మంథనిలో ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లుగానే జెడ్పీ చైర్మన్ పుట్ట మధు భార్య, మాజీ సర్పంచ్ పుట్ట శైలజ చైర్పర్సన్గా, ఆరెపల్లి కుమార్ వైస్చైర్మన్గా ఎన్నికయ్యారు. సుల్తానాబాద్లో చైర్పర్సన్కు ముత్యం సునీత, బిరుదు సమత, గాజుల లక్ష్మి పోటీపడగా, ముత్యం సునీతను చైర్పర్సన్ పీఠం వరించింది. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కోడలు బిరుదు సమత వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అన్ని మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్కు ఆధిక్యం ఉండడంతో ఇతర పార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్చైర్పర్సన్లకు పోటీకూడా పడలేదు. కాగా ఎన్నికల ప్రక్రియలో రామగుండం కార్పోరేషన్కు జేసీ వనజాదేవి, పెద్దపల్లి మున్సిపాల్టీకి ఆర్డీవో శంకర్కుమార్, సుల్తానాబాద్ మున్సిపాల్టీకి ఇన్చార్జి డీఆర్వో కె.నరసింహామూర్తి, మంథనికి జిల్లా సహకారాధికారి చంద్రప్రకాశ్రెడ్డి ఇన్చార్జీలుగా వ్యవహరించారు. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. -
ఖానా‘పురం’ ఎట్టకేలకు ‘కారు’పరం
నిర్మల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఐదేళ్లపాటు పట్టణాభివృద్ధికి అంకితమవుతామంటూ ప్రమాణం చేశాయి. బీసీ జనరల్కు రిజర్వు అయిన నిర్మల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన గండ్రత్ ఈశ్వర్ చైర్మన్ అయ్యారు. భైంసాలో గత పాలకవర్గంలో చైర్పర్సన్గా ఉన్న సబియాబేగం మరోసారి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కొత్త మున్సిపాలిటీ ఖానాపూర్ను ఎట్టకేలకు టీఆర్ఎస్ దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి అంకం రాజేందర్ చైర్మన్గా ప్రమాణం చేశారు. మూడు మున్సిపాలిటీల్లో ప్రత్యేక సమావేశం, ప్రమాణ స్వీకారోత్సవం ప్రశాంతంగా ముగిశాయి. నాలుగువందలకు పైగా ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్ పట్టణం 12వ మున్సిపల్ చైర్మన్గా గండ్రత్ ఈశ్వర్ ఎన్నికయ్యారు. ఇక్కడ 42వార్డులకు గానూ టీఆర్ఎస్ ఏకపక్షంగా 30వార్డులను దక్కించుకుంది. మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో హాజరైన కౌన్సిలర్లు 33వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఈశ్వర్ను చైర్మన్గానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా ఈశ్వర్ పేరును తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ ప్రతిపాదించగా, 24వ వార్డుకు కౌన్సిలర్ మేడారం అపర్ణ బలపరిచారు. దీంతో ఎన్నిక నిర్వహణాధికారి, జెడ్పీ సీఈఓ సుధీర్ చైర్మన్గా గండ్రత్ ఈశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్గా ఇప్పటి వరకు నిర్మల్లో రెండోసారి ఎన్నికై ఈశ్వర్ రికార్డు నెలకొల్పారు. ఆయన గతంలో 2000–05వరకు చైర్మన్గా కొనసాగారు. అప్పట్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చైర్మన్గా ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నిక అనంతరం వైస్ చైర్మన్గా 22వ(వైఎస్ఆర్ కాలనీ) వార్డు కౌన్సిలర్ షేక్ సాజిద్ పేరును 41వ వార్డు కౌన్సిలర్ షేక్ అబ్ధుల్ సయీద్ ప్రతిపాదించారు. 23వ వార్డుకు చెందిన సయ్యద్ జహీర్ బలపర్చారు. దీంతో షేక్ సాజిద్ వైస్ చైర్మన్గా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రత్యేక సమావేశానికి హాజరైన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఎక్స్ అఫిషి యో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేకాధికారి శృతిఓజా, కలెక్టర్ ప్రశాంతి, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భైంసాలో మళ్లీ వాళ్లే.. రాష్ట్రంలో మహారాష్ట్రతో సరిహద్దు పట్టణంగా ఉన్న భైంసా మున్సిపల్లో మరోసారి ఎంఐఎం కొలువుదీరింది. ఇక్కడ బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో గత పాలకవర్గంలో చైర్పర్సన్గా కొనసాగిన సబియాబేగంను ఈసారి కూడా చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. పట్టణంలోని రెండోవార్డు నుంచి ఆమె గెలుపొందారు. వైస్ చైర్మన్గా 20వ వార్డు నుంచి ఏకగ్రీవమైన మహ్మద్ జాబిర్ అహ్మద్ కూడా మరోసారి అదే స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్పర్సన్గా సబి యాబేగం పేరును ఒకటోవార్డు కౌన్సిలర్ ఫైజు ల్లాఖాన్ ప్రతిపాదించగా, 16వ వార్డు కౌన్సిలర్ ముదస్సిమ్ బలపర్చారు. వైస్ చైర్మన్గా జాబిర్ అహ్మద్ను 15వ వార్డు కౌన్సిలర్ ఖాదర్ ప్రతిపాదించగా, 13వ వార్డు కౌన్సిలర్ రాహుల్ దగ్డే బలపర్చారు. ఈమేరకు వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ భాస్కర్రావు ప్రకటించారు. అంతకుముందు ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నికకు ముందే బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఖానా‘పురం’ కారుకే... కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డ ఖానాపూర్లో తొలిసారే ఉత్కంఠ నెలకొంది. చివరకు ఈ పురం ‘కారు’ పార్టీ పరమైంది. మొత్తం 12వార్డులకు గానూ టీఆర్ఎస్, కాంగ్రెస్లకు చెరో ఐదు స్థానాలు రాగా, ఇండిపెండెంట్ ఒకటి, బీజేపీ ఒకటి గెలుపొందారు. టీఆర్ఎస్కు స్వతంత్ర అభ్యర్థిగా 10వ వార్డు నుంచి గెలుపొందిన తొంటి శ్రీనివాస్ మద్దతు పలికారు. అంతకుముందు ఆయన గులాబీ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన రెండో వార్డు కౌన్సిలర్ కారింగుల సంకీర్తన సమావేశానికి గైర్హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే రేఖానాయక్ ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా మద్దతు పలికారు. దీంతో టీఆర్ఎస్ బలం ఏడు స్థానాలకు చేరగా, కాంగ్రెస్ నుంచి ఒకరు గైర్హాజరు కావడంతో వారి బలం నాలుగు స్థానాలకు పడిపోయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నాయిని స్రవంతి ఏ పార్టీకీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయారు. దీంతో ప్రత్యేకాధికారి ప్రసూనాంబ, కమిషనర్ మల్లేశ్లు మెజార్టీ ఉన్న టీఆర్ఎస్కు చైర్మన్ ఎన్నికకు అవకాశం ఇచ్చారు. ఆ పార్టీ నుంచి చైర్మన్గా 9వ వార్డు కౌన్సిలర్ అంకం రాజేందర్ పేరును 10వ వార్డు కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్ ప్రతిపాదించగా, 3వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి బలపర్చారు. వైస్ చైర్మన్గా 8వ వార్డు కౌన్సిలర్ అబ్ధుల్ ఖలీల్ పేరును ఒకటో వార్డు కౌన్సిలర్ కావలి సంతోష్ ప్రతిపాదించగా, ఐదో వార్డు కౌన్సిలర్ పరిమి లత బలపర్చారు. దీంతో చైర్మన్గా అంకం రాజేందర్, వైస్ చైర్మన్గా అబ్ధుల్ ఖలీల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఖానాపూర్ టీఆర్ఎస్ కైవసం.. ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే గెలిచారు. చైర్మన్ ఎన్నికకు ఏడుగురి మద్దతు కావాలి. అయితే స్థానిక ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఎక్స్అఫిషియో మెంబర్గా ఖానాపూర్లో నమోదు చేసుకున్నారు. ఆమె ఓటుతో టీఆర్ఎస్ బలం ఆరుకు చేరింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన 10వ వార్డు కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్ పార్టీలో చేరడంతో చైర్మన్గా అంకం రాజేందర్, వైస్ చైర్మన్గా అబ్దుల్ ఖలీల్ ప్రమాణ స్వీకారం చేశారు. భైంసాలో గట్టి బందోబస్తు భైంసా(ముథోల్): భైంసా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా పట్టణంలో సోమవారం గట్టి బందోబస్తు నిర్వహించారు. 144సెక్షన్ విధించారు. డీఎస్పీ నర్సింగ్రావు గతంలో పనిచేసి బది లీపై వెళ్లిన మరో డీఎస్పీ రాములు భద్రతను పర్యవేక్షించారు. కాగా, ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యే కొడుకు
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ బల్దియాపై సంపూర్ణంగా గులాబీ జెండా ఎగిరింది. చైర్మన్, వైస్ చైర్మన్ రెండూ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గత పాలకవర్గంలో ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కారు పార్టీ గద్దెనెక్కింది. అయితే ఈమారు మాత్రం టీఆర్ఎస్ ఒంటరిగా అధికారం దక్కించుకుంది. చైర్మన్గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తనయుడు జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీకే చెందిన మహ్మద్ జహీర్ రంజానిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవం.. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ సంధ్యారాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కొంత మంది తెలుగులో, కొంత మంది హిందీలో, ఒకరు ఇంగ్లీషులో ప్రమాణస్వీకారం చేశారు. 11.53 గంటలకు ప్రమాణస్వీకారం ముగిసింది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తామని జేసీ పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి గెలిచిన 24 మంది సభ్యులకు తోడు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు పార్టీలో చేరడంతో బలం 26కు చేరుకుంది. బీజేపీ 11 మంది సభ్యులు, కాంగ్రెస్ ఐదుగురు, ఎంఐఎం ఐదుగురు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. కాగా బీజేపీ తరఫున ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, టీఆర్ఎస్ తరఫున ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. అయితే ఎంపీ సోయం బాపురావు గైర్హాజరు కాగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న హాజరయ్యారు. ఇకపోతే కౌన్సిలర్లు 49 మంది, ఎక్స్అఫీషియో మెంబర్ ఎమ్మెల్యేను కలుపుకొని 50 మంది ఉండగా, మెజార్టీ 25 వస్తే ఆ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి చైర్మన్ అవుతారని జేసీ వివరించారు. అయితే కేవలం టీఆర్ఎస్ నుంచే విప్ నోటీస్ అందినట్లు తెలిపారు. ఇతర పార్టీలు విప్ నోటీస్ అందించలేదని స్పష్టం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నుంచి 34వ వార్డు కౌన్సిలర్ జోగు ప్రేమేందర్ పేరును చైర్మన్ అభ్యర్థిగా, 45వ వార్డు కౌన్సిలర్ బండారి సతీష్ ప్రతిపాదించగా, 12వ వార్డు కౌన్సిలర్ జాదవ్ పవన్నాయక్ బలపర్చారు. ఇతర పార్టీల నుంచి చైర్మన్ అభ్యర్థిత్వానికి ఎవరూ పోటీ పడలేదు. దీంతో జోగు ప్రేమేందర్ ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు. అనంతరం టీఆర్ఎస్కే చెందిన 29వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ జహీర్ రంజాని పేరును వైస్ చైర్మన్ అభ్యర్థిత్వానికి ఆ పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ అలాల అజయ్ ప్రతిపాదించగా, 9వ వార్డు కౌన్సిలర్ ఉష్కం రఘుపతి బలపర్చారు. ఇక్కడ కూడా ఇతర పార్టీల నుంచి ఎవరూ వైస్ చైర్మన్ అభ్యర్థిత్వానికి పోటీకి రాకపోవడంతో మహ్మద్ జహీర్ రంజాని కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు. తండ్రికి పాదాభివందనం.. నూతన చైర్మన్, వైస్ చైర్మన్తో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ప్రమాణస్వీకారం చేయించడంతో ప్రత్యేక సమావేశం ముగిసింది. అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిసి ఎమ్మెల్యే జోగురామన్న పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు ప్రమాణస్వీకారం అనంతరం చైర్మన్ చాంబర్లో జోగు రామన్న కుటుంబ సభ్యులు అందరు కలిసి జోగు ప్రేమేందర్కు శుభాకాంక్షలు తెలిపారు. జోగు ప్రేమేందర్ తండ్రి జోగురామన్నకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎంఐఎంకు చెక్.. వైస్ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి అవసరమైన మెజార్టీ లభించడంతో సొంతగానే పాలకవర్గం ఏర్పాటుకు ఆసక్తి చూపిందనేది స్పష్టమవుతుంది. గత పాలకవర్గంలో ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈమారు టీఆర్ఎస్ నుంచి గెలిచిన ముస్లిం నాయకుడు మహ్మద్ జహీర్ రంజానికి పదవి కల్పించారు. తద్వారా ఎంఐఎంకు చెక్ పెట్టారన్న చర్చ సాగుతుంది. కాగా మున్సిపోల్స్లో ఆది నుంచి ఎమ్మెల్యే జోగురామన్న వ్యూహాత్మకంగా పావులు కదిపారన్న ప్రచారం జరుగుతోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఘట్టంలోనూ తన రాజకీయ చతురతను చాటి నియోజకవర్గంలో బలమైన నేతగా మరోసారి నిరూపించుకున్నారన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. -
జిల్లాలో అంతటా టీఆర్ఎస్సే..
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. అన్నిచోట్లా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను అధికార పార్టీ టీఆర్ఎస్ చేజిక్కించుకుంది. బలమున్న చోట అలవోకగా.. బలం తక్కువున్న చోట స్వతంత్రుల మద్దతుతో దక్కించుకుంది. మొత్తంగా జిల్లావ్యాప్తంగా గులాబీ గుబాళించింది. సోమవారం ప్రమాణ స్వీకారం ఉండడంతో పోలింగ్ రోజే క్యాంపులకు వెళ్లిన సభ్యులు.. నేరుగా ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి చేరుకున్నారు. ఈ మేరకు వారితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. చెన్నూర్ మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కన్నుల పండువగా జరిగింది. 18 మందితో కౌన్సిలర్లతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో డీఆర్వో రాజేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక చేపట్టారు. చైర్పర్సన్ అభ్యర్థిగా అర్చనరాంలాల్గిల్డా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. అలాగే వైస్చైర్మన్గా నవాజోద్దిన్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కురికాల బాపు తదితరులు పాల్గొన్నారు. లక్సెట్టిపేట చైర్మన్గా నల్మాసు కాంతయ్య లక్సెట్టిపేట మున్సిపల్ పాలకవర్గంతో స్థానిక మున్సిపాలిటీలో డీఆర్డీఎ అధికారి శేషాద్రి ప్రమాణ స్వీకారం చేయించారు. టీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్ అభ్యర్థులు ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. టీఆర్ఎస్కు కోరం ఉండడంతో చైర్మన్, వైస్ చైర్మన్ రెండు పదవులూ వారే దక్కించుకున్నారు. చైర్మన్గా నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్గా పొడేటి శ్రీనివాస్గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కమిషనర్ రాజలింగం, సిబ్బంది కొత్త పాలకవర్గాన్ని సన్మానించారు. నస్పూర్ చైర్మన్గా ఈసంపల్లి ప్రభాకర్ నస్పూర్ మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్కు చెందిన ఈసంపల్లి ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్గా తోట శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి శ్యామలాదేవి కొత్త పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లలో 10 మంది టీఆర్ఎస్, ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్రలు, ఒకరు ఫార్వర్డ్ బ్లాక్, ఇద్దరు బీజేపీ, ఇద్దరు సీపీఐ అభ్యర్థులు విజ యం సాధించారు. టీఆర్ఎస్ నుంచి 9వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన ఈసంపల్లి ప్రభాకర్ చైర్మన్గా నామినేషన్ వేయగా.. 22వ వార్డు కౌన్సిలర్ వంగ తిరుపతి ప్రతిపాదించారు. 7వ వార్డు కౌన్సిలర్ చిందం మహేశ్ బలపరిచారు. కాంగ్రెస్ నుంచి మరొకరు నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీఆర్ఎస్తో పాటు ముగ్గురు స్వతంత్రులు, ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే దివాకర్రావు ఈసంపల్లి ప్రభాకర్కు మద్దతుగా ఓటు వేయడంతో ప్రభాకర్ ఎన్నిక లాంఛనమైంది. వైస్చైర్మన్గా తోట శ్రీని వాస్ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఎన్నిక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, ఏసీపీ లక్ష్మీనారాయణ బందోబస్తును సమీక్షించారు. మున్సిపల్ క మిషనర్ రాధాకిషన్, సిబ్బంది పెద్దింటి మో హన్రావు, శ్రీపతి సురేశ్కుమార్, నారాయణ కొత్త పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధికి పాటుపడండి.. కొత్త పాలకవర్గం మున్సిపల్ అభివృద్ధికి పాటుపడాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. చైర్మన్, వైస్ చైర్మన్లను అభినందించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని పేర్కొన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ హవా కొనసాగిందన్నారు. టీబీజీకేఎస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, మంద మల్లారెడ్డి, వెంగళ కుమారస్వామి పాల్గొన్నారు. మంచిర్యాల చైర్మన్గా పెంట రాజయ్య మంచిర్యాల మున్సిపల్ పాలకవర్గంతో ఆర్డీవో శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా టీఆర్ఎస్కు చెందిన పెంట రాజయ్య, గాజుల ముఖేశ్గౌడ్ ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారి జి.స్వరూపరాణి పాల్గొన్నారు. క్యాతనపల్లి చైర్పర్సన్గా జంగం కళ క్యాతనపల్లి బల్దియా పాలకవర్గంతో జెడ్పీ సీఈఓ నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్పర్సన్గా జంగం కళ, వైస్చైర్మన్గా ఎర్రం సాగర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్తోపాటు కౌన్సిలర్లకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, మేనేజర్ కీర్తి నాగరాజు పాల్గొన్నారు. మందమర్రి సీఐ ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బెల్లంపల్లి చైర్పర్సన్గా శ్వేత.. బెల్లంపల్లి మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. చైర్పర్సన్ , వైస్చైర్మన్గా జక్కుల శ్వేత, బత్తుల సుదర్శన్ ఏకగ్రీవమయ్యారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ప్రత్యేకాధికారి, సబ్ కలెక్టర్ పీఎస్ రాహుల్ రాజ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. -
కొలువు దీరిన కాగజ్నగర్ మున్సిపాలిటీ పాలకవర్గం
కాగజ్నగర్: ‘‘ఎండీ సద్దాం హుస్సేన్ అనే నేను కాగజ్నగర్ పురపాలక సంఘం సభ్యుడిగా, శాసనము ద్వారా నిర్మితమైన..’’ ‘‘రాచకొండ గిరీశ్కుమార్ అనే నేను కాగజ్నగర్ పురపాలక సంఘం సభ్యుడిగా, శాసనము ద్వారా నిర్మితమైన..’’అంటూ సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంతో కాగజ్నగర్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశాల మేరకు కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ సీఈవో వేణు నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా ఎన్నికల సంఘం నియమనిబంధనలను చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు జెడ్పీ సీఈవో ఒక్కొక్కరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా కౌన్సిలర్ ఎల్లేష్ ప్రమాణ స్వీకారం చేశారు. 10వ వార్డు కౌన్సిలర్ అన్నబోయిన విజయ భగవంతుని ప్రమాణంతో పాటు తన భర్త వనమాల రాముపై ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు ప్రమాణ స్వీకార పత్రంపై సంతకాలు చేశారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎక్స్ అఫీషియగా హాజరై పర్యవేక్షించారు. ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక.. పట్టణంలోని 30 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ 22 స్థానాలు కైవసం చేసుకోగా సోమవారం చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా చేపట్టారు. చైర్మన్, వైస్చైర్మన్ పేర్లను జెడ్పీ సీఈవో ప్రకటించారు. వారికి పార్టీ బీ ఫారం అందించినట్లు పేర్కొన్నారు. చైర్మన్ సద్దాం హుస్సేన్ను పంబాల సుజాత ప్రతిపాదించగా, బొద్దున విద్యావతి బలపర్చారు. వైస్చైర్మన్ రాచకొండ గిరీష్కుమార్ను స్వామిశెట్టి రాజేందర్ ప్రతిపాదించగా, విజయ్యాదవ్ కుమార్ బలపర్చారు. చైర్మన్ పదవిని సద్దాం హుస్సేన్, గిరీష్కుమార్ చెరో రెండున్నర సంవత్సరాలు పాలించనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం వీరు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఆలింగనము చేసుకున్నారు. నూతన అధ్యయనం మొదలు.. – ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజ్నగర్ మున్సిపాలిటీలో నూతన అధ్యయనం మొదలైందని ఎమ్మెల్యే కోనప్ప పేర్కొన్నారు. నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అభివృద్ధిలో, పాలనలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. చైర్మన్ హుస్సేన్, వైస్చైర్మన్ గిరీష్కుమార్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన పాలకవర్గ సభ్యులకు, ఎమ్మెల్యే కోనప్పకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల, పాలకవర్గం సభ్యుల నమ్మకం వమ్ముకాకుండా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. -
టీఆర్ఎస్ వ్యూహంతో చతికిలబడ్డ విపక్షాలు
-
క్లర్కుగా చేసిన చోటే.. చైర్పర్సన్గా..!
సాక్షి,భీమ్గల్ : అదృష్టమంటే ఇదేనేమో..! క్లర్కుగా పని చేసిన కార్యాలయంలోనే తొలి చైర్పర్సన్గా మల్లెల రాజశ్రీ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీగా మారక ముందు గ్రామ పంచాయతీలో రాజశ్రీ క్లర్కుగా పని చేసేవారు. అయితే, 2006 నుంచి 2013 వరకు మల్లెల లక్ష్మణ్ వార్డు సభ్యుడిగా, 2013 నుంచి 2018 వరకు ఉప సర్పంచ్గా పని చేశారు. ఈ మధ్య కాలంలో రాజశ్రీ, లక్ష్మణ్ మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమ్గల్ మున్సిపాలిటీగా మారింది. చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నెల 22న జరిగిన ఎన్నికల్లో రాజశ్రీ టీఆర్ఎస్ తరఫున తొమ్మిదో వార్డు నుంచి బరిలోకి దిగి.. భారీ మెజారిటీతో గెలిచారు. సోమవారం జరిగిన పరోక్ష ఎన్నికలో ఆమె చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. -
బస్తీలో ‘కొత్త దోస్తీ’
సాక్షి, హైదరాబాద్ : పురపోరులో కొత్త పొత్తులు పొడిచాయి. ఎన్నికల్లో విమర్శలు, సవాళ్లతో కత్తులు దూసుకున్న పార్టీలు చైర్మన్, వైస్చైర్మన్ పదవులు పంచుకోవడానికి ఒక్కటయ్యాయి. నంబర్గేమ్లో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు.. వైరిపక్షాలతో జతకట్టాయి. ఆధ్యంతం రసవత్తరంగా సాగిన పురపోరులో చివరి ఘట్టం మరింత ఆసక్తిరేకెత్తించింది. ప్రచారపర్వంలో ‘బస్తీ మే సవాల్’అంటూ పదునైన విమర్శనాస్త్రాలు సంధించుకున్న వైరిపక్షాలు.. సంఖ్యాబలంలో వెనకబడటమే తరువాయి పొత్తులకు శ్రీకారం చుట్టాయి. ఫలితాలు వెలువడిన 48గంటల్లోనే కొత్త మిత్రులతో కలసి పురపగ్గాలు చేపట్టాయి. నిజామాబాద్ నగర పాలక సంస్థలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించకపోవడంతో టీఆర్ఎస్–మజ్లిస్లు చేతులు కలిపాయి. మేయర్ పోస్టును ఎగురేసుకుపోయాయి. టీఆర్ఎస్కు ఎంఐఎంతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా మద్దతు పలికారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుతో డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎం కైవసం చేసుకుంది. సంగారెడ్డి పురపాలికలో ఇద్దరు మజ్లిస్ కౌన్సిలర్లు అండగా నిలవడంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు గులాబీపరమయ్యాయి. పిట్టల పోరు పిల్లి తీర్చినట్లు అధికారపార్టీలో నెలకొన్న ముసలం ప్రత్యర్థి పార్టీకి కలిసొచ్చింది. బొల్లారం మున్సిపాలిటీలో గ్రూపు తగాదాల కారణంగా టీఆర్ఎస్లోని ఒక వర్గం కాంగ్రెస్తో జతకట్టింది. దీంతో చైర్మన్ టీఆర్ఎస్, వైస్ చైర్మన్ కాంగ్రెస్కు దక్కాయి. మణికొండలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 6, టీఆర్ఎస్ 5, ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఎన్నికల ముందు విపక్షాలుగా సవాళ్లు విసురుకున్న బీజేపీ–కాంగ్రెస్ ఫలితాల అనంతర మిత్రపక్షాలుగా మారిపోయాయి. ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ పోస్టులు పంచుకున్నాయి. అమరచింతలో అధికార పార్టీతో కామ్రేడ్లు దోస్తీ కట్టారు. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు సహకరించిన సీపీఎం.. వైస్ చైర్మన్ పోస్టును తమ ఖాతాలో వేసుకుంది. తిరుగుబాటు అభ్యర్థులు దారికి రావడంతో అయిజ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఖాతాలో పడింది. ఆలిండియా ఫార్వర్డ్బ్లాక్ పార్టీ తరఫున బరిలో దిగి గెలిచిన 10 మంది అభ్యర్థులు, టీఆర్ఎస్కు మద్దతు పలికారు. 16 మంది సంఖ్యాబలంతో పురపాలికను కైవసం చేసుకున్నారు. మక్తల్లో కాంగ్రెస్ సహకారంతో బీజేపీ చైర్మన్ కుర్చీని దక్కించుకుంది. టీఆర్ఎస్కు అధికారాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో కమలానికి దగ్గరైన కాంగ్రెస్కు బీజేపీ నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. వైస్ చైర్మన్కు మద్దతు పలకకుండా ముఖం చాటేసింది. చౌటుప్పల్ మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఎంలు ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి. అయితే, చైర్మన్ ఎన్నిక విషయంలో మాత్రం సీపీఎం ప్లేటు ఫిరాయించడంతో టీఆర్ఎస్కు చైర్మన్, సీపీఎంకు వైస్చైర్మన్ పీఠం దక్కాయి. నల్లగొండ మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ టీఆర్ఎస్ ఎక్స్అఫీషియో బలంతో పురపీఠాన్ని దక్కించుకుంది. కానీ, కాంగ్రెస్, బీజేపీలు కలిస్తే ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచనతో ముందు బీజేపీకి వైస్చైర్మన్ పదవిని ఆశగా చూపింది. దీంతో బీజేపీ సభ్యులు చైర్మన్ ఎన్నికలో తటస్థంగా వ్యవహరించారు. కానీ వైస్ చైర్మన్ ఎన్నిక విషయానికి వచ్చేసరికి బీజేపీకి దక్కలేదు. ఎన్నిక నేటికి వాయిదా పడింది. మంగళవారం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నీలగిరిలో నెలకొంది. బడంగ్పేట మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్న ఐదుగురు టీఆర్ఎస్ సభ్యులు చివరి నిమిషంలో తుక్కుగూడకు ఆప్షన్ మార్చుకుని పురపీఠం దక్కించుకోవడం ద్వారా బీజేపీకి షాక్ ఇచ్చారు. బడంగ్పేటలో కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్లోకి గంపగుత్తగా వెళ్లడంతో అక్కడ ఎక్స్అఫీషియో సభ్యుల అవసరం టీఆర్ఎస్కు రాలేదు. -
ఢిల్లీ పార్టీలు.. సిల్లీ పనులు
సాక్షి, హైదరాబాద్ : ‘పేరుకు ఢిల్లీ పార్టీలు.. చేసేవి సిల్లీ పనులు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా లేక జాతీయ పార్టీ లైన కాంగ్రెస్, బీజేపీ విలువలకు తిలోదకాలిచ్చి మున్సిపల్ ఎన్నికల్లో అపవిత్ర అవగాహన కుదుర్చుకున్నాయి. మక్తల్లో కాంగ్రెస్ మద్దతుతో బీజేపీ, మణికొండ, తుర్కయాంజాల్లో బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కించుకున్నాయి. టీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు 2 జాతీయ పార్టీల నడుమ కుదిరిన ఫెవీక్విక్ అపవిత్ర బంధంతో ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ, శాఖల మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో తెలంగాణభవన్లో కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. రాష్ట్ర అవతరణకు ముందు టీడీపీ, కాంగ్రెస్ హయాంలో రూపొందించిన నిబంధనల మేరకు తాము ఎక్స్అఫీషియో సభ్యుల సహకారంతో కొన్నిచోట్ల మున్సిపల్ పీఠాలు దక్కించుకున్నామని చెప్పారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఎంఐఎం సహకారంతో తమ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుందని చెప్పారు. కొల్లాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు ఏఐఎఫ్బీ పార్టీ గుర్తుపై మెజారీటీ స్థానాల్లో గెలిచినా, టీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్, వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవడంపై కేటీఆర్ స్పందించారు. పార్టీ మార్గాన్ని విభేదించి వెళ్లిన వారితో సంబంధం లేకుండా క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థికి చైర్మన్ పదవి అప్పగించామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బలంగా విశ్వసించడం వల్లే కరీంనగర్ సహా పది మున్సిపల్ కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులు మేయర్, చైర్మన్ పదవులు దక్కించుకున్నారన్నారు. చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డ మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ మున్సిపల్ పీఠాలను దక్కించుకుంటుందన్నారు. బాగేదారి విధానంతో అభివృద్ధి.. ‘రాష్ట్రంలో పట్టణ జనాభా ప్రస్తుతం 43 శాతం కాగా, వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో త్వరలో 50 శాతానికి చేరే అవకాశం ఉంది. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డులు, డివిజన్ల ఏర్పాటును అత్యంత శాస్త్రీయంగా చేశాం. ఆదర్శవంతమైన పట్టణాలు రూపొం దించే లక్ష్యంతో కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించాం’అని కేటీఆర్ వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిని ప్రారంభించడంతో పాటు కొత్తగా ఎన్నికైన వారికి అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా నిధులు, విధులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా రూ.1,037 కోట్లకు రాష్ట్రం కూడా మరో రూ.1,037 కోట్లు జత చేసి రూ.2,074 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సగటున ప్రతినెలా తొలి వారంలోనే రూ.173 కోట్లు మున్సిపాలిటీలకు విడుదల చేస్తామన్నారు. క్యూఆర్ కోడ్ విధానంలో మున్సిపాలిటీల్లోని ఇళ్లకు కొత్త నంబర్లు ఇస్తామని వెల్లడించారు. యువత, మహిళలు, సీనియర్ సిటిజెన్స్, కాలనీ సంక్షేమ సంఘాలతో 4 కమిటీలు ఏర్పాటు చేసి ఢిల్లీ తరహాలో బాగేదారి విధానంలో పట్టణాలు అభివృద్ది చేస్తామని తెలిపారు. కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు, అనుమతు ల్లేని లే ఔట్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. -
నాలుగు సరి
సాక్షి, హైదరాబాద్ : ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు 4 పురపీఠాలే దక్కాయి. వాస్తవానికి ఏడు మున్సిపాలిటీల్లో చైర్మన్గిరీలను దక్కించుకునే స్థాయిలో స్థానాలను గెలుచుకున్నప్పటికీ అధికార టీఆర్ఎస్ వ్యూహం, బలం ముందు కాంగ్రెస్ చేతులెత్తేయాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్, మణికొండతో పాటు నల్లగొండ జిల్లా చండూరు, గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలతో సరిపెట్టుకుంది. ఆ పార్టీకి రావా ల్సిన పెద్ద అంబర్పేట, ఆదిభట్ల, నారాయణ్ఖేడ్ను టీఆర్ఎస్ తన్నుకుపోయింది. ఇక సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో సీపీఎంతో కలసి పోటీ చేసిన కాంగ్రెస్కు మేజిక్ ఫిగర్ దక్కింది. కానీ, అక్కడ ఎక్స్అఫీషియో ఓట్ల సహకారంతో టీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు వ్యూహం పన్నుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలోని ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ సాంకేతికంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో ఆ పార్టీ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది. కరీంనగర్లో తెరవని ఖాతా.. కాగా, సోమవారం వెలువడిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. అక్కడ మొత్తం 60 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేక డీలా పడింది. మిగిలిన కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో గెలుపొందడం తెలిసిందే. కాంగ్రెస్ గెలిచిన స్థానాలివే... మున్సిపాలిటీ చైర్పర్సన్ పేరు సామాజిక వర్గం చండూరు తోకల చంద్రకళ ముదిరాజ్ తుర్కయాంజాల్ మల్రెడ్డి అనూరాధ రెడ్డి మణికొండ నరేందర్ ముదిరాజ్ వడ్డేపల్లి రాచపూడి కరుణ మాదిగ -
గులాబీ పురపీఠాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పురపీఠాలు గులాబీ పరమయ్యాయి. మొత్తం 118 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకుగాను సోమవారం జరిగిన చైర్మన్లు, మేయర్ల ఎన్నికల్లో 110 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లను టీఆర్ఎస్ దక్కించుకుంది. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ఎంఐఎంల ఖాతాలో 8 మున్సిపాలిటీలే పడ్డాయి. అందులో కాంగ్రెస్కు 4, బీజేపీ, ఎంఐఎంలకు రెండేసి మున్సిపల్ పీఠాల చొప్పున దక్కాయి. వాస్తవానికి, సోమవారమే 120 మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక జరగాల్సి ఉన్నా నేరేడుచర్లలో ఎక్స్అఫీషియో ఓటు వివాదం కారణంగా, మేడ్చల్లో కోరం లేని కారణంగా మంగళవారానికి ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఈ రెండు మున్సిపాలిటీలు కూడా టీఆర్ఎస్కే దక్కే అవకాశం ఉండటంతో మొత్తం 112 మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరనుంది. ఇక, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికి వస్తే మేయర్లు, డిప్యూటీ మేయర్ పదవులన్నీ అధికార టీఆర్ఎస్ పార్టీనే దక్కించుకోవడం విశేషం. సోమవారం కౌంటింగ్ జరిగిన కరీంనగర్ కార్పొరేషన్లోనూ మేజిక్ ఫిగర్ను దాటి 60కి 33 స్థానాలు టీఆర్ఎస్ గెల్చుకోవడంతో అక్కడ కూడా అధికార పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవడం లాంఛనమే. దీంతో రాష్ట్రంలోని 100 శాతం కార్పొరేషన్లు, 92 శాతం మున్సిపాలిటీల్లో పాగా వేయడం ద్వారా టీఆర్ఎస్ కొత్త రికార్డు సృష్టించింది. ఎక్స్అఫీషియో, స్వతంత్రుల మద్దతుతో ఈనెల 25న వెలువడిన మున్సిపోల్స్ ఫలితాల్లో 86 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మద్దతుతోనే పురపీఠాలు దక్కించుకునే స్థాయిలో స్థానాలను గెల్చుకుంది. మిగిలిన చోట్ల పార్టీకి ఉన్న ఎక్స్అఫీషియో సభ్యుల సహకారంతో వ్యూహాత్మకంగా పురపీఠాలను దక్కించుకుంది టీఆర్ఎస్. అవసరమైన చోట్ల స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతు కూడా తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించి ముందు నుంచీ చెబుతున్న విధంగా మెజార్టీ పురపాలికల్లో పాగా వేసింది. ముఖ్యంగా ఎక్స్అఫీషియో సభ్యుల బలాన్ని వినియోగించుకోవడంలో టీఆర్ఎస్ తనదైన రాజకీయ శైలిని ప్రదర్శించింది. మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎంపికలో కూడా అన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకోవడంతో ఒకట్రెండు చోట్ల తప్ప పెద్దగా అభ్యంతరాలు కూడా వ్యక్తం కాలేదు. మొత్తం మీద మున్సిపోల్స్లో అధికార పక్షం వ్యూహంతో మరోసారి రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చతికిలబడ్డాయి. కొన్ని చోట్ల ఉద్రిక్తత మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షాలు ఘర్షణకు దిగేంత వరకు పరిస్థితులు వెళ్లాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిలు టీఆర్ఎస్ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. తుక్కుగూడలో బీజేపీ ఆందోళనకు దిగింది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్రావు ఎక్స్అఫీషియో ఓటు విషయంలో మెలిక పడటంతో ఎన్నిక వాయిదా పడింది. దీనిపై ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్పై విరుచుకుపడ్డారు. వీటితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లోకి వెళ్లడం, ఆయా పార్టీల నేతల నుంచి నిరసనలు వ్యక్తం కావడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక, చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు నిర్వహించింది. ముందుగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించగా, ఆ తర్వాత వైస్చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్లు, మేయర్లు అనుచరులతో కలసి సంబురాలు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సోమవారమంతా కోలాహలం నెలకొంది. మొత్తం మున్సిపాలిటీలు 120 చైర్మన్ ఎన్నిక జరిగినవి 118 ఎన్నిక వాయిదా పడినవి 2’ పార్టీలవారీగా విజయాలు.. టీఆర్ఎస్ 110 కాంగ్రెస్ 4 బీజేపీ 2 ఎంఐఎం 2 -
‘పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవి సిల్లీ పనులు’
-
సూర్యాపేట జిల్లా కలెక్టర్ బదిలీ
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమేయ కుమార్పై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆయనను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్కి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఓటు వివాదం నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు అవకాశం కల్పించి, తర్వాత నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేసింది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసి, కేవీపీకి ఓటు వేసే అవకాశం కల్పించింది. అమేయ కుమార్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రభుత్వం నేరేడుచర్ల మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్ మహేందర్రెడ్డిని సస్పెండ్ చేసింది. కాగా అమయ్కుమార్ సూర్యాపేట జిల్లా కలెక్టర్గా 2018 డిసెంబర్ 29న బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానిక సంస్థలు, ఎంపీ, హుజూర్నగర్ ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. కేవీపీ ఓటు వివాదం నేపథ్యంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. (చదవండి: నేరేడుచర్లలో ఉత్కంఠ) -
నిజామాబాద్: బీజేపీకి టీఆర్ఎస్ చెక్
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి టీఆర్ఎస్ చెక్ పెట్టింది. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ నగర పాలక సంస్థను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మేయర్గా 11వ వార్డు కార్పొరేటర్ దండు నీతు కిరణ్, డిప్యూటీ మేయర్గా 14వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇద్రీస్ఖాన్ ఎన్నికయ్యారు. మేయర్ పోటీలో నీతు కిరణ్పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లావణ్యకు 29 మంది మద్దతు తెలపగా, నీతూ కిరణ్కు 38 మంది మద్దతు ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పోటీలో ఎంఐఎం అభ్యర్థి ఇద్రీస్ఖాన్కు 38 మంది, బీజేపీ అభ్యర్థి మల్లేశ్ యాదవ్కు 29 మంది మద్దతు తెలిపారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వివరాలు.. 1. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా పండిత్ వనిత, వైస్ చైర్మన్గా షేక్ మున్నా ఎన్నిక 2. బోధన్ మున్సిపల్ చైర్మన్గా తూము పద్మ, వైస్ చైర్మన్గా మహ్మద్ ఏతేషామ్ ఎన్నిక 3. భీంగల్ మున్సిపల్ చైర్మన్గా మల్లెల రాజశ్రీ, వైస్ చైర్మన్గా గున్నాల బాల భగత్ ఎన్నిక. 4. కామారెడ్డి జిల్లా: కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా నీతు జాహ్నవి, వైస్ చైర్మన్గా గడ్డం ఇందుప్రియ ఎన్నిక. 5. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా కుడుముల సత్యనారాయణ, వైస్ చైర్మన్గా మస్త్యాల సుజాత ఎన్నిక. 6. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్గా జనగాం గంగాధర్, వైస్ చైర్మన్గా షేక్ జుబేర్ ఎన్నిక. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు వీరే -
ఎవరనేది సీల్డ్ కవర్ నిర్ణయిస్తుంది
సాక్షి, కరీంనగర్: జిల్లా కార్పొరేషన్ ఫలితాలు మంత్రి కేటీఆర్ పనితీరుకు నిదర్శనమని పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎవరితో పొత్తు లేకుండా ఏకపక్షంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. కరీంనగర్లో ఈ నెల 24న మున్సిపల్ ఎన్నికలు జరగగా సోమవారం సాయంత్రం ఫలితాలు వెలువడ్డాయి. కరీంనగర్లోని 60 డివిజన్లలో టీఆర్ఎస్ 34 స్థానాలు కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యత కనబర్చింది. టీఆర్ఎస్ గెలుపు సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రేపటి నుంచే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఇప్పుడిక ఏ ఎన్నికలు లేవని, నాలుగేళ్ల వరకు రాజకీయాల గురించి మాట్లాడమని తెలిపారు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామన్నారు. 2023లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని చెప్పడానికి కాంగ్రెస్కు ఒక్క స్థానం రాకపోవడమే నిదర్శనమని ఎద్దేవా చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి కొన్ని ఓట్లు పొందిన బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని, సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తే వారే పదవి చేపడతారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. చదవండి: కరీంనగర్లో పత్తా లేని కాంగ్రెస్ మంత్రి గంగుల ఉదంతాన్ని పరిశీలిస్తాం.. -
కరీంనగర్ గడ్డ మీద కారు హవా
సాక్షి, కరీంనగర్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరుకు ఏ పార్టీ చెక్ పెట్టలేకపోయింది. ఇక కరీంనగర్లోనూ కారు హవా కొనసాగింది. మొత్తం 60 డివిజన్లకు గానూ 34 డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 12 స్థానాల్లో బీజేపీ జెండా పాతింది. అనూహ్యంగా పుంజుకున్న ఎంఐఎం జిల్లాలోని 6 స్థానాల్లో విజయబావుటా ఎగరేసింది. ఇతరులు 8 చోట్ల విజయం సాధించగా, మిగిలిన 6 డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఎక్కడా కాంగ్రెస్ జాడే కనిపించలేదు. ఇక టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రావడంతో మేయర్ ఎంపిక గురించి పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. కాగా జిల్లాలో రెండు రోజులు ఆలస్యంగా ఎన్నికలు జరగగా సోమవారం ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మూడో రౌండ్లో అభ్యర్థుల గెలుపును ప్రకటించారు. చదవండి: ప్రముఖులకు షాకిచ్చిన మున్సిపల్ ఎన్నికలు.. -
‘కారు’ జోరు; నేరేడుచర్లలో ఉత్కంఠ
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఒక్కస్థానం మినహా అన్నింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఎక్స్ ఎక్స్ అఫిషియో ఓటు వివాదంతో నేరేడుచర్లలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో నేరేడుచర్ల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం తర్వాత నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, పది మున్సిపాలిటీల్లోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. ఎక్స్ అఫిషియో సభ్యులు, స్వతంత్రులు, సీపీఎం మద్దతుతో మిగిలి 16 స్థానాలను కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వివరాలు.. 1. నల్గొండ మున్సిపల్ చైర్మన్గా మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిర మంగళవారానికి వాయిదా పడింది. 2. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్గా తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్గా కుర్ర కోటేశ్వరరావు ఎన్నిక 3. దేవరకొండ మున్సిపల్ చైర్మన్గా ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ చైర్మన్గా ఎం.డీ రహాత్ అలీ ఎన్నిక 4. నందికొండ-సాగర్ మున్సిపల్ చైర్మన్గా కర్ణ అనూష వైస్ చైర్మన్గా మంద రఘువీర్ ఎన్నిక 5. హాలియా మున్సిపల్ చైర్మన్గా వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్గా సుధాకర్ ఎన్నిక 6. చిట్యాల మున్సిపల్ చైర్మన్గా కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, వైస్ చైర్మన్గా కూరేళ్ల లింగస్వామి ఎన్నిక 7. చండూరు మున్సిపల్ చైర్మన్గా తోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్ చైర్మన్గా దోటి సుజాత ఎన్నిక 8. యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపల్ చైర్మన్గా ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య ఎన్నిక 9. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా ఎరుకల సుధ ఎన్నిక 10. ఆలేరు మున్సిపల్ చైర్మన్గా వసపరి శంకరయ్య ఎన్నిక 11. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్గా వెన్ రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం(సీపీఎం) ఎన్నిక 12. మోత్కూరు మున్సిపల్ చైర్మన్గా టిపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్గా బొల్లేపల్లి వెంకటయ్య ఎన్నిక 13. భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్గా చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ఎన్నిక 14. సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్గా పుట్ట కిషోర్ ఎన్నిక 15. కోదాడ మున్సిపల్ చైర్మన్గ వనపర్తి శిరీష,వైస్ చైర్మన్గా వెంపటి పద్మ ఎన్నిక 16. హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్గా అర్చన రవి, వైస్ చైర్మన్గా జక్కుల నాగేశ్వరరావు ఎన్నిక 17. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్గా పోతరాజు రజిని ఎన్నిక 18. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరుగుతుంది. -
రంగారెడ్డి జిల్లాలో దుమ్మురేపిన కారు
సాక్షి, రంగారెడ్డి: జిల్లా పురపోరులో గులాబీ వ్యూహం ఫలించింది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 8 మున్సిపాలిటీలను అధికార పార్టీ దక్కించుకుంది. నాలుగు పురపాలికల్లో మెజార్టీ వార్డులను గెలుచుకొని ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న కారు...జిల్లా నేతల వ్యూహ రచనతో మరో నాలుగింట గులాబీ జెండాను రెపరెపలాడించింది. శంషాబాద్ , షాద్ నగర్ , శంకర్పల్లి, ఇబ్రహింపట్నం, ఆదిభట్ల, తుక్కుగూడ, నార్సింగి, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ ఛైర్మన్ పదవులు టీఆర్ఎస్ పార్టీకి దక్కగా... తుర్కయంజాల్ , మణికొండ మున్సిపాలిటీలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఇక ఆమనగల్ మున్సిపాలిటీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. జల్పల్లి మున్సిపాలిటి ఛైర్మన్ పీఠాన్ని ఎంఐఎం దక్కించుకోగా.. వైస్ ఛైర్మన్ పదవి టీఆర్ఎస్ను వరించింది. కాంగ్రెస్కు దక్కుతుందనుకున్న ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ ఛైర్మన్లు... స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఎత్తుగడతో టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. ఆదిభట్ల మున్సిపాలిటికి సంబంధించి 14వ వార్డు సభ్యురాలు కొత్త హార్థిక కాంగ్రెస్ నుంచి గెలిచి అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరి ఛైర్మన్ పదవికి దక్కించుకుంది. అదే విధంగా పెద్ద అంబర్ పేటలో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో ఆ మున్సిపాలిటీ ఛైర్మన్ గులాబీవశం కాగా... వైస్ ఛైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకున్నారు. అదే విధంగా జిల్లాలోని మూడు కార్పొరేషన్లు కూడా టీఆర్ఎస్కే దక్కాయి. బండ్లగూడ జాగీర్ కార్పోరేషన్ మేయర్గా బుర్ర మహేందర్ గౌడ్, బడంగ్పేట కార్పొరేషన్ మేయర్గా పారిజాత, మీర్పేట మేయర్గా ముడావత్ దుర్గా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల వివరాలు... 1. ఆదిభట్ల మున్సిపాలిటీ (టీఆర్ఎస్) కైవసం: ఛైర్మన్గా కొత్త హార్థిక, వైస్ ఛైర్మన్గా కొర్ర కళమ్మ ఎన్నిక 2. ఇబ్రహింపట్నం మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా కప్పరి స్రవంతి, వైస్ ఛైర్మన్గా ఆకుల యాదగిరి 3. పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా చెవుల స్వప్న, వైస్ ఛైర్మన్గా చామ సంపూర్ణరెడ్డి 4. తుక్కుగూడ మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా కాంటేకర్ మధుమోహన్, వైస్ ఛైర్మన్గా భవానీ వెంకట్ రెడ్డి 5. శంకర్ పల్లి మున్సిపాలిటి (టీఆర్ఎస్): ఛైర్మన్గా సత విజయలక్ష్మి, వైస్ ఛైర్మన్ గా వెంకట్రామిరెడ్డి 6. షాద్ నగర్ మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా కొందూటి నరేందర్ , వైఎస్ ఛైర్మన్ గా ఎంఎస్ నటరాజన్ ఎన్నిక 7. శంషాబాద్ మున్సిపాలిటి (టీఆర్ఎస్): ఛైర్మన్గా కొలను సుష్మ, వైస్ ఛైర్మన్ బండి గోపాల్ యాదవ్ 8. నార్సింగి మున్సిపాలిటీ (టీఆర్ఎస్): ఛైర్మన్గా బి.రేఖ, వైస్ ఛైర్మన్ జి.వెంకటేశ్ యాదవ్ ఎన్నిక 9. మణికొండ మున్సిపాలిటీ (కాంగ్రెస్): ఛైర్మన్గా కస్తూరి నరేందర్ (కాంగ్రెస్) , వైస్ ఛైర్మన్ గా నరేందర్ రెడ్డి(బీజేపీ) 10. తుర్కయంజాల్ మున్సిపాలిటీ (కాంగ్రెస్): ఛైర్మన్గా మల్ రెడ్డి అనురాధ, వైస్ ఛైర్మన్ గా గుండ్లపల్లి హరిత 11. జల్ పల్లి మున్సిపాలిటీ (ఎంఐఎం): ఛైర్మన్గా అబ్దుల్లాహబిన్ అహ్మద్ సాది, వైస్ ఛైర్మన్ గా ఫర్హాన నాజ్ (టీఆర్ఎస్) 12. ఆమనగల్ మున్సిపాలిటీ (బీజేపీ): ఛైర్మన్గా నేనావత్ రాంపాల్, వైస్ ఛైర్మన్ గా బేమనపల్లి దుర్గయ్య -
‘పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవి సిల్లీ పనులు’
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేశాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్నే గెలిపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ చాలా చోట్ల కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మక్తల్, మణికొండ, తుర్క యంజాల్లో బీజేపీ-కాంగ్రెస్ అపవిత్ర పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు. పేరుకు మాత్రం ఢిల్లీ పార్టీలని, చేసేవి గల్లీ పనులు అని ఎద్దేవా చేశారు. ఒక్క మున్సిపాలిటీ కోసం రెండు జాతీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. (చదవండి : తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే) 120 స్థానాల్లో 112 స్థానాలను టీఆర్ఎస్ సాధించిందని, పదికి పది కార్పొరేషన్లు గెలవడం అనితరసాధ్యమని మంత్రి అన్నారు. కరీనగర్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్, నేరేడుచర్లలోనూ తమకు సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్నే గెలిపించారని, దేశానికే ఆదర్శవంతమైన పట్టణాలను తయారు చేస్తామని కేటీఆర్ స్పష్టం చాశారు. కొత్తగా ఎన్నికైన 130 మంది చైర్మన్లకు కొత్తగా తీసుకువచ్చిన మున్సిపల్ చట్టంపై శిక్షణ అందిస్తామన్నారు. పల్లె ప్రగతి మాదిరే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి వెల్లడించారు. మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి రూ.1037 కోట్లు వస్తే అంతే మొత్తంలో నిధులను రాష్ట్రం నుంచి కేటాయిస్తామన్నారు. కేంద్రం, రాష్ట్ర నిధులు కలిపి మొత్తంగా రూ.2074 కోట్లు వస్తాయని, దానిని ప్రతి నెల రూ.173 కోట్ల చొప్పున మున్సిపాలిటీలకు అందిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో జవాబుదారీ తనాన్ని తీసుకొస్తామన్నారు. సక్రమంగా పనిచేయని వారిని పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అన్ని మున్సిపాలిటీల్లో డిజిటల్ డోర్ నెంబర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్గా కాంటేకర్ మధుమోహన్
-
చక్రం తిప్పిన సబితమ్మ : అనూహ్యంగా యువనేతకు పట్టం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ రేపిన తుక్కుగూడ మున్సిపాలిటీని అనూహ్య పరిణామాల నడుమ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మంత్రి సబితారెడ్డి సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో కీలకమైన తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఇక్కడ ఉన్న 15 వార్డుల్లో బీజేపీ 9, టీఆర్ఎస్ 5 గెలుచుకోగా, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీకి మెజారిటీ వచ్చినప్పటికీ తగినంతమంది ఎక్స్ అఫీషియో ఓట్ల మద్దతు లేకపోవడంతో రెండో వార్డులో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి కాంటేకర్ మధుమోహన్ కీలకంగా మారారు. ఈ క్రమంలో తగినంత ఎక్స్ అఫీషియో ఓట్లను కూడగట్టడంతోపాటు యువనేత మధును పార్టీలోకి సబితమ్మ ఆహ్వానించారు. బీసీ వర్గానికి చెందిన మధుకు తుక్కుగూడ మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్మన్ పదవిని అప్పగించారు. బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తనకు కీలకమైన తుక్కుగూడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిని వరించిన చైర్మన్ పీఠం స్థానిక యువ నాయకుడు మధు మున్సిపాలిటీలోని రెండోవార్డు నుంచి కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మెజారిటీ వార్డుల్లో గెలుపొందిన బీజేపీ చైర్మన్గా పోటీకి తీవ్ర కసరత్తు చేసింది. అయితే, ఎక్స్అఫీషియో సభ్యులతో బీజేపీ ప్రణాళిక తారుమారైంది. టీఆర్ఎస్ లో చేరిన స్వతంత్ర అభ్యర్థి మధు కాంటేకర్ ను చైర్మన్ అభ్యర్థిగా మంత్రి సబితారెడ్డి నిర్ణయించి పావులు కదిపారు. చివరి నిమిషంలో అనూహ్యంగా ఎక్స్అఫీషియో సభ్యుల రంగ ప్రవేశంతో మొత్తం పరిస్థితి తారుమారైంది. టీఆర్ఎస్ నాయకులు చైర్మన్గా మధుమోహన్, వైస్ చైర్మన్గా భవాని వెంకట్ రెడ్డి విజయం సాధించారు. -
తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్రీయ సమితి(టీఆర్ఎస్) దుమ్మురేపింది. 120 మున్సిపాటీలకు గానూ 112 దక్కించుకుని సత్తా చాటింది. 8 మున్సిపాలిటీలు మాత్రమే కాంగ్రెస్(4), బీజేపీ(2), ఎంఐఎం(2) దక్కించుకున్నాయి. అటు పది నగర పాలక సంస్థలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఒక్కస్థానం మినహా అన్నింటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఓటు వివాదంతో నేరేడుచర్లలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. 1. నల్గొండ మున్సిపల్ చైర్మన్గా మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిర మంగళవారానికి వాయిదా పడింది. 2. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్గా తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్గా కుర్ర కోటేశ్వరరావు ఎన్నిక 3. దేవరకొండ మున్సిపల్ చైర్మన్గా ఆలంపల్లి నర్సింహ్మ, వైస్ చైర్మన్గా ఎం.డీ రహాత్ అలీ ఎన్నిక 4. నందికొండ-సాగర్ మున్సిపల్ చైర్మన్గా కర్ణ అనూష వైస్ చైర్మన్గా మంద రఘువీర్ ఎన్నిక 5. హాలియా మున్సిపల్ చైర్మన్గా వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్గా సుధాకర్ ఎన్నిక 6. చిట్యాల మున్సిపల్ చైర్మన్గా కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, వైస్ చైర్మన్గా కూరేళ్ల లింగస్వామి ఎన్నిక 7. చండూరు మున్సిపల్ చైర్మన్గా తోకల చంద్రకళ (కాంగ్రెస్), వైస్ చైర్మన్గా దోటి సుజాత ఎన్నిక 8. యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి మున్సిపల్ చైర్మన్గా ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య ఎన్నిక 9. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా ఎరుకల సుధ ఎన్నిక 10. ఆలేరు మున్సిపల్ చైర్మన్గా వసపరి శంకరయ్య ఎన్నిక 11. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్గా వెన్ రెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం(సీపీఎం) ఎన్నిక 12. మోత్కూరు మున్సిపల్ చైర్మన్గా టిపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్గా బొల్లేపల్లి వెంకటయ్య ఎన్నిక 13. భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్గా చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ఎన్నిక 14. సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్ చైర్మన్గా పుట్ట కిషోర్ ఎన్నిక 15. కోదాడ మున్సిపల్ చైర్మన్గ వనపర్తి శిరీష,వైస్ చైర్మన్గా వెంపటి పద్మ ఎన్నిక 16. హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్గా అర్చన రవి, వైస్ చైర్మన్గా జక్కుల నాగేశ్వరరావు ఎన్నిక 17. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్గా పోతరాజు రజిని ఎన్నిక 18. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 9 చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు. 1. వరంగల్ రూరల్ జిల్లా: పరకాల మున్సిపల్ చైర్మన్గా సోదా అనిత, వైస్ చైర్మన్గా రేగురి జైపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక. 2. వర్ధన్నపేట నూతన మున్సిపాలిటి ఛైర్ పర్సన్గా అంగోత్ అరుణ, వైస్ చైర్మన్గా కొమండ్ల ఏలందర్ రెడ్డి ఎన్నిక. 3. నర్సంపేట మున్సిపల్ చైర్మన్గా గుంటి రజని కిషన్, వైస్ చైర్మన్గా మునిగాల వెంకట రెడ్డి ఎన్నిక. 4. మహబూబాద్ మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్గా మహ్మద్ ఫరిద్ ఎన్నిక. 5. మహబూబాద్ జిల్లా: మరిపెడ మున్సిపల్ చైర్మన్గా గుగులోతు సిందూర, వైస్ చైర్మన్గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఎన్నిక. 6. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మెన్గా వంకుడొతు వీరన్న, వైస్ చైర్మన్గా కేసబోయిన కోటి లింగం ఎన్నిక. 7. మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్గా జినుగ సురేందర్ రెడ్డి ఎన్నిక. 8. భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్గా సెగం వెంకట రాణి, వైస్ చైర్మన్గా కొత్త హరిబాబు ఎన్నిక. 9. జనగామ జిల్లా: జనగామ మున్సిపల్ చైర్మెన్గా పోకల జమున, వైస్ చైర్మన్గా మేకల రాంప్రసాద్ ఎన్నిక. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 15 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు చైర్మన్ పదవులను దక్కించుకున్నారు. బొల్లారంలో తప్ప అన్నిచోట్ల వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బొల్లారంలో కాంగ్రెస్ అభ్యర్థి అంతిరెడ్డిగారి అనిల్రెడ్డి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1. సంగారెడ్డి రెడ్డి జిల్లా: సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్గా లతారెడ్డి ఎన్నిక. 2. సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్గా చింతా గోపాల్ ఎన్నిక. 3. ఆందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్గా గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్గా మాతరి ప్రవీణ్ కుమార్ ఎన్నిక. 4. నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్గా రూబీనా బేగం, వైస్ చైర్మన్గా అయ్యర్ పరశురాం ఎన్నిక. 5. బొల్లారం మున్సిపల్ చైర్మన్గా కోలన్ రోజారాణి, వైస్ చైర్మన్గా అనిల్రెడ్డి (కాంగ్రెస్) ఎన్నిక. 6. అమీన్పూర్ మున్సిపల్ ఛైర్మన్గా తుమ్మల పాండు రంగారెడ్డి, వైస్ చైర్మన్గా నందారం నర్సింహగౌడ్ ఎన్నిక. 7. తెల్లపూర్ మున్సిపల్ చైర్మన్గా మల్లేపల్లి లలిత, వైస్ చైర్మన్గా బలాగౌని రాములు ఎన్నిక. 8. మెదక్ జిల్లా: మెదక్ మున్సిపల్ చైర్మన్గా తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్గా ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్ ఎన్నిక. 9. నర్సాపూర్ చైర్మన్గా ఎర్రగొల్ల మురళి యాదవ్, వైస్ చైర్మన్గా ఎండీ నయీముద్దిన్ ఎన్నిక. 10. తూప్రాన్ చైర్మన్గా బొంది రవిందర్ గౌడ్, వైస్ చైర్మన్గా నందాల శ్రీనివాస్ ఎన్నిక. 11. రామాయంపేట చైర్మన్గా పల్లె జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్గా పుట్టి విజయలక్ష్మి ఎన్నిక. 12. సిద్ధిపేట జిల్లా: దుబ్బాక చైర్మన్గా గన్నె వనిత, వైస్ చైర్మన్గా సుగుణ బాలకిషన్ గౌడ్ ఎన్నిక. 13. చేర్యాల చైర్మన్గా అంకుగారి స్వరూప రాణి, వైస్ చైర్మన్గా నిమ్మ రాజీవ్కుమార్ రెడ్డి ఎన్నిక. 14. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చైర్మన్గా నేతిచిన్న రాజమౌళి, వైస్ చైర్మన్గా ఎండీ జకీరుద్దీన్ ఎన్నిక. 15. హుస్నాబాద్ చైర్మన్గా ఆకుల రజిత, వైస్ చైర్మన్గా అయిలేని అనిత ఎన్నిక. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో 16 చోట్ల టీఆర్ఎస్ పాగా వేసింది. కొల్లాపూర్, అయిజ, భూత్పూర్, కోస్గిలో మెజారిటీ సీట్లు లేకపోయినా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకోవడం విశేషం. మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మద్దతుతో కమలం వికసించింది. అమరచింత వైస్ చైర్మన్గా సీపీఎం అభ్యర్థి గోపి ఎన్నికయ్యారు. 1. మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్గా కోరమోని నర్సింహులు, వైస్ చైర్మన్గా గణేష్ ఎన్నిక. 2. భూత్పూర్ మున్సిపల్ చైర్మన్గా బస్వరాజ్ గౌడ్, వైస్ చైర్మన్గా కెంద్యాల శ్రీనివాస్ ఎన్నిక 3. వనపర్తి జిల్లా: అమరచింత మువ్సిపల్ చైర్మన్గా మంగమ్మ, వైస్ చైర్మన్గా గోపి (సీపీఎం) ఎన్నిక. 4. ఆత్మకూర్ మున్సిపల్ చైర్మన్గా గాయత్రి, వైస్ చైర్మన్గా విజయ్ భాస్కర్ రెడ్డి ఎన్నిక. 5. కొత్తకోట మున్సిపల్ చైర్మన్గా పొగాకు సుకేషిని, వైస్ చైర్మన్గా బీసం జయమ్మ ఎన్నిక. 6. వనపర్తి మున్సిపల్ చైర్మన్గా గాలి యాదవ్, వైస్ చైర్మన్గా వాకాటి శ్రీధర్ ఎన్నిక. 7. పెబ్బేరు మున్సిపల్ చైర్మన్గా కరుణశ్రీ, వైస్ చైర్మన్గా మేకల కర్రెస్వామి ఎన్నిక. 8. నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్గా ఎడ్మ సత్యంరెడ్డి, వైస్ చైర్మన్గా షాహీద్ ఎన్నిక. 9. కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్గా విజయలక్ష్మి, వైస్ చైర్మన్గా మహదాబేగం ఎన్నిక. 10. నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా కల్పనా భాస్కర్ గౌడ్, వైస్ చైర్మన్గా భాస్కరరావు ఎన్నిక. 11. జోగులాంబ గద్వాల జిల్లా: వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్గా కరుణ, వైస్ చైర్మన్గా సుజాత ఎన్నిక. 12. అలంపూర్ మున్సిపల్ చైర్మన్గా మనోహరమ్మ, వైస్ చైర్మన్గా శేఖర్ ఎన్నిక. 13. అయిజ మున్సిపల్ చైర్మన్గా దేవన్న, వైస్ చైర్మన్గా మాల నర్సింహులు ఎన్నిక. 14. గద్వాల మున్సిపల్ చైర్మన్గా బి.ఎస్ కేశవ్, వైస్ చైర్మన్గా బాబర్ ఎన్నిక. 15. నారాయణపేట జిల్లా: మక్తల్ మున్సిపల్ చైర్మన్గా పావని(బీజేపీ), వైస్ చైర్మన్గా అఖిలారెడ్డి(బీజేపీ) ఎన్నిక. 16. కోస్గి మున్సిపల్ చైర్మన్గా శిరీష, వైస్ చైర్మన్గా అన్నపూర్ణ ఎన్నిక 17. నారాయణపేట మున్సిపల్ చైర్మన్గా అనసూయ, వైస్ చైర్మన్గా హరినారాయణ్ బట్టడ్ ఎన్నిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. నిజామాబాద్ నగర పాలక సంస్థను ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 1. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా పండిత్ వినీత్, వైస్ చైర్మన్గా మున్నాభాయ్ ఎన్నిక. 2. బోధన్ మున్సిపల్ చైర్మన్గా తూము పద్మ, వైస్ చైర్మన్గా ఏతేషామ్ ఎన్నిక. 3. భీంగల్ మున్సిపల్ చైర్మన్గా మల్లెల రాజశ్రీ, వైస్ చైర్మన్గా భగత్ ఎన్నిక. 4. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా జాహ్నవి, వైస్ చైర్మన్గా ఇందుప్రియ ఎన్నిక. 5. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా సత్యనారాయణ, వైస్ చైర్మన్గా సుజాత ఎన్నిక. 6. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్గా జంగం గంగాధర్, వైస్ చైర్మన్గా షేక్ జుబేర్ ఎన్నిక. ఉమ్మడి ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మునిసిపల్ చైర్మన్గా కూసంపూడి మహేష్, వైఎస్ చైర్మన్ తోట సుజలారాణి ఎన్నిక. 1. వైరా మున్సిపల్ చైర్మన్గా సూతకాని జైపాల్, వైస్చైర్మన్గా ముళ్లపాటి సీతారాములు ఎన్నిక. 2. మధిర మున్సిపల్ చైర్మన్గా మొండితోక లత, యరమల విద్యాలత ఎన్నిక. 3. భద్రాది-కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మున్సిపల్ చైర్మన్గా దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్గా ఎస్డీ జానీ పాషా ఎన్నిక. 4. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్గా కాపు సీతామహాలక్ష్మి, వైస్ చైర్మెన్గా వేల్పుల దామోదర్ ఏకగ్రీవ ఎన్నిక. -
వరంగల్ మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్లు
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. 9 చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు. 9 మున్సిపాలిటీల్లోని చైర్మన్లు, వైస్ ఛైర్మన్ల వారి వివరాలు. వరంగల్ రూరల్ జిల్లా: పరకాల మున్సిపల్ చైర్మన్గా సోదా అనిత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా రేగురి జైపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా: వర్ధన్నపేట నూతన మున్సిపాలిటి ఛైర్ పర్సన్ అంగోత్ అరుణ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ గా కొమండ్ల ఏలందర్ రెడ్డి ఎన్నికయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట మున్సిపల్ చైర్మన్గా గుంటి రజని కిషన్ ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా మునిగాల వెంకట రెడ్డి ఎన్నికయ్యారు. మహబూబాద్ మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఎన్నికగా, వైస్ చైర్మన్ గా మహ్మద్ ఫరిద్ ఎన్నికయ్యారు. మహబూబాద్ జిల్లా: మరిపెడ మున్సిపల్ చైర్మన్ గుగులోతు సింధూర, వైస్ చైర్మన్ గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఎన్నికయ్యారు. మహబూబాద్ జిల్లా: డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్గా వంకుడొతు వీరన్న ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా కేసబోయిన కోటి లింగం ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్గా మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్గా జినుగ సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్గా సెగం వెంకట రాణి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా కొత్త హరిబాబు ఎన్నికయ్యారు. జనగామ జిల్లా:జనగామ మున్సిపాలిటీ చైర్మ్న్గా పోకల జమున ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా మేకల రాం ప్రసాద్ ఎన్నికయ్యారు జనగామ మున్సిపల్ చైర్మన్ జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్లను అభినందిస్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి -
ఉద్రిక్తత.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అరెస్టు..!
సాక్షి, యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇక్కడ హంగ్ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపాలిటీ కేంద్రం రణరంగాన్ని తలపించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీపీఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. 20 వార్డులున్న చౌటుప్పల్లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది. ఇక టీఆర్ఎస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో ద్వంద్వ విధానాల సీపీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. -
గందరగోళంగా మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక
-
తీవ్ర గందరగోళం.. చైర్మన్ ఎన్నిక వాయిదా..!
సాక్షి, సూర్యాపేట : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్రావుకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడానికి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నేరేడుచర్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలను ఆయన రద్దు చేశారు. మొత్తం 15 వార్డులున్న నేరేడుచర్లలో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 7, సీపీఎం 1 స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్, సీపీఎం కూటమిగా ఉన్నాయి. అయితే, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 19 మంది చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని రిటర్నింగ్ అధికారి జాబితాలో పేర్కొన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కేవీపీ రామచందర్రావు ఓటు పెట్టుకున్నా జాబితాలో లేకుండా పోయింది. (చదవండి : ఉత్కంఠ వీడింది.. మేయర్ పీఠం వారిదే..!) టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. అయితే, తెలంగాణకు కేటాయించిన కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్రావును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దరఖాస్తూ పెట్టుకున్నా ఓటు హక్కు కల్పించలేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్త చేసింది. ఈమేరకు ఎన్నికల కమిషనర్ను ఉత్తమ్కుమార్రెడ్డి సంప్రదించగా.. ఆయనపై విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక 3 ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి టీఆర్ఎస్కు 10 మంది బలం ఉండగా.. 2 ఎక్స్ అఫీషియో ఓట్లు, సీపీఎం మద్దతుతో కలిపి కాంగ్రెస్ సంఖ్యా బలం 10కి చేరింది. ఇరు పార్టీల సంఖ్యా బలం సమానంగా మారడంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవనుంది. రేపటికి వాయిదా..! సాక్షి సూర్యాపేట : నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియలో హైడ్రామా నడిచింది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావును లోనికి అనుమంతించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ను విరగ్గొట్టారు. చేతిలో ఉన్న పేపర్లను చించేశారు. దీంతో ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కేవీపీకి ఓటు హక్కు కల్పించడం పట్ల అభ్యంతరం తెలిపిన టీఆర్ఎస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కోరింది. తీవ్ర గందరగోళం నేపథ్యంలో చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
ఉత్కంఠ వీడింది; ఆ పార్టీలోకి ఇద్దరు జంప్..!
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్కు మార్గం సుగమమైనట్టు తెలుస్తోంది. మొత్తం 60 డివిజన్లలో 13 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్కు ఎంఐఎం (16) మద్దతు ఇవ్వనుంది. దీంతోపాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఓ కార్పొరేటర్, మరో ఇండిపెండెంట్ కార్పొరేటర్ గులాబీ గూటికి చేరాడు. ఇక ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ బలం 37కి చేరింది. 67 మంది సభ్యుల ఓట్లతో మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్ పదవి దక్కాలంటే ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి సంఖ్యా బలం 34 ఉండాలి. 37 మంది సభ్యులతో గులాబీ పార్టీ ముందు వరుసలో ఉంది. మేయర్ పదవి టీఆర్ఎస్కు, డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎంకు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. మేయర్ పీఠం కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. ఒకరి పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఫైనల్ చేసినట్టు సమాచారం. (చదవండి : నిజామాబాద్ కార్పొరేషన్కు లైన్క్లియర్) ఇదిలాఉండగా... 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పక్షంగా బీజేపీ అవతరించిన్పటికీ సరిపడినంత మెజారిటీ దక్కలేదు. కాంగ్రెస్ రెండు డివిజన్లలో, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలో.. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ తమకు రాలేదని.. టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్అఫీషియా సభ్యులు ఓటింగ్ పరంగా కూడా గులాబీ పార్టీకే ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని ఎంపీ అరవింద్ ఆదివారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణం, 12:30 నుంచి మేయర్ ఎన్నిక ప్రక్రియ, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభ కానుంది. (చదవండి : 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ) -
మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక నేడే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం కొత్త పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. శనివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో విజయఢంకా మోగిం చిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికైనట్లుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మధ్యాహ్నం మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక ఉండనుంది. ఈ ఎన్నిక ముగిశాకే డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోవాలి. ఈ ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలను ఎస్ఈసీ విడుదల చేసింది. మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికపై ఆదివారం ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. సోమవారం తమ సభ్యులకు జారీ చేసిన విప్పై వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించనున్నారు. మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికల నిర్వహణకు గెజిటెడ్ హోదా గల అధికా రిని జిల్లా కలెక్టర్ నియమించారు. ఎన్నికైన సభ్యు లు, ఎక్స్అఫీషియో సభ్యులతో మున్సిపాలిటీ ప్రత్యేక భేటీని నిర్వహిస్తారు. సోమవారం ఉద యం 11 గంటలకు మున్సిపాలిటీల పరిధిలో కౌన్సిలర్లు, కార్పొరేషన్ల పరిధిలో కార్పొరేటర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తారు. తర్వాత వారు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 తర్వాత వీరిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. మున్సిపాలిటీ కౌన్సిల్లోని మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది సమావేశానికి హాజరై ఉంటేనే కోరం ఉందని నిర్ధారించి మేయర్ /చైర్పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ స్థానా లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆపై ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించి, ఎన్నిక ప్రక్రియను ముగిస్తారు. సగం సగం వస్తే లాటరీ.. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలపై ఎస్ఈసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నిక వాయిదా పడితే తమకు సమా చారం ఇవ్వాలని పేర్కొంది. వీరి ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజున ఎన్నిక నిర్వహించాలని సూచించింది. మరుసటి రోజు సెలవు రోజైనప్పటికీ.. పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నిక నిర్వహించాలని, రెండోసారి మధ్యాహ్నం 3 వరకు ఎన్నిక పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు తెలిపింది. రెండోసారీ వాయిదా పడితే మాత్రం మరుసటి ఎన్నిక తేదీ ప్రకటించకుండా ఎస్ఈసీకి నివేదించాలని, దానిపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. మునిసిపల్ చైర్పర్సన్/మేయర్, వైస్చైర్పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పార్టీ విప్కు కట్టుబడే ఓటు వేయాలి. పార్టీ విప్ను ధిక్కరించిన కౌన్సిలర్లు/కార్పొరేటర్లపై అన ర్హత వేటు పడుతుందని ఎస్ఈసీ హెచ్చరించింది. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చైర్పర్సన్/మేయర్, వైస్చైర్పర్సన్/డిప్యూటీ మేయర్ల ఎన్నికల నిర్వహణకు ఈ నెల 16న మున్సిపల్ శాఖ ఉత్తర్వులిచ్చింది. పార్టీ ధ్రువీకరణ తప్పనిసరి.. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కౌన్సిలర్లు/కార్పొరేటర్లలో ఎవరైనా మేయర్/చైర్పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ స్థానాలకు పోటీ చేయాలనుకుంటే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు/ప్రధాన కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. సోమవారం ఉదయం 10లోగా జిల్లా కలెక్టర్ నియమించిన అధికారికి ఈ పత్రాన్ని సమర్పిస్తే వారి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ పదవులకు ఓ సభ్యుడిని మరో సభ్యుడు ప్రతిపాదించగా, ఇంకో సభ్యుడు బలపరిచినా సరిపోనుంది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఓటింగ్ నిర్వహిస్తారు. చేతులెత్తడంద్వారా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని ఎన్నికల అధికారి విజేతగా ప్రకటిస్తారు. మేయర్/చైర్పర్సన్ ఎన్నికలు పూర్తయిన తర్వాతే డిప్యూటీ మేయర్/వైస్చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. విప్ ధిక్కరిస్తే వేటు! గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు తమ పార్టీ విప్ను నియమించి, ఆ ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ నియమించిన ఎన్నికల అధికారికి సోమవారం ఉదయం 11లోగా సమర్పించాలి. విప్గా నియమితులైన వ్యక్తి తమ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులకు విప్ జారీ చేసి, వారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాలి. విప్ స్వీకరించినట్లు సభ్యుల నుంచి తీసుకున్న ధ్రువీ కరణ పత్రాలను విప్గా నియమితులైన వ్యక్తి ఎన్నికల అధికారికి భేటీ ప్రారంభం కావడానికి ముందు ఇవ్వాలి. కౌన్సిల్ సభ్యులు పార్టీ విప్ను ధిక్కరిస్తే అతడి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. తమ సభ్యుడు విప్ ధిక్కరించాడని పేర్కొంటూ ఎన్నికలు జరిగిన 3 రోజుల్లోగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే, సదరు సభ్యుడికి నోటిసులు జారీ చేసి సంజాయిషీ ఇచ్చుకోవడానికి వారం గడువు ఇస్తారు. విప్ను ధిక్కరించినట్టు నిర్ధారిస్తే వివరణ అందిన 2 రోజుల్లోగా అనర్హత వేటు వేస్తారు. వివరణ ఇవ్వకపోతే అనర్హత వేటుకు మార్గం సుగమం అవుతుంది. -
అధిష్టానమే ఫైనల్
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో దుమ్మురేపిన టీఆర్ఎస్.. మేయర్లు, చైర్పర్సన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 106–111 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకెళ్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. స్వయంగా అభ్యర్థుల ఎంపిక కసరత్తును పరిశీలించారు. ఎన్నికల సమన్వయ కమిటీ సహకారంతో ఆదివారమంతా ఇదే పనిలో ఉన్న పార్టీ అధిష్టానం హైదరాబాద్ నుంచే చైర్మన్లు, మేయర్లను ఎంపిక చేయనుంది. అయితే, ఆయా పీఠాల మీద ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపై ఒక్కో పదవికి కనీసం రెండు పేర్ల చొప్పున స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. వీటిని పరిశీలించిన అనంతరం ఉద్యమకారులు, సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు స్థానిక, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా పుర పీఠాధిపతులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణ యించింది. అవసరమైన చోట్ల ఎమ్మెల్యేలు, ఇంచార్జులు ఇచ్చిన పేర్లలో మార్పులను కూడా సూచించింది. ఈ మార్పుల అనంతరం టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలనుకుంటున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధ్యక్ష స్థానాల్లో కూర్చునే వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఒకట్రెండు చోట్ల సమస్య ఉన్న స్థానాలతో సహా సోమవారం ఉదయం ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి అందరి పేర్లను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఇబ్బంది లేని చోట మేయర్, చైర్పర్సన్ అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించనుండగా, సమస్యలున్న చోట్ల పార్టీ అధిష్టానం మార్చిన పేర్లను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నియమించిన ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు తెలియజేయనుంది. ఈ మేరకు వారి పేర్లను సీల్డ్ కవర్లో ఉంచి ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సోమవారం తీసుకెళ్లనున్నారు. ఈ పేర్లను మేయర్లు, చైర్పర్సన్ల ఎంపిక సమావేశంలోనే ఓపెన్ చేసి ప్రతిపాదిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. 120 కైవసం చేసుకోవాల్సిందే.. మున్సి‘పోల్స్’ఫలితాలపై ఆదివారం కసరత్తు చేసిన టీఆర్ఎస్ అధిష్టానం 9 కార్పొరేషన్లతో పాటు 106–111 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో 4 కార్పొరేషన్లు, 86 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్కు ఇప్పటికే మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ స్థానాలు దక్కాయి. మిగిలిన 5 కార్పొరేషన్లతో పాటు 20–25 మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియో సభ్యులు, తిరుగుబాటు చేసి గెలిచిన వారు, స్వతంత్రులుగా నిలబడి విజయం సాధించిన వారి సహకారం తీసుకోనున్నారు. ఈ మేరకు చాలా మంది తిరుగుబాటు, స్వతంత్ర విజేతలు ఆదివారమే టీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే, కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో మాత్రం పార్టీపై తిరుగుబాటు చేసి గెలుపొందిన వారి మద్దతు తీసుకోకూడదని, ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో వాటిని కైవసం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ రెండు చోట్లా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఇక, తాము భావించిన విధంగా మేయర్లు, చైర్మన్ స్థానాలను దక్కించుకునేందుకు ఎంత మంది ఎక్స్అఫీషియో సభ్యులు అవసరమవుతారు? ఎక్కడెక్కడ ఎవరి ఓటు నమోదు చేయించాలనే దానిపై శనివారం రాత్రి నుంచే కేటీఆర్ కసరత్తు చేశారు. టీఆర్ఎస్కు మొత్తం 150 మందికి పైగా ఎక్స్అఫీషియో సభ్యుల బలం ఉండగా, అందులో 70–75 మంది సహకారం అవసరమవుతుందనే అంచనా మేరకు వారి పేర్లను అవసరమైన మున్సిపాలిటీల్లో ఓటర్లుగా నమోదు చేశారు. ఎక్స్అఫీషియో సభ్యుల అవసరం లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పేర్లను నమోదు చేసుకోకూడదని నిర్ణయించారు. ఇబ్బంది ఉన్న చోట్ల స్పెషల్ ఫోకస్... ఇదిలా ఉండగా కొన్నిచోట్ల కాంగ్రెస్, బీజేపీ కలవని పరిస్థితి వస్తే మరో 5 మున్సిపాలిటీలు తమ వశం అవుతాయని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టి పుర పీఠాలను కైవసంచేసుకునేలా కసరత్తు చేస్తోంది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నది అనుకున్న విధంగా ఏర్పాట్లు జరిగిపోవాలని కేటీఆర్ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. మేయర్లు, చైర్మన్లతో పాటు డిప్యూటీ మేయర్లు, వైస్చైర్మన్ల ఎన్నికలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని, అంతా సజావుగా ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ భవన్లో సమీక్ష.. కాగా, సోమవారం జరగనున్న మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికపై కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో సమీక్ష జరిపారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి ఆయన స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. స్వతంత్రుల మద్దతును కూడగట్టడం కోసం ప్రయత్నించాలని, రానున్న నాలుగేళ్లు తామే అధికారంలో ఉంటాం కనుక తమకు మద్దతిస్తే మంచి అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించాలని వారికి సూచించారు. పార్టీ సూచించిన వారికే బీ–ఫారాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. -
మేయర్లు, చైర్ పర్సన్ల ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : పురపాలక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ కార్పోరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైరపర్సన్ల ఎంపికపైన కసరత్తు చేస్తుంది. ఈమేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామరావు, పార్టీ మున్సిపల్ ఎన్నికల సమన్వయ కమిటీతో క్షేత్రస్ధాయి పరిస్ధితులపైన తెలంగాణ భవన్ లో సమీక్షించారు. ఇప్పటికే నూటపదికిపైగా పురపాలికల్లో స్పష్టమైన మేజార్టీ సాధించిన టీఆర్ఎస్ అవకాశం ఉన్న మిగిలిన మున్సిపాలిటీ పీఠాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం స్వతంత్రంగా గెలిచిన అభ్యర్ధులపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే స్ధానిక నాయకత్వం వీరితో మాట్లాడుతూ, పార్టీకి మద్దతు కోరుతుంది. రాబోయే నాలుగు సంత్సరాలపాటు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని, ఈనేపథ్యంలో తమను గెలిపించిన వార్డు ప్రజలకు అభివృద్ది చేసే అవకాశం టీఆర్ఎస్ ద్వారానే లభిస్తుందన్న విషయాన్ని వారికి వివరిస్తున్నారు. ఇప్పటికే తొంబైశాతం మంది ఇండిపెండెట్లు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని స్ధానిక ఎమ్మెల్యేలు పార్టీకి తెలియజేశారు. దీంతోపాటు పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్ అఫీషియో సభ్యుల బలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈమేరకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సాయంత్రం నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా మంత్రులతో స్వయంగా మాట్లాడుతున్నారు. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ, జిల్లా ఇంచార్జీలు సైతం ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. స్ధానికంగా పార్టీకి లభించిన కార్పోరేటర్లు, కౌన్సిలర్ల సంఖ్యతోపాటు, పురపాలక పీఠానికి కావాల్సిన బలం, అవసరం అయిన ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య వంటి అంశాలపైన చర్చిస్తున్నారు. దీంతోపాటు అయా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్ అఫీషియో సభ్యులను స్ధానికంగా ఏ ఏ పురపాలక సంఘాలను ఎంచుకోవాలో పార్టీ సూచిస్తుంది. ముఖ్యంగా ఇతర పార్టీలతో సమానంగా బలం ఉన్నచోట్ల, ఒకటి, రెండు ఓట్లు అవసరం అయిన చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీకున్న ఎక్స్ అఫీషియో బలం వలన ఇలాంటి పురపాలక సంఘాల్లో టీఆర్ఎస్ విజయం ఖాయంగా మారింది. రేపు జరగనున్న మేయర్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. స్ధానిక ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పార్టీకి కనీసం రెండు చొప్పున పేర్లను పంపాల్సిందిగా అదేశించారు. ఈమేరకు ప్రాథమిక జాబితాను సిద్దం చేశారు. జిల్లా ఇంచార్జీలు మున్సిపాలిటీల వారీగా క్రోడీకరించిన జాబితాను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరీశీలించారు. స్ధానిక ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు పంపిన జాబితా నుంచి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, మేయర్లను, డిప్యూటీ మేయర్లను ఎంపిక చేస్తారు. పార్టీ నిర్ణయాన్ని రేపు ఉదయంలోగా స్థానిక నాయకత్వానికి తెలియజేస్తుంది. పార్టీ సూచించిన అభ్యర్ధులకే బిఫారాలు ఇవ్వాల్సి ఉంటుందని పార్టీ స్ధానిక నాయకత్వానికి తెలిపింది. ఈ ఎంపికలో ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, సామాజిక సమీకరణాలు, స్ధానికంగా పార్టీకి అవసరమైన ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
జూపల్లి.. ఇదే సరైన సమయం.. నిర్ణయం తీస్కో!
సాక్షి, కరీంనగర్: ‘తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న జూపల్లి కృష్ణారావు పట్ల టీఆర్ఎస్ కార్యాలయంలో ఎదురైన అవమానం తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి తమతో కలిసి తెలంగాణ కోసం జూపల్లి ఉద్యమించారని, మంత్రి పదవికి రాజీనామా చేసి.. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు తన నియోజకవర్గంలో తానేంటో నిరూపించుకొని.. గెలిచివస్తే.. టీఆర్ఎస్ నేతలు ఆయనను అవమానించడం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. జూపల్లి తన రాజకీయ భవిష్యత్ను నిర్ణయించుకునే సమయమిదేనని, ఇప్పటికైనా టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి ఆయన తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. -
మేం ఓడిపోవడం మంచిదే : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డిలో మేము ఓడిపోవడం మంచిదే.. గెలిస్తే మేము మున్సిపల్ చైర్మన్గా ఏ పనీ చేయలేకపోయేవాళ్లమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చిందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి అనే చర్చే రాలేదని.. కేవలం డబ్బు ప్రభావమే ఉందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చిత్తశుద్ధితో అధికార పార్టీపై పోరాడారని తెలిపారు. కాంగ్రెస్ గెలిచినా, ఓడినా ఎప్పుడూ హీరోనే అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన రాష్ట్ర కాంగ్రెస్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ డబ్బు ప్రభావంతో గెలిచింది మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు పెద్ద గొప్ప కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ‘అధికారంలో ఉన్న పార్టీకి అంగబలం, అర్థబలం అన్నీ ఉంటాయి. కాబట్టి కాబట్టి వాళ్లకు గెలుపు అవకాశాలు ఎక్కువ. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బు ప్రభావంతో గెలిచింది. మా దగ్గర డబ్బు లేదు, కాబట్టి వెనుకబడ్డాం. అంతమాత్రాన కాంగ్రెస్కు ప్రజాదరణ లేదనుకుంటే పొరపాటే. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు 5, 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు’. శభాష్ హరీష్ రావు సంగారెడ్డి కాంగ్రెస్కు కంచుకోట. అలాంటి చోట టీఆర్ఎస్ జెండా ఎగరేసిన మంత్రి హరీష్ రావును అభినందిస్తున్నాను. కేసీఆర్ చెప్పినట్టుగా 100 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసింది. దానికి కృషి చేసిన కేటీఆర్ను కూడా అభినందిస్తున్నా. కానీ ఎన్నికల్లో ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలనే విషయం కేసీఆర్ను చూసి నేర్చుకుంటున్నా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు కేసీఆర్ వైపే ఎందుకు నిలబడుతున్నారనేది కాంగ్రెస్ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంద’ని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. చదవండి: ఫలించిన హరీష్ రావు వ్యూహాలు.. జగ్గారెడ్డికి ఎదురుదెబ్బ -
మేయర్ పీఠం వద్దు.. ప్రతిపక్షంలో ఉంటాం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్పై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదివారం ప్రకటించారు. మేయర్ కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ తమకు రాలేదని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పాటు ఎక్స్అఫీషియా సభ్యులు ఓటింగ్ పరంగా కూడా టీఆర్ఎస్కు ఎక్కువ బలం ఉన్నందున తాము వెనక్కి తగ్గుతున్నామని అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ స్థానం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో గెలుపొంది బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. టీఆర్ఎస్కు 13 స్థానాలు దక్కగా, ఎంఐఎం 16, కాంగ్రెస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి మరో డివిజన్లో గెలుపొందారు. దీంతో మేయర్ పీఠం కోసం ఉన్న అవకాశాలను పరిశీలించిన అరవింద్.. కష్టతరంగా మారటంతో ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడ్డారు. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కార్పొషన్ మేయర్ను కైవసం చేసుకోనున్నాయి. దీని కోసం ఇప్పటికే ఇరుపార్టీల నేతలు మంతనాలు ప్రారంభించాయి. నిజామాబాద్లో మద్దతు ఇస్తే తమకు బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుపడుతున్నట్లు సమాచారం. (టీఆర్ఎస్తో ఎంఐఎం జతకట్టే అవకాశం!) ఆదివారం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలను అడ్డుకుని అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. కేసీఆర్కు దమ్ముంటే సీఏఏను అడ్డుకుని తీరాలని సవాల్ విసిరారు. సీఏఏపై తీర్మానం చేసే హక్కు అసెంబ్లీకి లేదని, పార్లమెంట్ చేసిన చట్టాన్ని అందరూ ఆమోదించి తీరాలని అరవింద్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేశారని, ఆధారాలతో నిరూపిస్తే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, త్వరలోనే టీఆర్ఎస్ భూస్థాపితం కానుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ముగిసిన చరిత్ర అని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి 28 సీట్లు ఇచ్చిన నిజామాబాద్ ప్రజలకు అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. -
ఇందూరు పీఠంపై వీడని ఉత్కంఠ..!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ స్థానం ఎవరికి దక్కుతుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పీఠం దక్కుతుందా.. లేక ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ అధికారం కైవసం చేసుకుంటుందా? అన్న దానిపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బల్దియాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలు ఇందుకు భిన్నంగా వచ్చాయి. టీఆర్ఎస్ ఇక్కడ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో గెలుపొంది బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. టీఆర్ఎస్కు 13 స్థానాలు దక్కగా, ఎంఐఎం 16, కాంగ్రెస్ రెండు, స్వతంత్ర అభ్యర్థి మరో డివిజన్లో గెలుపొందారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మద్దతిస్తే మాకేంటి..? అయితే, టీఆర్ఎస్, ఎంఐఎం (13+16) కలిసి ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో మేయర్ పీఠాన్ని అధికార పార్టీ దక్కించుకోవాలని చూస్తోంది. తమకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శనివారం హైదరాబాద్లో ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణం, 12:30 నుంచి మేయర్ ఎన్నిక ప్రక్రియ, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభ కానుంది. దీంతో మేజిక్ ఫిగర్కు స్వల్ప ఓట్ల తేడాతో నిజామాబాద్ పీఠం ఉత్కంఠ రేపుతోంది.అయితే నిజామాబాద్లో మద్దతు ఇస్తే తమకు బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుపడుతోంది. దీనితో పాటు ఎంఐఎం నుంచి మరికొన్ని ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (షెహర్ కా షేర్) ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతుతో.. జిల్లాలో టీఆర్ఎస్కు ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య అదనపు బలంగా మారింది. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి కూడా కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగే అవకాశం ఉంది. వీరికి తోడు జిల్లా ఎమ్మెల్సీలు వీజీ గౌడ్ (ఎమ్మెల్యే కోటా), ఆకుల లలిత (ఎమ్మెల్యే కోటా), రాజేశ్వర్రావు (గవర్నర్ కోటా) ఉన్నారు. ఎంఐఎం (16) సభ్యులకు తోడు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కలిపితే టీఆర్ఎస్ బలం 35కు చేరుతుంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను టీఆర్ఎస్ గానీ, ఎంఐఎం గానీ కైవసం చేసుకునే వీలుంటుంది. అయితే, మిత్రపక్షాల ఒప్పందంలో మేయర్ పదవి టీఆర్ఎస్కు దక్కుతుందా.. లేక ఎంఐఎంకు ఇస్తారా..? అన్న ఉత్కంఠ నెలకొంది. మేయర్ స్థానం ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్ఎస్కే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పీఠం కోసం బీజేపీ యత్నాలు.. మరోవైపు, బీజేపీ కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై దృష్టి సారించింది. ఇండిపెండెంట్గా విజయం సాధించిన మరాఠి యమునా (బీజేపీ రెబల్), ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కార్పొరేటర్లు బీజేపీతో జతకట్టిన పక్షంలో వీరి బలం 31 (28 +2+1)కు చేరుతుంది. ఎక్స్అఫీషియో సభ్యులుగా స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ ఓటుతో బీజేపీ బలం 32కు చేరుతుంది. అయినా ఎంఐఎం, టీఆర్ఎస్, ఎక్స్అఫీషియో సభ్యుల కంటే తక్కువ ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. అయితే, ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. -
ప్రముఖులకు షాకిచ్చిన మున్సిపల్ ఎన్నికలు..
సాక్షి, వేములవాడ: వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖులు ఓటవి చవిచూశారు. 2014 మొట్టమొదటి మున్సిపల్పై బీజేపీ జెండా ఎగురవేసిన సందర్భంగా అప్పుడు చైర్పర్సన్గా నామాల ఉమ, వైస్ చైర్మన్గా ప్రతాప రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. అనంతరం బీజేపీ నుంచి నామాల ఉమ టీఆర్ఎస్లో చేరిపోయారు. అప్పటి నుంచి టీఆర్ఎస్లోనే కొనసాగారు. అసమ్మతి రాగంలోనూ తన పట్టు నిరూపించుకుని పూర్తిస్థాయి బాధ్యతలు పూర్తిచేశారు. 2019 ఎన్నికల్లో 26వ వార్డు నుంచి పోటీ చేసిన నామాల ఉమ బీజేపీ అభ్యర్థి ముప్పిడి సునంద చేతిలో పరాభవం చవిచూశారు. 2014లో వైస్చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన ప్రతాప రామకృష్ణ (బీజేపీ జిల్లా అధ్యక్షుడు) 2019లో 23వ వార్డు నుంచి పోటీ చేసి మధు రాజేందర్ చేతిలో ఓటమిపొందారు. బీజేపీ దళితమోర్చ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శంకర్, ఆయన సతీమణి కుమ్మరి జ్యోతి ఓటమి చెందారు. మున్సిపల్ చైర్మన్ సీటు జనరల్ మహిళకు రిజర్వు కావడంతో 24వ వార్డు నుంచి ప్రముఖ వ్యాపారవేత్త చీకోటి శ్రీనివాస్ ఆయన సతీమణి అనురాధను పోటీలో దింపారు. స్వతంత్ర అభ్యర్థి అన్నారం ఉమారాణి చేతిలో పరాభవం పొందారు. 12వ వార్డులో ప్రముఖ వ్యాపారి తీగల వెంకటేశ్వర్రావు ఆయన సతీమణి శైలజను పోటీలో నిలిపారు. బీజేపీ అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి చేతిలో ఓడారు. గత పాలకవర్గంలో పని చేసిన పుల్కం శ్రీలక్ష్మి, ముద్రకోల వెంకటేశ్, సూగూరి లక్ష్మి, జంగం రాజేందర్ సతీమణి మఠం సంధ్యారాణి, నామాల వరలక్ష్మి, నూకలమర్రి వసంత ఓటమిపాలయ్యారు. పారిశుధ్య కార్మికురాలి నుంచి ప్రజాప్రతినిధిగా.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న బెక్కం అంజమ్మ అదే మున్సిపాలిటీ పాలకమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ 19వ వార్డు ఎస్సీ రిజర్వు కాగా ఈస్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్ అనూహ్యంగా కేటాయించడంతో ఎన్నికయ్యారు. 322 ఓట్లు సాధించిన అంజమ్మ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నల్లాల అన్నమ్మపై 111 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 23 ఏళ్లకే కౌన్సిలర్ రాయికల్(జగిత్యాల): పట్టణంలోని 7వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనుమల్ల దివ్య 23 ఏళ్లకే కౌన్సిలర్గా గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రాజుబాయిపై 183 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయమే.. 48వ వార్డు అభ్యర్థి దేవేందర్నాయక్ హ్యాట్రిక్ జగిత్యాల: ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయం ఆయన సొంతం. హ్యాట్రిక్ సాధించారు. జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన దేవేందర్నాయక్ షెడ్యూల్ కులాలకు చెందిన దేవేందర్నాయక్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నాడు. అప్పటినుంచి టీఆర్ఎస్ నుంచే గెలుస్తున్నారు. 2005లో 2వ వార్డు ఎస్టీకి రిజర్వుడుకాగా పోటీ చేసి విజయం సాధించాడు. 2014లోనూ 9వ వార్డు ఎస్టీకి రిజర్వుగా పోటీ చేసి గెలిచారు. పునర్విభజన అనంతరం పలు గ్రామాలు మున్సిపాలిటీలో విలీనంకావడంతో ప్రస్తుతం టీఆర్నగర్ 48వ వార్డుకు కేటాయించారు. ఎస్టీకి రిజర్వుకాగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిపై 393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భార్యాభర్తల ఓటమి జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని 17, 18 వార్డుల నుంచి బీజేపీ నుంచి పోటీ చేసిన భార్యాభర్తలు ఓటమిచెందారు. గతంలో బీజేపీ నుంచి వీరు కౌన్సిలర్గా గెలుపొందారు. ప్రస్తుతం 17వ వార్డు నుంచి భార్య అర్వ లక్ష్మీ పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి సిరికొండ పద్మపై ఓటమిపాలయ్యారు. భర్త అర్వ చంద్రశేఖర్రాజు 18వ వార్డునుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చుక్క నవీన్కుమార్పై ఓటమిచెందారు ఇద్దరికి సున్నా..ముగ్గురికి ఒక్కొక్క ఓటు మంథని: మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఒక్కఓటు కూడా పడని అభ్యర్థులు ఇద్దరు ఉండగా కేవలం ఒకేఓటు సాధించిన అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. నాలుగోవార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి కేతిరి రాజయ్య, 8వ వార్డు అభ్యర్థి కొత్త పద్మకు ఓట్లు రాలేదు. అదేవిధంగా 2 వార్డు స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ అయోషా, నాలుగోవార్డులో ఆంగోతు రాజునాయక్, 11 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మంథని రాహుల్కు ఒకేఓటు వచ్చింది. కేంద్రంలో అధికారంలోని బీజేపీ తరఫున పోటీ చేసిన 8 మంది అభ్యర్థులకు 163 ఓట్లు రాగా పార్వర్డ్ బ్లాక్ పార్టీ మూడుస్థానాల్లో పోటీచేయగా మూడోవార్డులో బొడ్డెల తిరుమల 184 ఓట్లు సాధించింది. నాడు సర్పంచులు.. నేడు కౌన్సిలర్లు జమ్మికుంటటౌన్(హుజూరాబాద్): జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇద్దరు మాజీ సర్పంచులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. పురపాలక సంఘం పరిధిలోని మోత్కులగూడెంకు చెందిన పొనగంటి మల్లయ్య 1995 నుంచి 2001 వరకు జమ్మికుంట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా పని చేశారు. ప్రస్తుతం బల్దియా పరిధిలోని 23వ వార్డు (జనరల్) నుంచి పోటీ చేసిన మల్లయ్య 177 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి వాసిఅయిన బొద్దుల అరుణ 2006 నుంచి 2011 వరకు కొత్తపల్లి సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు బల్దియా పోరులో 18వవార్డు (బీసీ మహిళ) నుంచి తలపడిన అరుణ 94 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నాడు తొలి ఎంపీపీగా..నేడు కౌన్సిలర్గా మెట్పల్లి(కోరుట్ల): మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 10వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన బోయినపల్లి చంద్రశేఖర్రావు గతంలో ఎంపీపీగా పనిచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలాల వ్యవస్థను ఏర్పాటు చేసి 1987లో మండల పరిషత్ అధ్యక్ష పదవీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరిపారు. ఆ ఎన్నికల్లో మెట్పల్లి నుంచి టీడీపీ తరఫున చంద్రశేఖర్రావు పోటీచేసి విజయం సాధించారు. మండల తొలి ఎంపీపీగా ఐదేళ్లు పని చేసిన ఆయన ఆ తర్వాత చాలాకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు టీఆర్ఎస్ వైస్చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. చాలాకాలం తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వచ్చిన తనను ఎమ్మెల్యే కీలక పదవీకి ఎంపిక చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ వి‘జయ’శ్రీ జగిత్యాలలోని 35వ వార్డు నుంచి అనుమండ్ల జయశ్రీ ఇండిపెండెంట్గా పోటీ చేసి 82 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఫ్లోర్లీడర్గా కొనసాగారు. ఇటీవల రాజకీయ పరిణామాల్లో భాగంగా టీఆర్ఎస్లో చేరారు. అనూహ్యంగా ఆమెకు టికెట్ దక్కకపోవడంతో రెబల్గా పోటీకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థిపై 82 ఓట్లతో విజయం సాధించారు. ఇది ప్రజా విజయమని ఆమె పేర్కొన్నారు. జయశ్రీ భర్త రఘు ఆమెను ఎత్తుకొని అభినందించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, జగిత్యాల భార్య గెలుపు..భర్త ఓటమి కోరుట్ల: కోరుట్ల మున్సిపాల్టీలోని 10,11వ వార్డుల్లో బీజేపీ తరఫున బరిలో దిగిన భార్యాభర్తలు దాసరి రాజశేఖర్–దాసరి సునీతల్లో ఒకరు గెలిచి మరొకరు ఓటమి పాలుకావడం చిత్రమైన సన్నివేశానికి తెరతీసింది. రెండు వార్డులకు సంబంధించిన కౌంటింగ్ పక్కపక్కనే ఉండడంతో ఇద్దరు ఒకేచోట ఉండి కౌంటింగ్ను పరిశీలించారు. 11వ వార్డులో బీజేపీ తరఫున బరిలో నిలిచిన దాసరి సునీత టీఆర్ఎస్ అభ్యర్థి కస్తూరి వాణిపై 470 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. పదో వార్డులో బీజేపీ అభ్యర్థి దాసరి రాజశేఖర్ టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డమీద పవన్పై 37 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. భార్య దాసరి సునీత గెలుపొందడం..భర్త రాజశేఖర్ ఓటమి పాలుకావడం విశేషం. -
గులాబీ జెండా.. ఓరుగల్లు నిండా !
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉద్యమాల ఖిల్లా.. పోరాటాల జిల్లాలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. తొమ్మిది మున్సిపాలిటీలకు గాను ఎనిమిది చోట్ల భారీ ఆధిక్యతను సాధించింది. ఇక మరిపెడ మున్సిపాలిటీలోనైతే 15 వార్డులకు మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుచుకున్నారు. పరకాల, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట, భూపాలపల్లిలో ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థులు దారిదా పుల్లో లేకుండా పోయారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 19 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ 10, సీపీఐ, సీపీఎం రెండేసి వార్డులను, స్వతంత్రులు మూడు వార్డులను గెలుచుకున్నారు. గులాబీ బ్రహ్మరథం ఓరుగల్లు ఇలాకాలో మరోసారి గులాబీ ప్రభంజనం వీచింది. ఓటెత్తిన జనం మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 9 మున్సిపాలిటీలోŠల్ ఆ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు పట్టం కట్టారు. జనగామ మున్సిపాలిటీ మినహా కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయంది. మొత్తం 200 వార్డులకు 134 వార్డులు టీఆర్ఎస్ గెలుచుకుంటే.. 33 వార్డులకే కాంగ్రెస్ పరిమితమైంది. ఇక బీజేపీ 10 గెలుచుకోగా, ఏఐఎఫ్బీ 4, సీపీఐ 4, సీపీఎం 2 వార్డులు గెలవగా.. 13 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. రోజురోజుకు జిల్లాలో పతనమవుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ 19 వార్డుల నుంచి అభ్యర్థులను దింపగా, ఒక్కరు కూడా గెలుపొందలేదు. జనగామలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను దింపిన డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గట్టి పోటీ ఇవ్వగా, మహబూబాబాద్లోను 10 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. నర్సంపేటలో ఆరు వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్, మిగతా మున్సిపాలిటీల్లో ప్రభావం చూపలేకపోయంది. కాంగ్రెస్ దిగ్గజాలకు ఓటర్లు ఈ ఎన్నికల్లోనూ షాక్ ఇచ్చారు. 135 వరకు వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 10 వార్డుల్లో గెలిచింది. లెక్క తప్పిన జనగామ జనగామ మున్సిపాలిటీ విషయానికొస్తే టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపు నుంచి వివాదాలే చోటు చేసుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా టీఆర్ఎస్ అభ్యర్థులపై రెబల్స్ ఇక్కడి నుంచే పోటీ చేశారు. దీంతో ఇక్కడ 30 వార్డులకు టీఆర్ఎస్ 13 మాత్రమే గెలుచుకోగా, 10 కాంగ్రెస్, 4 బీజేపీలు గెలుచుకున్నాయి. మరో మూడు వార్డుల్లో టీఆర్ఎస్ టికెట్ రాని వారు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్లకు గాలం వేయగా, టీఆర్ఎస్ సైతం ఇతర పార్టీల కౌన్సిలర్లను లాగడంతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. వరుస విజయాలు : అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలను సాధించిన టీఆర్ఎస్... మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. కాగా, ఈనెల 27వ తేదీ సోమవారం న జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగుర వేయనుంది. క్యాంపులకు కౌన్సిలర్లు తొమ్మిది మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం నుంచే కౌంటింగ్ మొదలైంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ఆయా మున్సిపాలిటీల్లో ఆధిక్యత పెరిగి విజయావకాశాలు ఉన్న కౌన్సిలర్లను ఒక చోటకు చేర్చేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇన్చారి్జలను నియమించారు. ఫలితాల వెల్లడయ్యాక ఒక్కో మున్సిపాలిటీకి చెందిన క్యాంపు ఇన్చార్జీలు వారిని నిర్దేశించిన ప్రాంతాలకు తరలించారు. మొత్తం 9 మున్సిపాలిటీల్లో 200 వార్డులకు 18 ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని సైతం కౌంటింగ్ కేంద్రాలకు రప్పించిన పార్టీల నేతలు.. ఫలితాలు వెల్లడి తర్వాత పార్టీల వారీగా క్యాంపులకు తరలించారు. మొత్తం మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడం లక్ష్యంగా టీఆర్ఎస్ క్యాంపులు నిర్వహిస్తుండగా.. మిగతా పార్టీల కౌన్సిలర్లు చెదిరిపోకుండా ఆయా పార్టీల నేతలు కూడా క్యాంపులకు కౌన్సిలర్లను తరలించారు. ఈనెల 27వ తేదీ సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఉండడం.. మధ్యలో ఒక రోజే సమయం ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉండేలా క్యాంపులు ఏర్పాటు చేశారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 9 మున్సిపాలిటీల టీఆర్ఎస్ కౌన్సిలర్లకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జీల పర్యవేక్షణలో హైదరాబాద్, వరంగల్ల్లో రిసార్టులు, ఫంక్షన్ హాల్లు, హోటళ్లలో బస ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక నర్సంపేటకు చెందిన కౌన్సిలర్లు హన్మకొండ అశోక్ హోటల్లోనే ఉన్నట్లు సమాచారం. -
తన ఓటమికి కారణమాయ్యడని కత్తితో దాడి
సాక్షి, మంచిర్యాల : ఓటమి చెందారనే కోపంతో అధికార పార్టీకి చెందిన నాయకుడే అదే పార్టీకి చెందిన మరో నాయకుడిపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్ పరిదిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై ప్రమోద్రెడ్డి కథనం ప్రకారం... నస్పూర్ 2వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుఫున రౌతు రజిత పోటీ చేసింది. ఆమె భర్త శ్రీనివాస్, ఐతే రజిత ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైంది. కౌంటింగ్ పూర్తి అయిన సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత వారు నివాసం ఉంటే సీసీసీ శుభాష్నగర్కు చెందిన మరో టీఆర్ఎస్ నేత అమృతరాజ్కుమార్ తమకు ఎన్నికల్లో సహాయం చేయలేదని కోపంతో రజిత మరిది రౌతు సత్యనారాయణ అతడితో గొడవకు దిగారు. సత్యనారాయణ ముందుగా రాజ్కుమార్ ఇంటికి వెళ్లి మాట్లాడేది ఉందని, బయటికి రమ్మని చెప్పారు. దీంతో రాజ్కుమార్ బయటికి వచ్చిన తరువాత మాట్లాడుతూనే తమకు ఎన్నికల్లో సహకరించకుండా రెబల్ అభ్యర్థికి గెలుపునకు కారణం అయ్యావని, మా వదిన ఓడిపోవడానికి నీవే కారణం అంటూ కత్తితో కడుపులో దాడిచేశాడు. అంతలోనే తేరుకున్న రాజ్కుమార్ అక్కడ ఉన్న వారి సహాయంతో తప్పించుకున్నారు. వెంటనే స్థానికులు అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఓడిన సర్పంచ్లు, సర్పంచ్ల భర్తలు
సాక్షి, చౌటుప్పల్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైతం ఓటమి పాలయ్యారు. నామమాత్రపు రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. మున్సిపాలిటీ ఏర్పాటుకు ముందు చౌటుప్పల్, తంగడపల్లి, లింగోజిగూడెం, లక్కారం, గ్రామాలకు సర్పంచ్లుగా, సర్పంచ్ల భర్తలుగా రాజకీయ తిప్పిన వ్యక్తులు సైతం ఓడిపోవాల్సి వచ్చింది. చౌటుప్పల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పని చేసిన బొంగు లావణ్య భర్త మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య(టీఆర్ఎస్) 19వ వార్డు నుంచి, లింగోజిగూడెం తాజా మాజీ సర్పంచ్ రమనగోని దీపిక భర్త అదే గ్రామ మాజీ సర్పంచ్ రమనగోని శంకర్(బీజేపీ), తంగడపల్లి తాజా మాజీ సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరాచారి(టీఆర్ఎస్), లక్కారం తాజా మాజీ సర్పంచ్ కానుగు యాదమ్మ భర్త కానుగు బాలరాజు(టీఆర్ఎస్), లింగోజిగూడెం మాజీ సర్పంచ్ ఊదరి నర్సింహ్మ(టీఆర్ఎస్) పరాజయం పాలయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలోనే కాకుండా ఎంతో కాలంగా వీరు గెలుస్తారన్న ప్రచారం ఉన్నప్పటికీ అనూహ్య పరిణామాల కారణంగా ఓడిపోయారు. విశేష రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఓటరు తీర్పును అంగీకరించాల్సి వచ్చింది. మోత్కూరు: మోత్కూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి బొల్లెపల్లి వెంకటయ్య నూతనంగా ఏర్పడిన మోత్కూరు మున్సిపాలిటీలో అదే పార్టీనుంచి కౌన్సిలర్గా పోటీ చేసిన గెలుపొందాడు. 8వ వార్డునుంచి అవిశెట్టి అవిలిమల్లు (కాంగ్రెస్)పై వెంకటయ్య 39 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి సానుభూతి ఆయనకు కలిసొచ్చిందంటున్నారు. నాడు ఎంపీటీసీగా ఓడి.. మండల పరిషత్ ఎన్నికల్లో మోత్కూరు –2 ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన గుర్రం కవిత ఓటమి పాలయ్యారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పసల విజ యపై 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ కవితను ప్రకటించగా ఫలితాల్లో టీఆర్ఎస్ అధిక స్థానాలు గెలువడంతో కవిత కౌన్సిలర్గా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. నాడు వార్డు మెంబర్గా.. నేడు కౌన్సిలర్గా విజయం మోత్కూరు గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించి నేడు మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు కౌన్సిలర్గా కారుపోతుల శిరీష (కాంగ్రెస్) గెలుపొందారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో కూడా విజయం సాధించడంతో ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. అన్న గెలుపు.. తమ్ముళ్ల ఓటమి చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కౌన్సిలర్లుగా పోటీ చేశారు. వారిలో ఇద్దరు ఓటమి పాలవ్వగా ఒకరు విజయం సాధించారు. పట్టణ కేంద్రానికి చెందిన సీపీఎం పట్టణ మాజీ కార్యదర్శి బత్తుల శ్రీశైలం అదే పార్టీ నుంచి 19వ వార్డులో పోటీ చేశాడు. తన బాబాయి కుమారులైన బత్తుల వెంకటేశం బీజేపీ తరఫున 20వవార్డు, విప్లవ్కుమార్ 16వ వార్డులో సీపీఎం తరుఫున పోటీ చేశారు. కానీ శ్రీశైలం 19వవార్డులో బీజేపీపై విజయం సాధించగా, వెంకటేశం, విప్లవ్కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. చండూరు: చండూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ఎంపీపీ తొకల వెంకన్నతో పాటు అతని భార్య చంద్రకళ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. వెంకన్న 8వ వార్డు నుంచి బరిలో నిలవగా అయనపై టీఆర్ఎస్ అభ్యర్థి బూతరాజు దశరథ పోటీ చేశారు. దశరథపై తోకల వెంకన్న 49 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అలాగే అతని భార్య చంద్రకళ 10వ వార్డు నుంచి బరిలో నిలువగా ఆమెపై టీఆర్ఎస్ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి పోటీ చేసింది. రాజకుమారిపై చంద్రకళ 240 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఓడిన దంపతులు 1వ వార్డునుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కోడి గిరిబాబు బరిలో నిలిచాడు. టీఆర్ఎస్నుంచి పోటీ చేసిన తన సోదరుడు కోడి వెంకన్నపై గిరిబాబు 223 ఓట్లతో ఓటమిపాలయ్యాడు. అదే విధంగా తన భార్యను చైర్మన్ చేయాలని కోడి గిరిబాబు 7వ వార్డునుంచి భార్య విజయలక్షి్మని కాంగ్రెస్ తరఫున పోటీలో నిలిపాడు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి చిలుకూరి రాధికపై విజయలక్ష్మి 148 ఓట్లతో పరాజయం పాలైంది. ఓడిన తాజా మాజీ కౌన్సిలర్లు, చైర్మన్లు భువనగిరి : గత మున్సిపాలిటీ కాలంలో కౌన్సిలర్లుగా పనిచేసి తిరిగి ఈ నెల 22న జరిగిన ఎన్నికల బరిలో నిలిచి కొందరు ఓటమి పాలయ్యారు. ఇందులో 6వ వార్డు నుంచి కుక్కదూవు లతశ్రీ, 10వ వార్డు నుంచి బట్టుపల్లి అనురాధ, ఇదే వార్డు నుంచి పడమటి జగన్మోహన్రెడ్డి, 20వ వార్డు నుంచి చిట్టిప్రోలు సువర్ణ, 21వ వార్డు నుంచి ఫతే మహ్మద్, 30వ వార్డు నుంచి లయిఖ్ అహ్మద్, ఇదే వార్డు నుంచి షఫిక్ అహ్మద్ ఉన్నారు. ఓడిన మాజీ చైర్మన్లు వివిధ పాలకవర్గాల్లో చైర్మన్లుగా ఎన్నికై ప్రస్తుతం కౌన్సిర్లుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇందులో 35వ వార్డు నుంచి నువ్వుల ప్రసన్న, 8వ వార్డునుంచి బర్రె జహంగీర్, 25వ వార్డునుంచి కొల్పుల కమలాకర్, 28వ వార్డు నుంచి సుర్వి లావణ్య, 9వ వార్డు నుంచి దోనకొండ వనిత ఉన్నారు. -
లాటరీలో వరించిన విజయం..
సాక్షి, మోత్కూరు : భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన మోత్కూరు మున్సిపాటిటీ ఓట్ల లెక్కింపులో 7వ వార్డు ఫలితం తీవ్ర ఉత్కంఠను రేపింది. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 6 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్కు వచ్చాయి. 7వ వార్డు ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చి టై అయ్యింది. 7వ వార్డులో అత్యధికంగా 8మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నాగార్జునరెడ్డి మధ్యే పోటీ జరిగింది. 1,104 ఓట్లకు గాను 1,001 ఓట్లు పోలయ్యాయి. అందులో ఒక పోస్టల్ బ్యాలెట్, 2 ఓట్లు నోటాకు పోలయ్యా యి. లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సావిత్రికి 378 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నాగార్జునరెడ్డికి 377 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు కాంగ్రెస్కు పడటంతో ఇద్దరికి సమానంగా 378 ఓట్లు రావడంతో టై అయ్యింది. దీంతో అభ్యర్థులు మళ్లీ కౌంటింగ్ చేయాలని కోరడంతో అధికారులు లెక్కించగా అవే ఓట్లు వచ్చాయి. సుమారు రెండు గంటలకు పైగా ఫలితం ఎటూ తేలకపోవడంతో కౌంటింగ్ హాల్ లోపల ఉన్న అభ్యర్థులతో పాటు బయట ఉన్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. చివరికి అధికారులు లాటరీ పద్ధతి ద్వారా విజేతను ప్రకటించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు అంగీకరించారు. దీంతో ఒక్కో అభ్యర్థి పేరుతో 5 చీటీలు మొత్తం 10 చీటీలు రాసి లాటరీ తీశారు. లాటరీలో తీపిరెడ్డి సావిత్రి పేరు రావడంతో అధికారులు ఆమెను విజేతగా ప్రకటించారు. -
ఒక్క ఓటు, మూడు ఓట్లతో లక్కీవీరులు..
సాక్షి, నారాయణపేట: ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న మాటను ఈ సంఘటన నిజం చేస్తున్నట్లుంది. మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసి ప్రత్యర్థికన్నా ఒక్కటంటే ఒక్కటే ఓటు ఎక్కువ రావడంతో విజయం వరించింది. నారాయణపేట మున్సిపాలిటీలోని 7వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్సలీం సమీప అభ్యర్థి చలపతిపై ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించి లక్కీ వీరుడుగా నిలిచారు. బీజేపీ అభ్యర్థికి 310 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సలీంకు 311ఓట్లు వచ్చాయి. ఒక ఓటుతో గెలుపొందారని అధికారులు వెల్లడించారు. బీజేపీ వారు పట్టుబట్టడంతో అధికారులు రీకౌంటింగ్ చేశారు. సలీంకు ఒక్క ఓటు అధికంగా రావడంతో ధ్రువీకరించి సరి్టఫికెట్ను అందజేశారు. ఈ సందర్భంగా మహ్మద్సలీం మాట్లాడుతూ కౌన్సిలర్గా గెలవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దొంగఓట్లు వేయడాన్ని తాను అడ్డుకోవడం వల్లే గెలుపు సాధ్యమైందని చెప్పారు. మూడు ఓట్లతో గెలుపు శాంతినగర్ (అలంపూర్): వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 7వ వార్డు అభ్యర్థి ఎన్.అజయ్కుమార్ మూడంటే.. మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేదవతికి 358 ఓట్లు రాగా.. అజయ్కుమార్కు 361ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేదవతి ఓట్లు రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరింది. అభ్యర్థి కోరిక మేరకు రెండో పర్యాయం అధికారులు ఓట్లు లెక్కించారు. రెండోసారి లెక్కించినప్పటికి 3 ఓట్లు ఆధిక్యత లభించడంతో అజయ్కుమార్ను విజేతగా అధికారులు ప్రకటించారు. -
ఎందుకీ ఓటమి?
-
భవిష్యత్తులో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం
-
హామీలు నెరవేరుస్తాం
-
మహబూబ్నగర్లో కారు స్పీడు తగ్గింది..
సాక్షి, మహబూబ్నగర్: వరుస ఎన్నికల్లో గెలుపుతో ఫుల్ జోష్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి పుర ఫలితాలు కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చాయనే చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లాలోని 17మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉన్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పుర ఫలితాలతో సంతృప్తిగా లేరని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో కేవలం ఎనిమిదింటిలోనే ఆ పార్టీ సంపూర్ణ మెజారీటీ సాధించింది. మిగిలిన స్థానాల్లో ఇతర పారీ్టలు, అభ్యర్థుల మద్దతు తీసుకుని పుర పీఠాల కోసం ప్రయతి్నస్తోంది. శనివారం ఉదయం 8గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 11గంటలకే పది వార్డులు కలిగిన ‘పుర’ ఫలితాలు వెలువడ్డాయి. 40 వార్డుల లోపు ఉన్న వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ఫలితాలు సాయంత్రం 4 గంటలకు వచ్చాయి. కాగా 49 వార్డులున్న మహబూబ్నగర్ పుర ఫలితాలు రాత్రి 9 గంటలకు వెలువడ్డాయి. మహబూబ్నగర్ పట్టణంలో టీఆర్ఎస్ 30, కాంగ్రెస్ 5, బీజేపీ 5, ఎంఐఎం 3, ఇతరులు ఆరింటిలో విజయం సాధించారు. వనపర్తిలో 33 వార్డులకు 21 వార్డులతో టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించి.. పుర పీఠాన్ని కైవసం చేసుకుంది. కొత్తకోటలో 15 వార్డులకు పది వార్డులు, ఆత్మకూరులో పది వార్డులకు ఆరు, నాగర్కర్నూల్లో 24 వార్డులకు 14, గద్వాలలో 37 వార్డులకు 19, అలంపూర్లో పది వార్డులకు ఏడు స్ధానాలతో గెలుపొందింది. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22వార్డులుండగా.. టీఆర్ఎస్ అభ్యర్థులు పది స్థానాల నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏడు స్థానాల్లో, నాలుగు చోట్ల స్వతంత్రులుగా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్స్, ఒక చోట బీజేపీ అభ్యర్ధి గెలిచాడు. దీంతో ఫలితాలు వెలువడ్డ గంటన్నర లోపే పట్టణానికి చేరుకున్న ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రెబెల్స్కు గులాబీ కండువా కప్పారు. దీంతో పుర పీఠం కైవసం చేసుకునేలా ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. శనివారం సాయంత్రమే టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్ధి ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పది వార్డులున్నాయి. వీటిలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నాలుగు చొప్పున, కాంగ్రెస్ అభ్యర్థులు రెండు స్థానాలు గెలుచుకున్నారు. దీంతో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లను బీజేపీ క్యాంపునకు తరలించింది. పది వార్డులు ఉన్న అమరచింత మున్సిపాలిటీలోనూ ఏ పారీ్టకి మెజారిటీ రాలేదు. అక్కడ టీఆర్ఎస్ 3, సీపీఎం 2, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐల నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యరి్థగా గెలుపొందిన రాజŒ కుమార్కు గులాబీ కండువా కప్పిన ఆ పారీ్ట.. ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో మంతనాలు ప్రారంభించారు. రంగంలో దిగిన అమరచింత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేందర్సింగ్ సీపీఎం అభ్యర్థులిద్దరినీ మక్తల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి వారితో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీపీఎం అభ్యర్థుల్లో ఒకరికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేటీఆర్ కోర్టులో కొల్లాపూర్ బంతి.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ వెల్లడైన కొల్లాపూర్ పుర ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వర్గపోరు ఆది నుండే ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన వర్గీయులకు టీఆర్ఎస్ నుంచి టికెట్లు ఇప్పించుకోవడంలో విఫలమైన జూపల్లి వారిని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో దింపారు. దీంతో జూపల్లి వర్గాన్ని ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ సైతం శక్తివంచనా లేకుండా ప్రచా రం నిర్వహించింది. హోరాహోరీగా కొనసాగిన పోరులో జూపల్లి వర్గీయులు పదలకొండు స్థానాల్లో స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎక్స్అఫీయో ఓట్లతో గట్టెక్కాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలిచిన తొమ్మిది మందిని తీసుకుని క్యాంపునకు తరలించాలని సూచించడంతో.. వారికి క్యాంప్నకు తీసుకెళ్లారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ తన వర్గీయులకు గాలం వేస్తుందని భావించిన జూపల్లి ఫలితాలకు ఒక రోజు ముందే క్యాంపునకు తరలించడం విశేషం. ‘పేట’లో గట్టెక్కిన గులాబీ.. నారాయణపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పారీ్టకి బీజేపీ ముచ్చెమటలు పట్టిచ్చింది. 24 వార్డులు ఉన్న పట్టణంలో టీఆర్ఎస్ పది స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 2, బీజేపీ 9, ఎంఐఎం 1, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇద్దరు స్వతంత్రులను కలుపుకుని పుర పీఠంపై పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తొమ్మిదో వార్డు నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్ధి మహేశ్ను టీఆర్ఎస్లో చేరి్పంచుకున్నారు. 23వ వార్డు నుంచి గెలిచిన ఎంఐఎం అభ్యర్థి తఖీచాంద్ మద్దతు కూడగట్టుకున్నారు. దీంతో టీఆర్ఎస్కు 12 సంఖ్యాబలం వచ్చింది. దీంతో ఎమ్మెల్యే తన ఎక్స్అఫీíÙయో ఓటును వేసి పేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయడం దాదాపు ఖరారైంది. అయిజ మున్సిపాలిటీలో మారుతోన్న రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. 20 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ రెబెల్స్ పది మంది గెలుపొందారు. దీంతో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను కర్నూలులో తన వద్దకు పిలిపించుకున్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం.. కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుతో పాటు ఎక్స్అఫీíÙయో కింద తన ఓటునూ వేసి మున్సిపాలిటీపై పాగా వేసేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. 49స్థానాలతో సరి.. లోక్సభ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో పుంజుకున్న బీజేపీ 338 వార్డులకు కేవలం 49 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో మక్తల్, నారాయణపేట, భూత్పూర్, ఆత్మకూరు, అమరచింత, గద్వాల, మహబూబ్నగర్ మున్సిపాలిటీల్లో కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీ 5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. 16 వార్డులు కలిగిన మక్తల్ మున్సిపాలిటీలో 8 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ రెండు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల సహకారంతో పురపీఠాన్ని కైవసం చేసుకోనుంది. ఇటు నారాయణపేటలోనూ బీజేపీకి ఆఖరి నిమిషంలో పుర పీఠం చేజారింది. అక్కడ 24 వార్డులుంటే టీఆర్ఎస్ పది, బీజేపీ 9 వార్డులు దక్కాయి. ఇద్దరు స్వతంత్రులు, మరో ఇద్దరు కాంగ్రెస్, ఒక ఎంఐఎం సభ్యులతో పుర పీఠం కైవసానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. చివరి క్షణంలో రంగంలో దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో కింద తన ఓటు హక్కును వినియోగించుకుని ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మక్తల్లో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు వేర్వేరుగా క్యాంపునకు తరలివెళ్లారు. అక్కడ 16 వార్డులు ఉంటే.. టీఆర్ఎస్ 5, బీజేపీ 8స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ రెండు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. దీంతో అవసరమైతే టీఆర్ఎస్ కాంగ్రెస్, ఇండిపెండెంట్ల సహకారంతో పాటు ఎమ్మెల్యే ఎక్స్అఫిఫియో ఓటుతో గట్టెక్కే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో గెలిచిన తమ అభ్యర్థులకు గాలం వేయకుండా ఇరుపారీ్టలు ముందస్తు జాగ్రత్తగా క్యాంపు బాటపట్టాయి. -
షెహర్ కా షేర్
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీకి పట్టణ వాసులు అండగా నిలిచారు. బల్దియా ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించారు. శనివారం వెలువడిన 9 నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల్లో నాలుగు నగర పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్, మీర్పేట, బడంగ్పేటలో మేయర్ గద్దెకు సరిపడా సంఖ్యా బలానికి చేరుకోవడంలో టీఆర్ఎస్ చతికిలపడింది. బండ్లగూడ, నిజాంపేట, జవహర్నగర్, పీర్జాదిగూడలో ఏకపక్ష ఫలితాలు రాగా.. బోడుప్పల్లో మేజిక్ ఫిగర్కు రెండు స్థానాల దూరంలో, రామగుండంలో ఆరు స్థానాల దూరంలో నిలిచింది. అయితే, ఇక్కడ గెలిచిన ఇండిపెండెంట్లలో తిరుగుబాటు అభ్యర్థులే ఎక్కువగా ఉండటంతో ఆయా పీఠాలను దక్కించుకోవడం టీఆర్ఎస్కు పెద్దగా కష్టం కాకపోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 316 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. ఇందులో 152 కార్పొరేటర్ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. 41 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 63 డివిజన్లలో విజయబావుటా ఎగురవేసి రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం పార్టీ 17 స్థానాలను గెలుచుకొని ఔరా అనిపించింది. 43 డివిజన్లు ఇతరుల ఖాతాల్లో పడ్డాయి. ఇందూరులో బీజేపీ రెపరెపలు.. ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ ఇందూరు నగర పాలక సంస్థలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ ఏకంగా 28 డివిజన్లలో విజయం సాధించింది. కార్పొరేషన్ను కైవసం చేసుకునేందుకు ముగ్గురు సభ్యుల బలం తగ్గింది. అయితే, ఇక్కడ టీఆర్ఎస్కు 13 డివిజన్లే దక్కగా.. ఎంఐఎం 17 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇందులో ఈ పార్టీలు గనుక కలిస్తే.. బీజేపీకి మేయర్ పీఠం దూరమైనట్లే. ఇక కాంగ్రెస్ నిరాశాజనక ఫలితాలనే నమోదు చేసింది. కేవలం 2 రెండు స్థానా లతోనే సరిపెట్టుకుంది. బీజేపీతో జతకలిస్తే.. ఎక్స్ అఫీషియో సభ్యుల బలాబలాలపై విజయం ఆధారపడి ఉంటుంది. మీర్పేట, బడంగ్పేటలో పోటాపోటీ.. రాజధాని శివార్లలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. మీర్పేట, బడంగ్పేటలో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇవ్వకపోవడంతో క్యాంపు రాజకీయాలకు అవకాశమిచ్చారు. శాసనసభ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించిన కాంగ్రెస్.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరడంతో చతికిలపడింది. బడా లీడర్లు కారెక్కగా.. చోటామోటా నాయకులు టీఆర్ఎస్ వ్యూహాలను తట్టుకోలేకపోయారు. బడంగ్పేటలో మొత్తం 28 డివిజన్లుండగా.. ఇందులో 12 స్థానాలు టీఆర్ఎస్, కాంగ్రెస్ 7, బీజేపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. ఒక చోట ఇతరులు గెలిచారు. మేయర్ పోస్టు దక్కించుకోవాలంటే పొత్తులు, ఫిరాయింపులు అనివార్యం. మీర్పేటలోనూ హంగ్ ఏర్పడింది. ఇక్కడ 46 స్థానాలకుగాను టీఆర్ఎస్ 19, బీజేపీ 16, బీజేపీ 3, ఇతరులు 8 చోట్ల గెలిచారు. నగర పీఠం చేజిక్కించుకునేందుకు 24 స్థానాలు కావాల్సిఉంది. నయా బస్తీ.. గులాబీ దస్తీ! పురపోరులో గులాబీ సత్తా చాటింది. కొత్త మున్సిపాలిటీల్లో తిరుగులేని ఆధిక్యతను సాధించింది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచి.. పల్లె అయినా.. పట్టణమైనా తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. పురపాలికగా మారిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగిన 67 మున్సిపాలిటీల్లో దాదాపు 50 చోట్ల చైర్మన్ పీఠం దక్కించుకునే స్థాయిలో సంఖ్యాబలాన్ని సాధించింది. సుమారు 10 చోట్ల హంగ్ ఏర్పడినా, ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో విపక్షాలను గెలుపు నుంచి దూరం చేసే అవకాశం లేకపోలేదు. 5 పురపాలికలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోగా.. 2 మున్సిపాలిటీల్లో కమలం వికసించింది. పట్టణీకరణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మేజర్ గ్రామపంచాయతీలు, వాటి చేరువలోని పల్లెలను కలుపుతూ మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన మున్సి‘పోల్స్’లో గులాబీ ఆఖండ విజయం సాధించింది. -
కాంగ్రెస్ ‘కుదేలు’
సాక్షి, హైదరాబాద్ : పురపోరు కాంగ్రెస్ పార్టీకి నిరాశే మిగిల్చింది. పట్టణ ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉందనే అంచనాతో మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి మరో సారి పరాభవమే ఎదురైంది. 120 మున్సిపాలిటీలకు గాను ఏడు చోట్ల మాత్రమే చైర్మన్ స్థానాలను దక్కించుకునే స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లు గెలుపొందింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 శాతం స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, ఒక్క మున్సిపల్ కార్పొరేషన్లో కూడా చెప్పుకోదగినన్ని సీట్లు సాధించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లలో బీజేపీ కన్నా వెనుకబడటం గమనార్హం. ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు పలువురు ముఖ్యులు ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రయత్నించినా ఫలితం రాక కుదేలయింది. బీజేపీ దెబ్బకు ప్రతిపక్ష పార్టీల ఓట్లలో వచ్చిన చీలికతో కాంగ్రెస్ పార్టీ కంగుతిందని మున్సిపోల్స్ రిజల్ట్స్ చెపుతున్నాయి. ముగ్గురు ఎంపీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్సభ పరిధిలో మాత్రమే మెరుగైన ఫలితాలొచ్చాయి. కాంగ్రెస్ గెలిచిన 6 మున్సిపాలిటీల్లో 4 ఈ లోక్సభ పరిధిలోనే ఉండగా, మరో 3 చోట్ల గట్టిపోటీ ఇచ్చింది. స్థానాల వారీగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ గెలిచిన 7 స్థానాలతో పాటు మరో 20 చోట్ల మాత్రమే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వగలిగింది. పెద్దఅంబర్పేట, తుర్కయాంజాల్, ఆదిభట్ల, చండూరు, నేరేడుచర్ల, వడ్డేపల్లి, నారాయణ్ఖేడ్ మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ స్థానాలు సాధించి గెలుపొందింది. కొన్ని స్థానాల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికొస్తే ఇండిపెండెంట్ల కన్నా తక్కువ స్థానాలతో నాలుగో స్థానానికి పడిపోయింది. నిజాం పేట కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలుపొందకపోవడం విశేషం. ఇక, ఇతర పార్టీలు స్వతంత్రులతో కలిస్తే మూడునాలుగు స్థానాలు పురపీఠాలు దక్కించుకునే అవకాశముండగా, భూత్పూరులో కాంగ్రెస్ మద్దతిస్తే బీజేపీకి చైర్మన్గిరి దక్కే అవకాశాలున్నాయి. పలుచోట్ల తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి నష్టపోయింది. కాగా, పోల్ మేనేజ్మెంట్లో తమ పార్టీ అభ్యర్థులకు సరైన సహకారం లభించలేదని, ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను శక్తిమేరా ఎదుర్కోగలిగామని సర్దిచెప్పుకుంటున్నారు. ముఖ్య నేతలకు కూడా ఎక్కువ మున్సిపాలిటీల్లో ప్రచారం చేయాల్సి రావడంతో కొన్ని చోట్ల సరైన సమయం ఇవ్వలేకపోయారని, ఎమ్మెల్యేల కూడా లేకపోవడంతో చాలా చోట్ల పట్టించుకున్న వారు లేరని, అయినా తాము 500కు పైగా స్థానాలు సాధించడం చిన్న విషయమేమీ కాదని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. -
120 గెలుస్తం
సాక్షి, హైదరాబాద్ : ‘మేం 100 పైగా పురపాలికలు గెలిచినం. ఎక్స్అఫీషియో ఓట్లతో ఈ సంఖ్య 115 నుంచి 120 వరకు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ వాళ్లు తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు (ఎక్స్అఫీషియో) ఓట్లు వేసే అవకాశముంది. దీంతో 115 నుంచి 120 పురపాలికలు గెలిచే ఆస్కారం ఉంది. అన్ని చోట్లా పోయి మేం రిగ్గింగ్ చేస్తమా? అన్ని చోట్లా వెళ్లి మేము దొంగ ఓట్లు వేస్తమా? ప్రతి చోటా మేం కుమ్మక్కయితమా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న చోట్లలో కూడా చాలా చోట్ల గెలిచినం.. మా ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని చోట్లలో ఒకటీఅరా ఓడిపోయినం కదా? దాన్నేం అంటరు’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత శనివారం ఆయన తెలంగాణభవన్లో పార్టీ నేతలతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ఈ వేవ్ ఎప్పుడూ చూడలేదు.. ‘ఆ అవాకులు చవాకులు మానేసి ప్రజా తీర్పును గౌరవించే సంస్కారాన్ని అలవర్చుకోవాలి. ఫలితాలొచ్చాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యం విలువ కోల్పోతుంది. వీళ్ల పిచ్చికూతలేవీ పట్టించుకోవద్దని ప్రజలు మాకు సందేశమిచ్చిన్రు. కాబట్టి వీ డొంట్ స్టాప్ అవర్ మిషన్. నా అనుభవంలో చాలా వేవ్లు చూసిన. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ వేవ్ చూసిన. ఈ వేవ్ నేనెప్పుడూ చూడలేదు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీరాజ్ ఎన్నికలు కావొచ్చు.. ఏడాది తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు.. ఇంత స్థిరమైన వేవ్ ఒకపార్టీ పట్ల, ఒక నాయకత్వం పట్ల కొనసాగడం సాధారణ విషయం కాదు. ఈ విజయాన్ని శిరోధార్యంగా తీసుకుంటం. గుండెల్లో పెట్టుకుంటం. మా కర్తవ్యాన్ని, బాధ్యతను ఈ విజయం మరింత పెచింది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు గర్వం, అహంకారం రావొద్దు’అని పేర్కొన్నారు. మా విధానాలు నచ్చాయి.. ‘మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఈ జిల్లా.. ఆ జిల్లా అనే తారతమ్యం లేకుండా 360 డిగ్రీల్లో ఒకే విధమైన ఫలితాన్ని ఇచ్చారు. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, విధానాలపై అనేక చర్చోపచర్చలు, వాదోపవాదాల తర్వాత అద్భుతంగా బలపర్చారు. మాపట్ల వారి విశ్వాసాన్ని తెలిపారు. ఇతరులు ఏమీ మాట్లాడినా పట్టించుకోకండి.. మీరు నిర్దేశించుకున్న లక్ష్యం వైపు కొనసాగండని వారు మమ్మల్ని ఆదేశిచ్చినట్లు భావిస్తునాం. మేం అవలంభించే 100 శాతంలౌకికవాద విధానం, అన్ని మతాలు, కులాల పట్ల సమాదరణ, అందరినీ కలుపుకొని పోయే పద్ధతి ప్రజలకు బాగా నచ్చిందని ఈ ఫలితాలు సందేశమిచ్చాయి. ఈ రోజు ఇంత బలమైన తీర్పునిచ్చి వెన్నుతట్టి మమ్మల్ని ముందుకు నడుపుతున్న తెలంగాణ ప్రజానీకానికి వ్యక్తిగతంగా నా పక్షాన, పార్టీ తరఫున శిరస్సు వంచి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నా. గెలిచిన విజేతలందరికీ అభినందలు. గెలుపు కోసం అహోరాత్రులు పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు. గెలుపు కోసం తమ ప్రాంతంలోనైనా, ఇతర ప్రాంతానికైన వెళ్లి అద్భుతంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి పార్టీ నేతలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్కు నా ఆశీస్సులు’అని కేసీఆర్ చెప్పారు. ఇది అసాధారణ విజయం.. ‘డిసెంబర్లో నేను శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు అనేక అనుమానాలు వెలిబుచ్చారు. కానీ, కరాంఖండిగా 93 నుంచి 102 స్థానాలు గెలుస్తామని చెప్పినం. 88 సీట్లను గెలవడం అద్భుతమైన సంకేతం. ఇటీవల గెచిన హుజూర్నగర్తో కలిపి సొంతంగా 89 స్థానాలు గెలుచుకున్నం. శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయం వచ్చింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా మాకు మెజారిటీ స్థానాలొచ్చినయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 32కి 32 జిల్లా పరిషత్లను టీఆర్ఎస్ గెలుచుకోవడం భారతదేశ చరిత్రలో ప్రథమం. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలను ఆపాలని విశ్వప్రయత్నం చేసిన్రు. ఎన్నికల ప్రక్రియ ముగిస్తే పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రజలిచ్చిన సమయాన్ని వినియోగించుకోవచ్చని మేమనుకుంటే.. అనేక రకాలుగా కోర్టుల చుట్టూ తిప్పి ఎన్నికలు జరగకుండా చేయాలని చూసిన్రు. అన్ని అవాంతరాల తర్వాత ఎన్నికలు జరిగినా ప్రజలు మాత్రం ముక్తకంఠంతో అద్భుత తీర్పు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో విభిన్న సమూహాల ఓటర్లుంటారు. సాధారణంగా ఇలాంటి ఫలితాలు రావు. చాలా కష్టంతో కూడిన పని. నాకున్న 40–45 ఏళ్ల అనుభవంలో దాదాపు అనేక మున్సిపల్ ఎన్నికలను నేను చూసిన. 1994లో అన్నగారు రామారావుతో పాటు నేను టీడీపీలో పనిచేస్తున్న. మధ్య నిషేధం ప్రకటిస్తే ప్రజలు మమ్మల్ని బ్రహ్మండంగా గెలిపించిన్రు. మద్య నిషేధంతో ప్రభుత్వంపై రూ.వేల కోట్ల భారం పడింది. విధి లేక సేల్స్ ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది. ఆ వెంటనే ఎన్నికలు పెడితే ట్యాక్స్ పెంచారనే కోపంతో ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారు. రాజీవ్ గాంధీ మరణించినప్పుడు కూడా నేను అప్పుడు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట మున్సిపాలిటీలో మెజారిటీ సంపాదించుకున్న. కానీ, పన్నులు పెంచినప్పుడు 5 వేల మెజారిటీతో మున్సిపాలిటీ ఓడిపోయిన’అని కేసీఆర్ వివరించారు. ప్రజలు అమ్ముడుపోయిన్రు అంటే మళ్లీ శిక్షిస్తరు.. ‘టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం అని.. ప్రజలు నవ్వుతరనే సిగ్గు లేకుండా నిన్నమొన్న కొందరు మాట్లాడిన్రు. నేనైతే ప్రచారినికీ పోలేదు. మంత్రులూ ఎవరి జిల్లాలకు వారు పరిమితమైన్రు. మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ కూడా ఎక్కడికీ వెళ్లలేదు. నేను నిజాయతీగా చెబుతున్న.. మొదటి నుంచి ఒక క్రమశిక్షణలో బతికినోళ్లం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూడా నేను ప్రగతి భవన్లోని నా కార్యాలయానికి కూడా వెళ్లలేదు. ఒక్క జిల్లా కలెక్టర్తో కూడా ఫోన్లో మాట్లాడలేదు. ఒక ప్రభుత్వ కార్యదర్శితో మాట్లాడలేదు. ఈ ఎన్నికల్లో అయితే ఎవరికీ ఫోనే చేయలేదు. ఎప్పుడో ఒకసారి 10 మంది మా పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి నాకు వచ్చిన సర్వే రిపోర్టులు మీకు పంపుతున్న.. చూసుకోండి అని చెప్పిన. అంతకు మించి నేనేమీ చెప్పలేదు. ఒక పోలీసు అధికారి, డీజీపీ, సీఎస్, కనీసం ఒక జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా ఫోన్ చేయలేదు. నేనెక్కడ అధికారిక దుర్వినియోగం చేశాను. రూ.వేల కోట్లు మేం ఖర్చు చేసినమంటరు. చూపెడ్తరా ఎక్కడ ఖర్చు చేసినం? టీఆర్ఎస్ పార్టీని, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాటలంటరా? రూ.వేల కోట్లకు తెలంగాణ ప్రజలు అమ్ముడుపోయిన్రని చెప్పడం మీ ఉద్దేశమా? ఇది ప్రజలను అవమానించడం కాదా? మీరు గెలిచిన మున్సిపాలిటీలను అదే పద్ధతిలో గెలిచిన్రా? దానికి ఏం సమాధానం చెప్తరు? ప్రజలు మిమ్మల్ని తిరేగేసి తొక్కి పడేస్తున్నరు. అయినా మేము అదే పద్ధతిలో మాట్లాడుతం అంటే మేం చేసేది ఏంలేదు. వారి ఖర్మ. ప్రజలు అమ్ముడుపోయిన్రు అంటే వారు మళ్లీ మిమ్మల్ని శిక్షిస్తరు’అని విపక్షాలను కేసీఆర్ మందలించారు. రాక్షసుల్లా పనిచేస్తాం.. ‘ఎన్నికలంటే మాకు తెలంగాణ రాజకీయాలు, రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం. ఇతర పార్టీలకు రాజకీయ ఆట. మాకు ఇది స్పష్టమైన కార్యం. దీనిని మేము ఆటలాగా తీసుకోం. కార్యం లాగా తీసుకుంటం. కార్యం ఎత్తుకున్నమంటే రాక్షసుల్లాగా పనిచేస్తం. ఇదే తెలంగాణ భవన్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంగ్, పార్టీ సాధారణ కార్యదర్శులు, జిల్లా ఇన్చార్జీలైన 9 మంది, క్షేత్ర స్థాయిలో పనిచేసిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అందరూ పనిచేసినరు కాబట్టి ఈ ఫలితం వచ్చింది.’అని స్పస్టం చేశారు. ప్రతిపక్షాల నోటికి మొక్కాలె ‘ప్రతిపక్షాల నోటికి మొక్కాలె. కొన్ని కుక్కలైతే నిరంతరంగా మొరిగే కుక్కలు. అవి ఈ ఎన్నికల్లో కూడా బహుళంగానే మొరిగినయి. ఏ మాట్లాడతరో ఏందో. అర్థం తాత్పర్యం ఉండదు. హద్దు అదుపు లేదు. ఒకడైతే సీఎం ముక్కు కొస్తా అంటడు. వారు జాతీయ పార్టీకి చెందిన వారు. వారి సంస్కారానికి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినట్టు చెంప ఛెల్లుమనిపించినట్టు దెబ్బ కొట్టిన్రు. ఇది మాములు దెబ్బకాదు. కుసంస్కారంగా, దుర్మార్గంగా, వ్యక్తిగతమైన నిందారోపణలతో ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నాయకులను దూషించడంప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని మనకు స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో కూడా చాలా దుర్మార్గమైన, నీచాతినీచమైన దుష్ప్రచారాలు చేశారు. అదేం సోషల్ మీడియానో నాకు అర్థం కాదు. అది సోషల్ మీడియానా? యాంటి సోషల్ మీడియానా? దాన్ని (కేంద్ర) ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుందో ఆలోచన చేయాలి. దీనిని అరికట్టడానికి ఏం చేయాలో మేమూ ఆలోచన చేస్తం. ఇప్పటిదాక సహించినం కానీ, రేపటి నుంచి చాలా కఠినంగా ఉంటాం. వారు ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలు బంద్ చేయకపోతే కొండ మీద గోపీ అయినా చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ దుష్ట సంస్కృతి ప్రబలడం మంచిది కాదు. ఇప్పటికే రాజకీయాలు, నాయకత్వాల మీద ప్రజలకు అసహ్యం కలుగుతోంది. ఇప్పటికే మనం పేపర్ కార్టూన్లం అయిపోయినం. ఇంకా పెద్ద కార్టూన్లు అయ్యే పరిస్థితి తెచ్చుకుందామా? రాజకీయ వ్యవస్థ అంతా ఆలోచించుకోవాలి. తిట్టడానికి ఏం ఉందండి. రేపు ఈ టైందాకా తిడుతూనే ఉండొచ్చు. అడ్దూ అదుపు, ఒక మర్యాద, సంస్కారం అనేది ఉంటది. దాన్ని బట్టి మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతం అంటే పద్ధతి కాదు. మేం చాలా సంయమనం పాటించినం’అని కేసీఆర్ మండిపడ్డారు. -
కారు.. వన్సైడ్ వార్
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కారు దుమ్ము రేపింది. పల్లె అయినా, పట్టణమైనా పట్టాభిషేకం మాత్రం టీఆర్ఎస్కేనని నిరూపితమైంది. శని వారం వెలువడిన మున్సిపల్ ఫలితాల్లో అధికార పార్టీ తిరుగులేని విజయం సాధించి సత్తా చాటింది. ముందు నుంచీ ఆ పార్టీ నేతలు చెబుతున్నట్టుగానే పురపోరులో ఏకంగా సెంచరీ కొట్టేసింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 86 చోట్ల సొంతంగా విజయం సాధించిన గులాబీ పార్టీ.. స్వతంత్రులు, ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి మరో 16 స్థానాలను కైవసం చేసుకోనుంది. దీంతో 100 నుంచి 102 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ ఏడు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోగా.. ఎంఐఎం, బీజేపీలు చెరో రెండు పురపాలికల్లో గెలుపొందాయి. మున్సిపల్ కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది. ఒక్క నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని కార్పొరేషన్లనూ గులాబీ పార్టీయే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదింటిలో సొంతంగా మెజార్టీ సాధించిన అధికార పార్టీ.. మరో మూడింటిని కూడా దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్లో కూడా టీఆర్ఎస్ అవకాశాలను కొట్టిపారేయలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీట్లు, ఓట్లు.. కారుదే జోరు ఓట్లపరంగా చూసినా, సీట్లపరంగా చూసినా కారు జోరు కొనసాగింది. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లాగానే ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఘన విజయాన్ని సాధించింది. విపక్షాలు కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో సత్తా చూపిస్తామంటూ కాంగ్రెస్.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనన్న బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. సీట్లపరంగా చూస్తే అటు మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ దాదాపు 60 శాతం స్థానాలు గెలుపొంది తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది. కాంగ్రెస్ పార్టీ 20 శాతం స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 8 శాతం స్థానాలను గెలుచుకుంది. గతంతో పోలిస్తే అటు మున్సిపాలిటీల్లోనూ, ఇటు కార్పొరేషన్లలోనూ బీజేపీ బాగా పుంజుకోవడం కమలనాథులకు కాస్త ఊరటనిచ్చే అంశం. కార్పొరేషన్లలో అయితే కాంగ్రెస్ను వెనక్కు నెట్టి బీజేపీ రెండో స్థానానికి ఎగబాకింది. ఇక ఎంఐఎం, ఇతరులు కలిసి 12 శాతం స్థానాలను కైవసం చేసుకున్నారు. ఎంఐఎం చెప్పుకోదగ్గ స్థానాలు సాధించగా.. టీజేఎస్, వామపక్షాలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) కొన్ని వార్డుల్లో విజయం సాధించింది. ఈ పార్టీ గుర్తుపై పోటీ చేసినవారిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ రెబెల్స్కూడా ఉన్నారు. 23 చోట్ల స్పష్టత లేదు... మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటినప్పటికీ, కొన్ని చోట్ల అధికార పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. చండూరు, నేరేడుచర్ల, వడ్డేపల్లి, పెద్ద అంబర్పేట, తుర్కయాంజల్, ఆదిభట్ల, నారాయణ్ఖేడ్లలో కాంగ్రెస్ గెలుపొందగా.. ఆమనగల్, తక్కుగూడల్లో బీజేపీ.. భైంసా, జల్పల్లిలో ఎంఐఎం విజయం సాధించాయి. 23 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇందులో కొంపల్లి, భువనగిరి, నల్లగొండ, భూత్పూరు, మక్తల్, మణికొండ, ఐజ, ఖానాపూర్, నస్పూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, సంగారెడ్డి, జనగామ, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, హాలియా, నారాయణ్పేట, కోస్గి, అమరచింత, నార్సింగి, కొల్లాపూర్, కల్వకుర్తి ఉన్నాయి. మిగలిన అన్ని పురపాలికల్లో అధికార పార్టీకి మెజార్టీ వచ్చింది. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే పీర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట, బండ్లగూడ జాగీర్లలో టీఆర్ఎస్ గెలుపొందగా.. నిజామాబాద్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. రామగుండం, బోడుప్పల్, మీర్పేట, బడంగ్పేట కార్పొరేషన్లను స్వతంత్రులు, ఎక్స్అఫీషియో సభ్యులతో టీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. స్పష్టత లేని మున్సిపాలిటీల విషయానికి వస్తే ఖానాపూర్, నస్పూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, సంగారెడ్డి, జనగామ, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, హాలియా, నారాయణ్పేట, కోస్గి, అమరచింత, నార్సింగి, కొల్లాపూర్, కల్వకుర్తిలలో స్వతంత్రులు, ఎక్స్అఫీషియో సభ్యుల బలంతో టీఆర్ఎస్ గెలిచే అవకాశాలుండగా.. ఐజలో స్వతంత్రుల మద్దతుతో పీఠం కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కొంపల్లి, భువనగిరి, నల్లగొండ, భూత్పూర్, మక్తల్, మణికొండ స్థానాల్లో కాంగ్రెస్–బీజేపీలు కలిస్తే మేజిక్ ఫిగర్ దాటనున్నాయి. ఇందులో మక్తల్, భూత్పూర్లలో కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. మిగిలినచోట్ల ఈ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్కు పీఠాలు దక్కే అవకాశముంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ వ్యూహంతో వ్యవహరిస్తే ఇందులోనూ కొన్ని ఆ పార్టీ ఖాతాలో పడతాయి. చదవండి : మున్సి‘పల్స్’ : సమగ్ర వివరాలు -
మున్సి‘పల్స్’ : సమగ్ర వివరాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్లింది. మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 109 స్థానాలను సొంతం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. 9 కార్పొరేషన్లకు గాను 8 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ కథలో మార్పేమీ లేదు. ఆ పార్టీ కేవలం 4 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకుంది. బీజేపీ 3 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. కాగా, ఈ నెల 27న మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరనుంది. తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎంపిక జరగనుంది. ఇప్పటికే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ అయింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎన్నికల్లో ఓటమి: అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, భూపాలపల్లి : మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పట్టణంలోని 5వ వార్డు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీచేసిన సింగనవేన విజేత ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె భర్త చిరంజీవి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు వెల్లడించారు. సంఘటన తెలిసిన అనంతరం మాజీ స్పీకర్, వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి బాదితుడిని పరామర్శించారు. కాగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి చిరంజీవి ఓడిపోగా.. ఈసారి కూడా 78 ఓట్ల తేడాతో ఆయన భార్య ఓడిపోయారు. ఎన్నికల కోసం గతంలో రూ. 8 లక్షలు, ప్రస్తుతం రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. -
‘సిరిసిల్లకు వెళ్లి చూడు కేటీఆర్’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా వికసించకపోయినా... విస్తరణకు దోహదపడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఫలితాల అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా.. ఒంటరిగా బీజేపీ గణనీయమైన సీట్లు దక్కించుకుందని తెలిపారు. అధికార పార్టీ అనేక అక్రమాలతో పాటు ధన ప్రవాహాన్ని పారించిందని ఆరోపించారు. 3 మున్సిపాలిటీల్లో ఒంటరిగా గెలిచామని, కొన్ని చోట్ల ఎక్కువ స్థానాలు గెలిచామన్నారు. టీఆర్ఎస్కు 30 చోట్ల మెజారిటీ దక్కలేదని, కేటీఆర్ ఇలాకాలో బీజేపీ నాలుగు స్థానాలు గెలిచిందని తెలిపారు. 120 మున్సిపాలిటీల్లో నాలుగైదు చోట్ల మినహా అన్ని చోట్ల బీజేపీకి ప్రాతినిధ్యం లభించిందని అన్నారు. (మున్సిపల్ ఫలితాలు: క్యాంప్లకు తరలింపు ) అదే విధంగా బీజేపీ ఎక్కడ ఉందంటున్న కేటీఆర్ను సిరిసిల్లకు పోయి చూడాలంటూ చురకలంటించారు. ఈ ఫలితాలను ఆదర్శంగా తీసుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత కసిగా పోరాడుతామని పేర్కొన్నారు. రెబల్గా పోటీ చేసిన వారిపై చర్యలు తీసుకోని అసమర్థ నాయకత్వం టీఆరెస్ది అని విమర్శించారు. విజయంపై టీఆర్ఎస్కు అంత నమ్మకం అంటే ముందుగా చైర్మన్ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు రాష్ట్రంలో ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని, కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. చదవండి: ఈ ఫలితాలు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు: ఎంపీ నిజామాబాద్ : మున్సిపాలిటీలన్నీ ఆ పార్టీవే రసవత్తరం.. అక్కడ కమలం, కారు ఢీ..! ఇది ఆలిండియా రికార్డు : కేసీఆర్ -
ఇది ఆలిండియా రికార్డు
-
ఈ ఫలితాలు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు: ఎంపీ
సాక్షి, నల్గొండ: అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు తెలివితో ఓటు వేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ: నల్గొండ ఎమ్మెల్యే పోలింగ్ రోజున అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని, కేసీఆర్ సర్కారుకు ఈ ఫలితాలు చెంపపెట్టు అంటూ విమర్శించారు. కాగా నల్గొండలో కాంగ్రెస్ నాలుగవ సారి జెండా ఎగరవేసిందని, హైదరాబాదుకు ధీటుగా నల్గొండను అభివృద్ధి చేస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస ఓటింగ్ పార్లమెంటు ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ సోదరులు కాంగ్రెస్ను అక్కున చేర్చుకున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు. -
నిజామాబాద్ : మున్సిపాలిటీలన్నీ ఆ పార్టీవే
సాక్షి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ స్పష్టమైన మెజారిటీ కనబర్చింది. బోధన్, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్లో 12 వార్డులకు 12 వార్డులను గెలిచి టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. -
‘పౌరసత్వ’ బిల్లుకు వ్యతిరేకం
సాక్షి, హైదరాబాద్ : ‘విధానం, స్వభావం ప్రకారం టీఆర్ఎస్ పూర్తి సెక్యులర్ పార్టీ. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వానిది 100 శాతం తప్పుడు నిర్ణయం. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనేది రాజ్యాంగ పీఠికలోనే ఉంది. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలపై అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగించింది. అమిత్షాకు కూడా ఇదే విషయం చెప్పా. దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ 370కి మద్దతు పలికాం. సీఏఏపై పార్లమెంటులోనే మా పార్టీ వైఖరి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాం. రాబోయే నెల రోజుల్లో భావసారూప్యత ఉన్న ప్రాంతీయ పార్టీలు, సుమారు 15, 16 మంది సీఎంలతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేస్తాం. అవసరమైతే పది లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తాం. భారత్కు మతపరమైన దేశమనే ముద్ర మంచిదికాదు. సీఏఏని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపిస్తాం’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. శనివారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘భారత్ను హిందూ రాష్ట్రంగా మారుస్తున్నారు.. అంతర్జాతీయ విపణిలో నష్టం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఏబీపై చర్చించడంతో పాటు, వంద శాతం వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తెచ్చే చట్టాలపై ప్రజా వ్యతిరేకతపై వచ్చినపుడు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నార్సీ, ఎన్పీఆర్ విషయంలో కేంద్రం, మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని సీఏ ఏను కొట్టేయాలి. ప్రాణాలు పోయినా సరే టీఆర్ఎస్ సెక్యులర్పార్టీగానే కొనసాగుతుంది. ఎన్ని కల్లో గెలుపోటములకు భయపడకుండా, సెక్యులర్ విధానానికి కట్టుబడి పోరాటం చేస్తాం. ఆ విషయం అసెంబ్లీలోనే చెప్పా ‘నేను సీఎంగా కొనసాగుతానని అసెంబ్లీ వేదికగా చెప్పా. మోదీ సీఎంగా పనిచేస్తూనే ప్రధాని కాలేదా. నన్ను సీఎం కుర్చీ నుంచి పంపాలని మీరు అనుకుంటున్నారా? ప్రజలు ఉండమంటున్నారు. సీఎం మార్పిడికి సంబంధించి ఓ సమయం, సందర్భం ఉంటుంది. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆయన శ్రేయోభిలాషులు ఎవరైనా కోరుకుంటే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు’అని కేసీఆర్ వెల్లడించారు. ‘కాంగ్రెస్, బీజేపీ గతంలో సిద్ధాం తాలను పక్కన పెట్టి పనిచేశాయి. అవసరమైన చోట మేం మజ్లిస్తో కలసి మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంటాం. ఏపీలో రాజధానుల ఏర్పాటు ఆ రాష్ట్ర అంతర్గత సమస్య’ అని పేర్కొన్నారు. చదవండి: ఇది ఆలిండియా రికార్డు అంటున్న కేసీఆర్ -
టీఆర్ఎస్ వారిని భయపెట్టి ఓట్లు మళ్లించుకుంది: అరుణ
సాక్షి, గద్వాల(మహబూబ్నగర్): జిల్లా మున్సిపాలిటీలోని 10 స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకుందని మాజీ మంత్రి డీకే ఆరుణ హర్షం వ్యక్తం చేశారు. గద్వాలోని తన నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ: 6 వార్డుల్లో కేవలం 50 ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా విజయం సాధించిందని, ఎస్ఆర్సీ పేరుతో ముస్లిం ఓటర్లను భమభ్రాంతులకు గురి చేసి టీఆర్ఎస్ వారి ఓట్లను మళ్ళీంచుకుందని తెలిపారు. కాగా ముస్లిం ఓటర్లు లేని చోట బీజేపీ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టితో గెలిచారని వెల్లడించారు. కేవలం ఎస్ఆర్సీ పేరుతో టీఆర్ఎస్ ముస్లింలను భయపెట్టి బీజేపీకి ఓటు వేయకుండా చేసిందన్నారు.గద్వాల మున్నిపాలిటీలో తమ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
రసవత్తరం.. అక్కడ కమలం, కారు ఢీ..!
సాక్షి, నిజామాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ స్పష్టమైన గెలుపునందుకుని పరుగులు పెడుతుండగా.. నిజామాబాద్లో మరోసారి కమలం వికసించింది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు గాను బీజేపీ అభ్యర్థులు 28 చోట్ల విజయం సాధించారు. అయితే, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ తప్పలేదు. ఎంఐఎం 16, టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ రెండు, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. కాంగ్రెస్, స్వతంత్రులతో కలిసి బీజేపీ, ఎంఐఎం, ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి టీఆర్ఎస్ మేయర్ పదవిని సొంతం చేసుకుంటామని ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. రాజకీయం రసవత్తరంగా మారడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించాయి. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందిన సంగతి తెలిసిందే. మేయర్ స్థానాన్ని ఆశించారు.. కానీ, కౌటింగ్ ప్రక్రియ మొదలవగానే ముందంజలో ఉన్న టీఆర్ఎస్ క్రమంగా వెనుకబడింది. టీఆర్ఎస్ గెలుస్తుందనుకున్న చివరి నాలుగు స్థానాలను అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ నుంచి మేయర్ స్థానాన్ని ఆశించిన అభ్యర్థులు భంగపడ్డారు. టీఆర్ఎస్ నేత, తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత కూడా ఓటమిపాలయ్యారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయీం ఓడిపోయారు. -
మాది ప్రజల కోసం పనిచేసే పార్టీ.. అందుకే: ఈటల
సాక్షి, హుజురాబాద్: జిల్లా పరిషత్లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో.. అవే మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతమయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్లో శనివారం ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ: మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. గెలిచిన కౌన్సిలర్లకు, గెలిపించిన నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ నిబ్బరంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు భయానికి వణికిపోతున్నాయని విమర్శించారు. ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని, అందుకే ప్రజలు అధికార పార్టీని గెలిపించారన్నారు. పార్టీలో నిర్ణయం తీసుకొని చైర్మన్, వైస్ చైర్మన్లను త్వరలో ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. -
ఇది ఆలిండియా రికార్డు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు భారీ విజయాన్ని అందించిన ప్రజలకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఈ విజయాన్ని అందించారన్నారు. ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. అన్ని చోట్లా ప్రజలు ఒకే రకమైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు. తాము అనుసరిస్తున్న పద్దతి ప్రజలకు నచ్చింది కాబట్టే ఇంతటి ఘన విజయాన్ని అందించారన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఫలితాల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మా సెక్యులర్ విధానాన్ని 100శాతం తెలంగాణ ప్రజలు బలపరిచారు. అభ్యర్థుల గెలుపుకోసం పనిచేసిన నేతలకు ధన్యవాదాలు. ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఏకపక్ష గెలుపు ఆనవాయితీగా మారింది. శాసన సభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినప్పుడు అందరూ భయపెట్టారు. కానీ ధీమాతో ముందుకు వెళ్లాను. 88 స్థానాల్లో గెలుపొందాం. హుజూర్నగర్ ఉపఎన్నికతో కలిసి 89 స్థానాలు గెలుచుకున్నాం. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు వచ్చాయి. స్థానికసంస్థల ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్లను స్వాధీనం చేసుకున్నాం. ఇది ఆలిండియా రికార్డు. మున్సిపాలిటీ ఎన్నికలు ఆపేందుకు ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేశాయి. కోర్టుల చుట్టూ తిప్పారు. అయినప్పటీకి ప్రజలు అర్థం చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇతర పార్టీలకు గేమ్ అయితే.. మాకు టాస్క్ ఎన్నికల కోసం పార్టీ నాయకులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావుకు నా ఆశీస్సులు. ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఏకపక్ష గెలుపు ఆనవాయితీగా మారింది. నేను అధికార దుర్వినియోగం చేశానని అంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్కు నేను జన్మలో ఫోన్ చేయలేదు. మంత్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారు. రూ.వేల కోట్లకు ప్రజలు అమ్ముడుపోయారని చెప్పదలుచుకున్నారా? మీరు గెలిస్తే న్యాయంగా గెలిచినట్లా? స్థాయిని మించి అధిక ప్రసంగాలు చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూపిస్తున్నారు. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించాలి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం పాత్ర పోషించాలి. ఒక పని చేపట్టామంటే మేం రాక్షసుల్లా పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో మేం పెట్టిన ఖర్చు రూ.80 లక్షలు మాత్రమే. రూ.80లక్షలు పార్టీ మెటీరియల్ కోసం ఖర్చు చేశాం. ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వలేదు. చాలా విజయాలు చూశాం కాని ఇంతటి ఘన విజయం నేను అయితే చూడలేదు. తెలంగాణ రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకుపోవడం ఇతర పార్టీలకు గేమ్ అయితే.. మాకు టాస్క్. కష్టపడి పనిచేస్తేనే ఈ ఫలితాలు వచ్చాయి. పట్టణ ప్రగతి చేపడతాం పల్లె ప్రగతి తరహాలో త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈ ఎన్నికల్లో ఎన్నికైనవారికి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ ఇస్తాం. పట్టణాలు అభివృద్ధి, నగరీకరణలో సవాళ్లపై అవగాహన కల్పిస్తాం. బీజింగ్ తర్వాత ఢిల్లీ అత్యధిక కాలుష్యం ఎదుర్కొంటుంది. హైదరాబాద్కు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 57 ఏళ్ల దాటిన వారికి పెన్షన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను కొన్ని పెండింగ్లో ఉన్నాయి. 57 ఏళ్ల వాళ్లకి పెన్షన్ఇస్తామని చెప్పాం. ఈ బడ్జెట్లోనే వాటిని పెట్టి మార్చి 1నుంచి ఫించన్లు అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు వయోపరిమితిని కూడా పెంచుతాం. పీఆర్సీ పెంపుపై కూడా త్వరలో చర్చలు జరుతుతాం. పరిమితులను బట్టి పీఆర్సీ అమలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు. మన రాష్ట్రానికే 5వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మేము పార్లమెంట్లో జరిగిన సమావేశాల్లో ధర్నా చేస్తే.. రూ.1000 కోట్లు ఇచ్చారు. ఇంకా రూ.1131 కోట్లు రావాలి. ఐజీఎస్టీ కింద 2812 కోట్లు రావాలి. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఉద్యోగులను పిలిచి నేనే మాట్లాడుతా. కేంద్ర ప్రభుత్వ విధానాలు చూస్తే ఘోరంగా ఉన్నాయి. కాగ్ వాళ్ల బండారం బయటపెడుతుంది. జీడీపీ పడిపోయింది. పోయిన 5 ఏళ్లు తెలంగాణ ఎంత ఎంజాయ్ చేసిందంటే... ఇండియాలో మనం నెంబర్ వన్. ప్రతి ఏడాది 21 శాతం పెరుగుదల ఉండేది. కానీ ఇప్పడు ఏ విభాగం అయినా డబ్బులు అడిగితేనే భయం అవుతుంది. ఇప్పుడు మన పెరుగుదల 9.5 ఉంది. అయినప్పటికీ కానీ పీఆర్సీ కూడా పెంచుతాం. కంటి వెలుగు తరహాలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య సూచికను తెలిపే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతాం. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాం తెలంగాణ నుంచి చాలామంది గల్ఫ్ వెళ్తున్నారు. అప్పులు చేసి మరీ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడంలేదు. ఇక్కడేమో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్నారు. రాష్ట్రంలోనే ఉపాధి లభిస్తుంటే గల్ఫ్ ఎందుకు వెళ్తున్నారు? అసెంబ్లీ సమావేశాలకు ముందు గల్ఫ్లో పర్యటిస్తా. త్వరలోనే గల్ప్ పాలసీ తీసుకొస్తాం. తెలంగాణ నిరక్ష్యరాస్యత ఎక్కువ ఉంది. ఇది కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇచ్చిన బహుమతి. త్వరలోనే నిరక్ష్యరాస్యత నిర్మూలన కోసం కార్యక్రమాన్ని చేపడతాం. కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకొస్తాం. రెవెన్యూ కార్యాలయానికి ప్రజలు పెట్రోలు పట్టుకొని వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ శాఖ అధికారులు ఆలోచించుకోవాలి. రెవెన్యూ శాఖలోనే అవినీతి ఎక్కువగా ఉంది. ఎవరేం అనుకున్న మేము భయపడం. పటిష్టమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాం. మాకు ఇంత విజయాన్ని అందించిన ప్రజల కోసం మేము ఏ పనిఅయినా చేస్తాం. కొద్ది రోజుల్లోనే రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తాం. కొత్త మున్సిపల్ చట్టాని, పంచాయతి రాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం. పన్నులు కొద్దిగా పెంచుతాం పల్లెలతో పాటు పట్టణాల అభివృద్ధికి నిధులు అందిస్తాం. కొద్దిగా పన్నులు పెంచాలి. నిరుపేదలపై భారం పడకుండా పన్నులు పెంచుతాం. ప్రతి నెల మున్సిపాలిటీలకు నిధులు అందిస్తాం. మున్సిపల్, గ్రామ పంచాయతీల పన్నులు కొద్దిగా పెంచుతాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పన్నులు వర్తించేలా నిర్ణయం తీసుకుంటాం. రైతు సమన్వయ సమితులను క్రియాశీలం చేస్తాం. రైతులే నిర్ణయాధికారులుగా మారే ప్రక్రియను అమల్లోకి తీసుకొస్తాం. ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక ఏర్పాటు చేస్తాం. మహిళలను హామీ ఇచ్చినట్లుగా పుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నిరుద్యోగ భృతిని అందించేందుకు కృషి చేస్తాం. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే వెల్లడిస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కచ్చితంగా అమలు చేస్తాం’ కేసీఆర్ అన్నారు. ఇది చదవండి : సీఏఏపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు -
నిజామాబాద్లో ఇండిపెండెంట్కి ఎంత క్రేజో..
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంకు హోరాహోరిగా తపపడుతున్నాయి. మూడ పార్టీలకు సీట్లు సమానంగా వస్తున్నాయి. హంగ్ దిశగా ఫలితాలు వస్తుండడంతో మేయర్ పీఠంపై పార్టీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను వలలో వేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిని రెండు పార్టీల నాయకులు వెంబడించారు. బైక్పై వెళ్తుండగా అడ్డుకొని తమ కారులో ఎక్కాలంటే..తమ కారులో ఎక్కాలని పోటాపోటీగా అభ్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. ఉక్కిరిబిక్కిరి అయిన ఇండిపెండెంట్ అభ్యర్థిని చివరికి టీఆర్ఎస్ కార్యకర్తలు ఓ కారులో తీసుకొని వెళ్లారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్ కార్పొరేషన్లోని 60 డివిజన్లకు గాను బీజేపీ 24, టీఆర్ఎస్ 15, ఎంఐఎం 18, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించగా, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్లో మేయర్ పదవిని ఆశించిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత పరాజయం చెందారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయీమ్ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఆధిక్యంలో ఉంటారన్నది తెలుస్తుంది. -
టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా..
సాక్షి, హైదరాబాద్: తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గం విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ అభ్యర్థుల గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్లే తమ నాయకులని స్పష్టం చేశారు. మిగతా విషయాలు అధిష్టానంతో మాట్లాడతానని చెప్పారు. కాగా, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫోన్ చేయడంతో జూపల్లి కృష్ణారావు హైదరాబాద్కు వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆయనకు, పార్టీకి మధ్య దూరం పెరిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అలాంటిదేమి లేదని తాజాగా జూపల్లి ప్రకటించారు. చదవండి: ఫలించిన హరీష్ రావు వ్యూహాలు.. -
ప్రజలకు మరోసారి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నా
-
ఇంతటి విజయాన్ని ఎన్నడూ చూడలేదు
-
సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది: జగిత్యాల కలెక్టర్
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): జిల్లా పార్లమెంట్ ఎన్నికలకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు రావడంతో కలెక్టర్ శరత్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎన్నికలను చక్కడా నిర్వహించామని, ఎన్నికల అధికారులు, పోటీ చేసిన అభ్యర్థుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు కారణమని తెలిపారు. సమిష్టి కృషితో పని చేస్తూ ప్రజలకు మెరుగైనా సేవలను అందిస్తున్నామన్నారు. దేశస్థాయిలో తెలంగాణ నెంబర్ వన్గా నిలవడం సంతోషకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
నిజామాబాద్లో నువ్వా, నేనా?
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు ఉండటంతో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నాయి. కార్పొరేషన్లోని 60 డివిజన్లకు గాను ఇప్పటివరకూ 24 స్థానాల్లో బీజేపీ, 19 స్థానాల్లో టీఆర్ఎస్, ఎంఐఎం 18 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లలో గెలిచింది. టీఆర్ఎస్లో మేయర్ పదవిని ఆశించిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత పరాజయం చెందారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయీమ్ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఆధిక్యంలో ఉంటారన్నది తెలుస్తుంది. కాగా, ఓట్ల లెక్కింపు జరుగుతున్న పాలిటెక్నిక్ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రం చుట్టూ భారీగా పోలీసులను మొహరించారు. మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కమిషనర్ పోలీస్ కార్తికేయ పర్యవేక్షిస్తున్నారు. -
ఎమ్మెల్యేపై టీఆర్ఎస్ కార్యకర్తల అనుచిత చర్య..!
సాక్షి, యాదాద్రి భువనగిరి : రాష్ట్రవ్యాప్తంగా ‘కారు’ దూసుకెళ్తుండగా.. యాదగిరిగుట్టలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు చోట్ల, టీఆర్ఎస్ మూడు, సీపీఐ ఒకటి, ఇండిపెండెంట్లు మూడు వార్డుల్లో విజయం సాధించారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కాంగ్రెస్కు ఉండటంతో యాదగిరి గుట్టలో ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకొనే అశకాశముంది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, టీఆర్ఎస్ కార్యకర్తలు నెట్టేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్కు మెజారిటీ స్థానాలు వచ్చాయని, ఆ అక్కసుతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీత కాంగ్రెస్ కార్యకర్తలపై కావాలనే లాఠీచార్జి చేయించారని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ‘లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నిస్తున్నా. యాదగిరిగుట్టలో ఇప్పటికే మాకు క్లీయర్ మెజారిటీ వచ్చింది. ఆలేరులో మా ఓటమిని అంగీకరించి అటు వైపు కూడా వెళ్ళలేదు. కానీ, మీ ఎమ్మెల్యే ఇక్కడికొచ్చి పోలీసులు, రౌడీల చేత బెదిరింపులకు పాల్పడుతూ కౌన్సిలర్లని కొనడానికి చూస్తున్నారు. దీనిపై సీఎం కేసార్ సమాధానం చెప్పాలి. దేవుడి సాక్షిగా టీఆర్ఎస్ అనైతికంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్కు పాపం తగులుతుంది. టీఆర్ఎస్ గుండాయిజాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఎంతవరకైనా చూసుకుంటాం’అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఫలితాలు.. మొత్తం మున్సిపాలిటీలు : 18 టీఆర్ఎస్ గెలిచినవి : 6 ఆలేరు, పోచంపల్లి, మోత్కూరు, దేవరకొండ, హుజూర్నగర్, తిరుమలగిరి కాంగ్రెస్ గెలిచినవి : 3 యాదగిరిగుట్ట, నేరేడుచర్ల, చండూరు హంగ్ : 4 చౌటుప్పల్, భువనగిరి, చిట్యాల, హాలియా టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న స్థానాలు : 5 నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, నందికొండ -
నిజాంపేటలో కారు జోరు.. కార్పొరేషన్ కైవసం
సాక్షి, హైదారాబాద్ : రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. నిజాంపేట కారు తిరుగులేని జోరును ప్రదర్శించి కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 22 డివిజన్లలో ఫలితాలు వెలువడగా.. 19 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడు డివిజన్లలో దయాకర్రెడ్డి ప్యానల్కు చెందిన స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కార్పొరేషన్ కైవసం చేసుకోవాలంటే 17 డివిజన్లలో విజయం సాధించాలి. టీఆర్ఎస్ ఇప్పటికే 19 డివిజన్లలో విజయం సాధించింది. టీఆర్ఎస్ భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నిజాంపేటకు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు నిజాంపేటలో పోలింగ్ కౌంటింగ మందకొడిగా సాగుతోంది. తుది ఫలితం వెలువడేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాపతంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్ శాతం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే నమోదైంది. తక్కువ పోలింగ్ శాతం నమోదైనప్పటికీ ఫలితాలు వెల్లడిలో మాత్రం తీవ్రమైన ఆలస్యం నెలకొంది. ఇక బోడుప్పల్(28)లో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్7, బీజేపీ 2, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు. ఫిర్జాదిగూడ 26 స్థానాలకు గాను 16 స్థానాలను కారు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మూడు స్తానాల్లో గెలుపొందింది. జవనహార్ నగర్లో కూడా కారు జోరు కొనసాగింది. 26 స్థానాలకు గాను టీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 3, బీజేపీ 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. -
ఉత్కంఠ పోరులో ఎంఐఎం విజయం
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం విజయం సాధించింది. ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచిన భైంసాలో పుర పోరు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. విజయం కోసం ఎంఐఎం, బీజేపీ తీవ్రంగా పోటీపడ్డాయి. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు రెండు వార్డులను సొంతం చేసుకున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కనీసం పోటీలో కూడా లేకుండా పోయాయి. గత ఎన్నికల్లోనూ భైంసా మున్సిపాలిటీలో సొంతం చేసుకున్న ఎంఐఎం మరోసారి అదే ఫలితాలను పునరావృతం చేసి పట్టునిలుపుకుంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 9 వార్డుల్లో విజయం నమోదు చేసింది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కారు జోరు.. తెలంగాణ భవన్లో సంబరాలు కాంగ్రెస్ కంచు కోటకు బీటలు కేటీఆర్కు షాకిచ్చిన స్వతంత్రులు కొడంగల్లో రేవంత్ రెడ్డికి షాక్ -
కారు జోరు.. మీడియా ముందుకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ భవన్ చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో కలిసి ఫలితాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు, నేతలు తెలంగాణ భవన్కు చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 120 మున్సిపాలిటీలకుగానూ టీఆర్ఎస్ వందకు పైగా స్థానాల్లో గెలుచుకునే విధంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలు సీఎం ఏ విధంగా మాట్లాడుతానేది ఆసక్తికరంగా మారింది. చదవండి :మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కారు జోరు.. తెలంగాణ భవన్లో సంబరాలు కాంగ్రెస్ కంచు కోటకు బీటలు కేటీఆర్కు షాకిచ్చిన స్వతంత్రులు కొడంగల్లో రేవంత్ రెడ్డికి షాక్ -
ఫలించిన హరీష్ వ్యూహాలు.. కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
సాక్షి, సంగారెడ్డి : తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్కు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో సంచలన విజయాలను నమోదు చేస్తోంది. ఇప్పటికే మధిర, కొత్తగూడెం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కారు పార్టీ.. తాజాగా వెలువడిన ఫలితాల్లో మరిన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డితో పాటు సదాశివపేట మున్సిపాలిటీలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. రెండు మున్సిపాలిటిల్లోనూ జగ్గారెడ్డికి ఓట్లర్లు దిమ్మతిరిగే రీతిలో షాక్ ఇచ్చారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ విజయ దుందుబీ మోగించింది. మొత్తం 14 మున్సిపాలిటీల్లో 13 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. నారాయన్ఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఫలితాలపై గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. హరీష్ చాణక్యం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్కు కూతవేటు దూరంలో ఉన్న సంగారెడ్డిలో ఇప్పటి వరకు టీఆర్ఎస్కు మంచి ఫలితాలు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. అయినా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ బరిలోకి దిగింది. దీనికి అనుగుణంగానే సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి, సదాశివపేట బాధ్యతలు అప్పగించారు. దీంతో హరీష్ మొదటి నుంచీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ.. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీనికి తగట్టుగానే హస్తం అభ్యర్థులను మట్టికరిపిస్తూ సంగారెడ్డిపై గులాబీ జెండా ఎగరేశారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు. — Harish Rao Thanneeru (@trsharish) January 25, 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కారు జోరు.. తెలంగాణ భవన్లో సంబరాలు కాంగ్రెస్ కంచు కోటకు బీటలు కేటీఆర్కు షాకిచ్చిన స్వతంత్రులు కొడంగల్లో రేవంత్ రెడ్డికి షాక్ -
కొడంగల్లో రేవంత్ రెడ్డికి షాక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్లో కాంగ్రెస్కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్ మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 12 వార్డుల్లో గులాబీ పార్టీ 7 గెలుపొందగా, కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్కు ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ ఫలితం లేకపోయింది. టీఆర్ఎస్కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేస్తూ.. కొడంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సంచలన రీతిలో విజయం సాధిస్తోంది. ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయ్యాయి. దీంతో మెజార్టీ జిల్లాల్లో ఫలితాలు ఏకపక్షం అయ్యాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో 80కుపైగా టీఆర్ఎస్ విజయం సాధించింది. మెజార్టీ స్థానాల్లో ముందంజంలో ఉంది. కార్పొరేషన్లలో కూడా కారు దూసుకుపోతోంది. (కాంగ్రెస్ కంచు కోటకు బీటలు) -
విజయం దిశగా టీఆర్ఎస్ జోరు
-
కేటీఆర్కు షాకిచ్చిన స్వతంత్రులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చేటుసుకున్నాయి. సిరిసిల్లలో పది వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించి.. కేటీఆర్కు ఊహించని షాక్ ఇచ్చారు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్ 24 వార్డుల్లో విజయం సాధించగా.. బీజేపీ 3, కాంగ్రెస్ 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. వీరంతా టీఆర్ఎస్కు చెందిన రెబల్స్గా తెలుస్తొంది. అయితే రెబెల్స్ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్ఎస్లోకి తీసుకునేది లేదని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) -
కాంగ్రెస్ కంచు కోటకు బీటలు
సాక్షి, ఖమ్మం : కాంగ్రెస్ కంచుకోట ఖమ్మం జిల్లాలో కారుజోరు కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కోటకు బీటలు పడ్డాయి. మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికారు టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 8 వార్డుల్లో 5 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ సీపీఐ తలఒక్క స్థానంలో గెలుపొందాయి. మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజంలో ఉంది. దీంతో మధిర మున్సిపాలిటీపై తొలిసారి గులాబీ జెండా ఎగరేసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీతో కలిసి పోటీచేయాలని నిర్ణయించిన భట్టికి మరోసారి భారీ షాక్ తగిలినట్లయింది. (మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణి) గత ఏడాది ముగిసిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిన్పటికీ.. ఖమ్మంలో మాత్రం చేదు ఫలితాలు ఎదురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, గులాబీ అధిపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించారు. దానికి తోడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా భట్టికి చెక్ పెట్టేందుకు మధిరపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగానే మున్సిపాలిటీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో 75కుపైగా టీఆర్ఎస్ విజయం సాధించింది. మెజార్టీ స్థానాల్లో ముందంజంలో ఉంది. కార్పొరేషన్లలో కూడా కారు దూసుకుపోతోంది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) -
కారు జోరు.. తెలంగాణ భవన్లో సంబరాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే తెలంగాణ భవన్ చేరుకుని, అక్కడ నుంచి ఎన్నికల కౌంటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ఇక ఫలితాల అనంతరం సంబరాలు జరపడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 120 మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాల్లో అధికార కారు పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ను చిత్తుచేస్తూ.. పూర్తి ఆధిక్యంలో దూసుకుపోతోంది. (మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణి) దీంతో తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈనెల 22న ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార టీఆర్ఎస్ అనుకూల ఫలితం దాదాపు ఖాయమే అయినా ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఫలితాల అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) -
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెలువడుతున్నాయి. ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల్లో అధికార టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కొన్ని వార్డుల్లో విజయం సాధించినప్పటికీ.. అనుకున్న స్థాయిలో రాణించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలాగే వర్థన్నపేట, జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) కమలం బోణి.. ఆమన్గల్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకున్న బీజేపీ.. అనుకున్న స్థాయిలోనే ప్రణాళిలకు రచించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పలుచోట్ల కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన భైంసాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 14 పోల్ అవ్వగా.. బీజేపీకి 8, ఎంఐఎం 3, కాంగ్రెస్ 1,ఇతరులకు 1 ఓటు దక్కించున్నారు. అయితే ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో నాలుగు వార్డుల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నాలుగు వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. మరికొన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పలు వార్డుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
-
గెలుపుపై టీఆర్ఎస్ ధీమా..
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తామని టీఆర్ఎస్ పార్టీ ధీమాతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం ఖయమని పార్టీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో సంబరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు.ఫలితాల ట్రెండింగ్ ప్రారంభం కాగానే సంబరాలు నిర్వహించనున్నారు.అనంతరం పార్టీ నేతలతో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమవనున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లపై కూడా కేటీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ భవన్కు చేరుకున్న రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు,ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,నవీన్లు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కాగా మేయర్, చైర్మన్ అభ్యర్థులపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం రేపు తీసుకోనున్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్, చైర్మన్ లిస్ట్ సీల్డ్ కవర్లో పెట్టి ఎమ్మెల్యేలకు అందజేయనున్నారు. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) అవసరమైన చోట క్యాంపులు... మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవుల కోసం పార్టీలో అంతర్గత పోటీ ఉన్న చోట పార్టీ తరఫున గెలుపొందిన వారిలో చీలిక రాకుండా నివారించడంతో పాటు, విపక్ష పార్టీలు ఎక్కువ స్థానాలు సాధించే మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్లు చేజారకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. రెబెల్స్ బరిలో ఉన్నచోట మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని వారి మద్దతు కూడా టీఆర్ఎస్ మేయర్, చైర్మన్ అభ్యర్థులకే లభించేలా చర్యలు చేపట్టనుంది. ఈ నెల 27న మేయర్, చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో రెండు రోజుల పాటు పార్టీ తరఫున గెలుపొందిన వారిని అవసరమైన క్యాంపులకు తరలించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. -
రాజకీయం.. ఇక రిసార్ట్స్లో
సాక్షి, మేడ్చల్జిల్లా: మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్న నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులను వెంటనే క్యాంపులకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 27న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్తోపాటు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. ప్రాదేశిక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లాగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ క్లీన్స్వీప్ చేయాలన్న పిలుపులో భాగంగా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందిన వారంతా అధిష్టానం నిర్ణయించిన మేయరు, ఛైర్మన్ అభ్యర్థులకు ఓటు వేసేలా క్యాంపులు నిర్వహించటానికి సన్నద్ధమైనట్టు సమాచారం. రెండు జిల్లాల్లో ఎన్నికలకు ముందే తొమ్మిది వార్డులను ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ కౌంటింగ్ పూర్తి కాగానే, గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థులను అక్కడ నుంచి నేరుగా క్యాంపులకు తరలించేందుకు నగర శివారు ప్రాంతాల్లో రిసార్టులను శుక్రవారం బుక్ చేశారు. మ్యాజిక్ ఫిగర్ రాని కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలో ఎవరైనా స్వతంత్రులు గెలిస్తే వారిని కూడా తమకే మద్దతు ఇచ్చేలా చూసి, వారిని కూడా క్యాంపులకు తరలించే అవకాశాలు లేకపోలేదు. -
ఫలితాలు రాకముందే క్యాంపు రాజకీయాలు
-
నేడే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
-
మున్సిపల్ ఫలితాలు: క్యాంప్లకు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 120 మున్సిపాలిటీలకు గాను 109 స్థానాలను సొంతం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. 9 కార్పొరేషన్లకు గాను టీఆర్ఎస్ 8 చోట్ల విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ కథలో మార్పేమీ లేదు. ఆ పార్టీ కేవలం 4 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకుంది. బీజేపీ 3 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు (శనివారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2619 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల సంఖ్యను బట్టి 5 నుంచి 24 రౌండ్లపాటు కౌంటింగ్ ప్రక్రియ జరిపారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్ పత్రాల ఓట్ల కౌటింగ్ను మొదలు పెట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించారు. కాగా, ఈ నెల 27న మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరనుంది. తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సభ్యుల ప్రమాణం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎంపిక జరగనుంది. ఇప్పటికే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ అయింది. పార్టీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టీఆర్ఎస్ 109 08 కాంగ్రెస్ 04 0 బీజేపీ 03 1 ఇతరులు 03 0 కౌంటింగ్ అప్డేట్స్ : క్యాంప్లకు తరలింపు నల్గొండలో మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ సన్నాహాలు మొదలుపెట్టాయి. గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపులకు బయలు దేరారు. నల్గొండలో హంగ్ నల్గొండ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. 48 వార్డులకు గానూ కాంగ్రెస్ 20, టీఆర్ఎస్ 20, బీజేపీ 6, ఎంఐఎం, ఇండిపెండెంట్ ఒక్కో స్థానంలో గెలిచారు. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో బీజేపీ మద్దతు కీలకం కానుంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మొత్తం 24 స్థానాలకు గాను ఆ పార్టీ అభ్యర్థులు 17 చోట్ల విజయం సాధించారు. టీఆర్ఎస్ 5, బీజేపీ 1, స్వతంత్రులు 1 చోట గెలుపొందారు. స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎమ్మెల్యేను నెట్టేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, టీఆర్ఎస్ కార్యకర్తలు నెట్టేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్కు మెజారిటీ స్థానాలు వచ్చాయని, ఆ అక్కసుతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి: రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఊరట లభించింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఇక్కడ కాంగ్రెస్ ఐదు, టీఆర్ఎస్ మూడు, సీపీఐ 1 ఒకటి, ఇండిపెండెంట్లు మూడు వార్డుల్లో విజయం సాధించారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కాంగ్రెస్కు ఉండటంతో ఇక్కడ ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకొనే అవకాశముంది. నిజామాబాద్లో టీఆర్ఎస్ తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత ఓటమి.. నిజామాబాద్ ఆరో డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల సుజాతపై 1509 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఉమారాణి ఘనవిజయం. మున్సిపాలిటీల వారీగా: నల్లగొండ మున్సిపాలిటీ: 48 కాంగ్రెస్- 20 టీఆర్ఎస్- 20 బీజేపీ- 06 ఎంఐఎం- 1 ఇండిపెండెంట్: 1 తుక్కుగూడ మున్సిపాలిటీ: మొత్తం 15 సీట్లు బీజేపీ- 9 టీఆర్ఎస్- 5 స్వతంత్రులు : 1 బడంగ్పేట్ మున్సిపాలిటీ: 22 టీఆర్ఎస్- 15 బీజేపీ- 3 కాంగ్రెస్ -3 స్వతంత్రులు : 1 జల్లపల్లి మున్సిపాలిటీ: టీఆర్ఎస్ - 5 ఎంఐఎం - 6 బీజేపీ - 2 తాండూరు (34) : టీఆర్ఎస్ 12 బీజేపీ 5 కాంగ్రెస్ 4 ఇండిపెండెంట్ 2 టీజేఎస్ 1 పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ (26) టీఆర్ఎస్ - 16 కాంగ్రెస్ - 3 బీజేపీ - 1 స్వతంత్రులు - 6 సూర్యాపేట జిల్లా : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకా అయిన హుజూర్నగర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మున్పిపాలిటీలో మొత్తం 28 సీట్లు ఉండగా 18 వార్డుల్లో కారు విజయం సాధించింది. మరో మూడు వార్డులు లెక్కింపు మిగిలి ఉండగానే టీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధించింది. ఎంపీగా గెలుపొందిన ఉత్తమ్ రాజీనామా చేయడంతో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగగా.. ఇక్కడ ఉత్తమ్ సతీమణి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపొందారు. నిజామాబాద్లో తిరుగులేని కారు..! ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్స్వీప్ చేసింది. మొత్తం ఆరు మున్సిపాలిటీలకుగాను ఆరు మున్సిపాలిటీల్లో కారు దూసుకుపోయింది. భీంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 12 వార్డులు సాధించి క్లీన్స్వీప్ చేసిన గులాబీ పార్టీ.. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో పూర్తి మెజారిటీని సాధించింది. రామగుండం కార్పొరేషన్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. అందులో టీఆర్ఎస్ 19, కాంగ్రెస్ ఆరు, బీజేపీ ఐదు, ఇతరులు తొమ్మిది స్థానాలు గెలుపొందారు. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుపొందినప్పటికీ.. కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవాడానికి కావాల్సిన మెజారిటీ సాధించలేదు. దీంతో ఇతర, స్వతంత్ర అభ్యర్థులు చైర్పర్సన్ ఎన్నికలో కీలకం కానున్నారు. మంచిర్యాల: లక్సెట్టిపేట మున్సిపాలిటీ మూడో వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు. టాస్ ద్వారా తుదిఫలితం ఖరారు చేసిన పోలింగ్ అధికారులు. టాస్ ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి విజయం మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. బంగారు తెలంగాణ కేసీఆర్కే సాధ్యమని ప్రజలు నమ్మారు- ట్విటర్లో మంత్రి కేటీఆర్ ఎన్నికలేవైనా గెలుపుమాత్రం టీఆర్ఎస్దేనని మరోసారి రుజువైంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభంజనం వీసింది. ఇందుకుగాను సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అభినందనలు. బంగారు తెలంగాణ కేసీఆర్కే సాధ్యమని చాటిన ప్రజానికానికి కృతజ్ఞతలు- ట్విటర్లో మంత్రి హరీష్రావు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ గులాబీ పార్టీ అంచనాలను అందుకుంటూ ఫలితాలను సాధించింది. ఇక్కడ మొత్తం 15 మున్సిపాలిటీలు ఉండగా 14 మున్సిపాలిటీలను కారు కైవసం చేసుకుంది. ఒక్క నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించగలిగింది. నిర్మల్: అత్యంత ఉత్కంఠ రేపిన నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది. హైదరాబాద్: మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్మీట్.. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు కొనసాగుతోంది. తిరుగులేని జోరుతో దూసుకుపోతున్న కారు.. ఇప్పటికే మున్సిపాలిటీ విషయంలో సెంచరీ దాటేసింది. ఇప్పటివరకు 103 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు సత్తా చాటింది. అన్ని మున్సిపాలిటీలోనూ గులాబీ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్లో కారుకు ఎదురులేదు. ఇక్కడ అన్ని మున్సిపాలిటీల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. భైంసా మినహా ఇక్కడ అన్ని మున్సిపాలిటీల్లోనూ కారు విజయం సాధించింది. ఇక, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ దూకుడు మీద ఉంది. కామారెడ్డి మినహా అన్ని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. మెజారిటీ మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో కారు తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఇప్పటివరకు (మధ్యాహ్నం 12 గంటలవరకు) అందుతున్న సమాచారం ప్రకారం 80కిపైగా మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక, మూడు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో జూపల్లి వర్గీయులు సత్తా చాటారు. మహబూబ్నగర్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. ఆమన్గల్ మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకుంది. బోడుప్పల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థి సంజీవరెడ్డి ఓటమి భువనగిరి మున్సిపాలిటీలో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరి నెలకొంది. ఇటు నల్లగొండ జిల్లాలోనూ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరి పరిస్థితి కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్రావు వ్యూహం ఫలించింది. ఇక్కడి సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేవంత్రెడ్డికి షాక్ తగిలింది. కొడంగల్ మున్సిపాలిటీలో కేవలం మూడు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇలాకాలో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం పది స్థానాల్లో స్వతంత్రులు గెలవడంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు షాక్ తిన్నారు. వీరిలో ఎక్కువమంది టీఆర్ఎస్ రెబెల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. రెబెల్స్ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్ఎస్లోకి తీసుకునేది లేదని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. యాదాద్రి: ఆలేరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ దూసుకుపోయింది. ఇక్కడ మొత్తం 12 వార్డుల్లోటీఆర్ఎస్ ఎనిమిది వార్డులు, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్, బీజేపీ తలా వార్డులో విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కారు తిరుగులేని జోరు ప్రదర్శిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు నాలుగు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. భీమ్గల్, బాన్సువాడ, ఆర్మూరు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ సత్తా చాటింది. - మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్లో 12 వార్డులకు 12 వార్డులను గెలిచి టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. - స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడలో మొత్తం 19 వార్డుల్లో టీఆర్ఎస్ 15 వార్డులు గెలిచి సత్తా చాటింది. - ఆర్మూరు మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డుల్లో టీఆర్ఎస్ 22 గెలిచి ముందంజలో ఉంది. - ఎల్లారెడ్డిలోని 12 వార్డుల్లో ఏకంగా పది వార్డులు టీఆర్ఎస్ గెలుపొందింది. ఖమ్మం: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కోటకు బీటలు వారాయి. మధిర మున్సిపాలిటీలో మొదటి రౌండ్ ముగిసేసరికి ఎనిమిది వార్డులకుగాను ఐదుచోట్ల టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. మూడు స్థానాల్లో కాంగ్రెస్, ఒక్కొక్క స్థానంలో టీడీపీ, సీపీఐ గెలిచాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం ఏడు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న టీఆర్ఎస్. భీమ్గల్, బాన్సువాడ మున్సిపాలిటీల్లో కారు జోరు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. మొత్తం 12 వార్డుల్లో టీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీ భీమ్గల్ కావడం గమనార్హం. కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. మొత్తం 19 వార్డుల్లో 11 వార్డులను టీఆర్ఎస్ సొంతం చేసుకొంది. ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పోలింగ్కు ముందే ఒక వార్డు 1 ఏకగ్రీవం అయింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి.. ఇండిపెండెంట్ అభ్యర్థి పైడి మాధవి విజయం రాజేంద్రనగర్లోనిబండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో రజియా సుల్తానా విజయం మేడ్చల్ జిల్లా: గుండ్లపోచంపల్లి ఐదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజు విజయం మేడ్చల్ జిల్లా : గుండ్లపోచంపల్లి 11వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ రెడ్డి విజయం మేడ్చల్ జిల్లా :గుండ్లపోచంపల్లి 10వ వార్డు తెరాస అభ్యర్థి ప్రభాకర్ విజయం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి మడుపతి చంద్రమౌళి గెలుపు జవహర్నగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం భైంసా నాలుగు వార్డుల్లో ఎంఐఎం గెలుపు వర్థన్నపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం మీర్పేట్లో మున్సిపాలిటీ 1, 4, 10,19 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు హుస్నాబాద్ 13, 19 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం చిట్యాల మున్సిపాలిటీ 7,10 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు హూజుర్ నగర్ 9,12 వార్డుల్లో కాంగ్రెస్ విజయం ధర్మపురి మొత్తం వార్డులు 15 : టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 7 గెలుపు తెలంగాణ భవన్కు చేరుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ హుజూర్నగర్, సూర్యాపేట, మహబూబ్నగర్లో టీఆర్ఎస్ ముందంజ సత్తుపల్లి పదోవార్డు టీఆర్ఎస్ గెలుపు బొల్లారం 16, 17, 18 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ శ్రీ దేవసేన మంచిర్యాలలో గంటకు పైగా ఆలస్యంగా కౌంటింగ్, ఇప్పటికీ ప్రారంభం కానీ బ్యాలెట్ బాక్స్ల లెక్కింపు యాదాద్రి జిల్లాలో మొదలైన క్యాంప్ రాజకీయాలు.. యాదగిరిగుట్టలో తమ అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించిన కాంగ్రెస్ ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు భైంసాలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 14 అనూహ్యంగా బీజేపీకి 8, ఎంఐఎం 3, కాంగ్రెస్ 1,ఇతరులకు 1 ఓటు జగిత్యాల పోస్టల్ బ్లాలెట్ లెక్కింపులో ఆలస్యం, ఇంకా ప్రకటించని పోస్టల్ బ్యాలెట్ వివరాలు సిరిసిల్లలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్ వరంగల్ నర్సంపేట్లో ఏడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరణ సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో 47 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ట్రెండ్.. ఫలితాలు రాకముందే క్యాంపులకు అభ్యర్థులు హైదరాబాద్ క్యాంపుకు తరలివెళ్తున్న ఉమ్మడి నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థులు ఇల్లందులో పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు సీల్ వేయని అధికారులు మహేశ్వరం, నాదర్గుల్ కేంద్రం వద్ద బీజేపీ ఆందోళన అభ్యర్థులు రాకముందే సీల్ తెరిచారని ఆరోపణ రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో రభస రామగుండం కేంద్రంలోకి వెళ్లిన ఎమ్మెల్యే చందర్.. బయటకు రావాలని అభ్యర్థుల ఆందోళన -
ఏ అవకాశాన్నీ వదలొద్దు!
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తామనే ధీమాతో తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది. ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల వ్యవధిలో వెలువడనుండగా... 95 శాతానికి పైగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకుంటామనే విశ్వాసాన్ని ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. ప్రీ, ఎగ్జిట్ పోల్ సర్వేలతోపాటు పోలింగ్ తర్వాత పార్టీ ఇన్చార్జిల నుంచి అందిన నివేదికలను క్రోడీకరించిన టీఆర్ఎస్ అధిష్టా నం ఏకపక్షంగా ఫలితాలు వస్తాయనే అంచనా వేస్తోంది. మేయర్, చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన అన్ని అవకాశాల ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ నెల 22న పోలింగ్ జరగ్గా, నిజామాబాద్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలో విపక్షాల నుంచి కొంతపోటీ ఎదురవుతుందని అంచనా వేస్తోంది. వడ్డేపల్లి, నందికొండలో కాంగ్రెస్, జల్పల్లి, భైంసాలో ఎంఐఎం, తుక్కుగూడ, ఆమనగల్ మున్సిపాలిటీల్లో బీజేపీ గట్టి పోటీని ఇచ్చినా చివరకు ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా వస్తాయని లెక్కలు వేస్తోంది. ఫలితాల వెల్లడి తర్వాత పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేజారకుండా చూసుకోవడంతోపాటు, అవసరమైనచోట మద్దతుకు వ్యూహాన్ని ఖరారు చేసిం ది. సంఖ్యాబలం తక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలను ఎక్స్అఫీ షియో సభ్యులుగా నమోదు చేయడం ద్వారా, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవాలని నిర్ణయించింది. ఎక్స్అఫీషియోలుగా ఎక్కడెక్కడ నమోదు చేసుకోవాలనే దానిపై ఎన్నికైన ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. విప్ జారీ అధికారం ఎమ్మెల్యేలకు... దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్కు ఆయన వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిలుగా వ్యవహరించిన ప్రధాన కార్యదర్శులతో పాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకల్లా తెలంగాణ భవన్కు చేరుకోవాల్సిందిగా పార్టీ ఆదేశించింది. పార్టీ తరఫున గెలుపొందిన వారు చేజారకుండా చూసుకోవడంతోపాటు, పార్టీ నిర్ణయించిన వారిని చైర్మన్, మేయర్గా ఎన్నుకునేలా ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం కల్పించారు. ఈ మేరకు విప్ జారీకి ఏ, బీ ఫారాలను సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం అందజేశారు. ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేతోపాటు మరికొందరికి విప్ జారీ అధికారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. అవసరమైన చోట క్యాంపులు... మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవుల కోసం పార్టీలో అంతర్గత పోటీ ఉన్న చోట పార్టీ తరఫున గెలుపొందిన వారిలో చీలిక రాకుండా నివారించడంతో పాటు, విపక్ష పార్టీలు ఎక్కువ స్థానాలు సాధించే మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్లు చేజారకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. రెబెల్స్ బరిలో ఉన్నచోట మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని వారి మద్దతు కూడా టీఆర్ఎస్ మేయర్, చైర్మన్ అభ్యర్థులకే లభించేలా చర్యలు చేపట్టనుంది. ఈ నెల 27న మేయర్, చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో రెండు రోజుల పాటు పార్టీ తరఫున గెలుపొందిన వారిని అవసరమైన క్యాంపులకు తరలించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచారం తదితరాలను తెలంగాణ భవన్ నుంచి పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ పర్యవేక్షించింది. శనివారం మున్సిపాలిటీల వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు పార్టీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేసింది. -
పదింటి కల్లా తొలి ఫలితం
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల తొలి ఫలితం శని వారం ఉదయం 10 గంటల కల్లా వెల్లడవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి చెప్పారు. సాయంత్రానికి 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామన్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు అవసరమైన మార్గదర్శకాలను జారీచేసినట్లు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఈసీ అధికారులు అశోక్, జయసింహారెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచే ప్రత్యేక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, ఎన్నిక పూర్తయ్యే వరకు అది కొనసాగుతుందన్నారు. ఇందులో అభ్యర్థులపై వ్యయ పరి మితి ఉండదని, వర్గాల మధ్య వైరం ఏర్పడేలా, గొడవలకు దారితీసేలా ప్రవర్తనా, తీరు ఉండరాదని, సాధారణ కోడ్లోని ఇతర అంశాలు వర్తిస్తా యన్నారు. అధికార పార్టీకి ఎక్కువ నిబంధనలు వర్తిస్తాయని, మద్దతు కోసం కాంట్రాక్ట్లు, పదవులు ఇస్తామనే వాగ్దానాలు చేయరాదని అన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు.. ఈ నెల 27న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మేయర్లు/డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు/డిప్యూటీ చైర్పర్సన్లను ఎన్నుకుంటారని నాగిరెడ్డి తెలిపారు. పరోక్ష పద్ధతుల్లో జరగనున్న ఈ ఎన్ని కల కోసం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో గెజిటెడ్ అధికారిని రిటర్నింగ్ అధికారిగా సంబంధిత జిల్లా కలెక్టర్లు నియమిస్తారని, వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. శనివారం కౌంటింగ్ ముగియగానే మేయర్, చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని గెలిచిన సభ్యులు, ఎక్స్ అఫీషియోలుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆర్వోలు నోటీసులిస్తారని తెలిపారు. ఎక్స్ అఫిషియో సభ్యులు తమ నియోజకవర్గ లేదా ఇతరత్రా పరిధిలోనే ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ఏదో ఒకచోట మాత్రమే సభ్యులుగా చేరి తమ ఓటును ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటు ఈ నెల 29న కరీంనగర్ మేయర్/డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు. ఎక్కడ ఆప్షన్ ఇస్తే అక్కడే.. మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగాయని, ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఎక్స్ అఫిషియోలుగా ఉన్న వారు ఏదో ఒక చోట మాత్రమే నమోదు చేసుకుని ఓటేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకసారి ఒకచోట ఆప్షన్ ఇచ్చాక దానికి మార్చుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు ముగిసే లోగా ఆప్షన్లు ఇస్తే మంచిదని చెప్పారు. సమాన ఓట్లు వస్తే లాటరీ.. ఎక్కడైనా ఇద్దరు అభ్యర్థులకు (సభ్యుల ఎన్నిక, మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికతో సహా) సమానమైన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తామని నాగిరెడ్డి చెప్పారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, డిప్యూటీ చైర్పర్సన్లుగా పేర్లను ప్రతిపాదిస్తూ సంబంధిత రాజకీయ పార్టీలు ఫారం–ఏలను 26న ఉదయం 11 గంటల కంటే ముందుగా, ఫారం–బీలను 27న ఉదయం 10 గంటల్లోగా రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో ఎవరికి విప్ అధికారాన్ని కల్పిస్తున్నారో తెలియజేస్తూ రాజకీయ పార్టీల బాధ్యులు 26న ఉదయం 11 గంటల్లోగా తెలియజేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగానే ఉందని, 2014లో మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల శాతం 75.82తో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో 74.40 శాతంగా కార్పొరేషన్లలో గతంలోని 60.63 శాతంతో పోల్చితే ఇప్పుడు 58.83 శాతం నమోదైందని చెప్పారు. -
పట్టణం ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శనివారం ఉదయం మొదలు కానుంది. పదింటికల్లా తొలి ఫలితం వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. తమ తమ అంచనాల మేరకు ఫలితాలు వస్తాయా రావా అన్న దానిపై పార్టీలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ జరిగిన సరళిని బట్టి గతంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాల తరహాలోనే పురపోరులోనూ టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం వస్తుందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అటు మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్లు అన్నింటినీ తామే కైవసం చేసుకుంటామనే విశ్వాసం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక, ప్రతిపక్షాల విషయానికి వస్తే గట్టి పోటీ ఇచ్చామనే అంచనాలో కాంగ్రెస్ ఉంది. 30 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతోంది. బీజేపీ కూడా కార్పొరేషన్లలో అందరి అంచనాలకు మించి ఫలితాలొస్తాయనే ఆశాభావంతో ఉంది. ఎంపిక చేసుకుని పోటీచేసిన స్థానాల్లో తమకు కూడా తగిన ప్రాతి నిధ్యం లభిస్తుందని, గత మున్సిపల్ ఎన్నికల కంటే మంచి ఫలితాలు సాధిస్తామని ఎంఐఎం చెబుతుండగా, వామపక్షాలు, టీజేఎస్ తదితర పార్టీలు అరకొర సీట్లపై ఆశలు పెట్టుకున్నాయి. అన్ని సర్వేలదీ అదే మాట మున్సిపోల్స్ ఫలితాలు నేటి మధ్యాహ్నానికి అధికారికంగా వెల్లడి కానుండగా, పోలింగ్ పూర్తయిన రోజే అన్ని రాజకీయ పక్షాలు ఓ అంచనాకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూడా అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ప్రీపోల్, పోస్ట్పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఈనెల 27న జరగనున్న మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నికపై అధికారి పార్టీ అప్పుడే దృష్టి సారించింది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో తమదే పైచేయి అవుతుందని, ఒకట్రెండు స్థానాలు తగ్గిన చోట్ల ఎక్స్అఫీషియో ఓట్ల ఆసరాతో పుర పీఠాలను దక్కించుకోవాలని యోచిస్తోంది. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లను సులువుగా కైవసం చేసుకుంటామనే ధీమా కూడా ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పల్లెల నుంచి కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన అన్ని స్థానాల్లో తమదే విజయమని గులాబీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చామనే ధీమాలో ఉంది. పట్టణ ప్రజలు తమ వైపు మొగ్గుచూపారని, ఊహించని ఫలితాలు వస్తాయని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నా.. 30 శాతం ఓట్లు, సీట్లు తమ ఖాతాలో పడతాయనే ఆశతో టీపీసీసీ నేతలున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మంతో పాటు ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్న స్థానాల్లో తాము మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు లెక్కలు కట్టుకుంటున్నారు. ఇక, బీజేపీ విషయానికి వస్తే కమలనాథులు కూడా ఈసారి తమకు వచ్చే ఓటు బ్యాంకు భవిష్యత్ రాజకీయ మార్పులకు పునాది అవుతుందని చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో ఎలా ఉన్నా కార్పొరేషన్లలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు, సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలంటున్నారు. ఎంఐఎం కూడా నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో మంచి ఓట్లు సాధిస్తామని, గతంలో తమకు మున్సిపాలిటీల్లో ఉన్న ప్రాతినిధ్యం కన్నా ఈసారి పెరుగుతుందని అంచనా వేస్తోంది. మొత్తమ్మీద టీఆర్ఎస్ అనుకూల ఫలితాలే వస్తాయనే అంచనాల మధ్య నేటి ఉదయం ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నానికి ముగిసే అవకాశాలుండటంతో సాయంత్రం 4 గంటల కల్లా కొత్త పురపాలకులపై స్పష్టత రానుంది. కార్పొరేషన్లలో ఏమవుతుంది? ఈనెల 22న ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార టీఆర్ఎస్ అనుకూల ఫలితం దాదాపు ఖాయమే అయినా ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. 20–22 శాతం చొప్పున ఓట్లు ఆ రెండు పార్టీలకు వస్తాయనే అంచనా ఉండగా, కార్పొరేషన్లలో కూడా కాంగ్రెసే రెండో స్థానంలో ఉంటుందని కొన్ని సర్వేలు చెపుతుండగా, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ కన్నా స్వల్ప ఆధిక్యత బీజేపీకే వస్తుందని అంటున్నాయి. రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కార్పొరేషన్లలో బీజేపీ మంచి ప్రభావం చూపిందనే లెక్కలు చూపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ వర్గాలు కూడా సర్వేల మాట ఎలా ఉన్నా కార్పొరేషన్లలోనూ బీజేపీ కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని, బీజేపీకి పడే ఓట్లు టీఆర్ఎస్ నుంచే వెళ్తాయి కాబట్టి తమకు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నాయి. మొత్తంమీద కార్పొరేషన్లతో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు,సీట్లు వస్తాయి.. ఆ పార్టీకి వచ్చే ఓట్లు టీఆర్ఎస్, కాంగ్రెస్లలో ఎవరికి నష్టం చేకూరుస్తాయన్నది భవిష్యత్ లె లంగాణ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. క్యాంపులకు వెళ్దాం..చలో చలో ఫలితాలు రాక ముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులతో ఇప్పటికే కొన్ని చోట్ల క్యాంపులకు వెళ్లిపోగా, నేటి ఫలితాల ను బట్టి ‘క్యాంపులు’ ముమ్మరం కానున్నాయి. హైదరాబాద్ శివార్లలోని రిసార్టులు, వైజాగ్తో పాటు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను దీనికోసం ఎంచుకుంటున్నారు. ఇప్పటికే టూర్ ప్యాకేజీలూ సిద్ధం చేసుకోగా, ఫలితాలు వెలువడ గానే గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ను తీసుకెళ్లి ఈనెల 27న మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక కార్యక్రమానికి వచ్చేలా పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్యాంపులకయ్యే ఖర్చును భరించేందుకు కూడా చైర్మన్, మేయర్ ఆశావాహులు వెనుకాడకపోవడంతో రాష్ట్రంలోని 50 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలిచిన వారు క్యాంపులకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
గతంతో పోలిస్తే ఈసారి తక్కువే: ఈసీ
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. రేపు(జనవరి 25) 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలకశాఖ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ... కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ రోజు (శుక్రవారం) కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 58 డివిజన్లకు పోలింగ్ జరిగింది. వీటి కౌంటింగ్ జనవరి 27న చేపట్టనున్నట్టు తెలిపారు. ఫలితాలు విడుదల చేసేంతవరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.(మూడు చోట్ల రీపోలింగ్ ) గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం తక్కువ అయ్యిందని అన్నారు. ఈ సారి మున్సిపాలిటీల్లో 74.40 శాతం..గతంలో 75.85 శాతం పోలింగ్ నమోదయ్యిందని తెలిపారు. అదే విధంగా రాజకీయ పార్టీలు మేయర్, చైర్మన్ల పేర్లను ఏ-ఫారం, బీ-ఫారం రూపంలో ఇవ్వాలన్న ఈసీ ఈ నెల 26న 11 గంటల వరకు ఏ-ఫారం, 27న ఉదయం 10 గంటల వరకు బీ-ఫారం సమర్పించాలని సూచించింది. ఈ సారి కార్పొరేషన్ల లో 58.83 శాతం.. గతంలో60.63 శాతం నమోదు అయ్యినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్ కు పూర్తి స్థాయి లో ఏర్పాట్లు చేశామన్నారు. చైర్మన్, మేయర్ ఎన్నిక ప్రక్రియ పరోక్ష పద్దతిలో సాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీలు తన నియోజకవర్గం పరిధిలో ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఓటు హక్కు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలెక్టర్కు ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. చదవండి : 27న మేయర్లు, చైర్మన్ల ఎన్నిక -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
సాక్షి, ఖమ్మం: ఎన్నికలు అంటే మద్యం, డబ్బులు అనేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. సామాన్యులు, మధ్యతరగతి వారు రాజకీయాల్లో పాల్గొనకుండా, మద్యం వ్యాపారులు, ఓట్లను కొనుగోలు చేసేవారు మాత్రమే రాజకీయాలు చేసే విధంగా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఖమ్మంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన ఎన్నికలు కావన్నారు. ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు కానే కావని విమర్శించారు. విచ్చలవిడి మద్యం, విపరీతమైన డబ్బులు, ప్రలోభాలకు, ప్రజాస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఎన్నికలని వ్యాఖ్యానించారు. అందరూ కలిసికట్టుగా పోరాడాలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన అవినీతి, అక్రమాలతో కూడగట్టిన వేల కోట్ల రూపాయలతో ఓటు విలువను దిగజార్చే కుట్ర చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపి సామాన్యులను రాజకీయాలకు దూరం చేసే కుట్రలో భాగంగా విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలను కలుషితం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను పాతర వేస్తున్నవారి నుంచి రాజకీయాలను కాపాడాలని కోరారు. అందుకోసం మేధావులు, ప్రజాస్వామిక వాదులు, చైతన్యవంతులు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున దుర్మార్గాలు, దౌర్జన్యాలు, డబ్బులు, మద్యం పంపిణీ జరిగినా.. మొక్కవోని ధైర్యంతో టీఆర్ఎస్ నేతల ఆగడాలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ పార్టీయేనని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఏమవుతుందో ఏమో? మూడు చోట్ల రీపోలింగ్ -
సర్వే : పురపోరులో కారు హవా..!
హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే కూడా ఇదే అంశం స్పష్టం చేసింది. జనవరి 17 నుంచి 19 వరకు 20 శాతం మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల పరిధిలో ప్రీ పోల్ సర్వేను చేపట్టినట్టు ఆ సంస్థ తెలిపింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో భారీ సంఖ్యలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని పేర్కొంది. పార్టీలు విజయం సాధించే స్థానాలు(ప్లస్ ఆర్ మైనస్ 3 శాతం) పార్టీ వార్డులు (మున్సిపాలిటీలు) డివిజన్లు(కార్పొరేషన్లు) టీఆర్ఎస్ 1950-2000 180-205 కాంగ్రెస్ 375-415 40-60 బీజేపీ 150-180 60-75 ఎంఐఎం 25-30 8-10 అలాగే కార్పొరేషన్లలో టీఆర్ఎస్కు 49.1 శాతం, కాంగ్రెస్కు 21 శాతం, బీజేపీకి 23.8 శాతం, ఎంఐఎంకు 3.3 శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. అలాగే 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్కు 52.3 శాతం, కాంగ్రెస్కు 23.3 శాతం, బీజేపీకి 16.1 శాతం, ఎంఐఎంకు 1.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కార్పొరేషన్లలో, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ స్పష్టమైన అధిక్యం కనబరుస్తుందని వెల్లడించింది. టీఆర్ఎస్తో పొల్చితే బీజేపీ, కాంగ్రెస్లు చాలా తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది. అలాగే కార్పొరేషన్లలో కాంగ్రెస్ కన్న బీజేపీ ఎక్కువ డివిజన్లను, అలాగే మున్సిపాలిటీల్లో బీజేపీ కన్న కాంగ్రెస్ ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంటుందని ఆ సంస్థ చెప్పింది. కార్పొరేషన్లలో ఓట్ల శాతం.. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం ఎన్నికలు జరగగా మొత్తం 70.26 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు పలు కారణాల వల్ల కరీంనగర్ కార్పొరేషన్కు మాత్రం శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. అలాగే కామారెడ్డి, భోదన్, మహబూబ్నగర్లలోని ఒక్కో కేంద్రంలో నేడు అధికారులు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఓట్ల శాతం.. -
స్ట్రాంగ్ రూం వద్ద 144 సెక్షన్ అమలు: జితెందర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్నిపల్ ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్ బాక్సులను ఎన్నికల నోడల్ అధికారుల గురువారం స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ జితేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను తరలించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి.. అధికారుల సమన్వయంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలించామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి 5వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, మూడేంచేల బలగాలతో భద్రత చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 25న ఫలితాలు విడుదల నేపథ్యంలో పటిష్టమైన బంధోబస్తును కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. -
షి'కారే'!
సాక్షి, మేడ్చల్ జిల్లా: గ్రేటర్ శివారుపురపాలక సంఘాల్లో కారుదే జోరు కొనసాగే అవకాశం కన్పిస్తోంది.బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అధికారపార్టీ కైవసం చేసుకుంటుందనిపరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఎన్నికలకు ముందేఐదు మున్సిపాలిటీల్లో తొమ్మిది వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీఆర్ఎస్..బుధవారం జరిగిన ఎన్నికల్లో జోరును పెంచినట్లు పోలింగ్ సరళిని పరిశీలిస్తే తెలుస్తున్నది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బోడుప్పల్ కార్పొరేషన్, తుర్కయంజాల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, తుక్కుగూడ, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో బీజేపీ, జల్పల్లిలో ఎంఐఎం పార్టీలు ప్రభావం చూపగా..మిగతా అన్ని చోట్లా టీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల మాత్రం స్వతంత్ర అభ్యర్థులు ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశాయి. నగర శివారులోని మున్సిపాలిటీల్లో అత్యధికం జనరల్కు రిజర్వు కావటం..పురపోరులో అత్యధికులు స్థిరాస్తి వ్యాపారులు నిలబడటం వల్ల ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయటానికి అభ్యర్థులు విచ్చవిడిగా మద్యం, డబ్బులు, గిఫ్టులు పంపిణీ చేశారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడాలేకుండా అన్ని పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. బోడుప్పల్, తుర్కయంజాల్ పురపాలక సంఘాల్లో కారుకు కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చినట్లు పోలింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. కాగా రెండు జిల్లాల్లో 631 వార్డులకు ఎన్నికలు జరగగా 395 వార్డుల్లో కారు, 102 వార్డుల్లో హస్తం, 64 వార్డులో కమలం, 56 వార్డుల్లో ఇతరులు గెలిచే చాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా ఎంఐఎం 20 నుంచి 25 వార్డుల్లో టీఆర్ఎస్ను బలంగా ఢీకొన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ శ్రేణులు, ముఖ్య కేడర్ నుంచి తెప్పించుకున్న సమాచారంతోపాటు తమ అంచనాల ప్రకారం గ్రేటర్ శివారు పురపాలక సంఘాలన్నింటినీ తామే గెలుచుకుంటామని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. సైలెంట్ ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. -
బ్యాలెట్పై ముందే సిరా గుర్తు!
రాజేంద్రనగర్: బ్యాలెట్ పేపర్లో ఓ అభ్యర్థి గుర్తుపై ముందే సిరాగుర్తు ఉండటంతో వివాదాస్పదమైంది. బుధవారం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. మున్సిపల్ పరిధి 20వ డివిజన్కు చెందిన ఐశ్వర్య తొలిసారి ఓటు వేసేందుకు కుటుంబీకులతో కలిసి బండ్లగూడ సరస్వతీ విద్యాలయంలోని పోలింగ్ బూత్కు వచ్చింది. దీంతో అధికారులు ఆమెకు బ్యాలెట్ పేపర్ను ఇచ్చారు. బ్యాలెట్పై అప్పటికే కారు గుర్తుపై సిరాతో ముద్ర వేసి ఉంది. దీంతో ఐశ్వర్య అభ్యంతరం వ్యక్తం చేసి ప్రిసైడింగ్ అధికారికి విషయం తెలిపి మరో బ్యాలెట్ పేపర్ కావాలని చెప్పాడు. ఓ వృద్ధుడు పొరపాటున బ్యాలెట్ పేపర్పై వేలి ముద్ర వేశాడని సముదాయించి అదే బ్యాలెట్ పేపర్తో ఓటు వేయించారు. ఐశ్వర్య మాత్రం తనకు అన్యాయం జరిగిందని, తన ఓటు చెల్లకుండా పోయిందని ఆరోపిస్తూ అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా ఎన్నికల అబ్జర్వర్ నాయక్, బండ్లగూడ ఆర్వో కృష్ణమోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. అధికారులు ఆమెను సముదాయించి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. వేసిన ఓటు తప్పకుండా చెల్లుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ముందే ఓటేశారు.. బ్యాలెట్ పేపర్లలోని కారు గుర్తుపై ముందే సిరా గుర్తుతో ఓటు వేశారని 20వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అభిలాష్ ముదిరాజ్ ఆరోపించారు. తాను మొదటి నుంచే బ్యాలెట్ పేపర్లను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని, పోలీసులు తనను పోలింగ్ బూత్ వద్దకు రానివ్వలేదని మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్లలోని కారు గుర్తుపై మందే సిరా ముద్రలు ఉన్నాయని చాలామంది తనకు ఫిర్యాదు చేశారని అభిలాష్ తెలిపారు. ఓడిపోతామనే భయంతో పోలీసులు, పొలింగ్ సిబ్బందితో టీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై ఇలా చేశారన్నారు. ఐశ్వర్య ఫిర్యాదు తన ఆరోపణలకు బలం చేకూరిందని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
మళ్లీ నీ నటనతో నవ్వించు: ఎమ్మెల్యే
సాక్షి, సంగారెడ్డి: అంధోల్ మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుదని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని అంధోల్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోకు ఆకర్షితులై టీఆర్ఎస్ అభ్యర్థులను ఓటర్లు ఆదరించారన్నారు. గత పాలకుల పని తీరుకు విసిగిపోయిన ప్రజలు ఈసారి తమ ఓటు బలంతో అంధోల్ను అభివృద్ధి పరుచుకున్నారన్నారు. అంధోల్ను భ్రష్టు పట్టించిన మాజీ మంత్రి బాబుమోహన్కు టీఆర్ఎస్ నేతలపై మాట్లాడే నైతిక హక్కు లేదని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి తన సొంత నిధులను ఖర్చు చేయలేని దద్దమ్మ అని విమర్శించారు. అంధోల్ అభివృద్ధికి అడ్డుపడ్డ బాబుమోహన్, ఆర్థిక మంత్రి హరీష్ రావును విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇక సినిమాలో నవ్వించిన ఆయన మళ్లీ ఆ రంగంలో ఇన్నింగ్స్ మొదలు పెట్టమని, సేద తీరే సమయంలో ఆయన నటన చూసి నవ్వుకుంటామని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. -
తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్
-
కాయ్ రాజా కాయ్
నిజామాబాద్, ఆర్మూర్: బల్దియా ఎన్నికలేమో గానీ జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. గెలుపు కోసం అభ్యర్థులు భారీగానే ఖర్చు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఓట్ల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు.! అయితే, మున్సిపల్ ఎన్నికల్లో అంతా బిజీగా ఉంటే, మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు కూడా బిజీగా మారారు. ఏ వార్డులో ఎవరు గెలుస్తారనే జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. వివిధ పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికల బల్దియా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థుల గెలుపోటములపై పందెం కడుతూతమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలోని నాలుగు బల్దియాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. అయితే, అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత బలాబలాలు, విజయావకాశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్లోని కొత్తబస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, గోల్బంగ్లాల వద్ద బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. క్రికెట్ బెట్టింగ్లా చైన్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో ఆయా పార్టీల అభ్యర్థులపైనే ఎక్కువగా పందాలు కాస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఒకరు, కాదు తమ నాయకుడే గెలుస్తారని ఇంకొకరు బెట్టింగ్లు కడుతున్నారు. జిల్లాతో పాటు ఆర్మూర్ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్లు, మట్కా జూదం గతంలో విచ్చలవిడిగా సాగిన సందర్భాలున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ బడాబాబుల బిడ్డలే ఎక్కువగా ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభం అయిన నాటి నుంచే ఈ బడా బాబులు అభ్యర్థుల గెలుపు, ఓటమిలపై చర్చించుకోవడం ప్రారంభించారు. తమ విశ్లేషణ ప్రకారం పలాన అభ్యర్థి కౌన్సిలర్గా భారీ మెజారిటీతో గెలుపొందుతాడు చూడండి అంటూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు పందాలు కాస్తున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఈ బెట్టింగ్లలో పాల్గొంటున్నారు. కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపోటములతో పాటు చైర్ పర్సన్ పీఠాన్ని ఫలానా వ్యక్తి కైవసం చేసుకుంటాడు కావాలంటే బెట్ కట్టండి అంటూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల గురించి చర్చించుకునే వారికి, బెట్టింగ్లు కట్టే వారికి మంచి టైంపాస్ వ్యవహారంగా మారింది. -
చెన్నూర్లో పోలింగ్కు ముందురోజు షాక్..?
మంచిర్యాల, చెన్నూర్: చెన్నూర్ టీఆర్ఎస్లో పోలింగ్కు ముందు ముసలం మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్గా అభ్యర్థిగా అర్చనరాంలాల్గిల్డాను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రకటించారు. దీంతో ఆరో వార్డుకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ కృష్ణ భార్య సాధనబోయిన లావణ్య తన ఇంటివద్దే కృష్ణ మద్దతుదారులు నిరసనకు దిగారు. మొన్నటివరకు లావణ్యను చైర్పర్సన్గా ప్రకటిస్తానని చెప్పి ఇప్పుడు బాల్క సుమన్ మాట తప్పారని కృష్ణ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ కృష్ణ ఇంటికి వచ్చి నిరసన నిలిపివేయాలని చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్తో సయోధ్య కుదుర్చుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. దీంతో కృష్ణ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఆరో వార్డులో చేస్తున్న పోటీనుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని విలేకరుల ఎదుట ప్రదర్శించారు. చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డులకు ఏడు వార్డులు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యేందుకు చక్రం తిప్పిన విప్ సుమన్.. తిరుగులేని నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. చైర్పర్సన్ ప్రకటన చేయడంతో సొంత పార్టీలోనే నిరసన ప్రారంభం కావడం విశేషం. అలక వీడిన అభ్యర్థి నిరసనకు దిగిన అభ్యర్థిని ఇంటికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ మరోమారు వెళ్లి వారిని సముదాయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక.. చైర్పర్సన్ ఎంపికకు ఈనెల 28వరకు సమయం ఉండడంతో ఆలోపు ఆలోచిద్దామని, అప్పటివరకు వేచి ఉండాలని సూచించారు. విప్ సుమన్ ఇదే విషయం తెలిపారని పేర్కొన్నారు. దీంతో సదరు అభ్యర్థి అలకవీడి.. రాజీనామా వెనక్కి తీసుకున్నారు. -
కాసుల గలగల
వనపర్తిటౌన్: వనపర్తి ఆర్టీసీకి సంక్రాంతి కలిసి వచ్చింది. ఏన్నాడు లేని రీతిలో ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. ఎనిమిది రోజుల్లో రూ.143.52 లక్షల ఆదాయం రాబట్టింది. రోజువారీగా వచ్చే ఆదాయం కంటే అదనంగా ఆదాయం సమకూరడంతో పాటుగా ఈనెల 20వ తేదీ ఒక్కరోజునే రూ.22 లక్షల ఆదాయం సమకూరింది. ఒక్కరోజు వనపర్తి ఆర్టీసీ రూ.22లక్షల ఆదాయం రాబట్టడం డిపో చరిత్రలోనే ఇది తొలిసారి అని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రోజువారి కంటే అదనంగా, పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను అధికంగా చేరవేయడంతో ఈ ఆదాయం సమకూరింది. పండుగకు ముందు, తిరుగు ప్రయాణాల్లో ఆదాయం సమకూర్చుకునేందుకు ఈనెల 11నుంచి ఆర్టీసీ అదనంగా 160 ట్రిప్పులు బస్సు సర్వీసులునడిపింది. ప్రత్యేక బస్సులను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడిపేందుకు ఆర్టీసీ తీసుకున్న చొరవతో అదనపు ఆదాయం ఆర్జించింది. రోజు వచ్చే ఆదాయం రూ.14.50 లక్షలు కాగా, పండుగ సీజన్లో రూ.17.94 లక్షల ఆదాయం వచ్చింది. ఇలా ఈనెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రూ.కోటి 43లక్షల 52వేలు వసూలు చేసింది. డిపోలో సంబరాలు వనపర్తి ఆర్టీసీ డిపోలో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. ఈనెల 20వ తేదీన ఒక్కరోజే రూ.22లక్షల ఆదాయం రావడంతో అధికారులు, ఉద్యోగులు స్వీట్లు తినిపించుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమష్టి కృషి వల్లే ఆర్టీసీకి రీజియన్లో అత్యధిక ఆదాయం సమకూరిందని డీఎం దేవదానం, ఏడీఎం దేవేందర్గౌడ్ అన్నారు. -
‘కట్ట’లు తెంచుకున్నాయ్!
సాక్షి నెట్వర్క్,నల్లగొండ : ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు చివరి అస్త్రంగా అడ్డూఅదుపు లేకుండా తాయిలాలు చెల్లించేశారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఎన్నికల్లో ఓటర్లకు నగదు, మద్యం, బియ్యం, కిరాణ సరుకులు వెండి, బంగారు ఆభరణాలు పంపిణీ చేశారు. సోమ, మంగళవారాల్లో పోటీపోటాగా నగదు పంపిణీ చేయగా, బుధవారం కూడా ఈ ‘పంచు డు’ కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కొన్ని మున్సిపాలిటీల్లో గంటగంటకూ ఓటు రేటు పెంచుకుంటూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక పార్టీ అభ్యర్థి ఓ టుకు ఇంత అని ఇస్తే.. మరో పార్టీ అభ్యర్థి దానికి కొంత కలిపి ఎక్కువ ముట్టజెబుతున్నాడు. చండూరులోని ఓ వార్డులో ఓటుకు ఏకంగా రూ.15వేల దాకా చెల్లిస్తుండడం గమనార్హం. ♦ నీలగిరి మున్సిపాలిటీలో అభ్యర్థులు పోటా, పోటీగా డబ్బుల పంపిణీ చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు బీజేపీలోని కొంత మంది అభ్యర్థులు ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చారు. వన్టౌన్ ప్రాంతంలోని ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి.. ప్రత్యర్థికి చెందిన అనుకూల ఓటర్లకు రూ.1500 చొప్పున పంపిణీ చేసినట్లు ఓటర్లే చెబుతున్నారు. టూటౌన్ ప్రాంతంలోని ఓ వార్డులో రూ.1500 నుంచి రూ.2 వేలు, ఆఫ్ బాటిల్ మందు పంపిణీ చేసినట్లు తెలిసింది. ♦ మిర్యాలగూడలో కొన్ని వార్డులలో ఓటు రేటు అమాంతం పెరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో ఓటుకు వెయ్యి రూపాయలు పంచాలని ఆయా రాజకీయ పార్టీల నాయకులు అనుకున్నారు. కానీ గెలుపే లక్ష్యంగా ఒక్కసారిగా రేటు పెంచారు. పట్టణంలోని ప్రధానంగా పోటీ ఉన్న వార్డులలో ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసినవి కాకుండా పోలింగ్కు వెళ్లే ముందు కూడా మళ్లీ ఇస్తామని హామీ ఇస్తున్నారు. ♦ దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈసారి ఓటుకు రేటు బాగా పెరిగింది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా మరీ కీలక వార్డుల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఓట ర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బులు వెదజల్లుతున్నా రు. మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డుల్లో ఓటుకి సు మారు రూ.7వేల వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. సోమవారం నాటికే ఎక్కువ శాతం ఓటర్లకు డబ్బులు చేరాయి. ♦ చండూరు మున్సిపల్ ఎన్నికలు మరీ కాస్ట్లీ అయ్యాయి. ఇక్కడ ప్రధాన పార్టీ అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.10వేల వరకు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు అడుగు ముందుకేసీ ఓటుకు రూ.15వేలకు పైగా ఇస్తున్నా రు. ఇవేగాకుండా బియ్యం బస్తాలు, మద్యం, మహిళలకు చీరలు తదితర వస్తువులు అందించినట్లు తెలుస్తోంది. ♦ హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఓటు విలువను రూ. 7వేల వరకు పెంచారు. మంగళవారం పలు వార్డుల్లో ఓటుకు రూ.2వేలు, మరికొందరికి రూ. 2500 నుంచి రూ. 7వేల వరకు డబ్బులు పంపిణీ చేశారు. వీటితోపాటు చీరలు, మద్యాన్ని క్వార్టర్నుంచి పుల్ బాటిల్ వరకు మద్యం పంపిణీ చేశారు. ♦ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో ఓటరుకు రూ. 2వేల నుంచి రూ. 5వేల వరకు పంపిణీ చేయడంతో పాటు చీరలు, మద్యాన్ని ముట్టజెప్పారు. -
ఎమ్మెల్యే వియ్యంకుడి అడ్డగింత
సాక్షి, పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి వియ్యంకుడు చిట్టిరెడ్డి రాంరెడ్డిని మంగళవారం పెద్దపల్లిలో అడ్డుకున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు వచ్చాడని ఆరోపిస్తూ.. స్థానిక యువకులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే వియ్యంకుడికి అక్కడి నుంచి తప్పించారు. బయటివారు స్థానికంగా ఉండకూడదని ఉత్తర్వులున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్ది అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా సమరం సాగుతోంది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారంటూ పెద్దపల్లి పట్టణంలోని బండారికుంటకు చెందిన పలువురు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి వియ్యంకుడు చిట్టిరెడ్డి రాంరెడ్డిని, కట్కూరి సుధాకర్రెడ్డిలను మంగళవారం అడ్డుకున్నారు. బండారికుంటలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా డబ్బులను పంచేందుకే వచ్చారంటూ కాలనీకి చెందిన పలువురు యువకులు రాంరెడ్డిని అడ్డుకుని మీరు ఏ వార్డుకు చెందినవారు.. ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారో.. చెప్పాలంటూ ప్రశ్నిస్తూ తీసిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది. సుల్తానాబాద్లో పోలీసులతో విజయరమణారావు వాగ్వాదం బుధవారం ఉదయం పోలింగ్ జరగనుండడంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకే వచ్చారంటూ ఆరోపించిన యువకులు సెల్ఫోన్లలో వీడియో చిత్రీకరించే యత్నం చేయగా రాంరెడ్డి తన అనుకూలురైన వ్యక్తి బైక్పై వెళ్లేందుకు యత్నించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి ఎమ్మెల్యే వియ్యంకుడిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయమై ఎస్ఐ ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాంగ్రెస్ నాయకులకు బెదిరింపులా..? సుల్తానాబాద్ (పెద్దపల్లి): సుల్తానాబాద్ కాంగ్రెస్ నేత అంతటి పుష్పలత అన్నయ్యగౌడ్ ఇంటి గోడ దూకి పోలీసులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి భయబ్రాంతులకు గురి చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు. కొద్దిసేపు కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు వాగ్వాదం జరగగా, అనంతరం సోదాలు నిర్వహించారు. 15వ వార్డుకు చెందిన ఓ అభ్యర్థి 45 చీరలు ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. 11వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు మద్యం బాటిళ్లు 48 తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మూడోసారి ఆర్మూర్ పీఠం ఎవరిదో..?
సాక్షి, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ చరిత్రలో మూడో పాలకవర్గం కోసం ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధంమైంది. యాభై రెండు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీగా ఉన్న ఆర్మూర్ను పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామపంచాయతీగా మార్చారు. సుమారు 44 సంవత్సరాలు గ్రామపంచాయతీగా కొనసాగిన అనంతరం తిరిగి 2006 మే 26న నాటకీయ పరిణామాలమధ్య మున్సిపాలిటీగా మార్చారు. తొలి మున్సిపల్ చైర్మన్ కేవీ నరసింహారెడ్డి 1956 నుంచి 1962 వరకు ఆర్మూర్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చైర్మన్గా కేవీ నరసింహారెడ్డి ఎన్నికైయ్యారు. తరువాత గ్రామపంచాయతీగా మారింది. 2001 నుంచి 2006 వరకు గ్రామ పంచాయతీకి చివరి సర్పంచ్గా కొంగి సదాశివ్ బాధ్యతలు నిర్వహించారు. తిరిగి ఆర్మూర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తరువాత మొదటి సారిగా 2008లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆర్మూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గానికి మూడో పర్యాయము మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డులు - 36 ఓటర్లు - 55,016 పురుషులు - 26,601 మహిళలు - 28,413 ఇతరులు - 02 పట్టణ జనాభా - 67,252 చైర్పర్సన్ రిజర్వేషన్ - బీసీ మహిళ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఈ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అందుకే ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డి పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం పోలింగ్ నిర్వహించి ఈ నెల 25వ తేదీన కౌంటింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విలీన గ్రామాలైన పెర్కిట్–కొటార్మూర్, మామిడిపల్లిని కలుపుతూ ఆర్మూర్ పట్టణ జనాభా 67, 252గా ఉంది. పట్టణంలో మొత్తం ఓటర్లు 36 వార్డులకు 55,016 మంది కాగా అందులో పురుషులు 26, 601 మంది, మహిళలు 28,413 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. బీసీ ఓటర్లే అధికం మొత్తం ఓటర్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలుగా విభజించగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్లు 44,727 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 21,520 మంది ఓటర్లు, మహిళలు 23,207 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 4,518 మంది కాగా వీరిలో పురుషులు 2,104 మంది, మహిళలు 2,414 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 664 మంది కాగా అందులో పురుషులు 313 మంది, మహిళలు 351 మంది ఉన్నారు. ఇక మిగిలిన ఓసీ ఓటర్లు 5,105 మంది కాగా అందులో పురుషులు 2,663 మంది, మహిళలు 2,442 మంది ఉన్నారు. 24వ వార్డులో అత్యధికంగా 1,714 మంది ఓటర్లు ఉండగా 9వ వార్డులో అత్యల్పంగా 1,348 మంది ఓటర్లు ఉన్నారు. -
ముగిసిన మున్సిపల్ పోలింగ్
సాక్షి, తెలంగాణ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 120 మున్సిపాలిటీలకు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. 5 గంటలలోపు క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. అత్యధికంగా ఆదిభట్లలో అత్యల్పంగా నిజాంపేటలో పోలింగ్ నమోదు. ఈనెల 25న ఎన్నికల లెక్కింపుజరగనుంది.సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీ సమేతంగా వచ్చి 22 వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.అందోల్ జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తొమ్మిదవ వార్డు నుండి ఎంపీడీఓ కార్యాలయ పోలింగ్ కేంద్రంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ. సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని పోలింగ్ కేంద్రం వద్ద చనిపోయిన వ్యక్తి ఓటు వేశారంటూ కాంగ్రెస్ నాయకుల ఆందోళన చేపట్టారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ. చోటుచేసుకుంది. ఇల్లందులోనిమెయిన్ రోడ్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూతులో డబ్బులు పంపిణీ చేస్తున్న 9వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్ధిని స్వతంత్ర అభ్యర్థి పోలీసులకు అప్పగించారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధు తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అధికార పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస పార్టీ 5వ డివిజన్ అభ్యర్థి మురుగేష్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేయించాడని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఒకటవ వార్డు లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్లో 7వ డివిజన్ 24 25 26 27 భూతులలో రెండో ఓటు వేసేందుకు వచ్చిన ముగ్గురు మహిళలను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి మున్సిపాలిటీ ఎన్నికలలో దొంగ ఓట్లకు పాల్పడుతున్న ముఠాను నార్సింగి పోలీసులు. అరెస్ట్ చేశారు. డబ్బులు తీసుకొని దొంగ ఓట్ల పాల్పడుతున్న పురుషులతో పాటు మహిళలు ఉండడం గమనార్హం. 12 మహిళలు.8.పురుషులను అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మద్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట- 73.7 శాతం ఓట్లు నమోదు, హుజూర్ నగర్ - 73.97 శాతం నమోదు, దుండిగల్ మున్సిపాలిటీ- 60.74 శాతం పోలింగ్ నమోదు, కొంపల్లి మున్సిపాలిటీ - 59.09 శాతం పోలింగ్ నమోదు.డోర్నకల్ మున్సిపాలిటీ - 72.6 శాతం పోలింగ్ నమోదు, వర్ధన్నపేట మున్సిపాలిటీ- 80.04పోలింగ్ శాతం నమోదు, హుజురాబాద్ -75.02 శాతం నమోదు, నర్సంపేట -75.28 శాతం నమోదు, హుస్నాబాద్ - 77.86 శాతం నమోదు, కొత్తపల్లి -71.68 శాతం నమోదు,మెట్పల్లి -63.43 శాతం నమోదు,భీంగల్ - 67.24 శాతం నమోదు, తిరుమలగిరి -82.45 శాతం నమోదు, కోరుట్ల - 64.49 శాతం నమోదు, చౌటుప్పల్-85శాతం నమోదు, అమరచింత- 74.47, పరిగి- 64.83 శాతం నమోదు,, చొప్పదండి- 71.37 శాతం నమోదు, మెదక్ - 74.16,శాతం నమోదు, ధర్మపురి- 71.70 శాతం నమోదు, మోత్కూరు -81.19 శాతం నమోదు, జమ్మికుంట- 71.98శాతం నమోదు, మధిర - 72.14 శాతం నమోదు, తుక్కుగూడ మున్సిపాలిటీ- 74.21 పోలింగ్ నమోదు, ఆదిబట్ల మున్సిపాలిటీ- 85.5 శాతం పోలింగ్ నమోదు, కామారెడ్డి - 61.30 శాతం నమోదు, బాన్సువాడ - 71.65 శాతం నమోదు, ఎల్లారెడ్డి - 74.02 శాతం నమోదు. ఇల్లందులో పోలింగ్ బూత్ లో డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థిని పట్టించుకోకపోవడం పట్ల ఎన్డీ నేతల ఆందోళన తుంకుంట- 61.89 శాతం ఓటింగ్ నమోదు, సుల్తానాబాద్- 77.1శాతం పోలింగ్, తొర్రూరు మున్సిపాలిటీ- 65.54 శాతం పోలింగ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ -71.79 శాతం నమోదు, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్- 55.26 శాతం నమోదు, జలపల్లి - 42 శాతం నమోదు, శంషాబాద్- 61 శాతం నమోదు, కోదాడ -72.41 శాతం నమోదు, జనగామ -69.57 శాతం నమోదు,అమీన్ పూర్ -56.89 శాతం నమోదు, శంకర్ పల్లి -73.17 శాతం నమోదు, జగిత్యాల -58.43 శాతం నమోదు, లక్సెట్టిపేట -72.47 శాతం నమోదు, చెన్నూరు- 69.35 శాతం నమోదు, క్యాతనపల్లి -68.15 శాతం నమోదు, మక్తల్- 65.74 శాతం నమోదు, యాదగిరిగుట్ట- 83.19 శాతం నమోదు,పరకాల మున్సిపాలిటీ-74.97 శాతం నమోదు, జమ్మికుంట మున్సిపాలిటీ - 71.98 శాతం నమోదు, సిరిసిల్ల మున్సిపాలిటీ-68.69 శాతం నమోదు, వేములవాడ మున్సిపాలిటీ - 74.65 శాతం నమోదు, రామగుండం కార్పొరేషన్ - 57.63 శాతం, పెద్దపల్లి మున్సిపాలిటీ -68.54 శాతం నమోదు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ- 77.21 శాతం, మంథని మున్సిపాలిటీ - 74.86 శాతం నమోదు, కోరుట్ల మున్సిపాలిటీ- 64.49 శాతం నమోదు, రాయికల్ మున్సిపాలిటీ- 60.47 శాతం నమోదు,సత్తుపల్లి మున్సిపాలిటీ- 71.82 శాతం, మెదక్ , 74 ,16 తూప్రాన్ -75 ,64 శాతం నమోదు, రామయంపేట్- 80.5 శాతం నమోదు, నర్సాపూర్ -61.63 శాతం నమోదు,సంగారెడ్డి -67.02 శాతం నమోదు, ఆందోలు -76 .7 శాతం నమోదు, నారాయణ్ ఖేడ్ - 68 .8 శాతం నమోదు, సదాశివపేట - 75 -58 శాతం నమోదు, ఐడిఏ బొల్లారం- 60.,4 శాతం నమోదు, తెల్లపూర్ -74 .02 శాతం నమోదు, అమీన్ పూర్ -56.9 శాతం నమోదు, హుస్నాబాద్ -77.86 శాతం నమోదు, గజ్వెల్ 74.21 శాతం నమోదు, దుబ్బాక -76.3 శాతం నమోదు, చేర్యాల -74.04 శాతం నమోదు. పెద్దపల్లిలోని.రామగుండం కార్పొరేషన్ హనుమాన్ నగర్ లో రూ. 76,000 ల విలువచేసే 245 మద్యం బాటిల్ లు, 36,300 ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. పోలింగ్ అప్డేట్స్ ► పెద్దపల్లి బండారీ కుంటలో పోలీసుల తీరుపై రోడ్ పై కాంగ్రెస్ నాయకులు బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. ► సిరిసిల్ల 18వ వార్డులో స్వతంత్య్ర అభ్యర్థికి, టీఆర్ఎస్ అభ్యర్థి మధ్య గొడవలు రావడంతో పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ►మంచిర్యాల 14వ వార్టులో ఇద్దరు నకిలీ ఓటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ 5000 స్వాధీనం చేసుకున్నారు. గంటల వరకు తెలంగాణ లోని 120 మున్సిపాలిటీ లు, 9 కార్పొరేషన్ల లో 67.46 శాతం పోలింగ్ నమోదు ►మేడ్చల్ జిల్లాలో 3 గంటల వరకు 51.86 పోలింగ్ నమోదు ► రంగారెడ్డి జిల్లాలో 3 గంటల వరకు 55.1 శాతం పోలింగ్ ► కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 26 వార్డ్ లోని 63 64 పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత ► బోధన్ 32వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి మీర్ ఇల్యాజ్ అలీల మధ్య ఘర్షణ, టీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ కు గాయాలు. చికిత్స కొరకు బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలింపు.. మొహమ్మద్ ఇమ్రాన్ షరీఫ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే షకీల్. కేస్ నమోదు చేసిన పోలీసులు ► నిజామాబాద్లో పోలింగ్ సందర్భంగా పలు డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో స్వల్ప ఉద్రిక్తం నెలకొనడంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ► నిజామాబాద్ 41 వ డివిజన్ లో ఉద్రిక్తత. నెలకొంది. బీజేపీ ఎంపీ అర్వింద్కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని ఎంపీ ఆరవింద్ ఆరోపణలు చేశారు. ► పెద్ద అంబర్ పెట్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన దొంగ ఓటర్ను పట్టుకొని స్థానికులు దేహశుద్ది చేశారుతొర్రూరు ► మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శివలింగయ్య సందర్శించారు ► గద్వాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 58 వ పోలింగ్ బూత్ లో మాజీ మంత్రి డీకే అరుణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► కొడంగల్ మున్సిపాలిటీ లోని మొదటి వార్డు లో మాజీ ఎమ్మెల్యే ఆర్.గుర్నాథ్ రెడ్డి. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మంచిర్యాల జిల్లాలో 1 గంట వరకు 53.18 శాతం పోలింగ్ నమోదు ► మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ 5వ డివిజన్ అబ్యర్తి మురుగేష్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడని అడిగినందుకు మురుగేష్ కాంగ్రెస్ కార్యకర్తను చితక బాదాడు ►నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ►ఐటీ కంపెనీలు ఏవైతే సెలవు ప్రకటించని కంపెనీల పై ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ►నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం వీ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు సరిగా లేవంటూ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్లలో ఒక డివిజన్, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా 324 డివిజన్లు, 2,647 వార్డులకు అధికారులు పోలింగ్ను నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఓటర్లను గుర్తించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను ఉపయోగిస్తున్నారు. ► పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ 3వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల కార్యకర్తల్ని పోలీసులు తరిమికొట్టారు ►బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మధ్యాహ్నం 1 గంటల వరకు 49.10 శాతం పోలింగ్ నమోదు ►ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మధ్యాహ్నం 1 గంటల వరకు 45.91 శాతం పోలింగ్ నమోదు ►నిజాంపేట్ 1 గంట వరకు 26.08 శాతం పోలింగ్ నమోదు ► హుజురాబాద్ 1 గంట వరకు 61. 12 శాతం పోలింగ్ ►రంగారెడ్డి జిల్లా లో ఒంటి గంట వరకు 52.13 పోలింగ్ శాతం ►పరకాల మున్సిపాలిటీలో మధ్యాహ్నం1గంట వరకు 60.64 పోలింగ్ శాతం నమోదు ►డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికలలో మధ్యాహ్నం 1గంట వరకు 62.6 శాతం పోలింగ్ నమోదు ►తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1గంట వరకు 52.63శాతం పోలింగ్ నమోదు ►వర్ధన్నపేట మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1గంట వరకు 69.12శాతం పోలింగ్ నమోదు ►తుంకుంట మున్సిపాలిటీ లో మధ్యాహ్నం 1గంట వరకు 51.01శాతం పోలింగ్ నమోదు ►జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం 1గంట వరకు 60.65శాతం ఓట్లు పోలు అయ్యాయి మెట్పల్లిలోని రేగుంట గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ ►కోరుట్ల మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1గంట వరకు 52.55శాతం పోలింగ్ నమోదు ►సుల్తానాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మధ్యాహ్నం 1 గంట వరకు 63.03శాతం పోలింగ్ నమోదు ►మేడ్చల్ జిల్లా ఫిర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 33 శాతం పోలింగ్ నమోదు ►జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ ఇప్పటివరకు 25 శాతం పోలింగ్ ►రంగారెడ్డి జిల్లా ఆది బట్ల మున్సిపాలిటీ లో 11గంటల వరకు 51.86శాతం పొలింగ్ నమోదు ►తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 38.53% పోలింగ్ నమోదు. ►రాజేంద్రనగర్: మణికొండ మున్సిపాలిటీ పరిధిలో 10శాతం, బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో 14శాతం, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 15శాతం 11గంటల వరకు పోలింగ్ జరిగింది. ►చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 11 గంటల వరకు 47.06శాతం ఓటింగ్ జరిగింది ►సూర్యాపేట జిల్లాలో 11 గంటల వరకు 37.09శాతం పోలింగ్ నమోదు ►జగిత్యాల జిల్లాలో జగిత్యాల మున్సిపాలిటీ 28.89శాతం, మెట్ పల్లి మున్సిపాలిటీ 32.05శాతం, కోరుట్ల మున్సిపాలిటీ 33.43శాతం, రాయికల్ మున్సిపాలిటీ 32.64శాతం, ధర్మపురి మున్సిపాలిటీ 36.93శాతంగా 11 గంటల వరకు పోలింగ్ నమోదు ►పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ 26 శాతం, పెద్దపల్లి మున్సిపాలిటీ 38శాతం, సుల్తానాబాద్ మున్సిపాలిటీ 44శాతం, మంథని మున్సిపాలిటీ 47శాతంగా 11 గంటల వరకు పోలింగ్ నమోదు ►కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ 40.60శాతం, హుజురాబాద్ మున్సిపాలిటీ 39.65శాతం, కొత్తపల్లి మున్సిపాలిటీ 40శాతం, చొప్పదండి మున్సిపాలిటీ 36.98శాతంగా 11 గంటల వరకు పోలింగ్ నమోదు ►డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.9 శాతం పోలింగ్ నమోదయింది ►రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 11 గంటల వరకు 39.86 శాతం పోలింగ్ నమోదు ►మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ఉదయం 11 గంటల వరకు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 28.36శాతం, నాగారం మున్సిపాలిటీలో 30.75శాతం పోలింగ్ నమోదు. ►రంగారెడ్డి జిల్లా భడాంగ్ పేట్ కార్పొరేషన్లో ఉదయం 11.30.గంటల వరకు 16.2శాతం పోలింగ్ నమోదు ►నిజాంపేట్లో 11 గంటల వరకు 17.69శాతం పోలింగ్.. ఉదయం నుండి మందకొడిగా సాగుతున్న పోలింగ్ ►తుక్కుగూడ మున్సిపాలిటీ 15 వార్డులో 11 గంటల వరకు 41.38 శాతం పోలింగ్ ►కామూరెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 33.35శాతం, ఎల్లారెడ్డి 43.17శాతం, బాన్సువాడ 41.75శాతం పోలింగ్ నమోదు ►బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదు ►రాజన్న సిరిసిల్లలో 11 గంటల వరకు 33.48 శాతం, వేములవాడలో 42 శాతం పోలింగ్ నమోదు ►జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 32.05శాతం పోలింగ్ నమోదు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 11 గంటల వరకు 42 శాతంగా పోలింగ్ నమోదు సిరిసిల్లలో ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ కృష్ణ భాస్కర్ ►మెట్పల్లిలో ఓటు వేసిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ►వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి… మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా 29 వ వార్డు లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్క మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ►నిజామాబాద్ కాకతీయ కళాశాలలోని గోదావరి క్యాంపస్లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్లో ఎంపీ ధర్మపురి అరవింద్ తన సతీమణి ప్రియాంకాతో కలిసి ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ►ఖమ్మం జిల్లా మధిరలోని 9వ వార్డులో తెలంగాణ సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క.. తన సతీమణి నందినితో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసేందుకు అధికార పార్టీ పోలీస్ వ్యవస్థను వాడుకుంటోందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారపార్టీ విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని.. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. ►సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్ బూత్లో మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ►మిర్యాలగూడలోని పోలింగ్ సెంటర్ 59 నందు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►నల్లగొండ పట్టణంలోని 33వ వార్డులో గల నల్లగొండ పబ్లిక్ స్కూల్లో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►సూర్యాపేట జిల్లా కోదాడలోని 14వ వార్డ్లో నల్లగొండ ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఉదయం 8 గంటల సమయంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తోందన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ►వనపర్తి 23వ వార్డులోని బాయ్స్ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోని ప్రజాస్వామ్యా ప్రక్రియను బలోపేతం చేయాలని అన్నారు. కార్పొరేషన్ల బరిలో 1,746 మంది అభ్యర్థులు, మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 11,099 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 45 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుకోనున్నారు. పోలింగ్కు నిర్వహణకు 50వేల మందికి సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. (మేమంటే మేమే) రాష్ట్రంలోని 80 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరుగుతు నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల పని తీరు, సమర్థతకు గీటురాయిగా మారనున్నాయి. పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఎమ్మెల్యేలకు సైతం కీలకంగా మారింది. ఎన్నికల గెలుపోటములు పార్టీలో వారి ప్రాధాన్యతను నిర్దేశించడంతోపాటు భవిష్యత్తులో పదవులు పొందడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. ఈ నెల 25న ఫలితాల వెల్లడి సందర్భంగా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్సీలు, ఎంపీలకు అధిష్టానం ఆదేశించింది. (పుర పోరుకు పటిష్ట బందోబస్తు: డీజీపీ) -
నేడే మున్సిపోల్స్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. 2,647 వార్డులకు 11,099 అభ్యర్థులు, 324 డివిజన్లకు 1,744 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో 40,40,582 మంది, కార్పొరేషన్ల పరిధిలో 13,15,360 మంది ఓటర్లున్నారు. 7,961 పోలింగ్ కేంద్రాల్లో తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలతో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. 15 వేల మంది పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. శుక్రవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58 వార్డులకు (ఏకగ్రీవాలు మినహాయించి) ఎన్నికలు జరుగుతాయి. కరీంనగర్ ఫలితాలను 27న ప్రకటిస్తారు. 80 వార్డుల్లో, ఒక డివిజన్లో ఏకగ్రీవం బుధవారం ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులు, 9 కార్పొరేషన్ల పరిధిలో ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మొత్తం వార్డులు, డివిజన్లకు కలిపి 12,898 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అన్ని వార్డులు, డివిజన్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా 3,750 మంది స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ నుంచి 2,616, బీజేపీ నుంచి 2,313, టీడీపీ నుంచి 347, ఎంఐఎం నుంచి 276, సీపీఐ నుంచి 177, సీపీఎం నుంచి 166, మంది పోటీ చేస్తున్నారు. ఎస్ఈసీ దగ్గర గుర్తింపు పొంది, గుర్తులు ఖరారు కాని రికగ్నైజ్డ్ పార్టీల నుంచి 281 మంది పోటీలోఉన్నారు. కాగా, కొంపల్లి మున్సిపాలిటీలోని 10 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా రియల్ టైమ్ ఓటర్ల డిజిటల్ అథెంటికేషన్ చేస్తున్నారు.