Vote right
-
గుజరాత్ ఎన్నికలు: తల్లి ఆశీస్సులు అందుకున్న మోదీ
అహ్మదాబాద్: గుజరాత్ రెండో(తుది) విడత పోలింగ్ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రమే ఆయన అహ్మదాబాద్కు వెళ్లారు. అయితే నేరుగా గాంధీనగర్ రైసన్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. సుమారు 45 నిమిషాలు అక్కడే గడిపారు. ఆపై గాంధీనగర్లోని బీజేపీ ఆఫీస్కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్, ఇతర సీనియర్ నేతలు మోదీకి స్వాగతం పలికారు. అహ్మదాబాద్ రనిప్లోని ఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నారన్పూర్ ప్రాంతంలోని మున్సిపల్ సబ్ జోనల్ కార్యాలయంలోని కేంద్రంలో ఓటేయనున్నారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్ 1న 89 సీట్లకు తొలి విడతలో పోలింగ్ జరగ్గా 63.31శాతం పోలింగ్ నమోదైంది. ఇవాళ మిగిలిన 93స్థానాలకు రెండో దశలో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON — ANI (@ANI) December 4, 2022 -
న్యూజిలాండ్లో 16 ఏళ్లకే ఓటు హక్కు
వెల్లింగ్టన్: ఓటు హక్కు అర్హతను 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశ పెడతామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పారు. దేశ సుప్రీంకోర్టు కూడా 16 ఏళ్ల వారికి ఓటు హక్కు కల్పించడంపై సానుకూలంగా స్పందించడంతో సోమవారం ఆమె ఈ ప్రకటన చేశారు. రాబోయే నెలల్లో ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వాటిపై పార్లమెంట్లోని 75% మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండటంతో ‘16 ఏళ్లకే ఓటు’ ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాల్లేవు. కాగా, 16 ఏళ్ల వారికీ ఓటు హక్కు కల్పించిన దేశాల్లో ఆస్ట్రియా, మాల్టా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్ ఉన్నాయి. -
జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంతో.. స్థానికేతరులకు సైతం ఓటు హక్కు కలిగేలా జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రాంతీయ పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో.. ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఏడాది కాలంగా జమ్ము రీజియన్ జిల్లాలో నివాసం ఉంటున్న వాళ్లకు.. ఎలాంటి ధ్రువీకరణ లేకున్నా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చంటూ తహసీల్దార్లకు మంగళవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా.. ఆ నివాస ధ్రువీకరణ పత్రాలతో ప్రాంతీయేతరులు సైతం ఓటర్ జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే లభిస్తుందన్నమాట. అయితే.. ఈ ఆదేశాలపై ప్రాంతీయ పార్టీలన్నీ భగ్గుమన్నాయి. ఓటర్లను దిగుమతి చేసుకునే బీజేపీ కుట్రలో ఇది భాగమంటూ మండిపడ్డాయి. గులాం నబీ ఆజాద్.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు కేంద్రంపై ‘వలసవాద విధానం’ అంటూ మండిపడ్డారు. రాజకీయ దుమారం చెలరేగడంతో.. వివాదాస్పదమైన ఈ ఉత్తర్వులను గత రాత్రి(బుధవారం) వెనక్కి తీసేసుకున్నారు అధికారులు. ఇక జమ్ము కశ్మీర్లో ఓటర్ నమోదు, సవరణల ప్రక్రియ నవంబర్ 25లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు ముందు దాకా.. అక్కడ శాశ్వత నివాసితులకు మాత్రమే ఓటర్లుగా అవకాశం ఉండేది. అయితే.. ఆగష్టు 2019 తర్వాత స్థానికేతరులకు అవరోధంగా ఉన్న చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి. దీంతో నాన్ లోకల్స్ను సైతం ఓటర్ లిస్ట్లో చేర్చేందుకు అవకాశం లభించినట్లయ్యింది. ఈ ఆగష్టులో కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ మొదలుకాగా.. స్థానికేతరులకు అవకాశం లభిస్తే 20-25 లక్షల మధ్య కొత్త ఓటర్లు జత అవుతారని జమ్ము కశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంచనా వేస్తున్నారు. -
మూడో బిడ్డ పుడితే పథకాలు వద్దు
హరిద్వార్: జనాభాను తగ్గించే చర్యల్లో భాగంగా ఒకే తల్లిదండ్రులకు పుట్టే మూడవ, లేదా ఆ తర్వాతి సంతానానికి, ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ సేవలు, పథకాలు, ఓటు హక్కును నిలిపివేయడం వంటివి చేయాలని యోగాగురు బాబా రాందేవ్ ఆదివారం అన్నారు. మతాలకు అతీతంగా, దేశంలోని ప్రజలందరికీ ఈ నిబంధనను వర్తింపజేయాలని ఆయన పేర్కొన్నారు. హరిద్వార్లో రాందేవ్ విలేకరులతో మాట్లాడుతూ ‘జనాభా విస్ఫోటన సమస్యను ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధంగా లేదు. 150 కోట్ల మంది కంటే ఎక్కువ జనాభాను దేశం భరించలేదు. ఎవరైనా మూడో బిడ్డను లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కంటే, ఆ జంటకు అలాగే మూడో లేదా ఆ తర్వాతి సంతానానికి ప్రభుత్వ సేవలను నిలిపివేయాలి. వివిధ పథకాలకు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదు. ఓటు హక్కును ఇవ్వకుండా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేయాలి’ అని అన్నారు. -
అమ్మను కోల్పోయినా బాధ్యత మరచిపోలేదు
మధ్య ప్రదేశ్లోని సత్నా... ఐదో దశలో అక్కడ పోలింగు జరిగింది. అందరిలాగే సత్నా మాజీ కార్పొరేటర్ అశోక్ గుప్తా కుటుంబీకులు కూడా ఓటు వేసేందుకు పోలింగు కేంద్రానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు.అయితే, అంతలోనే అనుకోని విషాదం... కార్పొరేటర్ తల్లి అకస్మాత్తుగా కన్ను మూసింది. కుటుంబ సభ్యులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు.ఒకవైపు తల్లి అంత్యక్రియలు నిర్వహించాలి. మరోవైపు ఓటు వేసి రావాలి. అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చాక ఓటు వేయడానికి సమయం ఉంటుందో...ఉండదో... అశోక్ గుప్తా కుటుంబ సభ్యులంతా దీనిపై చాలా సేపు మల్లగుల్లాలు పడ్డారు. చివరికి ముందు ఓటు వేసి వచ్చి ఆ తర్వాత అంతిమ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఒకవైపు ఆ ఏర్పాట్లు చూస్తోంటే ఓటు అర్హత కలిగిన 19 మంది పొద్దున్నే వెళ్లి ఓటు వేసి వచ్చారు. మృతురాలి భర్త కూడా కొడుకు సాయంతో పోలింగు కేంద్రానికి వెళ్లి ఓటు వేసి వచ్చారు.‘ఎన్నికలు ఐదేళ్లకొకసారి వస్తాయి. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత కాబట్టి ముందు ఓటు వేసి రావాలని నిర్ణయించుకున్నాం’అన్నారు మృతురాలి మనవడు కైలాష్ గుప్తా. ఓటు వేసి వచ్చాక అందరూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
పట్టించిన సిరా గుర్తు
కర్ణాటక, బనశంకరి : లోకసభ ఎన్నికల నేపథ్యంలో మొదట విడత పోలింగ్ జరిగిన వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం రెండో విడత పోలింగ్లో బెంగళూరు నగరంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి యత్నించి కొందరు పట్టుబడ్డారు. యలహంక, యశవంతపుర, రాజరాజేశ్వరినగర తదితర ప్రాంతాల్లో ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఉద్యోగాల నిమిత్తం బెంగళూరు నగరంలో స్ధిరపడిన చాలామంది ఓటర్లు ఈనెల 11 తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మొదటవిడత ఎన్నికల్లో తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుని బెంగళూరు నగరానికి చేరుకున్నారు. గురువారం బెంగళూరు నగరంలో జరుగుతున్న రెండో విడత పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పటికే వారి చేతి వేలికి వేసిన సిరా గుర్తును గమనించిన ఎన్నికల అధికారులు రెండో ఓటుహక్కు వినియోగించుకోవడానికి నిరాకరించారు. యలహంకలో ఇలాంటి కేసులు చోటుచేసుకోగా సుమారు 13 మంది ఓటుహక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నించగా వారి ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా 11 మంది పారిపోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన తాము చేనేత కార్మికులుగా పనిచేస్తున్నామని 11న జరిగిన శాసనసభ, లోకసభ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నామని తెలిపారు. బెంగళూరు ఓటరు జాబితాలో తమ పేరు ఉండటంతో దీంతో ఇక్కడ కూడా తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చామని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యలో ఇలాంటి గందరగోళ సంఘటనలు తలెత్తాయి. మొదటి దశ పోలింగ్లో ఓటుహక్కు వినియోగించుకున్న ఓటర్లు మరోసారి నగరంలో ఓటుహక్కు వినియోగించడానికి యత్నించి పట్టుబడిపోయారు. ఆంధ్రప్రదేశ్. అరుణాచల్ప్రదేశ్. అస్సాం, బీహర్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, ఒడిస్సా, సిక్కిం, తెలంగాణా, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాల్లోని చాలామంది ఉద్యోగాల నిమిత్తం కర్ణాటకలో స్ధిరపడ్డారు. అక్కడ తమ ఓటుహక్కు వినియోగించుకుని ఇక్కడ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉందని గుర్తించిన ఎన్నికల అధికారులు ముందుజాగ్రత్తగా అధికారులకు సూచించారు. దీంతో రెండోసారి ఓటుహక్కు వినియోగించుకోకుండా చర్యలు తీసుకున్నారు. -
తాళికట్టు శుభవేళ.. వేలికి సిరా గుర్తు
సాక్షి, బెంగళూరు: ఎన్నికల రోజున పలు చోట్ల పెళ్లిళ్లు జరిగాయి. ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని కొత్త దంపతులు కొందరు పెళ్లికి ముందే ఓటేస్తే, మరికొందరు తాళి కట్టి బయల్దేరారు. ⇔ దక్షిణ కన్నడ జిల్లాలోని విట్లాలో ఉదయాన్నే వధువు శ్రుతి పెళ్లి మంటపానికి వెళ్లకముందు పోలింగ్ కేంద్రానికి వెళ్లి క్యూలో నిలబడి ఓటేశారు. ⇔ అదే జిల్లా పుత్తూరులో వధువు హేమలత, బెళ్తంగడి తాలూకాలో తణ్ణీరుపంథలో పెళ్లికూతుళ్లు అశ్విని, అక్షత ఓటు వేశారు. ⇔ బంట్వాళలో నవజంట సుమిత్ పూజారి, ప్రతిజ్ఞ మొదట ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ఆ తర్వాత పోళలి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. -
పోస్టల్ బ్యా‘లేట్’!
ఒక్కఓటు చాలు బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలు తారుమారు కావడానికి. అందుకే ప్రతి ఓటు విలువైనదంటారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని, అందరూ రాజాంగం కల్పించిన హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ తపన పడుతుంటుంది. నూరు శాతం పోలింగ్ కోసం వందలాది కోట్లు ఖర్చు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తోంది. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సాధారణ ప్రజల మాట పక్కనపెడితే.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందే ఓటు హక్కు వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. ఇందుకు జిల్లా యంత్రాంగం ఉదాసీన వైఖరే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికలకు సంబంధించి చాలామంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. పోస్టల్ బ్యా లెట్లు అందకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలిసింది. అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు లేదనే విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలో 4058 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం సెక్టోరల్ ఆఫీసర్లు 399, రూట్ ఆఫీసర్లు 399, పోలింగ్ ఆఫీసర్లు 4553, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు 4553, అదనపు పోలింగ్ ఆఫీసర్లు 13,663, మైక్రో అబ్జర్వర్లు 2130 మంది చొప్పున 25,697 మంది సిబ్బంది పాల్గొన్నారు. మరో 12వేల మంది వరకు వివిధ స్థాయిల్లో పోలీస్ సి బ్బంది పాల్గొన్నారు. ఇక ప్రైవేటు ఉద్యోగులు ఎంత తక్కువ లెక్కేసుకున్నా మరో వెయ్యి మంది వరకు పని చేశారు. ఇలా పోలింగ్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ వేసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిది. ఎన్నికల్లో ప్రతిసారి శిక్షణ సమయంలోనే వీరికి ఓటు హక్కు వినియోగించుకునే వెలుసుబాటు కల్పిస్తారు. కానీ ఈసారి ఆ అవకాశం కల్పించలేదు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కానీ ఆ మేరకు కనీస ప్రచారం కూడా కల్పించలేదు. దీంతో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు చాలా తక్కువనే చెప్పాలి. ఓటు వేసినవారు కేవలం 4,189 మందే.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 25,697 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్ 7వ తేదీ కల్లా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. దీంతో 14,250 మంది మాత్రమే ఫారం–12 కోసం దరఖాస్తు చేశారు. కానీ ఇప్పటి వరకు వీరిలో కేవలం 2,300 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోగలిగారు. వీరిలో 1693 మంది పోలింగ్ ముందురోజు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిలో సిటీ పరిధిలో 1700 మంది పోలీసులకు కేవలం 1100 మంది మాత్రమే 2వ తేదీన తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా 190 ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపణలు కూడా వచ్చాయి. విశాఖ రీజియన్ పరిధిలో 690 మందిసిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటే 550 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 140 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వేయలేకపోయారు. ఇక ఆర్మడ్ రిజర్వుడు సిబ్బంది 398 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటే వారిలో 239 మంది ఓటు హక్కు వేశారు. రెండు ఓట్లు వేసిన వారు తక్కువే కాగా ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారిలో కనీసం సగం మంది కూడా రెండు ఓట్లు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ వేసిన వారిలో సగానికి పైగా అసెంబ్లీ బ్యాలెట్ అందితే.. పార్లమెంటుబ్యాలెట్ అందలేదు. పార్లమెంట్ బ్యాలెట్ అందితే అసెంబ్లీ బ్యాలెట్ అందని అయోమయ పరిస్థితి నెలకొంది. కనీసం దరఖాస్తు చేసుకున్న వారికైనా పూర్తిస్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు అందాయా అంటే అదీ కన్పించడం లేదు. ఇప్పటికీ వందలాది మంది టీచర్లు, వివిధ స్థాయిల్లో పనిచేసిన పోలింగ్ సిబ్బంది తమకు పోస్టల్బ్యాలెట్ ఇంకా రాలేదు? ఎప్పుడు వస్తుందంటూ ఆరా తీస్తూనే ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసిన వారు కూడా తమకు అసెంబ్లీ బ్యాలెట్ రాలేదని కొందరు..పార్లమెంట్ బ్యాలెట్ రాలేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. జాప్యం వెనుక పెద్దల ఒతిళ్లే కారణమా? ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వేసే అవకాశం కల్పించడంలో కావాలనే జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు కూడా బలంగా పని చేస్తున్నాయని విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఆర్టీసీ కార్మికులు ఇలా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతిఒక్కరూ గడిచిన ఐదేళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల విసిగి వేసారిపోయారు. దీంతో వీరంతా మార్పు కోరుకుంటున్నట్టుగా స్పష్టం కావడంతో పోస్టల్ బ్యాలెట్కు అవకాశం ఇస్తే పడే ప్రతి ఓటు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడుతుందన్న భావనతో కావాలనే పోస్టల్ బ్యాలెట్ అందకుండా జాప్యం చేస్తున్నారని బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కాటంనేని భాస్కర్ను కలిసి ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థించగా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ అందే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ భాస్కర్ హామీ ఇచ్చారు. ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్కు వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ జిల్లాలో 14 వేలకు పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే కేవలం 2వేల మందికే పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారని, మిగతా వారికి ఇవ్వకపోవడానికి గల కారణమేంటని కలెక్టర్ను ప్రశ్నించారు. ఆర్టీసీ, అంగన్వాడీ, ఆశవర్కర్లకు ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు వేసుకోవడాని తక్షణమే పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ఆశవర్కర్లతో పాటు అంగన్వాడీ ఉద్యోగులను దూరంగా ఎన్నికల విధులకు పంపించారని, వారు పోస్టల్ బ్యాలెట్లు అడిగితే మీకు ఓట్లు లేవని అంటున్నారని కలెక్టర్కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో లేని నియమాలు విశాఖ జిల్లాకే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఓటు వేసుకునే హక్కు రాజ్యంగబద్దంగా అందరికీ ఉందని, దాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. గత ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు రాలేదని, ఈ ఎన్నికల్లోనే ఎందుకు ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతోనే పోస్టల్బ్యాలెట్లు ఇవ్వడం లేదని ఉద్యోగుల ఆరోపిస్తున్నారన్నారు. ఒక పౌరుడిగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు ఎందుకు కాలరాస్తున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విశాఖ సౌత్ ఎమ్మెల్యే అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి భీశెట్టి సత్యవతి, సీనియర్నేత కుంభా రవిబాబు, అనకాపల్లి ఎన్నికల పరిశీలకుడు దాడి రత్నాకర్, అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాదరెడ్డి, అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, సీనియర్నేత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు కోల్పోయారు
జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో అనేక కేడర్లలో పనిచేస్తున్న 18వేల మందిని ఓపీవీలుగా నియమించారు. వారిలో 4,800 మంది వరకు అంగన్ వాడీ వర్కర్లు, స్వీపర్లు, ఆశావర్కర్లు ఉన్నారు. ఎన్నికల విధులకు వినియోగించే ఉద్యోగులకు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ను అందజేయాల్సి ఉంటుంది. అయితే 4,800 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకుండా ఓటు వేసే వారి ప్రాథమిక హక్కును కాలరాశారు. ఈ విషయం జిల్లావ్యాప్తంగా విమర్శలకు తావిస్తోంది. ఓటు విలువను తెలియజేసే జిల్లా యంత్రాం గమే ఇలా చేయడంపై పలువురు ఈ ఘటనను ఈసీ దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. చిత్తూరు కలెక్టరేట్ : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలి. ఎన్నికలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా నిర్వహించాల్సిన జిల్లా యంత్రాంగం 4,800 మంది ఉద్యోగులకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పి వారి ఓటు హక్కును వినియోగించుకోకుండా దూరం చేసింది. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు 18 సంవత్సరాలు నిండిన వారందరికీ హక్కును కల్పి స్తారు. ఆ హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లాలోని ప్రతి ఊరిలో ప్రచారం కల్పిం చిన జిల్లా యంత్రాంగమే తప్పు చేయడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్లలో విధులు నిర్వహించడానికి 1+5 చొప్పున పీఓ, ఏపీఓ, ఓపీఓలను నియమించారు. జిల్లావ్యాప్తంగా 3,800 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆ పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి 27,189 మందిని నియమించారు. పోలింగ్ బాధ్యతలు అప్పజెప్పే వారికి ముందుగా పోస్టల్ బ్యాలెట్ అందజేయాల్సి ఉంది. పోలింగ్ ప్రక్రియ కసరత్తులో నిర్లక్ష్యం వహించడం వల్ల ఓపీఓల నియామకాల్లో తప్పిదాలు చేశారు. ఓపీఓ కేడర్లో విధులు నిర్వహించడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే జూనియర్, సీనియర్, రికార్డు అసిస్టెంట్ వారిని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో అలా చేయకుండా అంగన్వాడీ వర్కర్లను, స్వీపర్లను, ఆశా వర్కర్లకు విధులు అప్పగించారు. పోతేపోనీ అనుకుంటే వారి ఓటు హక్కుకు భంగం కలిగించడం ఎంతవరకు న్యాయమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అధికారిక కుట్రేనా? అంగన్వాడీ వర్కర్లను, స్వీపర్లను, ఆశావర్కర్లను విధులకు కేటాయించి వారి ఓటు హక్కును కాలరాయడం అధికారికంలో ఉన్న పాలకులు చేయించిన కుట్రే అని అనుమానాలు వస్తున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో అంగన్వాడీ ఉద్యోగులకు అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు అధికారంలో ఉన్న పాలకులకు ఓట్లు వేయరని, వారి ఓట్లు మరొకరికి పడకూడదనే కుట్రతో ఇలాంటి పనులను అధికారులతో చేయించారని తెలుస్తోంది. అధికార పార్టీకి తొత్తులుగా ఉన్న అధికారులు కొందరు ఇలా చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శలు వస్తున్నాయి. బాధ్యులు ఎవరు? తాము ఓటు హక్కు కోల్పోవడంపై ఎవరు బాధ్యత వహిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఓపీఓ విధులపై కనీస అవగాహన లేని వారిని విధులకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని వామపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని 3,800 పోలింగ్ కేంద్రాల్లో ఓపీఓలుగా 18వేల మందిని నియమించిన వారిలో 30 శాతం మందిని పోలింగ్ రోజున రిజర్వులో ఉంచారు. శిక్షణ తీసుకున్న ఓపీఓ కేడర్ ఉద్యోగులను రిజర్వ్లో పెట్టి, శిక్షణ పొందని అంగనవాడీ, ఆశా వర్కర్లను, హెల్పర్లకు పోలింగ్లో ఓపీఓలుగా విధులను అప్పజెప్పారు. విధుల కేటాయింపులో అధికార పార్టీ సూచనల మేరకు జిల్లా యంత్రాంగం చేసిన తప్పు వల్ల ఓటు హక్కు కోల్పోయేలా చేసినందుకు బాధ్యత ఎవరు వహిస్తారని రాజకీయపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారని తెలిసింది. ముమ్మాటికీ అధికారిక కుట్రే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్, జిల్లా యంత్రాంగం ప్రచారం చేసింది. ప్రతి ఒక్కరూ వారి ప్రాథమిక హక్కు అయిన ఓటును కచ్చితంగా వినియోగించుకోవాలి. జిల్లాలో ఓపీఓలుగా అంగన్వాడీ, ఆశా వర్కర్లు, స్వీపర్లను విధులకు కేటాయించి ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడం రాజ్యాంగ విరుద్ధమే. ఓటు హక్కు కోల్పోయిన వారికి కచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. – నాగరాజన్, సీపీఐ, జిల్లా కార్యదర్శి -
79.64 శాతం ఓటింగ్
సాక్షి, అమరావతి: గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2014 ఎన్నికల్లో 78.41 శాతం మేరకు ఓటింగ్ నమోదవగా.. గురువారం నాటి ఎన్నికల్లో 79.64 శాతం మేరకు ఓట్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో 3.67 కోట్ల మంది ఓటర్లకుగాను 2.87 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 3.93 కోట్ల మంది ఓటర్లకుగాను 3.13 కోట్ల మంది ఓటేశారు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి 26 లక్షల మంది అధికంగా ఓటేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశంజిల్లాలో 85.98 శాతం మేరకు ఓటింగ్ నమోదవగా, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 71.81 శాతం మేరకు ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని అద్దంకి 89.82 శాతంతో అత్యధిక ఓటింగ్ జరిగిన నియోజకవర్గంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట 89.64 శాతం, ప్రకాశం జిల్లా దర్శి 89.62 శాతం ఓట్ల పోలింగ్తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
తెలంగాణ టు ఆంధ్ర..!
దంతాలపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినయోగించుకోవడానికి తెలంగాణలో ఉపాధికి వచ్చిన ఆంధ్ర ఓటర్లు బుధవారం తరలివెళ్లారు. నర్సింహులపేట మండల కేంద్రానికి సుమారు పది సంవత్సరాల క్రితం ఉపాధి కోసం వచ్చిన ఒంగోలువాసులు మేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వెళ్తుండగా సాక్షి వారిని పలకరించగా తమది ఒంగోలు జిల్లా కనిగిరి అని ఎన్నికల్లో ఓటు వేయడం బాధ్యతగా భావించి వెళ్తున్నామని తెలిపారు. -
ఓటుపై వేటు!
సాక్షి, దర్శి (ప్రకాశం): తమ ఓటు హక్కును పథకం ప్రకారం కోల్పోయేలా చేశారని ఒంగోలు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు ఆర్వో కృష్ణవేణి ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం తమకు ఎన్నికల డ్యూటీలు వేశారని, బ్యాలెట్ల కోసం ముందస్తు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. తమకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకుంటే డ్యూటీలకు రామన్న అనుమానంతో దర్శిలో పోస్టల్ బాలెట్లు ఇస్తారని అబద్దాలు చెప్పి డ్యూటీకి పంపారని డ్రైవర్లు మండిపడుతున్నారు. ఇక్కడ ఆర్వోను పోస్టల్ బ్యాలెట్లు అడగగా తనకు సంబంధం లేదని సమాధానం చెప్పారని వాపోయారు. ఎన్నకల విధులకు వెళ్లే తాము ఇప్పడు ఓటు ఎలా వేయాలని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా మోసం చేయడం మంచి పద్ధతి కాదంటున్నారు. తమకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం గతంలో ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల కమిషన్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని లక్షలు ఖర్చు చేసి ప్రకటనలు చేస్తున్నా తమ గోడు మాత్రం వినడం లేదని మండిపడ్డారు. ఇలా చేయడం దారుణం ఓటు హక్కు లేకుండా చేయడం మనిషిని చంపడంతో సమానం. గతంలో ఇంత దారుణంగా వ్యవహరించడం నేను ఎప్పుడూ చూడలేదు. ఓటు హక్కును హరిస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఎందుకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం లేదు. - ఎం.మల్లికార్జునరావు ఇది మంచి పద్ధతి కాదు అధికారులు వ్యవహార శైలి బాగాలేదు. మాకు ఓటు హక్కు కల్పించాల్సిందే . లేదంటే ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి. ఇలాంటి కుట్రలు చేసే వారికి ఉద్యోగులందరూ సరైన బుద్ధి చెప్పండి. ఎన్నికల కమిషన్ మామొర ఆలకించాలి. - బి.రమణయ్య, ఆర్టీసీ డ్రైవర్ నిలువునా మోసగించారు ముందు పోస్టల్ బ్యాలెట్ ఇస్తామన్నారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పడు అడిగితే సమాధానం లేదు. ముందే ఇలా చేస్తారని చెప్తే డ్యూటీలకు వచ్చే వాళ్లం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఓటు హక్కు హరించేలా ఎన్నికల అధికారులు కుట్రలు చేస్తే ఎన్నికలు పెట్టడం ఎందుకు. - కేవీ రెడ్డి, ప్రైవేటు స్కూల్ బస్ డ్రైవర్ -
ఓటేస్తే చికెన్పై రూ.50 రాయితీ
టీ.నగర్: పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తికి చికెన్ ధరలో రూ.50 రాయితీ అందజేస్తూ చెన్నై ఐనావరంలోని ఒక దుకాణ యజమాని ప్రకటించాడు. ఎన్నికల కమిషన్ పార్లమెంటు ఎన్నికల్లో వంద శాతం పోలింగ్కు ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. అలాగే పలువురు 100 శాతం పోలింగ్కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇలా ఉండగా చెన్నై ఐనావరం మార్కెట్ సమీపంలోని చికెన్ సెంటర్ యజమాని మురళీబాబు వంద శాతం పోలింగ్పై అవగాహన పెంచేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. పోలింగ్ జరిగే 18వ తేదీన ఓటేసి వచ్చిన ఓటరుకు కోడిమాంసంలో ప్రత్యేక రాయితీ ప్రకటించాడు. ఓటేసినట్లు సిరాతో ఉన్న గుర్తును చూపితే కోడి మాంసం కిలో ధరలో రూ.50 తగ్గింపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈయన నిర్ణయానికి నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. -
గర్వంగా సిరా చుక్క చూపాలి
సాక్షి, మేడ్చల్ జిల్లా: ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని, గురువారం జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేసి గర్వంగా సిరా మార్క్ను చూపాలని మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల అధికారి, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. ఓట వేయడం బాధ్యతగా భావించాలన్నారు. బుధవారం మేడ్చల్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లరలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి వెయ్యి వాహనాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను సిబ్బంది బుధవారం రాత్రి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారని చెప్పారు. నియోజకవర్గంలో గుర్తించిన 258 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వీటికి మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. నియోజకవర్గంలోని 2,960 పోలింగ్ కేంద్రాలను 259 సెక్టార్లుగా విభజించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల విధుల్లో 20వేల మంది సిబ్బంది సహా పోలీసులు పాల్గొంటున్నారన్నా రు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థికి 9వాహనాలు.. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు అభ్యర్థి లేదా సంబంధిత ఏజెంట్లు 9 వాహనాలు మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఒక్కొ వాహనంలో డ్రైవర్ సహా నలుగురు మాత్రమే వెళ్లాలన్నారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 6గంటల లోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఏజెంట్ల సమక్షంలోనే గంటసేపు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రిసైడింగ్ అధికారికి మినహా మరెవరికీ కేంద్రంలోకి సెల్ఫోన్ అనుమతి లేదన్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్దేశించిన డీఆర్సీ సెంటర్లకు ఈవీఎంలు తరలిస్తామన్నారు. అక్కడి నుంచి అదే రాత్రి కీసరలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్లకు తరలిస్తామన్నారు. స్ట్రాంగ్రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఉంటుందన్నారు. స్ట్రాంగ్రూమ్లను అభ్యర్థులు సహా వారి ఏజెంట్లు ఎప్పుడైనా పరిశీలించడానికి అవకాశం ఇస్తామన్నారు. ఎవరైనా అభ్యర్థి స్ట్రాంగ్రూమ్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఇస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్ఓ మధుకర్రెడ్డి, నోడల్ అధికారులు కౌటిల్య, సౌమ్య, శ్రీనివాస్రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఓటున్నా.. వృథా అయింది..!
సాక్షి, ఒంగోలు, చీరాల అర్బన్: అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల యంత్రాంగం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అయితే ఓటు హక్కు ఉండి వినియోగించుకోలేకపోవడానికి గల కారణాలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మాత్రం వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఆర్టీసీ డ్రైవర్లు 600 మంది జిల్లా వ్యాప్తంగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి నెలకొనడం దారుణం. జరిగింది ఇదీ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు గాను మొత్తం 600 బస్సులు కావాలని జిల్లా ఎన్నికల అధికారి వాడరేవు వినయ్చంద్ ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. ఇందుకు ఆర్ఎం జి.విజయగీత గత నెల 25వ తేదీనే పోస్టల్ బ్యాలెట్లకు అర్హత ఉన్నవారు తమ ఫారం–12, ఐడీ కార్డు ప్రతులను అధికారులకు అందజేయాలని, గజిటెడ్ అధికారి వాటిని ధ్రువీకరించి రిటర్నింగ్ ఆఫీసర్లకు అందజేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. అయితే ఆర్టీసీలో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ను ప్రవేశపెట్టేందుకు ఎన్నికల కమిషన్ అంగీకారం తెలిపింది. దీంతో ప్రతి ఏటా తాము ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ పోస్టల్బ్యాలెట్ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామన్న ఆవేదన స్థానంలో అంతులేని ఆనందం నెలకొంది. అయితే 10,11 తేదీల్లో ఎన్నికల డ్యూటీకి కేటాయిస్తున్న బస్సులకు డ్రైవర్లుగా ఎవరెవరిని పంపాలనే అంశంలో డిపో మేనేజర్లు సరైన నిర్ణయం తీసుకోవడంలో వైఫల్యం చెందారు. దీంతో వారు ఈనెల 7వ తేదీ వరకు సిబ్బందికి డ్యూటీలు కేటాయిస్తూ వచ్చారు. 9వ తేదీ మధ్యాహ్నంలోగా ఫారం 12, గుర్తింపు కార్డులు అందజేయాలని ఆదేశించారు. దీంతో విధులకు నియమితులైన డ్రైవర్లు తమతమ పత్రాలను అధికారులకు అందించారు. ఏం ప్రయోజనం.. ఇలా అన్ని డిపోల్లో వచ్చిన ఫారం 12ను తీసుకొని రిటర్నింగ్ అధికారులకు అందజేసి పోస్టల్ బ్యాలెట్లను సిబ్బందికి ఇప్పించే ప్రక్రియను మంగళవారం ఆర్టీసీ అధికారులు చేపట్టారు. అందులో భాగంగా వారు రిటర్నింగ్ ఆఫీసర్ల వద్దకు వెళ్లగా పోస్టల్ బ్యాలెట్లకు ఈనెల 4వ తేదీతోనే గడువు ముగిసిందని, అందువల్ల ఇప్పుడు ఫారాలు తీసుకోవడం సాధ్యం కాదంటూ సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆర్టీసీ అధికారులు ఏం చేయాలో తెలియక చివరకు చావు కబురు చల్లగా సిబ్బందికి చెప్పారు. గడువు ముగిసిందని అందువల్ల పోస్టల్ బ్యాలెట్లు మంజూరు కావని స్పష్టం చేశారు. దీంతో తొలిసారిగా ఓటు వినియోగించుకునేందుకు అవకాశం చేతివరకు వచ్చినా బటన్ నొక్కే అవకాశం మాత్రం లేకుండా చేశారనే వాదన వినిపిస్తోంది. దీంతో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తొలుత భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భావించి విరమించారు. పరిశ్రమలు, షాపులు, సంస్థల్లో పనిచేసే కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవును తీసుకుంటుండగా తమకు మాత్రం కనీసం ఓటు హక్కు వినియోగించుకునేందుకు సైతం అవకాశం లేకుండా పోతుందని, కనీసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కొంతమందికైనా అవకాశం దక్కుతుందని భావిస్తే అది కూడా నిరాశను మిగిల్చిందంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ దూరం.. ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఎన్నికల రోజున విధుల్లో ఉన్న సిబ్బందంతా ఓటుకు దూరమవుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే హక్కును వీరంతా కోల్పోతున్నారు. ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని ముందురోజే సంబంధిత పోలింగ్ కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తారు. దీంతో వీరంతా రెండు రోజులు పాటు తమ ఓటు హక్కు ఉన్నా.. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంతాలైన విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, షాపూరు బస్సుల్లో ఉన్న సిబ్బంది ఎన్నికల రోజున ఓటు హక్కు వేయలేని పరిస్థితి నెలకొంది. తెలియక పోవడంతో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిసారీ ఓటు హక్కును ఆర్టీసీ కార్మికులు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా తమకు కూడా పోస్టల్ బ్యాలెట్ను తొలిసారిగా అందించారు. అయితే డ్యూటీ చార్టులు వేయించుకునే కార్మికులు ఎవరనేది తేలియకపోవడంతో సిబ్బంది వినియోగించుకోలేదు. దీంతో ఈసారి కూడా ఓటుకు దూరమయ్యాం. బి.రవి, ఈయూ రీజియన్ కార్యదర్శి అవగాహన లోపంతోనే వినియోగించుకోలేదు ఎన్నికల విధులకు వెళ్లే కార్మికులకు పోస్టల్ బ్యాలెట్ను గత నెల 28న అందించాం. రీజియన్లోని డిపోలకు సర్క్యులర్ పంపాం. అయితే పోలింగ్ రోజున డ్యూటీలు ఎవరికి కేటాయిస్తారో తెలియక పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోలేదు. కార్మికులు అవగాహన లేకపోవడంతో పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోలేదు. - విజయగీత, ఆర్టీసీ ఆర్ఎం -
ఓట్లకు రావాలంటే.. నోట్లు వదలాల్సిందే!
సాక్షి, చీరాల అర్బన్ (ప్రకాశం): ఓట్ల పండగ దగ్గరలోనే ఉంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుదూరు ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రయాణం కడుతున్నారు. అయితే ఊరికి వచ్చేందుకు హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉన్న వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. రైళ్లలో రిజర్వేషన్లు ఖాళీ లేవు. ప్రైవేటు ట్రావెల్స్కు వెళ్దామంటే ధర రెండింతలు పెంచేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని ఉన్నా రవాణా సౌకర్యం లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ, ఉన్నత చదువులు, వ్యాపారం రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు సొంత ఊరు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆర్టీసీ, రైళ్లలో సీట్లు ఫుల్ కావడంతో ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11న ఉండటంతో 10వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఇదే సరైన సమయంగా చూసుకుని ప్రైవేటు ఆపరేటర్లు 10, 14న టిక్కెట్ ధరలు అమాంతం పెంచేశారు. ఒక్క చీరాలకే 10 వేల మంది రాక సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు చీరాలకు చెందిన సుమారు 10 వేల మంది ఓటర్లు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. చీరాల, వేటపాలెం మండలాలకు చెందిన ఎక్కువ మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ, విద్య, వ్యాపారం రీత్యా స్థిరపడిన వారు ఉన్నారు. ఓటు మాత్రం నియోజకవర్గంలో ఉండటంతో ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. 10వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి చీరాలకు రోజు వారీ సర్వీసులతో పాటు అదనంగా మరో ఐదు సర్వీసులు నడుపుతున్నారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. 14వ తేదీన తిరుగు ప్రయాణంలోనూ ఇబ్బందులు పడకుండా ప్రస్తుతం రోజువారీ సర్వీసులతో పాటు మరో ఐదు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ కె.గంగాధరరావు తెలిపారు. ప్రయాణికులపై ప్రై‘వేటు’ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లుకు తిరుగు ప్రయాణం చుక్కలు చూపించనుంది. 10వ తేదీన వచ్చిన వారు 14వ తేదీకి తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు రిజర్వేషన్లు చేయించుకునేందుకు వెళ్తే సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఎన్నికల సమయాన్ని అదనుగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలు అమాంతం పెంచేశారు. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. మామూలు రోజుల్లో చీరాల నుంచి హైదరాబాద్కు ఏసీ టిక్కెట్ రూ.560 వరకు ఉంటే ఎన్నికల సందర్భంగా ఆ టిక్కెట్ను అమాంతంగా రూ.1500లకు పెంచేశారు. మరికొన్ని ట్రావెల్స్ అయితే టిక్కెట్ రూ.2 వేల వరకు పెంచేశాయి. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులకు టిక్కెట్లు ధరలు పెంచేసింది. వలస ఓటర్ల్లపై ప్రత్యేక దృష్టి చీరాల నియోజకవర్గంలో స్థానికులై ఉండి దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిపై రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టిసారించాయి. స్థానిక ఓటర్లకన్నా ఎన్నికల్లో వలస ఓటరుదారులు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఎక్కువగా ప్రభావితం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రసన్నం చేసుకుంటున్నాయి. మరికొందరైతే మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ నాయకులు ఓటర్లుకు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మంది ఉంటే వాహన సౌకర్యం కూడా కల్పిస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం ఎన్నికల నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. రోజువారీ సర్వీసులతో పాటు అదనంగా మరో ఐదు బస్సులను 10వ తేదీ, 14న తిప్పేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ప్రయాణికుల రద్దీని గమనించి ఇంకా ఎక్కువ బస్సులు తిప్పుతాం. ఓటర్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - కె.గంగాధరరావు, మేనేజర్, చీరాల డిపో -
11 రకాల గుర్తింపు కార్డులు
బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): ఓటర్ కార్డు లేనివారు ఎన్నికల సంఘం నిర్ణయించిన 11 రకాల గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు. కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన జరిగే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 35,78,458 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపా రు. ఓటర్ కార్డు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటును వినియోగించుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫొటో కూడిన ఓటర్ స్లిప్ గుర్తింపు కార్డు కిందకు రాదని, అది కేవలం పోలింగ్ కేంద్రాల్లో ఓటు నంబర్ తెలుసుకునేందుకే మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారిలో 3,43,619 మం దికి ఓటర్ కార్డులను పంపిణీ చేశామన్నారు. మరో 80 వేల ఓటరు కార్డులు సోమవారం నాటికి జిల్లాకు రానున్నాయన్నారు. వాటిని మం గళ, బుధవారాల్లో పంపి ణీ చేస్తామని వివరిం చారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. గిరిజన ప్రాంతాలైన అరుకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. పోలింగ్ సమయం ముగిసేప్పటికి ఎంత మంది లైన్లో ఉంటారో వారందరికీ స్లిప్స్ ఇచ్చి పోలింగ్లో పాల్గొనేందుకు అనుమతిస్తామని, తదుపరి వచ్చిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. గుర్తులతో ఉన్న స్లిప్లు పంపిణీచేయరాదు ప్రభుత్వం ఫొటోతో కూడిన ఓటర స్లిప్లను బీపీఎల్ ద్వారా పంపిణీ జరుగుతోంది. అయితే పార్టీలు సొంతంగా పంపిణీ చేయాలని భావిస్తే పార్టీ గుర్తులు లేని స్లిప్పులను మాత్రమే అందించాలన్నారు. అలా కాకుండా గుర్తులతో ఉన్న వాటిని ఎక్కడైనా పంపిణీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాల గుర్తింపు:ఎస్పీ బాబూజీ జిల్లా ఎస్పీ బాబూజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 2,207 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వాటిలో 256 సమస్యాత్మక, 83 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అరుకు, పాడేరు నియోజకవర్గాల్లో 469 పోలింగ్ కేంద్రాల్లో ఎల్.డబ్ల్యూ.ఈ ప్రభావిత కేంద్రాలుగా గుర్తించినట్టు వివరించారు. ఆంధ్రా, ఒడిశా పోలీసుల సహకారంతో ఈ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రేహౌండ్, సెంట్ర ల్ పారా మిలటరీ, స్టేట్ ప్రత్యేక దళాల సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 19 కేంద్రాలకు హెలికాఫ్టర్లలో సిబ్బంది తరలింపు గిరిజన ప్రాంతాలతోపాటు రోడ్డు మార్గంలోని 19 పోలింగ్ కేంద్రాలకు హెలికాఫ్టర్ ద్వారా సిబ్బందిని, పోలింగ్ సామగ్రిన్ని తరలించనున్నామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల్లో తొలిసారిగా డ్రోన్లను వినియోగించి పటిష్టమైన నిఘా పెడుతున్నామన్నారు. శరవేగంగా ఓటర్ కార్డు, స్లిప్స్ పంపిణీ ఎన్నికల మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఓటర్లకు అవసరమైన ఓటర్ కార్డులు, ఓటర్ స్లిప్స్ను అధికారులు శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,71,520 నూతన కార్డు జారీ చేయగా.. ఇప్పటి వరకు 3,43,619 కార్డులను పంపిణీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 35,78,458 ఓటర్ స్లిప్పులను జారీ చేయగా ఇప్పటి వరకు 26,94,821 స్లిప్పులు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 8,286 మంది బ్లైండ్ ఓటర్లకు బ్రైయిలీ స్లిప్స్ జారీ చేయగా ఇప్పటి వరకు 6,563 పంపిణీ చేశారు. కొత్తగా ఆరు పోలింగ్ కేంద్రాలు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4052 పోలింగ్ కేంద్రాలు ఉండగ వాటికి అదనంగా మరో 6 కేంద్రాలకు ఎన్నికల కమిషన్ అనుమతి జారీ చేసింది. దీనితో జిల్లా వ్యాప్తంగా మొత్తం 4058 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక పోలింగ్ కేంద్రంలో 1600 ఓటర్లు దాటి ఉన్న 39 పోలింగ్ కేంద్రాలను విభజించాలని ఎన్నికల కమిషన్ను కోరగా.. అందులో కేవలం 6 కేంద్రాలకు కమిషన్ అనుమతి జారీ చేసింది. గాజువాక నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం నంబరు 54, 157ను, భీమిలి నియోజకవర్గంలో 224, 255, 289, 311 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ గుర్తుంపు కార్డులతో ఓటు వేయవచ్చు ♦ ఆధార్ కార్డు ♦ పాస్పోర్ట్ ♦ డ్రైవింగ్ లైసెన్స్ ♦ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు(ఫొటోతో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డు) ♦ ఫొటోతో కూడిన బ్యాంకు/పోస్టాఫీసు పాస్బుక్ ♦ పాన్ కార్డు ♦ ఎన్ఆర్సీ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్కార్డులు ♦ ఉపాధి హామీ జాబ్కార్డు ♦ కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్ ఇన్యూరెన్స్ స్మార్ట్ కార్డు ♦ ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్ ♦ ఎంపీ, ఎమ్మెల్యేలకు జారీ చేయబడిన అఫిషీయల్ ఐడీ కార్డు అదనంగా వీవీప్యాట్లు కావాలి: కలెక్టర్ ఈవీఎంలకు సంబంధించి అదనంగా వీవీ ప్యాట్లు అవసరం ఉందని, వాటిని అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జిల్లా ఎన్నికల అధికారి కె.భాస్కర్ కోరారు. ఆదివారం సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పించామన్నారు. ఈ సమావేశంలో నగర్ పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, ఎస్పీ బాబూజీ పాల్గొన్నారు. శాంతి, భద్రతలకు పటిష్ట ఏర్పాట్లు పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ఎన్నికల నేపథ్యంలో శాంతి, భద్రతలు పటిష్టంగా అమలు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విశాఖ పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా అన్నారు. సిటీ పరిధిలో 333 కేసులకు సంబంధించి 3,393 మందిని బైండోవర్ చేశామని, ఎంసీసీ అతిక్రమించినందుకు 64 కేసులను బుక్ చేశామన్నారు. 819 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మొత్తం 5 వేల 922 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. -
ఓటు అంటేనే భయం.. భయం..
సాక్షి, మార్కాపురం (ప్రకాశం): పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్, అధికార యంత్రాంగం, పోలీసు బందోబస్తు, అత్యాధునిక టెక్నాలజీ, మీడియా వంటివన్నీ ఉన్నాగానీ, ఓ చిన్న గ్రామంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భయపడుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలతో కొన్నేళ్లుగా ఇష్ట్రపకారం ఓటు వేయలేకపోతున్నారు. బెదిరింపులకు భయపడి ఇష్టంలేని వ్యక్తులకు ఓటేస్తున్నారు. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ పంచాయతీలో నెలకొన్న ఈ పరిస్థితి ఎన్నికల కమిషన్, అధికారులు, పోలీసుల పనితీరుకు సవాల్ విసురుతోంది. చిన్నపాటి గ్రామమైన గొట్టిపడియలో 1,541 ఓట్లు ఉన్నాయి. పోలీసు రికార్డుల్లో ఫ్యాక్షన్ విలేజ్గా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉంది. ఆ గ్రామంలో కొన్నేళ్లుగా వర్గపోరు జరుగుతోంది. ఎన్నికలు వస్తే ఒక వర్గానికి చెందిన ప్రజలు భయం, ఆందోళనకు గురవుతుంటారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వేసుకోలేని పరిస్థితి. అధికార పార్టీకి చెందిన ఒక వర్గం నాయకులు గత ఎన్నికల్లో కొంతమంది దళితులు, మరికొంతమంది బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్ కేంద్రంలో ఎవరికి ఓటు వేసేది తమకు చూపించాలని బెదిరించారు. దీంతో కొంత మంది గ్రామస్తులు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో తామంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల కమిషన్తో పాటు మార్కాపురం ఆర్డీఓ, డీఎస్పీకి వినతిపత్రాలు పంపారు. టీడీపీ నేతలు తమను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, చర్చికి వచ్చి బైబిల్ పట్టుకుని తాము చెప్పినట్లుగా ఓటు వేస్తామని ప్రమాణం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పలువురు దళితులు ఆరోపిస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని 85, 86 పోలింగ్ బూత్లు గొట్టిపడియ పంచాయతీలోకి వస్తాయి. ఈ గ్రామంలో గొట్టిపడియతో పాటు అక్కచెరువు తండా ఉంది. పోలింగ్బూత్ 85లో 783, 86లో 755 ఓట్లు ఉన్నాయి. ఇటీవల మరో 25 ఓట్లు అదనంగా చేరాయి. ఆ వివరాలను ఓటర్ల జాబితాలో ప్రచురించాల్సి ఉంది. 20 ఏళ్లుగా స్వేచ్ఛ లేదు... గొట్టిపడియలోని బూత్ నంబర్ 85, 86లో ఓటింగ్ ప్రక్రియ స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన తుమ్మా వెంకటరెడ్డి, గాలెయ్య, సుబ్బారెడ్డి, పుప్పాల దావీదు, నాగూర్, ఏసు, వెంకటేశ్వరరెడ్డి, కాశయ్య, రాజారావుతో పాటు మొత్తం 42 మంది గ్రామస్తులు సంతకాలు చేసి కలెక్టర్, ఈసీకి పంపారు. గత 20 ఏళ్ల నుంచి తామంతా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలను, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీకి చెందిన బూత్ ఏజెంట్లే తమ ఓట్లు వేస్తున్నారన్నారు. అదేంటని ప్రశ్నిస్తే మా ఇష్టమని బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. మిగిలిన వారు కూడా ఎవరికి ఓటు వేసేది పోలింగ్ కేంద్రంలో కూర్చున్న అధికారపార్టీ ఏజెంట్లకు చూపించి వేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు కాకుండా వేరే పార్టీ వారికి ఓటు వేసి బయటకు వస్తే తమపై దాడులకు దిగుతున్నారని తెలిపారు. అప్పట్లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోలేదన్నారు. వివాదాస్పద బూత్ ఏజెంట్లను నియమించవద్దని కోరారు. పోలింగ్ కేంద్రానికి ఆనుకుని టీడీపీ కార్యాలయం ఉందని, పోలింగ్ జరిగే రోజు అక్కడ ఆ పార్టీ కార్యకర్తలు ఉండకుండా 100 మీటర్ల దూరం వరకూ నిలువరించాలని గ్రామస్తులు రాసిన లేఖలో కోరారు. ఓటింగ్ ప్రక్రియను సీసీ కెమేరాలతో రికార్డు చేయాలని, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక చర్యలు తీసుకోవాలి గొట్టిపడియ, అక్కచెరువు తండాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నా.. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలన్నా ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. లేదంటే అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా మేము ఓటు వేయాల్సిందే. మాకు అదనంగా రక్షణ కల్పించాలి. – మేఘావత్ రాములు నాయక్, అక్కచెరువుతండా అదనపు పోలీసులను నియమించాలి 85, 86 పోలింగ్ బూత్లలో ప్రశాంతంగా ఓటు వేసుకునే పరిస్థితి ఉండాలంటే అదనంగా పోలీసులను నియమించాలి. లేదంటే గత ఎన్నికల్లోలాగే మేము భయంతో ఇష్టంలేని వారికే ఓటు వేయాల్సి వస్తుంది. ఈసారి అటువంటి పరిస్థితి మాకు వద్దు. మా ఇష్టం వచ్చిన వారికి మేము ఓటు వేసుకోవాలి. – ఎం.బాలునాయక్, అక్కచెరువుతండా బెదిరింపులు ఆపాలి ఎన్నికలంటే మా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంటుంది. మా ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకోలేని పరిస్థితి మాది. దీనికి వ్యతిరేకంగా పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ నేతల బెదిరింపులు లేకుండా చూడాలి. గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి మాలో ధైర్యం నింపాలి. – కుందురు నడిపి కొండారెడ్డి, గొట్టిపడియ ప్రశాంతంగా ఓటు వేసుకోనివ్వాలి మా గ్రామంలో మమ్మల్ని ప్రశాంతంగా ఓటు వేసుకోనిచ్చే పరిస్థితి కల్పించాలి. గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు, బెదిరింపులకు ఓటర్లు భయపడుతున్నారు. స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాలి. – తుమ్మా వెంకటరెడ్డి, గొట్టిపడియ -
ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, మహబూబ్నగర్ : మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈనెల 11న జరగనున్న ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో విద్యుత్, ఫర్నీచర్, తాగునీటి వసతి, గదులు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. వికలాంగులు ఓటు వేసేందుకు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక ర్యాంప్లు నిర్మించారు. స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునేలా అధికారులు ఇదివరకే గ్రామాలు, పట్టణంలో ఓటర్లకు అవగాహన కల్పించారు. బీఎల్ఓలు, వీఆర్ఓలు, సూపర్వైజర్ల ద్వారా విస్తృతంగా ఓటుహక్కు ప్రాముఖ్యతపై వివరించిన అధికారులు ఓటరు స్లిప్పులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.26లక్షల మంది ఓటర్లు మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 2,26,399 మంది ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2,12,851 మంది ఓటర్లుగా నమోదు కాగా ప్రస్తుతం 13,548 మంది కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,13,248 మంది పురుషులు, 1,13,143 మంది మహిళలు, 8 మంది ఇతరులతో కలిపి మొత్తం 2,26,399 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన పోలింగ్ కేంద్రాలు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 263 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు 268పోలింగ్ కేంద్రాలకు పెంచారు. గతంతో పోల్చితే ఈసారి 5కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు. ఇందులో మహబూబ్నగర్ అర్బన్లో 184, మహబూబ్నగర్ రూరల్లో 37, హన్వాడ మండలంలో 47 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెరిగిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక వసతులు దివ్యాంగుల ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వారి కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ర్యాంపులతో పాటు వీల్చైర్లను సమకూర్చనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు అదే తరహాలో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా వికలాంగులను గుర్తించి వారికి అవవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించి ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై నిఘా అదేవిధంగా, సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పారా మిలటరీ బలగాలతో ఫ్లాగ్మార్చ్ నిర్వహించిన అధికారులు ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటరు విధిగా ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వికలాంగుల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్ల ఏర్పాటుతో పాటు వీల్చైర్లను సమకూర్చుతున్నాం. పోలింగ్ సిబ్బందికి కూడా అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాం. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని అధికారులకు సహకరించాలి. – వెంకటేశం, తహసీల్దార్, మహబూబ్నగర్ అర్బన్ -
మేము ఓటేసేదెలా..?
సాక్షి, దర్శి టౌన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ విధుల్లో అధికారులు, సిబ్బందిని నియమించే విషయంలో హడావిడిగా తీసుకుంటున్న నిర్ణయాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా వైద్యారోగ్య సిబ్బందిని, డాక్టర్లను పోలింగ్ విధులకు కేటాయించినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకపోవడంతో ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. జిల్లాలో 14 సీహెచ్సీలు, 90 పీహెచ్సీలు ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న దాదాపు 2,973 మంది ఆశా కార్యకర్తలు, ఎంపీహెచ్ఈఓలు, హెచ్ఎస్లు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందిని మార్చి 26న పోలింగ్ విధులకు నియమించారు. వీరందరికీ పోస్టల్ బ్యాలెట్లు కేటాయించారు. అయితే, మరో 309 మంది ఆరోగ్య కార్యకర్తలు, హెచ్ఈఓలు, హెచ్ఎస్లను రెండు రోజుల క్రితం (గత నెల 31వ తేదీ) పోలింగ్ బూత్లలో విధులకు నియమించారు. ఏప్రిల్ 1వ తేదీ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మరో 1,500 మంది ఆరోగ్య సిబ్బందిని, 150 మంది వైద్యాధికారులను పోలింగ్ బూత్ల వద్ద అత్యవసర సేవలు అందించడానికి నియమించారు. ఆయా పీహెచ్సీల పరిధిలోని పోలింగ్ బూత్ల వద్ద డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య సిబ్బంది, సూపర్వైజర్లు విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ, వీరెవరికీ పోస్టల్ బ్యాలెట్లు కేటాయించలేదు. దీంతో మొత్తం 1959 మంది డాక్టర్లు, సిబ్బంది తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవా లంటూ ఆందోళన చెందుతున్నారు. స్వస్థలాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి ఇబ్బందే... వైద్యాధికారులు, సిబ్బంది ఎక్కడెక్కడో పనిచేస్తుండగా, వారిలో పనిచేసే ప్రాంతంలో కాకుండా ఎక్కడెక్కడో స్వస్థలాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి పోలింగ్ విధుల కారణంగా ఓటేయడం ఇబ్బందిగా మారే పరిస్థితి నెలకొంది. వైద్యాధికారులు, సిబ్బందిలో ఎక్కువ మంది పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉండటం లేదు. సమీపంలోని పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటూ పనిచేసే ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి వారంతా ఉదయాన్నే వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో, స్వస్థలాల్లో ఓటు హక్కును వినియోగించుకుని అనంతరం పోలింగ్ విధులకు హాజరుకావాలి. అలా చేయాలంటే సమయానికి పోలింగ్ విధులకు హాజరవడం జరగని పని. పోలింగ్ విధులకు సకాలంలో హాజరు కావాలంటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో పోలింగ్ విధులకు నియమించిన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. ఓటు వేసి వెంటనే విధులకు హాజరుకావాలి పోలింగ్ విధులకు నియమించడి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది అందరూ తొలుత వారి ఓటు వేసి ఆ వెంటనే పోలింగ్ బూత్ల వద్ద విధులకు హాజరుకావాలని డీఎంఅండ్హెచ్ఓ రాజ్యలక్ష్మి తెలిపారు. దూరప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించగా, పోలింగ్ విధులకు మాత్రం కచ్చితంగా అందరూ హాజరుకావాల్సిందేని స్పష్టం చేశారు. - డీఎంఅండ్హెచ్ఓ -
ప్రధానికి క్రికెటర్ అశ్విన్ ట్వీట్
ఈ నెలతో పాటు మే నెలలో జరిగే లోక్సభ ఎన్నికల సమయంలో తాము ఎక్కడ ఉంటే అక్కడే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని క్రికెట్ ఆట గాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు అశ్విన్ ప్రధానికి ట్వీట్ చేశాడు. ఎన్నికలు జరిగే సమయంలో ఐపీఎల్ జరుగుతోంది. దానిలో భాగంగా భారత జట్టు దేశంలోని వివిధ నగరాల్లో ఆడవలసి వస్తుంది. ఈ పోటీలు జరిగే సమయంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు తాను నివసించే పట్టణంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల క్రికెటర్లకు ఓటు వేసే అవకాశం ఉండదు. అయితే, తాము ఓటు తప్పని సరిగా వేయాలని, అందుకోసం తామున్న చోటే ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయన ప్రధానిని కోరారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని అశ్విన్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. -
అందరి ‘నోటా’ వింటున్న మాట
సాక్షి, శ్రీకాకుళం: మాటలు మార్చేవారు కొందరు... ప్రలోభాలు పెట్టేవారు ఇంకొందరు... నేర చరిత్ర కలిగినవారు మరికొందరు... ఇటువంటి లక్షణాలు కలిగిన రాజకీయ పార్టీల నేతలను ఓటర్లు నోటా రూపంలో తిరస్కరిస్తున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకుగాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో 8,998 ఓట్లు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 6,133 ఓట్లు నోటాకు పడ్డాయి. ఈ విధానం తక్కువ మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు, అక్కడ ఓడిన అభ్యర్థుల తలరాతను మార్చేసింది. ఈ దఫా నోటా ఓట్లు కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగైతే పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిత నోటా ఓటుపై ఆధారపడి ఉంది. ► ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే, ఓటు ఎవ్వరికి వేయాలన్న సందిగ్ధంలో చాలా మంది పోలింగ్ కేంద్రానికి రావడం మానేస్తున్నారు. ఆ సందేహాన్ని వీడుతూ అందర్ని పోలింగ్ కేంద్రానికి రప్పించేందుకు 2014లో ఎన్నికల సంఘం ఈవీఎంల్లో కొత్తగా ఒక బటన్ను పరిచయం చేసింది. దాని పేరు నోటా. అంటే ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ (పై వారిలో ఎవ్వరూ లేరు) ఈవీఎంలో చివరి బటన్ను నోటాకు కేటాయించారు. అర్హులైన అభ్యర్థులు లేరని ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు నోటా మీటను ఉపయోగించుకుంటున్నారు. పరిచయమైన తొలి సంవత్సరం ఎన్నికల్లోనే నోటాను లక్షల మంది ఓటర్లు వినియోగించుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అసెంబ్లీ స్థానాల వారీగా పడిన నోటా ఓట్లు అసెంబ్లీ స్థానం నోటా ఓట్లు ఇచ్ఛాపురం 951 పలాస 934 టెక్కలి 770 పాతపట్నం 928 శ్రీకాకుళం 1,106 ఆమదాలవలస 665 ఎచ్చెర్ల 749 నరసన్నపేట 819 రాజాం 694 పాలకొండ 1,382 2009 ఎన్నికల్లోనే అనుకున్నా... వాస్తవానికి 2009 ఎన్నికల్లోనే నోటాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం తొలిసారి సుప్రీం కోర్టుకు వివరించింది. అప్పటి ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినా, పౌరహక్కుల సంస్థ, పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో నోటాను అమలులోకి తీసుకురావాలంటూ 2013 పెప్టెంబర్ 27న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నోటా బటన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1.1 శాతం అంటే 60 లక్షల మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ఆ తర్వాత పలు అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో నోటాకు ఓటే వేసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు కలవరం ఎక్కువైంది. కొన్ని ప్రాంతాల్లో ఓడిన, గెలిచిన అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్లు తేడా కంటే నోటా ఓట్లు ఎక్కువగా పోలవుతుండటం గమనార్హం. పక్కనే తెలంగాణాలో నోటా ఓట్లు పెరిగాయి. 2014 ఎన్నికల్లో 1.25 లక్షల మంది నోటా ఓట్లు పోలవ్వగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2.2 లక్షల ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓటింగ్ శాతంలో నోటా ఏడో స్థానంలో ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓటు జిల్లాలో పడింది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిశీలిస్తే, నోటాకు 0.54 శాతం ఓట్లు పడ్డాయి. అంటే పోలైన ఓట్లలో నోటాకు 6,133 ఓట్లు పడ్డాయి. నోటాకి ఎందుకు వేయాలి.. ఆలోచించండి నోటాను విలువైన ఓటుగా పరిగణిస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. అభ్యర్థుల ఓట్లు కంటే ఎక్కువ నోటాకి వస్తే, తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. కాని అభ్యర్థుల కంటే నోటా ఓట్లు ఎక్కువ పోలైతే, మరోసారి ఎన్నికలు నిర్వహించి, ఆ అభ్యర్థులు కాకుండా వేరే వారిని నిలపాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఆ ఎన్నికల ఖర్చంతా ఆ రాజకీయ పార్టీలే భరించేలా చట్టాన్నీ చేయాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల తర్వాత పోలైన ఓట్ల జాబితాల్లో నోటాని చేర్చి ఎన్నికల సంఘానికి ఆయా జిల్లాల నుంచి పంపించారు. అయితే నోటా విలువైన ఓటు కాదని ఆ వివరాలు విడిగా పంపించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘాల కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు సమాచారం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు నోటాను ఒక విలువైన ఓటుగా భావించిన ఓటరు కంగుతిన్నారు. దీనిపై నిరసన వ్యాఖ్యలు వినిపించాయి. అందుకే ఓటుహక్కును ఏ విధంగాను దుర్వినియోగం చేయకుండా ఉన్న అభ్యర్థుల్లో మంచి అభ్యర్థికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఓటుహక్కు వినియోగించుకోవాలి. ఓటుహక్కు వజ్రాయుధం వంటిది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరూ సమర్థుల్లో.. మంచివారో.. ప్రజలకు మేలు చేసేవారెవరు వంటి గుణగణాలు పరిశీలించాలి. ఇవేమీ నచ్చకుంటే నోటాకు ఓటు వేయొచ్చు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విధానం కేవలం వ్యతిరేకత చూపించడానికే పనికొస్తుంది. ప్రజాస్వామ్యంతో ఓటుతోనే ప్రగతి సాధించాలి. అందుకే ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. – కూన అచ్యుతరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, బీఆర్ఏయూ -
ఓటెత్తాలి చైతన్యం
ఓటుహక్కు వినియోగించుకోవడంలో సిటీజనులు కాసింత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఎన్నిక వేళ ఓటు వేయడం పౌరులుగా తమ ప్రథమ కర్తవ్యమనే విషయానికి ప్రాధాన్యమివ్వడంలేదు. దీంతో ప్రతి ఎన్నికల్లో ఆశించినంత పోలింగ్ శాతం ఉండటంలేదు. గ్రేటర్ పరిధిలో 4 లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో హైదరాబాద్, సికింద్రాబాద్,మల్కాజిగిరి, చేవెళ్ల. ఇందులో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల ఓటర్ల పోలింగ్ శాతం మెరుగ్గా ఉన్నట్లుగణాంకాలు చెబుతున్నాయి. వచ్చే నెల 11న జరగబోయే లోక్సభ ఎన్నికల్లోనైనా మహానగర ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగాతరలివచ్చి ఓటెత్తేందుకుచైతన్యవంతం కావాల్సినఅవసరముంది. సికింద్రాబాద్లో దుస్థితి ఇలా.. సికింద్రాబాద్లోనూ ప్రతి ఎన్నికలోనూ పోలింగ్ శాతం తగ్గుముఖం పడుతోంది. గతంలో జరిగిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 1.87 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ స్థానాల పరిధిలో సుమారు 80 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో తమ ఓటుహక్కు వినియోగించుకునేవారు మాత్రం 60 శాతం లోపేనని గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, బల్దియా ఎన్నికలు నిరూపించాయి. పోలింగ్ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్ తదితర అసంఘటిత రంగాల ఉద్యోగులు, వేతన జీవులు పోలింగ్కు దూరంగా ఉంటుండడంతో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని సమాజంలో మార్పును తీసుకొచ్చే గురుతర బాధ్యతను విస్మరిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఈసారి ఓటర్లలో చైతన్యం నింపి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ పలు యాప్లను, చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. మహానగరం పరిధిలో గతంలో నాలుగు లోక్సభ స్థానాల్లో నమోదైన ఓట్ల శాతం ఇలా ఉంది. విస్తృత ప్రచారం.. ఓటరు చైతన్యం పెంచడం, ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్నికల కమిషన్ అధికారులు నగర వ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ఇటీవల శ్రీకారం చుట్టాయి. నూతనంగా ఓటర్లుగా నమోదు చేసే విషయంలో వివిధ రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరించి వయోజనులను ఓటర్లుగా నమోదు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాయి. ఓటర్లుగా నమోదైన వారు పోలింగ్ జరిగే ఏప్రిల్ 11న విధిగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చూడాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు. మల్కాజిగిరిలో పరిస్థితి ఇదీ.. మినీ ఇండియాగా పేరొందిన దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి లోక్సభ పరిధిలో గతంలో నమోదైన పోలింగ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. గతంలో జరిగిన రెండు లోక్సభ ఎన్నికల్లోనూ పోలింగ్ 51 శాతం దాటకపోవడం గమనార్హం. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 0.41 శాతం పోలింగ్ తగ్గడం గమనార్హం. 2009లో మొత్తం ఓట్లు: 23,43,050 ఓటేసినవారు: 12,05,714 2014లో మొత్తం ఓట్లు: 31,83,083 ఓటేసిన వారు: 16,24,859 (51.05శాతం) సికింద్రాబాద్లో దుస్థితి ఇలా.. సికింద్రాబాద్లోనూ ప్రతి ఎన్నికలోనూ పోలింగ్ శాతం తగ్గుముఖం పడుతోంది. గతంలో జరిగిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 1.87 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం. 2009లో సికింద్రాబాద్లో మొత్తం ఓట్లు: 15,74,818 పోలైన ఓట్లు: 8,65,038 (54.53 శాతం) 2014లో మొత్తం ఓట్లు: 18,93,741 ఓటేసిన వారు: 10,04,763 (53.30 శాతం) హైదరాబాద్లోనూ అత్యల్పమే.. హైదరాబాద్ నగరంలో సగం మంది ఓటర్లు పోలింగ్ రోజున ఇళ్లకు పరిమితమవడం, లేదా సెలవురోజు కావడంతో విహార యాత్రకు వెళుతుండడంతో ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్లు గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే అవగతమవుతోంది. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికల్లో 0.81 శాతం మేర పోలింగ్ స్వల్పంగా పెరగడం గుడ్డిలో మెల్ల. 2009లో మొత్తం ఓట్లు: 13,93,242 ఓటేసినవారు: 7,31,348(52.49 శాతం) 2014లో మొత్తం ఓట్లు: 18,23,217 ఓటేసిన వారు: 9,71,770(53.50 శాతం) చేవెళ్లలో చాలా నయం.. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో ఓటింగ్ శాతం నగరంలోని 3 లోక్సభ స్థానాల కంటే మెరుగ్గా నమోదవడం విశేషం. గతంలో జరిగిన రెండు లోక్సభ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో పోలింగ్ 60 శాతానికి పైగానే నమోదైంది. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 4.01 శాతం మేర పోలింగ్ తగ్గడం గమనార్హం. 2009లో మొత్తం ఓటర్లు: 16,81,664 పోలైన ఓట్లు: 10,85,000 (64.52 శాతం) 2014లో మొత్తం ఓట్లు: 21,85,164 పోలైన ఓట్లు: 13,22,312(60.51 శాతం) పోలింగ్ పెంపునకు చర్యలివీ.. వాదా యాప్: అంధులు, వృద్ధులు, గర్భిణులు రద్దీగా ఉండే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును తమకు వీలైన సమయంలో వినియోగించుకునేందుకు వారికి అనువైన స్లాట్ను ఈ యాప్ ద్వారా బుక్చేసుకోవచ్చు. వీరికి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేయడంతోపాటు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా వారికి పోలింగ్ సిబ్బంది సహకరించనున్నారు. నమూనా పోలింగ్ కేంద్రాలు: జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి.. నూతనంగా ఓటర్లుగా నమోదైన వారు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలి.. వీవీప్యాట్ యంత్రాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు. సీ విజిల్: ఎన్నికల్లో అక్రమాలు, వివిధ పార్టీల అభ్యర్థులు, క్యాడర్ చేసే అక్రమాలను ఎన్నికల సంఘం, బల్దియా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్ను ప్రారంభించారు. ఫోటోలు, వీడియోలను ఈ యాప్లో అప్లోడ్ చేస్తే చాలు అక్రమార్కులపై చర్యలు తథ్యం. సువిధ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అవసరమైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
వారి ఓటు ఏపీకా తెలంగాణకా
సుదీర్ఘకాలం తర్వాతఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం.. అక్కడా ఇక్కడాఓటు హక్కు ఉన్నవారు ఈసారివారి ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకోను న్నారా..అది ఎవరికి అనుకూలం.. మరెవరికి ప్రతికూలం అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీలకు అంతుచిక్కనిప్రశ్నగా ఉంది. మేడికొండ కోటిరెడ్డి, సాక్షి, అమరావతి :కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబరు–6లో ఓటు ఉన్న మహిళకే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పోలింగ్ బూత్–112లోనూ ఉంది. తెలంగాణలోనూ, ఏపీలో ఒకే రోజు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆమె ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటుందో..? తూర్పుగోదావరి జిల్లా తుని అసెంబ్లీ నియోజక వర్గంలోని పోలింగ్ బూత్–152లో ఓటున్న వ్యక్తికే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోనూ ఓటు ఉంది. అతడు ఈ ఎన్నికల్లో ఎక్కడ తన ఓటు హక్కు వినియోగించుకుంటాడో..? ♦ వాళ్లద్దరే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటున్న దాదాపు 18.50 లక్షల మంది ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు? ఈ అంశం ఇప్పుడు ఏ నియోజకవర్గ ఫలితాలను మార్చబోతుంది? ఏ అభ్యర్థి అదృష్టాన్ని వెక్కిరించబోతుంది? ఇప్పుడు.. రాష్ట్రంలో ప్రధాన పార్టీలను ఈ అంశమే ముప్పుతిప్పలు పెడుతోంది. గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి ! ఐదేళ్ల క్రితం వరకు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కొనసాగిన నేపథ్యంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతవాసులు లక్షల మంది విద్య, ఉపాధి అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉండే హైదరాబాద్కు వెళ్లి నివాసం ఉన్న ఉదంతాలున్నాయి. ఇలాంటివారిలో 18,50,511 మందికి 2019 జనవరికి ముందు ఎన్నికల సంఘం వద్ద సమాచారం మేరకు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని ఒక స్వచ్ఛంద సంస్థ తేల్చింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో పుట్టిన ప్రాంతంలోనూ, ఉపాధి కోసం వెళ్లి నివాసం ఉంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండుచోట్లా ఓటు నమోదు చేసుకున్నారు. రెండుచోట్ల ఓటు హక్కు ఉన్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు ప్రైవేట్ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అయితే, గత 20 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఒక్కటే అయినప్పటికీ, ప్రాంతాలవారీగా వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగాయి. 2004, 2009లో తెలంగాణ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కలిపి ఒకసారి, ఆంధ్రలో మిగిలిన ప్రాంతం రాయలసీమ జిల్లాలకు మరోసారి ఎన్నికలు జరిగాయి. 2014లో తెలంగాణ జిల్లాలకు ఎన్నికలు జరిగిన వారం రోజుల తర్వాత ఆంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఎన్నికలు జరిగాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్లో కూడా ఓటు హక్కు ఉన్నవారు మొదట తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకుని, తర్వాత ఆ ఓటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా ఉంది. అయితే, ఈసారి 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటిలోనూ మొత్తం 42 లోక్సభ స్థానాల పరిధిలో ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గతంలో రెండుచోట్ల ఓటు హక్కు వినియోగించుకునే వారు ఇప్పుడు ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడో ఒకచోటనే ఓటుహక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలవారే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నవారిలో ఎక్కువ మంది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వారేనని ఓ అంచనా ఉంది. 2006లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండేసి అసెంబ్లీ సెగ్మెంట్స్ తగ్గి.. ఆ మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగాయి. విజయనగరం, రాయలసీమ ప్రాంతాల వారు హైదరాబాద్లో ఉంటు న్నప్పటికీ, వారిలో ఎక్కువమంది తమ పుట్టిన ప్రాంతమైన రాయలసీమ, విజయనగరం జిల్లాల్లో ఒక్కచోట మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారని అంచనా ఉంది. అయితే, గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి హైదరాబాద్కు వెళ్లి తాత్కాలిక లేదా శాశ్వత నివాసం ఏర్పరచుకున్నప్పటికీ వారందరూ హైదరాబాద్తో పాటు తమ సొంత ఊరిలో కూడా ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువని అంచనా ఉంది. ఏపీలోనే ఓటు వేస్తే ప్రభావం ఏంటో..? తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో అక్కడ ప్రస్తుతం లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో మాత్రం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండుచోట్ల ఓటు హక్కు ఉన్నవారిలో ఎక్కువమంది ఈసారి ఏపీలో ఓటు వినియో గించుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రెండుచోట్ల ఓటు ఉన్నవారిలో ఎక్కువమంది హైదరాబాద్లో ప్రత్యేకించి కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, సనత్నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోనే ఉన్నారన్నది సమాచారం. హైదరాబాద్లో నివాసం ఉంటున్నవారు ఏపీలో ఓటుహక్కు వినియోగించుకుంటే.. అది టీడీపీకి వ్యతిరేక ప్రభావం చూపవచ్చంటున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. గ్యారంటీగా గెలుపుపై ఆశలు పెట్టుకున్న కూకట్పల్లి వంటి చోట కూడా టీడీపీ ఓటమి పాలైంది. -
మీ ఓటు వేరొకరు వేసినట్లు గుర్తిస్తే..
సాక్షి, సిటీబ్యూరో: పోలింగ్ ప్రక్రియలో చాలెంజ్ ఓటు అని ఒకటి ఉంది. ఓటరు జాబితాలో పేరుండి.. పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన తర్వాత ఆ ఓటు వేరొకరు వేసినట్లు గుర్తిస్తే సదరు ఓటరు వెనుదిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రిసైడింగ్ అధికారి వద్ద ఓటును చాలెంజ్ చేయవచ్చు. మొదటగా ఓటరు గుర్తింపును చాలెంజ్ చేసి ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు, వయసు తదితర వివరాలు సరిచూడాలి. ఇలా ఒక్కో అంశాన్ని చాలెంజ్ చేయవచ్చు. ప్రతి చాలెంజ్కు రూ.2 చెల్లించాలి. అధికారులు ప్రతి చాలెంజ్ను వరుస క్రమం పరిశీలిస్తారు. సదరు ఓటరు అన్ని ఆధారాలు చూపితే చాలెంజ్లో నెగ్గినట్లుగా భావించి ఓటు వేయడానికి అనుమతిస్తారు. చాలెంజ్ ఓటర్ల ఫాంలో ఓటరు వివరాలు నమోదు చేసి సంతకం తీసుకుంటారు. చాలెంజ్ చేసిన వ్యక్తి సరైన ఆధారాలతో రుజువు చేసుకోలేని పక్షంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఓటర్లను ప్రలోభపెడితే ఐదేళ్ల జైలు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా కులం, ధనం, బహుమానాల పేరుతో రాజకీయ పార్టీలు ప్రలోభపెడుతుంటాయి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంలో మార్గదర్శకాలను ప్రకటించింది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలని బెదిరించడం, బలవంతంగా ఓటు వేయించడం, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాలకు చెందిన ఓటర్లను ప్రలోభపెట్టడం నేరమని పేర్కొంది. ఓటర్లను ప్రలోభానికి చేస్తే గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా తప్పదు. -
కొత్త ఓటర్ల నమోదులో విశాఖ నంబర్ 1
సాక్షి, విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయమై ఓటర్లలో చైతన్యం బాగా వచ్చిం దని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఆయన సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తుది ఓటర్ల జాబితా వెల్లడించిన తర్వాత ఏకంగా రెండున్నర లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. అత్యధిక దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో విశాఖ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు తీసుకున్న దరఖాస్తుల్లో 1,81,189 మంది కొత్తవారికి ఓటుహక్కు కల్పిం చామని ఆయన చెప్పారు. తుది ఓటర్ల జాబితా సమయానికి 32,80,028 ఓట్లు ఉండగా, తాజాగా పెరిగిన ఓటర్లను బట్టి ఈ సంఖ్య 34,61,217కు చేరిందన్నారు. మరో 90 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, ఈనెల 25 వరకు వీటిని పరిశీలించే అవకాశం ఉండడంతో ఏప్రిల్ 11న ఓటుహక్కు వినియోగించుకునే తుది ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 15వ తర్వాత కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని, కానీ వాటిని ఎన్ని కల తర్వాతే పరిశీలించి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. ఊహించని స్పందన.. రానున్న ఎన్నికల్లో కొత్తగా వినియోగిస్తున్న వీవీ ప్యాట్లతో పాటు ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించి న మాక్ పోలింగ్కు ఊహించని స్పందన లభించిందని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. మార్చి ఒకటి నుంచి 10 వరకు జిల్లాలోని 4052 పోలింగ్ స్టేషన్లలో డెమోలు నిర్వహించామన్నారు. సుమారు 13.50లక్షల మంది అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 40 శాతం మంది ఓటు హక్కు వినియోగంపై అవగాహన పొందారన్నారు. ఇంతపెద్ద సంఖ్యలో డెమోలో పాల్గొన్న ఓటర్లు న్న జిల్లాగా కూడా విశాఖ రికార్డు సృష్టిం చిందన్నారు. పరిస్థితి చూస్తుంటే గతంలో నమోదైన పోలింగ్ శాతాన్ని అధిగమించి నూరుశాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఏలూరులో ఉన్న తన ఓటును విశాఖకు మా ర్పించుకున్నానని, ఎన్నికల్లో విధిగా ఓటుహక్కు వినియోగించుకుంటానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విని యోగించుకునేలా పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. 42 వేల మందికి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే 32వేల మంది పోలింగ్ సిబ్బం దితో పాటు బందోబస్తు నిర్వహించే మరో 10 వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశామని కలెక్టర్ వెల్లడిం చారు. వారు తాము ఏ కేంద్రంలో పనిచేయాలో ఇచ్చిన నియామక పత్రాన్ని జతచేసి కౌంటింగ్కు గంట ముందు వరకు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సారి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని పెంచారని కలెక్టర్ వెల్లడించారు. అరుకు, పాడేరు మిన హా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరి«ధిలో ఉద యం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వర కు పోలింగ్కు అనుమతిస్తారన్నారు. అదే అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్కు అనుమతించనున్నారన్నారు. అంతే కాదు గతంలో మాదిరిగా పోలింగ్ అనంతరం అరకు, పాడేరు నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలను స్థానికంగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారని, మర్నాడు వాటిని ప్రత్యేక బందోబస్తుతో జిల్లా కేంద్రానికి తరలిస్తారన్నారు. 10,105 మంది బైండోవర్ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలకులుగా 18 మందిని నియమించారన్నారు. 53 ప్లైయింగ్ స్క్వాడ్లు, 51 స్టాటిక్ సర్వలెన్స్ బృందాలు, 46 మోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్లు, 36 వీడియో సర్వలెన్స్ టీమ్లు, 18 చొప్పున వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. 399 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించగా, వారందరికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. 805 లైసెన్సడ్ ఆయుధాల్లో 650 ఆయుధాలను ఇప్పటి వరకు డిపాజిట్ చేశారన్నారు. 2595 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీచేశామని చెప్పారు. ఇప్పటి వరకు 10,103 మందిని బైండోవర్ చేశామన్నారు. కాగా ఇప్పటి వరకు 32,254.25 లీటర్ల మద్యం, రూ.22,50,630 నగదు, 80 వాహనాలను సీజ్ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు టటటటటటట13,651 పోస్టర్లు, 6644 హోర్డింగ్లు తొలగించామని, 931 విగ్రహాలకు ముసుగులు వేశామని, వివిధ పార్టీలకు చెందిన 13,511 జెండాలను, అలాగే 4314 వాల్ పెయింటింగ్లను కూడా తొలగించామన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఇదీ ఓటు కథ!
సాక్షి, సిటీబ్యూరో: లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నుంచి నామినేషన్లస్వీకరణ పర్వం ప్రారంభమైంది. దీంతో ఎన్నికలవేడి రాజుకుంది. ఎక్కడ చూసినా ఓట్ల గురించిన చర్చే సాగుతోంది. రాజకీయ నాయకులతో పాటు పౌరుల నాలుకలపైనా ఓటు అనే పదం నానుతోంది. అసలీ ఓటు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంగ్లేయుల పాలనలో మొదలు.. ఓటు వేయడమనేది ఆంగ్లేయుల పాలనా కాలంలోనే మొదలైనా ఆ తర్వాత అది ఓ రూపాన్ని సంతరించుకుంది. మన దేశంలో బ్రిటిష్ వారి పాలనలో భారతీయులకు పరిమితంగానే కల్పించిన ఓటుహక్కును భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు కలసాకారమైంది. భారత పౌరులందరికీ ఓటు.. 1907లో ఏర్పడిన రాయల్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుపై చేసిన సిఫార్సుల ఆధారంగా 1909 కౌన్సిల్ చట్టం పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటుహక్కు వచ్చింది. 1919 కౌన్సిల్ చట్టం ఓటుహక్కును కొంత మేర విస్తృతపరిచింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటుహక్కు దేశ జనాభాలో 10.5 శాతానికి పెరిగింది. 1947లో రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సందర్భంగా దీనిని 28.5 శాతానికి పెంచారు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి, రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించారు. 21 నుంచి 18 ఏళ్లకు.. 1952లో సాధరణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 కింద సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. 21 ఏళ్లు పైబడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి రాజీవ్గాంధీ ప్రభుత్వం ఓటుహక్కు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ప్రజాసామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి ఒక వ్యక్తికి ఒక ఓటును మాత్రమే కల్పించారు. ఆర్టికల్ 325 ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంత, లింగభేదాలు వంటి తేడాలతో ఏ వ్యక్తికీ ఓటుహక్కునునిరాకరించకూడదు. -
‘నా ఓటు’లో సమస్త సమాచారం
సాక్షి, సిటీబ్యూరో: లోక్సభ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ‘నా ఓటు’ అనే యాప్ను ప్రవేశపెట్టి.. ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పోలింగ్ కేంద్రం, ఓటరుతో పాటు సమాచారాన్ని తెలుసుకునే విధంగా డిజైన్ చేశారు. స్మార్టుఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ సమయంలో ఓటుహక్కును సులువుగా వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో పొందుపరిచిన అంశాలు ఓటర్లను చైతన్యం చేసే విధంగా ఉన్నాయి. సమాచారం ఇలా.. ఈ యాప్ ద్వారా సమగ్ర సమాచారాన్ని ‘ఓటరు అన్వేషణ’ తో çపూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. గ్రామం, వయస్సు, పేరు, తండ్రి, లింగం, జిల్లా, నియోజకవర్గం నమోదు చేస్తే అన్ని వివరాలు తెరపై కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటీ కార్టు (ఎపిక్) సంఖ్యతో సహా కేంద్రం వివరాలు వస్తాయి. ఒక వేళ ఇవన్నీ కాకున్నా ఎపిక్ సంఖ్య నమోదు చేసినా ఓటరు వివరాలు పూర్తిగా తెలుస్తాయి. దివ్యాంగుల కోసం నాఓటు యాప్లో ‘పికప్ సర్వీస్’ అనే ఆప్షన్ ఉంది. వారు తమ ఎపిక్ నంబర్ నమోదు చేస్తే నిర్దేశిత బీఎల్ఓకు పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలనే సమాచారం వెళుతుంది. దీనికోసం దివ్యాంగుల ఫోన్ నెంబర్ అనుసంధానం చేసి ఉండాలి. అలా లేకపోయినా సంబంధిత బీఎల్ఓకు ఫోన్చేస్తే వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తారు. ప్రభుత్వం పంపిణీ చేసే ప్రతి ఓటరు చీటీపై సంబంధిత బీఎల్ఓ నంబర్ ఉంటుంది. ఇందుకోసం పీడబ్ల్యూడీ వలంటీర్లను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. తమ పోలింగ్ కేంద్రం పేరును నొక్కితే ఆ కేంద్రంలోని సంబంధిత వలంటీర్ పేరు, హోదా, ఫోన్ నంబర్ తెరపై ప్రత్యక్షమవుతుంది. దివ్యాంగులు వలంటీర్లకు ఫోన్చేస్తే.. వారు ఓటర్ల వద్దకు వెళ్లి, ప్రత్యేక వాహనంలో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేరుస్తారు. అభ్యర్థుల వివరాలు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు యాప్లో కనిపించనున్నాయి. ఇందులో జిల్లా ఎన్నికల ఆఫీసర్, ఆయా నియోజక వర్గాల ఆర్వోల పేర్లు, ఫోన్ నంబర్లతో పాటు ఈ– మెయిల్ వివరాలు కూడా ఉంటాయి. వీటితో పాటు ఎన్నికల షెడ్యూల్ మొదలు, ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏఏ తేదీల్లో ఏ కార్యక్రమం ఉంటుందనే సమాచారం యాప్లో పొందుపరిచారు. కేంద్రానికి ఎలా వెళ్లాలంటే... ఈ యాప్లో పోలింగ్ రూట్ మ్యాప్ తెలిపే ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఓటర్లు తాము ఉన్న ప్రదేశం నుంచి నిర్దేశిత పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి రూట్ మ్యాప్తో పాటు చిరునామా కనిపిస్తుంది. సంబంధిత ఫోన్లో జీపీస్ కూడా పని చేయాల్సి ఉంటుంది. యాప్ కింద భాగంలో పోలింగ్ స్టేషన్, పోలీస్స్టేషన్, బస్టాప్ వివరాలతో కూడిన ఆప్షన్లను ఎన్నికల సంఘం వారు ఉంచారు. ఓటర్లు తాము ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్స్టేషన్, బస్టాప్ వివరాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం ఈ ఏర్పాట్లు చేస్తుంది. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఓటు హక్కు.. వంద నోటు కాదు
సాక్షి, ములుగు: ఓటు హక్కు అంటే వంద రూపాయాల నోటు, లిక్కర్ బాటిల్ కాదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. డీఆర్డీఏ తరఫున మండలంలోని జాకారం సాంఘిక సంక్షేమ శాఖ గురుకులం విద్యార్థులతో ఆదివారం ఏర్పాటు చేసిన ఓటు హక్కు వినియోగ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా సరైన నాయకుడిని ఎంచుకునే అవాకాశం ఉంటుందని అన్నారు. కొంతమంది ఓటు వేసే రోజును ప్రభుత్వ సెలవుదినంగా అనుకుంటున్నారని, ఆ ఆలోచనను మరిచి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వినియోగంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. ప్రలోభాల విషయంలో పౌరులు నేరుగా 1950 టోల్ ప్రీ నంబర్కి కానీ, ప్రత్యక్ష సమాచారాన్ని అందించడానికి నేరుగా సీ విజిల్ యాప్ ద్వారా కాని ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. సీ విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను జిల్లా యంత్రాంగం తరఫున గంటన్నర సమయంలో పరిష్కరిస్తామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటును వినియోగించే విధంగా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చేపట్టిన ఆటపాటలు అలరించాయి. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సంజీవరావు, డీపీఎం సతీష్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య, సీఐ సార్ల రాజు, తహసీల్దార్ భూక్యా గన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ దేశాల్లో ఓటు వేయకుంటే కఠిన చర్యలు
సాక్షి, చిట్యాల (నకిరేకల్) : మన ప్రజాస్వామ్య భారత దేశంలో ఓటు వజ్రాయుధం. ఓటు వేయటం ద్వారా మన భవిష్యత్ను మనమే నిర్ణయించుకోవచ్చు. కానీ మన దేశంలోని ఓటర్లు మాత్రం ఎన్నికల్లో ఆరవై శాతానికి మించి ఓటును వేయటం లేదు. దీంతో కొన్ని సార్లు చిత్తశుద్ధితో పనిచేసే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఎన్నిక కాకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడుతుండడమే కాకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఓటు వేయటం తప్పని సరి. ఒక వేళ ఓటు వేయకపోతే వారిపై కఠిన చర్యలు, శిక్షలను విధిస్తాయి. ఓటు తప్పనిసరి చేసిన దేశాలు ఆస్ట్రేలియా, అమెరికా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బెల్జియం, గ్రీస్, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పిన్స్, సింగపూర్, థాయ్లాండ్, టర్కీ, స్విర్జర్లాండ్, బ్రెజిల్, బొలీలియో వంటి దేశాలలో ఓటు వేయటం తప్పని సరి. ఈ దేశాలలోని అర్హులైన పౌరులు ఓటు వేయకపోతే వారిపై పలు రకాల చర్యలు, శిక్షలను, జరిమానాలను విధిస్తారు. బెల్జియంలో.. బెల్జియం దేశంలో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోకపోతే రెండు నుంచి నాలుగు వేల యూరోలు (భారత కరెన్సీలో రూ.3 లక్షలకుపైగా) జరిమానా, రెండోసారి ఓటు హక్కును వినియోగించుకోకపోతే పది వేల యూరోలు (భారత కరెన్సీలో 8 లక్షలకు పైగా) జరిమానా విధిస్తారు. వరుసగా నాలుగు సార్లు ఓటు హక్కును వినియోగించుకోకపోతే పది సంవత్సరాల పాటు వారి ఓటు హక్కును తొలగిస్తారు. అంతేకాకుండా వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, సదుపాయాలు, పథకాలను తొలగిస్తారు.భారీగా జరిమానా విధిస్తుంది. సింగపూర్లో.. వేగంగా ఆభివృద్ధి చెందిన దేశాలలో సింగ్పూర్ ఒకటి. ఈ దేశంలో ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పని సరి. ఈ దేశంలో ఒక్కసారి ఓటు హక్కును వినియోగించుకోకపోయినా వారి పేరు ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. మరలా ఓటు హక్కును పునరుద్ధరించాలంటే ఓటు వేయకపోవడానికి సరైన కారణం చూపాల్సి ఉంటుంది. గ్రీస్లో.. గ్రీస్ దేశంలో ఓటు హక్కును వినియోగించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఓటు హక్కును వినియోగించుకోని వారి పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సదుపాయాలను కోల్పోవాల్సి వస్తుంది. అమెరికాలో.. అమెరికా వంటి దేశంలో పోలింగ్ రోజు ఎలాంటి హడావుడి ఉండదు. అంతేకాకుండా పోలింగ్ రోజు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆఫీసులకు, పాఠశాలలకు సెలవులు ఉండవు. అయినా 75 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుంది. ఇక్కడ కూడా ఓటు వేయకపోతే వారికి కొన్ని పథకాలను తొలగిస్తారు. ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఆస్ట్రేలియాలో.. ఆస్ట్రేలియా ఎన్నికల్లో తొంబై ఆరు శాతానికిపైగా పోలింగ్ నమోదవుతుంది. ఈ దేశంలో ఎన్నికలు మొదలయ్యే కొన్ని నెలల ముందు నుంచే అక్కడి అధికారులు ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఇక్కడే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. లేనట్లయితే ఓటు వేయని వారిని గుర్తించి వారికి అక్కడి ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది. -
థర్డ్ జండర్కు ఓటు హక్కు
సాక్షి,నెల్లూరు: భారత ఎన్నికల కమిషన్ పురుషులు, మహిళలతో పాటు థర్డ్ జండర్కు ఓటు హక్కు కల్పించింది. 2009 ఎన్నికల ముందు థర్డ్ జండర్కు ఓటు హక్కు లేదు. థర్డ్ జండర్లలో అవగాహన పెరగడం, సమాజంలో అందరితో సమానంగా జీవనం సాగిస్తున్నామని వారు అందోళన కార్యక్రమాలు చేశారు. దీంతో థర్డ్ జండర్కు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మంజూరు చేశారు. వాటి ఆధారంగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించారు. 2009 ఎన్నికల నుంచి థర్డ్ జండర్కు ఓటు హక్కు కల్పించారు. 2014 ఎన్నికల నాటికి జిల్లాలో 298 మంది ఓటు హక్కు పొందారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 338 మంది ఓటు హక్కు పొందారు. -
సమయం లేదు మిత్రమా
సామాన్యుడి చేతిలో ఓటు వజ్రాయుధం. నేతల తల రాతలు మార్చాలన్నా.. నచ్చిన నాయకుడిని ఎంచుకోవాలన్నా ఓటే మూలం. ఐదేళ్ల పాటు పీఠంపై ఉండే పాలకులను ఎన్నుకునేందుకు ఇది సువర్ణావకాశం. ఈ క్రతువులో దిగ్విజయంగా పాల్గొనాలంటే ఓటరు జాబితాలో పేరు ఉండాల్సిందే. ఇన్నాళ్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి పేజీలకు పేజీలు తిరగేసి జాబితాలో పేరు చూసుకునేందుకు కష్టాలు పడాల్సి వచ్చేది. యువకులు వీలున్నా వెళ్లలేకపోతుండగా, వృద్ధుల పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది.. అక్కడికి వచ్చే వారికి సమాధానం చెప్పలేక కోపగించుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. చిత్తూరు కలెక్టరేట్ : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫారం–7 ను ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఓట్లు తొలగించేందుకు కొందరు కుట్రపన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమకు ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటి పట్టునే ఉండి జాబితాను సరిచూసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిం చింది. పేరు, పోలింగ్ కేంద్రం, చిరునామా వంటి వివరాలన్నింటినీ ఇంటి వద్దే ఉండి తెలుసుకోవచ్చు. టెక్నాలజీపై పట్టులేని వారికోసం 1950 కాల్సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ నంబర్కు కాల్చేసి కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఎలా అంటారా..మీరే చదవండి.. మీ ఓటు చూసుకోండిలా.. ♦ గూగుల్ సెర్చ్లోకి వెళ్లి http://ceoandhra.nic.in పేజీలో లాగిన్ అవ్వాలి. ♦ వెంటనే రాష్ట్రాల ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్పేజీ కనిపిస్తుంది. ♦ సెర్చ్ యువర్ నేమ్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అసెంబ్లీ నియోజకవర్గం అనే ఆప్షన్ వస్తుంది. ♦ ఒకవేళ వెబ్ పేజీ హిందీ పేజీలో ఉంటే ట్రాన్స్లేట్ ఆప్షన్స్ను ఎంపిక చేస్తే ఇంగ్లిష్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి. ♦ తర్వాత పేజీలో మీ పేరు, తండ్రి, భర్త పేరు, వయసు, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎంపిక చేసుకోవాలి. ♦ వివరాలన్నీ నింపిన తర్వాత వెబ్పేజీకి కుడివైపు కింద భాగంలో చప్టా (అల్ఫాబెట్స్, అంకెలతో ఉంటుంది)ను నమోదు చేయాలి. ♦ చివరిగా సెర్చ్ బటన్ను క్లిక్ చేయాలి. ♦ వెంటనే మీరు పైన నింపిన వివరాలతో పాటు మీ ఓటరు సంఖ్య, ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం చిరునామా సులువుగా తెలిసిపోతాయి. ♦ ఆండ్రాయిడ్ మొబైల్ ఉండే ప్రతి ఒక్కరూ ఫోన్లోనే వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. అందుకోసం Vౖఖీఉఖఏఉఔ్కఔఐNఉ అనే యాప్ను విడుదల చేశారు. ఆ యాప్లో పేరు, తండ్రిపేరు, వయస్సు, అసెంబ్లీ నియోజకవర్గం నమోదు చేస్తే చాలు ఓటు ఉందో లేదో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటు ఉంటే అదే యాప్ ద్వారా ఎపిక్ కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు పొందడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం చివ రి అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికి ఓటు హక్కు పొందని వారు ఈనెల 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఓటు నమోదు కోసం ప్రచారం చేశాం. కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాం.– పీఎస్.గిరీష,జిల్లా డెప్యూటీ ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ కొత్తఓటు నమోదు ఈనెల 15 వరకే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వారికి ఎన్నికల సంఘం మరో చివరి అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు ఆఖరి అవకాశాన్ని ఇచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఎన్నికల్లో అవకాశం ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ ద్వివేది వెల్లడిం చారు. జిల్లాలో ఇప్పటికీ ఓటు నమోదు చేసుకోని వారు, రకరకాల కారణాలతో ఓటు లేని వారు ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 18 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఈ నెల 15వ తేదీ వరకు నూతనంగా ఓట్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 2019 జనవరి 01 నాటికి 18 సంవత్సరాలు వయసు నిండిన వారు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏయే ఫారంలు దేనికోసం.. ఓటరుగా నమోదయ్యే వారు, ఇప్పటికే ఓటు ఉండి చేర్పులు మార్పులు చేసుకోవాల్సిన వారు ఏయే ఫారంను దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ♦ ఫారం–6 : నూతన ఓటు నమోదు, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారిన వారి కోసం. ♦ ఫారం–7: ఓటు తొలగింపు, ఆక్షేపణలు. ♦ ఫారం–6ఏ: ఓవర్సిస్ ఓటర్ నమోదు ♦ ఫారం 8: పేరు తదితర వివరాల సవరణ కోసం. ♦ ఫారం 8 ఏ : నియోజకవర్గం పరిధిలోని నివాసం మార్పుకోసం దరఖాస్తులను వినియోగించుకోవాల్సి ఉంటుంది. -
మీకు ఓటుందా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మీరు ఓటరుగా నమోదయ్యారా? ఓటు ఉంటే.. ఎక్కడ ఓటరుగా నమోదయ్యారు? అనేది మీకు తెలియదా. ఏం పర్వాలేదు. వెంటనే మీ మొబైల్ నుంచి 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే చాలు. కాల్ సెంటర్ ప్రతినిధులు ఇట్టే చెప్పేస్తారు. ఇందుకోసం మీరు చేయాల్సింది.. మీ ఓటరు గుర్తింపు కార్డు నంబర్ చెప్పడమే. ఒకవేళ ఓటు కలిగి లేకుంటే ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదు కావడానికి ఈనెల 2, 3 తేదీల్లో బూత్ స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 3,300 పోలింగ్ బూత్లలో ఓటరు నమోదుగా కావొచ్చు. ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటరు నమోదు చేసుకునేందుకు అర్హులు. వయసును నిర్దరించే ఏదేని ధ్రువీకరణ పత్రం ఉండటంతోపాటు స్థానికంగా నివసిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఇప్పటికే ఓటు హక్కు కలిగిన వారు చేర్పులు మార్పులు కూడా చేసుకోవచ్చని ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. -
ఓటు నమోదుకు మరో అవకాశం
ఒంగోలు అర్బన్: ఓటు నమోదు, మార్పులు–చేర్పులకు ఈ నెల 23, 24 తేదీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపెయిన్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. స్థానిక ఏబీఎం కాలేజీ క్రీడా మైదానంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం మహిళలతో రంగోళి కార్యక్రమం నిర్వహించి ముగ్గులు వేయించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి ఓటరూ ఓటర్ల జాబితా, పోలింగ్ యంత్రాలపై అవగాహనతో ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సేవలను అందిస్తారని తెలిపారు. ముగ్గుల పోటీల్లో 402 మంది మహిళలు పాల్గొన్నారు. విజేతలు కె.సుబ్బలక్ష్మికి రూ. 5 వేలు, మణిమంజరికి రూ. 3 వేలు, ఎం.వెంకటలక్ష్మికి రూ. 2 వేలు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ రవి, డీడీ లక్ష్మీసుధ, ఐసీడీఎస్ పీడీ విశాలక్ష్మి, డీఎస్డీఓ యతిరాజు, డీఈఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు ఓటింగ్లోపాల్గొనాలి ప్లారమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టి పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటసుబ్బయ్య అన్నారు. ఈ మేరకు సీపిఓ కాన్ఫరెన్స్ హాలులో విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎంతమంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో గుర్తించి వారికి ప్రత్యేక ఏర్పాట్లతో ఓటు హక్కు వనియోగించుకునేలా చర్యలు చేపడతామన్నారు. వారికి అవసరమైన వీల్ ఛైర్స్, వలంటర్లీను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చూపులేని వారికోసం బ్రెయిలీ లిపి ద్వారా కూడా ఈవీఎంలతో ఓటు వేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 2019 ఎన్నికలు అందరికీ అందుబాటులో ఎన్నికలు అనే నినాధంతో భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి బి. శింగయ్య, సీపిఓ వెంకటేశ్వర్లు, టూరిజం అధికారి నాగభూషణం, స్టెప్ సిఈఓ రవి ఇతర అధికారలు పాల్గొన్నారు. -
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి
వైఎస్ఆర్ జిల్లా, రాజుపాళెం : ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని, రెండు, మూడు ఓట్లు ఉంటే నేరమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. రాజుపాళెం మండలంలోని వెంగళాయపల్లె, అయ్యవారిపల్లె గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని సవరణల తర్వాత ఎలక్షన్ కమిషన్ తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందేనన్నారు. వాటి ప్రకారం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 2,14,370 ఓట్లు ఉన్నాయన్నారు. అయితే నియోజకవర్గానికి సంబంధించి 9,871 ఓట్లు అర్హత లేనివి ఉన్నాయని చెప్పారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓట్లు ఉంటాయన్నారు. ఎవరిపై విమర్శలు చేయకుండా పార్టీలకతీతంగా, స్వచ్ఛందంగా అర్హత లేని ఓట్లను తొలగించాలని కోరుతున్నామన్నారు. వైఎస్ఆర్సీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి, స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఏస్ఏ నారాయణరెడ్డి, జిల్లా అ«ధికార ప్రతినిధి భాస్కర్, జిల్లా సేవాదళ్ ప్రెసిడెంట్ ధనిరెడ్డి కిరణ్రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లేజీ యూత్!
విద్యాధికులు, ఉద్యోగులు అధికంగా ఉండే నగరాల్లో ఓటు చైతన్యం కొరవడుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువుంటుంది. ఐదేళ్ల పాటు మనల్ని పాలించేవారిని ఎన్నుకోవడంలో ఓటు పాత్ర కీలకం. అయితే ఈ కీలక పాత్రను నేటి యువత విస్మరిస్తోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని చైతన్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఓటు వేయడంలో మాత్రం నగర యువత బద్ధకిస్తోంది. హైటెక్సిటీగా పేరొందిన మన భాగ్యనగరంలో దాదాపు 55 శాతం మంది యువత ఓటు విషయంలో అనాసక్తి చూపుతున్నారని ఓ సంస్థ సర్వేలో వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం, పలు స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యం పెరుగుతోంది. అయితే.. మెట్రో నగరాల్లో మాత్రం ఈ చైతన్యం పూర్తిగా కొరవడుతోంది. మరీ ముఖ్యంగా మెట్రో యువత ఓటువేయడాన్ని తమకు సంబంధం లేని అంశంగా చూస్తున్నారని ‘నెట్స్ అవే’ అనే సంస్థ తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైంది. నగరాల్లో ఉంటున్న వారు.. తమ ఓటుహక్కు నమోదు, ఓటేయడం,ఓటరు ఐడీకార్డును పొందడం వంటి విషయాల్లో వెనుకంజలో ఉన్నట్లు పేర్కొంది. ఈ సంస్థ తాజాగా ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు చెందిన యువతీయువకుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రశ్నావళి రూపొందించి..ఆన్లైన్లో వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ ఆన్లైన్ సర్వే ప్రకారం..పై అంశాల్లో బెంగళూరు యూత్ ముందువరుసలో ఉన్నారు. ఓటరు నమోదు, ఓటరు ఐడీకార్డులను పొందడం, ఓటు వేసేవారు ఈ సిటీలో 53 శాతం మేర ఉన్నట్లు వెల్లడైంది. ఇక 52 శాతంతో పుణే, ముంబైలు రెండోస్థానంలో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీలో 47శాతం మంది మాత్రమే ఈ అంశాలపై ఆసక్తి చూపుతుండడం గమనార్హం. హైదరాబాద్లో కేవలం 45 శాతం మందే ఓటింగ్ విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు తేలింది. సర్వేలో తేలిన అంశాలివే! ♦ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ మెట్రో నగరాలకు వలసొస్తున్న వారిలో 91 శాతం మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఆసక్తిచూపడం లేదు. ♦ మెట్రో నగరాల్లో నివసిస్తున్న యూత్లో 75శాతం మందికి తమ ఓటును ఎలా నమోదు చేసుకోవాలన్న అంశంపై అవగాహన కొరవడింది. ♦ వివిధ అవసరాల నిమిత్తం మెట్రో నగరాల్లో నివసిస్తున్న యువతలో 60శాతం మంది తాము నివసిస్తున్న సిటీలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ♦ 40 శాతం మంది ఓటర్ ఐడీ ఉంటే దేశంలో ఎక్కడైనా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని నమ్ముతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తాం.. ఓటుహక్కు నమోదుపై సరైన అవగాహన లేకపోయినా.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓటేస్తామని 75 శాతం యువత చెప్పడం విశేషం. మరో 20 శాతం మంది ఏదీ చెప్పలేమని పేర్కొన్నారు. ఇక 5 శాతం మంది పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఓటేయబోమని స్పష్టంచేయడం గమనార్హం. ఇదీ గ్రేటర్ పరిస్థితి గ్రేటర్లో నెటిజన్లుగా మారిన మెజారిటీ హైటెక్ సిటీజన్లు..గతంలో జరిగిన పలు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే విషయంలో దూరంగా ఉన్నారనేది సుస్పష్టం. మహానగరం పరిధిలో గతంలో పలు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రస్థాయి సగటుతో పోలిస్తే పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం పట్ల ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్లో సుమారు 24 నియోజకవర్గాల పరిధిలో 77 లక్షల మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో తమ ఓటుహక్కు వినియోగించుకునేవారు మాత్రం 60 శాతం లోపే. ఈ విషయం. గత సార్వత్రిక ఎన్నికలు, బల్దియా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది. పోలింగ్ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్ తదితర రంగాల ఉద్యోగులు, వేతనజీవులు పోలింగ్కు దూరంగా ఉంటున్నారు. గతానుభవాల నుంచి పాఠాలేవీ? మహానగరం పరిధిలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 58శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో అంతకంటే తక్కువగా కేవలం 53 శాతం మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని 15 నియోజకవర్గాల్లో కేవలం 48.89 శాతం మంది మాత్రమే తమ ఓటుహక్కు వినియోగించుకోవడం గమనార్హం. చైతన్యం పెరగాల్సిందే.. ఓటరు చైతన్యం పెంచడం, ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్నికల కమిషన్ అధికారులు నగర వ్యాప్తంగా విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. నూతనంగా ఓటర్లుగా నమోదు చేసే విషయంలో వివిధ రాజకీయ పార్టీలు క్రియాశీలంగా వ్యవహరించి వయోజనులను ఓటర్లుగా నమోదు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తే పరిస్థితిలో మార్పులొస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఓటర్లలో చైతన్యం నింపేందుకు జీహెచ్ఎంసీ ఇటీవల తీసుకున్న చర్యలివీ.. వాదా యాప్: అంధులు, వృద్ధులు, గర్భిణీలు రద్దీగా ఉండే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును తమకు వీలైన సమయంలో వినియోగించుకునేందుకు వారికి అనువైన స్లాట్ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వీరికి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేయడంతోపాటు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా వారికి పోలింగ్ సిబ్బంది సహకరిస్తారు. నమూనా పోలింగ్కేంద్రాలు: జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి..నూతనంగా ఓటర్లుగా నమోదైన వారు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలి..వీవీప్యాట్ యంత్రాల పనితీరుపై అవగాహన కల్పించారు. సి–విజిల్(సిటిజన్ విజిల్): ఎన్నికల అక్రమాలు, వివిధ పార్టీల అభ్యర్థులు, క్యాడర్ చేసే అక్రమాలను ఎన్నికల సంఘం, బల్దియా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్ను ప్రారంభించారు. ఫోటోలు, వీడియోలను ఈ యాప్లో అప్లోడ్ చేస్తే చాలు అక్రమార్కులపై చర్యలు తథ్యం. సువిధ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అవసరమైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
ఈవీఎంల వినియోగంపై అవగాహన
కర్నూలు(అగ్రికల్చర్): ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు హక్కు వినియోగం, వీవీ ప్యాట్లతో ఉపయోగాలపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించి ఆదివారం కర్నూలు శివారు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ వివిధ అంశాలను వివరించారు. ఈవీఎం, వీవీ ప్యాట్లను శిక్షణ నిమిత్తం రెవెన్యూ డివిజన్కు 10 ప్రకారం పంపిణీ చేశారు. వీవీ ప్యాట్లు, బ్యాలెట్ , కంట్రోల్ యూనిట్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో ర్యాండమ్గా గోదాము నుంచి తీయించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈవీఎంల ద్వారా ఓటు ఎలా వేయాలి, వీవీప్యాట్ ద్వారా ఓటు సరిగా పడిందా లేదా ఏ విధంగా సరిచూసుకోవాలి తదితర అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లకు పది ప్రకారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్రతినిధులు వీటిపై అవగాహన కల్పిస్తారన్నారు. శిక్షణ జరుగుతున్న సమయాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తనిఖీలు చేసుకోవచ్చన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, జాయింట్ కలెక్టర్ రవి పట్టన్శెట్టి, డీఆర్వోవెంకటేశం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించండి కర్నూలు(అగ్రికల్చర్): నియోజకవర్గాల వారీగా తీవ్ర సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, వాటి లోకేషన్లు గుర్తించి బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఈఆర్వోలు, డీఎస్పీలు, తహసీల్దార్లను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్పోస్టుల ఏర్పాటుపై సూచనలు ఇచ్చారు. జిల్లాలో 3,780 పోలింగ్ కేంద్రాలుండగా 2,180 లొకేషన్లున్నాయని, వీటిలో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ లొకేషన్లు, పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. సమస్యాత్మక లొకేషన్లను బట్టి పోలీసు బందోబస్తు ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో నగదు, మద్యం ప్రమేయాన్ని నివారించేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ రవి పట్టన్శెట్టి, అడిషనల్ ఎస్పీ మాధవరెడ్డి, డీఆర్ఓ వెంకటేశం, పలువురు డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. -
చీకటి రోజు
ఓటర్ల దినోత్సవం నివ్వెరపోయింది. ‘ఓటు హక్కు పొందాలి... దానిని న్యాయం చేస్తారనుకున్న వారిని ఎన్నుకునేందుకు వాడుకోవాలి... నిర్భయంగా హక్కును వినియోగించుకోవాలి.’ అంటూ ఓ వైపు నినాదాలు జిల్లా వ్యాప్తంగా మార్మోగుతున్నాయి. ఓటు హక్కు వజ్రాయుధమనీ... దానిని సక్రమంగా వినియోగించుకోమని మరోపక్క ప్రసంగాలతో అధికారులు ఉత్తేజితుల్ని చేస్తున్నారు. కానీ మరోపక్క ఓటు హక్కును హరిస్తున్నారని అడ్డుకుంటున్న వారిపై అదేరోజు కేసులు నమోదయ్యాయి. అన్యాయంగా ఓట్లను తొలగిస్తున్నవారికి లాఠీలు అండగా నిలిచాయి. ప్రభుత్వ పెద్దల తెరవెనుక మంత్రాంగంతో నిరపరాథులపై ప్రతాపం చూపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఓట్ల గల్లంతైపోతున్నాయని ఆందోళ న వ్యక్తం చేసిన వారిని ఓటర్ల దినోత్సవం రోజే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు చేయించ డం ప్రజాస్వామ్యంలో చీకటిరోజుగా మిగి లింది. అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి, మహిళలు, వృద్ధులు అని చూడకుండా ఈడ్చుకెళ్లిన పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ దిశా నిర్దేశంలో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జిల్లా పోలీసులు జిల్లా వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో పాటు నేతలను కేవలం ట్యాబ్లు లాక్కున్నారనే నెపంతో ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు లేకుండానే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వైపు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం అవుతుండగానే జిల్లాలోమరికొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ సర్వే బృందాలు కలకలం రేపాయి. వారిని పట్టుకుని పార్టీ నేతలు పోలీసులకు అప్పగించారు. ఓట్లు పోతున్నాయోమోనని ఆందోళన వ్యక్తం చేసిన వారిని అరెస్ట్ చే యడంవంటి పరిణామాలపై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రజావ్యతిరేకత ఉందన్న భయంతోనే... ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు విజయనగరం జిల్లాలో విశేష ఆదరణ లభించడంతో అధి కార తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం మొదలైంది. ఆ పార్టీ నేతల కంటిమీద కునుకు కరువైం ది. ప్రతిపక్ష పార్టీని జిల్లాలో ఎలాగైనా దెబ్బకొట్టా లని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పీపుల్స్ రీసెర్చ్ అనే ప్రైవేటు సంస్థ వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లను సర్వే ద్వారా గుర్తించి తొలగించే ప్రయత్నం చేస్తోందనే విషయం వెలుగులోకి వచ్చింది. పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో సర్వే బృందం సభ్యులను పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం పట్టుకుని వారి ట్యాబ్లను పరిశీలించగా వాటిలో ఓటర్ల జాబితాలు ఉండటం చూసి ఖంగుతిన్నారు. ఓటర్ల జాబితాలతో ఎందుకు సర్వే చేస్తున్నారని నిలదీస్తే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అనుమానం వచ్చి వారిని పోలీసులకు అప్పగించారు. సర్వే బృందాన్ని పోలీసులకు అప్పగించిన తర్వాత పోలీసుల తీరు అనుమానాలకు బలం చేకూర్చింది. వెంటనే ఎన్నికల కమిషన్కు, డీజీపీకి ఫిర్యాదు చేయడానికి పార్టీ సీనియర్ నేతలు సన్నద్ధమయ్యారు. టీడీపీ కొత్త నాటకం ఎన్నికల కమిషన్ను వైఎస్సార్సీపీ నేతలు కలవనున్నారనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం ట్యాబ్ల నాటకానికి తెరతీసింది. తమ ట్యాబ్లు లాక్కుని వెళ్లిపోయారంటూ సర్వే సంస్థ ఫిర్యాదు చేసిందని చెబుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ పోలీసు బలగాలు వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై పడ్డారు. ఆ సంస్థ ఫిర్యాదు చేయడం, అర్ధరాత్రి పోలీసులు రంగంలోకి దిగడం మరింత అనుమానాలు రేకెత్తించింది. పూసపాటిరేగ, కు మిలి గ్రామాలకు చెందిన 14 మందిని వారి ఇళ్లనుంచి బలవంతంగా బయటకు లాక్కువచ్చి అరె స్ట్ చేశారు. అర్ధరాత్రి తమ వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకువెళుతున్నారని అడిగిన మహిళలను, ప్రజా ప్రతినిధులను పక్కకు ఈడ్చిపడేశారు. అయినా ప్రభుత్వం సంతృప్తి చెం దలేదు. ప్రజాసంకల్పయాత్రలో జిల్లా వ్యాప్తంగా నాయకత్వం వహించిన మజ్జి శ్రీనివాసరావును టార్గెట్ చేసింది. విజయనగరం పట్టణంలోని ధర్మపురిలో ఉన్న శ్రీనివాసరావు ఇంటిని తెల్లవారుజామునే పోలీసు బలగాలు ముట్టడించాయి. ఆయన నిద్రలేవకముందే చుట్టుముట్టాయి. ఎలాంటి ఆధారంగానీ, ఫిర్యాదుగానీ లేకుండానే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి పార్టీ నాయకులుగానీ, కార్యకర్తలుగానీ అందుబాటులో లేకపోవడం, కొద్దిమంది సిబ్బంది మాత్రమే శ్రీనివాసరావు ఇంటి వద్ద ఉండటంతో కాసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుంటుండగానే ఆయనను పోలీసులు వాహనంలో ఎక్కించి పట్టణమంతా తిప్పి తమను వెంబడిస్తున్న మీడియాను ఏమార్చేందుకు యత్నించి చివరకు జామి స్టేషన్కు తీసుకువెళ్లారు. కేవలం ట్యాబ్ల కోసం ఇంత హైడ్రామా నడపాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నకు పోలీస్ అధికారుల వద్ద సమాధానం లేదు. ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్రాజు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, సీనియర్ నేతలు పెనుమత్స సాంబశివరాజు, నెక్కల నాయుడుబాబు తదితరులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ డీఎస్పీ శ్రావణ్కుమార్ను ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన అరెస్టులకు నిరసనగా ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ఆగని సర్వే బృందాల చర్యలు ఇంత జరుగుతున్నా జిల్లాలోని చీపురుపల్లి, నెల్లి మర్ల, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం వంటి ప్రాంతాల్లో సర్వే బృందాలు శుక్రవారం కూడా తి రిగాయి. దాదాపు 700 మంది సభ్యులు ఈ బృం దాల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. వారిలో కొందరిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీ సులకు అప్పగించారు. మరోవైపు సర్వేను తప్పుబట్టలేమని, వారిని అడ్డుకోవడమే తప్పని విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజు ఓ ప్రకటన విడుదల చే శారు. ఇంకోవైపు పార్టీ సీనియర్ నేత, మాజీ మం త్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో ఎన్నికల కమిషన్ను, డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లాలో అరెస్ట్ అయిన వారిని పోలీసులు స్టేషన్ బెయిల్(41 నోటీస్)పై మధ్యాహ్నం 2గంటల సమయంలో విడుదల చేశారు. అయితే ఈ మొత్తం ఉదంతం నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీని భయపెట్టాలని అధికార టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రైవేటు సర్వే సంస్థపై సాక్షా త్తూ మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రేమ ఒలకబోస్తూ వ్యా ఖ్యలు చేయడం, అర్ధరాత్రి పోలీసులు అరెస్టులకు పాల్పడటం వంటి పరిణామాలు ఓట్ల తొలగింపు ప్రక్రియను అధికారపార్టీయే చేపడుతోందనే అనుమానాలకు బలం చేకూర్చాయి. రామభద్రపురంలో సర్వే కలకలం రామభద్రపురం: మండలంలోని నరసాపురంలో పార్వతీపురం ఏరియా పెదబొండపల్లికి చెందిన గొడబ కిరణ్కుమార్ అనే యువకుడు ఇంటింటికీ తిరిగి మీరు ప్రభుత్వానికి అనుకూలమా... ప్రతికూలమా అంటూ ప్రశ్నిస్తుండటతో ఆయన్ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని 147 బూత్లో ఉన్న ఓటర్లను వివిధ ప్రశ్నలు వేసి వివరాలను ట్యాబ్లో ఆన్లైన్ చేస్తుండటం, అక్కడ వారు లేకపోయినా ఫోన్ నంబర్ తీసుకుని వారిని ఫోన్లో సంప్రదిస్తుండటంతో ఆ యువకుడిని నిలదీశారు. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడితో పూచీకత్తు రాయించుకుని విడిచిపెట్టినట్టు ఎస్ఐ ఆర్ సత్యంనాయుడు తెలిపారు. -
ఓటే వజ్రాయుధం... భవితకు సోపానం...
విజయనగరం గంటస్తంభం: బంగారు భవితకు ఓటే వజ్రాయుధం వంటిదనీ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల్లో వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. మహారాజా అటానమస్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసి న ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ డబ్బు, మద్యం, మతం, కులం పే రుతో ఓటర్లను ప్రలోభపెట్టడం నేరమని, డబ్బు, మద్యం ఇచ్చినవారు, తీసుకున్నవారు శిక్షార్హులే న ని అన్నారు. ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, పోటీ చేసే వారు ఎవరూ నచ్చకపోతే నోటా ఆప్షన్ ఉపయోగించుకోవాలని సూచించా రు. ఎన్నికలలో కొందరు పోటీ చేసేవారు లక్షలు, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి గెలిచి మరలా అక్రమార్జన ద్వారా సంపాదిస్తున్నారని, అటువంటి వారికి ఓట్లు వేయకూడదని సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, ఎవరి ప్రలోభాలకూ లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ఓటు హక్కు పొందిన అందరూ తమ ఓటును వినియోగించుకోవాలని, ఓటర్ల నమోదుపై అవగాహన కలిగించాలన్నారు. నిబద్ధత కలిగిన, నిస్వార్ధమైన, నిజాయితీగల నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. ర్యాలీతో ప్రారంభం అంతకుముందు ఉత్సవాలు ర్యాలీతో ప్రారంభమయ్యాయి. కోట జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఓటుకు సంబంధించిన నినాదాలతో ఎం ఆర్ కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి, విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలు అందించిన ఈఆర్ఓలు, ఏపీఆర్ఓ లు, బీఎల్వోలకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందించారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు, టూకే రన్ లో విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. కొత్ట ఓటర్లకు ఓటుహక్కు కార్డులను అందజేశారు. వృద్ధ, థర్డ్జెండర్, నూతన ఓటర్లను సత్కరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జేసీ–2 జె.సీతారామారావు, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, పీటీసీ ప్రిన్సిపల్ మెహర్ బాబు, అధికారులు, సిబ్బంది, పలువురు ఓటర్లు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక దరఖాస్తుపై’ వైఖరి చెప్పండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏకపక్షంగా తొలగించిన ఓటర్లకు తిరిగి ఓటర్ల జాబితాలో స్థానం కల్పించేందుకు ప్రత్యేక దరఖాస్తును అందుబాటులో ఉంచే విషయంలో వైఖరి తెలియచేయాలని హైకోర్టు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపునకు గురైన ఓటర్లు, తిరిగి ఓటర్ల జాబితాలో స్థానం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడమే మార్గమని, అయితే దీని బదులు వారికోసం ప్రత్యేక దరఖాస్తును అందుబాటులోకి తీసుకొచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ప్రతీ అగర్వాల్ మరో 25 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దసంఖ్యలో ఓటర్లను జాబితా నుంచి తొలగించారన్నారు. పిటిషనర్ల పేర్లను కూడా అలాగే తొలగించారని తెలిపారు. ఎన్నికల సంఘం తీరు వల్ల పిటిషనర్లు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారని, అందువల్ల రాజ్యాంగం తమకు కల్పించిన హక్కును వినియోగించుకునే దిశగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతేకాక పరిహారం కూడా ఇప్పించాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, తొలగింపునకు గురైన ఓటర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చే విషయంలో ప్రత్యేక దరఖాస్తును తీసుకురావడంపై వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. -
ప్రమాదంలో ‘ఓటు’
‘అందరికీ ఓటు హక్కు’ నినాదం జిల్లాలో అపహాస్యం పాలవుతోంది. ఏకపక్ష పోలింగ్ బూత్లపై విచారణ నామమాత్రంగా జరుగుతోంది. విచారణకు వెళ్లిన అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. దీంతో అంతా బాగుందని రాసుకుంటున్నారు. ఆ పోలింగ్ బూత్లలో మరోసారి ఏకపక్ష తీర్పు వచ్చే అవకాశమేర్పడింది. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం. అక్కడే కొన్ని బూత్లలో ఎస్సీలు ఓటేసే పరిస్థితి లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కమ్మగుట్టపల్లి, బందార్లపల్లి, పేట ఆగ్రహారం గ్రామాల్లోని ఎస్సీల ఓట్లు టీడీపీ నాయకులే వేస్తున్నారు. చిత్తూరు, సాక్షి: జిల్లాలో ఓటుహక్కు ప్రమాదంలో పడింది. ఏకపక్ష పోలింగ్ బూత్లపై విచారణ లేకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. కొంతమంది అధికారులు కలెక్టర్కు మొరపెట్టుకుంటుండగా.. మరికొందరు ఎందుకొచ్చింది గొడవని ‘అంతా బాగుందని’ రిపోర్టు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదయ్యి.. ఒక్క పార్టీకే ఓట్లన్నీ గంపగుత్తగా పడిన పోలింగ్ బూత్లపై తాజాగా విచారణ జరుగుతోంది. అక్కడ అన్ని పార్టీల ఓటర్లు ఉన్నారా?.. లేక రిగ్గింగ్ జరుగుతోందా? తెలుసుకోడానికి ఎలక్షన్ కమిషన్ విచారణ చేపట్టింది. విషయ సేకరణ కోసం అలాంటి గ్రామాలకు వెళ్లిన అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్ల సంతకాలను కూడా తెలుగుదేశం నాయకులే పెట్టి అధికారులను పంపించి వేస్తున్నారు. అక్కడ ఎస్సీలను ఓట్లు వేయనీయరు.. పూతలపట్టు పేరుకే ఎస్సీ నియోజకవర్గం. అక్కడ ఎస్సీలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి కూడా లేదు. కమ్మగుట్టపల్లి పోలింగ్బూత్ నెం 79, బందార్లపల్లి పోలింగ్ బూత్లు 89,90, పేట ఆగ్రహారం పోలింగ్ బూత్ నెం. 86లలో ఎస్సీల ఓట్లను టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారు. ఓటు వేయడానికి వెళ్లిన వారిపై తెలుగుదేశంనాయకులు దాడులకు తెగబడ్డారని ఎస్సీలు వాపోతున్నారు. గత మూడు విడతలుగా ఓటేయలేదని చెబుతున్నారు. కనీసం 2500 ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ పోలింగ్ బూతుల్లో విచారణ కోసం వెళ్లిన అధికారులు టీడీపీ నాయకుల బెదిరింపులకు తలొగ్గి.. ఎలాంటి అవకతవకలు జరగలేదని నివేదికలో పొందుపరిచారని తెలిసింది. దీనిపై జిల్లా యం త్రాంగం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఎస్సీలు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని రాజకీయ వి«శ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. కంగుందిలో మరీ ఘోరం.. కుప్పం మండలం కొత్త ఇండ్లు, చందం,కంగుంది, గుడ్డునాయనపల్లి, అడవిబుదుగూరు తదితర గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదు. ఎన్నికల రోజు పోలింగ్ అంతా ముగిసిన తరువాత.. ఎవరెవరు ఓటేయలేదో వారి ఓట్లన్నీ.. టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తుంటారు. అక్కడ చనిపోయిన వారి ఓట్లు ఇంకా ఉన్నాయని తెలిసినా అధికారులు తొలగించే సాహసం చేయడం లేదు. కంగుందిలో ఎస్సీలు ఇప్పటికీ ఓటు వినియోగించుకునే స్థితిలో లేరు. మేం చెప్పినట్లు వినాల్సిందే.. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగేళ్లపాళ్యం, కొణతలేరు, కన్నలి గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేయలేని పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అక్కడ టీడీపీ నాయకులదే హవా. ఇద్దరు పెద్ద నాయకులు ఓటర్లను భయపెడుతున్నారు. కచ్చితంగా టీడీపీకి ఓటేయాల్సిందేనని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. గత ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. టీడీపీ నాయకుల బెదిరింపులకు తట్టుకోలేని బసవన్నగుంట, కత్తివారి కండ్రిగ గ్రామస్తులు దగ్గరలోని బసవన్నగుంటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తంగేళ్లపాళ్యం, కొణతనేరి, కన్నలి గ్రామాల్లో స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరుతున్నారు. వైఎస్సార్సీపీ ఏజెంట్ల సంతకాల ఫోర్జరీ.. ఏకపక్ష ఓటింగ్పై విచారణకు వచ్చిన అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. అధికారులు వైఎస్సార్సీపీ నాయకులను కలవకుండా చూసుకుంటున్నారు. తెలుగుదేశం నాయకులే వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్ల సంతకాలు పెట్టి అధికారులను పంపిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఓటు వేసేందుకు అమెరికా నుంచి వచ్చాను
రాజేంద్రనగర్: అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న కార్తీక్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరానికి వచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ హైదర్షాకోట్ పొలింగ్ బూత్ 56లో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు నారాయణరావు, జ్యోతితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చానన్నారు. ఆదివారం రాత్రి తిరిగి అమెరికాకు పయనమవుతున్నట్లు వెల్లడించారు. ఓటు ఎంతో పవిత్రమైందన్నారు. ప్రపంచంలోనే భారత దేశ ప్రజాస్వామ్యం ఎంతో గోప్పదన్నారు. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. -
అబ్రాడ్ టు హైదరాబాద్
సాక్షి,సిటీబ్యూరో: ఇంటికి దగ్గరగా పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నా... ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపటం లేదు. అయితేకొందరు ఎన్ఆర్ఐలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల నుంచి వచ్చారు. ఒక్క ఓటు కదా.. ఏం వేస్తాం అని వారు అనుకోకుండా ఓటు వేసి ఆదర్శరంగా నిలిచారు.∙ముషీరాబాద్ నియోజకవర్గంలోని చిక్కడపల్లికి చెందిన బండి అభినయ్(35) పదిహేనేళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం అమెరికా వెళ్లారు. సాల్ట్ లేక్ సిటీలో నివసిస్తున్నారు. ఆసుపత్రులకు సంబంధించిన పరికరాల వ్యాపారంతో పాటు వివిధ ప్రాంతాల్లో హోటళ్లను నిర్వహిస్తున్నారు. ♦ మొట్ట మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ గతంలోనే ఓటు వచ్చిందని, కానీ వినియోగించుకోలేదన్నారు. ♦ మదీనగూడ దీప్తిశ్రీనగర్కు చెందిన శ్రీనివాస్, ప్రసన్న దంపతుల కుమార్తె డాక్టర్ నిషిత అమెరికాలోని ఓక్లహోమా యూనివర్సిటీలో దంత వైద్యురాలిగా పనిచేస్తున్నారు. గతంలోనే తనకు ఓటు హక్కు వచ్చినా, అప్పట్లో వినియోగించుకునే అవకాశం లభించలేదు. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలనే సంకల్పంతో స్వదేశానికి వచ్చారు. ♦ సీతాఫల్మండికి చెందిన సత్య ప్రకాష్ వత్తిరీత్యా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఎలాగైనా వెళ్లి ఓటు వేయాలని సంకల్పంతో అమెరికా నుంచి వచ్చి తన విలువైన ఓటును వినియోగించుకున్నారు. ♦ సరితగౌడ్ అనే యువతి కూడా దక్షిణాఫ్రికా నుంచి సికింద్రాబాద్కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. -
ఆలోచించండి.. ఓటేయండి
బంజారాహిల్స్: ‘‘ప్రజాస్వామ్యం మనకు ఒక గౌరవం, హక్కును కల్పించింది. అలాంటప్పుడు ఆలోచించి ఓటేయాలి కదా..! నచ్చిన వస్తువును కొనుగోలు చేసేందుకు రోజంతా దుకాణాలు తిరుగుతాం. అలాంటిది అయిదేళ్లు పాలించే ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవాలంటే ఎంతగా ఆలోచించాలి..? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఆలోచించండి.. ‘ఓటు వేయడం అవసరమా’ అనే భావన చాలా మందిలో ఉంది. ఆ భావనను వీడనాడండి. ఓటు వేయకుంటే మనల్ని మనం మోసం చేసుకోవడంతో పాటు ఇతరులకు నష్టం చేసిన వారిగా మిగులుతాం’’ అంటున్నారు యువ కథానాయకుడు సందీప్ కిషన్. ఓటరుగా నమోదు చేసుకోగానే సరిపోదని, దాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలంటున్న ఆయన తన ‘ఓటు’ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు సందీప్ మాటల్లోనే... ఇది మూడోసారి.. ఇప్పటి దాకా నేను రెండు సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇప్పుటి ఎన్నికల్లో మూడోసారి ఓటు వేయబోతున్నాను. నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా ఓటు వేస్తారు. మేం ఉదయం 7.30 గంటలకే మాదాపూర్లోని మా పోలింగ్ కేంద్రానికి వెళ్తాం. తప్పనిసరిగా క్యూ పద్ధతి పాటిస్తాం. ఓటు వేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చూసుకుంటాం. వేలి మీద ఇంకు చూడగానే.. నేను మొదటిసారి ఓటు వేసినప్పుడు వేలి మీద ఇంకును చూసినప్పుడల్లా ఎంతో గర్వంగా ఫీలయ్యాను. మొదటిసారి నేను దేశం కోసం ఉపయోగపడుతున్నానని గర్వపడ్డాను. తొలిసారి పోలింగ్లో పాల్గొన్న తర్వాత ఓటు ప్రాముఖ్యత కూడా తెలిసి వచ్చింది. అప్పుడు గర్వంగా, హాయిగా అనిపించింది. ఆ ఇంకు గుర్తును వరుసగా నాలుగైదు రోజులు చూసుకున్నాను. ఆ గుర్తు పోకుండా ఉంటే బాగుండు అనిపించింది. చిన్నప్పుడు నాన్నతో కలిసి.. నా చిన్నతనంలో మా నాన్న ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు నన్ను వెంట తీసుకెళ్లువారు. పోలింగ్ కేంద్రం బయట నన్ను నిలబెట్టి ఆయన ఓటు వేసి వచ్చిన తర్వాత వేలిపై ఇంకు ముద్ర చూపించేవారు. అది చూసినప్పుడు నాకు ఎంతో ఆసక్తి కలిగింది. నా వేలిపై ఎప్పుడు ఇలా ఇంకు ముద్రను చూపిస్తానా.. అని అనుకునేవాడిని మొత్తానికి నాక్కూడా ఆ అవకాశం వచ్చింది. హైదరాబాద్ అద్భుత నగరం నేను తిరిగిన, చూసిన నగరాల్లో హైదరాబాద్ అద్భుతమైన నగరం. ఇక్కడున్నంత సౌకర్యం, ఆహ్లాదం, ఆనందం నాకెక్కడా దొరకలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో పెద్దగా చేయాల్సింది ఏమీ లేదనిపిస్తుంది. మెట్రో రైలు, రోడ్లు ఇలాంటి పనులు ఇంకా తొందరగా అయిపోతే బాగుండనిపిస్తుంది. అభ్యర్థుల గతం చాలా అవసరం ఉన్నవారిలో 70 శాతం మంది ఓటు వేసి.. 30 శాతం మంది వేయకపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మన కోసం మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఓటు వేసే ముందు అభ్యర్థుల గతం చూడాలి. గతంలో వారు చేసిన పనులను ఆకళింపు చేసుకోవాలి. మనకు ఎవరు సరైన వారో నిర్థారించుకోవాలి. కులమతాలు కాకుండా.. మనిషి గుణగణాలు చూసి వేయాలి. -
జర సూస్కోని వోటెయ్యుండ్రి మల్ల..!
అందరూ మంచిగున్నరా.. నేను మీ మల్లేశాన్ని. గీ రెండ్రోజులు సర్ది జేసింది గందుకే రాలేకపోయిన. గిన్ని దినాలూ మీతో ముచ్చటబెట్టుడు మంచిగుండె. సూసిండ్రా గీ ఎలచ్చన్ల ప్రచారం జరిగినన్నాల్లు ఎన్ని సెప్పిండ్రు.. ఎంతగనం తిరిగిండ్రు.. కాల్లకి సెక్రాలు కట్కొని ఊరూరు.. గల్లి గల్లీ చుట్టేసిండ్రు. కూటమోల్లని కారోల్లు.. కారోల్లని కూటమోల్లు.. గీల్లిదర్నీ గా కమలమోల్లు.. ఆల్లని ఈల్లందరూ ఎంత తిట్టుకుండ్రో మీకు జెప్పిన. నీల్లిస్తాం.. కొల్వులిస్తం.. అప్పులు మాఫీ జేస్తం.. గది జేస్తం గిది జేస్తం అని ఊదరగొట్టిండ్రు! మీరు గెలిపించండి సాలు.. సొర్గం మీ గుమ్మం కాడ దించుతం.. అని ఆశపెట్టిండ్రు. పార్టీలు మార్చినోల్లు.. పురాన దోస్తుల్ని దుష్మల్నని మీటింగుల్ల తిట్టినోల్లు.. ఆల్లకి ఓటేస్తే మీ బతుకు బర్బాద్ అయినట్లే.. తెలంగాన ఎనకయినట్లే అన్నోల్లు.. ఈల్లకి ఓటేస్తే అభివృద్ధి ఖతం మీయిస్టం మల్ల అన్నోల్లు.. ఇయన్నీ ఇన్కొని యాస్టకొచ్చింది గాదె. మా కాకా అయితే.. గిదేందిర మల్లేసు గిప్పుడే గీల్లు గిట్ల కొట్లాడుతుండ్రు.. ఈల్లని దీస్కెల్లి గా కుర్సీల కూర్సోబెడ్తే ఇంకేమైన ఉందా అన్నడు. నిజమే కాకా ఏం జేస్తం మల్ల మనం కూడ జరంత జూసుకోవాలె. ఎవరు మంచిగుండ్రు.. ఎవరు మన తెలంగానకు మంచి జేస్తరు అని దిమాక్ పెట్టి ఆలోచించాలె. గాల్లకె ఓటెయ్యాలె.. అని చెప్పిన. గంతె గదా. అయినా ఎంత గత్తర జేసిండ్రు! దావత్ ఇస్తమని.. నాస్టా పెట్టిస్తమని.. ట్రిప్పుల్కి పంపిస్తమని. మన ఎంకటేసుల్ని అడుగుండ్రి మల్ల ఈల్ల జాత్కాలన్ని ఇప్తడు. ఇయన్ని బేకార్ గానీ వదిలేయుండ్రి. మీ మల్లేశాన్ని నేను జెప్తున్న.. మీరు యేసే ఓటు తెలంగానని ముందుకు దీస్కెల్లాలె. అని అనుకున్నరు. కొంచెం గడబిడ అయినమంటె సాల్.. ఇగ ఐదేల్లు బర్బాద్ అయినట్లె! ఆయన జెప్పిండు.. ఈయన జెప్పిండు.. గివన్నీ జాన్తానై! అందుకే సెబ్తున్న ఇయ్యాల మంచిగ తయారై పోలింగ్బూత్కి పోండి. మనసుకు నచ్చినోల్లకి.. మనల్ని మన తెలంగానని ముందుకు దీస్కెల్లేటోల్లకి బరాబర్ ఓటు వేయుండ్రి. ఏలికి సుక్క పెట్టించ్కుని నవ్వుతూ ఇంటికెల్లుండ్రి! మన ఓటు.. మన ఇజ్జత్.. మనం భద్రంగా కాపాడుకోవాలె.. మంచోల్లకి మంచిగా వెయాలె! వస్తా మల్ల.. గిన్నాల్లు గీ సిల్లీ మల్లేశం ముచ్చట్లు ఇన్నరు. నవ్వుకున్నరు. అరె బై గిట్లనా అనుకున్నరు! ఏదైతేనేం నాల్గు మంచి మాటలు జెప్పిన. మల్లీ ఈలున్నప్డు వస్త. అందాక బై!! – రామదుర్గం మధుసూదనరావు -
ఓట్లు ఎన్ని రకాలో!
సాక్షి, సిటీబ్యూరో: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకుంటే ఓటు హక్కు వస్తుంది. ఎన్నికలప్పుడు వారు పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేస్తారు. దీంతోపాటు మరి కొన్ని రకాల ఓట్లు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. వాటిలో చాలా మందికి ‘పోస్టల్ బ్యాలెట్’ గురించి మాత్రమే తెలుసు. ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, రక్షణ దళాల్లో ఉండే సిబ్బందికి ఈ పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. మరికొన్ని ఓట్లు లెక్కింపులోకి రానప్పటికీ వాటికీ ప్రత్యేకతలున్నాయి. ఆ ఓట్లు పలు సందర్భాల్లో అభ్యర్థి విజయంపై ప్రభావం చూపుతాయి. వాటిని ‘నమూనా ఓట్లు, టెండర్ ఓట్లు, చాలెంజ్ ఓట్లు, టెస్టు ఓట్లు’ అని అంటారు. టెస్ట్ ఓటు: ఓటరు తన ఓటు వేశాక తాను వేసిన ఓటు గుర్తు వీవీప్యాట్లోని స్లిప్లోని గుర్తు సరిగాలేదని నిర్ణయిస్తే పోలింగ్ ఆపించవచ్చు. అది ఎలా అంటే.. తన ఓటు తాను కోరుకున్న అభ్యర్థికి పడనట్లుగా వీవీప్యాట్ స్లిప్పులో కనిపిస్తే మొదట ఫిర్యాదు చేయాలి. ప్రిసైడింగ్ అధికారి అతనితో మాట్లాడి.. తప్పుడు అభియోగం అయితే జరిగే పరిణామాలను హెచ్చరిస్తారు. ఓటరు నుంచి రాతపూర్వకంగా ఆమోదం తీసుకొని పోలింగ్ ఏజెంట్ ముందు ఓటింగ్ మిషన్లో టెస్ట్ ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. మళ్లీ టెస్ట్ ఓటు వేసే సమయంలో ఓటరు కోరుకున్న అభ్యర్థి గుర్తు కాకుండా ఇతరుల గుర్తు వీవీ ప్యాట్ స్లిప్పులో కనిపిస్తే ఓటింగ్ నిలిపివేస్తారు. ఒకవేళ సదరు ఓటరు చేసిన ఆరోపణ తప్పుగా తేలితే రెండో ఎంట్రీకి ఎదురుగా సంబంధిత ఓటరు ఏ అభ్యర్థి పక్షాన ఓటు వేసిందీ రాసి, అతడి సంతకం కాని వేలిముద్రను తీసుకుని పోలీసులకు అప్పగిస్తారు. నమూనా ఓటు : పోలింగ్ బూత్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి గంట ముందు ఈవీఎం చెకింగ్ చేయడానికి వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు 50 ఓట్లు వేస్తారు. అ ఓట్ల లెక్కింపు వెంటనే పూర్తి చేసి ఈవీఎంల నుంచి తొలగిస్తారు. అనంతరం అసలైన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈవీఎంను చెకింగ్ చేయడానికి వేసే ఈ ఓట్లను నమూనా ఓట్లు అంటారు. టెండర్ ఓటు : ఓ వ్యక్తి ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు అతని ఓటు అంతకు ముందే ఎవరైనా వేసి ఉంటే అప్పుడు అతడు ‘టెండర్ ఓటు’ వేయవచ్చు. ఆ వ్యక్తి నిజమైన ఓటరుగా నిర్ధారించుకున్నాకే అక్కడి పోలింగ్ అధికారి అతనికి బ్యాలెట్ ఇస్తాడు. ఇలాంటి వారికి ఈవీఎంలో బటన్ నొక్కే అవకాశం ఉండదు. అతడి బ్యాలెట్ను సీల్డ్ కవర్లో భద్రపరుస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల ఓట్ల లెక్కింపు అనంతరం సమానంగా ఓట్లు వస్తే ఈ టెండర్ ఓటును పరిగణనలోకి తీసుకుంటారు. చాలెంజ్ ఓటు: ఇది కూడా అతి ముఖ్యమైనదే. ఓటరు పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్ల నుంచి అసలు ఇతను ఓటరు కాదని అభ్యంతరం చెబితే.. సదరు వ్యక్తి ‘చాలెంజ్ ఓటు’ వేయవచ్చు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి పోలింగ్ అధికారి రూ.2 తీసుకొని రసీదు ఇస్తారు. ఓటరు, ఏజెంట్ అక్కడ ఉన్నత ఇతర ఓటర్ల నుంచి పోలింగ్ అధికారి వివరాలు తీసుకుంటారు. అసలైన ఓటరుగా నిర్ధారణ అయితే అతనికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అసలైన ఓటరుగా నిర్ధారణ కాకుంటే పోలీసులకు అప్పగిస్తారు. చాలెంజ్ ఓటు వేసిన వ్యక్తి పేరు అతని చిరునామాను ‘ఫారం 14’లో నమోదు చేస్తారు. ఓట్..రైట్! మన హక్కు ఓటు. సరైన వ్యక్తికి వేస్తేనే అది రైట్ అంటున్నారు నగరానికి చెందిన స్ట్రీట్ ఆర్టిస్ట్ స్వాతి విజయ్. పోలింగ్ రోజున క్యూలో నుంచుని బాధ్యతగా ఓటేయడం అవసరం. అంతేకాదు.. మనం వేసే ఓటు సరైన వ్యక్తికి వేస్తున్నామా లేదా అనేది కూడా పూర్తి స్పష్టత ఉండాలి. అప్పుడే దానికి సార్థకత. లేదంటే టాయిలెట్లోని కమోడ్లో వేసినట్టే అవుతుంది. ఇదే సందేశంతోగచ్చిబౌలిలోని ఓ గోడపై వీరు గీసిన చిత్రం ఆలోచింపజేసేదిగా ఉంది. ఓటర్లూ.. ఆలోచించండి మరి! -
టీ అమ్ముకుంటాను.. కానీ ఓటమ్ముకోను
సాక్షి, సూపర్బజార్(కొత్తగూడెం): ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఎన్నికల అధికారులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్కుమార్ శైనీ ప్రత్యేక దృష్టి పెట్టి విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై మారుమూల గ్రామాల్లో కూడా అవగాహన కల్పించారు. పోస్టర్లు, ఆకాశవాణి ద్వారా కూడా ప్రచారం చేపట్టారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో, వాహనాలు సైతం వెళ్లడానికి అవకాశం లేని ప్రాంతాలకు ప్రత్యేకంగా పోలీస్ అధికారితో కలిసి మోటారుసైకిల్పై 21 కిలోమీటర్లు ప్రయాణించి ఆయా గ్రామాలకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఓటు హక్కు విలువను తెలియజేసే విధంగా కూరగాయల, పండ్ల వ్యాపారులకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటాం.. ప్రలోభాలకు గురికాం అనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మండల సమాఖ్య, డ్వాక్రాసంఘ సమావేశాల్లో మహిళలకు, కళాశాలల్లో యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివ్యాంగులకు కల్పిస్తున్న రవాణా సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో విలువిద్యలో జిల్లా కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన గొంది మారెప్పను ఐకాన్గా నియమించారు. జిల్లాలో గత ఎన్నికల్లో నమోదైన 70 శాతం ఓటింగ్ను ఈసారి మరింత పెంచాలని కలెక్టర్, ఇతర అధికారులు కృషి చేస్తున్నారు. -
ఫోన్ పాలి‘ట్రిక్స్’!
మీ మాటే మీ ఓటును ఉరి తీయవచ్చు. మీ అభిప్రాయమే మీ హక్కులకు దిక్కు లేకుండా చేసేయొచ్చు. టీడీపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్లో సామాన్యుడే సమిధగా మారుతున్నాడు. జనాభిప్రాయం తెలుసుకుంటామనే నెపంతో అధికారికంగా వారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గుర్తిస్తున్నారు. గుర్తించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి నిస్సిగ్గుగా తొలగిస్తున్నారు. సాంకేతిక సాయంతో జరుగుతున్న ఈ రాజ్యాంగ పరిహాస ప్రక్రియ ప్రజాస్వామ్యవాదులను విస్మయపరుస్తోంది. జిల్లాలో ఇదే తరహాలో వేలకొద్దీ ఓట్లను తొలగించారు. ఇంకా తొలగిస్తున్నారు.. శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘మన గీత పెద్దగా ఉండాలంటే.. పక్క వాడి గీత చిన్నది చేసెయ్యాలి..’ అధికార టీడీపీ అనుసరిస్తున్న కొత్త మంత్రమిది. ఓటు బ్యాంకును పెంచుకునే మార్గాలు వెతక్కుండా.. విపక్షాల ఓటుబ్యాంకును నిర్వీర్యం చేయడానికి అధికార పార్టీ నేతలు క్షుద్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే అభిప్రాయాలు తెలుసుకునే ఫోన్కాల్. చంద్రబాబు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్లో ఏ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పినా ఇక ఆ వ్యక్తి ఓటుకు కాలం చెల్లినట్టే. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు అనుసరిస్తున్న ఈ పద్ధతులు చూసి ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యపోతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పరిహరిస్తూ నిస్సిగ్గుగా ఓటు హక్కును తొలగించేస్తున్న విధానాలు చూసి సామాన్యులు బిత్తరపోతున్నారు. వ్యతిరేకత తెలుసుకుంటూ.. జనాల్లో అధికార పార్టీపై రోజురోజుకూవ్యతిరేకత పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యతిరేకతను తెలుసుకుంటూ ఓట్లను తొలగించేందుకు టీడీపీ నాయకులు కొత్త విధానాలు తీసుకువచ్చారు. గ్రామాల్లో వారికి అనుకూలంగా ఉన్న వారు, లేని వారిని గుర్తించి, వారికి అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగించడానికి ఏకంగా ప్రత్యేక టీమ్లు గ్రామాల్లో తిరుగుతున్నాయి. కొత్త ఓట్లు చేర్పించడం, తమకు వ్యతిరేకమైన ఓట్లను తొలగించడం వంటి పనులు వీరు చేస్తున్నారు. అక్కడక్కడా ఒకరికే రెండుమూడు ఓట్లు ఉండడం కూడా వీరి చేతివాటమే. ఫోన్కాల్తో.. ప్రభుత్వ ప్రతినిధులు మనతో మాట్లాడుతున్నట్లు ఒక ఫోన్కాల్ సెల్ఫోన్కు వస్తుంది. అక్కడ ప్రభుత్వం పనితీరుపై కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఒకటి, రెండు టైప్ చేయాలని సూచిస్తున్నారు. ఇలా ఎవరైనా పనితీరు బాగోలేదని సమాధానం చెబితే కారణాలు, వారి వివరాలు అడిగి వారి ఓటు, కుటుంబ సభ్యుల ఓటును నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఒకవేళ మాజీ ప్రజాప్రతినిధులకు ఫోన్ వెళితే వారు ఇక ఓటు గురించి మర్చిపోవాల్సిందే. గత మార్చిలో జరిగిన సమ్మరీలో జిల్లాలో సుమారుగా 33,957 ఓట్లను తొలగించారు. వారికి ఈ సమ్మరీలో ఓటు హక్కును కల్పించాల్సింది. కానీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వచ్చే దారి కనిపించడం లేదు. ఇదంతా ఈ ప్రత్యేక టీమ్లు చేసిన పనే. ఈ పూర్తి జాబితా 2019 జనవరి 4 వతేదీ వరకు విడుదల చేసే అవకాశం ఉండదు. ఆ తర్వాత కొత్త ఓట్లను అవకాశం ఉండదు. దీంతో ప్రతిపక్షం వారి ఓట్లను తొలగించడం ఈజీ అవుతుందని టీడీపీ వారు ఈ ప్లాన్ వేశారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. బలమైన చోట మరీనూ.. సాధారణంగా ఓటు బ్యాంకు పెంచుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలు, రాయితీలు, ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతారు. కానీ అవేవీ చేయకుండా తమకు బలం ఉన్న చోట అధికార పార్టీ నేతలు డబుల్ ఓట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా చాలాచోట్ల మరణించిన వారి పేర్లను కూడా ఓటరు జాబితాలో కొనసాగిస్తున్నారు. తమకు అనుకూలమైన చోట్ల సహేతుకమైన కారణాలు చూపకుండానే ప్రతిపక్ష పార్టీ ఓట్లను తొలగిస్తున్నారు. బోగస్ ఓట్లపై దృష్టి జిల్లాలో ఎక్కువగా బోగస్ ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ సారి సమ్మరీలో కూడా పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. సుమారుగా 77 వేల కొత్త దరఖాస్తుల్లో డబుల్ ఓట్లు, అధికార పార్టీ చొరవతో అడ్డంగా కుక్కిన ఓట్లు 20వేలకు పైగా ఉంటాయని అంచనా. -
ఓటుహక్కును వినియోగించుకున్నారా..
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4లక్షల 83వేల 654 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 25లక్షల 31వేల 556 ఓటర్లు ఉండగా 20లక్షల 47వేల 902 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వినియోగించుకోని వారు స్థానికంగా లేరా.. వినియోగించుకునేందుకు సమయం లేదా.. ఒక్కరికి రెండేసి ఓట్లు ఉండటంతో ఒకటే వినియోగించుకున్నారా.. ఇవన్నీ బోగస్ ఓట్లా అనేది అధికారులకు అంతుపట్టని విషయం. 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లాగా ఉన్నది ప్రస్తుతం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పడ్డాయి. ఈ సారి ఓటు హక్కు అందరూ వినియోగించుకునేందకు జిల్లా ఎన్నికల అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, వరంగల్ రూరల్ : ఓటుహక్కును అందరూ వినియోగించుకునేలా జిల్లా ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి తొలి సారిగా ఈవీఎంలకు వీవీ ప్యాట్లను అనుసంధానం చేశారు. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారో కనపడే విధంగా ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లకు, రాజకీయ నాయకులకు అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు మూడు దశల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. 100 శాతం ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు గతంలో దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు ఓటుహక్కును వినియోగించుకునేందుకు కుటుంబసభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీసుకెళ్తే తప్ప ఓటు వేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎన్నికల సంఘమే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. దివ్యాంగులతో ఓటు వేయించే బాధ్యతను ఎన్నికల సంఘం బూత్ల వారీగా అధికారులకు అప్పగించింది. దివ్యాంగులకు వీల్ చైర్లు, ర్యాంప్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆయా జిల్లాలో పోలింగ్కేంద్రాల వద్ద ఏమేమి అవసరాలు ఉంటాయో అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు జరిగే నాటికి మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు మౌలిక సదుపాయాల గురించి ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, నీటిసౌకర్యం కల్పించాలన్నారు. ఈ సారైనా ఓటుహక్కు వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందా చూడాలి. -
ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు
బంజారాహిల్స్: కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా గమ్మున కూర్చుంటారు. దీనివల్ల ప్రశ్నించే హక్కు కోల్పోతారు. ఆ పరిస్థితి ఎదురు కాకూడదనుకుంటే నిజాయితీతో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇదే విషయాన్ని రాజ్యాంగం చెబుతోంది. ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఒక్కసారి ఓటు వేయకపోతే ఐదేళ్ల వరకు తలవంచాల్సి ఉంటుంది. ఓటేసిన తర్వాత తలెత్తుకు తిరిగేలా ఉండాలి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వ్యక్తిగత బాధ్యతగా భావించాలి. మన హక్కును మనం కాపాడుకోవాలి. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు వేస్తాను. ఆ రోజు షూటింగ్లు ఉన్నా ఆలస్యంగానైనా వెళ్తాను కానీ ఓటు వేయడం మాత్రం మానను.– శివబాలాజీ,సినీనటుడు, బిగ్బాస్–1 విజేత -
ఓటుహక్కును వదులుకున్న చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు, అనంతర పరిణాలతో ఉమ్మడి రాజధాని(హైదరాబాద్)పై హక్కులను కాదనుకుని వెళ్లిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ఓటు హక్కును కూడా వదులుకున్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న నారావారు.. ఇప్పుడు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గానికి బదిలీ అయ్యారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలు కూడా తమ ఓట్లను బదిలీచేయించుకున్నారు. కృష్ణా నది ఉండవల్లి కరకట్ట వద్ద తాత్కాలిక అధికారిక నివాసం(హౌస్ నంబర్ 3-781/1)లో ముఖ్యమంత్రి నివసిస్తున్నారు. అది తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుండటంతో ఆమేరకు దరఖాస్తు చేసుకోగా, అధికారులు దర్యాప్తుచేసి, ధృవీకరించారు. 2014 ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బాబు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం తెలిసిందే. ఓటరు జాబితాలో బాబు కుటుంబం పేలుతున్న జోకులు : కాగా, కొత్త ఓటరు జాబితాకు సంబంధిత ఫొటోలు వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు, మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘ఓటుహక్కు లేనోళ్లు కూడా ఇక్కడి సమస్యలపై మాట్లాడతారా?’ అన్న లోకేశ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘‘శభాష్ లోకేశ్.. ఇప్పటికైనా రాష్ట్ర సమస్యలపై మాట్లాడే హక్కును సాధించావ్..’ అని జోకులు వినిపిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసుకు భయపడి విభజన హక్కును కేంద్రానికి తాకట్టుపెట్టారనే విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబును ఉద్దేశించి.. ‘తెలంగాణలో ఉన్న చివరి హక్కునూ వదులుకురు..’ అనే అర్థంలో కామెంట్లు పేలాయి. -
అమరావతి నగరాన..అపురూప ఘట్టం
♦ నేడు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ♦ వేదిక : అసెంబ్లీ కమిటీ హాలు ♦ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ ♦ 5,246 కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల ఓట్ల విలువ ⇔ అమరావతి ఓ అపురూప ఘట్టానికి వేదిక కానుంది. రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలకు తొలిసారి రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మారనుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 33 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. సాక్షి, అమరావతిబ్యూరో: రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును అమరావతిలో వినియోగించుకుంటారు. రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. మిగిలిన 174 మంది కూడా సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అమరావతి పరిధిలోని కృష్ణా జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. వారిలో కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, రక్షణనిధి, వల్లభనేని వంశీ, ఉప్పలపాటి కల్పన, బోడే ప్రసాద్, బోండా ఉమా తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు గతంలోనూ ఎమ్మెల్యే, ఎంపీలుగా చేసిన అనుభవం ఉంది. వారు గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక గుంటూరు జిల్లాలో 17 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొంటారు. వారిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీని వాసరెడ్డి, తెనాలి శ్రావణ్కుమార్, అనగాని సత్యప్రసాద్, రావెల కిషోర్బాబు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారు రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మిగిలినవారు గతంలో కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రెండు జిల్లాల్లో ఐదుగురు ఎంపీలు రాష్ట్రంలో 25 మంది లోక్సభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. వారిలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఐదుగురు ఎంపీలు ఉన్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు. కేశినేని నాని, గల్లా జయదేవ్, శ్రీరాం మాల్యాద్రి తొలిసారి ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్రానికి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్లో పాల్గొంటారు. వారిలో అమరావతి నుంచి ఒక్క కేంద్రమంత్రి సుజనా చౌదరి మాత్రమే ఉన్నారు. వై.ఎస్.జగన్ రాక నేడు రాష్ట్రపతి ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం విజయవాడ రానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన సోమవారం ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్కు వస్తారు. అక్కడ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాసేపు సమావేశమవుతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్పై చర్చిస్తారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలసి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనానికి బయలుదేరుతారు. అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. -
గ్రేటర్ 'ఓటరు నమోదు'లో విచిత్రం..
- భారతీయురాలు కాదంటూ దరఖాస్తు తిరస్కరణ - కుషాయిగూడ మీ సేవా కేంద్రం తీరుతో విస్తుపోయిన మహిళ హైదరాబాద్: 'ఓటు మీ హక్కు.. ఆ హక్కు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి' అంటూ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఈసీ చేసిన ప్రచారానికి జాగృతురాలైన ఓ మహిళ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె పుట్టి పెరిగింది ఈ గడ్డపైనే. విదేశాలు కాదుకదా పక్క రాష్ట్రం వెళ్లొచ్చిన దాఖలాలూ లేవు. కానీ మీ సేవా వెబ్ పోర్టల్ మాత్రం ఆమెను భారతీయురాలిగా గుర్తించలేదు. హైదరాబాద్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడ, నాగార్జున నగర్ కాలనీకి చెందిన నేరళ్ల అనిత గత నవంబరు 17న కుషాయిగూడలోని మీసేవా కేంద్రంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంది. ఓటరుగా నమోదయింది లేనిది తెలుసుకునేందుకు సోమవారం అదే మీసేవా కేంద్రానికి వెళ్లింది. అయితే దరఖాస్తు తిరస్కరణకు గురైందని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయింది. ‘మీరు భారతీయురాలు కానందున దరఖాస్తును తిరస్కరిస్తున్నం’ అని కంప్యూటర్ లో కనిపించడంతో ఆశ్చర్యపోయింది. 'నేను భారతీయురాలు కాకపోవడమేంటి?' అని అక్కడి సిబ్బందిని ప్రశ్నించింది. సిస్టమ్ ఓకే చెప్పనిదే తామేమీ చేయలేమని వారు బదులిచ్చారు. చేసేదేమీలేక మీసేవ వాళ్లిచ్చిన జిరాక్స్ కాపీతో అక్కడి నుంచి వెళ్లిపోయిందా మహిళ. -
రేవంత్ ఓటేయడం అనుమానమే..!
కోర్టులో హాజరుపరిచే సమయాన్నిబట్టి అవకాశం సోమవారం సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్ సమయం ఓటింగ్కు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరనున్న ఎమ్మెల్యే సాక్షి, హైదరాబాద్: ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోమవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది. రేవంత్ను సోమవారం కోర్టులో ఏసీబీ అధికారులు హాజరుపరచనుండగా కోర్టులో బెయిల్ పిటిషన్తోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని రేవంత్ పిటిషన్ వేస్తారని టీడీపీ వర్గాలు చెప్పాయి. కానీ, ఆయనను ఏ సమయంలో ఏసీబీ అధికారులు కోర్టుకు తీసుకెళ్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేముందు రేవంత్ను సోమవారం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారమంతా ముగిసి హాజరుపరిచేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ముగియనుండటంతో ఈలోగా ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చి కొంత సమయం మిగిలి ఉంటే ఓటు వేసే అవకాశం ఉంటుందని, లేదంటే అనుమానమేనని పేర్కొంటున్నాయి. -
మళ్లీ విద్వేష రాజకీయం
సంపాదకీయం మంచీ చెడ్డ విచక్షణ లేకపోతే పోయింది...కనీసం వేళా పాళా అయినా చూసుకోవా లని మతతత్వవాదులు అనుకోవడం లేదు. వివిధ మతాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలున్న దేశానికి ఆమోదయోగ్యమైన, అపురూపమైన రాజ్యాంగాన్ని అం దించిన మహనీయుడు డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంతి జరగ బోతున్నదని గానీ... విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మతాలకూ, సంస్కృతు లకూ, జాతులకూ దేశంలో సమానావకాశాలుంటాయని చెప్పిన సందర్భాన్నిగానీ గుర్తించకుండా ఎన్డీయే కూటమిలోని భాగస్వామి శివసేన మళ్లీ తన నైజాన్ని ప్రద ర్శించింది. ముస్లింలను తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు గనుక వారికున్న ఓటు హక్కును రద్దుచేయాలని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ రెండ్రోజుల క్రితం డిమాండ్ చేసింది. తరచు నోరుపారేసుకోవడంలో ఖ్యాతి గడిం చిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను కఠినంగా అమలు చేయాలని, అందుకు అంగీకరించనివారి ఓటు హక్కును రద్దు చేయాలని కోరారు. హిందూ మహాసభ ఉపాధ్యక్షురాలు సాధ్వీ దేవ ఠాకూర్ ఇంకో అడుగు ముందు కేశారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ముస్లిం, క్రైస్తవ మతాలవారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే వారి జనాభా పెరగకుండా ఉంటుందని ఆమె సలహా ఇచ్చారు. ఇవి ఎవరో మతి చలించినవారి మాటలుగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇప్పు డు మాట్లాడిన నేతలందరూ గతంలో కూడా ఇదే బాణీలో మాట్లాడారు. ఇక శివసేన సంగతి చెప్పనవసరం లేదు. ఆ పార్టీ సంస్థాపకుడు స్వర్గీయ బాల్ ఠాక్రే ఇలాంటి ప్రసంగాల్లో అందరినీ మించిపోయారు. 1987 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో ఆయన ముస్లింలపై చేసిన వ్యాఖ్యానాలపై కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఎన్నికల్లో అవినీతి విధానాలు అవలంబించారన్న అభియోగం రుజువైనందున ఠాక్రేను ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా, ఆయనకు ఓటు హక్కు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు 1995 డిసెంబర్లో ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్కు సలహా ఇచ్చింది. మిగిలిన ప్రక్రియంతా పూర్తయ్యాక ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకింద 1999లో ఠాక్రే ఓటింగ్ హక్కును సస్పెండ్చేశారు. ఆయన ఓటింగ్ హక్కు ఎందుకు రద్దయిందో శివసేన నేతలకు లోతుగా అర్థమై ఉంటే మళ్లీ ఆ తరహా మాటలు మాట్లాడకూడదు. కానీ వారికి తెలిసిందల్లా చట్టంలో ఓటు హక్కు రద్దు చేసే అవకాశం ఉంటుందన్న విషయం ఒక్కటే. అందువల్లే ఇప్పుడు ముస్లింలకు ఆ హక్కు రద్దుచేయమని డిమాండుచేస్తున్నారు. శివసేన వ్యక్తంచేసిన భావాలను తమవిగా భావించనవసరం లేదని బీజేపీ సంజాయిషీ ఇవ్వొచ్చు. సామ్నా సంపాదకీయాన్ని వెనువెంటనే ఆ పార్టీ ఖండించి ఉండొచ్చు. కానీ, ఇంతమాత్రాన బీజేపీ పాపం మాసిపోదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్యా దూరం పెరిగిన మాట వాస్తవమే కావొచ్చుగానీ...ఇప్పటికీ శివసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. కేంద్ర కేబినెట్లోనూ కొనసాగుతున్నది. ముస్లింలైనా, మరొకరైనా వారికై వారు ఓటు బ్యాంకుగా మారరు. శివసేన లాంటి పార్టీలు వారిని అలా మార్చుకుంటున్నాయి. సమాజాన్ని కుల, మత ప్రాతి పదికలపై చీల్చి వాటి ఆధారంగా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూడటం రాజకీయ పార్టీలు చేసే పని. తమ ప్రయోజనాల పరిరక్షణ సాధ్యమవుతుందనో, తమకు రక్షణ లభిస్తుందనో, తమ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనో ఆశించి చాలామంది ఇలాంటి పార్టీలపై భ్రమలు పెంచుకోవడం మాట వాస్తవమే అయినా అన్నివేళలా అది కొనసాగదు. నిజానికి అలా మత ప్రాతిపదికన ఓట్లేసి ఉంటే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ తరహా విజయం సాధ్యమయ్యేదే కాదు. ఈ దేశ ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని అవాంఛనీయమైన మాటలతో, అధిక ప్రసంగాలతో చెదరగొట్టుకుంటున్నదీ, అభద్రతా భావన కల్పించి వారిని మరోవైపు నెడుతున్నదీ ఈ బాపతు నేతలే. ఇంతకూ శివసేనకు ముస్లింల ఓటు హక్కు రద్దుచేస్తే బాగుంటుందన్న ఆలోచన ఎందుకొచ్చినట్టు? పుట్టి ఇన్నేళ్లయినా శివసేన అటు పటిష్టమైన ప్రాంతీయ పార్టీగా ఎదగలేదు. కనీసం హిందూత్వ విషయంలోనూ బలమైన పార్టీగా రూపొందలేదు. మహారాష్ట్ర కూటమిలో తనకు ఒకప్పుడు జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇవాళ శాసించే స్థాయికి చేరుకుంది. తన ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నది. గొడ్డు మాంసాన్ని నిషేధించడంలోగానీ, మల్టీప్లెక్స్లలో మరాఠీ చిత్రాల ప్రదర్శనకు సంబంధించిన ఆంక్షలు విధించడం లోగానీ బీజేపీ చురుగ్గా వ్యవహరించి శివసేనకు ఎజెండా లేకుండా చేసింది. ఎన్డీయే కూటమితో ఉంటామో ఉండమో చెప్పలేమన్న బెదిరింపులేవీ బీజేపీ అధినేతల ముందు పనిచేయలేదు. దానికితోడు ఎంఐఎం మహారాష్ట్రలో వేళ్లూనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే ఇలాంటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి సంచలనం కలిగించాలని, లబ్ధిపొందాలని శివసేన భావిస్తోంది. సమాజంలో అశాం తిని రగిలించేందుకూ, భిన్నవర్గాలమధ్య విభేదాలు సృష్టించేందుకూ ప్రయత్నించే శక్తులను ఆయా పార్టీల్లోని అగ్రనేతలు మందలింపుతో సరిపెట్టడమో, ప్రత్యర్థి పక్షాలు విమర్శించి ఊరుకోవడమో చేసినంతమాత్రాన ఒరిగేదేమీ లేదు. కొంత వ్యవధినిచ్చి అటువంటివారు మళ్లీ అదే బాణీలో మాట్లాడుతున్నారు. సమాజానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. విద్వేషపూరిత వ్యాఖ్యానాలు ఎవరు చేసినా వెనువెంటనే రంగంలోకి దిగి కేసులు పెట్టి చర్య తీసుకునే స్వతంత్ర వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ఈ బాపతు నేతలు దారికొస్తారు. తమ వ్యాఖ్యలు ఏదో సంచలనం కలిగించి ఊరుకోవడంకాక జైలుపాలు చేస్తాయని, ఎన్నికల రాజకీయా లకు శాశ్వతంగా దూరంచేస్తాయన్న స్పృహకలిగినప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటారు. రాజ్యాంగంపైనా, చట్టబద్ధపాలనపైనా నమ్మకం ఉన్న పాలకులు చేయాల్సిన పని అది. -
ఓటేద్దాం రండి!
సాక్షి, హన్మకొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. బరిలో 22 మంది అభ్యర్థులు నిలవగా, జిల్లాలో పట్టభద్రుల ఓట్లు 1,04,364 ఉన్నారుు. వీరిలో పురుషులు 76,873, మహిళా ఓటర్లు 27,487 కాగా ఇతర కేటగిరీలో నలుగురు ఓటర్లు ఉన్నారు. వీరు 144 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 99 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1000 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని మరో 45 చోట్ల అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించేందుకు వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేశారు. ఐదు చోట్ల అనువైన పరిస్థితి లేదు. ఏర్పాట్లు పూర్తి ఎన్నికల నిర్వాహణలో పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి 1000 మంది వరకు ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగనున్న దృష్ట్యా శనివారం సాయంత్రానికే ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇందుకోసం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, జనగామ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి పోలింగ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సూక్ష్మ పరిశీలకులుగా, పోలింగ్ పార్టీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరు అవసరాన్ని బట్టి పోలింగ్ సరళి, ఇతర సమాచారాలను నేరుగా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు సమాచారం ఇస్తారు. జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మినహా మిగతా అన్నింటిలో 1000 లోపు ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రంలో కూడా ఆలస్యం కాకుండా 800లోపు ఓట్లు ఉన్నట్లయితే రెండు ఓటింగ్ కంపార్టుమెంట్లు, ఆపైన ఓటర్లు ఉన్నట్లయితే మూడు ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్యాలెట్ బ్యాక్స్లు కూడా ఒక్కో బూత్లో రెండుకన్నా తక్కువ కాకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రాంతాన్ని 27 రూట్లు, 27 జోన్లుగా విభజించారు. వాటికి ప్రత్యేక ఇన్చార్జీలను నియమించారు. పోలింగ్ పూర్తరుున వెంటనే బ్యాలెట్ బాక్సులను డివిజన్ ప్రధాన కేంద్రాలు చేరుస్తారు. అన్ని బాక్సులు వచ్చినతర్వాత కట్టుదిట్టమైన భద్రత నడుమ నల్గొండకు తరలిస్తారు. స్థానికులనే ఏజెంట్లుగా నియమించుకోవాలి.. నియోజకర్గ పరిధిలోని వ్యక్తినే పోలింగ్ ఏజెంట్గా నియమించుకోవాలి. ఏజెంటుగా నియమితులైన వారు ఉదయం 7:00 గంటల వరకు పోలింగ్ కేంద్రాలను చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తీరు తెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు వరంగల్ క్రైం : ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అర్బన్ పరిధిలో ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 35 మంది ఎస్సైలు, 400 కానిస్టేబుళ్లతో పాటు ఒక కంపెనీ సీఐఎస్ఎఫ్ బలగా లు పో లింగ్ నిర్వహణలో సేవలందించనున్నాయి. కాగా, రూరల్ పరిధిలో 20 మంది సీఐలు, 56 మంది ఎస్సై లు, 83 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 300 కానిస్టేబుళ్లు, 67 మహిళా కానిస్టేబు ళ్లు, హోంగార్డులు, 100 మంది కానిస్టేబుళ్లు, 34 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, ఒక కంపెనీ సీఐఎస్ఎఫ్ బలగాలను బందోబస్తు కోసం నియమించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 31 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 2.86 లక్షల గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,33,003 మంది, హైదరాబాద్లో 87,208 మంది, మహబూబ్నగర్ జిల్లాలో 66,100 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 1,92,110 మంది పురుషులు కాగా, 94,188 మంది మహిళలు, మరో 13 మంది ఇతరులు ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 97, రంగారెడ్డిలో 165, హైదరాబాద్ జిల్లాలో 151 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లాలో 894 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరిలో 182 మంది ప్రిసైడింగ్ అధికారులు, 182 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 364 మంది పోలింగ్ సిబ్బందితోపాటు 166 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే స్థాయిలో పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఓటర్లకు అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో ‘నోటా’ను వినియోగించుకునే వీలు కల్పించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ రాజేంద్రనగర్లోని ఎంపీ ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుర్తింపు కార్డు తప్పనిసరి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లేని వారు పాస్పోర్టు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, పాన్కార్డు, విద్యాసంస్థల్లో పనిచేసేవారి సర్వీసు ఐడీ కార్డు, యూనివర్సిటీ డిగ్రీ/డిప్లొమా (ఒరిజినల్), అంగవైకల్య సర్టిఫికెట్ (ఒరిజినల్), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సర్వీసు ఐడీ కార్డు, ఎంపీలు, ఎమ్మెలే ్యలు, ఎమ్మెల్సీల అధికారిక ఐడీ కార్డులను చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పట్టభద్రులు ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి కానీ, ఇంటి నెంబరు లేదా ఓటరు పేరు ద్వారా కానీ తమ పోలింగ్ స్టేషన్ను వివరాలను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఓట్ అని టైపు చేసి స్పేస్ ఇచ్చి ఎపిక్ నెంబరు వేసి 87904 99899 నెంబర్కు ఎస్ఎంఎస్,లేదా టోల్ఫ్రీ నెంబరు 1950కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అభ్యర్థులు వీరే.. 1. ఆగిరు రవికుమార్ గుప్తా (కాంగ్రెస్) 2. జి.దేవీప్రసాద్రావు(టీఆర్ఎస్) 3. ఎన్.రామచంద్రరావు(బీజేపీ) 4. జాజుల భాస్కర్ ఆఫీసర్(శ్రమజీవి పార్టీ) 5. ఎ.సునీల్ కుమార్ అలిచాల (తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) 6. బి.సుశీల్కుమార్ (ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ) ఇండిపెండెంట్లు 7. అరకల కృష్ణగౌడ్ 8.కుందేటి రవి 9.కూరపాటి జాకోబ్ రాజు 10.కె. కృపాచారి 11.ఎం.కృష్ణ 12. గంగుల నరసింహారెడ్డి(జి.ఎన్.ఆర్.) 13. గౌరీశంకర్ప్రసాద్.ఎల్ 14. టి.నర్సింలు 15. పిట్ల నగేశ్ ముదిరాజ్ 16. పిల్లి రాజమౌళి 17.ఎ. భాస్కర్రెడ్డి 18.మహమ్మద్ అబ్దుల్ అజీజ్ఖాన్ 19. మీసాల గోపాల్ సాయిబాబా 20. ముకుంద నాగేశ్వర్ 21.రవీందర్ మాల 22.రాకొండ సుభాష్రెడ్డి 23.ఎస్.రాజేందర్ 24.డి.వి.రావు 25.కె.వి.శర్మ 26.శాంత్కుమార్ గోయెల్ 27.ఎ.శివకుమార్ 28.షేక్ షబ్బీర్ అలీ 29.సయ్యద్ హైదర్అలీ 30.సిద్ధి లక్ష్మణ్గౌడ్ 31.సిల్వేరి శ్రీశైలం 25న లెక్కింపు ఈ నెల 25న ఉదయం 8 గంటలకు చాదర్ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్లో ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్కు 28 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. -
30లోగా పాత ఎంపీలకే చాన్స్
* ‘స్థానిక’ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్అఫీషియోలపై న్యాయ శాఖ స్పష్టత * 16 తర్వాత కొత్త ఎమ్మెల్యేలకు ఓటు హక్కు * ప్రమాణ స్వీకారం చేయకున్నా ఓటేయొచ్చు * చైర్పర్సన్ల ఎన్నికపై తొలగిన సందిగ్ధం * జూన్ 2 తర్వాత నిర్వహణకే ఈసీ మొగ్గు సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికల నిర్వహణపై న్యాయ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహిస్తే ఎక్స్అఫీషియో సభ్యులుగా ప్రస్తుతమున్న ఎంపీలకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుందని పేర్కొంది. అయితే రాష్ర్ట శాసనసభ రద ్దయినందున ఎమ్మెల్యేల విషయాన్ని మాత్రం న్యాయశాఖ ప్రస్తావించలేదు. స్థానిక సంస్థలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తి చేసి ఫలితాల విడుదలకు సిద్ధమైన ఈసీ.. వాటి చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికపై సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు మే 16న వెల్లడికానున్న నేపథ్యంలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎవరికి అవకాశం కల్పించాలన్న విషయంలో స్పష్టత కోరుతూ రాష్ర్ట ప్రభుత్వానికి ఈసీ గత నెలలో లేఖ రాసింది. ప్రభుత్వం దీనిపై న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరింది. అయితే ఈలోగానే రాష్ర్ట శాసనసభ రద్దు కావడంతో ప్రస్తుత ఎమ్మెల్యేలంతా మాజీలయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీల పదవీకాలం ఈ నెల 30 వరకు ఉన్నందున ఆలోగా స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే పాత వారికే ఓటుహక్కు కల్పించాలని న్యాయశాఖ తేల్చింది. అయితే మున్సిపల్ చట్టాల ప్రకారం స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరోక్ష ఎన్నికల నిర్వహణకు నిర్దేశిత కాలపరిమితేమీ లేదని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి. నిజానికి ఎంపీపీ, జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యులు పాల్గొన్నప్పటికీ వారికి ఓటు హక్కు ఉండదు. మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో మాత్రమే ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిషత్లకు ఎప్పుడైనా పరోక్ష ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది. ఇక మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక విషయంలో ఎక్స్ అఫీషియో సభ్యులు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో మే 16 తర్వాత కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొత్త ఎమ్మెల్యేలు జూన్ రెండో తేదీ వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేనందున.. అప్పటివరకు పరోక్ష ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. రాజస్థాన్లో గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేయకున్నా చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని, అదే పద్దతిని ఇక్కడ కూడా పాటించే అవకాశం లేకపోలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ విధానంలో ఈ నెల 30లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రస్తుత ఎంపీలు, కొత్త ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. కానీ లోక్సభ ఫలితాలతో కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలు మాత్రం దూరంగా ఉండాల్సిందే. ఈ వివాదాలన్నింటినీ అధిగమించాలంటే.. జూన్ రెండో తేదీ తర్వాతే పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే మేలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత స్థానిక సంస్థల పాలకమండళ్లకు పరోక్ష పద్ధతిలో నిర్వహించే ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. -
ఎనిమిదిలోనూ భారీ పోలింగ్
* 7 రాష్ట్రాల్లోని 64 లోక్సభ స్థానాల్లో 63.8 శాతం పోలింగ్ * అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 81.28% * 41 నియోజకవర్గాలకు మే 12న చివరి విడత ఎన్నికలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో 8వ దశ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలు సహా ఏడు రాష్ట్రాల్లోని 64 లోక్సభ నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ ముగిసింది. మొదటి విడత నుంచి ఓటెత్తుతున్న భారీ పోలింగ్ ఈ దశలోనూ కొనసాగింది. మొత్తం 9.5 కోట్ల ఓటర్లకు గానూ.. దాదాపు 6.06 కోట్ల మంది (63.8%) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, ఆయన సోదరుడు వరుణ్ గాంధీ, ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి సహా 1737 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయింది. బీహార్లోని సీతామర్హి జిల్లాలో ఓ పోలింగ్ బూత్ను ఆక్రమించేందుకు కొందరు దుండగులు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారు. దాంతోపాటు, కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన 502 స్థానాల్లో రికార్డుస్థాయిలో 66.27% పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. 2009 ఎన్నికల్లో ఈ 502 నియోజకవర్గాల్లో 57.74 శాతం పోలింగ్ మాత్రమే నమోదయిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తరువాత ఈ శాతం మరింత పెరగొచ్చన్నారు. ► ఈ విడతలో అత్యధిక శాతం పోలింగ్ పశ్చిమబెంగాల్లో నమోదైంది. అక్కడ 81.28% ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానాల్లో 77.72% ఓటింగ్ నమోదైంది. ► ఉత్తరప్రదేశ్లో 55.52%, బీహార్లో 58% పోలింగ్ నమోదయింది. ఉత్తరప్రదేశ్లోని 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు హోరాహోరీ తలపడ్డాయి. రాహుల్గాంధీ బరిలో ఉన్న అమేథీలో 55.2% పోలింగ్ నమోదయింది. 2004 నుంచి వరుసగా ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న రాహుల్గాంధీ.. మొదటిసారి ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లి ఎన్నికల సరళిని పరిశీలించారు. ► జమ్మూ, కాశ్మీర్లోని బారాముల్లాలో మాత్రం వేర్పాటు వాదుల భయానికి ఓటర్లు ఓటేసేందుకు ముందుకురాలేదు. బారాముల్లా, లడఖ్ స్థానాల్లో 49.96% పోలింగ్ మాత్రమే నమోదైంది. గత ఎన్నికల్లో ఇది 39.68 శాతమే. ► నాలుగు స్థానాల్లో ఎన్నికలు జరిగిన హిమాచల్ప్రదేశ్లో 66.5%, ఐదు స్థానాల్లో పోలింగ్ జరిగిన ఉత్తరాఖండ్లో 62% పోలింగ్ నమోదైంది. 2009 ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్లో 53.7%, ఉత్తరాఖండ్లో 53.68% నమోదయింది. ► మొత్తంమీద ఈ విడత ఎన్నికల్లో బుధవారం నాటికి దేశం మొత్తంమీద 502 స్థానాల్లో పోలింగ్ పూర్తవగా.. మిగిలిన 41 నియోజకవర్గాల్లో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. ఓటేసిన తొలి ఓటరు కినౌర్: స్వతంత్ర భారత తొలి ఓటరు.. శ్యాంశరణ్ నేగి బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 97 ఏళ్ల నేగి హిమాచల్ ప్రదేశ్లోని కినౌర్ జిల్లా కల్పాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం.. ఇంకు పూసిన చూపుడు వేలిని మీడియాకు చూపారు. హిమాచల్ప్రదేశ్ సాంప్రదాయ టోపీ ధరించి, ఊతకర్ర సహాయంతో భార్యతో కలసి ఉదయం 6.55 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయనకు ఎన్నికల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఓటేసి బయటకొచ్చిన నేగీని శాలువా కప్పి సత్కరించారు. ‘నేను తొలి ఓటు వేసిన రోజు ఇప్పటికీ జ్ఞాపకముంది. ఆ ఆనందం, ఆ ఉద్వేగం జ్ఞాపకమున్నాయి. ఈ సారీ ఓటు వేశాను’ అని ఆయన అన్నారు. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి వరకు జరిగిన దేశ తొలి సాధారణ ఎన్నికల్లో తొలి ఓటు ఆయనే వేశారు. అప్పుడు ఉపాధ్యాయుడిగా ఉన్న నేగి వయస్సు 34 ఏళ్లు. ఆనాడు తొలి పోలింగ్ కేంద్రాన్ని కల్పాలోనే ఏర్పాటుచేశారు. అక్కడే ఎన్నికల విధుల్లో ఉన్న నేగి తొలుత తానే ఓటేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆయనను భారత తొలి ఓటరుగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేస్తూనే ఉన్నారు. -
ఓట్లు వేయించే బాధ్యత యువతదే: అస్మితా సూద్
ఇప్పుడు ఎన్నికల్లో అందరి దృష్టి యువతపైనే.. కారణం దేశ జనాభాలో 60 శాతం యువతే కావడం.. అయితే చాలా మంది యువతీ యువకులు... వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది.. దీన్నెవరూ ఏమీ చేయలేరు.. అనే నిరాశావాదంతో నిస్పృహతో రాజకీయాల గురించి మాట్లాడేందుకు, ఓటింగ్కు దూరంగా ఉంటారు. కానీ మన తలరాతలు మార్చే రాజకీయ వ్యవస్థను శాసించేందుకు యువతే ముందుకు కదలాలి. ఏ ఒక్క ఓటూ వృథా కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి... - అస్మితా సూద్, హీరోయిన్ -
ఓటు వేసిన ఎమెల్యే, ఎంపీ అభ్యర్థులు
-
ఓటు వేసి పండగ చేసుకోండి: సిత్మా సభర్వాల్
ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైనది ఓటు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. డబ్బు, మద్యం ప్రలోభాలకు లోనుకాకుండా సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. అప్పుడే ప్రజల ఆకాంక్షలతో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుంది. తద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. అందుకే అందరూ ఎన్నికలను పండుగలా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం మా బాధ్యత. దీనికోసం ‘ఓటరు పండగ’ కార్యక్రమం చేపట్టాం. మెదక్ జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెంచడానికి ప్రోత్సాహక బహుమతులు ప్రకటించాం. 95 శాతం పోలింగ్ నమోదైన గ్రామాలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కోసం రూ.2 లక్షలు ప్రత్యేక ప్రోత్సాహకంగా అందిస్తాం. ముఖ్యంగా రక్షిత మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు ప్రాముఖ్యం ఇస్తాం. దీనితో పాటు లక్కీడిప్ ద్వారా ఓటరును విజేతగా ఎంపిక చేస్తాం. విజేతలకు కారు, ఎల్సీడీ,ల్యాప్టాప్, మోటార్సైకిల్, కూలర్, ఫ్రిజ్ బంపర్ బహుమతులను అందజేస్తాం. ఓటు వేసినట్టు వేలుపై సిరా గుర్తు చూపించిన వారికి పోలింగ్ రోజున లీటర్ పెట్రోల్పై రూ.1 రాయితీ ఇస్తున్నాం. పారిశ్రామిక ప్రాంతాల్లో 90 శాతం పోలింగ్ నమోదైతే లక్కీడిప్ ద్వారా మొదటి 20 మంది ఓటర్లకు కూలర్లు, మరో 20 మందికి ఆరోగ్య తనిఖీ కూపన్లు ఇస్తాం. వీటితో పాటు మిగిలిన బంపర్ బహుమతులు కూడా వీళ్లకు వర్తిస్తాయి. 92 శాతం ఓటింగ్నమోదైన గ్రామాల్లో ఓటు వేసిన వారికి 10 మందికి డ్రాద్వారా ఒక్కొక్కరికి కనీసం రూ.1200 విలువైన బహుమతులు అందిస్తున్నాం. ఇవి కాకుండా చీరలు, కుట్టుమిషన్లు, రైతు ఉపకరణాలు,ధోవతి, ఫ్యాను తదితర వాటికి డ్రా ద్వారా ఎంపిక చేసి అంద జేస్తాం. - సిత్మా సభర్వాల్, మెదక్ జిల్లా కలెక్టర్ -
మేము సైతం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటుహక్కు వినియోగించుకునేందుకు మంగళవారం నగరం నుంచి వేలాది మంది జిల్లావాసులు పల్లెబాట పట్టారు. తమ తమ వృత్తులు, వ్యాపారాల రీత్యా నగరంలో వీరంతా ఓటు వేసేందుకు తమ సొంత ఊళ్లకు బయలుదేరివెళ్లారు. బుధవారం ఎన్నికలు, గురువారం మే డే రోజున సెలవు కూడా కలిసి రావడంతో స్వగ్రామాలకు బయలుదేరారు. రాజధాని నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే వాహనాలు మంగళవారం సాయంత్రం నుంచి కిటకిటలాడాయి. ఆర్టీసీ చాలా బస్సులను పోలింగ్ సిబ్బంది కోసం కేటాయించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి జిల్లాలోని నలుమూలలకు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైంది. కుటుంబాలతో ఇళ్లకు బయలుదేరిన వారు బస్సుల్లేక ప్రత్యామ్నాయ వాహనాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల కమిషన్ చేసిన విస్త్రృత ప్రచారం కారణంగా ఈసారి ఓటర్లలో చైతన్యం పెరిగింది. దీనికి తోడు రెండు రోజుల వరుస సెలవులు రావడంతో సుదూర ప్రాంత ప్రజలు కూడా స్వస్థలాలకు పయనమయ్యారు. -
మా ఓటు ఎక్కడంటే..!
మంచిర్యాల సిటీ, న్యూస్లైన్ : రిజర్వుడు స్థానాలకు వలస వచ్చిన నేతలు.. సొంత నియోజకవర్గం వదిలి సురక్షిత స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు.. పునర్విభజనతో పాత స్థానాలు చెల్లాచెదురైన నాయకులకు సొంత ఓటు దూరమవుతోంది. వారి ఓటు ఒక చోట ఉండటం, పోటీ మరొక చోట చేయడంతో ఓటుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇలా జిల్లాలోని రెండు లోక్సభ, పది అసెంబ్లీ స్థానాల్లో కొందరు అభ్యర్థులు ఓటు వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బాల్క సుమన్ కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ఓటు హక్కు ఉంది. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి తులసీదాస్ తన నియోజకవర్గంలో కాకుండా ఆదిలాబాద్లో ఓటు ఉంది. అదేవిధంగా చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్లో ఓటు వేయనున్నారు. పార్లమెంట్ స్థానాలు.. ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ ఉట్నూర్లో, టీఆర్ఎస్ అభ్యర్థి గెడం నగేష్ బజర్హత్నూర్ మండలం జాతర్లలో, కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్ గుడిహత్నూర్ మండలం తోషంలో ఓటు వేయనున్నారు. పెద్దపల్లి : పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద, టీడీపీ అభ్యర్థి శరత్బాబు మంచిర్యాలలో, టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాకుండా కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ఓటు వేయనున్నారు. శాసనసభ స్థానాలు.. ఆదిలాబాద్ : ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెజ్జంకి అనిల్కుమార్, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్, కాంగ్రెస్ అభ్యర్థి బార్గవ్ దేశ్పాండే ఆదిలాబాద్లో, టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న జైనథ్ మండలం దీపాయిగూడలో ఓటు వేయనున్నారు. నిర్మల్ : నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి అల్లూరి మల్లారెడ్డి నిర్మల్ మండలం మాధాపూర్లో, టీడీపీ అభ్యర్థి మిర్జాయాసిన్ బేగం, కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ఐకే రెడ్డి నిర్మల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీహరిరావు మామడ మండలం దిమ్మతుర్తిలో ఓటు వేయనున్నారు. ఖానాపూర్ : ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ ఖానాపూర్లో, కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా హరినాయక్ జన్నారంలో, టీడీపీ అభ్యర్థి రితీష్ రాథోడ్ ఉట్నూర్లో ఓటు వేయనున్నారు. బోథ్ : బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సా ర్ సీపీ అభ్యర్థి గెడం తులసీదాస్ తాను పోటీ చేస్తున్న స్థానంలో కాకుండా ఆదిలాబాద్లో ఓటు వేయనున్నా రు. అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురా వు ఇచ్చోడలో, కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ జాదవ్ నేరడిగొండ మండలం రాజూరలో, టీడీపీ సోయం బాపురా వు బోథ్ మండలం నాగోగులలో ఓటువేయనున్నారు. ముథోల్ : ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విఠల్రెడ్డి భైంసా మండలం దేగాంలో, టీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాలాచారి భైంసాలో, బీజేపీ అభ్యర్థి రమాదేవి కుంటాల మండలం అందపూర్లో ఓటు వేయనున్నారు. మంచిర్యాల : మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి సయ్యద్ అఫ్జలుద్దీన్, టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం అరవిందరెడ్డి, బీజేపీ అభ్యర్థి మల్లారెడ్డిలు మంచిర్యాలలో ఓటు వేయనున్నారు. చెన్నూర్ : చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ మేకల ప్రమీల , బీజేపీ అభ్యర్థి రాం వే ణు, టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు మందమర్రిలో, గడ్డం వినోద్ పోటీ చేస్తున్న స్థానంలో కాకుండా హైదరాబాద్లో ఓటు వేయనున్నారు. బెల్లంపల్లి : బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజ్కిరణ్, సీపీఐ అభ్యర్థి గుం డా మల్లేష్, టీడీపీ అభ్యర్థి పాటి సుభద్రలు బెల్లంపల్లి లో, టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య నెన్నల మండ లం జెండా వెంకటాపూర్లో ఓటు వేయనున్నారు. ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సక్కు తిర్యాణి మండలం లక్ష్మీపూర్లో, టీఆర్ఎస్ అభ్యర్థి కొవ లక్ష్మీ, టీడీపీ అభ్యర్థి మర్సుకోల సరస్వతీలు ఆసిఫాబాద్లో ఓటు వేయనున్నారు. సిర్పర్ కాగజ్నగర్ : సిర్పూర్ కాగజ్నగర్ నుంచి వైఎస్సార్ సీపీ షబ్బీర్ హుస్సేన్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంసాగర్రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సమ్మయ్య, టీడీపీ అభ్యర్థి రావి శ్రీనివాస్, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పలు కాగ జ్నగర్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. -
సమస్యలు ఉంటే తెలపాలి
కలెక్టరేట్, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులకు సమస్యలు, సందేహాలు ఉంటే తెలపాలని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సీడీలను, హార్డ్ కాపీలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల జాబితా కూడా అతికించడం జరుగుతుందన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఈవీఎంల కమిషనింగ్ ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతుందన్నారు. ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన కల్పించాలని, సెక్టోరల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కమిటీలు, ఫ్లయింగ్ స్క్వాడ్, గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పోలింగ్ ఏజెంట్ల జాబితా ఈ నెల 28న ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలను సక్రమంగా అందజేయాలని, అనుభవం గల అకౌంటెంట్లను నియమించుకోవాలన్నారు. ప్రచార కార్యక్రమాలకు అనుమతి తీసుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సారి 90 శాతం పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నెల 30న పోలింగ్ ఉండడం వల్ల జిల్లా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఈనెల 28లోగా తిరిగి వెళ్లిపోవాలన్నారు. అక్రమ మద్యం రవాణాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ఎలాంటి సమాచారమైన ఫోన్ ద్వారా తెలపవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జేసీ లక్ష్మీకాంతం, పార్టీల నాయకులు ఎం. ప్రభాకర్రెడ్డి, యూనిస్ అక్బానీ, ప్రశాంత్ కుమార్, బండి దత్తాత్రి, సురేష్ జోషి, ఓంకార్ మల్ శర్మ, లక్ష్మణ్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ మీడియా చానల్ ప్రారంభించిన ఈసీ
న్యూఢిల్లీ: ఓటు హక్కు, పోలింగ్ విధానం తదితర అంశాలలో ఓటర్లకు చైతన్యం కలిగించే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఇంటర్నెట్ ఆధారిత ‘‘ఓటర్ ఎడ్యుకేషన్ చానల్’’ను ప్రారంభించింది. తన అధికారిక వెబ్సైట్లో ఈ చానల్ లింకును ఈసీ ఏర్పాటు చేసింది. దీనిని యూ ట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. ఈ చానల్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 10,400 హిట్స్ వచ్చాయి. ప్రముఖ వ్యక్తుల సందేశాలతో కూడిన వీడియోలను ఇందులో పొందుపరిచారు. ప్రధాన ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ సందేశంతో ప్రారంభమయ్యే ఈ వీడియోల్లో.. క్రికెటర్ ధోనీ, షట్లర్ సైనా నెహ్వాల్, బాక్సర్ మేరీ కోమ్ లాంటి క్రీడాకారులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, నటుడు ఆమిర్ ఖాన్ వంటి ప్రముఖుల సందేశాలు కూడా ఉన్నాయి. త్వరలోనే ఈ చానల్లో మరిన్ని వీడియో క్లిప్పిం గులు అందుబాటులో ఉంచుతామని ఈసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. -
మేల్కొనకపోతే ఐదేళ్లు కష్టమే..
మంచిర్యాల రూరల్, న్యూస్లైన్ : ఓటు హక్కును వినియోగించుకోవడంలో లక్షలాది మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని చెబుతున్నా ఓటు వేయడానికి చాలా మంది మందుకు రావడం లేదు. దీనికి తాజాగా జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికలే నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో 1,17,381 మంది.. మొదటి విడత పరిషత్ ఎన్నికల్లో 1,41,288 మంది.. రెండో విడత పరిషత్ ఎన్నికల్లో 1,17,325 మంది అంటే మొత్తంగా 4,35,994 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోలేదు. ఒక్క మన జిల్లాలోనే ఇంత మంది ఓటుకు దూరమైతే ఇతర జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఇంక ఎంత మంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారో ఒక్కసారి పరిశీలిస్తే ఓటు వేయని వారు కోట్ల సంఖ్యలో ఉంటారు. ప్రధానంగా పట్టణాల్లో నిర్లక్ష్యం అధికంగా కనిపిస్తుంది. పల్లెల్లో కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటి వచ్చి ప్రజలు ఓటు వేశారు. చదువుకున్న వారు నిర్లక్ష్యం వీడితే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఒక్క రోజు కేటాయించండి.. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయని వారు ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎన్నికలకు మ రో 15 రోజుల సమయం ఉన్నందున దూర ప్రాంతాల్లో ఉండే వారు, ఓటు వేసేందుకు ఒక రోజు ముందుగానే వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోండి. ఓటరు కా ర్డు లేకున్నా, ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తమ వెంట తీసుకెళ్లాలని మరవకండి. ఓటు వేసేందుకు క్యూలో గంటల తరబడి నిలబడడం తమవల్ల కాదని, నిర్లక్ష్యం చేయకండి. ఐదేళ్లకు ఒకసారి మాత్రమే మనం ఓటు వేస్తామని, అందుకు ఒక్క రోజును మనం కేటాయించాలనే విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని పాలించే నాయకున్ని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకండి. ఏ నాయకుడు నచ్చకపోతే ‘నోటా’ అనేది ఉంటుం దని మరవకండి. నచ్చిన అభ్యర్థికే వేస్తారో... అభ్యర్థులు నచ్చలేదని తిరస్కరించే ‘నోటా’కే మీ ఓటు వేస్తారో మీ ఇష్టం. కాని ఓటు మాత్రం వేయడం మరవద్దు. నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుందని అనుకుంటే పొరపాటు, అలా అనుకునే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో 4.36 లక్షల మంది ఓటు వేయలేక పోయారనే విషయాన్ని గ్రహించాలి. అధికారుల పాత్రే కీలకం ఓటు హక్కుపై ప్రజల్లో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఓటరును పోలింగ్ కేంద్రానికి రప్పించడమే అధికారులకు అసలైన సమస్య. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్న ప్రజలు ఓటు వేసేందుకు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు మన జిల్లాలో ఉన్నాయి. వాగులు, వంకలు, రాళ్లు తేలిన రోడ్లపై నడిచి కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు ఓటర్లు వస్తున్నా, పూర్తిస్థాయిలో రావడం లేదనే విషయాన్ని గ్రహించాలి. గతంలో లాగా పోటీలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను తరలించేందకు ఆస్కారం లేకపోవడంతో, ఇప్పుడు దూర ప్రాంతంలోని వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు సరైన వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. పోలింగ్ రోజుతో పాటు, అంతకంటే ముందు రోజు గానీ, తరువాత రోజు గానీ ప్రభుత్వ పరంగా సెలవు ప్రకటిస్తే, దూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు వారి స్వస్థలాలకు చేరుకుని ఓటు వేసేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న వారిలో యువత ఎక్కువ శాతం ఉంది. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలి. పోల్ చీటీలను పోలింగ్కు మూడు రోజుల ముందుగానే ప్రతి ఓటరుకు చేరేలా చర్యలు తీసుకోవాలి. -
ఔను.. వారు రెండు రాష్ట్రాల్లో ఓటేశారు
కెరమెరి, న్యూస్లైన్ : ఆంధ్రా, మహారాష్ట్ర వివాదాస్పద సరి హద్దులోని రెండు గ్రామాల పంచాయతీలైన పరందోళి, అంతాపూర్ ప్రజలు రెండ్రోజుల్లో రెండు రాష్ట్రాల్లో రెండు సార్లు ఓటు హక్కు విని యోగించుకున్నారు. గురువారం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన పార్లమెం టు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం జిల్లాలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. అంతాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన ఓటర్లకు బోలాపటార్లో, బోలాపటార్కు చెందిన ఓట ర్లఅంతాపూర్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో రవాణా సౌకర్యం కోసం ఓట ర్లు ఇబ్బంది పడ్డారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. బోలాపటార్లో 8.30 గంటల వరకు ఒక్కరూ ఓటు వేయలేదు. అనంతరం ఒక్కొక్కరుగా వచ్చారు. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో ఆల స్యం జరిగింది. మరోవైపు అనేకమంది కాలినడకన రావడంతో ఇబ్బంది పడ్డారు. చంద్రాపూర్ ఎంపీ ఎన్నికల్లో ఎడమచేయి చూపుడు వేలుకి సిరా చుక్కవేయగా, శుక్రవారం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎడమచేయి మధ్యవేలికి సిరా చుక్కవేశారు. రెండు గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,585 ఓటర్లు ఉన్నారు. ఇందులో పరందోళి గ్రామపంచాయతీలో 1,317మంది ఓటర్లకు గాను 1071 మంది ఓటు వేశారు. 81.32 శాతం పోలింగ్ నమోదైంది. అంతాపూర్ గ్రామ పంచాయతీలో 1,268 ఓటర్లకు గాను 922మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 72.71శాతం పోలింగ్ నమోదైంది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
యువతే శాసించాలి : చార్మి
ఇప్పుడు ఎటు చూసినా సమాజంలో అశాంతి, అభద్రతాభావం రాజ్యమేలుతున్నాయి. ఈ సంక్షోభాలను ఎదుర్కోవాలంటే రాజకీయాలను యువతే శాసించాలి. దేశభవిష్యత్తు.. కొత్త రాష్ట్రాల భవిష్యత్తు ఉన్నతంగా లిఖించాల్సిన బాధ్యత యువతరంపైనే ఉంది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ముందుకు సాగాలంటే వనరులు, ప్రమాణాలతో కూడిన విద్య అవసరం.. ఇది కొందరికే పరిమితం కాకూడదు. అందరికీ అందాలి.. యువత ఎప్పటికప్పుడు విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని నవసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.. మరో ముఖ్య విషయం.. స్త్రీ స్వేచ్ఛకు భంగం కలగని సమాజం కావాలి.. అటువంటి సమాజాన్ని సృష్టించే నాయకుడినే ఎన్నుకోవాలి.. యువత తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు వేయడం మన హక్కే కాదు.. దేశపౌరులుగా మన బాధ్యత కూడా.. -
‘గూగుల్’తో నేతల జాతకాలు...
ఓటు వేసే ముందు మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేతల జాతకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ‘గూగుల్’లో గాలించండి. వారి వివరాలన్నీ క్షణాల్లోనే మీ కళ్ల ముందుంటాయి. భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ‘గూగుల్’ తన ఎన్నికల పోర్టల్లో ‘నో యువర్ కేండిడేట్స్’ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ‘గూగుల్.ఇన్/ఎలక్షన్స్’ పోర్టల్లో ‘నో యువర్ కేండిడేట్స్’ ద్వారా ఎన్నికల బరిలోనున్న అభ్యర్థులందరి వివరాలనూ క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. కేవలం ప్రచారార్భాటాన్నే నమ్ముకోకుండా, అభ్యర్థుల వివరాలను పూర్తిగా తెలుసుకుని ఓటర్లు మరింత విచక్షణతో తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఇది దోహదపడగలదని పరిశీలకులు భావిస్తున్నారు. -
విభజన పార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటాం: అశోక్బాబు
మేమూ రాజకీయాలు చేస్తాం: అశోక్బాబు తణుకు, న్యూస్లైన్: రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలపై ఓటు హక్కుతో ప్రతీకారం తీర్చుకుంటామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం తణుకు ఎన్జీవో హోంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలవైపే ఉద్యోగ సంఘాలు మొగ్గుచూపుతాయని చెప్పారు. రాజకీయ పార్టీలు ఓట్లు, సీట్లు అనే పద్ధతిలో కాకుండా, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడాలని.. అటువంటి పార్టీల వైపు తాము ఉంటామన్నారు. ఉద్యోగుల సమస్యలను, సంక్షేమాన్ని పట్టించుకోకపోతే తామూ రాజకీయాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కమలనాథన్ కమిటీలో అవగాహనలేమి కారణంగా ఉద్యోగుల ఆప్షన్లపై ఎటువంటి స్పష్టతా లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్లో ఉన్న లక్ష మంది పెన్షనర్లకు సక్రమంగా పెన్షన్ అందాలని, పీఆర్సీ, హెల్త్ కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే ఉద్యోగ సంఘాలు మద్దతిస్తాయని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పలుచోట్ల ఎన్నికల ఫలితాలను మార్చారని.. ఉద్యోగులను తక్కువగా అంచనా వేయొద్దని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అధినేతలను కలిశామని, త్వరలో మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డిని కూడా కలుస్తామని చెప్పారు. -
ఓటుహక్కుపై నిరాసక్తత వద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని ప్రతి ఓటరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఓటు విషయంలో నిరాసక్తత ప్రదర్శించకూడదని కలెక్టర్ బి. శ్రీధర్ సూచించారు. ఓటు హక్కు వినియోగంపై కలెక్టర్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ‘ఓటు వేస్తాం’ అంటూ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించి ఆ ఫొటోలను తనకు పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పనిచేసే ఉద్యోగులందరూ జిల్లాలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని, జీహెచ్ఎంసీ పంపిన ఉత్తర్వులను తగు వివరణలతో తిప్పి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా మొత్తం మీద ఎన్నికల నిర్వహణకు 33 వేల మంది సిబ్బంది అవసరమవగా ఇప్పటి వరకూ 20 వేల మంది వివరాలు మాత్రమే అందాయని, ఇంకా 13 వేల మంది సిబ్బంది కొరత ఉందని తెలిపారు. పదవీ విరమణ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ముందుకు రావాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు 98663 06532 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికల విధులు నిర్వహిస్తామంటూ జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రమాణం చేయించారు. సమావేశంలో ఓటర్ల అవగాహన నోడల్ అధికారి డాక్టర్ అనంతం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
కలెక్టరేట్, న్యూస్లైన్ : ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అన్నారు. ‘పరిషత్’ ఎన్నికలకు సంబంధించి మంగళవారం జిల్లాకేంద్రం లోని అంబేద్కర్ భవనంలో సూక్ష్మ పరిశీలకుల కు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సూక్ష్మ పరిశీలకులంతా జనరల్ అబ్జర్వర్ల పర్యవేక్షణలో పనిచేస్తారని తెలిపారు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ జరుగుతున్న తీరు, అధికారుల విధి నిర్వహణ తీరు, పోలింగ్ సిబ్బంది వ్యవహర శైలిని పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు బాధ్యతలు నిర్వర్తించాలని తెలియజేశారు. పోలింగ్ రోజున పోలింగ్కు గంట ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సూక్ష్మ పరిశీలకుల నివేదిక ఆధారంగా అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తామని, నిష్ఫక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. సూక్ష్మ పరిశీలకులందరికి సార్వత్రిక ఎన్నికలకు త్వరలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలియజేశారు. అంతకు ముందు డీఆర్డీఏ పీడీ వెంకటేశం మాట్లాడుతూ... పోలింగ్ రోజున బ్యాలట్ బాక్సులను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలకు తప్పక పాటించాలన్నారు. ఈసీ సూచనలకు అనుగుణంగా పోలింగ్ అధికారులు ఓటర్ల చేతివేళ్లపై మార్కింగ్ వేస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఓటర్లు కానివారు ఓటింగ్ కోసం వస్తున్నారా, కమిషన్ జారీచేసిన పాసులు లేకుండా పోలింగ్ కేంద్రాలకు ఎవరైనా వస్తున్నారా, ఏవైన లోపాలు దృష్టికి వస్తే ఎన్నికల పరిశీలకులకు సమాచారం అందిస్తుండాలని సూచించారు. పోలింగ్ అయిన పిదప నిర్ధేశించిన పట్టికలో వివరాలు నమోదు చేసి అబ్జర్వర్లకు అందచేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన పలు నిబంధనలను మైక్రో అబ్జర్వర్లకు సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వరరావు వివరించారు. అవగాహన సదస్సులో 278 మంది మైక్రో అబ్జర్వర్లు, పలువురు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
మున్సి‘పోలింగ్’కు ఏర్పాట్లు పూర్తి
కొత్తగూడెం, న్యూస్లైన్: ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓరారు. ఆయన శుక్రవారం ఇక్కడ ఎస్పీ ఎవి.రంగనాథ్, ఎన్నికల పరిశీలకుడు విష్ణువర్థన్తో కలిసి విలేకరుల సమావేశంలోలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామన్నా. ఈవీఎంలు మొరాయిస్తాయేమోనని ప్రత్యామ్నా య ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేయని చోట రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఓటర్ స్లిప్లు పంపిణీ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కొత్తగా ఓటరు నమోదు కోసం ఈ నెల 9న పదివేల మంది దరఖాస్తు చేశారన్నారు. పరిశీలనలో జాప్యం కారణంగా వీరికి ఇంకా ఓటు హక్కు రాలేదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ప్రధానంగా కొత్తగూడెం, ఖమ్మం డివిజన్ల నుంచి ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రూ.60 లక్షలు స్వాధీనం: ఎస్పీ ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న రూ.60లక్షల నగదు స్వాధీనపర్చుకున్నట్టు ఎస్పీ ఎవి.రంగనాథ్ చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమణ కింద 35 కేసులు నమోదు చేశామన్నారు. తనిఖీలు, దాడుల ద్వారా 3,600 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 4,200 బీర్ బాటిళ్లు, 25 టన్నుల నల్ల బెల్లం, తొమ్మిది టన్నుల పటిక పట్టుకున్నట్టు చెప్పారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిలిపివేశామని, బెల్ట్ షాపులకు సహకరిస్తున్న ఏడు వైన్ షాపులను సీజ్ చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులకు నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తులో ఏడుగురు డీఎస్పీలు, 36 మంది సీఐలు, 123 మంది ఏఎస్సైలు, 7175 మంది కానిస్టేబుళ్లు, 402 మంది మహిళా కానిస్టేబుళ్లు పాల్గొంటారని వివరించారు. వీరితోపాటు నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలు కూడా విధులు నిర్వర్తిస్తాయన్నారు. సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్ పాల్గొన్నారు. -
పోలింగ్ శాతం పెంచండి: భన్వర్లాల్
తక్కువ పోలింగ్ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టండి: భన్వర్లాల్ విజయవాడ సిటీ, న్యూస్లైన్: ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకునేలా, పోలింగ్ శాతాన్ని పెంచేలా ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ ఆదేశించారు. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎన్నికలపై విసృ్తత ప్రచారం కల్పించాలన్నారు. ఈ మేరకు విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు నిర్దిష్టమైన సూచనలు చేశారు. - గత ఎన్నికల్లో 72 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని, ఈసారి కనీసం 85 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామని, దీనికి సంబంధించిన ప్రచారం కల్పించాలని కోరారు. - ఓటరు ఇంటికి వెళ్లి స్లిప్పు ఇచ్చి ఓటు వేసేందుకు రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. పట్టణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది ఓటుహక్కును వినియోగించుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. - ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ కామినీ చౌహాన్ రతన్ హైదరాబాద్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లో అమలుచేసిన స్వీప్ సిస్టమ్ విధానం ద్వారా పోలింగ్ శాతం పెరిగేలా చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మన అధికారులకు వివరించారు. - యువత, మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఎక్కువ శాతం మంది పోలింగ్లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నట్టు చౌహాన్ తెలిపారు. స్లోగన్ పోటీలు, కార్టూన్, పతంగుల పండుగ, మానవహారాలు, సంతకాల సేకరణ, ఓటుహక్కు వినియోగించుకుంటామనే ప్రతిజ్ఞ, ఓటువిలువ తెలిసేలా కార్యక్రమాలు అమలు చేశామన్నారు. -
అరకొర సిబ్బంది.. తీరని ఇబ్బంది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల విధు ల కోసం జిల్లా యంత్రాంగం ఉద్యోగులను అన్వేషిస్తోంది. ఇప్పటికే ప్రభు త్వ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉద్యోగుల జాబితాను సేకరించిన యంత్రాంగం, అవసరాల మేరకు సమకూరకపోవడంతో కొత్త వారి కోసం వెతుకులాట సాగిస్తోంది. ఈ మేరకు ప్రైవేటు సంస్థల ఉద్యోగులను కూడా పోలింగ్ నిర్వహణకు వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఏప్రిల్ 30న జరిగే సాధారణ ఎన్నికల్లో సుమారు అరకోటి మంది ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ఇందుకుగాను ఆరు వేల పోలింగ్ బూత్లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ స్టేషన్కు సగటున ఐదుగురు ఉద్యోగులుండే లా కార్యాచరణ తయారు చేసింది. దీనికి అదనంగా 10శాతం సిబ్బందిని రిజర్వ్లో ఉంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ బూత్లు మన జిల్లాలోనే ఉండడంతో 35వేల మందిని ఎన్నికల విధులకు అవసరమవుతారని అంచనా వేసింది. ఇందులో రెండు వేల మంది సూక్ష్మ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే సీనియర్ అధికారులకు ఈ బాధ్యతలను అప్పగిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారీ మొత్తంలో అవసరమైన ఉద్యోగులను సమకూర్చడం యం త్రాంగానికి తలకుమించిన భారంగా మారింది. 12వేలు కొరత! ఉద్యోగుల వేట ముమ్మరంగా కొనసాగిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు 12 వేల మంది కొరత కనిపిస్తోంది. వీరిని ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలో తెలియక జిల్లా యంత్రాంగం తలపట్టుకుంటోంది. దాదాపు పక్షం రోజులుగా ఉద్యోగులను గుర్తించడంలో తలమునకలైన అధికారులకు నిరాశే మిగిలింది. ఎన్నికల గడువు సమీపిస్తున్నందున ఆలోపు పోలింగ్ స్టాఫ్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాల్సివుంటుంది. మరోవైపు కేంద్ర పరిశీలకులు కూడా ఏప్రిల్ 1 నాటికి జిల్లాకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త శాఖల నుంచి ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్కు కలెక్టర్ శ్రీధర్ లేఖ రాశారు. ఇప్పటివరకు ఎన్నికల విధులకు దూరంగా ఉన్న శాఖలను కూడా ఈసారి రంగంలోకి దించితేనే గండం గట్టెక్కుతుందనే భావించిన అధికారులు పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏజీ ఆఫీస్, అరణ్యభవన్, రైల్వే, పాఠశాల విద్యాశాఖ, హౌసింగ్ బోర్డు తదితర శాఖలపై దృష్టి సారించారు. ‘విభజనే’ ముఖ్యం! ఇదిలావుండగా, పోలింగ్కు స్టాఫ్ కొరత తీవ్రం గా వేధిస్తున్నందున మొదటిసారి సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికల నిర్వహణకు వాడుకోవాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు జీఏడీ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే ఈసీ ప్రతిపాదనకు చుక్కెదురైంది. రాష్ట్ర విభజన కసరత్తు మెలిక పెడుతూ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం కాలేమని స్పష్టం చేసింది. విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు సెలవు దినాల్లో కూడా పనిచేస్తున్నందున, ఎలక్షన్ డ్యూటీలకు హాజరుకాలేమని తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాలలు, కళాశాల ల్లో పనిచేసే సిబ్బందిని కూడా వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ఈసీకి లేఖ రాసింది. -
భారత్లో స్వచ్ఛమైన ప్రభుత్వం రావాలి: భారతీయ అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికాలోని దాదాపు 30 లక్షల మంది భారతీయ అమెరికన్లలో అతికొద్దిమందికి మాత్రమే భారత్లో ఓటు హక్కు ఉంది. అయితే ఆ వర్గానికి చెందిన వారిలో ప్రతి ఒక్కరూ భారత్లో లోక్సభ ఎన్నికల తర్వాత స్వచ్ఛమైన ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిస్తున్నారు. ‘భారత్ ప్రపంచ వేదికపై కనిపించడం లేదు. కొత్త ఆలోచనలను స్వీకరించి దేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపే ప్రభుత్వం రావాలి’ అని భారత సంతతి ప్రజల అంతర్జాతీయ సంస్థ(గోపియో) వ్యవస్థాపక అధ్యక్షుడు థామస్ అబ్రహామ్ అన్నారు. కొత్త ప్రభుత్వం అమెరికా, భారత్ల మధ్య సంబంధాలను బలోపేతం చేసేదిగా ఉండాలన్నారు. -
ప్రతి నెలా వివరాలు వెల్లడించాలి
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇకపై తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) గురించి ప్రతి నెలా మరిన్ని వివరాలు వెల్లడించాల్సి రానుంది. అలాగే, తాము ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో వోటింగ్ హక్కులను వినియోగించుకున్న తీరు వెనుక హేతుబద్ధతను కూడా ఇన్వెస్టర్లకు వివరించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇన్వెస్టర్లకు మరింత చేరువయ్యే దిశగా ఆన్లైన్, మొబైల్ మాధ్యమాలతో పాటు ఇతర మార్గాల్లోనూ ఫండ్స్ విక్రయాలను పెంచుకోవాల్సి ఉంటుంది. దాదాపు రూ. 9 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు సంబంధించి మొట్టమొదటిసారి రూపొందించిన దీర్ఘకాలిక నిబంధనలపై స్టాక్మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ విధానాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం వివిధ స్కీములు, రిటైల్..కార్పొరేట్ వంటి ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రాష్ట్రాల వారీ పెట్టుబడులు తదితర వివరాలన్నీ ఫండ్ సంస్థలు ప్రతి నెలా వెల్లడించాలి. వీటన్నింటినీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వారం పనిదినాల్లోగా ఉంచాలి. మరోవైపు, వివిధ సంస్థల్లో వోటింగ్ హక్కులను ఏ విధంగా (అనుకూలంగా, వ్యతిరేకంగా మొదలైనవి) వినియోగించుకున్నదీ, దాని వెనుక హేతుబద్ధత ఏమిటి అన్నది కూడా ఫండ్ సంస్థలు వార్షిక నివేదికల్లో, వెబ్సైట్లలో వెల్లడించాలి. ఇక, అదనపు పంపిణీ మార్గాలను పెంచుకునే దిశగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల మద్దతు తీసుకోవాలని ఫండ్ సంస్థలకు సెబీ సూచించింది. అలాగే ఇంటర్నెట్, మొబైల్ యూజర్ల కోసం ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ విధానాలను మెరుగుపర్చాలని పేర్కొంది. ప్రాంతీయ భాషల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. -
మాది డేగకన్ను
భన్వర్ లాల్.. ఇప్పుడు రాష్ట్రంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పట్టి పట్టి, పట్టుదలగా తెలుగు మాట్లాడే ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల క్రతువుకు సారథి. 2010 నవంబర్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి పలు ఉప ఎన్నికలను సమర్థంగా నిర్వహించి తానేమిటో నిరూపించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో వాటికి సంబంధించి పలు అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ... బోగస్పై వేటు ఇప్పటిదాకా 33 లక్షల బోగస్, డూప్లికేట్ ఓట్లను తొలగించాం. ఒకరికి రెండు, మూడు ఓట్లుంటే వాటిని ఏరేసే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశాం. పోలింగ్ సమయానికి ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఆచూకీ లభించని, చనిపోయిన, డూప్లికేట్ ఓటుగా అనుమానవుున్న జాబితాను ప్రత్యేకంగా ఆయా ఎన్నికల అధికా రులకు అందజేస్తాం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా యువత భాగస్వామ్యం కానుంది. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రవూలు నిర్వహించి వురీ 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేరుుంచుకునేలా శ్రద్ధ తీసుకుంది. రాష్ట్రంలో కూడా ఇఅందుకు ఎంతో కృషి చేశాం. ఓటర్లుగా నమోదై, ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ విసృ్తతంగా ప్రచారం చేశాం. విద్యా సంస్థల యాజమాన్యాలు, యూనివర్సిటీలు ఇందుకు పూర్తి సహకారం అందించాయి. స్వచ్ఛంద సంస్థలతో పాటు మీడియా కూడా లక్ష్య సాధనలో తోడ్పడింది. ‘ఆన్లైన్’ సదుపాయుం ఓటర్ల నమోదు ప్రక్రియను వురింత సులభతరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైతే, వారిలో ఏకంగా 42 లక్షల మంది 18-21 ఏళ్ల వారే! ఎన్నికల అక్రమాలు, హింసపై డేగ కన్ను రిగ్గింగ్, ఈవీఎంల ధ్వంసం వంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో మొత్తం 7 వేల పోలింగ్ బూత్లుంటే వాటిలో 95 శాతం ఇప్పటికే బీబిఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. మార్చి నెలాఖరు లోపు మరో 275 టవర్లను ఏర్పాటు చేస్తావుని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. అప్పుడు దాదాపు 100 శాతం పోలింగ్ స్టేషన్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలోకి వస్తాయి. ఒకటీ అరా బూత్లు రాకపోతే అక్కడ తాత్కాలిక టవర్ల ఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక పోలింగ్ జరిగే అన్ని కేంద్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసేదాకా ‘లైవ్ వెబ్ టెలికాస్టింగ్’ ఉంటుంది. ఒక ‘ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) కార్యాలయం పరిధిలో ఉన్న అన్ని బూత్లలోనూ పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను ఈఆర్వో కార్యాలయంలోని కంప్యూటర్లో లైవ్ వెబ్ టెలికాస్టింగ్ ద్వారా చూసుకోవచ్చు. ఎవరు నిబంధనలు అతిక్రమించినా ఇట్టే తెలిసిపోతుంది. పోలింగ్ అక్రమాలకు పాల్పడే అభ్యర్థులపై అనర్హత వేటు లాంటి తీవ్రమైన చర్యలుంటాయి. డబ్బు, మందుపై ఉక్కుపాదం విచ్చలవిడి డబ్బు, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు కూడా విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నాం. నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఓటర్లను చైతన్య పరిచే ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నాం. వాటి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గ పరిధిలో పూర్తి భద్రతతో కూడిన 3, 4 చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఇక డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకుల సహకారవుూ తీసుకుంటున్నాం. అనుమానాస్పద ఆన్లైన్ లావాదేవీలపై కన్నేసి ఉంచాం. పోలింగ్కు 48 గంటల ముందు అన్ని వుద్యం దుకాణాలనూ మూసేయిస్తాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా బెల్టు షాపులు లేకుండా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ప్రతి దుకాణానికీ గతేడాది ఈ నెలలో అది ఎంత వుద్యం విక్రరుుంచిందో ఈసారి కూడా అంతే సరఫరా చేయూలని, ఒక్క బాటిల్ కూడా అదనంగా ఇవ్వరాదని అధికారులను ఆదేశించాం. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. తొలిసారిగా తిరస్కరణ ఓటు ఇప్పటిదాకా ఓటర్లు ఎవరో ఒక అభ్యర్థికి విధిగా ఓటేయూల్సి వచ్చేది. కానీ తన ఓటుకు వారిలో ఎవరూ అర్హులు కారని భావిస్తే తిరస్కరణ ఓటు వేసే అవకాశాన్ని తొలిసారిగా ఈ ఎన్నికల్లో కల్పించాం. అందుకోసం ‘నన్ ఆఫ్ ద అబౌ’ (పై వారెవరూ కాదు-నోటా) అన్న బటన్ నొక్కితే చాలు. ఈ బటన్ ఓటింగ్ యుంత్రం (ఈవీఎం)లో చివరన ఉంటుంది. వుంచి అభ్యర్థిని పెట్టకపోతే ఓటర్లు తిరస్కరించే ప్రవూదవుుంది గనుక వారి ఎంపికలో పార్టీలు మరింత జాగ్రత్తగా ఉంటాయని భావిస్తున్నాం. వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో వికలాంగులు చక్రాల కుర్చీలో వచ్చేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ విధిగా ‘ర్యాంప్’ ఉండాలి. కేవలం నాలుగైదు ఓట్లున్న చోట కూడా ఇది తప్పనిసరి. ఆ మేరకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం. అలాగే అంధ ఓటర్ల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ బ్రెయిలీ ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ఇతరుల సాయం లేకుండా వారే స్వయుంగా ఓటేసుకునే వీలుంటుంది. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, పసిపిల్లల తల్లులు క్యూలో నిల్చునే పని లేకుండా నేరుగా వెళ్లి ఓటేసేందుకు అనువుతించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించాం. ఈసారి పోలింగ్ తేదీకి వారం ముందే ప్రతి ఓటరుకూ ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్పులను ఇంటింటికీ వెళ్లి అందజేస్తాం. కనీస సౌకర్యాలు పోలింగ్ బూత్లలో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఈసీ అదేశాల మేరకు ఈ దిశగా కలెక్టర్లకు నిర్దిష్ట సూచనలు చేశాం. తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, క్యూలో నిలుచునే ఓటర్లకు నీడ కల్పించడం తప్పనిసరి చేశాం. కరెంటు లేకపోతే జనరేటర్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం. సిబ్బందికి కాస్త అసౌకార్యం అనివార్యం పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. వారు పోలింగ్కు ముందు రోజు సాయంత్రానికే పోలింగ్ స్టేషన్కు చేరుకుని ఒక రాత్రి అక్కడ నిద్రించాల్సి ఉంటుంది. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఇంత పెద్ద క్రతువులో అక్కడక్కడా ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా సిబ్బందికి ఒకటీ అరా ఇబ్బందులు ఎదురవవచ్చు. పైగా అవసరమైనప్పుడు మహిళా ఓటర్లతో తగిన రీతిలో వ్యవహరించేందుకు అనువుగా ఈసీ నిబంధన మేరకు ప్రతి బూత్లోనూ తప్పనిసరిగా కనీసం ఒక మహిళా ఉద్యోగి ఉండాలి. కాబట్టి వారిని మారుమూల ప్రాంతాలకు పంపకుండా ఉండటం సాధ్యం కాదు. అందుకే వుహిళా సిబ్బంది పరిస్థితిని అర్థం చేసుకుంటారని, ఐదేళ్లకొక్కసారి ఒక్క రోజు కలిగే ఈ అసౌకార్యాన్ని భరించి సహకరిస్తారని ఆశిస్తున్నాం. -
ఓటు హక్కు మరవకు..ఎవ్వరికీ వెరవకు
సాక్షి, సంగారెడ్డి: ఓటర్లను అడ్డగించి, భయాందోళనలు కలిగించే అరాచక మూకలకు ఇకపై కాలం చెల్లనుంది. ప్రతి ఒక్క ఓటరూ నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికను రచిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏదైన సమూహానికి చెందిన ప్రజలు ఓటేయకుండా పోలింగ్కు దూరంగా ఉంటే.. దానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఓటేయకుండా వీరిని ఏవరైనా అడ్డుకుంటున్నారా?.. భయపెడుతున్నారా?.. లేక వీరే అయిష్టతతో ఓటేయడం లేదా? అన్న అంశాలను తెలుసుకునేందుకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టడం ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పరిపాటిగా మారింది. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం నేరుగా ఓటుకు దూరంగా ఉంటున్న ఓటర్లపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టడం గమనార్హం. బడుగు ఓటరుకు భరోసా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న దళిత, గిరిజనవాడల్లో తక్కువ ఓటర్లు ఉంటే అక్కడ పోలింగ్ కేంద్రాలు లేవు. సమీప గ్రామంలోని పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటేయాల్సిందే. వీరు ఓటేయకుండా ప్రజలు సుదూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయాల్సిన దుస్థితి. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోకుండా వీరిని అడ్డుకున్న ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి. జిల్లాలోని అన్నీ అసెంబ్లీ నియోజకవార్గల్లోని మారుమూల తండాల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నా.. నారాయణ్ఖేడ్, దుబ్బాక నియోజకవర్గాల్లో మరీ ఎక్కువ అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో సెక్టోరియల్, స్థానిక పోలిసు అధికారులు ఇలాంటి సమూహాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడానికి కలెక్టర్ స్మితా సబర్వాల్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆలోగా సర్వే నివేదికలను కలెక్టర్కు అందజేయనున్నారు. నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా ఓటేసేలా ఈ సమూహాల ప్రజలకు ప్రత్యేక రక్షణ కల్పించనున్నారు. అదే విధంగా ఓటర్లలో ధైర్యాన్ని నింపడంతో పాటు ఓటు హక్కుపై చైతన్యం కల్పించడానికి అధికారులు ఆయా ప్రాంతాలను సందర్శించి కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అవసరమైతే స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని సైతం తీసుకోవాలని సూచించింది.