Traffic Police Hyderabad
-
కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కుమారి ఆంటీ.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. హైరాబాద్లోని మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే కుమారి ఆంటీ.. ఒకే ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఆమె మాటలతో రీల్స్ కూడా క్రియెట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లో ఓ ట్వీట్ చేశారు. దీనిని చూస్తుంటే కుమారీ ఆంటీని పోలీసులు కూడా ఫాలో అవుతున్నారనిపిస్తుంది. అసలేం పోస్టు చేశారంటే.. ‘ మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా’ అంటూ బుల్లెట్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఫొటోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు..ట్రాఫిక్ నియమాలు పాటించండి.. క్షేమంగా ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు. Midhi motham 1000 ayindhi, user charges extra...#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov— Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024 ఇది చూసిన నెటిజన్లు.. కుమారి ఆంటీ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నారు. కుమారి ఆంటీని బాగానే ఫాలో అవుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఎమోజీలు, కుమారి ఆంటీ డైలాగ్ వీడియోలు పోస్టు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఇదొక్కడే కాదు సమయం, సందర్భాన్ని బట్టి సినిమా డైలాగ్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగ్స్ను ఉపయోగిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటారు. చదవండి: ఆర్టీసీ ప్రయాణికుల అసౌకర్యంపై ఎండీ సజ్జనార్ స్పందన -
ప్రధాని మోదీ పర్యటన.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు తెలిపారు. మోనప్ప జంక్షన్– టివోలి జంక్షన్–సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్ రోడ్–చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్, ఆర్పీరోడ్-ఎస్పీ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ నేపథ్యంలో పలు జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోనప్ప (రాజీవ్ గాంధీ విగ్రహం) – గ్రీన్లాండ్స్–ప్రకాశ్నగర్–రసూల్పురా–సీటీ–ప్లాజా–ఎస్బీహెచ్–వైఎంసీఏ–సెయింట్ జాన్ రోటరీ–సంగీత్ క్రాస్రోడ్–ఆలుగడ్డ బావి–మెట్టుగూడ– చిలకలగూడ–బ్రూక్ బాండ్–టివోలి–బాలమ్రాయ్–స్వీకర్ ఉపకార్–సికింద్రాబాద్ క్లబ్–తిరుమలగిరి–తాడ్బండ్–సెంట్రల్ పాయింట్ మార్గాల్లో ప్రయాణించొద్దని సూచించారు. టివోలి క్రాస్రోడ్ నుంచి ప్లాజా క్రాస్రోడ్ల మధ్య ఉన్న రోడ్డును మూసివేయనున్నట్లు తెలిపారు. ఎస్బీఎస్ క్రాస్రోడ్ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డును మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు సకాలంలో రైల్వేస్టేషన్కు ముందుగానే చేరుకోవాలని సూచించారు. చిలకలగూడ జంక్షన్ వైపు నుంచి సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశాలను పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులు, వాహనాలు చిలకలగూడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోకి ప్రవేశించాలని చెప్పారు. సెయింట్ జాన్స్ రోటరీ-సంగీత్ జంక్షన్-రేతిఫైల్ టీ జంక్షన్-చిలకలగూడ జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, ప్రయాణికులు క్లాక్ టవర్-పాస్పోర్ట్ ఆఫీస్-రెజిమెంటల్ బజార్ మెయిన్ రోడ్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకోవచ్చని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమ ప్రయాణానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన ఇలా శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోనున్న మోదీ.. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బీబీ నగర్ ఎయిమ్స్లో పలు అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే వర్చువల్గా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు రైల్వేకు సంబంధించిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు పీఎంవో పేర్కొంది. మొత్తం రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరామనవమి పండగ సందర్భంగా ఈనెల 30న హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకుహైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని తెలిపారు. పండగ రోజు రాములవారి శోభాయాత్ర ఉండనున్న నేపథ్యంలో ప్రధానంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. 30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర ఉదయం 11 గంటలకు సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. బోయగూడ కమాన్, మంగళ్హాట్ పోలీస్స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకుయాత్ర చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో యాత్ర సాగనున్న మార్గాల్లో వాహనాల దారిమళ్లింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు .పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ వాహనదారులు తమ తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. -
Hyderabad: పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేపై టూ వీలర్ ప్రవేశానికి చెక్..
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు వ్యతిరేకంగా పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్వేపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్స్ప్రెస్వే పై ద్విచక్ర వాహనదారులు ప్రయాణించకుండా ఉండేందుకు హెచ్ఎండీఏతో కలిసి తగు చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్యామ్సుందర్రెడ్డి తెలిపారు. సరోజినీదేవి ఆసుపత్రి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు 11 కిలో మీటర్ల మేర నిర్మించిన పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కేవలం కార్లకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ద్విచక్ర వాహనాదారులు, భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. కానీ కొందరు ద్విచక్ర వాహనాదారులు ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. ► గతంలో ఈ వంతెనపై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు సైతం జరిగాయన్నారు. ►ఈ నేపథ్యంలో పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ద్విచక్ర వాహనదారుల ప్రవేశాన్ని అరికట్టేందుకు హెచ్ఎండీఏతో పలుమార్లు సంప్రదింపులు జరిపి తగు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ►ఎక్స్ప్రెస్వే వంతెనపై ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ► ఈ నెల చివరి నాటికి ఈ పనులు పూర్తి అవుతాయన్నారు. సీసీ కెమెరాల ద్వారా వాహనాదారులను గుర్తించి అపరాధ రుసుం వేస్తామన్నారు. ►సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు పోలీస్స్టేషన్లోనే తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫ్లై ఓవర్ ర్యాంపుల వద్ద సీసీ కెమెరా వాహనాన్ని గుర్తించి అపరాధ రుసుం విధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. -
బంజారాహిల్స్లో మద్యం మత్తులో యువకుడి వీరంగం
-
బంజారాహిల్స్లో మద్యం మత్తులో యువకుడి వీరంగం.. ఎస్సైని కాలుతో తన్ని
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్లో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కారులో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే యువకుడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 94 పాయింట్లు నమోదు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువకుడు రెచ్చిపోయి ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ ట్రాఫిక్ ఎస్సైతో దుర్భాషలాడాడు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ఎసైను కాలితో తన్నాడు. యువకుడి పక్కన ఉన్న యువతి సైతం రెచ్చిపోయి ప్రవర్తించింది. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ మాట్లాడింది. దీంతో ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులపై హద్దుమీరి ప్రవర్తించిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్గా గుర్తించారు. -
పొద్దు పొద్దున్నే పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్! ట్వీట్ వైరల్
నటుడు కమల్ కామరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆవకాయ్ బిర్యానీ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమైన ఆయన గోదావరి వంటి చిత్రాల్లో సహానటుడి పాత్రలు పోషించాడు. ఆయన ఎక్కువగా బయట కనిపించరనే విషయం తెలిసిందే. వెండితెరపై తప్పా మూవీ ఈవెంట్స్లో, ప్రిరిలీజ్ ఫంక్షన్స్లో పెద్దగా కనిపించడు. సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాన్ని మీడియాకు దూరంగా గడుపుతాడు కమల్. చదవండి: సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైంది. పోలీసులకు దొరికపోయానంటు ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. దీంతో నెటిజన్లు ఆయన పోలీసులకు దొరకడం ఏంటీ! ఏం చేశాడు! ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే. తాజాగా కమల్ రాజు బైకి వెళ్తున్న ఫొటో షేర్ చేశాడు తన ట్విటర్లో షేర్ చేశాడు. తాజాగా కమల్ కామరాజు తాను పోలీసులకు దొరికిపోయానంటూ ట్వీట్ చేసి షాకిచ్చాడు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం ‘‘అందరికీ చెప్తాను. ఇవాళ నా బైక్ స్పీడు పెంచి దొరికిపోయాను. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి ఆత్రుత ఆపుకోలేక 60లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్న సమయంలో కూడా నేను స్పీడుగా వెళ్లడాన్ని పట్టుకుని నాకు చలాన్ పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పని తీరు, అభివృద్ధి చేసిన పద్ధతులు చూసి నాకు సర్ప్రైజింగ్గా అనిపించింది. వారు అభివృద్ధి చేసిన పద్ధతులకు ధన్యవాదాలు’ తెలిపాడు. అంతేకాదు, తాను బైక్ మీద వేగంగా వెళ్తున్న ఫొటోను కూడా షేర్ చేశాడు. పోలీసులు ఏర్పాటు చేసిన కెమరాలో.. ఈ ఫొటో క్యాప్చర్ అయ్యింది అని తెలిపాడు. అందరికి చెప్తా... ఇవ్వాళా నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా . పోదున్నే కాళీ రోడ్ చూసి excite అయ్యి 60 లొ వవెళ్ళాలి 80 లొ వెళ్ళా. kudos to hyderabad traffic police and their advanced methods for capturing and sending me a challan even at such early hours. @hydcitypolice @HYDTP pic.twitter.com/KSuP5rvkVM — kamal kamaraju ~k k (@kamalkamaraju) January 19, 2023 -
Hyderabad: ఎఫ్ఐఆర్లు.. జరిమానాలు..రెడ్ నోటీసులు
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వద్ద రోడ్డుకు రెండువైపులా ఫుట్పాత్ ఆక్రమణలు, రోడ్డు పక్కనే అక్రమ పార్కింగ్లు, పుట్పాత్పైనే చిరు వ్యాపారాలు జోరుగా సాగేవి.. ఇక్కడికి అంబులెన్స్ రావాలంటే నరకయాతన అయ్యేది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గత రెండు నెలలుగా ఈ అక్రమ పార్కింగ్లు, ఫుట్పాత్ ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తుండటంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొంత మేర వాహనాలు తేలికగా రాకపోకలు సాగించే విధంగా ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పదేపదే చెప్పినా పెడచెవిన పెడుతూ రోడ్లపక్కనే బండ్లు పెట్టుకొని హోటళ్లు నడిపిస్తున్న వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడమే కాకుండా సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా రోడ్లపక్కన అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలిస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద నో పార్కింగ్ జోన్లో వాహనాలను లిఫ్ట్ చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు ►దీంతో అపోలో పరిసరాల్లో వాహనం పెడితే పోలీసులు లిఫ్ట్ చేస్తారని చిరు వ్యాపారాలు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తారని భావించిన వీరంతా గత నాలుగు వారాల నుంచి వీటి జోలికి పోవడం లేదు. ►ఫలితంగా ఈ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ అడ్డంకులు తొలగిపోయి వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలవుతోంది. ►గతంలో రోజుకు రెండు మూడుసార్లు ట్రాఫిక్ పుష్కాట్ వాహనాలను తిప్పిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు గంటలో నాలుగైదు సార్లు తిప్పుతుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ►ఇది కేవలం అపోలో ఆస్పత్రికే పరిమితం చేయకుండా స్టార్ ఆస్పత్రి, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి, స్టార్ బక్స్, తాజ్మహల్ హోటల్, రియాట్ పబ్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, బంజారాహిల్స్ రోడ్ నం.1, బంజారాహిల్స్ రోడ్ నం.12, ఫిలింనగర్లకు విస్తరించారు. ►బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు, ఫుట్పాత్లకు అడ్డంకులు సృష్టిస్తున్న 30 మంది చిరు వ్యాపారులపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ►మరో వైపు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు ఇష్టానుసారంగా గతంలో వాహనాలు నిలిపేవారు. ► ఇప్పటికే ఈ ఆస్పత్రికి రెడ్నోటీసులు జారీ చేశారు. ఆస్పత్రికి వైపు మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని, రెండోవైపు వాహనాలు పార్కింగ్ చేస్తే వీల్ క్లాంప్లు వేస్తున్నామని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సైతం గత ఐదు వారాల నుంచి అక్రమ పార్కింగ్లపై కొరడా ఝులిపిస్తున్నారు. ►రోడ్డుకు రెండువైపులా చిరు వ్యాపారులు రోడ్డును, ఫుట్పాత్ను ఆక్రమించి ఇబ్బందులు కల్గిస్తుండటంతో జరిమానాలు విధిస్తున్నారు. ఫలితంగా ఫుట్పాత్ ఆక్రమణలతో పాటు అక్రమ పార్కింగ్లకు 80 శాతం వరకు తెరపడింది. ►నిత్యం ఇక్కడి పోలీసులు ట్రాఫిక్ పుష్కాట్ వాహనంతో వాహనాలు స్టేషన్కు తరలిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న వ్యాపార కేంద్రాలకు ఒక్కదానికి కూడా పార్కింగ్ సౌకర్యం లేదు. ►ఈ రోడ్డులో హోటళ్లు, ఆభరణాల షోరూంలు, బొటిక్లు ఎక్కువగా ఉన్నాయి. వీరందరికీ ఇప్పటికే పలుమార్లు అవగాహన కలిగించి లైన్ దాటితే జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ► వివాహ భోజనంబు, అంతేరా, స్పైసీ అవెన్యూ, వ్యాక్స్ బేకరీ, బ్రీవ్ 40, సెవన్త్ హెవన్, కేఫ్ కాఫీడే తదితర వ్యాపార సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ►జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రోడ్డు, ఫుట్పాత్ అడ్డంకులు న్యూసెన్స్కు పాల్పడుతున్న 25 మంది వ్యాపారులపై ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. భారీగా జరిమానాలు విధించారు. పంజగుట్టలో.. ►పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు అక్రమ పార్కింగ్లు అధికంగా ఉండే సోమాజిగూడ యశోదా ఆస్పత్రి రోడ్డుపై దృష్టి సారించారు. ►ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకు సుమారు 25 వాహనాలను స్టేషన్కు తరలిస్తున్నారు. ►అక్రమ పార్కింగ్లు చేస్తున్న బైక్లను తరలిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్డులో చిరువ్యాపారులను మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తుండటంతో సహజంగానే రోడ్డు మరింత ఇరుకుగా మారుతోంది. ►ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో పాటు, పంజగుట్ట ప్రధాన రహదారిలోని మెరీడియన్, రెడ్రోజ్ హోటల్, రాజ్భవన్ రోడ్డులో నిత్యం వాహనాలను సీజ్ చేస్తున్నారు. -
Hyderabad: కోర్ సిటీలోకార్ రేసా?.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నగరవాసులకు చుక్కలు చూపింది. తొలిసారిగా ఐఆర్ఎల్కు హైదరాబాద్ వేదిక కావటం గర్వకారణమే కానీ రేసింగ్ నిర్వహణకు ఎంపిక చేసిన ప్రాంతమే “సిటీ’జనులను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేసింది. నగరం నడిబొడ్డున నిర్వహించిన రేసింగ్.. రెండు రోజులుగా వాహనదారులకు చమటలు పట్టిస్తోంది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గతంలో ఫార్ములా రేసులు జరిగిన నగరాలను, అక్కడి ఏర్పాట్లను అధ్యయనం చేయకుండా నిర్ణయం తీసుకోవటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రోడ్ల నిండా వాహనాలే.. ఐఆర్ఎల్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెక్లెస్ రోడ్, ఐమ్యాక్స్, సెక్రటేరియట్ చుట్టూ రహదారులను పూర్తిగా మూసివేశారు. సమాంతర రోడ్లు లేకపోవటంతో ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ రహదారులైన ఖైరతాబాద్, బుద్ధభవన్, రసూల్పురా, మినిస్టర్ రోడ్, బీఆర్కే భవన్ వైపు మళ్లించారు. దీంతో ఆయా మార్గాలలోని నివాస, వాణిజ్య సముదాయాలవాసులు, ఉద్యోగస్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్బండ్, ట్యాంక్బండ్లలో ట్రాఫిక్ స్తంభించింది. అఫ్జల్గంజ్ మీదుగా సికింద్రాబాద్కు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్బండ్ మార్గం కాకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్, కవాడిగూడ మీదుగా ప్రయాణించడంతో రోడ్లన్నీ బ్లాకయ్యాయి. దీంతో ఆయా రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కి.మీ. ప్రయాణానికే గంటల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చేయాలంటే.. రేసింగ్ అనేవి కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమైనవి. పైగా ఐఆర్ఎల్ పోటీలకు ఉచిత ప్రవేశం కాదు అలాంటప్పుడు ప్రధాన నగరంలో కాకుండా శివారు ప్రాంతాలలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు లేదా లింకు రోడ్లలో నిర్వహిస్తే బాగుండేదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయ పడ్డారు. కొన్ని దేశాలలో విమానాశ్రయాలలోనూ రేసింగ్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో శంషాబాద్, బేగంపేట విమానాశ్రయంలలో నిర్వహిస్తే బాగుండేదనే పలువురు తెలిపారు. పైగా రేసింగ్ కోసం కొత్తగా రోడ్లను నిర్మించే అవసరం కూడా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి, ఉప్పల్ స్టేడియంలలో ట్రాక్స్ను నిర్మించి రేసింగ్లను నిర్వహిస్తే వీక్షకులకు సైతం ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. చైనా, చెన్నైలలో ఎలాగంటే.. చైనా, మన దేశంలోని చెన్నైలో ఫార్ములా రేసింగ్లను సాధారణ ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా శివారులలో నిర్వహిస్తుంటారు. మన దగ్గర మాత్రం సిటీ సెంటర్లో నిర్వహించడంపై నగరవాసులు విమర్శిస్తున్నారు. పోటీ లేకుండానే రేసింగ్ ముగిసింది ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం మరోసారి నిరాశపర్చింది. ఎలాంటి పోటీలు లేకుండా ట్రయల్స్కే పరిమితమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ట్రయల్స్ గంట ఆలస్యంగా మొదలయ్యాయి. రేసర్లు రెండు, మూడు రౌండ్లు తిరిగిన తర్వాత ఆఖరికి పోటీ ఉంటుందని మొదట ప్రచారం చేశారు. కానీ వాతావరణం అనుకూలంగా లేదనే కారణంగా లీగ్ను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో నవంబర్ నెలలో జరిగినట్లుగా ఉదయం 11 గంటల నుంచే పోటీ ఉండవచ్చని భావించి వీక్షించేందుకు వచ్చిన మోటారుస్పోర్ట్స్ ప్రియులు సాయంత్రం 4 గంటల వరకు పడిగాపులు కాశారు. గంట పాటు ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ సమయంలోనూ కొన్ని వాహనాలు బ్రేక్డౌన్కు గురయ్యాయి. ట్రాక్ పై నిలిచిపోయిన వాటిని అక్కడి నుంచి తరలించారు. ఎంతో ఉత్కంఠ రేపుతుందనుకొన్న లీగ్ ఎలాంటి హడావుడి లేకుండానే మొదటి రోజు ముగిసింది. ఈసారి పోటీలపై పెద్దగా ప్రచారం లేకపోవడంతో ప్రేక్షకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. చాలా వరకు గ్యాలరీలు ఖాళీ సీట్లతో కనిపించాయి. నరకప్రాయంగా మారుతోంది.. సిటీలో వాహనాల రద్దీ ఎక్కువ. దీనికి తోడు ఇలా ట్రాఫిక్ మళ్లింపు, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా మూనేసి వేరు దారుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాయంత్రం ఇళ్లకు వెళ్లడానికి నరకప్రాయంగా మారుతోంది. – రామ్, ప్రైవేటు ఉద్యోగి వైఫల్యానికి నిదర్శనం.. తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురయ్యే ఇబ్బందులను భరించగలం. కానీ ఇలాంటి పరిణామాలు తరచుగా జరగడమే సంబంధిత శాఖల వైఫల్యానికి నిదర్శనం. నగరం కేంద్రంగా జరిగే కొన్ని కార్యక్రమాలు సిటీ ప్రతిష్టను పెంచేవే అయినప్పటికి వాటిని నిర్వహించే ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. – ప్రవీణ్ రెడ్డి, సాఫ్ట్వేర్ రెట్టింపు సమయం.. సాధారణ రోజుల్లో బంజారాహిల్స్ నుంచి రామ్నగర్ రావడానికి గంట సమయం పడితే గత రెండు రోజులుగా రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. నగరం మధ్యలో రోడ్లు మూసేసి, ట్రాఫిక్ మళ్లింపులతో ఈవెంట్లు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – మణికంఠ, నగరవాసి జనాల్ని బాధపెట్టే పోటీలు.. ఇండియన్ రేసింగ్ లీగ్తో రోడ్లపై నరకాన్ని చూడాల్సి వస్తోంది. చివరకు అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జనాల్ని బాధపెట్టి కార్లను పరుగులు పెట్టించడమేంటి? – వంగీపురం రాఘవ, నాగారం -
హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ బదిలీ..
సాక్షి, హైదరాబాద్/వరంగల్: హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఆయనను వరంగల్ పోలీసు కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ ఎస్పీగా పని చేస్తూ డీఐజీగా పదోన్నతి పొందిన రంగనాథ్ గతేడాది డిసెంబర్ 29న సిటీ ట్రాఫిక్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండకు వెళ్లే ముందూ ఆయన సిటీ ట్రాఫిక్ డీసీపీగా పని చేశారు. రోడ్డు ఆక్రమణల నిరోధం కోసం నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు అమలులోకి వచ్చిన ఆపరేషన్ రోప్లో రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుట్పాత్లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు, తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, మలక్పేట్ వద్ద మూడో మార్గం పనుల వేగవంతం... ఇలా నగర ట్రాఫిక్పై రంగనాథ్ తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ లోక్ అదాలత్ను ఆన్లైన్లో నిర్వహించేలా చేశారు. ట్రాఫిక్ విభాగంలోనూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణ, జంక్షన్లలో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా సంచరిస్తున్న అంబులెన్స్ల క్రమబద్దీకరణ, జంక్షన్లలో గ్రీన్ లైట్ వినియోగం పెంపు, కార్ల అద్దాల నల్ల ఫిల్మ్ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగంపై ఆంక్షలు.. ఇలా ఎన్నో సంస్కరణలు రంగనాథ్ తీసుకువచ్చారు. ఆయన అమలు చేసిన జూబ్లీహిల్స్ రోడ్ నెం.45తో పాటు ఇతర మార్గాల్లో మళ్లింపులు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ట్రాఫిక్ విభాగానికి కొత్త చీఫ్ వచ్చే వరకు మరో అధికారి ఇన్చార్జిగా ఉండనున్నారు. 19నెలలు పనిచేసిన తరుణ్జోషి వరంగల్ పోలీస్ కమిషనర్గా ఉన్న డాక్టర్ తరుణ్జోషిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. 2004 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన తరుణ్జోషి 2021 ఏప్రిల్ 4న వరంగల్ పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీస్ వర్టికల్స్, వెల్ఫేర్ విషయంలో నిజాయితీగల అధికారిగా పేరున్న ఆయన సుమారు 19 నెలల పాటు తన మార్కు వేసుకున్నారు. ఐజీగా పదోన్నతి పొందిన తరుణ్జోషి సెంట్రల్ సర్వీసెస్కు వెళ్తున్నారన్న ప్రచారం కొంతకాలంగా జరిగింది. ఇదే సమయంలో గురువారం ఆయనను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్ను నియమించింది. చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. పోలీస్శాఖలో రంగనాథ్ తనదైన మార్క్ ఏవీ రంగనాథ్ 1970 అక్టోబర్లో నల్లగొండలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం హుజూర్నగర్ తదితర ప్రాంతాల్లో చేసిన ఆయన తర్వాత గుంటూరులో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ హైదరాబాద్లో పూర్తి చేశారు. ఓయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఐడీబీఐ బ్యాంకు అధికారిగా కొంతకాలం పనిచేసి పోలీస్ బాస్ కావాలన్న లక్ష్యంతో గ్రూప్–1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ –1 లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. పోలీస్ బాస్ కావాలన్న ఏకైక లక్ష్యంతో డీఎస్పీ ఆప్షన్ ఖరారు చేసుకున్నారు. 1996 బ్యాచ్లో డీఎస్పీ ర్యాంక్లో స్థిరపడి 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయిన రంగనాథ్ 2003 వరకు కొత్తగూడెంలో పనిచేసి, ఆ తర్వాత సంవత్సరంపాటు వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా పనిచేశారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం, నక్సల్స్ చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు. అనంతరం తూర్పు గోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో బలిమెల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహౌండ్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత రంగనాథ్ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న ఏవీఆర్.. 2012 చివరివరకు అక్కడ పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి, అక్కడినుంచి నల్లగొండకు బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు పనిచేసి తన మార్కు వేసుకున్నారు. నల్లగొండలో ఉన్నసమయంలోనే డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తించిన ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీసు కమిషనర్గా నియమితులయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా, నల్ల గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు. నర్సంపేటలో పనిచేసినప్పుడు నక్సల్స్ సమస్యపై కీలకంగా పనిచేశారు. కాగా, ఆయన సీపీగా రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. ప్రొఫైల్ పూర్తి పేరు : ఆవుల వెంకట రంగనాథ్ పుట్టిన తేదీ : అక్టోబర్ 22, 1970 పుట్టిన ప్రదేశం : నల్లగొండ తల్లిదండ్రులు : సుబ్బయ్య, విజయలక్ష్మి భార్య : లక్ష్మీలావణ్య పిల్లలు : రుషిత, కౌశిక్ గ్రూప్ –1 : 1996 డీఎస్పీ, 2006లో ఐపీఎస్ మొదటి పోస్టింగ్ : గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ ఇష్టమైన ఆట : టెన్నిస్ ప్రదేశం : కశ్మీర్ చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. -
రాంగ్రూట్, ట్రిపుల్ రైడింగ్లపై నిబంధనలు కఠినతరం
-
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా.. కచ్చితంగా దొరికిపోతారు..
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం సైరన్లు పోలీసు, అగ్నిమాపక శాఖ తప్ప మరెవరూ వినియోగించకూడదు. ప్రస్తుతం అనేక మంది తేలికపాటి వాహన చోదకులు వీటిని బిగించుకున్నారు. మోగిస్తే తప్ప ఈ ఉల్లంఘన విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియదు. మరి ఇలాంటి వారికి చెక్ చెప్పడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగానే నగర ట్రాఫిక్ విభాగం అధికారులు విజిలెన్స్ టీమ్స్ను రంగంలోకి దింపుతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది, కెమెరాల కంటికి కనిపించని ఉల్లంఘనలకు సైతం ఆస్కారం ఇవ్వద్దంటూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ఈ బృందాలకు రూపమిస్తున్నారు. ప్రస్తుతం విధి విధానాల రూపకల్పన, సభ్యుల ఎంపిక దశలో ఉన్న ఈ టీమ్స్ త్వరలో క్షేత్ర స్థాయిలో పని ప్రారంభించనున్నాయి. ఇలాంటి విధులకు వినియోగం.. ► ఈ విజిలెన్స్ బృందాలను ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్ని రకాలైన ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి రంగంలోకి దింపుతున్నారు. సైరన్ల వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లు, మల్టీ టోన్డ్ హారన్లు, ఎయిర్ హారన్ల వినియోగం, అనధికారికమైన బుగ్గ కార్లు, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ తదితర ఉల్లంఘనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►వీటిలో కొన్ని ఉల్లంఘనల్ని చౌరస్తాలు దాటేసిన తర్వాత, లేదా వాహనచోదకులు వినియోగించినప్పుడు మాత్రమే గుర్తించడం సాధ్యమవుతోంది. ఈ కారణంగానే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఈ వాహనచోదకులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి ఉల్లంఘనుల కారణంగా ఇతర వాహనచోదకులకు ఇబ్బందులు కలగడంతో పాటు శబ్ధ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. ఈ విషయం గమనించిన ఉన్నతాధికారులు విజిలెన్స్ టీమ్స్కు రూపమిస్తున్నారు. మొత్తం 48 మంది కానిస్టేబుళ్లు.. నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఆరు జోన్లు ఉన్నాయి. ప్రాథమికంగా జోన్కు రెండేసి బృందాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టీమ్కు ప్రత్యేక వాహనం, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. పని ఒత్తిడికి తావు లేకుండా రెండు షిఫ్టుల్లో వినియోగించడానికి మొత్తం 48 మందిని ఎంపిక చేస్తున్నారు. వీరికి అనేక అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు మెలకువలు నేర్పించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆయా జంక్షన్ల వద్ద మాటు వేసి ఉండే ఈ బృందాల పని తీరును స్వయంగా ఉన్నతాధికారులే పర్యవేక్షించనున్నారు. స్పీడింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిలో యువతే ఎక్కువగా ఉంటాయి. వీరిని వెంబడించి, అడ్డుకోవడానికి ఈ టీమ్స్ ప్రయత్నిస్తే వాళ్లు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది కొన్నిసార్లు ప్రమాద హేవుతుగానూ మారుతుంది. టీటీఐలో ప్రత్యేక శిక్షణ.. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు విజిలెన్స్ టీమ్స్ కారణంగా ఎలాంటి అపశ్రుతులు, వాహన చోదకులతో పాటు ఉల్లంఘనులకూ ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో (టీటీఐ) వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా ఉల్లంఘనులకు ఎలా, ఎప్పుడు, ఎక్కడ చెక్ చెప్పాలి? వారితో పాటు రహదారిపై ప్రయాణిస్తున్న, నడుస్తున్న వారికి ఎలాంటి హాని లేకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలు ఈ శిక్షణలో వారికి నేర్పుతున్నారు. ఈ విజిలెన్స్ టీమ్స్ను ప్రథమ చికిత్స, సీపీఆర్ తదితరాల్లోనూ నిష్ణాతులను చేయాలని నిర్ణయించారు. కేవలం ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికే కాకుండా వర్షాలు, నిరసనలతో పాటు ఇతర కారణాల వల్ల హఠాత్తుగా తలెత్తే తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ క్లియరెన్స్ కోసమూ వినియోగిస్తారు. (క్లిక్ చేయండి: పీసీఎస్ హెడ్– క్వార్టర్స్గా ఐసీసీసీ) -
బస్టాప్లో బస్సు ఆపొద్దంటూ బోర్డు.. పాపం ప్రయాణికులు..
హైదరాబాద్: బస్టాప్లు ఏర్పాటు చేసేదే బస్సులు ఆపేందుకు.. కానీ బస్టాప్లో బస్సులు ఆగడం వల్ల వెనక ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ ట్రాఫిక్ పోలీసులు ఆ బస్టాప్లో బస్సులు ఆగొద్దంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం వల్ల ప్రయాణికులు, వాహనదారుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే రోడ్డులో బస్టాప్ ఉంది. ఈ బస్టాప్లో గత కొన్ని సంవత్సరాలుగా బస్సులు ఆగుతుంటాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాప్లో బస్సులు ఆగడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోతుందంటూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ బస్టాప్లో బస్సులు, ఆటోలు నిలపవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో బస్సులు ఎక్కడ ఆపాలంటూ ఒక వైపు ఆర్టీసీ డ్రైవర్లు, మరోవైపు బస్సులు ఎక్కేందుకు వస్తున్న ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కొరవడిన సమన్వయం... జూబ్లీహిల్స్ చెక్పోస్టులో సిగ్నళ్లకు దగ్గరగా ఉన్న బస్టాప్ల వద్ద సమస్య ఎదురైతే ట్రాఫిక్ పోలీసులు ముందుగా ఆయా బస్టాప్లను తొలగించి మరికొంత దూరంలో ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకి సూచించాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ప్రతిపాదన చేయకుండా సంబంధిత అధికారులు బస్టాప్లో బస్సులు ఆపొద్దంటూ బోర్డులు పెట్టడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ఇంకాస్త దూరం వెళ్లాక బస్సులు ఆపేందుకు అనువైన స్థలం కూడా లేదు. ఇక్కడ ఇరుకైన రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. నిత్యం ఫిలింనగర్, అపోలో ఆస్పత్రి వైపు వెళ్లే వందలాది మంది ఇక్కడ బస్సు సేవలను వినియోగించుకుంటుంటారు. రెండు శాఖల అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే వీటిని ఇక్కడి నుంచి తొలగించి ప్రయాణికులకు అనువైన స్థలంలో బస్టాప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ముందు బైక్... వెనకాల కాన్వాయ్.. అభిమానిని చూసి ఆగిన ఎంపీ) -
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుల షాక్.. ఫైన్ కట్టకుంటే మళ్లీ ఫైన్!
సాక్షి, సిటీబ్యూరో: అనునిత్యం ఉల్లంఘనలకు పాల్పడటం, జారీ అయిన ఈ–చలాన్లు పట్టించుకోకుండా వ్యవహరించడం... ఈ పంథాలో రెచ్చిపోతున్న వాహనచోదకులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. మూడు నెలల వ్యవధిలో పదేపదే వైలేషన్స్కు పాల్పడి, జరిమానాలు చెల్లించని వారికి భారీగా వడ్డించనున్నారు. కేవలం తీవ్రమైన ఉల్లంఘనలకు మాత్రమే ఈ విధానం అమలుకానుంది. దీనికి సంబంధించి నగర ట్రాఫిక్ విభాగం ప్రాథమిక కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే ద్విచక్ర వాహనచోదకులకు రూ.100 జరిమానా పడుతోంది. ఇలా జారీ అవుతున్న ఈ–చలాన్లను అనేక మంది చెల్లించట్లేదు. ఇకపై ఒకసారి చలాన్ జారీ అయిన నాటి నుంచి మూడు నెలల వ్యవధిలో ఆ ఈ–చలాన్ చెల్లించకుండా మరో ఉల్లంఘనకు పాల్పడితే అప్పుడు విధించే జరిమానా పెరుగుతుంది. రెండోసారికి రూ.200, మూడోసారికి రూ.600 చొప్పున విధిస్తారు. ఎప్పటి జరిమానాలు అప్పుడు చెల్లించేస్తే మాత్రం రూ.100 చొప్పునే పడుతుంది. ఇదొక్కటే కాదు.. మరికొన్ని తీవ్రమైన ఉల్లంఘనల విషయంలోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. ► రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే ద్వికచ్ర వాహనాలు, ఆటోలకు రూ.200, రూ.600, రూ.800 చొప్పున, ► తేలిక పాటి వాహనాలకు, భారీ వాహనాలకు రూ.1000, రూ.1500, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేస్తారు. ► అలాగే ఎక్కడపడితే అక్కడ అక్రమంగా పార్కింగ్ చేస్తే ద్విచక్ర వాహనాలు, ఆటోలకు రూ.200 (అక్కడ నుంచి ఠాణాకు తరలిస్తే మాత్రం రూ.350), రూ.700, రూ.1000 చొప్పున, తేలికపాటి, భారీ వాహనాలకు రూ.1000, రూ.1200, రూ.1700 చొప్పున విధిస్తారు. ► ఈ విధానం కోసం ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు పెంచట్లేదు. మోటారు వాహనాల చట్టంలో (ఎంవీ యాక్ట్) ఉన్న కీలక సెక్షన్లు వినియోగిస్తున్నారు. దీని కోసం పెద్ద అధ్యయనమే నిర్వహించారు. అందులో రాంగ్ సైడ్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ ఇలా వేర్వేరు సెక్షన్లకు వేర్వేరుగా జరిమానాలు ఉన్నాయి. మరోపక్క ఒకసారి జారీ చేసిన చలాన్ను నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే అది ఉత్తర్వుల ధిక్కరణ కిందికి వస్తుందని, దీనికి రూ.500 జరిమానా విధించవచ్చని ఎంవీ యాక్ట్ చెప్తుంది. ఇలాంటి అనేక కీలక సెక్షన్లు ఇప్పటి వరకు వాడలేదు. వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ట్రాఫిక్ జామ్స్, ప్రమాదాలు తగ్గించడానికి ఇకపై వినియోగించాలని నిర్ణయించారు. ► వితౌట్ హెల్మెట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్లతో పాటు సిగ్నల్ జంపింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్ తదితర ఉల్లంఘనకూ ఈ విధానం వర్తిస్తుంది. ఏ వైలేషన్ వల్లనైతే ప్రాణనష్టం, ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయో అలాంటి వాటికి వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ లోక్ అదాలత్లు ఉండవని, ప్రతి ఒక్కరూ ఈ–చలాన్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: దసరా సెలవులు కుదింపుపై క్లారిటీ వచ్చేసింది -
ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయిన మహిళ
-
బాలాపూర్ గణేష్ శోభాయాత్ర.. ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో సామూహిక గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను నిమజ్జనం చేసే పనుల్లో భక్తులు నిమగ్నమయ్యారు. నిమజ్జనోత్సవానికి మూడు కమిషనరేట్ల పోలీసులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. బాలాపూర్ గణేషుడి శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, గణనాథుడు సాగరానికి చేరేందుకు వీలుగా మార్గం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. బాలాపూర్ నుంచి సౌత్ జోన్ మీదుగా చార్మినార్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరుగుతుందని వెల్లడించారు. మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని అన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు చదవండి: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం జరగనున్నట్లు రంగనాథ్ తెలిపారు. గణేష్ నిమజ్జానానికి ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్లో 20 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. సెంట్రల్ జోన్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని, భక్తులు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ వినాయకుడు మద్యాహ్నం తర్వాత ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నామని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. రేపు సెలవు గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం(సెప్టెంబర్ 9) సెలవు ప్రకటించింది. తిరిగి సెప్టెంబర్ 12న వర్కింగ్ డేగా ప్రకటించింది. -
హైదరాబాద్: ఓరి వీళ్ల వేషాలు తగలెయ్య.. నంబర్ ప్లేట్ ఏదయ్యా! (ఫొటోలు)
-
ఖైరతాబాద్ ఎమ్మెల్యే కార్లపై 66 చలాన్లు.. రూ. 37, 365 చెల్లించి..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు చెందిన అయిదు కార్లకు పెండింగ్ చలాన్లను ఆదివారం క్లియర్ చేశారు. కొంత కాలంగా ఆయనకు చెందిన టీఎస్ 09 ఎఫ్ఏ 0999తోపాటు మరో నాలుగు కార్లకు 66 చలానాలు పెండింగ్లో ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఈ వాహనాలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పెండింగ్ చలాన్ల జాబితా గుట్టురట్టైది. దీంతో 66 చలానాలకుగాను రూ. 37365లను ఎమ్మెల్యే చెల్లించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్కు చెందిన అయిదు కార్లకు చెందిన చలానాలు క్లియర్ అయినట్లు తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు -
బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
స్పెషల్ డ్రైవ్లో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు హై ఎండ్ కార్ల భరతం పట్టారు. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పది వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ దర్జాగా తిరుగుతున్న ఖరీదైన కార్లు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టడీ సర్కిల్, తాజ్ మహల్ హోటల్, టీవీ చౌరస్తా, కళింగ కల్చరల్ సెంటర్ చౌరస్తా, తాజ్కృష్ణ ఎదురుగా బంజారాహిల్స్, ఎస్సార్నగర్, సైఫాబాద్, నారాయణగూడ, చిక్కడపల్లి ట్రాపిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి తనఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నడుపుతున్న ఓ వ్యక్తి కారును సీజ్ చేశారు. ► నంబర్ ప్లేటు లేకుండా తిరుగుతున్న నాలుగు కార్లను సీజ్ చేశారు. ఈ అయిదు కార్లపై ఛార్జిషీటు దాఖలు చేయనున్నారు. ►బ్లాక్ ఫిల్మ్లతో తిరుగుతున్న 35 మంది కారు యజమానులకు ఒకొక్కరికి రూ. 700లు చొప్పున జరిమానా విధించారు. ఇర్రెగ్యులర్, ఇన్ప్రాపర్ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 32 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. ►ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 39 మంది వాహనదారులకు రూ. 200ల చొప్పున జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న మూడు కారు యజమానులకు రూ. 2000ల ప్రకారం జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ► జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ చెక్పోస్టు, నీరూస్ జంక్షన్, రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, రోడ్ నంబర్ 36 కళాంజలి వద్ద జూబ్లీహిల్స్ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు, మారేడుపల్లి, మహంకాళి, గోపాలపురం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల నుంచి అయిదు చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ► బ్లాక్ ఫిల్మ్లతో తిరుగుతున్న 48 టాప్ మోడల్ కార్ల యజమానులకు రూ. 700ల ప్రకారం జరిమానా విధించారు. ► ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 13 వాహనాలపై జరిమానా విధించారు. ► ఇంప్రాపర్, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లతో ప్రయాణిస్తున్న 45 కార్లకు రూ. 200ల వంతున జరిమానా విధించారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 2 వాహనాలపై చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. సర్వీసు రోడ్డులో పార్కింగ్ చేసిన ఒక వాహనంపై జరిమానా విధించారు. ► ఇద్దరు వాహనదారులపై 41(ఐ) సీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కల్గిస్తున్న ఒక వాహనదారుడిపై కేసు నమోదైంది. అక్రమ పార్కింగ్ చేసిన ఇద్దరు వాహనదారులకు జరిమానా విధించారు. -
బ్లాక్ ఫిల్మ్లు, నంబర్ ప్లేట్లపై నజర్; 18 నుంచి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలను నగర ట్రాఫిక్ పోలీసులు సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి మరో విడత స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈసారి కారు అద్దాలపై బ్లాక్ ఫిల్మ్లు, నంబర్ ప్లేట్ సరిగా లేకపోవటం, వాహనం కొనుగోలు చేసిన నెల తర్వాత కూడా టీఆర్ నంబర్తో తిరగడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను నేర కార్యకలాపాలకు దోహదపడేవిగానూ పరిగణిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం చార్జిషీట్లు దాఖలు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తామని హెచ్చరించారు. సంబంధిత వాహనాలను గుర్తిస్తే 90102 03626కు ఫిర్యాదు చేయాలన్నారు. (క్లిక్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి) -
Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే!
బంజారాహిల్స్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో 85 శాతం మంది యువతే ఉంటున్నారు. జైలుకు వెళుతున్న వారిలో సైతం ఎక్కువగా యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రతిరోజు వేర్వేరు చోట్ల శ్వాస విశ్లేషణ పరీక్షలు (బ్రీత్ ఎనలైజర్) నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు. కేసు నమోదు చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిసినా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 85 శాతం మంది 18–40 ఏళ్ల వారే ఉంటున్నట్లు ఇటీవల పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పరిధిలోని ఐదు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 300 పైన నమోదైన వారికి జైలుశిక్ష విధించారు. బీఏసీ 397గా నమోదైన ఓ డ్రైవర్కు వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో బీఏసీ 300కు పైగా నమోదైన వాహనదారులు 9 మందికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. చదవండి👉🏻 ఖమ్మంలో వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం 485 మంది కోర్టులో హాజరు.. డ్రంక్ అండ్డ్రైవ్లో వాహనం ఆపిన వెంటనే మద్యం తాగిన వాహనదారుడు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. శ్వాస విశ్లేషణ పరీక్షలో వచ్చిన కౌంట్ను జత చేసి న్యాయస్థానానికి పంపిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ బీఏసీ 300 దాటితే వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వీరికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా విధిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 2100 కేసులు నమోదు కాగా ఇందులో 485 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 9 మందికి జైలుశిక్ష పడింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండుసార్లు పట్టుబడ్డ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయింది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో నాలుగైదు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. చదవండి👉🏼 ‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు? తీరు మారడం లేదు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో విరివిగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడ్డ ప్రతి ఒక్కరి వివరాలు ట్యాబ్లో పొందుపరుస్తున్నారు. మందుబాబుల పేరు, వివరాలు నమోదు చేయగానే గతంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి ఉంటే ఆ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రెండుమూడు సార్లు సైతం పట్టుబడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవల జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ట్యాబ్లో ఫీడ్ చేయగానే అంతకుముందే పట్టుబడ్డట్లుగా తేలింది. దీంతో ఆయనున న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి డ్రైవింగ్ లైసెన్స్రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీని ఆధారంగా కోర్టులు రెండు రోజుల నుంచి నెల రోజుల పాటు శిక్షలు వేస్తున్నాయి. చదవండి👉 కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య -
గచ్చిబౌలి: మద్యం మత్తులో వీరంగం.. పోలీసులపై చిందులు తొక్కిన యువకులు
సాక్షి, గచ్చిబౌలి: మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జి సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాలో ఇంజనీరింగ్ చదివి ఇటీవలే నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును డ్రైవ్ చేస్తూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల పై చిందులు వేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేటకు చెందిన కే.విజయ్(30), ఘట్కేసర్కు చెందిన సూర్య(28)లు గురువారం సాయంత్రం విధులు ముగించుకొని కొండాపూర్ ప్రాంతానికి వచ్చారు. కారు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ విజయ్, సూర్యలను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరు యువకులు నిహాల్, లోహిత్లుగా గుర్తించారు. మత్తులో ఉన్న వీరు పోలీసులపై తిరగబడడంతో వీరిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. దిల్సుఖ్నగర్లోని కొత్తపేటకు చెందిన లోహిత్, కొండాపూర్కు చెందిన నిహాల్రెడ్డి ఇద్దరు స్నేహితులుగా గుర్తించారు. అమెరికాలో వీరిద్దరు బీటెక్ పూర్తి చేసి ఇటీవలే నగరానికి వచ్చారు. కాగా వీరు ఇరువురు గురువారం జూబ్లీహిల్స్లోని ఓ పబ్లో మద్యం తాగి సాయంత్రం కొండాపూర్లోని నిహాల్ ఇంటికి వస్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి వీరి ముందు బైక్పై వెళ్తున్న విజయ్, సూర్యల వాహనాన్ని ఢీకొట్టారు. వీరికి డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేయగా కారు నడుపుతున్న నిహాల్కు 234 ఎంజీ, లోహిత్కు 501ఎంజీ వచ్చింది. వీరు మద్యంతోపాటు మత్తు పదార్థాలను తీసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై పార్లమెంటు సభ్యుడి స్టిక్కర్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: సైలెంట్ జోన్స్.. నో హారన్ ప్లీజ్
రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాల నేపథ్యంలో నగరంలో వాహనాల ద్వారా ఏర్పడుతున్న శబ్ధ కాలుష్యాన్ని నిరోధించడంపై సిటీ ట్రాఫిక్ విభాగం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాలను సైలెంట్ జోన్లుగా ప్రకటించనుంది. వీటిలో నో హాకింగ్ విధానాన్ని అమలు చేస్తూ హారన్లు మోగించడం నిషేధించడానికి కసరత్తు చేస్తోంది. వీటిని అతిక్రమించే ఉల్లంఘనులకు గుర్తించి, చర్యలు తీసుకోవడానికి అకోస్టిక్ కెమెరాలు వినియోగించనుంది. ఫ్రాన్స్కు చెందిన ఎకోమ్ సంస్థకు చెందిన వీటి పనితీరును బుధవారం ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ పరిజ్ఞానం దేశంలోనే తొలిసారిగా నగరంలో వాడనున్నారు. -సాక్షి, హైదరాబాద్ మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాల హారన్, సైలెన్సర్లు 80 డెసిబుల్స్ వరకు శబ్ధం చేయవచ్చు. ఈ పరిమితిని దాటి శబ్ధం చేసే ఫ్యాన్సీ హారన్లు, వాహనాల సైలెన్సర్లపై ఇప్పటికే ఆడియో మీటర్లను వినియోగించి ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కొందరు వాహన చోదకులు వినియోగిస్తున్న హారన్లు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ ఇతరులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రధానంగా జంక్షన్ల వద్ద ఆగి ఉన్నప్పుడు, సిగ్నల్ రెడ్ లైన్ నుంచి గ్రీన్ లైట్లోకి మారిన వెంటనే హారన్లు మోగిస్తుండటంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని గమనించిన మంత్రి కేటీఆర్ నిరోధానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల ట్రాఫిక్ వింగ్కు ఆదేశాలు ఇచ్చారు. జర్మనీ పరిజ్ఞానంతో తయారైన కెమెరాలు... హారన్లు, సైలెన్సర్ల ద్వారా శబ్ధకాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను గుర్తించే అకోస్టిక్ కెమెరాలను ప్రస్తుతం దేశంలోని ఏ పోలీసు విభాగమూ వాడట్లేదు. ఫ్రాన్స్కు చెందిన ఎకోమ్ కంపెనీ జర్మనీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది. ప్రస్తుతం ఇజ్రాయిల్, చైనా, మలేషియా సహా కొన్ని మూడో ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉంది. వీటి పరితీరును సంస్థ ప్రతినిధి ప్రతీక్ ట్రాఫిక్ విభాగం అధికారులతో పాటు బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ నిపుణులకు వివరించారు. చతురస్రాకారంలో ఉండి రెండు చేతులతోనూ పట్టుకుని వినియోగించే ఈ కెమెరా ముందు వైపు మానిటర్, వెనుక వైపు 72 మైక్రోఫోన్లు ఉంటాయి. వీటి సహాయంతో సదరు కెమెరా గరిష్టంగా 20 మీటర్ల దూరంలో ఉన్న వాహనాల నుంచి వెలువడే శబ్ధ కాలుష్యాన్ని గుర్తిస్తుంది. కనిష్టంగా 20 డెసిబుల్స్ నుంచి గరిష్టంగా 20 వేల డెసిబుల్స్ వరకు వెలువడే శబ్ధాలను గుర్తించి ఈ వాహనం వీడియో, ఫొటో తీస్తుంది. మానిటర్లో శబ్ధం వెలువరిస్తున్న వాహనం చుట్టూ ఎర్ర రంగులో వలయం కనిపిస్తుంటుంది. ఏఎన్పీఆర్ సాఫ్ట్వేర్కు అనుసంధానం... ఎకోమ్ సంస్థ బుధవారం డెమో ఇచ్చిన కెమెరా ద్వారా శబ్ధ కాలుష్యానికి కారణమవుతున్న వాహనాన్ని గుర్తించడంతో పాటు అది ఏ స్థాయిలో శబ్ధాన్ని చేస్తోందో తెలుసుకోవచ్చు. ఆపై దీన్ని వాడే ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనం దగ్గరకు వెళ్లి మాన్యువల్గా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది కష్టసాధ్యం, ఇబ్బందికరమని ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకోస్టిక్ కెమెరాలను ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టంతో (ఏఎన్పీఆర్) అనుసంధానించాలని నిర్ణయించారు. ఇలా చేస్తే జంక్షన్లలో ట్రాఫిక్ కెమెరాలతో కలిసి ఉండే అకోస్టిక్ కెమెరాలు శబ్ధ కాలుష్యానికి కారణమైన వాహనంతో పాటు దాని నంబర్ను గుర్తిస్తుంది. ఆ వాహనచోదకుడికి ఈ–చలాన్ పంపడంతో పాటు న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేయడానికి అవసరమైన ఆధారాలను అందిస్తుంది. ఈ విధానం ప్రస్తుతం ఇజ్రాయిల్లో ఉందని, నగరంలో వాడుతున్న ఏఎన్పీఆర్ వ్యవస్థతో అనుసంధానంపై శుక్రవారం జరగబోయే రెండో దశ సమావేశంలో పూర్తి స్పష్టత ఇస్తామని ఎకోమ్ సంస్థ ప్రతినిధి ట్రాఫిక్ చీఫ్కు తెలిపారు. కాగా ఈ కెమెరా ఖరీదు రూ.13 లక్షలని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్లో 45 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు..
సాక్షి,సనత్నగర్: జీహెచ్ఎంసీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)–2 కింద బేగంపేట కరాచీ బేకరీ సమీపంలోని పికెట్ నాలాపై జరిగే బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో 45 రోజుల పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎస్ఎన్డీపీ ఈ వినతి మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఎస్పీ రోడ్డు, మినిస్టర్ రోడ్డు, సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ఆ మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జూన్ 4 వరకు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు విడుదల చేసిన రూట్ మ్యాప్.. రాకపోకలు ఇలా.. సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ నుంచి రసూల్పురా జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ను హనుమాన్ దేవాలయం వద్ద లేన్ (యాత్రి నివాస్ దగ్గర) వద్ద ఎడమ వైపు మళ్లీ..పీజీ రోడ్డు, ఫుడ్ వరల్డ్, రాంగోపాల్పేట పీఎస్ కుడి వైపు, మినిస్టర్ రోడ్డు మీదుగా రసూల్ పురా ‘టి’ జంక్షన్కు వెళ్లాల్సి ఉంటుంది. ► కిమ్స్ ఆస్పత్రి నుంచి రసూల్పురా ‘టి’ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు న్యూ రాంగోపాల్పేట పీఎస్ ఎదురుగా సింథికాలనీ, పీజీ రోడ్డు వైపు రైట్ టర్న్ తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదు. ►బేగంపేట ఫ్లైఓవర్ నుంచి వచ్చే కిమ్స్ హాస్పిటల్ వైపు వెళ్లే వాహనదారులు రసూల్పురా ‘టి’ జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతి లేదు. ఈ మార్గంలో కేవలం సీటీఓ జంక్షన్, సికింద్రాబాద్ వైపు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. ►హనుమాన్ టెంపుల్ నుంచి ఫుడ్ వరల్డ్, రాంగోపాల్పేట పీఎస్, రసూల్పురా ‘టి’ జంక్షన్ మధ్య ‘వన్ వే’గా గుర్తించారు. ►సికింద్రాబాద్ నుంచి సోమాజీగూడ వైపు గూడ్స్ వాహనాలతో పాటు ప్రైవేటు, స్కూల్స్, కాలేజీ బస్సులు వంటి రవాణా వాహనాలను అనుమతించరు. అవి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: లెక్క తప్పైతే మంత్రి పదవి రాజీనామా చేస్తా: కేటీఆర్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లే మార్గాలు ఇవీ.. పంజగుట్ట వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►గ్రీన్ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, సీటీఓ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని, హనుమాన్ టెంపుల్ లేన్, ఫుడ్వరల్డ్, రాంగోపాల్పేట పీఎస్ ఎడమ మలుపు నుంచి కిమ్స్ హాస్పిటల్కు వెళ్లాలి. ►పంజగుట్ట ఎక్స్రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లైవర్, నెక్లెస్ రోటరీ, పీవీఎన్ఆర్ మార్గ్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్.. ►సీటీఓ జంక్షన్, ప్యారడైజ్, రాణిగంజ్ జంక్షన్ కుడి వైపు తిరిగి, మినిస్టర్ రోడ్డు మీదుగా కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. ►కోఠి, ఎంజే మార్కెట్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్బండ్, రాణిగంజ్ జంక్షన్ ఎడమ మలుపు, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ లేదా బుద్ధభవన్, నల్లగుట్ట, ఆర్యూబీ, మినిస్టర్ రోడ్డు, కిమ్స్ హాస్పిటల్ చేరుకోవాల్సి ఉంటుంది. -
E Challan: అంచనాలకు మించి వసూలు.. వారిపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించకపోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు రిబేటుతో చెల్లించడానికి అవకాశం కల్పించిన ఈ– లోక్ అదాలత్ శుక్రవారంతో ముగిసింది. మార్చి 1న మొదలైన ఈ పథకం తొలుత ప్రకటించిన దాని ప్రకారం అదే నెల 31తో ముగియాల్సి ఉంది. వాహన చోదకుల విజ్ఞప్తుల నేపథ్యంలో మరో 15 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ– చలాన్ల బకాయిలు రూ.1,200 కోట్ల ఉండగా.. 90 నుంచి 25 శాతం వరకు రిబేట్స్ ఇవ్వడంతో ఈ– లోక్ అదాలత్ ద్వారా మొత్తం రూ.250 కోట్ల వరకు వసూలు అవుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రూ.300 కోట్లకు చేరడంతో విజయవంతమైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి 11.59 గంటల వరకు సమయం ఉండటంతో మరికొంత జమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.92 కోట్ల వాహనచోదకులు వినియోగించుకున్నారు. అత్యధికంగా ద్విచక్ర వాహనాలవే.. చెల్లింపులు జరిగిన అత్యధిక చలాన్లు ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే అని అధికారులు వివరిస్తున్నారు. మొత్తం పెండింగ్ చలాన్లలో 70 శాతానికి పైగా క్లియర్ అయినట్లు స్పష్టం చేస్తున్నారు. కొన్ని వాహనాలు చేతులు మారడం, మరికొన్ని వినియోగంలో లేకపోవడం తదితర కారణాలతో 10 నుంచి 15 శాతం చలాన్లు చెల్లింపులు జరగలేదని భావిస్తున్నారు. ఈ– లోక్ అదాలత్లో పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై సోమవారం నుంచి చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సర్వర్లో పెండింగ్ చలాన్లు జాబితాను అప్డేట్ చేస్తున్నారు. ఇది క్షేత్రస్థాయి అధికారుల వద్ద ఉండే ట్యాబ్లకు అనుసంధానించి ఉంటుంది. రహదారులపై తనిఖీలు నిర్వహించనున్న ప్రత్యేక బృందాలు జరిమానాల బకాయి ఉన్న వారిని గుర్తించి పట్టుకుంటాయి. వీళ్లు ఎంత మొత్తం పెండింగ్లో ఉండే అంతా చెల్లించేలా చర్యలు తీసుకోనున్నాయి. మరోపక్క 15 చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్లో ఉన్న వారి జాబితాలను ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా రూపొందిస్తున్నారు. వారిపై ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేయనున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మరోపక్క చలాన్ల సంఖ్య, చెల్లించాల్సిన మొత్తం ఆధారంగా టాప్ వైలేటర్స్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్ నుంచి ఆయా వాహన చోదకుల చిరునామాలు సంగ్రహిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా ఏర్పాటయ్యే ప్రత్యేక బృందాలకు ఇవి అందించనున్నారు. ఆ టీమ్స్ సదరు ఉల్లంఘనుల ఇళ్లకు వెళ్లి పెండింగ్లో ఉన్న జరిమానా చెల్లించేలా ప్రయత్నాలు చేస్తాయి. ఫోన్ నంబర్ల డేటాబేస్ సమకూరింది ఈ– లోక్ అదాలత్ నేపథ్యంలో భారీ సంఖ్యలో పెండింగ్ చలాన్లు వసూలు కావడంతో పాటు వాహన చోదకులకు సంబంధించిన ఫోన్ నంబర్లతో కూడిన డేటాబేస్ సమకూరింది. కొన్ని వాహనాలు అనేక మంది చేతులు మారినా... ఆర్టీఏ డేటాబేస్లో అప్డేట్ కాని నేపథ్యంలో వారి చిరునామాలు, కాంటాక్ట్ నంబర్లు అందుబాటులో ఉండేవి కాదు. ఫలితంగా అనేక ఈ– చలాన్లు వాహనాల మాజీ యజమానులకు చేరేవి. ఈ– లోక్ అదాలత్ చెల్లింపుల నేపథ్యంలో ఓటీపీ తప్పనిసరి చేయడంతో వాహనచోదకులు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్తో పాటు తమ ఫోన్ నంబర్లను పొందుపరిచారు. ఈ వివరాలు సంగ్రహించిన సర్వర్ ప్రత్యేక డేటాబేస్ రూపొందించింది. ఈ నేపథ్యంలోనే ఈ– చలాన్ను వాట్సాప్ ద్వారా పంపే ప్రక్రియ కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాం. ఇలా చేస్తే ప్రతి ఉల్లంఘనుడికి కచ్చితంగా ఈ– చలాన్ చేరుతుంది. – నగర ట్రాఫిక్ ఉన్నతాధికారి -
చలాన్లు క్లియర్ చేయలేదా? డిస్కౌంట్ ఆఫర్ ఎండ్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ సర్కార్ ప్రకటించిన పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. మార్చి ఒకటి నుంచి పోలీసులు ఈ ఆఫర్ ప్రకటించారు. ముందుగా మార్చి నెలాఖరు వరకే ఈ ఆఫర్ ఉండగా.. ఆ తర్వాత ఏప్రిల్ 15 వరకు దాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ 16 నుంచి యథావిధిగా చలాన్ రుసుము వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు 60 శాతం వాహనదారులు చలాన్లు క్లియర్ చేసుకున్నారు. దాదాపు రూ. 250 కోట్లను ఫైన్ల రూపంలో చెల్లించారు. అయితే మరోసారి ఆఫర్ పొడిగింపు ఉండదని పోలీసులు ఇదివరకే స్పష్టం చేశారు. చదవండి: ‘అత్తమామలు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. భర్తతో మాట్లాడనీయడం లేదు’ -
డైరెక్టర్ త్రివిక్రమ్ కారుకు జరిమానా
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు జరిమాన విధించారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వెలుతున్న త్రివిక్రమ్ కారును అడ్డుకున్నారు. ఆయన కారును తనిఖీ చేసిన ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలింను గుర్తించారు. దీంతో కారుకు ఫైన్ వేసి బ్లాక్ ఫిలింను తొలగించారు. ఆనంతరం ఆయనకు రూ. 700 జరిమానా విధించారు. చదవండి: టాలీవుడ్ హీరోయిన్పై మనసు పారేసుకున్న యంగ్ క్రికెటర్! కాగా వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్లకు కూడా ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసి బ్లాక్ ఫిలిం తొలగించిన సంగతి తెలిసిందే. -
హీరో మంచు మనోజ్ కారుకు జరిమానా.. ఎందుకంటే?
Hyderabad Traffic Police Fined To Manchu Manoj Car: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్ టోలీచౌకిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ కారుకు బ్లాక్ ఫిలిం ఉన్నట్లు గుర్తించారు. దీంతో మనోజ్ కారుకు రూ. 700 ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే మనోజ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను తొలగించారు. కాగా వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లను అడ్డుకున్న పోలీసులు ఇటీవల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారును ఆపి సోదాలు నిర్వహించారు పోలీసులు. ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తెర ఉన్నందున మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ. 700 జరిమానా విధించారు. అనంతరం ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను తొలగించారు. అలాగే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కారులకు సైతం బ్లాక్ ఫిలిం తెరను తొలగించి చలానా విధించారు. చదవండి: స్టార్ హీరో కారును అడ్డుకున్న పోలీసులు, ఏం జరిగిందంటే? -
బ్లాక్ ఫిల్మ్.. అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు జరిమానా
బంజారాహిల్స్: కారు అద్దాలకు బ్లాక్ఫిలిం ఏర్పాటు చేసుకున్న సినీనటులు అల్లు అర్జున్ ,కల్యాణ్రామ్కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. శనివారం ఉదయం మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ మీదుగా రేంజ్ రోవర్ కారులో వెళ్తున్న అల్లు అర్జున్ను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నీరూస్ చౌరస్తాలో ఆపారు. కారు అద్దాలకున్న నలుపు రంగు తెరలను తొలగించి, మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన కింద రూ.700 జరిమానా విధించారు. ఇదే చౌరస్తా నుంచి వస్తున్న నటుడు కల్యాణ్రామ్ రేంజ్ రోవర్ కారును సైతం ఆపి, అద్దాలకున్న నలుపు రంగు తెరల్ని తొలగించి రూ.700 జరిమానా విధించారు. -
జూనియర్ ఎన్టీఆర్ కారును అడ్డుకున్న పోలీసులు, ఏం జరిగిందంటే?
నందమూరి హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ కారును ఆపి సోదాలు నిర్వహించారు. అంతేగాక అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తెరను పోలీసులు తొలగించారు. కాగా వై కాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: జీవితమంతా అంధకారమే: ప్రణీత షాకింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని అడ్డుకుని అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు. అంతేకాదు ఎన్టీఆర్ కారుకు రూ. 700 జరిమాన కూడా వేసినట్లు తెలుస్తోంది. తనిఖీ సమయంలో కారులో డ్రైవర్తోపాటు.. ఎన్టీఆర్ తనయుడు.. మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. చదవండి: కీరవాణి కంపోజ్ చేసిన ఆ పాట అంటే ఇరిటేషన్: ఎన్టీఆర్ శుక్రవారం జూబ్లీహిల్స్ కారు ప్రమాదం ఘటన నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ తన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ఎన్టీఆర్ కోమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ సీతారామారాజుగా కనిపించనున్నాడు. తారక్ సరసన ఒలీవియా మోరిస్, చెర్రీకి జోడిగా ఆలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. -
చలాన్ క్లియరెన్స్కు భారీ స్పందన.. నిమిషానికి 1000
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్ జరిమానా బకాయిలు భారీ తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్ అదాలత్కు వాహన చోదకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోలీసులు పెట్టిన వన్టైమ్ డిస్కౌంట్ ఆఫర్లకు భారీగా స్పందన లభిస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్లైన్లో ప్రారంభమైన ఈ విధానంలో మంగళవారం వరకు 1.29 కోట్ల చలాన్లు చెల్లించారు. 15 రోజుల వ్యవధిలో చలాన్ల రూపంలో రూ.132 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. వీటిలో 80 శాతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు సంబంధించినవే కావడం గమనార్హం. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో 56 లక్షల చలాన్లకు సంబంధించి రూ.43 కోట్లు వసూలయ్యాయి. చదవండి:హైదరాబాద్: కీలక నిర్ణయం.. ఎక్కడపడితే అక్కడ.. ‘ఫొటోలు’ తీయరిక! మార్చి 31 వరకు ఈ ఆఫర్ ఉండనుంది. నిమిషానికి వాహనాదారులు 1000 చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారు. మొదటి రోజేజే 5.5 కోట్ల రూపాయలు ఫైన్లుచెల్లించారు. డిసెంబర్ 2021 వరకు 80 లక్షల పెండింగ్ చలాన్ లు ఈ–చలాన్ చెల్లింపుల కోసం ఉద్దేశించిన అధికారిక వెబ్సైట్లో కొన్ని మార్పులు చేశారు. తొలినాళ్లల్లో అక్కడ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్తో పాటు ఇంజన్ లేదా చాసిస్ నంబర్ ఎంటర్ చేయడం కచ్చితం చేశారు. అప్పుడే పెండింగ్ చలాన్లు కనిపించేవి. అయితే తాజాగా చేసిన మార్పులతో కేవలం వాహనం నంబర్తోనే ఎంటర్ కావచ్చు. ఫోన్ నంబర్ పొందుపరిచి, దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం మాత్రం తప్పనిసరి. ఈ–లోక్ అదాలత్ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జారీ అయిన ఈ–చలాన్లకు మాత్రమే ఈ రిబేటు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చలాన్లకు మాత్రం మొత్తం చెల్లించాల్సిందేనని వివరిస్తున్నారు. చదవండి: అలా చేస్తే కిషన్రెడ్డిని హైదరాబాద్ నడిబొడ్డున సత్కరిస్తాం: మంత్రి కేటీఆర్ -
ట్రాఫిక్ చీఫ్ కీలక నిర్ణయం! ఇకపై అటువంటి చలాన్లు ఉండవా?
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ఈ– చలాన్ల ప్రధాన ఉద్దేశం రోడ్డు భద్రత పెంచడంతో పాటు ప్రమాదాలు, మరణాలు నిరోధించడం. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసుల ఈ–చలాన్ జారీ విధానం ‘రోగమొక చోటైతే.. మందొక చోట’ అన్న చందంగా ఉంది. ఈ లోపాలను పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే ఎక్కువగా కన్నేసి ఉంచనున్నారు. అక్కడి ఉల్లంఘనులనే ఫొటోలు తీసి ఈ–చలాన్ల పంపనున్నారు. త్వరలో ఈ విధానం ప్రారంభం కానుందని, సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. 90 శాతం హెల్మెట్ కేసులే.. లక్డీకాపూల్ అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉండే ప్రాంతం. ఇక్కడ సరాసరిన వాహనాల సరాసరి వేగం గంటలకు 15 కి.మీ కూడా మించదు. అలాంటి చోట హెల్మెట్ ధరించినా, ధరించకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇలాంటి చోట్లా రోజూ వందలు, వేల సంఖ్యలో ‘వితౌట్ హెల్మెట్’ కేసులు నమోదు చేస్తూ ఈ–చలాన్లు జారీ చేస్తుంటారు. ►ఏటా జారీ అవుతున్న ఈ– చలాన్లలో 90 శాతం హెల్మెట్ కేసులే ఉంటున్నాయి. ప్రస్తుతం జారీ అవుతున్న ఈ– చలాన్ విధానంలో ఇలాంటి లోపాలు అనేకం ఉన్నాయి. వీటిని గమనించిన రంగనాథ్ కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానం అమలవుతోంది. ►దీని ప్రకారం ఏ ట్రాఫిక్ పోలీసు ఉల్లంఘనులకు నేరుగా చలాన్ విధించరు. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది తమ వద్ద ఉన్న కెమెరాలతో ఉల్లంఘనకు పాల్పడిన వాహనం ఫొటో తీస్తున్నారు. ఆర్టీఏ డేటాబేస్లోని వాహనం చిరునామా ఆధారంగా ఉల్లంఘనకు సంబంధించిన ఈ– చలాన్ పంపిస్తున్నారు. ఈ ఫొటోలు తీసే పోలీసులు జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో ఉంటున్నారు. బ్లాక్ స్పాట్లలోనే.. ఒకే చోట ఉంటూ తమ కంటికి కనిపించిన ప్రతి ఉల్లంఘనను ఫొటో తీస్తున్నారు. ఇకపై వీళ్లు తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్ స్పాట్స్లోనే ఉండనున్నారు. ఇప్పటికే గడిచిన అయిదేళ్ల గణాంకాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు పోలీసుస్టేషన్ల వారీగా ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పోలీసులు కూడా ఏ తరహా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ ఉల్లంఘనలకే ప్రాధాన్యం ఇస్తూ ఫొటోలు తీస్తారు. చదవండి: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111? 125 ఆధునిక ట్యాబ్ల కొనుగోలు.. ►ఈ విధానం అమలు కోసం ట్రాఫిక్ విభాగం అధికారులు కొత్తగా 125 అత్యాధునిక ట్యాబ్స్ ఖరీదు చేశారు. కెమెరాల స్థానంలో వీటిని వినియోగిస్తూ, ప్రత్యేక యాప్ ద్వారా ఉల్లంఘనుల ఫొటోలు తీయనున్నారు. దీంతో ఆ ఫొటో తీసిన సమయం, తేదీలతో పాటు ప్రాంతం కూడా అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా నమోదవుతుంది. క్షేత్రస్థాయి పోలీసులు ఒకే చోట ఉండి ఫొటోలు తీయకుండా నిఘా ఉంచేందుకు ఇది ఉపకరించనుంది. ►మరోపక్క ప్రస్తుతం ఈ– చలాన్ల బట్వాడాకు సంబంధించి పోలీసు విభాగం పోస్టల్ శాఖకు నిర్ణీత రుసుం చెల్లిస్తోంది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఒక్కో ఈ– చలాన్కు రూ.15 చొప్పున పోస్టల్ శాఖకు చేరుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఈ– లోక్ అదాలత్లో వచ్చిన సొమ్ము నుంచి ఇది చెల్లించాల్సిందే. ఈ ఖర్చు తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. -
వాహనాల ధ్వని కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసుల నజర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాహనాల కారణంగా నానాటికీ పెరిగిపోతున్న ధ్వని కాలుష్యం తగ్గింపుపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. దీని నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీటిని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు సిటీ ట్రాఫిక్ అదనపు సీపీ సభ్యులుగా ఉన్నారు. మార్గదర్శకాలు రూపొందించడంపై ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న, భయంకరమైన శబ్ధాలు చేసే సైలెన్సర్లు, హారన్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధి విధానాల కోసం కసరత్తు చేస్తున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఏవీ రంగనాథ్ నేతృత్వంలో ట్రాఫిక్ కమిషనరేట్లో జరిగిన సమావేశంలో ఆర్టీఏ, కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ విభాగాల అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు. రాజధానిలో సంచరిస్తున్న వాహనాల హారన్లతో పాటు సైలెన్సర్ల మార్పు చేర్పుల ద్వారా తీవ్రమైన ధ్వని కాలుష్యం ఏర్పడుతోందని పోలీసులు గుర్తించారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ఓ వాహనం హారన్ గరిష్టంగా 93 నుంచి 100 డెసిబుల్స్ మధ్య మాత్రమే శబ్ధం చేయాలి. అలాగే ఆయా వాహనాల ఇంజిన్లు, సైలెన్సర్లు సైతం ఎంత శబ్ధం చేయవచ్చనేది స్పష్టంగా నిర్ధేశించి ఉంది. (క్లిక్: కేబీఆర్ పార్కు: చీకటి పడితే భద్రత దైవాధీనం) అయితే ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్న వాహనచోదకులు పరిమితికి మించి శబ్దాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కేవలం ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులు, బుల్లెట్ వంటి వాహనాలు మాత్రమే కాదు.. చివరకు ఆర్టీసీ బస్సులు, కాలేజీలు, స్కూళ్ళకు విద్యార్థుల్ని తరలించే వాహనాలు సైతం కర్ణకఠోరమైన శబ్ధాన్ని విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్యాన్సీ హారన్లు, ఎయిర్ హారన్స్, మల్టీ టోన్ హారన్స్, మోడిఫైడ్ సైలెన్సర్ల కారణంగా, అనవసరంగానూ మోగిస్తున్న హారన్ల వల్లే ఇలా జరుగుతోందని అధికారులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం రంగనాథ్ నేతృత్వంలో రోడ్లపైకి వచ్చిన అధికారులు వివిధ వాహనాలతో పాటు ప్రధానంగా బస్సులపై దృష్టి పెట్టారు. సౌండ్ లెవల్ మీటర్ల సాయంతో ఏఏ వాహనాలు, ఏ స్థాయిలో ధ్వనికి కారణమవుతున్నాయో గుర్తిస్తున్నారు. (క్లిక్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?) సమగ్ర నివేదికలు సమర్పిస్తాం: హాకింగ్ ఫ్రీ సిటీ అమలే మా లక్ష్యం. ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న వాహనాలకు కంపెనీలు అందిస్తున్న హారన్లు, సైలెన్సర్ల వద్ద వెలువడుతున్న శబ్ధంతో పాటు పాటు మార్పుచేర్పుల ద్వారా వస్తున్నదీ అధ్యయనం చేస్తున్నాం. కార్ డెకార్స్ సంస్థల యజమానులు, మార్పులు చేసే మెకానిక్స్, వివిధ కార్లు, బైకులు విక్రయించే డిస్ట్రిబ్యూటర్లు, ట్రావెల్ ఏజెన్సీలతో సోమవారం సమావేశమయ్యాం. జాతీయ రహదారులపై ఎయిర్ హారన్లు తప్పనిసరని కొందరు చెబుతున్నారు. వారు సిటీలోనూ వినియోగిస్తున్నారు. ఈ ధ్వని కాలుష్య అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించి కమిటీకి సమర్పిస్తాం. దాని నిర్ణయం మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఖరారు చేస్తాం. ప్రస్తుతం సిటీ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఐదు సౌండ్ లెవల్ మీటర్లు ఉన్నాయి. త్వరలో మరిన్ని ఖరీదు చేయనున్నాం. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ చీఫ్ -
తెలంగాణలో జోరందుకున్న పెండింగ్ చలానాల చెల్లింపులు
-
ఏయ్.. నేను ఊదనంటే ఊదను.. పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మందుబాబు
-
ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన కానిస్టేబుల్
-
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్ న్యూస్.. ఇక ఇంటికొస్తారు!
‘ఖెరతాబాద్ చౌరస్తాలో సిగ్నల్ జంపింగ్ చేసిన ఓ యువకుడు అదే జోష్లో రాయదుర్గంలోని తన ఇంటికి చేరుకున్నాడు. మర్నాటి మధ్యాహ్నం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అతడి ఇంటికి వచ్చారు. కౌన్సిలింగ్ చేయడంతో పాటు అతడి వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు కట్టించారు’. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ట్రాఫిక్ స్థితిగతులను మెరుగుపరచడం, రోడ్డు ప్రమాదాలను నిరోధించడం దృష్టి పెట్టిన ట్రాఫిక్ విభాగం అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని చౌరస్తాలు, జంక్షన్లలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారికి చెక్ చెప్పే విషయంలో వినూత్నంగా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా ఆ తరహా ఉల్లంఘనుల ఇంటికి పంపడానికి ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నామని సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రమాదాలు మూడు తరహాలు... ట్రాఫిక్ విభాగం అధికారులతో పాటు రహదారి భద్రత నిపుణులు సైతం రోడ్డు ప్రమాదాలను మూడు తరహాలకు చెందినవిగా చెబుతుంటారు. వాహనం నడిపే వ్యక్తి మాత్రమే ప్రమాదకరంగా పరిగణించేవి మొదటి రకమైతే.. ఎదుటి వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నవి రెండో తరహాకు చెందినవి. ఈ రెంటికీ మించి వాహన చోదకుడితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం జరగడానికి కారణమయ్యే వాటిని మూడో కేటగిరీగా పరిగణిస్తారు. సాధారణంగా ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ మూడో కోవకు చెందిన వాటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ నిరోధానికి చర్యలు తీసుకుంటూ ఉంటారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ.. నగరంలోని కొన్ని జంక్షన్లలో ఉల్లంఘనలకు పాల్పతుడున్న వారి వల్ల.. వారితో పాటు ఎదుటి వారికీ ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధానంగా సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్ వంటి వైలేషన్స్ ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నట్లు గుర్తించారు. చౌరస్తాలు, జంక్షన్లలో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, ఫొటో, వీడియోలు తీయడానికి బషీర్బాగ్ కమిషనరేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అదనపు సిబ్బందిని మోహరించనున్నారు. వీరు ఆ తరహా ఉల్లంఘనులను, వారి వాహనం నంబర్ ఆధారంగా చిరునామా గుర్తిస్తారు. వైలేషన్ చోటు చేసుకున్న మరుసటి రోజే ఉల్లంఘనుడి ఇంటికి వెళ్లడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. అక్కడిక్కడే వెరిఫై చేయడం ద్వారా ఆ వాహనంపై ఉన్న చలాన్లు గుర్తించి కట్టిస్తారు. జంక్షన్లలోనూ ప్రమాదాలు.. నగరంలో 2019– 21 మధ్య కాలంలో నగరంలో చోటుచేసుకున్న ప్రమాదాలను ట్రాఫిక్ విభాగం అధికారులు అధ్యయనం చేశారు. అవి జరిగిన సమయాలతో పాటు ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సిటీలోని అనేక జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద పెద్ద సంఖ్యలోనే ప్రమాదాలు జరిగినట్లు తేల్చారు. ద్విచక్ర వాహనచోదకులు జంక్షన్లలో చేస్తున్న ఉల్లంఘనల కారణంగానూ ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ వైలేషన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండింటికీ సమ ప్రాధాన్యం నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నిరోధానికీ సమ ప్రాధాన్యమిస్తున్నాం. అందులో భాగంగానే జంక్షన్లలో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, వారి ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ చేయడానికి ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తున్నాం. వాహన చోదకుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతో పాటు వారిలో బాధ్యత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
ఇదెక్కడి మాస్ వాడకంరా మావ.. 'పుష్ప'ను వాడేసిన పోలీసులు
Hyderabad Traffic Police Using Pushpa Poster Urge Wear Helmets: ప్రజల్లో 'పుష్ప'రాజ్ ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు. పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్లు ప్రేక్షక జనాల్లో ఓ రేంజ్లో నాటుకుపోయాయి. డైలాగ్లు, పాటలను స్పూఫ్స్, కవర్ సాంగ్స్గా మలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తమదైన శైలీలో పుష్పరాజ్ డైలాగ్లు కొట్టడం, అవి వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా సినిమాలోని క్యారెక్టర్లను ఎవరికీ నచ్చినట్లు వారు వాడుకుంటున్నారు. ప్రముఖ వాణిజ్య సంస్థ 'అమూల్' తన వ్యాపారం కోసం 'పుష్పక్ ది స్లైస్.. అమూల్ హావ్ సమ్ అమ్ములు, అర్జున్..' అనే కార్టూన్ను షేర్ చేసింది. దీనికి బన్నీ కూడా స్పందించాడు. దీంతో ఆ వాణిజ్య ప్రకటన వైరల్గా మారింది. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పుష్పరాజ్ను వాడటం ఆసక్తికరంగా మారింది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ను కచ్చితంగా ధరించాలనే నియమంపై కార్యక్రమం చేపట్టారు. పుష్ప సినిమాలో బైక్పై వెళుతున్న అల్లు అర్జున్ హెల్మెట్ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. ఆ ఫొటోపై 'హెల్మెట్ తప్పని సరి.. తగ్గేదే లే..' అంటూ రాసి ఉంది. అలాగే 'హెల్మెట్ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది.' అంటూ ట్వీట్ చేశారు పోలీసులు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అందుకే ఈ సినిమాతో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తే జనాల్లోకి బాగా వెళ్తుందని పోలీసులు భావించినట్లు తెలుస్తోంది. #HYDTPweBringAwareness Wear Helmet. It saves you #WearHelmet #Helmet #ThaggedheLe@jtcptrfhyd @dcptraffic1hyd. pic.twitter.com/VyGMUY43O8 — Hyderabad Traffic Police (@HYDTP) January 14, 2022 ఇదీ చదవండి: పుష్పను వాడేసిన అమూల్, కామెంట్ చేసిన బన్నీ -
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనే ఎక్కువ!
మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం... హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాల డ్రైవింగ్... రాంగ్రూట్లో వెళ్తూ ప్రమాదాలకు గురికావటం... సిగ్నల్ జంపింగ్... సీటు బెల్టు ధరించకపోవడం... వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించకపోవడం ఇలాంటివన్నీ ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకం. ప్రాణాంతం కూడా. పోలీసులు ఎంత చెప్పినా.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఉల్లంఘనులు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భారీగా ‘ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన’ల కేసులు నమోదు చేశారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రాత్రి 9 నుంచి 11 గంటల వరకు 3 గంటల పాటు ఈ డ్రైవ్ చేపట్టారు. ఇందులో అధికంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపైనే దృష్టిసారించారు. మద్యం సేవించి వాహనాలపై వెళ్లే ప్రాంతాలను గుర్తించి అక్కడే రోజూ ఈ తనిఖీలు నిర్వహించారు. (చదవండి: హైదరాబాద్ పోలీస్.. టార్గెట్ న్యూ ఇయర్ పార్టీస్!) బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మొత్తం 7024 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న 14 మందితో పాటు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 1794 మందిపై కేసులు నమోదు చేశారు. (చదవండి: రోడ్డు ప్రమాదం.. నిందితుడిని అరెస్టు చేయరా?) ► సక్రమంగా నంబర్ ప్లేట్ లేని 81 మంది, ట్రిబుల్ రైడింగ్ చేస్తున్న 50 మందిపై కేసులు నమోదు చేశారు. ► నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 33 మందిపై కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 54 కేసులు నమోదయ్యాయి. ► రాంగ్సైడ్ డ్రైవింగ్ చేస్తూ 105 మంది పట్టుబడ్డారు. ► ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించిన ఇంకో 1640 మందిపై కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 589 కేసులు నమోదయ్యాయి. ► డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 70 నమోదు కాగా మైనర్లు వాహనాలు నడుపుతూ ఒకరు పట్టుబడ్డారు. ► నంబర్ ప్లేట్సరిగా లేని 35 మందిపై హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న 71 మందిపై కేసులు నమోదు చేశారు. ► సంబంధం లేని ఇతరులకు వాహనాలు ఇచ్చి నడిపిస్తుండగా అలా 57 మందిపై కేసులు నమోదు చేశారు. ► సైలెన్సర్లు మార్చి అధిక శబ్ధంతో వాహనాలు నడుపుతున్న ఏడు మందిపై కేసులు నమోదు చేశారు. ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఒకరిపై కేసు నమోదైంది. -
ఒకే రోజు 6 డ్రంకన్ డ్రైవ్ ఘటనలు.. నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. సోమవారం ఒకేరోజు జరిగిన ఆరు ఘటనల్లో నలుగురు మృత్యువాత పడటం డ్రంకన్డ్రైవ్ విషాదానికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇకనుంచి ప్రతి రోజూ రాత్రి వేళ డ్రంకన్ డ్రైవ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కేసుల తీరుతెన్నులు, పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సిటీ ట్రాఫిక్ చీఫ్ విజయ్కువర్ మంగళవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు అప్పుటికప్పుడే... ►నగర పోలీసు విభాగం 2011 నుంచి డ్రంక్ డ్రైవింగ్కు అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ ఏడాది నవంబర్ నుంచి ప్రతి వీకెండ్లోనూ ఈ స్పెషల్డ్రైవ్ నిర్వహించే వాళ్లు. ఆ తర్వాత కాలంలో దీన్ని విస్తరిస్తూ వారానికి రెండు లేదా మూడు రోజులు చేపడుతున్నారు. ►తాజా పరిణామాల నేపథ్యంలో ప్రతి రోజూ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా డ్రంకన్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని విజయ్కుమార్ ఆదేశించారు. ప్రతి పోలీసుస్టేషన్లోనూ కనీసం రెండు బృందాల చొప్పున ఉండాలని, నిత్యం ఒకే స్పాట్లో కాకుండా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో, కనీసం మూడు గంటల చొప్పున డ్రైవ్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ►రానున్న రోజులతో పాటు ప్రత్యేక సందర్భాల్లో ఈ తనిఖీల సమయంతో పాటు చేసే ప్రాంతాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి తాజా విధానాలు అమలులోకి రానున్నాయి. సిబ్బందితో ఇబ్బంది లేకుండా... ►ప్రతి రోజూ డ్రంకన్ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించడానికి ట్రాఫిక్ పోలీసుల్లో ఉన్న సిబ్బంది సంఖ్య ఓ ప్రధాన సమస్యగా మారుతోంది. పగటిపూట రోడ్లపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంతో పాటు బందోబస్తు విధులకే ఉన్న సిబ్బంది చాలట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి రోజూ కొందరు సిబ్బందితో రెండు బృందాలు ఏర్పాటు చేసి రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ చేపడితే ఇబ్బందులు ఉంటాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విధులు నిర్వర్తించిన వాళ్లు మరుసటి రోజు ఉదయం విధులకు హాజరుకాలేదు. ఈ ప్రభావం ట్రాఫిక్ తీరుతెన్నులపై ఉంటుంది. ►ఈ నేపథ్యంలోనే డ్రంకన్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ కోసం పరిమిత సంఖ్యలో ట్రాఫిక్ అధికారులు, అవసరమైన మేర శాంతిభద్రతల విభాగం పోలీసులను వినియోగించనున్నారు. వీరికి సహకరించడానికి సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్– క్వార్టర్స్ నుంచి సిబ్బందిని వెహరించాలని ట్రాఫిక్ చీఫ్ విజయ్కుమార్ నిర్ణయించారు. ఆ ‘వేగులపై’ ప్రత్యేక నిఘా.. ►పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా, ఎన్ని తనిఖీలు చేపడుతున్నా ఆ సమాచారం ‘వేగుల’ ద్వారా తెలుసుకుంటున్న ‘నిషా’చరులుగా తమ ప్రయాణ వర్గాలను మార్చుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ►ఇలాంటి మందుబాబులకు సహకరించడానికి కొందరు యువకులు వాట్సాప్ గ్రూపుల్ని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉండే ఈ గ్రూపు సభ్యుల తమ ప్రాంతంలో జరిగే డ్రంక్ డ్రైవింగ్కు సంబంధించిన సమయం, ప్రాంతం వివరాలను ఇందులో పోస్టు చేస్తున్నారు. ►వేగుల సమాచారంతో ప్రయాణ వర్గం మార్చుకుంటున్న మందుబాబుల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలకు ఆస్కారం ఉందని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారి కోసం నిఘా వేసి ఉంచాలని, ఆయా గ్రూపుల్ని గుర్తిస్తే వాటి అడ్మిన్స్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అంశం పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ‘నిషా’ నిందితులకు రిమాండ్ మూడ్రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ బంజారాహిల్స్: మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి ఇద్దరు మృతికి కారకులైన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. ఉప్పల్ రాఘవేంద్ర కాలేజీకి చెందిన బజార్ రోహిత్గౌడ్, కర్మన్ఫట్లో నివసించే వేదుల సాయి సోమన్ మద్యం తాగి ఆ మత్తులోనే కారు నడపడంతో ప్రవదం చోటుచేసుకుంది. నిందితులిద్దరిపై ఐపీసీ సెక్షన్ 304(2) (నేరపూరిత హత్య), 185 ఎంవీ యాక్ట్ కింద కేసు నవెదు చేశారు. వీరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్త న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వీరిద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు. ప్రవద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఇది మామూలు లిస్టు కాదు.. నాలుగేళ్లుగా ‘జంప్’ అవుతున్నాడు, కానీ ఈసారి
బంజారాహిల్స్: స్కేటింగ్ కోచ్ జునైద్ శనివారం (టీఎస్09 ఎఫ్డీ 3792) యాక్టివాపై వెళ్తుండగా.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. ఆ స్కూటర్కు సంబంధించిన పెండింగ్ చలానాలు పరిశీలించగా గత నాలుగేళ్లుగా పెండింగ్ చలానాలతో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నట్లుగా తేలింది. మొత్తం 107 పెండింగ్ చలానాలు ఈ బైక్పై నమోదై ఉన్నాయి. చలాన్ల జాబితా చాంతాడంత ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. రూ. 35,835 జరిమానా పెండింగ్లో ఉండటంతో ఆ మొత్తాన్ని సదరు వాహనదారుడు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో బైక్ను పోలీసులు సీజ్ చేశారు. హెల్మెట్ లేకుండా పోలీసులను తప్పించుకొని తిరుగుతున్న అతడు ఎట్టకేలకు జూబ్లీహిల్స్లో పోలీసులకు చిక్కాడు. అబిడ్స్లో నివసించే జునైద్ హైటెక్ సిటీ గూగుల్ బిల్డింగ్లో స్కేటింగ్ కోచ్గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. (చదవండి: ‘మేడారం’ పనులు మొదలయ్యేదెప్పుడు?) -
TS: వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
సాక్షి హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టు బడిన వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనాలు సీజ్ చేసే సమయంలో మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 448–ఎ నిర్ధేశించిన మేరకు వ్యవహరించాలని చెప్పింది. తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్ అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో తమ వాహనాలను సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 41 పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. మరొకరికి అప్పగించొచ్చు... ‘డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనానికి సంబంధించిన ఆర్సీ చూపిస్తే ఆ వాహనాన్ని విడుదల చేయాలి. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే ఆయన్ను వాహనం నడపకుండా అడ్డుకోవచ్చు. అదే వాహనంలో లైసెన్స్ కలిగి మద్యం సేవించని వారు ఉంటే వారికి వాహనాన్ని అప్పగించవచ్చు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ మినహా ఎవరూ లేకపోతే వాహనదారుని బంధువులు లేదా సన్నిహితులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఒకవేళ వాహనాన్ని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోతే సమీప పోలీస్స్టేషన్కు ఆ వాహనాన్ని తరలించి సురక్షితంగా ఉంచాలి. వాహన డ్రైవర్ మద్యం సేవించారన్న కారణంగా ఆ వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసు అధికారులకు లేదు. ఒకవేళ వాహనదారుడిని ప్రాసిక్యూట్ చేయా లని పోలీసులు భావిస్తే వాహనాన్ని సీజ్ చేసిన 3రోజుల్లోగా సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి. ఈ మేరకు న్యాయమూర్తులు చార్జిషీట్లను మూడు రోజుల్లో విచారణకు స్వీకరించాలి. కోర్టు విచారణ ముగిసిన వెంటనే సంబంధిత ఆర్టీఏకు సమాచారం ఇచ్చి ఆ వాహనాన్ని పోలీసు అధికారులు విడుదల చేయాలి’అని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. -
ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్
Traffic Challan Issued To Telangana CS Somesh Kumar Official Vehicle: తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్షించాల్సిందే. ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. దానిలో భాగంగానే నిబంధనలు పాటించని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక వాహనానికి చలాన్ విధించి తమకు అందరూ ఒక్కటే అని చాటి చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. (చదవండి: బైక్పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..) హైదరాబాద్ టోలిచౌకి పీఎస్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లై ఓవర్పై అధిక వేగంతో సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం (TS09FA0001) వెళ్తుండడాన్ని గుర్తించి చలాన్ విధించారు. మూడు వేల రూపాయల చలాన్ కట్టాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. చదవండి: సీఎస్ చదివాక సంతకం చేయాలి కదా? -
బైక్పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..
సాక్షి, కుత్బుల్లాపూర్: ఒక ద్విచక్ర వాహనానికి ఏకంగా 65 చలాన్లు ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. సుచిత్ర లయోలా కాలేజీ వద్ద బుధవారం రాత్రి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అల్వాల్కి చెందిన సయ్యద్ సాజిద్ (టీఎస్ 10 ఈపీ 8619) ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం చలాన్ల గురించి ఆరా తీయగా 64 ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 23,580 రూపాయలు అపరాధ రుసుం ఉన్నట్లు తెలుసుకుని రసీదు ఇచ్చి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే ఈ వాహన వివరాలు తనిఖీ చేయగా ఉమారామ్నగర్ అల్వాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా తేలింది. అయితే సదరు వాహనం తనదంటే తనది అని ఇద్దరూ మొండికేయడంతో వాహనానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు తీసుకురావాలని ఇద్దరికీ సూచించామని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: బైక్పై చలాన్లు చూసి షాకైన పోలీసులు విల్లాలో చోరీ నిజాంపేట్: సోలార్ ఫెన్సింగ్ను తొలగించి ఓ విల్లాలో దొంగతనానికి పాల్పడిన సంఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పోలీసులు తెలిపిన వివరాలు. బాచుపల్లిలోని శ్రీనివాస లేక్వ్యూలోని పసుపులేటి వెంకట శివకుమార్కు చెందిన విల్లాలోకి దొంగలు ప్రవేశించి రెండున్నర తులాల బంగారు హారం, 20 తులాల రెండు వెండి ప్లేట్ల ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
Hyderabad: బైక్పై చలాన్లు చూసి షాకైన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒకటి, రెండు ఫైన్లు ఉంటేనే మనం గాబరపడిపోతుంటాం. ఫైన్ చెల్లించి జాగ్రత్త పడితే మేలని భావిస్తుంటాం. అయితే తాజాగా ఓ వ్యక్తికి వచ్చిన చలాన్లు చూసి ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. 79 చలాన్లు పెండింగ్లో ఉన్న బైక్ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం నేరేడ్మెట్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సందీప్కుమార్కు చెందిన (ఏపీ 10 ఏడబ్లూ 2064) బైక్పై 79 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో బైక్ను సీజ్ చేసినట్లు మల్కాజిగిరి ట్రాఫీక్ సీఐ సుదీర్ కృష్ణ తెలిపారు. చదవండి: ఇతగాడి పెండింగ్ చలానాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. -
దెబ్బకు మత్తు దిగింది.. తిక్క కుదిరింది
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో చిక్కిన చోదకుల్లో 372 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయని ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ తెలిపారు. గత నెల 26 నుంచి 30 వరకు జరిగిన ప్రత్యేక డ్రైవ్ల్లో మొత్తం 621 కేసులు నమోదు చేశారు. వీటి చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో హాజరుపరిచారు. చోదకులు తీసుకున్న మద్యం మోతాదు, నడిపిన వాహనం తదితరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఒక రోజు నుంచి 22 రోజుల వరకు జైలు శిక్షలు విధించాయి. జైలుకు వెళ్లిన 372 మందిలో 186 మందికి ఒక రోజు, 101 మందికి రెండు రోజులు, 40 మందికి మూడు రోజులు, 18 మందికి నాలుగు రోజులు, 11 మందికి ఐదు రోజులు, ఇద్దరికి ఆరు రోజులు, అయిదుగురుకి వారం, నలుగురికి ఎనిమిది రోజులు, 10, 12, 16, 18 రోజుల చొప్పున ఒక్కొక్కరికి, మరో వ్యక్తికి 22 రోజుల జైలు శిక్ష పడింది. వీరికి కోర్టులు రూ.15.26 లక్షలు జరి మానా విధించాయి. వీరి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలంటూ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. -
ఇదేందయ్యో.. బైక్పై ఏకంగా ఐదుగురు, నెంబర్ ప్లేట్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా.. వాహనదారులు పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డుపై వెళ్తూనే ఉంటారు. నింబంధనలు ఉల్లంఘించిన వారిని రోడ్డుపైనే నిలిపి పోలీసులు చలానాలు రాసినా.. ఫోటోలు తీసి ఇంటికి జరిమానాలు పంపినా కూడా కొంత మంది మాత్రం పట్టించుకోకుండా యాథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కకుండా కొంతమంది తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా దాచేస్తారు. తాజాగా ఓ వ్యక్తి ఎన్టీఆర్ గార్డెన్స్ రోడ్డు గుండా వెళ్తూ నిబంధనలు ఉల్లంఘించాడు. బైక్పైన ఏకంగా నలుగురిని ఎక్కించుకుని వెళ్తున్నాడు. సీసీ కెమెరాల్లో చిక్కకుండా నెంబర్ ప్లేట్కు ఓ సంచీని అడ్డుపెట్టి మరో ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఓ నెటిజన్ స్పందించి.. ‘ఐదుగురితో వెళ్లడమే కాకుండా.. నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం మరో ఉల్లంఘన. ఇలా అయితే ఎలా? ’ అని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిబంధనలు ఉల్లంఘించిన బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు రిప్లై ఇచ్చారు. -
ఓ స్క్రూ.. ఇలా కన్ఫ్యూజ్ చేసింది..!
సాక్షి, హైదరాబాద్: ఓ చిన్న ‘స్క్రూ ఓ వాహనం అడ్రస్నే’ మార్చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనంపై కాకుండా మరో వాహనంపై ఈ–చలాన్ జారీ అయ్యేలా చేసింది. దీంతో బాధితుడు సిటీ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. టీఎస్––5570 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన వాహనం నెంబర్ ప్లేట్పై మొదటి అంకె ‘5’ ముగింపులో స్క్రూను బిగించారు. దీంతో దూరం నుంచి చూసే వాళ్లకు ఇది ‘6’గా కనిపిస్తోంది. ఫలితంగా ఆ వాహనం నెంబర్ ‘6570’గా కనిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినపుడు ట్రాఫిక్ పోలీసులు తీసిన స్టిల్ కెమెరాల్లో ఈ నెంబర్ క్యాప్చర్ అయింది. ఆనెంబరు ‘6570’గా భావించి ఈ–చలాన్లు పంపుతూ వచ్చారు. దీంతో ఆ నెంబరుగల వాహన యజమాని.. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన వాహన నెంబర్ వినియోగిస్తున్నారని భావించారు. ఈ విషయాన్ని నగర ట్రాఫిక్ విభాగం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు ఆరా తీయగా ‘5570’ నెంబర్ గల వాహనం ఉల్లంఘనలకు పాల్పడిందని, అయితే నెంబర్ ప్లేట్ బిగించడానికి వాడిన స్క్రూ కారణంగా అది ‘6570’గా మారిందని గుర్తించారు. దీంతో పెండింగ్ చలాన్లను నిజంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనానికి విధించారు. -
Nikhil Siddharth: హీరో కారుకు పోలీసుల చలాన్లు!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కారు నంబరు ప్లేటు నిబంధనల ప్రకారం లేదని రెండు చలాన్లను విధించారు. అయితే నిబంధనల ఉల్లంఘన సమయంలో నిఖిల్ కారులో లేడని పోలీసులు తెలిపారు. కాగా కరోనా కేసులను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ఈ నెల 9 వరకు అమల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే నిఖిల్ ప్రస్తుతం '18 పేజీస్' సినిమా చేస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నాడు. దీనితో పాటు నిఖిల్ 'కార్తికేయ 2' సినిమా చేస్తున్నాడు. ఇది 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్గా రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా లాక్డౌన్ కాలంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిఖిల్.. తన భార్య పల్లవి డాక్టర్ కావడంతో రోగులకు వైద్యపరమైన సలహాలు ఇస్తూ.. ఓ వాలంటీర్గా పనిచేస్తోందంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: 'కార్తికేయ 2' షూటింగ్కు సడన్ బ్రేక్! -
36 కిమీ..28 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సైబరాబాద్ పోలీసుల సహకారంతో మరోసారి ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శంషాబాద్లోని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్ అయిన ఊపిరితిత్తుల్ని తరలిస్తున్న అంబులెన్స్ల కోసం ఈ పని చేశారు. ఫలితంగా ఈ 36.8 కిమీ దూరాన్ని అంబులెన్స్ కేవలం 28 నిమిషాల్లో అధిగమించాయి. ఇతర రాష్ట్రంలోని ఓ డోనర్ ఇచ్చిన ఊపిరితిత్తులతో కూడిన విమానం శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఈ లైవ్ ఆర్గాన్స్ బాక్సుల్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్లు అక్కడకు చేరుకున్నాయి. చదవండి: 11.5 కిమీ.. 9 నిమిషాలు అక్కడ నుంచి ఉదయం 11.11 గంటలకు బయలుదేరాయి. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్లకు ఎస్కార్ట్గా ముందు వెళ్ళింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో నిరాటంకంగా సాగి 11.39 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగర ట్రాఫిక్ పోలీసులు మొత్తం 13 సార్లు లైవ్ ఆర్గాన్స్తో కూడిన అంబులెన్సుల కోసం గ్రీన్ఛానల్ ఇచ్చినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ తెలిపారు. -
హెల్మెట్ లేకుంటే 3 నెలలు లైసెన్స్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో నియంత్రించడంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ద్విచక్ర వాహన చోదకులతో పాటు వెనకాల కూర్చునే వారికి హెల్మెట్ లేకుంటే ఈ–చలాన్లు జారీ చేస్తున్న పోలీసులు.. ఇకపై మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం– 2019 ప్రకారం హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయొచ్చన్న అంశాలు వాహన దారులకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘ఇప్పటివరకు జరుగుతున్న చాలా వరకు రోడ్డు ప్రమాదాల సమయంలో వాహన చోదకులకు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో హెల్మెట్ ధరించని వారికి జరిమానాతో పాటు 3 నెలల డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. ఇదే విషయాన్ని వాహనచోదకులకు అవగాహన కలిగించే దిశగా కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అదేశాను సారం చర్యలు తీసుకుంటాం’అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
11.5 కిమీ.. 9 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ – సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ మధ్య మార్గం.. అనునిత్యం రద్దీగా ఉంటుంది.. ఈ మార్గంలో వాహనాల సరాసరి స్పీడు గంటకు 25 కిలోమీటర్లు మించదు.. పగటి పూట, పీక్ అవర్స్లో ఆ వేగం 20 కిలో మీటర్లకు చేరదు. అయితే ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ మూడు లైవ్ ఆర్గాన్స్ కోసం నగర ట్రాఫిక్ పోలీసులు శనివారం ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. ఫలితంగా ఈ 11.5 కిమీ మార్గాన్ని అంబులెన్స్ కేవలం 9 నిమిషాల్లో అధిగమించింది. దీనికి పైలెట్గా వాహనంలో వెళ్లిన స్థానిక ట్రాఫిక్ పోలీసుల నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైందని నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ తెలిపారు. వీరి కృషిని అభినందిస్తూ నగర కొత్వాల్ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. ఉదయం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలోని పశ్చిమ, ఉత్తర మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ శనివారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ రోగికి కిడ్నీ, లంగ్స్, లివర్ మార్పిడి చేయాల్సి ఉందని, ఆ శస్త్ర చికిత్స ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా.. డోనర్ ఇస్తున్న ఆ అవయవాలు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరనుంది అన్నది వాటిలో వినిపించిన సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఉదయం 8 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలయ్యాయి. టీసీసీసీ నుంచి నిరంతర పర్యవేక్షణ.. డోనర్ ఇచ్చిన అవయవాలతో కూడిన బాక్స్లను తీసుకువెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 11.5 కిలోమీటర్ల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్కు ఎస్కార్ట్గా ముందు వెళ్లేందుకు సిద్ధమైంది. అలా నే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారు లు సంసిద్ధులయ్యారు. బషీర్బాగ్ కమిషనరేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించ డానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద యం 8 గంటల నుంచి వీరంతా తీవ్ర ఉత్కంఠతో గడిపారు. ఇదీ ప్రయాణించిన మార్గం.. శనివారం ఉదయం 9 గంటలకు ‘లైవ్ ఆర్గాన్ బాక్స్’లతో కూడిన అంబులెన్స్ జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి పంజగుట్ట, బేగంపేట రసూల్పురా, ప్రకాష్నగర్ మీదుగా ప్రయాణించి సరిగ్గా 9.09 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి చేరింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో కేవలం 9 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. ఈ కాసేపు అంబులెన్స్ సైరన్కు పోటీగా ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్ సెట్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. విలువైన ప్రా ణం కాపాడేందుకు ట్రాఫిక్ పోలీ సులు చూపిన చొరవను ఆ యా ఆస్పత్రి యాజమాన్యాలు కొనియాడాయి. -
భలే భలే.. నేనూ పోలీసునే..
లక్డీకాపూల్: నేను కూడా పోలీసునే అన్న భావన.. తల్చుకుంటేనే భలేగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్లో వినూత్నంగా ప్రవేశపెట్టిన సోషల్ పోలీసింగ్ చాలా నేర్పింది. పని చేస్తున్న సంస్థల్లో గుర్తింపు పొందడంతో పాటుగా పోలీస్ కమిషనర్కు అనునిత్యం అందుబాటులో ఉండటంతో సమాజంలో తమ బాధ్యతను మరింతగా పెంచుతున్నట్టుగా అనిపిస్తుందంటున్నారు. వాస్తవానికి ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనగానే కంప్యూటర్లకు అంకితమైపోతారు. బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోరనే ప్రచారం లేకపోలేదు. ఈ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగులు సామాజిక కార్యక్రమంలో చురుకైన, నిర్మాణాత్మకమైన పాత్రను పోషించడం గొప్ప విషయమే. ఈ క్రమంలో సోషల్ పోలీసింగ్ డ్యూటీ చేస్తున్న వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు తమ రంగాల్లో ఉద్యోగం చేసుకుంటూనే రోజు ఒక గంట పాటు పోలీసు డ్యూటీ చేస్తున్నారు. ప్రస్తుతం నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కోవిడ్–19 నేపథ్యంలో నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూమ్ను ఈ సోషల్ పోలీసింగ్ కార్యకర్తలే నిర్వహించారు. అదేవిధంగా లాక్డౌన్ బాధితులకు అన్ని విధాలుగా చేయూత అందించడంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రత్యేక తర్ఫీదుతో విధుల్లోకి.. నగరంలోని రోడ్డు ప్రమాదాలు, వైలేషన్స్ను నియంత్రించే క్రమంలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సి) ఏర్పడింది. ఐటీ కారిడార్లోని ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు ఇతర సంస్థలకు చెందిన ఉద్యోగులతో ఎస్ఎస్సీ బలోపేతమైంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్తో భాగస్వామ్య ఒప్పందం మేరకు ట్రాఫిక్ అవేర్నెస్ కల్పిస్తోంది. ఇందుకు సైబరాబాద్ పోలీసులు ఎస్సీఎస్సీలోని దాదాపు 2 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ట్రాఫిక్పై అవగాహన కల్పించే క్రమంలో ట్రాఫిక్ రూల్స్, విధివిధానాలు, వైలెన్స్లో తీసుకునే చర్యలు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన చర్యల్లో తర్ఫీదు ఇచ్చారు. దాంతో పాటు ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో లైంగిక వేధింపులను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా అన్ని అంశాల్లో పోలీసులు తర్ఫీదు ఇచ్చి మరీ ట్రాఫిక్ డ్యూటీ అప్పగిస్తున్నారు. ఈ విధంగా ఐటీ కారిడార్లోని ఎంతో మంది సోషల్ పోలీసులుగా డ్యూటీ చేస్తున్నారు. చేసేది సేవా కార్యక్రమమే అయినా.. దాన్ని ఒక విధిగా చేయడం ఐటీ ఉద్యోగులకే చెల్లింది. అయితే ప్రస్తుతం ఈ ఎస్ఎస్సీ ద్వారా సుమారుగా 250 మంది మాత్రమే సోషల్ పోలీసింగ్ సేవలను అందిస్తున్నారు. ఇందుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పలువురికి ప్రశంస పత్రాలను అందించి పోత్సహించడం విశేషం. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కలిగింది.. ట్రాఫిక్ వలంటీర్గా చేయడం వల్ల రోడ్ సేఫ్టీ పట్ల అవేర్నెస్ పెరుగుతుంది. మన చుట్టు పక్కల వాళ్లకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగించే వీలు కలుగుతుంది. రెండు సంవత్సరాలుగా ట్రాఫిక్ వలంటీర్ సేవలను అందిస్తున్నా. మూడు నెలలకు ఒక సారి సైబరాబాద్ పోలీసు కమిషనర్తో సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో వలంటీర్గా బాగా పనిచేసిన వారికి బెస్ట్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ విధమైన సేవలను అందించడం చాలా తృప్తి ఇస్తోంది.– రాజశేఖర్రెడ్డి కేసారి, టెక్ మహేంద్ర. ట్రాఫిక్ డ్యూటీ చాలా ఇష్టం.. సామాజిక సేవా కార్యక్రమాలన్నా.. పోలీసు డ్యూటీఅన్నా నాకు చెప్పలేనంత ఇష్టం. అందుకే స్వచ్ఛందంగా నగరంలో ట్రాఫిక్ వలంటీర్గా చేస్తున్నారు. అందులోనూ సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ సైడ్ వచ్చి మరీ మూడు గంటల పాటు ట్రాఫిక్ నియంత్రణ విధులను నిర్వహిస్తున్న. మూడు నెలల్లో పది వేల ట్రాఫిక్ వైలేషన్ కేసులను రిపోర్ట్ చేస్తున్న. నగరంలో తొలి మహిళా వలంటీర్గా గుర్తింపు పొందాను. – సుకన్య రాయల్, ఇన్ఫార్ కంపెనీ. రాంగ్రూట్ యాక్సిడెంట్తో పోలీసునయ్యా.. కూకట్పల్లి ఫ్లైఓవర్పై ఓ వ్యక్తి రాంగ్లో వచ్చి యాక్సిడెంట్కు కారణమయ్యాడు. ఈ ఘటనలో రైట్ రూట్లో వెళ్తున్న వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. కానీ రాంగ్ రూట్లో వచ్చిన వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లా. అప్పడు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మీరు కూడా పోలీసు కావచ్చు. సోషల్ పోలీసుగా పనిచేయమని ప్రోత్సహించారు. ఆ విధంగా సంవత్సరన్నర నుంచి నగరంలో ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో సోషల్ పోలీసింగ్ సేవలను అందిస్తున్నాం. – పెన్మెత్స బాలకృష్ణ, సాఫ్ట్వేర్ సంస్థ టీమ్ లీడర్. -
ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కేసులే..
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పెలియన్ రైడర్కు హెల్మెట్ లేకున్నా, వాహనాలకు సైడ్ మిర్రర్లు లేకున్నా ఈ–చలాన్లు జారీ చేస్తున్న వీరు.. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న లెర్నింగ్ లైసెన్స్(ఎల్ఎల్) వ్యక్తులపై దృష్టి సారించారు. ఎల్ఎల్ చేతికి వచ్చిన వెంటనే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ అన్నట్లుగా ఊహించుకుంటూ సరిగా డ్రైవింగ్ రాకుండానే రోడ్లెక్కి ప్రమాదాలకు కారణం అవుతున్నట్లుగా సైబరాబాద్ పోలీసుల అధ్యయనంతో తేలింది. వీరు చాలా వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో మోటారు వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా మూడు రోజులుగా ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం.. ప్రతిరోజూ వీరిపై నిఘా ఉంచి వారి ఎల్ఎల్ తీసుకొని నిబంధన ప్రకారం రద్దు కోసం ఆర్టీఏ అధికారులకు పంపిస్తాం. ‘లెర్నింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడూ అతడితో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వాహనం ముందు, వెనక భాగంలో ఎల్ అనే ప్లేట్ను కూడా పెట్టుకోవడం లేదు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కూడా వాడటం లేదు. నేర్చుకుందామని రోడ్లపైకి వచ్చి నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. ఇలా వివిధ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అందుకే లెర్నింగ్ లైసెన్స్ వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. – విజయ్కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
మూడు కిలోమీటర్లు దాటి వెళ్లిన వాహనాలు సీజ్
-
వైరల్ అవుతున్న ట్రాఫిక్ పోలీసుల వీడియో
సాక్షి, హైదరాబాద్: కరోనాను ఎదుర్కోటానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం కొత్తపేట సర్కిల్లో కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీనికోసం వాహనదారులను రోడ్డుపైనే కొన్ని నిమిషాలపాటు నిలిపివేశారు. అనంతరం ఐదుగురు పోలీసులు వారికెదురుగా నిలబడి కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు అవసరమైన సూచనలిచ్చారు. ఇందుకోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలన్నారు. చేతులను 20 సెకండ్లపాటు కడుక్కోవాలని పేర్కొన్నారు. (బస్సుల్లో హ్యాండ్ శానిటైజర్లు) అంతేకాక చేతులను ఏవిధంగా కడుక్కోవాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. పత్రి వ్యక్తికి ఒక మీటర్ దూరంగా ఉండి మాట్లాడాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరమని నొక్కి చెప్పారు. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, అందరికీ నమస్కారం మాత్రమే పెట్టాలని కోరారు. అనంతరం దీని గురించి పోలీసులు మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ‘భయపడవద్దు.. భద్రత పాటిద్దాం - కలిసికట్టుగా కరోనా అరికడుదాం’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (పదో తరగతి విద్యార్థులకు మాస్కులు) చదవండి: కానిస్టేబుల్ ర్యాప్ సాంగ్.. నెటిజన్లు ఫిదా -
ఉల్లంఘనలకు కేరాఫ్గా ‘రెంటల్’ బైక్స్
నగరంలో ‘రెంటల్ బైక్స్’ వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ వాహనాలపై షికార్లు కొడుతున్నారు. భారీగా ఉల్లంఘనలకూ పాల్పడుతున్నారు. యాప్ల ద్వారా బుకింగ్ చేయడం...బైకు వారి సొంతం కాకపోవడం...పోలీసుల భయం లేకపోవడం..జరిమానా కట్టే బాధ ఉండకపోవడంతో అద్దె బైకులపై మైనర్లూ హల్చల్ చేస్తున్నారు. ఇష్టంవచ్చినట్లు డ్రైవ్ చేస్తూ..దూసుకుపోతూ ఇతర వాహనచోదకులకు నరకం చూపిస్తున్నారు. మరోవైపు హల్చల్ రైడర్ల కారణంగా ఆయా రెంటల్ సంస్థలు నెలకు రూ.లక్షల్లో జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఇక ఈ వాహనాలు భద్రతా పరంగానూ సంక్షిష్టతను సృష్టించేఅవకాశం ఉందని నిపుణులువ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఒకచోట నుంచి మరోచోటుకు ప్రయాణించడానికి ఆటో, బస్సు, ట్యాక్సీ, ఎంఎంటీఎస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో వీటికి తోడు రెంటల్ బైక్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఎంత ఉపయోగం ఉంటోందో.. దానికి రెట్టింపు స్థాయిలో ఇబ్బందులు ఉంటున్నాయని ట్రాఫిక్ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కోకొల్లలుగా ఉల్లంఘనలకు పాల్పడటం ఒక ఎత్తయితే.. భద్రత పరంగానూ ఎన్నో సవాళ్ళు సృష్టించే ఆస్కారం ఉండటం మరో ఎత్తని వ్యాఖ్యానిస్తున్నారు. అంతా యాప్ ఆధారంగానే... సిటీలో కొన్ని సంస్థలకు చెందిన రెంటల్ బైక్స్ వేల సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటిని బుక్ చేసుకోవడం, వినియోగించడం అంతా స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే వాటి యాప్స్, బ్లూటూత్ పరిజ్ఞానం ఆధారంగా జరుగుతోంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రాథమికంగా డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు, దాని ఫొటోతో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన సెల్ఫీనీ యాప్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు సరి చూసిన తర్వాతే ఆ యాప్ నిర్వాహకులు వాహనం బుక్ చేసుకోవడానికి, వినియోగించడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ వాహనాలను వినియోగించే వాహనచోదకుల సౌకర్యార్థం వాటి సీటు కింద డిక్కీల్లో హెల్మెట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. బుకింగ్ను అంగీకరించే ముందే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ వాడాలని, అధికారిక పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాన్ని పార్క్ చేయాలని సూచిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాక్టికల్గానే ఇబ్బందులు వస్తున్నాయి. ఆ మొబైల్ చేతిలో ఉండే చాలు... మోటారు వాహన చట్టం ప్రకారం మైనర్లకు వాహనం ఇవ్వడం, వాళ్ళు దాన్ని నడపటం నేరం. ఇలా చేస్తూ ఎవరైనా చిక్కితే ఆ మైనర్తో పాటు వాహన యజమానీ బాధ్యుడవుతాడు. ఇతడిని జువైనల్హోమ్కు అతడికి జైలుకు తరలించేందుకు ఆస్కారం ఉంది. గతంలో ఇలాంటి కేసులు నగరంలో వెలుగు చూశాయి. అయితే రెంటల్ బైక్స్ విషయానికి వచ్చేసరికి మైనర్లు వీటిని వాడకుండా కట్టడి చేయడానికి ఆస్కారం ఉండట్లేదు. అప్పటికే ఆయా యాప్స్ను డౌన్లోడ్ చేసుకుని, రెంటల్ బైక్స్ వినియోగిస్తూ వారి మొబైల్ చేతిలో ఉండే చాలు... మైనర్లు సైతం ఈ బైక్స్ బుక్ చేసుకుని చక్కర్లు కొట్టేయచ్చు. ఓ వాహనాన్ని బుక్ చేసుకుంటున్న సమయంలో సదరు వినియోగదారులు యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్ యజమానేనా? వేరే వ్యక్తా? మైనరా? అనేది తెలుసుకునే పరిజ్ఞానం ఆయా సంస్థల వద్ద ఉండట్లేదు. ఈ విషయంలో మైనర్కు వాహనం ఇచ్చిన సంస్థది తప్పవుతుందా? లేక సదరు మైనర్ యాత్తో కూడిన మొబైల్ ఇచ్చిన వ్యక్తిది తప్పవుతుందా? అనేది పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎడాపెడా దూసుకుపోతూ ఫీట్లు... ఈ కారణంగానే అనేక మంది మైనర్లు సైతం ఈ రెంటల్ బైక్స్పై ఎడాపెడా దూసుకుపోతున్నారు. వీటిని వినియోగిస్తున్న మేజర్లు సైతం చేస్తున్న ఫీట్లు అన్నీఇన్నీ కావు. నెక్లెస్రోడ్, కేబీఆర్ పార్క్ తదితర మార్గాల్లో ఈ రెంటల్ బైక్స్ రైడర్లు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ రెంటల్ బైక్ డిక్కీలో హెల్మెట్ ఉండాల్సి ఉన్నా.. అనేక వాటిలో మాయమయ్యాయి. దీంతో వీటిని బుక్ చేసుకున్న వినియోగదారులు హెల్మెట్లు లేకుండానే దూసుకుపోతున్నారు. దీనికి తోడు సొంత వాహనం కాకపోవడంతో అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, త్రిబుల్ రైడింగ్, అక్రమ పార్కింగ్, రద్దీ రోడ్లలోనూ వీటిని వదిలేయడం తదితర ఉల్లంఘ«నలకు ఈ వాహనాలు కేరాఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. రహదారుల్లో వీరు చేస్తున్న విన్యాసాల కారణంగా తమ పనులపై వెళ్ళే సాధారణ వాహనచోదకులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. వీరి వ్యవహారంపై ఫిర్యాదు చేయాలన్నా ఎవరి చెప్పాలో అర్థం కాక మిన్నకుండిపోతున్నారు. నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కావడంతో... ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పోలీసులు నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలు చేస్తున్నారు. వీటి ప్రకారం సాధారణంగా రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్లు వాహనచోదకుల్ని ఆపి చలాన్లు విధించరు. కేవలం పెండింగ్ చలాన్లు ఉన్న వాహనచోదకుల్ని గుర్తించడానికి, డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలకు మాత్రమే వాహనాలను ఆపుతున్నారు. మిగిలిన సందర్భాల్లో కేవలం ఉల్లంఘనుల ఫొటో తీసి ఈ–చలాన్ మాత్రమే పంపిస్తున్నారు. ఈ కారణంగానే రెంటల్ బైక్స్పై ఫీట్లు చేస్తున్న, ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు ఆపట్లేదు. కేవలం ఆయా ఉల్లంఘనల్ని ఫొటోలు తీసి ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామా ఆధారంగా సదరు బైక్స్ను నిర్వహిస్తున్న సంస్థలకు పంపిస్తున్నారు. ఆ నిర్వాహకులు జరిమానాలు రూ.లక్షల్లో చెల్లిస్తున్నా బైక్స్ వినియోగిస్తున్న ఉల్లంఘనులకు మాత్రం చెక్ పడట్లేదు. ఈ బైక్ యాప్స్తో కూడిన ఫోన్లు అసాంఘిక శక్తుల చేతిలో పడి, వాళ్ళు ఆ వాహనాలు బుక్ చేసుకుని వినియోగించగలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం ‘విధిస్తున్నాం’ ఇటీవల కాలంలో నగరంలో పెరిగిపోయిన రెంటల్ బైక్స్ కారణంగా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వీటిని వినియోగిస్తున్న యువకులు, మైనర్లు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాల్లో అనునిత్యం ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికి నిబంధనల ప్రకారం ఈ–చలాన్లు విధిస్తున్నాం. ఇటీవలే ఓ సంస్థకు చెందిన ప్రతినిధులు నేరుగా వచ్చి రూ.3 లక్షల జరిమానాలు క్లియర్ చేసి వెళ్ళారు. క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల దృష్టికి తీవ్రమైన ఉల్లంఘనలు వస్తే వెంటనేవాహనాన్ని స్వాధీనం చేసుకుని ఆయా సంస్థలకుసమాచారం ఇచ్చి అప్పగిస్తున్నారు. ఈ కేసుల్లోనూ జరిమానా విధిస్తున్నారు. ఈ రెంటల్ బైక్స్వినియోగిస్తున్న ఆయతాయిల కారణంగాసాధారణ వాహనచోదకులు ఇబ్బందులుఎదుర్కొవాల్సి వస్తోంది. – సిటీ ట్రాఫిక్ పోలీసులు -
మానవత్వం.. మాతృత్వం
అసెంబ్లీ ఎదురుగా ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద ట్రాఫిక్ క్రేన్ వర్కర్ను ఓ ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడటంతో స్థానిక పోలీసులు అతనికి సపర్యలు చేసి 108కు ఫోన్ చేశారు. ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో అదే క్రేన్లోనే ఇలా బల్లపై ఉంచి ఆస్పత్రికి తరలించారు. మాతృత్వం ఉపాధ్యాయుల చలో అసెంబ్లీ కార్యక్రమం ఉండటంతో శుక్రవారం ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విధి నిర్వహణలో భాగంగా ఓ కానిస్టేబుల్ తన కూతురిని తీసుకొని విధుల్లో పాల్గొంది. -
బాతాఖానీ.. ఇదేం పని!
కుత్బుల్లాపూర్: బహదూర్పల్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ లారీని ఆపినా ఆగలేదంటూ నడి రోడ్డులో నిలిపివేసి తమాషా చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఒక వైపు ట్రాఫిక్ రద్దీ ఏర్పడినప్పటికీ సదరు కానిస్టేబుళ్లు లారీని కదలనీయకుండా రోడ్డు మధ్యలో నిలిపి ట్రాఫిక్ను లారీ చుట్టూ తిప్పి పంపించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇలా పది నిముషాల పాటు హల్చల్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు మీదనే బాతాఖానీ కొడుతూ లారీని మధ్యలో ఆపడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీని పక్కన ఆపి ఫైన్ వేయాల్సిందిపోయి ఇలా ఇతరులకు ఇబ్బంది కలిగించారని పలువురు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు మధ్యలో లారీ ఆపుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. సర్కిల్లో.. -
ఒక యాక్టివా.. 72 చలానాలు
నల్లకుంట: సుమారు 72 పెండింగ్ చలానాలు ఉన్న ఓ యాక్టివా ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సిగ్నల్స్ వద్ద నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ చేట్టారు. అదే సమయంలో అంబర్పేటకు చెందిన సురేశ్ అనే వ్యక్తి యాక్టివా (టీఎస్11 ఈజే 7202) ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. అనుమానంతో ఆ వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా 72 పెండింగ్ చలానాలు (రూ. 9,750) ఉన్నాయి. దీంతో వాహనాన్ని సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు స్టేషన్కు తరలించారు. -
బైక్పై రూ.20 వేలకు పైగా పెండింగ్ చలాన్లు
బహదూర్పురా: బహదూర్పురా చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో బైక్లు నడుపుతున్న మైనర్లను పట్టుకున్నారు. బహదూర్పురా ట్రాఫిక్ ఎస్సైలు సత్యనారాయణ, జి.కరుణాకర్ రెడ్డి ఆదివారం బహదూర్పురా చౌరస్తాలో ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారు. డ్రైవింగ్లో పట్టుబడిన ఓ మైనర్ ద్విచక్ర వాహనంపై రూ.20 వేల పైచిలుకు చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -
గూగుల్ ట్రాన్స్ లేటర్తో మిస్సింగ్ కేసు ఛేదన
రాజేంద్రనగర్: తప్పిపోయి తిరుగుతున్న వృద్ధుడిని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గూగుల్ ట్రాన్స్ లేటర్ సాయంతో పట్టుకొని కుటుంబీకులకు అప్పగించారు. వివరాలు.. శంషాబాద్ నర్కూడ ప్రాంతానికి చెందిన విజయ్నాయక్ రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. రెండు వారాల క్రితం ఠాణా పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఓ వృద్ధుడు రోడ్డుపై అటూఇటూ తిరుగుతూ కనిపించాడు. దీంతో అతడిని దగ్గరకు పిలిచి రోడ్డుపై తిరిగితే ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. అతడికి తెలుగు అర్థంకాకపోవడంతో నవ్వుతూ అలాగే రోడ్డుపై తచ్చాడసాగాడు. దీంతో విజయ్నాయక్ అతడిని కూర్చోబెట్టి టీ, బిస్కెట్ ఇచ్చారు. వివరాలు అడిగానా వృద్ధుడి నుంచి సమాధానం రాలేదు. అనంతరం కానిస్టేబుల్ తన విధులు ముగియడంతో వెళ్లిపోయారు. మరుసటి రోజు కూడా విజయ్నాయక్ అక్కడ విధులు నిర్వహిస్తుండగా వృద్ధుడు అతడి వద్దకు వచ్చాడు. టీ, బిస్కెట్ ఇవ్వాలని సైగలద్వారా చెప్పడంతో ఇచ్చారు. ఇలా వారంరోజుల పాటు ఇలా జరిగింది. వృద్ధుడి నుంచి వివరాలు రాబట్టే యత్నం చేసినా ఫలితం లేదు. ఈనెల 12న తిరిగి వృద్ధుడు ఆరాంఘర్ చౌరస్తాకు రావడంతో విజయ్నాయక్ దగ్గరికి పిలిచాడు. తన సెల్ఫోన్ లోని గూగుల్ ట్రాన్స్ లేటర్ తో వృద్ధుడి మాటలను తెలుగులో అనువధించారు. వృద్ధుడు తాను తప్పిపోయానని.. ఇంటికి పంపించమని ?ప్రాధేయపడ్డాడు. అతడి నుంచి వివరాలు రాబట్టగా.. తన పేరు మధన్ మాలిక్ అని, వెస్ట్బెంగాల్ హౌరా రూరల్ జిల్లా రోజా గ్రామమని తెలిపాడు. నాలుగు నెలల క్రితం మరో ఆరుమందితో కలిసి వడ్రంగి పని చేసేందుకు వచ్చానని తెలిపాడు. తనను ఎలాగైనా ఇంటికి పంపించాలని వేడుకున్నాడు. వెంటనే కానిస్టేబుల్ సంబంధిత వివరాలను గూగుల్లో సెర్చ్ చేయగా వృద్ధుడి గ్రామం ఉదయ్నారాయణపూర్ ఠాణా పరిధిలో ఉందని గుర్తించారు. సదరు ఠాణా నంబర్ను సేకరించి అదేరోజు అక్కడి పోలీసులతో మాట్లాడి విషయాన్ని వివరించారు. వృద్ధుడితో పోలీసులు మాట్లాడి వివరాలు తీసుకొని కుటుంబీకులకు తెలిపారు. వృద్ధుడి కుటుంబీకులు అదే పోలీస్స్టేషన్ లో 2019 జూన్ 19న మిస్సింగ్ కేసు పెట్టారు. 13నవారు ఉదయ్నారాయణ్పూర్ ఠాణాకు చేరుకున్నారు. వీడియో కాల్ చేయడంతో వృద్ధుడు తన కుటుంబీకులను గుర్తించాడు. తాము రాజేంద్రనగర్ వస్తున్నామని, అప్పటి వరకు వృద్ధుడిని సంరక్షణ చూసుకోవాలని వారు కానిస్టేబుల్ను కోరడంతో ఆయన విషయాన్ని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ ప్రసాద్తో పాటు లా ఆండ్ ఆర్డర్ ఇన్ స్పెక్టర్ సురేష్కు వివరించారు. బుధవారం రాత్రి అక్కడి పోలీసులు, మధన్ మాలిక్ కుమారుడు రాజేంద్రనగర్ ఠాణాకు చేరుకున్నారు. వృద్ధుడికి సంబంధించిన పత్రలు చూపించడంతో వారికి అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ విజయ్నాయక్ను ఉన్నతాధికారులు అభినందించారు. -
‘ఆటో’ మెటిక్గా లైన్లోకి వచ్చేస్తాడు..
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ చెక్పోస్టులో ఏ ఆటోవాలాను ఆయన గురించి ప్రశ్నించినా వామ్మో ఆయన మామూలు పోలీసు కాదు.. మామూళ్ల పోలీసంటూ టక్కున చెప్పేస్తారు. ఎస్ఆర్నగర్, మైత్రివనం నుంచి బయల్దేరిన ఆటోలు గమ్యం చేరే వరకు ఎవరూ పట్టుకోకూడదు. పొరపాటున ఏ ఆటోనైనా జూబ్లీహిల్స్ చెక్పోస్టులోగానీ, ముందున్న తనిఖీల వద్దగానీ ఎవరైనా పట్టుకుంటే క్షణాల్లోనే సదరు పోలీసాఫీసరు లైన్లోకి వచ్చేస్తాడు... ‘వదిలెయ్ భయ్..మనోడే’ అంటూ మెల్లగా చెప్తాడు... విశేషమేంటంటే పోలీస్ స్టేషన్ పరిధులకు అతీతంగా ఆయన రెఫెన్సులుంటాయి.. చేసే పనికి తగ్గట్లు టారిఫ్లు కూడా ఉంటాయి. ఇంతిస్తే.. అరే ఇంతే ఇస్తవా భయ్... నీకు చేసిన పనేంది... నువ్వు ఇచ్చేది ఏంది అంటూ పైగా దబాయింపులు... ఆయన ఇంటి దగ్గర ఏదైనా పని పడిందంటే ఏదో ఒక ఆటోవాలాకు మూడినట్లే... క్షణాల్లో ఆటోవాలాలు ఆయన ఇంటి ముందు వాలిపోయి ఆదేశించిన పనిని చక్కబెట్టాల్సిందే... లేదంటే ‘టోల్’ తీస్తాడు. ఓ ఘటనలో ఈ ట్రాఫిక్ ఎస్ఐ ప్రవర్తించిన తీరు మరీ విచిత్రంగా ఉంది. కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్పోస్టులో కొందరు సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్ సరిగ్గా లేని ఆటో వాలాలను ఆపిన కానిస్టేబుల్కు ఆయన ఫోన్ చేసి వదిలెయ్యమని చెప్పాడు. దీంతో సదరు కానిస్టేబుల్ మీరు చెప్తే వదలడం కుదరదని, తమ పరిధిలోని సెక్టార్ ఎస్ఐగానీ, జూబ్లీహిల్స్ సీఐగాని చెబితే వదిలేస్తాం కానీ మీకేం సంబంధం అన్నాడు. దీంతో డ్యూటీలోనే ఉన్న సదరు ఎస్ఐ సార్. రయ్..మంటూ యూనిఫాంలో బైక్ వేసుకొని జూబ్లీహిల్స్ పోస్టులో పని చేస్తున్న కానిస్టేబుల్పై రంకెలేశాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయినా తీరు మారని ఎస్ఐ తన దందా కొనసాగిస్తూనే ఉన్నాడు. రెక్కాడితే డొక్కాడని ఆటోవాలాలను బ్లాక్మెయిల్చేస్తూ నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని ఎవరైనా పోలీసులు పట్టుకున్న ప్రతిసారీ విడిపిస్తూ డబ్బులు దండుకుంటున్నాడని ఆటోవాలాలు వాపోతున్నారు. దీనికి తోడు ఆయన పని చేస్తున్న పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు పని చేస్తున్న మరో అధికారి పదోన్నతి మీద వెళ్ళిపోవడంతో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రైవేట్ ట్రావెల్స్ మొదలుకొని ఆయన సెక్టార్లోని చిరు వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులు ఎవ్వరినీ వదలకుండా దందాకు దిగుతున్నాడు. మూడేళ్లు గడుస్తున్నా ఆయన పని చేస్తున్న పోలీస్ స్టేషన్ను విడవకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా మామూళ్ల వసూళ్లలో బిజీగా ఉన్నాడు. నన్నెవరూ ఏం చేయలేరంటూ... సదరు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో సీఐకి డీఎస్పీగా పదోన్నతి వచ్చింది. ఓ ఎస్ఐ ఇటీవలే బదిలీ కావడంతో ఈ వసూల్ రాజా ఒక్కడే మిగిలారు.. దీంతో తననెవరూ ఏమీ చేయలేరని దర్జాగా అన్ని పోలీస్ స్టేషన్లూ చుట్తేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం. -
రియల్ రైడ్ చేయండి..
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల భాగ్యనగరంలో గణేశుడి శోభాయాత్ర జరిగింది. అప్పుడు ట్రాఫిక్ అధికారులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏయే మార్గాల్లో శోభాయాత్ర జరుగుతోంది.. ఎటువైపు రోడ్లు మూసేశారు.. ఇలా అన్ని వివరాలను గూగుల్ మ్యాప్లో పొందుపరిచారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. దీన్నే రియల్ టైమ్ సమాచారం అందించడం అంటారు. అయితే ఇలా సాధారణ రోజుల్లో కూడా వాహనదారులకు అందించాలని ట్రాఫిక్ విభాగం యోచిస్తోంది. ఇందుకు గురువారం హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ గూగుల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు అందించే సమాచారం ఆధారంగా ప్రత్యేక మార్కింగ్స్తో వివరాలను మ్యాప్స్లో పొందుపరిచేందుకు గూగుల్ అంగీకరించింది. ట్రయల్ రన్ నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దాదాపు ప్రతి వాహనదారుడు గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకుంటున్నాడు. అందులో సూచించిన ప్రకారం ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందో తెలుసుకుని ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నాడు. దీంతో వాహనదారులకు మరింత మెరుగైన సమాచారం అందించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చే విధానంతో ఏయే రోడ్లు మూసేశారు.. అందుకు కారణాలు.. ఎన్ని రోజుల పాటు అలా ఉంటుంది.. తదితర అంశాలు గూగుల్ మ్యాప్స్లో ప్రత్యక్షం కానున్నాయి. రహదారుల మూసివేత మాత్రమే కాకుండా కీలక సమయాల్లో విధించే ట్రాఫిక్ ఆంక్షలు/మళ్లింపులు, ధర్నాలు/ నిరసనలు, సభలు/ సమావేశాలు, ప్రమాదాలతో పాటు రోడ్డు మరమ్మతులు.. ఇలా ఏ విషయమైనా ప్రత్యేక గుర్తులతో గూగుల్ మ్యాప్స్లో పొందుపరచనున్నారు. వర్షం పడినా చెప్పేస్తుంది.. రోడ్ల మరమ్మతులతో వివిధ అభివృద్ధి పనులు చేసేందుకు ఆయా విభాగాలకు ట్రాఫిక్ అధికారులు నిర్ణీత సమయం ముందు లిఖిత పూర్వకంగా అనుమతి ఇస్తారు. అలా చేసిన వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్కు అందజేస్తారు. ఆయా మార్గాల్లో మళ్లింపులు/ఆంక్షలు మొదలైన నాటి నుంచి పూర్తయ్యే వరకు ఆ సమయాన్ని సూచిస్తూ గూగుల్ మ్యాప్స్లో పొందుపరుస్తారు. వర్షం నీరు నిలవడం, ప్రమాదాలు జరగడంతో ఏర్పడే ట్రాఫిక్ జామ్ వివరాలను బషీర్బాగ్లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్, కంట్రోల్ సెంటర్కు చెందిన అధికారులు గూగుల్కు అందిస్తారు. ఇందుకు పలు ప్రాంతాలో అమర్చిన సీసీ కెమెరాలను వినియోగిస్తారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సిబ్బంది నుంచి సమాచారం తీసుకుంటూ గూగుల్కు అందిస్తూ మ్యాప్లో అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. -
కింగ్..ట్రాఫిక్ వింగ్
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ విభాగంలో పోస్టింగ్ అంటే ఒకప్పుడు పనిష్మెంట్గా భావించేవాళ్లు. ఉన్నతాధికారులు సైతం ఆరోపణలు వచ్చిన, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులను ఈ వింగ్కే పంపేవాళ్లు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సిటీ ట్రాఫిక్ విభాగంలో పోస్టింగ్స్ కోసం దరఖాస్తులు పెట్టుకునే, పైరవీలు చేయించుకునే పరిస్థితి వచ్చింది. ఈ మార్పునకు కారణం ఏమిటన్నది? ఉన్నతాధికారులకు అంతు చిక్కలేదు. పైకి కనిపించని ‘మర్మం’ ఏదైనా ఉందా? అని అనుమానించారు. దీంతో ఏకంగా ఈ వ్యవహారాన్ని నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్కు అప్పగించారు. లోతుగా విచారణ చేపట్టిన స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్లో పని ఒత్తిడి ఉండడం, ట్రాఫిక్ విభాగంలో ప్రోత్సాహకాలు ఇస్తుండడంతోనే సిబ్బంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారని తేల్చింది. అప్పుడలా... హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల విభాగం పోలీస్స్టేషన్లు 60 ఉండగా, ట్రాఫిక్ ఠాణాలు 25 ఉన్నాయి. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ పీఎస్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా (ఎస్హెచ్ఓ) పని చేయడానికి భారీ డిమాండ్ ఉండేది. ఎ–గ్రేడ్ ఠాణాల్లో పోస్టింగ్స్ కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచే పైరవీలు నడుస్తుండేవి. ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో పోస్టింగ్స్ అంశం దీనికి విరుద్ధంగా ఉండేది. అత్యంత అరుదైన సందర్భాల్లో మినహా ట్రాఫిక్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా వెళ్లడానికి ఎవరూ సుముఖత చూపేవారు కాదు. ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మార్చాలంటూ అధికారుల చుట్టూ తిరిగేవారు. దీంతో ప్రతిసారి బదిలీల సందర్భంలో ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చేది. కొన్నాళ్లు ట్రాఫిక్లో పని చేయాలని, ఆపై మంచి పోస్టింగ్ ఇస్తామని చెప్పి బాధ్యతలు చేపట్టేలా చేసేవారు. ఇప్పుడిలా... గడిచిన కొన్నాళ్లుగా ట్రాఫిక్ విభాగానికీ కొద్దికొద్దిగా ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. కౌంటర్ ఇంటెలిజెన్స్(సీఐ) సెల్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) తదితర విభాగాల్లో ఇస్తున్నట్లు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభమైంది. రాష్ట్ర నేర పరిశోధన విభాగంతో (సీఐడీ) పాటు ట్రాఫిక్ వింగ్కు ప్రోత్సాహకంగా జీతానికి 30శాతం అదనం ప్రకటించారు. దీంతో ఈ విభాగంలోకి వెళ్లడానికి అధికారులు ఉత్సాహం చూపారు. అయితే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ విభాగానికి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందినవారు, ఇతర విభాగాలు/యూనిట్స్ నుంచి వచ్చి రిపోర్ట్ చేసిన ఇన్స్పెక్టర్లు తమకు ట్రాఫిక్ వింగ్లోనే పోస్టింగ్ కావాలని కోరుతున్నారు. ఈ రకంగా ఉన్నతాధికారులకు ఒకేసారి 25 దరఖాస్తులు వచ్చాయి. దీంతో అసలు ట్రాఫిక్ విభాగం మీద ఇంత ‘ప్రేమ’ ఎందుకు పుట్టుకొచ్చింది? పైకి కనిపించని ‘ప్రత్యేక కారణాలు’ ఏమైనా ఉన్నాయా? అనేది తేల్చాల్సిందిగా ఉన్నతాధికారులు ఎస్బీని రంగంలోకి దింపారు. డిమాండే కానీ... అనూహ్యంగా వచ్చిన డిమాండ్కు కారణాలు గుర్తించడానికి ఎస్బీ సిబ్బంది విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో నిశితంగా పరిశీలించిన నేపథ్యంలో ‘ప్రత్యేక కారణాలు’ లేవని తేల్చారు. కేవలం లా అండ్ ఆర్డర్ వింగ్లో పని ఒత్తిడి, ఇతర అంశాలను అధికారులు తట్టుకోలేకపోతున్నారని.. దీనికి తోడు ట్రాఫిక్ వింగ్లో 30 శాతం అదనంగా రావడం వీరిని ఆకర్షిస్తోందంటూ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ అదనపు ప్రోత్సాహకం కేవలం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకే వర్తిస్తోంది. దీంతో ఆ కేడర్ వరకే డిమాండ్ ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారులు ఈ ప్రోత్సాహకం పరిధిలోకి రాకపోవడంతో అక్కడ కథ షరామామూలే అని తెలిపారు. కేవలం హైదరాబాద్లోనే పోస్టింగ్ కావాలనుకున్నోళ్లు, తాత్కాలిక ప్రాతిపదికనో మాత్రమే ఈ స్థాయిల్లో ట్రాఫిక్ వింగ్పై ఆసక్తి చూపుతున్నారని తేలింది. -
మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజాయతీ
సాక్షి,సిటీబ్యూరో: విధినిర్వహణలో ఉన్న సమయంలో తనకు దొరికిన పర్సును బాధితురాలికి అందజేసి ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజాయతీ చాటుకుంది. బుధవారం ఉదయం కూకట్పల్లి జేఎన్టీయూ జంక్షన్ వద్ద డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లీశ్వరికి ఓ పర్సు కనిపించింది. అందులో రూ.5950 నగదు, రెండు ఏటీఎం కార్డులు ఉన్నట్లు గుర్తించింది. పర్సులో ఉన్న ఒక స్లిప్పులో ఎస్బీఐ అకౌంట్ నెంబరు ఉండటంతో నంబర్ ఆధారంగా బ్యాంకుకు వెళ్లి విచారించగా ఖాతాదారు ఎన్. కవితగా గుర్తించిన ఆమె బ్యాంకు అధికారుల నుంచి నెంబరు తీసుకొని ఫోన్చేసింది. మంజీరా మాల్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న కవిత తన నెలజీతాన్ని పర్సులో దాచుకుంది. పర్సు పోగొట్టుకొని ఆందోళనలో ఉన్న కవితకు పర్సును అందజేసి మల్లీశ్వరి నిజాయితీని చాటుకోవడంతో ఆమెను అభినందించారు. -
రెండు రోజులు.. 237 డ్రంకన్ డ్రైవ్ కేసులు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ప్రత్యేక డ్రంకన్డ్రైవ్ తనిఖీల్లో 237 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదుచేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. వీరిలో 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు 106 మంది, 31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారు 83 మంది, 41 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు 29 మంది, 51 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు 12 మంది, 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్నవారు నలుగురు, 61 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారు ముగ్గురు ఉన్నారు. వాహనాల వారీగా కేసులను పరిశీలిస్తే అత్యధికంగా 157 బైక్లు, 62 ఫోర్వీలర్స్, 16 త్రీవీలర్స్, రెండు లారీలు.. మొత్తం 257 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్.విజయ్కుమార్ తెలిపారు. -
ఉల్లంఘిస్తే ‘రెట్టింపు’
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ప్రజలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా పడుతుంది. ఇదే పని పోలీసులు చేస్తే ఇప్పటి వరకు వారికి ఫైన్తో పాటు తాఖీదులు, తీవ్రమైన వాటికి పాల్పడితే బదిలీ అనివార్యం అవుతోంది. త్వరలో అమలులోకి రానున్న సవరణలతో కూడిన మోటారు వాహనాల చట్టం ఫలితంగా పోలీసులపై ఈ భారం మరింత పెరగనుంది. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే... కొత్త చట్టంలో చేర్చిన సెక్షన్ 210–బీ ప్రకారం వారికి రెట్టింపు వడ్డన ఉంటుంది. అంటే సాధారణ ప్రజలకు ఆ ఉల్లంఘనలకు ఎంత జరిమానా విధిస్తారో... వీరికి ఆ మొత్తానికి రెట్టింపు వేస్తారు. దీనిపై నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ లేఖ రాశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 371 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్మెమోలు జారీ చేశారు. వీరిలో 30 మందిని హెడ్–క్వార్టర్స్ సహా వివిధ విభాగాలకు ఎటాచ్ చేస్తూ వేటు వేశారు. మరోపక్క పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనల్ని క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలు ఉన్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) వద్దకు ద్విచక్ర వాహనాలపై వచ్చే ప్రతి అధికారి/సిబ్బంది కచ్చితంగా దీనిని ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయా వాహనాలను లోపలకు అనుమతించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీ యాక్ట్లోకి కొత్తగా వచ్చిన 210–బీను అనుసరిస్తూ ఈ విధానాలను మరింత విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/ కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. ఈ సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడితే తేలిగ్గా గుర్తించి వారికి రెట్టింపు జరిమానా విధించవచ్చు. అదే ఓ అధికారి మఫ్టీలో తన ప్రైవేట్ వాహనం వినియోగించి ఉల్లంఘనలకు పాల్పడితే వారిని ఎలా గుర్తిస్తారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చేస్తున్న ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం నాలుగు రకాల సాధనాల ద్వారా ఇవి పోలీసులకు చేరుతున్నాయి. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు బషీర్బాగ్లోని కమిషనరేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వాటిని, పత్రికల్లో ప్రచురితం/ప్రసారం అయిన ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్థారించిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసులను నుంచి జరిమానా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ప్రతి హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా వ్యవహరించాలని అనిల్కుమార్ కోరారు. -
ఒక బైక్.. 31 చలానాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఫేజ్ 03లో నివసించే పోలిరెడ్డి ప్రతాప్ టీఎస్ 09 ఈఎక్స్ 6724 హోండా యాక్టీవా బైక్కు 31 చలానాలు పెండింగ్లో ఉన్నాయి. ఆయన రూ. 5,385 జరిమానా చెల్లించాల్సి ఉంది. అయితే పెండింగ్ చలానాలు కట్టకుండా తిరుగుతున్న ఈ వాహనాన్ని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్ చెక్పోస్టులో పట్టుకున్నారు. 31 చలానాలు పెండింగ్లో పెట్టుకొని తిరుగుతుండగా పట్టుకున్న పోలీసులు వాటిని తిరిగి చెల్లించిన తర్వాతనే వదిలిపెట్టారు. నంబర్ ప్లేట్ను మలిచి తిరుగుతున్న వ్యక్తికి జరిమానా బంజారాహిల్స్: నంబర్ ప్లేట్ను మలిచి ట్రాఫిక్ పోలీసులకు, సీసీ కెమెరాలకు, పోలీసు కెమెరాలకు చిక్కకుండా అడ్డదారుల్లో వాహన నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న ఓ పూజారిని జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకొని చలానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని నూర్నగర్కు చెందిన యశ్వంత్శర్మ(19) గత కొంత కాలంగా హోండా యాక్టీవా బైక్ నంబర్ ప్లేట్ను సంఖ్య కనిపించకుండా ఒక మూలలో మలిచారు. అయితే వాహన తనిఖీల్లో భాగంగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.ముత్తు ఈ వాహనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాధితుడికి జరిమానా విధించారు. -
డ్రంక్ ఆండ్ డ్రైవ్లో పట్టుకున్నారని..
లంగర్హౌస్: చదువుతోంది డిగ్రీ...డ్రంక్ ఆండ్ డ్రైవ్లో పట్టుబడితే తన వాహనాన్ని సీజ్ చేశారని ట్రాఫిక్ పోలీసులపై కక్ష పెంచుకున్నారు. కక్ష సాధింపు చర్యగా ఏకంగా ట్రాఫిక్ పోలీసుల నుంచే మూడు ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. చివరకు సిగ్నల్ జంప్ ఈ–చలాన్ నేరస్తులను పట్టించి కటకటాలపాటు చేసింది. లంగర్హౌస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీఐ యాదయ్య గౌడ్, డీఎస్సై నరేందర్ వివరాలు వెల్లడించారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన మేరకు.. లంగర్హౌస్ సర్దార్బాగ్లో నివాసముండే మొహమ్మద్ జహంగీర్(20) కారు మెకానిక్గా పనిచేస్తు చదువుకుంటున్నాడు. మారుతీనగర్లో నివాసముండే ధనరాం భాస్కర్(19) సనత్నగర్లోని శ్లోకం కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గత ఫిబ్రవరి నెలలో మద్యంతాగి యాక్టివా వాహనంపై వస్తుండగా లంగర్హౌస్ బాపూఘాట్ వద్ద టోలీచౌకీ ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. జహంగీర్పై కేసు నమోదు చేసి అతని వాహనాన్ని స్వాధీనం చేసుకొని సంగం ఆలయం పక్కన ట్రాఫిక్ సీజ్ వాహనాల పార్కింగ్లో పెట్టారు. దీంతో పోలీసులపై కక్ష పెంచుకున్న జహంగీర్ జరిగిన విషయాన్ని భాస్కర్కు తెలిపాడు. ఎలాగయినా తన వాహనాన్ని తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల తరువాత సంగం ప్రాంతాన్ని పరిశీలించిన జహంగీర్, భాస్కర్లు 24 గంటలు ట్రాఫిక్ పోలీసులు కాపలా ఉండటమే కాకుండా వాహనాలకు అడ్డుగా బారీకేడ్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం గమనించారు. పక్కా ప్లాన్తో తెల్లవారుఝామున వాహనాల పార్కింగ్లోకి చొరబడ్డారు. పోలీసుల కళ్లు కప్పి తమ ద్విచక్రవాహనాన్ని వాగులోంచి దాటించి మూసీకి అటు వైపు చెట్ల నుండి తీసుకెళ్లారు. మరో రెండు రోజుల తరువాత సంగం వచ్చి పల్సర్ వాహనాన్ని చోరీ చేసి మూసీలోంచి అవతలి గట్టుకు తీసుకెళ్లి ఉడాయించారు. అయితే పల్సర్ వాహనదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా నిందితున్ని అరెస్టు చేసిన తరువాత అక్కడ చోరీ అయ్యింది ఒకటి కాదు రెండు వాహనాలు అని తెలియడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.కాగా ఈ చోరీకి భాద్యత వహిస్తు విదులు నిర్వహిస్తున్న హోంగార్డులు తమ వేతనాల నుండి భాదితునికి ద్విచక్ర వాహనాన్ని కొనిచ్చారు. తరువాత మరో బాలున్ని చేర్చుకొని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పార్కింగ్ నుండి మరో వాహనాన్ని చోరీ చేసి వాటిని అమ్మి హుక్కా సేవిస్తూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు. లంగర్హౌస్తో పాటు నార్సింగి పరిధిలో రెండు కెటీఎం వాహనాలు, రెండు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను చోరీ చేశారు. ఈ చలాన్ పట్టించింది... కొద్ది రోజుల క్రితం చోరీ చేసిన వాహనంపై ఇద్దరూ తిరుగుతు మాసబ్ట్యాంక్ వద్ద సిగ్నల్ జంప్ చేశారు. ఈ చలాన్ ఆ«ధారంగా పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితులు మల్లేపల్లి వరకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు తివారి, నరేష్ బాబు, మదన్లు కొద్ది రోజులు ఆయా ప్రాంతాలలో డేగకన్నుతో తిరుగుతు చాకచక్యంగా నిందితులు భాస్కర్, జహంగీర్లను అదుపులోకి తీసుకున్నారు.వీరిని అరెస్టు చేసి 5 వాహనాలను సీజ్ చేశారు. -
చలాన్తోనే సరిపెడుతున్నారు..
సాక్షి,సిటీబ్యూరో: అనుమతి లేని సమయంలో నగరంలోని రహదారుల పైకి దూసుకువస్తున్న భారీ వాహనాలు, డీసీఎంల కారణంగా 10 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇలా వస్తున్న వాహనాలకు చలాన్ విధించడం మినహా కఠిన చర్యలు తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. వీటి కారణంగానే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదన్నారు. అనుమతి పొందిన వాటి మినహా నగరంలో భారీ వాహనాలు, లారీలు, డీసీఎంల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యలోనే ఇవి నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అయినా ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడుపడితే అప్పుడు దూసుకొచ్చేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ‘నో–ఎంట్రీ’ కేసులు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఏటా 30 వేల నుంచి 50 వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఆయా వాహనాల డ్రైవర్లు కూడా అనుమతి లేని వేళల్లో నగరంలోని ప్రవేశించి ఓసారి చలాన్ వేయించుకుంటున్నారు. దీనిని చూపిస్తూ ఆ రోజంతా సిటీలో స్వైర విహారం చేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతి జంక్షన్లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయట్లేదు. మరోపక్క ఇలాంటి ‘నో–ఎంట్రీ వాహనాలను’ స్వాధీనం చేసుకునే ఆస్కారం సైతం పోలీసులకు ఉంది. అయితే దీని వెనుక పెద్ద ప్రహసనమే ఉంటోంది. రహదారిలో ఓ ప్రాంతంలో ఇలాంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడే ఉంచడం సాధ్యం కాదు. దాని డ్రైవర్ను పంపేసినా మరో డ్రైవర్ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ పోలీసు స్టేషన్, లేదా గోషామహల్ స్టేడియానికి తరలించాలి. అనంతరం సదరు డ్రైవర్/యజమాని జరిమానా చెల్లించి వచ్చి తీసుకువెళ్ళే వరకు దాన్ని భద్రపరచాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి అనుమతి లేని సమయంలో వచ్చిన భారీ వాహనంలో నిత్యావసర, అత్యవసర, సున్నిత వస్తువులు ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. ఇవన్నీ ఆయా వాహనాల డ్రైవర్లకు కలిసి వస్తుండటంతో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇలా నో–ఎంట్రీ సమయంలో వస్తున్న భారీ వాహనాల్లో డీసీఎంలే ఎక్కువ... ప్రమాదాల్లోనూ వీటిది పెద్ద స్థానమే. మరోపక్క రాత్రి అయిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులతో నిండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా నడిచే ఈ వాహనాలు, అడ్డగోలుగా పార్కింగ్స్, భయానకమైన శబ్ధాలు చేసే హారన్లు తోటి వాహనచోదకులతో పాటు నగరవాసులకూ నరకాన్ని చూపిస్తున్నాయి. రాత్రి 10 గంటల లోపు ప్రైవేట్ బస్సులు సిటీలోకి రావడానికి అనుమతి లేదు. అలాగే రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు బేఖాతరు చేయడం, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్ చేయడం పరిపాటిగా మారింది. వీటి సమస్య తీరాలంటే ప్రయాణికులను ఎక్కించుకోవడానికి, దింపడానికి ఈ వాహనాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుస్టేషన్ల వారీగా గుర్తించి ఏర్పాట్లు చేస్తేనే ఈ బస్సుల హడావుడికి చెక్ చెప్పవచ్చు. -
టాలీవుడ్ యంగ్ హీరోకు ఫైన్
సాక్షి, హైదరాబాద్ : యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవి రూ. 500ల ఫైన్ విధించారు. అనంతరం కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ను పోలీసులు తొలగించారు. ఈ ఘటన మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో చోటుచేసుకుంది. కాగా, భారత్లో కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడటంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల నాగశౌర్య ఓ బేబీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. వైజాగ్లో జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డ సంగతి విదితమే. -
స్పీడ్గా దొరికిపోతారు!
స్పీడ్గా దొరికిపోతారు! వాహనాల మితిమీరిన వేగానికి కళ్లెం వేసేందుకు పరిగి పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. స్పీడ్గా దూసుకెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఇందుకోసం స్పీడ్గన్లు వినియోగిస్తున్నారు. జిల్లా మీదుగా వెళ్లే హైదరాబాద్– బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ మార్గంగా మార్చారు. విస్తరణ పనులు కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో వాహనాల వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలా వాహనదారులు విపరీతమైన స్పీడ్తో దూసుకెళ్లడంతో పాటు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు స్పీడ్కు కళ్లెం వేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గడిచిన మూడు నెలల కాలంలో 154 స్పీడ్ కంట్రోల్ కేసులు నమోదు చేశారు. సాక్షి, పరిగి: పరిగి మీదుగా వెళ్లే హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై వాహనదారులు ఇటీవల 100 నుంచి 140 స్పీడ్తో దూసుకెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని నియంత్రించేందుకు క్రమం తప్పకుండా నిత్యం సాయంత్రం వేళల్లో రహదారిపై స్పీడ్ గన్లతో కాచుకుని ఉంటున్నారు. గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని దాటిపోతున్న వాహనదారులకు ఈ చలానా రూపంలో ఫైన్లు విధిస్తున్నారు. ఈ విషయం కొంతమంది వాహనదారులకు సైతం అర్థం కావటంతో పోలీసుల నిఘాలో ఉన్నామనే విషయాన్ని గమనించి వేగం తగ్గించారు. తెలియని వారు మాత్రం స్పీడ్ గన్కు దొరికిపోయి జరిమానాలు చెల్లిస్తున్నారు. గడిచిన మూడు నెలల కాలంలో అతి వేగం కారణంగా పోలీసులు రూ.1,59,390 జరిమానా విధించారు. స్కూల్ బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ బిగింపు.. చిన్నారులను తరలించే స్కూల్ బస్ల విషయంలో పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అటు పోలీసు శాఖయే కాకుండా ఆర్టీఓ అధికారులు సైతం ఈ అంశాన్ని సున్నితంగా పరిగణించి స్కూల్ బస్ల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 70 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వీటి పరిధిలో 100 పైచిలుకు స్కూల్ బస్లు ఉన్నట్లు గుర్తించారు. స్కూల్ బస్ విషయంలో నూతనంగా కేంద్రం తీసుకు వచ్చిన ఎంవీఐ యాక్టు ప్రకారం ఇటీవల రెన్యువల్ చేసే సమయంలో స్కూల్ బస్సులన్నింటికీ స్పీడ్ గవర్నెన్స్ను బిగించారు. ఇవీ ఆటోమేటిక్ వేగ నియంత్రికలుగా పనిచేస్తూ వేగాన్ని నియంత్రిస్తాయి. -
ఏమిటా స్పీడు... చలాన్ పడుద్ది
హైదరాబాద్ : డ్రైవింగ్... రద్దీ రోడ్లపై నెమ్మదిగా వెళ్లినా, ఖాళీగా కనిపిస్తే చాలు దూసుకుపోతాం. మనలో అనేక మందికి ఇది అలవాటే. ఇక ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లాంటి మార్గాల్లో వేగానికి పరిమితే ఉండదు. సాధారణ స్పీడ్ దాటినా మీటర్ రీడింగ్ కూడా చాలా మంది చూసుకోరు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. ఇదిగో ఇలాంటి వారి కోసమే పోలీసులు కొత్త యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మీ స్పీడ్ను పరిశీలించి హెచ్చరిస్తాయి. ‘నో యువర్ స్పీడ్’, ‘యువర్స్ స్పీడ్’యంత్రాలను ఓఆర్ఆర్పై ఏర్పాటు చేయనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్రావు ‘సాక్షి’కి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తమ పరిధిలో ఉన్న 62 కి.మీ. ఔటర్లో ఒక్కో రోజు ఒక్కో చోట వీటిని వినియోగించనున్నారు. యువర్స్ స్పీడ్ పనిచేస్తుంది ఇలా.. ఈ యంత్రాన్ని నిర్ణీత ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఇది ఎదురుగా వచ్చే వాహనాలను 300–400 మీటర్ల దూరం నుంచే అధ్యయనం చేస్తుంది. రాడార్ టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రం వాహన వేగాన్ని అధ్యయనం చేసి అనుసంధానించి ఉండే బోర్డు మీద వేగాన్ని (యువర్ స్పీడ్ అంటూ..) అంకెల్లో సూచిస్తుంది. వాహనం సాధారణ వేగంతో ఉంటే గ్రీన్ సిగ్నల్ను, మితిమీరితే రెడ్ సిగ్నల్ను చూపిస్తూ ‘డేంజర్’అని హెచ్చరిస్తూ డ్రైవర్ను అప్రమత్తం చేస్తుంది. హెచ్చరికను పట్టించుకోకుండా ముందుకు వెళితే అక్కడ ఉండే స్పీడ్ లేజర్ గన్ కెమెరా దీన్ని గుర్తించి ఈ–చలాన్ రూపంలో వాహనదారుడికి జరిమానా విధిస్తుంది. ట్యాంక్బండ్పై ట్రయల్.. ఈ స్పీడ్ డిటెక్టింగ్ టెక్నాలజీని ఇన్స్పెక్టర్ ఎం.నర్సింగ్రావు నేతృత్వంలోని బృందం గత నెలలో ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసి అధ్యయనం చేసింది. ఈ స్పీడ్ డిటెక్టర్లు జర్మనీ టెక్నాలజీతో తయారై రాడార్ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. ప్రయోగాత్మక పరిశీలనలో అనేక మంది వాహనచోదకులు ‘యువర్ స్పీడ్’చూసుకొని వేగం తగ్గించారని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు వీటిని అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలు గుర్తించాక కీలక ప్రాంతాల్లో పెట్టాలని యోచిస్తున్నారు. స్పీడ్ లిమిట్ లోపల వెళ్తే ఇలా ‘గ్రీన్’ రీడింగ్ చూపిస్తుంది.., స్పీడ్ లిమిట్ దాటి వెళ్తే ఇలా ‘రెడ్’ రీడింగ్ చూపిస్తుంది.. ప్రాథమికంగా రెండు యంత్రాలు... రోడ్డు ప్రమాద నిరోధం, ప్రాణనష్టం తగ్గించడమే మా లక్ష్యం. ఇందులో భాగంగా రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు ఓఆర్ఆర్పై రెండు యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. – దివ్యచరణ్ రావు, ట్రాఫిక్ డీసీపీ, రాచకొండ -
వేడుకున్నా వదల్లే..
ట్రాఫిక్ పోలీసులకు చేతులెత్తి మొక్కుతూ.. కాళ్లావేళ్లా పడుతున్న ఈ పెద్దాయన పేరు అమర్సింగ్(55). మధ్యప్రదేశ్కు చెందిన ఈయన అక్కడ ఉపాధి లేక బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి చింతల్ హెచ్ఎంటీ ప్రధాన రోడ్డులో చిన్న షెడ్డు వేసుకుని రగ్గులు, దుప్పట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు సంయుక్తంగా ఇక్కడ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. పోలీసులను బతిమిలాడుతున్న అమర్సింగ్ ఈక్రమంలో రోడ్డు పక్కనున్న అమర్సింగ్ షెడ్డును కూడా తొలగిస్తుండగా.. తన బతుకు నాశనం చేయొద్దంటూ అక్కడున్న ట్రాఫిక్ ఎస్ఐ రమేష్సింగ్ కాళ్లపై పడి వేడుకున్నాడు. ఆయన పట్టించుకోకపోవడంతో అక్కడికి వచ్చిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కాళ్లపై కూడా పడ్డాడు. అయినా అధికారులు కనికరం చూపకుండా అమర్సింగ్ షెడ్డును తొలగించి, సామగ్రిని జప్తు చేశారు. దాంతో బాధితుడు కన్నీళ్లు పెట్టుకోవడం మినహా మరేం చేయలేకపోయాడు. ఇతడి లాగే మరికొందరు బడుగుల బతుకును అధికారులు కూల్చివేశారు. బడాబాబుల ఆక్రమణలపై కన్నెత్తి చూడలేని అధికారులు తమ ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చిరుజీవులపై ప్రతాపం చూపుతున్నారని అక్కడి పరిస్థితిని గమనించిన కొందరు చెప్పుకోడం గమనార్హం. -
56 చలాన్లు : రూ.9675 బకాయి
హిమాయత్నగర్: సర్వీస్ రోడ్పై వాహనాల పార్కింగ్ చేస్తుండటంపై ట్రాఫిక్ పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హిమాయత్నగర్ ప్రధాన రోడ్ స్వాగత్ గ్రాండ్ వద్ద ఏపీ29 బిఎల్2385 ద్విచక్ర వాహనానికి 56 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకుగాను రూ.9675 బకాయిలున్నట్లు గుర్తించిన ఎస్సై కృష్ణంరాజు వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించాడు. -
ఐడియా అదిరింది..!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఓ చిన్న ప్రయోగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం నెట్జనులనే కాదు... ఏకంగా బిగ్–బీ అమితాబ్ బచ్చన్ను ఆకట్టుకుంది. కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్టాప్లైన్ను ఆయన ట్విటర్ వేదికగా సూపర్ ఐడియా అంటూ కొనియాడారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ తరహా ఎలక్ట్రానిక్ స్టాప్లైన్ల సంఖ్య పెంచాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. సిటీలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అనేక మంది ఓ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించే వారైనా, తమ తప్పు లేకపోయినా స్టాప్లైన్ క్రాసింగ్ అంటూ జరిమానాతో పాటు పెనాల్టీ పాయింట్ తప్పట్లేదు. ఓ రోడ్డుపై వివిధ చోట్ల ప్రయాణించే వాహనచోదకుడికి ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించకపోవడమే దీనికి కారణం. ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నచోట్ల మినహాయిస్తే సాధారణంగా జంక్షన్లలో కుడివైపునే సిగ్నల్స్ ఉంటున్నాయి. దీంతో ఎడమ వైపుగా వెళ్లే వారికి పక్కగా భారీ వాహనం ఉండే సిగ్నల్ వారికి కనిపించే అవకాశం ఉండట్లేదు. దీంతో రెడ్సిగ్నల్ పడిన విషయం గుర్తించలేక స్టాప్లైన్ క్రాసింగ్కు పాల్పడుతున్నారు. ఫలితంగా కేవలం జరిమానా విధింపే కాకుండా కొన్నిసార్లు ప్రమాదాలకు కారకం అవుతోంది. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండే జంక్షన్ల వద్ద ఎల్ఈడీ లైట్లతో కూడిన స్టాప్లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్క్ చౌరస్తా వద్ద అమలులోకి తీసుకువచ్చారు. కొన్నాళ్ల అధ్యయనం తర్వాత మార్పుచేర్పులు చేస్తూ అన్ని జంక్షన్లలోనూ అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. కేవలం సిగ్నల్ లైట్లు మాత్రమే కాకుండా స్టాప్లైన్ కూడా ఏ రంగు సిగ్నల్ ఉందో చూపే విధంగా చేయాలని యోచించారు. ఇలా చేస్తే లైట్లు కనిపించకున్నా స్టాప్లైన్ను చూసైనా ముందుకు వెళ్లొచ్చా? లేదా? అనేది వాహనచోదకులు నిర్థారించుకోవచ్చని అధికారులు ఓ ఆలోచన చేశారు. దీంతో సిగ్నల్ స్తంభానికి అనుసంధానిస్తూ ఆ రహదారిపై స్టాప్లైన్ స్థానంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. వాహనాలు దీనిపై నుంచి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మెటీరియల్ ఎంపిక చేశారు. ఫలితంగా రెడ్ సిగ్నల్ పడితే ఈ ఎల్ఈడీ లైట్లు ఆ రంగులో, గ్రీన్ పడితే ఆ రంగులోకి మారతాయి. రాత్రి వేళల్లో ఇవి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కేబీఆర్ చౌరస్తా వద్ద సిగ్నల్కు ఏర్పాటు చేశారు. అధ్యయనం తర్వాత వీటిని విస్తరించనున్నారు. ఇలా చేయడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికీ ఇక సిగ్నల్ లైట్ రంగు తెలుస్తుందని, పొరపాటున జరిగే ఉల్లంఘనులకు చెక్ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఇది ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ స్టాప్లైన్ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో అమితాబ్ బచ్చన్ దృష్టికీ వెళ్లింది. ఈ ప్రయోగానికి ఆకర్షితుడైన ఆయన ఆదివారం ట్విట్టర్లో ‘దిస్ ఈజ్ ఏ సూపర్ ఐడియా... మోస్ట్ ఎఫెక్టివ్’ అంటూ ఫొటోతో సహా ట్వీట్ చేశారు. this is a super idea .. most effective 👏👏👏👏 https://t.co/BDQ5K66OBq — Amitabh Bachchan (@SrBachchan) July 4, 2019 -
రోడ్లకు సొబగులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రజలు రోడ్డు దాటాల్సిన చోట జీబ్రా లేన్లు.. పెద్ద, చిన్న వాహనాల ప్రయాణానికి సదుపాయంగా లేన్ మార్కింగ్లు..ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్లు లేవు. స్టాప్లైన్లు సరిగ్గా లేకున్నా.. ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాలు చెలరేగుతున్నాయి. దీనికి తోడు పాత రోడ్లకే కాకుండా కొత్తగా నిర్మిస్తున్న రోడ్లపై కూడా లేన్ మార్కింగ్లు చేయడం లేదు. ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో, ఆర్అండ్బీ మంత్రి సూచనల మేరకు గ్రేటర్ నగరంలోని అన్ని రోడ్లపై లేన్ మార్కింగ్లు, స్టాప్లైన్లు తదితరమైనవి వేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. తొలి విడతగా దాదాపు 50 కి.మీ.ల మేర రోడ్లకు మార్కింగ్లు వేయనుండగా ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభించారు. దాదాపు 15 కి.మీ.ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా 35 కి.మీ.ల మార్గాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ లేన్లు మన్నికగా ఉండేందుకు థర్మోప్లాస్టిక్ పెయింట్ను బీటీ రోడ్లపై తెలుపు గీతలతో, సీసీ రోడ్లపై పసుపు రంగులో వేస్తున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వేస్తే ఎండవేడిమికి బీటీపైనున్న నలుపు వాహనాల ప్రయాణాలతో తెలుపు గీతలకు అంటుకుని నల్లగా మారే అవకాశం ఉందని, ఇప్పుడిప్పుడే నగరంలో ఎండలు తగ్గినందున ఈ పనులకు ఇదే సరైన సమయమని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్ తెలిపారు. పాదచారుల భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నామన్నారు. మొత్తం 17 పనులుగా విభజించి లేన్మార్కింగ్ పనులు చేస్తున్నారు.ఇవి పూర్తయ్యాక మిగతా ప్రాంతాల్లో చేపట్టనున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్నెంబర్ 1, 10 జంక్షన్, జహ్రానగర్ జంక్షన్, బీఎన్రెడ్డి నగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయన్నారు. సెంట్రల్ మీడియన్లు..రెయిలింగ్లు.. కేవలం కొత్తరోడ్లపైనే కాక జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రోడ్లకూ ఈ పనులు చేస్తామని చెప్పారు. దీంతోపాటు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటకుండా ఉండేందుకు కొన్ని ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్లకు రెయిలింగ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్భవన్ , తదితర మార్గాల్లో ఈపనులు చేపట్టినట్లు చెప్పారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బీటీ పొరలుపొరలుగా వేయడంతో రోడ్ల ఎత్తు బాగా పెరిగి సెంట్రల్ మీడియన్లు పైకి కనిపించకుండా కుంచించుకుపోయాయి. అలాంటి మార్గాల్లో సెంట్రల్ మీడియన్ల ఏర్పాటు పనులకు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం లోయర్ ట్యాంక్బండ్లోని కట్టమైసమ్మ గుడి వద్ద నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్ మీదుగా హిందీ మహా విద్యాలయ వరకు ఈ పనులకు సిద్ధమయ్యారు. -
‘కమ్యూనికేషన్’ కష్టాలు
సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్ర నంబర్ ప్లేట్ ఉన్న ఓ వాహనానికి రూ.రెండు లక్షల వరకు ఈ–చలాన్ల రూపంలో జరిమానా పడింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కెమెరాతో పాటు ఆయా ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ఈ వాహనానికి దఫాలవారీగా భారీ మొత్తంలో జరిమానా విధించారు. అయితే సదరు వాహన యజమాని ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ♦ తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) నంబర్ గల ఓ వాహనం దాదాపు ఏడాదిన్నరగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే తిరుగుతోంది. సదరు వాహనం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తుండటంతో దఫాలవారీగా లక్షన్నర వరకు ఈ–చలాన్లు జారీ అయ్యాయి. ♦ ఈ రెండు కేసుల్లోనే కాకుండా పలు ఇతర రాష్ట్ర వాహనాలు, టీఆర్ నంబర్ గల వాహనాల వివరాలు తెలంగాణ రాష్ట్ర ఆర్టీఏ డాటాబేస్లో అందుబాటులో లేకపోవడంతో కేవలం ఈ–చలాన్లను వెబ్సైట్లో ఆప్లోడ్ చేయడం వరకే పరిమితమవుతోంది. అయితే సదరు వాహనదారుల చిరునామాతో పాటు సెల్నంబర్లు లేకపోవడంతో వారికి సమాచారం అదించడం తలనొప్పిగా మారుతోంది. వారికి పోస్ట్ చేద్దామంటే చిరునామా లేకపోవడం, సంక్షిప్త సమాచారం పంపేందుకు సెల్ నంబర్ లేకపోవడంతో ‘కమ్యూనికేషన్’ కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే సదరు వాహనదారులు కూడా ఈ–చలాన్ వెబ్సైట్లో ఈ–చలాన్లను చెక్ చేసుకోకపోవడంతో జరిమానాలు పేరుకుపోతున్నాయి. 2014 తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ వాహనాల సమాచారం కూడా డాటాబేస్లో లేకపోవడంతో పొరుగు రాష్ట్ర వాహనాల బాధలు రెట్టింపయ్యాయి. నగరంలో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్...తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు ఈ–చలాన్ విధించడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. అయితే స్పాట్ చలాన్ డ్రైవ్లో దొరికిన సమయంలో ఈ వాహనదారుల జాతకం బయటపడి చిరునామా, సెల్నంబర్లు దొరుకుతున్నాయి. టీఆర్ నంబర్లతో పరేషాన్... నగరంలో కొత్త వాహనాల కొనుగోలు పెరిగిపోవడంతో పాటు వాహనదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్)తోనే ఎక్కువ కాలం వెళ్లదీస్తున్నారు. నెలరోజుల్లోగా శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉన్నా పట్టించుకోకుండా టీఆర్ నంబర్తోనే వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ నిఘానేత్రాలకు చిక్కుతున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద సీసీటీవీ కెమెరాలకు చిక్కిన సిగ్నల్ జంపింగ్ కేసుల్లోనూ టీఆర్ నంబర్ వాహనాల సంఖ్య వేలల్లోనే ఉంది. అయితే టీఆర్ వాహనాల వివరాలు డాటాబేస్లో లేకపోవడంతో వారికి పోస్టు, ఎస్ఎంఎస్లు పంపడం వీలుకావడం లేదు. కేవలం ఈ–చలాన్ వెబ్సైట్లో జరిమానా వివరాలను ట్రాఫిక్ పోలీసులు నిక్షిప్తం చేస్తున్నారు. సదరు వాహనదారులు ఈ–చలాన్లు తనిఖీ చేసుకోకపోవడంతో రికవరీ సాధ్యం కావడం లేదు. తరచు తనిఖీ చేసుకోవాలి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇతర రాష్ట్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. టీఆర్ వాహనాలదీ కూడా అదే పరిస్థితి. అయితే వీరి వివరాలు ఆర్టీఏ డాటాబేస్లో లేకపోవడంతో ఈ–చలాన్లు పోస్టు చేయడం, ఎస్ఎంఎస్ పంపడం సాధ్యపడటం లేదు. ఈ–చలాన్ వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తున్న ఈ–చలాన్లను వాహనదారులు తనిఖీ చేసుకుని క్లియర్ చేయాలి. వాహనం పట్టుబడితే సీజ్ చేస్తాం. అవసరమైతే వాహనదారుడిని జైలుకు పంపిస్తాం.– ఎస్.విజయ్ కుమార్,సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
బాటసారీ.. లేదు దారి
నగరంలో నడిచే దారి కరువైంది. ఫలితంగా పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రేటర్లో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జరిగిన ప్రమాదాల్లో 36శాతం మంది బాధితులు వీరే కావడం గమనార్హం. సాక్షి, సిటీబ్యూరో :ఎన్నో అంశాల్లో ప్రగతి పథంలో దూసుకెళుతున్న హైదరాబాద్ మహానగరం పాదచారులకు రోడ్డుపై నడిచే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలే ఈ అంశాన్ని చెబుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం మరింత ఊతమిస్తున్నాయి. నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో ద్విచక్రవాహన దారులు (50 శాతం)మొదటి స్థానంలో ఉంటే పాదచారులు రెండోస్థానంలో ఉన్నారు. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో వీరు 36 శాతానికి పైగా ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కారణాలు ఏమైన్నప్పటికీ ప్రాథమిక అంశాలైన ఫుట్పాత్ల ఆక్రమణ, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ పెలికాన్ సిగ్నల్స్తో పాటు జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం..ఉన్న వాటిని సరిగా పట్టించుకోక పోవడం వల్లనేఈ పరిస్థితి తలెత్తింది. మృతుల్లో పాదచారులూ ఎక్కువే.. నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2018కి సంబంధించి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో జరుగుతున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. వీటిలో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా.. రెండో స్థానం పాదచారులదే. కొన్నేళ్ల గణాంకాలను లెక్కతీస్తే రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో గత ఏడాది మొత్తం 2,540 ప్రమాదాలు జరగ్గా.. 2,550 మంది బాధితులుగా మారారు. వీటిలో ప్రమాదాల బారిన పడిన పాదచారుల సంఖ్య 924 మంది ఉన్నారు. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36 శాతం, మృతుల్లో 43 శాతం పాదచారులే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి మోక్షమెప్పుడో? రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీతో పాటు ఇటీవల రూపుదిద్దుకుని, అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లేదు. ప్రణాళిక లోపం వల్ల నగరంలో ఉన్న ఫుట్పాత్ల్లో సగం ఆక్రమణకు గురికాగా.. మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్ వద్ద ‘పెడస్ట్రియన్స్ క్రాసింగ్’ కోసం ప్రత్యేక చర్యలు, అందుకు అనుగుణంగా ‘ఆల్ రెడ్స్’ అనే సాంకేతిక అంశం ఏర్పాటు ఆమడదూరంలో ఉన్నాయి. వీటికి పరిష్కారంగా ట్రాఫిక్ విభాగం అధికారులు పంపిన ప్రతిపాదనలకు కూడా ‘గ్రేటర్’లో మోక్షం లభించడం లేదు. నగరంలో కీలక ప్రాంతాల్లో కనీసం రెండడుగుల వెడల్పుతో ఫుట్పాత్ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ చేసేందుకు ఓపెనింగ్స్ అవసరమని చేసిన ప్రతిపాదనలు బల్దియా ఫైళ్లల్లో కొన్నేళ్లుగా మగ్గిపోతున్నాయి. మూలనపడ్డ ‘పెలికాన్స్’ ప్రతిపాదన పాదచారుల భద్రత కోసం సిటీలో నిత్యం బిజీగా ఉండే 60 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కొన్నేళ్ల క్రితమే ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్కు సంబంధించిన మౌలిక వసతుల కల్పన జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి 2010 మార్చిలో జీహెచ్ఎంసీకి పంపారు. ఒక్కో సిగ్నల్ ఏర్పాటుకు రూ.40 వేల వరకు ఖర్చవుతుందని అంచనా వేసిన ‘గ్రేటర్’ అధికారులు.. కేవలం 30 సిగ్నల్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని దశల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమికంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద నాలుగింటిని అందుబాటులోకి తెచ్చారు. ఏడాది తరక్కుండానే అవి పాడైపోయినా పట్టించుకునేవారు కరవయ్యారు. మిగిలిన చోట ఏర్పాటు ప్రతిపాదనను దాదాపు మర్చిపోయారు. బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని కేర్ ఆస్పత్రి సమీపంలో మరో పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని భావించి ప్రాథమిక కసరత్తు చేసినా అది అమలు కాలేదు. ఈ లోపాలు సరిచేయాల్సిందే.. ♦ ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు, కాలిబాటలను మింగేసిన బడా మాల్స్ ఒక ఎత్తయితే ప్రభుత్వ విభాగాల అనాలోచిత చర్యలు మరో ఎత్తు. వీటివల్ల మరికొన్ని ఇబ్బందులు తలెత్తి కాలిబాటలు అక్కరకు రావడం లేదు. ఫుట్పాత్ల మధ్యలో ఉన్న చెట్లకు తోడు అధికారులు ఉద్దేశ పూర్వకంగా, అనాలోచి ధోరణిలో ఏర్పాటు చేసిన/చేస్తున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, మూత్రశాలలు ఆ కొద్ది స్థలాన్నీ ఆక్రమించేస్తూ పాదచారులకు నడిచే దారి లేకుండా చేస్తున్నాయి. ♦ రోడ్లకు అనుసంధానంగా ఉన్న క్యారేజ్వే ఆధారంగా కాలిబాటలు కనిష్టంగా 4–5 అడుగుల వెడల్పు ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిపై అడ్డదిడ్డంగా ఉన్న చెట్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి తొలగించాలి. ఈ తొలగింపు ప్రక్రియ సాధ్యం కాని ప్రాంతాల్లో ఉన్న ఫుట్పాత్ వెడల్పు కనీసం 2 నుంచి మూడు అడుగులు అదనంగా విస్తరించాలి. ♦ ఈ ఫుట్పాత్లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమే అన్నది అందరికీ అవగాహన కల్పించడంతో పాటు అది కచ్చితంగా అమలయ్యేలా చేయాలి. ఆక్రమణలు నిరోధించడానికి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో సంయుక్త ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేయాలి. ♦ నిత్యం రోడ్డుపై నడుస్తున్న పాదచారుల కంటే వాటిని దాటేందుకు ప్రయత్నిస్తున్న వారే ఎక్కువగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. పెడస్ట్రియన్లు సైతం ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటకుండా అడ్డగించేందుకు కాలిబాటలకు కచ్చితంగా బారికేడ్లు ఉండాలి. పటిష్టమైన స్టీలుతో వీటిని ఏర్పాటు చేసి కేవలం రోడ్డు దాటేందుకు అవకాశం ఇచ్చిన చోట మాత్రమే ఓపెనింగ్ ఉంచాలి. ♦ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లపై కూడా కనిష్టంగా మూడడుగుల ఎత్తుండే బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వీటివల్ల అడ్డదిడ్డంగా పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండదు. రోడ్డు దాటే అవకాశం ఇచ్చిన చోట మాత్రమే డివైడర్లపై బారికేడ్లు లేకుండా చూడాలి. డివైడర్లపై ఉండే ఈ దారి కనిష్టంగా రెండున్నర అడుగుల కంటే ఎక్కువే ఉండాలి. ఆయా ప్రాంతాల్లో పాదచారులకు ఉపయుక్తంగా ఉండేలా పెడస్ట్రియన్ సిగ్నల్స్ను ఏర్పాటు చేయాలి. ♦ రహదారులపై పాదచారులు రోడ్డు దాటేందుకు అవకా«శం ఇచ్చిన చోట స్పష్టమైన సూచికలు, అందరికీ కనిపించేలా జీబ్రా క్రాసింగ్స్తో పాటు ఇరువైపులా పాదచారుల (పెలికాన్) సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకువచ్చినా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ దాటడం అంత తేలిక కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ఆయా కీలక ప్రాంతాల్లో పాదచారుల భద్రతకు బాధ్యత తీసుకోవాలి. ♦ అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఐటీఎంఎస్ ప్రాజెక్టులో భాగంగా పాదచారుల కోసం సిగ్నలింగ్ వ్యవస్థలో కొత్త విధానం ఏర్పాటు చేయాలి. అన్ని దారుల్లోనూ రెడ్, గ్రీన్ సిగ్నల్స్ పడటం పూర్తయ్యాక 10 నుంచి 15 సెకండ్ల పాటు అన్ని వైపులా రెడ్ సిగ్నల్ పడేలా.. ఆ సమయంలో ప్రత్యేకమైన సైరన్తో పాదచారుల సురక్షితంగా జంక్షన్ దాటేలా రూపొందించాలి. ♦ రాజధానిలోని రోడ్లు అనేక ప్రాంతాల్లో చాలా వెడల్పుతో ఉంటాయి. కొన్నిచోట్ల 25 నుంచి 50 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్లూ ఉన్నాయి. ఇలాంటి చోట్ల క్రాస్ చేయాలని నడక ప్రారంభించిన పాదచారి ఒకే తడవలో రోడ్డు మొత్తం దాటడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భాల్లో డివైడర్లు లేదా రోడ్డు మధ్యలో ఆగిపోతున్న పాదచారులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతున్నారు. అలా కాకుండా రోడ్డు మొత్తం దాటడానికి వీల్లేనపుడు మధ్యలో ఆగే సందర్భాల్లో డివైడర్పై ‘పెడస్ట్రియన్ రెఫ్యూజీలు’గా పిలిచే ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం నగరంలో పాదచారుల భద్రతకు జీహెచ్ఎంసీ సహాయంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 27 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు మంజూరు చేయించగా వీటిలో ఆరు అందుబాటులోకి వచ్చాయి. మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. మెట్రో స్టేషన్లను ఆధారంగా చేసుకుని రోడ్డు దాటేలా ఆ సంస్థను ఒప్పించాం. సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో సెంట్రల్ మీడియం ఎత్తు పెంచడంతో పాటు రెయిలింగ్ ఏర్పాటు చేయిస్తున్నాం. పాదచారులు ఎక్కువగా రోడ్డు దాటే ప్రాంతాలైన మెట్టుగూడ, మెహదీపట్నం, రసూల్పురాల్లో ఉన్న సిగ్నల్స్ను ఆధునీకరించాం. – ఎల్.ఎస్. చౌహాన్, ట్రాఫిక్ డీసీపీ వాహన చోదకుల నిర్లక్ష్యమూ కారణమే.. సిటీ రహదారులపై పాదచారులు రోడ్డు దాటాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి మౌలికవసతుల కొరత ఓ కారణమైతే వాహన చోదకుల వ్యవహారశైలి మరో కారణం. సాధారణంగా జంక్షన్లో ఆగి ఎదురుచూస్తున్న పాదచారి రెడ్ సిగ్నల్ పడి వాహనాలు ఆగినప్పుడు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తాడు. అయితే, కొందరు ద్విచక్ర, తేలికపాటి వాహన చోదకులు ఆ సమయంలోనూ వాహనాలను ముందుకు ఉరిస్తూ పాదచారులను ఇబ్బంది పెట్టడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరోపక్క అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పాదచారులు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి.– కరణ్జీత్ సింగ్, జగదీష్ మార్కెట్ ఎఫ్ఓబీలు, భూగర్భ మార్గాలు కనుమరుగు నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్ల గతంలో భూగర్భ క్రాసింగ్ మార్గాలు నిర్మించారు. ఆపై దిల్సుక్నగర్, సికింద్రాబాద్, బేగంపేట, మెహదీపట్నం సహా అనేక ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి తెచ్చారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్రోడ్స్, కోఠి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా మరొకటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. ఇక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టిన జీహెచ్ఎంసీ అధికారులు వాటికి ఎలివేటర్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో పాదచారులకు ఉపయోగపడలేదు. ఇవి పూర్తిగా ఓ స్వరూపాన్ని సంతరించుకోకముందే ‘మెట్రో’ గండం వచ్చిపడింది. మెట్రోరైల్ నిర్మాణాల కోసం సిటీలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను తొలగించారు. తర్వాత కొన్ని నిర్మిస్తున్నా అవి అవసరాలకు అనుగుణంగా మాత్రం లేవు. 2018లో నగర పోలీస్ విభాగం గణాంకాలు ఇవీ.. మొత్తం ప్రమాదాలు : 2,540 క్షతగాత్రులు : 2,550 మృతులు : 303 బాధిత ద్విచక్రవాహన చోదకులు : 1,231 బాధిత పాదచారులు : 924 రహదారుల పరిస్థితి ఇలా... బల్దియా ఆధీనంలోని రోడ్లు : 6,200 కి.మీ. ఆర్ అండ్ బీ ఆధీనంలోనివి : 189.49 కి.మీ. జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలోనివి : 98.7 కి.మీ. మొత్తం రోడ్ల పొడవు : 6.488 కి.మీ. ఫుట్పాత్ల పొడవు : 2 వేల కి.మీ. లోపుటవీటిలో సరాసరిన కనిష్టంగా ఐదు కి.మీ. అడ్డంకులు లేకుండాఉన్న ఫుట్పాత్లు లేవు.