World championship
-
64 గళ్లపై చిన్నారి అద్భుతం
రెండేళ్ల క్రితం.. ప్రముఖ చెస్ వెబ్సైట్ చెస్ బేస్ డాట్ ఇన్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ మ్యాచ్లను నిర్వహించింది. అందులో భారత గ్రాండ్మాస్టర్లయిన అర్జున్ ఇరిగేశి, డి.గుకేశ్లు ఒకవైపు.. 20 మంది జూనియర్ చెస్ ఆటగాళ్లు మరోవైపు ఆడారు. ఫలితాలను పక్కన పెడితే ఇద్దరు టాప్ గ్రాండ్మాస్టర్లను కొందరు చిన్నారులు తమ ఆటతో ఆకర్షించారు. వారిలో ఆరేళ్ల ఆదుళ్ల దివిత్ రెడ్డి కూడా ఉన్నాడు. అతనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నట్లు గుర్తించిన ఆ ఇద్దరు గ్రాండ్మాస్టర్లూ త్వరలోనే దివిత్ పెద్ద విజయాలు సాధిస్తాడని జోస్యం చెప్పారు. రెండేళ్లు తిరిగేసరికి అది నిజమైంది. దివిత్ రెడ్డి ఇప్పుడు వరల్డ్ క్యాడెట్ అండర్–8 చాంపియన్షిప్లో సత్తా చాటాడు. కొన్ని నెలల వ్యవధిలో అతను అటు ర్యాపిడ్, ఇటు క్లాసిక్ రెండు విభాగాల్లోనూ వరల్డ్ చాంపియన్గా నిలవడం విశేషం. అల్బేనియా, ఇటలీలలో జరిగిన ఈ టోర్నీలో దివిత్ ప్రదర్శన చూస్తే భారత చదరంగంలో మరిన్ని సంచలనాలకు కారణం కాగల కొత్త కెరటం వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిభను గుర్తించి..సాధారణంగా ఐదారేళ్ల చిన్నారులు స్కూల్తో పాటు తమ వయసుకు తగినట్లుగా తమకు నచ్చిన విధంగా ఏదో ఒక ఆటలో మునిగి తేలుతుంటారు. కానీ క్రీడలకు సంబంధించి వారిలో దాగి ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు మాత్రమే సరిగ్గా గుర్తించగలరు. దివిత్ తల్లిదండ్రులు మహేశ్ రెడ్డి, సింధుజ సరిగ్గా అదే పని చేశారు. అతడికి చదరంగంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు, ఆ క్రీడలో అతను పూర్తిగా లీనమైపోతున్నట్లు ఆరంభంలోనే గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన వీరిద్దరూ చెస్కు సంబంధించిన పజిల్స్ను పరిష్కరించడంలో దివిత్కున్న ప్రత్యేక ప్రతిభను పసిగట్టగలిగారు. అందుకే తమ అబ్బాయిని పూర్తిగా చదరంగం వైపు మళ్లిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. దానికి ఎగ్జిబిషన్ టోర్నీ మరింత స్ఫూర్తినిచ్చింది. కోచ్ రామకృష్ణ వద్ద శిక్షణ ఇప్పించారు. రెండేళ్ల పాటు ఆయన శిక్షణలో దివిత్ మరింత రాటుదేలాడు. దాంతో టోర్నీల్లో ఆడించడం మొదలుపెట్టారు. వరుస విజయాలతో..రాష్ట్ర స్థాయి టోర్నీల్లో విజేతగా నిలిచిన తర్వాత దివిత్ జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడి ప్రదర్శన ఆ చిన్నారిలోని అపార ప్రతిభను చాటింది. ఫలితంగా వరల్డ్ చాంపియన్షిప్లలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ ఏడాది ఏప్రిల్లో అల్బేనియాలో జరిగిన టోర్నీ ద్వారా దివిత్ టాలెంట్కి మరింత గుర్తింపు దక్కింది. అండర్–8 చాంపియన్షిప్లో అతను ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలిచాడు. రెండు నెలల తర్వాత జార్జియాలో జరిగిన వరల్డ్ కప్లో కూడా అతనికి రెండో స్థానం దక్కింది. తాజాగా ఇటలీలో అండర్–8 క్లాసికల్లో వరల్డ్ చాంపియన్షిప్ సాధించడం అతడి ఆటను మరో మెట్టు ఎక్కించింది. తర్వాతి వయో విభాగాలైన అండర్–10, అండర్–12లలో ఇదే తరహా ఆటను కొనసాగిస్తే దివిత్ కెరీర్ మరింత వేగంగా దూసుకుపోవడం ఖాయం. అన్నింటా అండగా నిలుస్తూ..తన గెలుపు విలువేమిటో ఎనిమిదేళ్ల దివిత్కు తెలియకపోవచ్చు. కానీ అతని తల్లిదండ్రులు ఆ గెలుపు స్థాయిని గుర్తించారు. అందుకే కెరీర్లో ముందుకు తీసుకెళ్లేందుకు వారు తమ వైపునుంచి ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పెరిగే పోటీని దృష్టిలో ఉంచుకొని కొత్త కోచ్తో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. చెస్లో కోచింగ్ అంటే ఆర్థికపరంగా కూడా అమిత భారమే! దీంతో పాటు వరుస టోర్నీల్లో పాల్గొంటేనే ఫలితాలు రావడంతో పాటు రేటింగ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా చేయాలంటే పెద్ద సంఖ్యలో వేర్వేరు దేశాల్లో పోటీ పడటం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ తమ చిన్నారి కోసం వాటన్నిటినీ ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం సొంత డబ్బులతోనే ముందుకు సాగుతున్న వీరు మున్ముందు దివిత్ మంచి ఫలితాలు సాధిస్తే స్పాన్సర్షిప్ చాన్స్ రావచ్చనే విశ్వాసంతో ఉన్నారు. అన్నింటినీ మించి వారు తమ అబ్బాయి ఆటను నమ్ముతున్నారు.గ్రాండ్మాస్టర్ లక్ష్యంగా..‘చెస్ అంటే చాలా ఇష్టం. ఎన్ని గంటలైనా ఆడుతూనే ఉంటా..’ ఇదీ చిన్నారి దివిత్ మాట. ప్రస్తుతం అతను రోజుకు 7–8 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. మధ్యలో కొద్దిసేపు విరామం మినహా అతనికిప్పుడు చదరంగపు గళ్ళే లోకం. అతని ఫలితాలు చూస్తేనే అతను ఎంతగా కష్టపడుతున్నాడో అర్థమవుతోంది. సిసిలియన్ డిఫెన్స్ తన ఫేవరిట్ అని చెబుతున్న దివిత్.. ప్రస్తుత భారత టాప్ ఆటగాడు అర్జున్ ఇరిగేశి స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాడు. ఆటలో విజయాలతో పాటు ఓటములు కూడా సహజం. సాధారణంగా వేర్వేరు ఏజ్ గ్రూప్ చెస్ టోర్నీలు జరుగుతున్నప్పుడు పరాజయం ఎదురైతే చిన్నారులు ఏడుస్తూ బయటకు రావడం చాలా చోట్ల కనిపించే దృశ్యం. కానీ దివిత్ ఏరోజూ అలా చేయలేదని తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. గేమ్ ఓడిన తర్వాత కూడా ప్రశాంతంగా వచ్చి నేను ఓడిపోయాను, తర్వాతి గేమ్కు ప్రిపేర్ అవుతాను అని చెప్పడం ఎనిమిదేళ్ల చిన్నారి స్థితప్రజ్ఞకు నిదర్శనం. చెస్కు ఎక్కువ సమయం కేటాయించేందుకు దివిత్ పేరెంట్స్ అతని స్కూల్ చదువును ఆన్లైన్ క్లాస్ల ద్వారా కొనసాగిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న దివిత్.. వచ్చే రెండేళ్ల పాటు తనకిష్టమైన చెస్లో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తే ఆపై చదువును, ఆటను సమన్వయం చేసుకుంటూ వెళ్లవచ్చనేది వారి ఆలోచన. దివిత్ కూడా దానికి తగినట్లుగా సాధన చేస్తున్నాడు. పిన్న వయసులోనే దివిత్ను గ్రాండ్మాస్టర్గా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. ప్రస్తుతం 1876 రేటింగ్ ఉన్న అతను జీఎమ్ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
ప్రపంచ రికార్డు కోసం 1,121కిలోల గుమ్మడికాయ (ఫొటోలు)
-
చెలరేగిన ఉతప్ప.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఇండియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ శుభారంభం చేసింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఇండియా బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప(32 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. గుర్క్రీత్ సింగ్(33), నమన్ ఓజా(25) పరుగులతో రాణించారు. కాగా కెప్టెన్ యువరాజ్ సింగ్ మాత్రం నిరాశపరిచాడు. బౌలింగ్లో ఒక ఓవర్ వేసి 14 పరుగులిచ్చిన యువీ.. బ్యాటింగ్లోనూ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలోక్రిస్ స్కోఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా.. రవి బపోరా రెండు వికెట్లు సాధించాడు.అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఇయాన్ బెల్(59), సమిత్ పటేల్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హార్భజన్ సింగ్ రెండు, కులకర్ణి, ఆర్పీ సింగ్ తలా వికెట్ పడగొట్టారు. -
నేటి నుంచి (జులై 3) మరో క్రికెట్ పండుగ.. జులై 6న భారత్-పాక్ మ్యాచ్
టీ20 వరల్డ్కప్ ముగిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో క్రికెట్ పండుగ మొదలైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 3) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు (ఇండియా ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటున్నాయి. లెజెండ్స్ క్రికెట్కు సంబంధించి ఈ టోర్నీని వరల్డ్కప్గా పరిగణించవచ్చు. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్, హెర్షల్ గిబ్స్, షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్, బ్రెట్ లీ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. సింగిల్ రౌండ్ ఫార్మాట్లో జరిగే (ప్రతి జట్టు మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది) ఈ టోర్నీ జులై 13న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. సింగిల్ రౌండ్ తర్వాత టాప్-4లో ఉండే జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జులై 6న జరుగనుంది.జట్ల వివరాలు..భారత్ ఛాంపియన్స్: యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, పవన్ నేగిఆస్ట్రేలియా ఛాంపియన్స్: బ్రెట్ లీ, టిమ్ పైన్, షాన్ మార్ష్, బెన్ కట్టింగ్, బెన్ డంక్, డిర్క్ నాన్స్, డాన్ క్రిస్టియన్, బెన్ లాఫ్లిన్, ఆరోన్ ఫించ్, బ్రాడ్ హాడిన్, కల్లమ్ ఫెర్గూసన్, పీటర్ సిడిల్, జేవియర్ డోహెర్టీ, నాథన్ కౌల్టర్ నైల్, జాన్ హేస్టింగ్స్ఇంగ్లండ్ ఛాంపియన్స్: కెవిన్ పీటర్సన్, రవి బొపారా, ఇయాన్ బెల్, సమిత్ పటేల్, ఒవైస్ షా, ఫిలిప్ మస్టర్డ్, క్రిస్ స్కోఫీల్డ్, సాజిద్ మహమూద్, అజ్మల్ షాజాద్, ఉస్మాన్ అఫ్జల్, ర్యాన్ సైడ్బాటమ్, స్టీఫెన్ ప్యారీ, స్టువర్ట్ మీకర్, కెవిన్ ఓ'బ్రియన్వెస్టిండీస్ ఛాంపియన్స్: డారెన్ సామీ, క్రిస్ గేల్, శామ్యూల్ బద్రీ, రవి రాంపాల్, కేస్రిక్ విలియమ్స్, జాసన్ మహమ్మద్, నవిన్ స్టీవర్ట్, డ్వేన్ స్మిత్, యాష్లే నర్స్, సులీమాన్ బెన్, చాడ్విక్ వాల్టన్, జెరోమ్ టేలర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్, కిర్క్ ఎడ్వర్డ్స్, జోనాథన్ కార్టర్దక్షిణాఫ్రికా ఛాంపియన్స్: జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్, ఇమ్రాన్ తాహిర్, మఖాయా ంటిని, డేల్ స్టెయిన్, అష్వెల్ ప్రిన్స్, నీల్ మెక్కెంజీ, ర్యాన్ మెక్లారెన్, జస్టిన్ ఒంటాంగ్, రోరీ క్లీన్వెల్ట్, జెపి డుమిని, రిచర్డ్ లెవి, డేన్ విలాస్, వెర్నాన్ ఫిలాండర్,పాకిస్తాన్ ఛాంపియన్స్: యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, అబ్దుల్ రజాక్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సోహైల్ తన్వీర్, సోహైల్ ఖాన్, తన్వీర్ అహ్మద్, ముహమ్మద్ హఫీజ్, అమీర్ యామిన్, షోయబ్ మాలిక్, సోహైబ్ మక్సూద్, ఉమర్జెల్ ఖాన్ అక్మల్,షెడ్యూల్..బుధవారం, జూలై 03ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్గురువారం, జూలై 04సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్శుక్రవారం, జూలై 05ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇండియా వర్సెస్ వెస్టిండీస్శనివారం, జూలై 06ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియాఇండియా వర్సెస్ పాకిస్థాన్ఆదివారం, జూలై 07సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్సోమవారం, జూలై 08ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియామంగళవారం, జూలై 09వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్బుధవారం, జూలై 10వెస్టిండీస్ వర్సెస్ఆస్ట్రేలియా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాబుధవారం, జూలై 12మొదటి సెమీ ఫైనల్- TBA vs TBAరెండవ సెమీ ఫైనల్- TBA vs TBAశనివారం, జూలై 13ఫైనల్ మ్యాచ్ - TBA vs TBA -
సింగపూర్లో ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత టీనేజ్ గ్రాండ్మాస్టర్, క్యాండిడేట్స్ టోర్నీ విజేత దొమ్మరాజు గుకేశ్కు స్వదేశంలో ప్రపంచ చెస్ చాంపియన్షిప్ ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా), చాలెంజర్ గుకేశ్ మధ్య ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్ ఆతిథ్య హక్కులు సింగపూర్కు లభించాయి. ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కుల కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్), తమిళనాడు ప్రభుత్వం, సింగపూర్ పోటీపడ్డాయి. బిడ్లను పరిశీలించాక ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు సింగపూర్కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య 25 లక్షల డాలర్ల (రూ. 20 కోట్ల 85 లక్షలు) ప్రైజ్మనీతో ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది. ఇద్దరి మధ్య 14 రౌండ్లు నిర్వహిస్తారు. తొలుత 7.5 పాయింట్లు సంపాదించిన ప్లేయర్ను విశ్వవిజేతగా ప్రకటిస్తారు. 14 రౌండ్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిస్తే టైబ్రేక్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు క్లాసికల్ ఫార్మాట్లో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. ఆనంద్ ఐదుసార్లు (2000, 2007, 2008, 2010, 2012) విశ్వవిజేతగా నిలిచాడు. -
అల్ట్రా రన్నర్ మీనల్
ఆమె ఖాతాలో అనేక రేస్లు పూర్తి చేసిన రికార్డులు ఉన్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్గా పేరొందింది. పేరు మీనల్ కొటక్, గుర్గావ్వాసి.ఇటీవల 680కి పైగా కిలోమీటర్ల పరుగును 6 రోజుల్లో అంటే 144 గంటల్లో కవర్ చేసి సరికొత్త రికార్డ్ను నెలకొల్పిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. తనను తాను మెరుగుపరుచుకోవాలనే సంకల్పంతో అల్ట్రారన్లలో పాల్గొంటున్నాను అని చెబుతోంది మీనల్ కొటక్. ‘‘పురుషుల రికార్డ్ ఇప్పటి వరకు 574.5 కిలోమీటర్ల ఉంటే, నా రికార్డ్ 680 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసింది. మిగతావారికంటే ఉన్నతంగా ఉండేలా నన్ను నేను మెరుగుపరుచుకోవాలన్నదే నా సంకల్పం. కిందటేడాది అమెరికాలోని మిల్వాకీలో జరిగిన అల్ట్రామారథాన్లో భారతదేశం తరపున పాల్గొన్న మల్టీ డే రికార్డ్ అసాధారణమైంది. ఇటీవల జరిగిన ఆరు రోజుల ఈవెంట్లోనూ నేనే ముందున్నాను.ఈ రేసుతో ఆసియాలో టాప్ 5 యాక్టివ్ రన్నర్గా, ప్రపంచంలో టాప్ 12 యాక్టివ్ 6–డే ఉమెన్ అల్ట్రారన్నర్లలో ఒకరిగా ఉన్నాను. నా మనుగడ కోసం మొండిగా పోరాడతాను. సుదీర్ఘమైన చలి, ఒంటరితనం దేనినీ లెక్కచేయను. చాలా కఠినమైన సాధన. నా ఎమోషన్స్ అన్నీ సమం చేసుకుంటూ ప్రయత్నం చేశాను. చివరకు నా సంకల్పం మనసు, శరీరంపై గెలిచింది. మార్చిన పరుగు2014లో ఒక ట్రెడ్మిల్ పరుగు నా రన్నింగ్ సామర్థ్యాన్ని, శక్తిని గ్రహించేలా చేసింది. నా బలాన్ని గుర్తించిన సరైన వ్యక్తుల సహాయంతో ఢిల్లీ హాఫ్ మారథాన్లో పరుగెత్తాను. 34 సంవత్సరాల వయసులో వృత్తిపరమైన రన్నింగ్ అనుభవం లేకుండా పాల్గొన్న ఆ మారథాన్ నా జీవిత గమనాన్ని మార్చింది. ఆ సమయంలోనే మహిళా అల్ట్రారన్నర్లు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిసి, ఆసక్తి కలిగింది. మారథాన్లకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించి, చరిత్ర సృష్టించాలనుకున్నాను. 2017లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచిప్రాతినిధ్యం వహించాను. అక్కడ నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నా సామర్థ్యాన్ని గుర్తించింది. వారు నాకున్న రికార్డులన్నీ పరిశీలించారు. అలా 2017లో బెల్ఫాస్ట్లో తొలిసారిగా భారతదేశానికిప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత 2018లో ఆసియా ఛాంపియన్షిప్లో పాల్గొన్నాను. డిప్రెషన్ నుంచి కోలుకొని...2019లో ప్రపంచ ఛాంపియన్షిప్లో దేశానికిప్రాతినిధ్యం వహించడానికి కొంత కాలానికి ముందు కాలికి తీవ్ర గాయమైంది. అనేక కారణాల వల్ల డిప్రెషన్ బారిన పడ్డాను. నా కెరీర్ పీక్లో ఉన్న సమయంలో బెడ్రెస్ట్లో ఉండటం వల్ల చాలా బాధపడ్డాను. మొత్తానికి ఆ ఒత్తిడిని జయించి ఇప్పుడు నా 44 ఏళ్ల వయసులో 680 కిలోమీటర్ల పరుగును సాధించేంతగా ఎదిగాను. ఏడాది కిందట అమెరికాలో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగును పూర్తి చేశాను. మూడేళ్లుగా ఈ రేసులను ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ ఆటలో మనసు శక్తి ఎంతటిదో తెలుసుకున్నాను.ప్రణాళికతో దినచర్యమల్టీడే రేసులు 24 గంటల రేసుల కంటే భిన్నంగా ఉంటాయి. ఒక క్రీడాకారుడు ఇక్కడ రోజుల తరబడి పరిగెత్తడంలో ఎన్నో ప్రణాళికలను అమలు పరచాల్సి ఉంటుంది. దీంతో గతంలోకంటే ఎక్కువ ప్రేరణ, మద్దతు అవసరం అవుతుంది. ఈ రేసులోకి వెళ్లడానికి మొదటి మూడు రోజులు ఆలోచించాను. ఒకసారి శిక్షణ మొదలుపెట్టాక ఇక ప్రణాళికలను అనుసరించేలా నా దినచర్య మారిపోయింది. రన్నింగ్ కోసం మాత్రమే కాదు ఒక రేసర్గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించు కోవాలంటే పోషకాహారం వంటి అనేక ఇతర అంశాలు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఒక గంట లేదా రెండు గంటలు నిద్ర, బట్టలు మార్చుకోవడం, ఆహారం తీసుకోవడం, కాళ్లకు బొబ్బలు రాకుండా చూసుకోవడం... వీటన్నింటిపైనా శిక్షణప్రారంభించనప్పటి నుండే శ్రద్ధ వహించాలి. మల్టీ డే రేసింగ్ ఆరోగ్య పోటీగా కూడా మార్చుకోవచ్చు.ఇప్పటివరకు భారత దేశం నుండి ఏ మహిళ కూడా మల్టీ డే మారథాన్లో పాల్గొనలేదు. ఈ విషయం నన్ను ఆలోచించేలా, రికార్డ్ను సాధించేలా చేసింది. అల్ట్రారన్ రేస్లో మొదటి భారతీయ మహిళను నేనే అవుతానని అనుకోలేదు. మానవ పరిమితులన్నీ అధిగమించడానికి ఒక అడుగు ముందుకు వేసినందుకు సంతోషంగా ఉన్నాను. నా భర్త సచిన్ ఉద్యోగి అయినప్పటికీ నా ముఖ్యమైన రన్నింగ్రేసులన్నింటికీ తప్పక హాజరై, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు’’ తన విజయపరంపరను వెనకాల ఉన్న రహస్యాలను వివరించింది మీనల్ కొటక్. -
సెయిలింగ్ ప్రపంచ చాంపియన్షిప్కు మాన్య
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన యువ సెయిలర్ మాన్య రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ 4 (లేజర్ 4.7) యూత్ వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఆమె ఎంపికైంది. జూన్ 22నుంచి 30 వరకు పోర్చుగల్లోని వియానా డి కాస్టెలోలో ఈ టోర్నీ జరుగుతుంది. 15 ఏళ్ల మాన్య గత కొంత కాలంగా సెయిలింగ్ పోటీల్లో నిలకడగా రాణిస్తోంది. హుస్సేన్ సాగర్ జలాల్లో సెయిలింగ్ నేర్చుకున్న ఈ అమ్మాయి తొలి జూనియర్ రెగెట్టాలోనే రజతం సాధించింది. జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో వరుస విజయాలు సాధించిన ఆమె ఇటీవల షిల్లాంగ్లో జరిగిన ర్యాంకింగ్ టోర్నీలో కాంస్యం గెలుచుకుంది. వరల్డ్ చాంపియన్షిప్ కోసం భారత్నుంచి ఎంపికైన ఇద్దరు సెయిలర్లలో ఒకరిగా మాన్యకు అవకాశం దక్కింది. ఈ టోర్నీ కోసం ప్రస్తుతం మాన్య సిద్ధమవుతోంది. అయితే వరల్డ్ చాంపియన్íÙప్ స్థాయి టోర్నీలో పాల్గొనడం, ఇతర సన్నాహకాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే తన ఈవెంట్ కోసం మాన్య స్పాన్సర్ల సహాయాన్ని ఆశిస్తోంది. ప్రయాణ, వసతి, ఎక్విప్మెంట్, శిక్షణ కోసం తనకు అండగా నిలవాలని ఆమె కోరుతోంది. ఈ నేపథ్యంలో మాన్యకు స్పాన్సర్షిప్ అందించాలని భావించేవారు ఝ్చ్చny్చట్ఛఛీఛీy20ఃజఝ్చజీ .ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు. -
నా లక్ష్యానికి పరిమితి లేదు.. ఒలింపిక్స్ కంటే కూడా: నీరజ్చోప్రా
ఒలింపిక్స్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణం, ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ చాంపియన్, ఆసియా క్రీడల స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల స్వర్ణం, జూనియర్ ప్రపంచ చాంపియన్... భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అసాధారణ కెరీర్లో అందుకున్న అద్భుత విజయాలెన్నో. వాస్తవంగా ఈ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటే మేజర్ ఈవెంట్లలో అతను సాధించేందుకు ఇక ఏమీ మిగలనట్లే! కానీ నీరజ్ మాత్రం తాను ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని చెబుతున్నాడు. జావెలిన్ను మరింత బలంగా, మరింత దూరం విసరగలనని అతను చెబుతున్నాడు. బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్కు తొలి స్వర్ణ పతకం అందించిన ప్లేయర్గా కొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధిస్తానని వ్యాఖ్యానించాడు. పసిడి పతకం గెలిచినందుకు నీరజ్ చోప్రాకు 70 వేల డాలర్ల (రూ. 57 లక్షల 84 వేలు) ప్రైజ్మనీ లభించింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ ఈవెంట్లో నీరజ్ పసిడి పతకం గెలిచాక మీడియాతో పంచుకున్న భావాలు అతని మాటల్లోనే... ♦ త్రోయర్లకు ఎప్పటికీ ఫినిషింగ్ లైన్ అనేదే ఉండదు అంటారు. మా చేతుల్లో జావెలిన్ ఉన్నంత వరకు ఎంత దూరమైన విసరగలం. మా లక్ష్యానికి పరిమితి లేదు. నేను ఎన్ని పతకాలు గెలిచినా ఇంకా ఎక్కువ దూరం బల్లెంను విసరాలనే ప్రేరణ అలాగే ఉంటుంది. ఈ పతకాల వల్ల నేను ఇప్పటికే అన్నీ సాధించానని అనుకోను. మరింత కష్టపడి నా దేశానికి మరిన్ని పతకాలు తీసుకొస్తా. పోడియంపై నా పక్కనే ఎవరైనా భారతీయులు నిలబడగలిగితే అది ఇంకా బాగుంటుంది. ♦ 90 మీటర్ల దూరం కూడా సాధ్యమే. అయితే సాధారణంగా దృష్టంతా గెలుపుపైనే ఉంటుంది. గత కొంత కాలంగా 90 మీటర్ల దూరంపై చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సాధించగలననే అనుకున్నా గాయాల వల్ల కొంత ఇబ్బంది పడ్డా. అయితే ఈ విషయంపై ఒత్తిడి పెంచుకోదల్చుకోలేదు. అయితే ఒక ఈవెంట్లో అన్నింటికంటే పతకం గెలవడం ముఖ్యం. ఒక్కసారి 90 మీటర్ల మార్క్ అందుకుంటే అదే నిలకడను కొనసాగించాలని నేను నమ్ముతా. ఒలింపిక్ క్రీడల తర్వాత వరల్డ్ చాంపియన్ ఎలాగైనా గెలవాలని భావించా. ఇప్పుడు ఆ కల నిజమైంది. ♦ భారత ఆల్టైమ్ గ్రేట్ అథ్లెట్ అని నా గురించి నేను ఏనాడూ చెప్పుకోలేదు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ చెప్పను. వరల్డ్ చాంపియన్షిప్ స్వర్ణం లేదని ఇప్పటి వరకు కొందరు అన్నారు. ఇప్పుడు దానిని సాధించాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దానిపైనే దృష్టి పెడతాను తప్ప ఇలాంటి చర్చలోకి రాను. నిజంగా గ్రేటెస్ట్ ఎలా ఉండాలని అడిగితే మాత్రం నేను ఆరాధించే చెక్ రిపబ్లిక్ త్రోయర్ జాన్ జెలెజ్నీలాగా ఉండాలని చెబుతా. ♦ నా దృష్టిలో ఒలింపిక్స్తో పోలిస్తే ప్రపంచ చాంపియన్షిప్లోనే గట్టి పోటీ ఉంటుంది. టాప్ అథ్లెట్లంతా దీని కోసమే సన్నద్ధమై వస్తారు. భవిష్యత్తులో భారత అథ్లెట్లు మరిన్ని విజయాలు సాధిస్తారు. పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్తో పోటీని ప్రత్యేకంగా చూడవద్దు. మా ఆటను భారత్, పాకిస్తాన్ మధ్య పోరుగా కొందరు చిత్రీకరిస్తున్నారు. నా ఫోన్లో కూడా అంతా భారత్, పాక్ గురించే మెసేజ్లు ఉన్నాయి. మన దేశంలో ఇలాంటి వాతావరణం సహజమే. కానీ దీనిని మా ఇద్దరి మధ్య పోటీగా చూడవద్దు. రెండు దేశాల పేర్లతో ఒత్తిడి పెంచవద్దు. ఈవెంట్లో ఇతర ప్రత్యర్థులందరినీ దృష్టిలో ఉంచుకొని సిద్ధం కావాల్సి ఉంటుంది. సరిగా చూస్తే యూరోపియన్లతో పోటీ పడి రెండు దేశాలు విజయాలు సాధించడం మంచి పరిణామం. రూ. 57 లక్షల 84 వేలు ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి నీరజ్ 70 వేల డాలర్ల (రూ. 57 లక్షల 84 వేలు) ప్రైజ్మనీ అందుకున్నాడు. -
ప్రణయ్ ప్రతాపం.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకం ఖరారు
దశాబ్దకాలంగా భారత అగ్రశ్రేణి షట్లర్గా కొనసాగుతున్న హెచ్ఎస్ ప్రణయ్ ఎట్టకేలకు విశ్వవేదికపై తన సత్తా చాటుకున్నాడు. అత్యంత ప్రతిభావంతుడైనప్పటికీ నిలకడలేమితో ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరించిన ప్రపంచ చాంపియన్షిప్ పతకం తొలిసారి ప్రణయ్ మెడలో పడనుంది. 2021, 2022 ప్రపంచ చాంపియన్షిప్లలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగి పతకానికి చేరువై దూరమైన ఈ కేరళ స్టార్ మూడో ప్రయత్నంలో మాత్రం అసాధారణ ఆటతీరుతో సక్సెస్ సాధించాడు. ప్రపంచ నంబర్వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్, యూరోపియన్ చాంపియన్ అయిన డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ను అతని సొంతగడ్డపైనే ఓడించి ప్రణయ్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్ చేరిన ప్రణయ్ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కోపెన్హాగెన్ (డెన్మార్క్): ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరో అద్భుతం చేశాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–15, 21–16తో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) తో ప్రణయ్ ఆడతాడు. అక్సెల్సన్తో 68 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ తొలి గేమ్ను చేజార్చుకున్నా నిరాశపడకుండా పట్టుదలతో ఆడి వరుసగా రెండు గేమ్లు గెలిచి ముందంజ వేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మెగా ఈవెంట్లో ప్రణయ్ ధాటికి అక్సెల్సన్కు అనూహ్య పరాజయం తప్పలేదు. తొలి గేమ్ కోల్పోయిన ప్రణయ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మరో కోచ్ గురుసాయిదత్ సూచనలతో తన వ్యూహం మార్చుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ, అడపాదడపా కళ్లు చెదిరే స్మాష్లతో ప్రణయ్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనవసర తప్పిదాలు చేసేలా చేశాడు. రెండో గేమ్లో స్కోరు 13–10 వద్ద ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో రెండో గేమ్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచాడు. మూడో గేమ్లోనూ ప్రణయ్ దూకుడు కొనసాగిస్తూ అక్సెల్సన్పై ఒత్తిడి పెంచాడు. స్కోరు 7–6 వద్ద ప్రణయ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–6తో ముందంజ వేశాడు. ఆ తర్వాత అక్సెల్సన్ తేరుకునే ప్రయత్నం చేసినా ప్రణయ్ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడుతూ విజయం అందుకున్నాడు. సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి పురుషుల డబుల్స్ విభాగం నుంచి ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 18–21, 19–21తో ప్రపంచ 11వ ర్యాంక్ జంట కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్ముసెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. ఇప్పటిదాకా 14 ప్రపంచ చాంపియన్షిప్లో భారత షట్లర్లు గెలిచిన పతకాల సంఖ్య. మహిళల సింగిల్స్లో పీవీ సింధు (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు), సైనా నెహ్వాల్ (1 రజతం, 1 కాంస్యం), పురుషుల సింగిల్స్లో ప్రకాశ్ పదుకొనే (1 కాంస్యం), సాయిప్రణీత్ (1 కాంస్యం), కిడాంబి శ్రీకాంత్ (1 రజతం), లక్ష్య సేన్ (1 కాంస్యం), గుత్తా జ్వాల–అశి్వని పొన్నప్ప (1 కాంస్యం), సాత్విక్–చిరాగ్ శెట్టి (1 కాంస్యం) ఈ జాబితాలో ఉన్నారు. ప్రణయ్ సెమీస్లో ఓడితే కాంస్య పతకం దక్కుతుంది. ఫైనల్ చేరి గెలిస్తే స్వర్ణ పతకం, ఓడితే రజత పతకం లభిస్తుంది. 2011 నుంచి ప్రతి ప్రపంచ చాంపియన్షిప్లోనూ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకాలు సాధిస్తుండటం విశేషం. -
పసిడి పోరుకు భారత జట్లు
పారిస్: ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో కనబరిచిన జోరును భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలోనూ కొనసాగించారు. బుధవారం జరిగిన కాంపౌండ్ విభాగం టీమ్ ఈవెంట్స్లో భారత మహిళల, పురుషుల జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 234–233తో ఎల్లా గిబ్సన్, లేలా అనిసన్, ఇసాబెల్ కార్పెంటర్లతో కూడిన బ్రిటన్ జట్టును ఓడించింది. శనివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్ బృందం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మెక్సికో 234–233తో దక్షిణ కొరియాపై గెలిచింది. క్వాలిఫయింగ్లో అగ్రస్థానంలో నిలిచి టాప్ సీడ్ హోదాలో నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 233–230 ఎస్తోనియా జట్టును ఓడించింది. మరోవైపు ప్రపంచ చాంపియన్ ఓజస్ దేవ్తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్లతో కూడిన భారత పురుషుల జట్టు కూడా బంగారు పతకంపై గురి పెట్టింది. తొలి రౌండ్లో భారత జట్టు 239–235తో ఇటలీపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 237–235తో మెక్సికో జట్టును ఓడించింది. భారత్, టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో నాలుగు సిరీస్ల తర్వాత రెండు జట్లు 235–235తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ అనివార్యమైంది. ‘షూట్ ఆఫ్’లోనూ రెండు జట్లు 30–30తో సమంగా నిలిచాయి. అయితే కొరియా ఆర్చర్లతో పోలిస్తే భారత ఆర్చర్ ఓజస్ దేవ్తలే కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో భారత జట్టును విజేతగా ప్రకటించారు. రెండో సెమీఫైనల్లో అమెరికా 238–234తో డెన్మార్క్పై గెలిచి శనివారం జరిగే స్వర్ణ పతక మ్యాచ్లో భారత్తో పోటీపడేందుకు సిద్ధమైంది. రెండో రౌండ్లో ధీరజ్ బుధవారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్తోపాటు అతాను దాస్ రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో ధీరజ్ 6–2తో ఇమాదిద్దీన్ బాక్రి (అల్జీరియా)పై, అతాను దాస్ 6–0తో ఎలైన్ వాన్ స్టీన్ (బెల్జియం)పై గెలుపొందారు. భారత్కే చెందిన మృణాల్ చౌహాన్ 3–7తో ఫ్లోరియన్ ఫాబెర్ (స్విట్జర్లాండ్) చేతిలో, తుషార్ ప్రభాకర్ 2–6తో పీటర్ బుకువాలస్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ క్వాలిఫయింగ్ టీమ్ ర్యాంకింగ్ రౌండ్లో భారత జట్టు 2034 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దాంతో భారత జట్టుకు నేరుగా రెండో రౌండ్లోకి ‘బై’ లభించింది. -
డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ల వెనుక మనోడే
విశాఖ స్పోర్ట్స్: ప్రపంచ టెస్ట్ క్రికెట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) టైటిల్ పోరులో భారత్ జట్టు వికెట్ కీపర్గా విశాఖకు చెందిన కె.ఎస్.భరత్ ఎంపికయ్యాడు. ప్రస్తుత సీజన్లో తొలిసారిగా టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన ఈ 30 ఏళ్ల కీపర్ బ్యాటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్లు ఆడాడు. ఇవన్నీ భారత్లోనే జరిగాయి. కానీ విదేశీ గడ్డపై జరగనున్న ఈ చాంపియన్ప్లో ఆడేందుకు సెకండ్ ఫ్రంట్లైన్ వికెట్కీపర్గా ఉన్న భరత్కు అనూహ్యంగా అవకాశం అందివచ్చింది. పంత్ గాయపడి అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ మంగళవారం ప్రకటించిన భారత్ 15వ మెంబర్ స్క్వాడ్లో వికెట్కీపర్గా అవకాశం దక్కింది. అయితే జట్టులో మరో వికెట్కీపర్ బ్యాటర్ కె.ఎల్.రాహుల్ ఉన్నా.. వికెట్ల వెనుక భరతే నిలిచే అవకాశాలు ఉన్నాయి. లండన్లో జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే టైటిల్ పోరులో ఆ్రస్టేలియాతో భారత్ తలపడనుంది. భారత్ వేదికగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. మొదటి టెస్ట్లో భరత్ తొలి స్టంపౌట్గా లబుషేన్ను వెనక్కి పంపాడు. సిరీస్లో భాగంగా నాలుగు మ్యాచ్ల్లో తొలి టెస్ట్లో ఓ స్టంపౌట్, ఓ క్యాచ్ పట్టిన భరత్.. మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఆరు క్యాచ్లు పట్టాడు. నాలుగో టెస్ట్లో 44 పరుగుల కెరీర్ బెస్ట్ స్కోర్తో మొత్తంగా 101 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో వచ్చి 67, ఏడో స్థానంలో వచ్చి 26, ఎనిమిదో స్థానంలో వచ్చి 8 పరుగులు చేశాడు. -
Prime Volleyball League 2023: వాలీబాల్ లీగ్కు వేళాయె...
బెంగళూరు: గత ఏడాది వాలీబాల్ ప్రియుల్ని అలరించిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఇప్పుడు రెండో సీజన్తో మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆశిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సీజన్–2 పోటీల్లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు కోల్కతా థండర్బోల్ట్స్, హైదరాబాద్ బ్లాక్హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, కాలికట్ హీరోస్, అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టొర్పెడోస్, చెన్నై బ్లిట్జ్, ముంబై మిటియోర్స్ ‘ఢీ’కి రెడీ అయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్స్ కోల్కతా థండర్బోల్ట్స్ తమ జోరు ఈ సీజన్లోనూ కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉంది. ముందుగా శనివారం నుంచి లీగ్ దశలో 28 మ్యాచ్లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మార్చి 3, 4 తేదీల్లో సెమీఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు. 5న విజేతను తేల్చే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. బెంగళూరులో నేడు కోల్కతా థండర్బోల్ట్స్, బెంగళూరు టొర్పెడోస్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతుంది. ఈ నెల 12 నుంచి 21 వరకు హైదరాబాద్ వేదికగా 11 మ్యాచ్లు జరుగుతాయి. అనంతరం మిగిలిన లీగ్ దశ సహా సెమీస్, ఫైనల్ దాకా కొచ్చిలోనే మ్యాచ్ల్ని నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు క్లబ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈసారి, వచ్చే ఏడాది క్లబ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్షిప్ భారత్లోనే జరుగనుండటంతో మరో విశేషం. -
ప్రపంచ టీటీ చాంపియన్షిప్ పోటీలకు శ్రీజ అర్హత
World Table Tennis Championships: దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీలకు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా అర్హత పొందారు. దోహాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరి ఈ బెర్త్లు ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆచంట శరత్ కమల్... పురుషుల డబుల్స్లో శరత్ కమల్–సత్యన్.. మిక్స్డ్ డబుల్స్లో మనిక బత్రా–సత్యన్ కూడా ఈ మెగా ఈవెంట్కు అర్హత పొందారు. ఇది కూడా చదవండి: బోపన్న, రామ్కుమార్ జోడీలు ఓటమి అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 ఏటీపీ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)... రామ్కుమార్ (భారత్)–రేయస్ వరేలా (మెక్సికో) జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాయి. బుధవారం జరిగిన మ్యాచ్ల్లో ఐదో సీడ్ బోపన్న–ఎబ్డెన్ 6–7 (4/7), 5–7తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స్)–టిమ్ ప్యూయెట్జ్ (జర్మనీ) చేతిలో... రామ్–వరేలా 3–6, 4–6తో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–రోజర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని? శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..? -
భారత్లో అడుగుపెట్టనున్న మోటో జీపీ.. మెగా ఈవెంట్ ఎప్పుడంటే?
ఫార్ములా రేసింగ్ను ఇష్టపడే భారత అభిమానులకు శుభవార్త. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించే మోటో జీపీ బైక్ రేసింగ్ వరల్డ్ చాంపియన్షిప్ తొలిసారి ఇండియాకు రాబోతుంది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్ను ''గ్రాండ్ పిక్స్ ఆఫ్ భారత్'' పేరుతో మన దేశంలో నిర్వహించనున్నారు. అందుకోసం గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఫెయిర్స్ట్రీట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్నా స్పోర్ట్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. మోటార్సైకిల్ రేసును ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని భారత ప్రేక్షకులకు అందించేందుకు డోర్నా స్పోర్ట్స్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనికోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. అంతేకాదు ఇంటర్నేషనల్ లెవల్ మోటో జీపీ రైడర్లను ఇండియాలో తయారు చేసే దిశగా కృషి చేస్తోంది. మోటో జీపీనే కాదు.. మోటో ఈని కూడా ఇండియాకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకముందు భారత్లో తొలిసారి జరిగిన ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రికి కూడా నోయిడాలో ఉన్న ఈ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూటే ఆతిథ్యమిచ్చింది. అయితే ఒక సీజన్తోనే ఎఫ్1 ఇండియన్ గ్రాండ్ ప్రిని ముగించింది. ఇప్పుడు మోటో జీపీ రాక రేసింగ్ ప్రియులకు ఆనందాన్నిస్తోంది. చదవండి: తీవ్రంగా గాయపడిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ -
ప్రపంచ చాంపియన్షిప్పై కసరత్తు
న్యూఢిల్లీ: జపాన్లాంటి కోర్టుల్లో ఆడాలంటే చాలా ఓపిక కావాలని భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ అన్నాడు. త్వరలో అక్కడ జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్ కోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. ‘నేను రెండు వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పట్లా రొటిన్గానే సన్నద్ధమవుతున్నా. నా ప్రాక్టీస్లో తేడా ఏమీ లేదు. కానీ టోక్యోలోని బ్యాడ్మింటన్ కోర్టులు మందకొడిగా ఉంటాయి. అక్కడ ఆడాలంటే నేర్పుంటే చాలదు. చాలా ఓర్పు కావాలి. అందుకే నేను ఆటతీరులో సహనం, సంయమనంపై దృష్టిపెట్టాను’ అని అన్నాడు. ఈ నెల 22 నుంచి టోక్యోలో ప్రపంచ చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. స్పెయిన్లో జరిగిన గత మెగా ఈవెంట్లో ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న అతను ర్యాంకు మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. ‘ర్యాంకుల్లో ఎగబాకడం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక్క రేటింగ్ పాయింట్ కూడా కీలకమే. నేను మళ్లీ టాప్–20 ర్యాంకుల్లోకి రావాలంటే ఒక్కో టోర్నీలో నిలకడగా క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ చేరుతుండాలి. అప్పుడు అనుకున్న ర్యాంకుకు చేరుకోగలం’ అని అన్నాడు. ఒకానొక దశలో చక్కని ఆటతీరుతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకిన ప్రణయ్ని 2020 నవంబర్లో కోవిడ్ దెబ్బతీసింది. మహమ్మారి అతని ప్రదర్శనపై పెను ప్రభావమే చూపింది. ఆ తర్వాత ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సహకారంతో ఆరోగ్యాన్ని, తర్వాత ఫిట్నెస్ను మెల్లిగా ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్లలో సెమీస్ చేరిన ప్రణయ్ స్విస్ ఓపెన్లో రన్నరప్తో తృప్తి చెందాడు. థామస్ కప్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే పెద్ద పెద్ద ఎండార్స్మెంట్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయని, మేజర్ టోర్నీల్లో గెలిస్తేనే బ్రాండింగ్ దక్కుతుందని చెప్పాడు. -
WAC 2022: నిరాశ పరిచిన సబ్లే.. 11వ స్థానంతో ముగించి...
World Athletics Championship 2022: పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. అమెరికాలోని ఒరెగాన్లో జరిగిన ఫైనల్ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్షిప్లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. The pride of Morocco! Olympic champion Soufiane El Bakkali 🇲🇦 runs 8:25.13 to claim world gold and confirms his 3000m steeplechase dominance 💪#WorldAthleticsChamps pic.twitter.com/Ym2CVrdv1B — World Athletics (@WorldAthletics) July 19, 2022 -
'రిటైర్ అయ్యే రోజున కచ్చితంగా పతకం అందుకుంటా'
అమెరికా లెజెండరీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ పతకంతోనే కెరీర్కు గుడ్బై చెప్పింది. ఓరెగాన్లోని హ్యూజిన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్షిప్లో ఫెలిక్స్ 4X400 మీటర్ల మిక్స్డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. వరల్డ్ చాంపియన్షిప్లో అలిసన్ ఫెలిక్స్కు ఇది 19వ పతకం కావడం విశేషం. 36 ఏళ్ల అలిసన్ ఫెలిక్స్ అమెరికా ట్రాక్ అండ్ ఫీల్డ్ టీమ్లో ఎన్నో ఏళ్లుగా ముఖ్య క్రీడాకారిణిగా ఉంది. తన కెరీర్లో ఫెలిక్స్ 19 వరల్డ్ చాంపియన్షిప్ పతకాలతో పాటు 13 ఒలింపిక్ పతకాలు గెలుచుకుంది. ఏడుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా అలిసన్ ఫెలిక్స్ నిలవడం విశేషం. తాను రిటైర్ అయ్యే రోజున కచ్చితంగా మెడల్ అందుకుంటానని అలిసన్ ఫెలిక్స్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. తాజాగా వరల్డ్ చాంపియన్షిప్లో పతకంతోనే కెరీర్కు గుడ్బై చెప్పిన అలీసన్ తన మాటను నిలబెట్టుకుంది. What a race 🔥 The Dominican Republic 🇩🇴 overtakes the Netherlands 🇳🇱 and the USA 🇺🇸 in the dying metres to take world mixed 4x400m victory!#WorldAthleticsChamps pic.twitter.com/tJb3EWKpid — World Athletics (@WorldAthletics) July 16, 2022 చదవండి: Kick Boxing: నిర్లక్ష్యం.. రింగ్లోనే కుప్పకూలిన కిక్ బాక్సర్ Commonwealth Games 2022: బర్మింగ్హామ్లో వేర్వేరుగా వసతి! -
కిడాంబి శ్రీకాంత్ రిటర్న్స్..!
సాక్షి క్రీడా విభాగం: నాలుగేళ్ల క్రితం... కిడాంబి శ్రీకాంత్ కొట్టిందే స్మాష్... గెలిచిందే టైటిల్! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్తో 2017లో అతను ప్రపంచ బ్యాడ్మింటన్ను శాసించాడు. ఇండోనేసియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్... ఈ నాలుగు ఫైనల్ మ్యాచ్లలో కూడా సంపూర్ణ ఆధిపత్యం... ఏ ప్రత్యర్థి చేతిలోనూ ఒక్క గేమ్ కూడా ఓడకుండా శ్రీకాంత్ ఈ విజయాలు సాధించాడు. ఇలాంటి ప్రదర్శన ఫలితంగానే 2018 ఏప్రిల్లో వారం రోజుల పాటు వరల్డ్ నంబర్వన్గా కూడా అతను నిలిచాడు. అయితే ఆ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఆట లయ తప్పింది... పేలవ ప్రదర్శనతో అన్సీడెడ్లు, అనామకుల చేతిలో వరుస పరాజయాలు, మధ్యలో ఇబ్బంది పెట్టిన మోకాలి గాయం, టైటిల్ సంగతి తర్వాత, ఆరంభ రౌండ్లు దాటితే చాలనే పరిస్థితి ఒకదశలో కనిపించింది. గత నాలుగేళ్లలో ఒకే ఒక టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్కు కూడా అతను అర్హత సాధించలేకపోయాడు. ఒక రకంగా మళ్లీ ‘సున్నా’ నుంచి మొదలు పెట్టాల్సిన స్థితిలో శ్రీకాంత్ నిలిచాడు. అయితే అతను వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో సత్తా చాటి మళ్లీ పైకి లేచాడు. ఒక్కో టోర్నీకి తన ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రపంచ చాంపియన్షిప్ పతకం సాధించి తానేంటో మళ్లీ నిరూపించుకున్నాడు. నవంబర్లో హైలో ఓపెన్ (జర్మనీ)లో శ్రీకాంత్ సెమీఫైనల్కు చేరుకున్నాడు. గత రెండేళ్లలో అతనికి ఇదే తొలి సూపర్–500 సెమీఫైనల్. మ్యాచ్ గెలిచిన తర్వాత ‘ఎన్నో ఏళ్ల క్రితం నేను తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడినప్పుడు కలిగిన భావనే ఇప్పుడూ వచ్చింది. మళ్లీ కొత్తగా మొదలు పెడుతున్నట్లుంది’ అని వ్యాఖ్యానించడం ఈ ప్రదర్శన విలువేమిటో చెబుతుంది. మోకాలి గాయంతో 2019లో శ్రీకాంత్ ప్రదర్శన ఆశించిన రీతిలో సాగలేదు. అతని బలమైన అటాకింగ్ గేమ్ కూడా బాగా దెబ్బతింది. ఆ ఏడాది ఇండియా ఓపెన్లో రన్నరప్గా నిలిచినా, ఓవరాల్గా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. దాంతో గాయానికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు శ్రీకాంత్ సిద్ధమయ్యాడు. సర్జరీ తర్వాత మళ్లీ ఆటను మెరుగుపర్చుకునే ప్రయత్నంలో ఉండగానే ప్రపంచాన్ని కరోనా చుట్టేసింది. తాను కోరుకున్నా ఆడలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో రీహాబిలిటేషన్పైనే దృష్టి పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ షట్లర్ 2020 అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్తో మళ్లీ బరిలోకి దిగి క్వార్టర్ ఫైనల్ చేరగలిగాడు. అయితే మోకాలు మాత్రం భయపెడుతూనే ఉంది. ‘గాయం నుంచి కోలుకున్నా సరే, ‘స్మాష్’కు ప్రయత్నిస్తే మళ్లీ ఏమైనా జరగవచ్చేమో అనే సందేహం శ్రీకాంత్ మనసులో ఏదో ఓ మూల వెంటాడుతూనే ఉంది. అందుకే తన శైలికి భిన్నమైన డిఫెన్స్ తరహా ఆటకు కూడా అతను ప్రయత్నించాడు. అయితే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2021లో ఆడిన తొలి ఆరు టోర్నీలలోనూ ఇది కనిపించింది’ అని భారత జట్టు కోచ్లలో ఒకడైన సియాదతుల్లా చెప్పాడు. స్పెయిన్లో వరల్డ్ చాంపియన్షిప్ పతకం ఖరారైనా... ఈ సెప్టెంబర్లో మొదలైన యూరోపియన్ సర్క్యూట్తోనే శ్రీకాంత్ ఆట ఒక్కసారిగా మారింది. 2021లో అతని ఆటను రెండుగా విభజించి చూస్తే రెండో దశలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు ఆరు నెలల విరామం తర్వాత సాగిన ఈ కొత్త ప్రయాణంలో శ్రీకాంత్ ఆట కూడా కొత్తగా కనిపించింది. ఇన్నాళ్లూ వేధించిన గాయం సమస్యను అతను అధిగమించి పూర్తి ఫిట్గా ఒకప్పటి శ్రీకాంత్ను గుర్తుకు తెచ్చాడు. డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్లలో వరుసగా రెండుసార్లు వరల్డ్ నంబర్వన్ మొమొటా చేతిలో ఓడినా శ్రీకాంత్ ఆట మాత్రం గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా కనిపించింది. ఫ్రెంచ్ ఓపెన్లోనైతే రెండు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని, ఆపై వరుసగా నాలుగు పాయిం ట్లు గెలిచి మ్యాచ్ను మూడో గేమ్ వరకు తీసుకెళ్లడంతో అతనిలో ఆత్మవిశ్వాసం కూడా ఎంతో పెరిగింది. హైలో ఓపెన్లో లాంగ్ ఆంగస్పై గెలిచిన తీరు నిజంగా సూపర్. ఆపై బాలిలో జరిగిన మూడు టోర్నీల్లో మరింత స్వేచ్ఛగా ఆడాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్షిప్లో గ్వాంగ్ జుతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లోనే శ్రీకాంత్ దూకుడు కనిపించగా, క్వార్టర్స్లో కాల్జూను ఓడించిన తీరును ప్రశంసించకుండా ఉండలేం. శ్రీకాంత్ తాజా ప్రదర్శన భవిష్యత్తులో అతను మరిన్ని ప్రతిష్టాత్మక విజయాలు సాధించగలడనే నమ్మకాన్ని కలిగించడం శుభపరిణామం! -
ప్రపంచ చాంపియన్షిప్కు తొలిసారి సైనా దూరం
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలిసారి ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు దూరమైంది. 2006 నుంచి క్రమం తప్పకుండా ఈ టోర్నీ ఆడుతున్న ఆమె ఈ ఏడాది మాత్రం తప్పుకుంది. స్పెయిన్లో ఈ నెల 12 నుంచి 19 వరకు ఈ టోర్నీ జరగనుంది. ప్రస్తుతం ఆమె మోకాలి గాయం నుంచి కోలుకుంటుంది. గత కొంతకాలంగా సైనా ఏ టోర్నీనీ పూర్తిస్థాయిలో ఆడలేకపోయింది. ఉబెర్ కప్, ఫ్రెంచ్ ఓపెన్లో ఆడేందుకు వచ్చి గాయంతో మధ్యలోనే వైదొలిగింది. -
అంతర్జాతీయ వేదికపై భారత్కు పతకాల పంట
వ్రోక్లా (పోలాండ్): ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. శనివారం మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలు గెలిచారు. కొరియా, చైనా ఆర్చర్ల గైర్హాజరీని భారత ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. క్యాడెట్ మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో పర్ణీత్ కౌర్, ప్రియా గుర్జర్, రిధి వర్షిణిలతో కూడిన భారత బృందం 228–216తో టర్కీ జట్టును ఓడించింది. క్యాడెట్ పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో కుశాల్ దలాల్, సాహిల్ చౌదరీ, నితిన్లతో కూడిన భారత జట్టు 233–231తో అమెరికా జట్టుపై గెలిచింది. కాంపౌండ్ మిక్స్డ్ ఫైనల్లో ప్రియా–కుశాల్ ద్వయం 155–152తో అమెరికా జోడీపై నెగ్గింది. క్యాడెట్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో ప్రియా గుర్జర్ 136–139తో సెలెన్ రోడ్రిగెజ్ (మెక్సికో) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. ఇదే విభాగం కాంస్య పతక పోరులో పర్ణీత్ 140–135తో హేలీ బౌల్టన్ (బ్రిటన్)ను ఓడించి కాంస్య పతకం సాధించింది. కాంపౌండ్ జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో సాక్షి 140–141తో అమందా మ్లినారిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకోగా... కాంపౌండ్ జూనియర్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక పోరులో రిషభ్ యాదవ్ 146–145తో సెబాస్టియన్ గార్సియా (మెక్సికో)పై గెలిచి కాంస్యం సాధించాడు. -
మేరీకోమ్ X నిఖత్
న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పట్టుదల నెగ్గింది. భారత దిగ్గజం మేరీకోమ్తో ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ పోరు నిర్వహించాలనే ఆమె మొరను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆలకించాయి. ఇద్దరి మధ్య ట్రయల్ బౌట్ పెట్టాలని బీఎఫ్ఐని క్రీడాశాఖ ఆదేశించింది. దీంతో బీఎఫ్ఐ డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లందరికీ సెలక్షన్ బౌట్లను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇటీవల బీఎఫ్ఐ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్కి అనుకూలంగా వ్యవహరించింది. ట్రయల్స్ లేకుండానే 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్ని ఒలింపిక్స్ క్వాలియఫర్స్కు ఎంపిక చేసింది. ఇది వివాదం రేపింది. తన ఒలింపిక్స్ అవకాశాల్ని ఇలా తుంచేయడాన్ని సహించలేకపోయిన నిఖత్ ఏకంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అందులో కోరింది. దీనిపై ఎట్టకేలకు స్పందించిన క్రీడాశాఖ ట్రయల్స్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లకు ట్రయల్స్ పోటీలు జరుగనున్నాయి. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్, నిఖత్ల మధ్య నిర్వహించే ట్రయల్స్ బౌట్లో నెగ్గిన బాక్సర్... ఒలింపిక్స్ క్వాలిఫయర్స్కు అర్హత సంపాదిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో ఈ క్వాలిఫయర్స్ పోటీలు జరుగుతాయి. 51 కేజీల విభాగంతోపాటు 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో కూడా సెలెక్షన్ ట్రయల్స్ బౌట్లు ఉంటాయి. ఆ ఇద్దరికి మినహాయింపు... ఇక పురుషుల విభాగంలో ప్రపంచ చాంపియన్షిప్లో రజతం నెగ్గిన అమిత్ పంఘాల్ (52 కేజీలు), కాంస్యం సాధించిన మనీశ్ కౌశిక్ (63 కేజీలు)లకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా జట్టులోకి ఎంపిక చేయనున్నారు. మిగతా ఆరు కేటగిరీల్లో (57, 69, 75, 81, 91, ప్లస్ 91 కేజీలు) మాత్రం డిసెంబర్ 27, 28 తేదీల్లో ట్రయల్స్ ఉంటాయి. -
షెల్లీ గెలిచింది మళ్లీ...
తల్లి హోదా వచ్చాక తమలో ప్రావీణ్యం మరింత పెరిగిందేకానీ తరగలేదని జమైకా మేటి అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్... అమెరికా స్టార్ అలీసన్ ఫెలిక్స్ నిరూపించారు. మహిళల 100 మీటర్ల విభాగంలో తనకు తిరుగులేదని షెల్లీ మరోసారి లోకానికి చాటి చెప్పగా... ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన అథ్లెట్గా అలీసన్ ఫెలిక్స్ గుర్తింపు పొందింది. 11 స్వర్ణాలతో జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ పేరిట ఉన్న రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో 33 ఏళ్ల ఫెలిక్స్కు 17వ పతకం కావడం విశేషం. దోహా (ఖతర్): తక్కువ ఎత్తు ఉన్నా... ట్రాక్పై చిరుతలా దూసుకెళ్లే అలవాటుతో... ‘పాకెట్ రాకెట్’గా ముద్దు పేరు సంపాదించిన జమైకా మేటి మహిళా అథ్లెట్ షెల్లీ యాన్ ఫ్రేజర్ ప్రైస్ మళ్లీ విశ్వవేదికపై కాంతులీనింది. తొలి సంతానం కోసం 2017 ప్రపంచ చాంపియన్ షిప్కు దూరమైన షెల్లీ... మగశిశువుకు జన్మనిచ్చాక ఈ ఏడాది మళ్లీ ట్రాక్పై అడుగు పెట్టింది. ప్రపంచ చాంపియన్షిప్లో రాణిస్తుందో లేదో అనే అనుమానం ఉన్న వారందరి అంచనాలను తారుమారు చేసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 5 అడుగుల ఎత్తు ఉన్న షెల్లీ 10.71 సెకన్లలో గమ్యానికి చేరి ఏకంగా నాలుగోసారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచింది. రాకెట్ వేగంతో రేసును ఆరంభించిన షెల్లీ 20 మీటర్లకే తన ప్రత్యర్థులను వెనక్కినెట్టి అందరికంటే ముందుకు వెళ్లిపోయింది. అదే జోరులో రేసును ముగించేసింది. డీనా యాషెర్ స్మిత్ (బ్రిటన్–10.83 సెకన్లు) రజతం... మేరీ జోసీ తా లూ (ఐవరీకోస్ట్–10.90 సెకన్లు) కాంస్యం సాధించారు. గతంలో షెల్లీ 2009, 2013, 2015లలో కూడా ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకాలు గెలిచింది. రేసు ముగిసిన వెంటనే షెల్లీ తన రెండేళ్ల కుమారుడు జియోన్తో సంబరాలు చేసుకుంది. ‘మళ్లీ స్వర్ణం గెలిచి... నా కుమారుడితో విశ్వవేదికపై సగర్వంగా నిల్చోవడం చూస్తుంటే నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. గత రాత్రంతా నాకు నిద్ర లేదు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలోనూ ఇలాగే జరిగింది. శుభారంభం లభిస్తే చాలు రేసులో దూసుకుపోతానని తెలుసు. అదే వ్యూహంతో ఈసారీ బరిలోకి దిగాను. కొన్నాళ్లుగా తీవ్రంగా కష్టపడ్డాను. భర్త జేసన్, కుమారుడు జియోన్ నాలో కొత్త శక్తిని కలిగించారు’ అని షెల్లీ వ్యాఖ్యానించింది. ఫెలిక్స్...12వ స్వర్ణం గత నవంబర్లో ఆడ శిశువు కామ్రిన్కు జన్మనిచ్చాక... ఈ ఏడాది జులైలో ట్రాక్పైకి అడుగు పెట్టిన అలీసన్ ఫెలిక్స్ 4x400 మిక్స్డ్ రిలేలో స్వర్ణ పతకం సాధించింది. దాంతో 11 స్వర్ణాలతో ప్రపంచ చాంపియన్షిప్లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన ఉసేన్ బోల్ట్ రికార్డును 12వ స్వర్ణంతో ఫెలిక్స్ బద్దలు కొట్టింది. గతంలో ఫెలిక్స్ 2005 (1), 2007 (3), 2009 (2), 2011 (2), 2015 (1), 2017 (2) ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లోనూ పసిడి పతకాలు సాధించింది. జావెలిన్ ఫైనల్లో అన్ను రాణి... సోమవారం భారత అథ్లెట్స్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల జావెలిన్ త్రో విభాగంలో అన్ను రాణి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు 12 మంది పాల్గొనే ఫైనల్కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ ‘ఎ’ గ్రూప్లో పోటీపడిన అన్ను రాణి ఈటెను 62.43 మీటర్ల దూరం విసిరింది. ఈ క్రమంలో 62.34 మీటర్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. ఓవరాల్గా క్వాలిఫయింగ్లో తొమ్మిదో స్థానంతో అన్ను రాణి నేడు జరిగే ఫైనల్కు అర్హత పొందింది. మహిళల 200 మీటర్ల హీట్స్లో అర్చన 23.65 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచింది. మహిళల 400 మీటర్ల హీట్స్లో భారత్కే చెందిన అంజలీ దేవి 52.33 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచింది. -
టోక్యో ఒలింపిక్స్కు వినేశ్ ఫొగాట్
నూర్-సుల్తాన్ (కజకిస్తాన్): భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బుధవారం 2020 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లోని సెకండ్ రేప్చేజ్ రౌండ్లో ఆమె సరా అన్ హిల్డర్బ్రాండ్ట్ (అమెరికా)ను సునాయసంగా ఓడించి.. 53కేజీల విభాగంలో ఒలింపిక్స్ బెర్త్ను సొంతం చేసుకున్నారు. 8-2 తేడాతో సరాను ఓడించిన ఫొగాట్.. గ్రీస్కు చెందిన టాప్ రెజ్లర్ మరియా ప్రెవోలరాకితో తలపడనున్నారు. మరియాపై గెలుపొందితే ఆమె కాంస్య పతకం సొంతం చేసుకుంటారు. మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మయు ముకయిద (జపాన్) 7-0 తేడాతో ఫొగాట్ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ జపాన్ రెజ్లర్ తన జైత్రయాత్ర కొనసాగించి గెలిచి ఫైనల్ చేరింది. దీంతో వినేశ్కు ‘రెపిచేజ్’లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలో యులియా బ్లహిన్యా (ఉక్రెయిన్), సరాలను ఓడించిన వినేశ్.. మరియాపై కూడా విజయం సాధిస్తే.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లోని కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంటారు. -
'ఈ సారి ఎలాగైనా సాధిస్తా'
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ చాంపియన్షిప్ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫిట్నెస్పై ఎక్కువ దృష్టిపెట్టినట్లు చెప్పింది. ఈ మెగా ఈవెంట్లో గతంలో సింధు నాలుగు పతకాలు సాధించింది. రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలు నెగ్గింది. కానీ స్వర్ణం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఫైనల్ చేరిన రెండుసార్లు పరాజయమే చవిచూసింది. అయితే ఈ సారి మాత్రం టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నానని 24 ఏళ్ల సింధు చెప్పు కొచ్చింది. ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్లోని బాసెల్లో ప్రపంచ చాంపియన్షిప్ బ్యాడ్మింటన్ జరుగనుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ప్రాక్టీస్లో కఠోరంగా శ్రమించా. ఈ సారి తప్పకుండా స్వర్ణం సాధిస్తానన్న నమ్మకముంది. అలాగని నాపై ఒత్తిడేమీ లేదు. మంచి ప్రదర్శన కనబరుస్తాను. డిఫెన్స్, ఫిజికల్ ఫిట్నెస్పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. అలాగే ఆటతీరు కూడా మెరుగయ్యేందుకు కష్టపడ్డాను’ అని తెలిపింది. తెలుగుతేజంకు జపాన్ ప్రత్యర్థి యామగుచి కొరకరాని కొయ్య గా మారింది. ఇండోనేసియా, జపాన్ టోర్నీల్లో సింధుకు చుక్కలు చూపించింది. ఆమెను ఎదుర్కోవడంపై ఎలాంటి కసరత్తు చేశారని ప్రశ్నిం చగా.... ‘యామగుచితో పోరు కష్టమేమీ కాదు. ఇండోనేసియా టోర్నీలో ఆమెను దీటుగా నే ఎదుర్కొన్నా. కానీ ఆమె అటాకింగ్ బాగా చేసింది. ర్యాలీల్లోనూ దిట్టే! కాబట్టి ఆమె దూకుడు నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఆమెతో నేను తలపడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సింధు వివరించింది. ప్రపంచ చాంపియన్షిప్లో తెలుగుతేజం ఐదో సీడ్గా బరిలోకి దిగుతోంది. తొలిరౌండ్లో ఆమెకు బై లభించింది. రెండో రౌండ్లో చైనీస్తైపీకి చెందిన పాయ్ యు పొ లేదంటే లిండా (బల్గేరియా)తో తలపడే అవకాశముంది. ఇందులో గెలిస్తే... తదుపరి రౌండ్లో బీవెన్ జంగ్ (అమెరికా)ను ఎదుర్కొంటుంది. ఈ అడ్డంకులన్నీ దాటితే క్వార్టర్స్లో తైపీ స్టార్ తై జు యింగ్ ఎదురయ్యే అవకాశాలున్నాయి. -
వరల్డ్ చాంపియన్షిప్ నుంచి ఔట్
ఇటీవలే థాయిలాండ్ ఓపెన్ గెలిచి ఊపు మీదున్న భారత డబుల్స్ బ్యాడ్మింటన్ జంట సాతి్వక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి అనూహ్యంగా వరల్డ్ చాంపియన్షిప్ నుంచి తప్పుకున్నారు. ‘సాతి్వక్ భుజం గాయంతో బాధపడుతుంటే నా పక్కటెముకల గాయం కూడా తగ్గలేదు. మా ఫామ్, ఫలితాలను బట్టి చూస్తే ఇది కఠిన నిర్ణయమే అయినా మాకు మరో అవకాశం లేదు’ అని చిరాగ్ శెట్టి వెల్లడించాడు. -
ప్రపంచ చాంపియన్షిప్కు వినేశ్ ఫొగాట్, సాక్షి
లక్నో: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ ట్రయల్స్లో భారత స్టార్ ప్లేయర్లు వినేశ్ ఫొగాట్ (53 కేజీలు), సాక్షి మలిక్ (62 కేజీలు) సత్తా చాటారు. ఆదివారం జరిగిన ఈ ట్రయల్స్ ఫైనల్ బౌట్లో వినేశ్ ఫొగాట్ 9–0తో పింకీపై గెలుపొందగా... రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ 13–2తో రేష్మా మన్ను అలవోకగా ఓడించి ప్రపంచ చాంపియన్షిప్కు అర్హత సాధించారు. వీరిద్దరితో పాటు సీమా బిస్లా (50 కేజీలు), సరితా మోర్ (57 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు), కిరణ్ గొడారా (76 కేజీలు) వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. దివ్య కక్రాన్ 6–3తో నవ్జోత్ కౌర్పై విజయం సాధించగా... 57 కేజీల విభాగంలో బెర్త్ కోసం పూజ, అన్షు మలిక్, మంజు, సరిత గట్టిగా పోటీపడ్డారు. కానీ ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత పూజ దండాను వెనక్కి నెట్టి సరిత భారత జట్టులోకి ఎంపికైంది. కజకిస్తాన్ వేదికగా సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ జరగనుంది. ఈ చాంపియన్షిప్లో సత్తా చాటిన రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్ బెర్తు ఖరారు అవుతుంది. ఆదివారం జరిగిన ట్రయల్స్ వెయిట్ కేటగిరీలన్నీ ఒలింపిక్స్లో భాగంగా ఉండగా... ఆగస్టు రెండో వారంలో ఒలింపిక్స్ క్రీడల్లో లేని వెయిట్ కేటగిరీలకు ట్రయల్స్ నిర్వహిస్తారు. -
జ్యోతి సురేఖ డబుల్ ధమాకా
ఎస్–హెర్టోజెన్బాష్ (నెదర్లాండ్స్): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ చాంపియన్షిప్లోనూ అదరగొట్టింది. విజయవాడకు చెందిన 22 ఏళ్ల జ్యోతి సురేఖ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. తొలుత ముస్కాన్ కిరార్, రాజ్ కౌర్లతో కలిసి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో కాంస్యం దక్కించుకోగా... ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో మరో కాంస్యం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ, ముస్కాన్, రాజ్ కౌర్ బృందం 229–226తో యెసిమ్ బోస్టాన్, గిజెమ్ ఎల్మాగాక్లి, ఇపెక్ టామ్రుక్లతో కూడిన టర్కీ జట్టుపై గెలిచింది. భారత జట్టు విజయంలో జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. ఆమె సంధించిన ఎనిమిది బాణాల్లో ఆరు ‘10’ షాట్లు ఉండటం విశేషం. యెసిమ్ బోస్టాన్ (టర్కీ)తో జరిగిన వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్లో జ్యోతి సురేఖ ‘షూట్ ఆఫ్’లో పైచేయి సాధించింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 145–145 పాయింట్లతో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో బాణం అవకాశం ఇచ్చారు. ఇందులో జ్యోతి సురేఖ గురికి 10 పాయింట్లు రాగా... యెసిమ్ బాణానికి తొమ్మి ది పాయింట్లే వచ్చాయి. నేడు పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో తరుణ్దీప్ రాయ్, రమేశ్ ప్రవీణ్ జాదవ్, అతాను దాస్లతో కూడిన భారత జట్టు స్వర్ణం కోసం తలపడనుంది. చైనా జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 24: తన ఎనిమిదేళ్ల కెరీర్లో జ్యోతి సురేఖ సాధించిన అంతర్జాతీయ పతకాల సంఖ్య. ఇందులో మూడు స్వర్ణాలు, 11 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ‘రెండేళ్ల క్రితం టీమ్ విభాగంలో మేం రజత పతకం సాధించాం. ఈసారి కాంస్యం దక్కినా ఎలాంటి నిరాశ లేదు. ఎందుకంటే వరుసగా రెండో ప్రపంచ చాంపియన్ షిప్లోనూ టాప్–3లో నిలిచాం. ఈ పతకం మా అందరికీ ఎంతో ప్రత్యేకం. ఇక వ్యక్తిగత విభాగంలో నాకిది తొలి ప్రపంచ చాంపియన్షిప్ పతకం. ఒకదశలో కొంచెం నెర్వస్గా ఫీలయ్యాను. కానీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నించాను. నా ప్రత్యర్థి నుంచి కూడా గట్టిపోటీ ఎదురుకావడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాను. షూట్ ఆఫ్లో మాత్రం కంగారు పడకుండా గురి చూసి కొట్టాను. ’’ –జ్యోతి సురేఖ -
పసిడిపై గురి
ఎస్–హెర్టోజెన్బాష్ (నెదర్లాండ్స్): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల ఆర్చరీ జట్టు ప్రపంచ చాంపియన్షిప్లో అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం క్వార్టర్ ఫైనల్కు చేరి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత బృందం... గురువారం మరో రెండు విజయాలు సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. తరుణ్దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్లతో కూడిన భారత బృందం క్వార్టర్ ఫైనల్లో 6–0తో చి చుంగ్ టాన్, యు చెంగ్ డెంగ్, చున్ హెంగ్ చెలతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించింది. భారత్ తొలి సెట్ను 55–52తో, రెండో సెట్ను 55–48తో, మూడో సెట్ను 55–54తో గెల్చుకుంది. ఒక్కో సెట్కు రెండు పాయింట్ల చొప్పున ఇస్తారు. సెమీఫైనల్లో భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో వాన్ డెన్ బెర్గ్, వాన్ డెర్ వెన్, స్టీవ్ విజ్లెర్లతో కూడిన నెదర్లాండ్స్ జట్టుపై గెలిచింది. తొలి సెట్ను నెదర్లాండ్స్ 56–54తో, రెండో సెట్ను భారత్ 52–49తో, మూడో సెట్ను నెదర్లాండ్స్ 57–56తో, నాలుగో సెట్ను భారత్ 57–55తో గెల్చుకున్నాయి. దాంతో స్కోరు 4–4తో సమమైంది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించగా... భారత్ 29–28తో నెదర్లాండ్స్ను ఓడించి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్షిప్లో భారత జట్టు ఫైనల్ చేరింది. చివరిసారి 2005లో భారత్ ఫైనల్ చేరి తుది పోరులో 232–244తో కొరియా చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. చివరిసారి ఫైనల్ చేరిన నాటి భారత జట్టులోనూ తరుణ్దీప్ రాయ్ సభ్యుడిగా ఉండటం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ పోటీపడుతుంది. -
ఉత్సాహంగా..రేస్
సాక్షి,విజయవాడ : ప్రతిష్టాత్మకమైన ఎస్1హెచ్2ఓ పవర్ బోటు రేసింగ్కు రెండవ రోజు ఉత్సాహంగా సాగింది. రేసింగ్ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. శనివారం జరిగిన కాలిఫైయింగ్ తొలిరౌండ్లో 19 జట్లు పాల్గొనగా అందులో 12 జట్లు అర్హత సాధించాయి. రెండవ క్వాలిఫైయింగ్ రౌండ్ పూర్తయిన తరువాత 6 జట్లు అర్హత సాధించాయి. ఇందులో అమరావతి బోటు కూడా అర్హత సాధించింది. ఆదివారం ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే ఏడు పోటీలు పూర్తయిన తరువాత చాంపియన్స్ను ప్రకటిస్తారు. నదుల్లో బోటింగ్ కొంత ఇబ్బందే సముద్రంలో జరిగే ఈ రేస్లు నదిలో నిర్వహించడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని రేసర్లను విలేకర్లు ప్రశ్నించినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉందని వారు చెప్పారు. ముఖ్యంగా నదిపై వచ్చే గాలి వల్ల, నీటి ప్రవాహం వల్ల బోట్లు నడపడం కొంచెం ఇబ్బందిగా ఉంటోదని పేర్కొన్నారు. చాకచక్యంగా, వేగవంతంగా నడుపుతున్నామని రేసర్లు చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల చేతుల్లో పాస్లు వీవీఐపీ పాన్లను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. ఈ పాస్లన్నీ అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చేతికి, పర్యాటక శాఖ ఉన్నతాధికారుల చేతికి వెళ్లిపోయాయి. బోట్ రేసింగ్ పై ఆసక్తితో తిలకించడానికి వచ్చే వారికి పాస్లు లేకపోవడంతో దుర్గాఘాట్లోనూ, భవానీఘాట్లోనూ కూర్చుని తిలకించాల్సి వచ్చింది. పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులను పెద్దఎత్తున తరలించారు. ఉదయం వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు కూర్చోలేక రేస్ ప్రారంభం కాకముందే వెళ్లిపోవడం దర్శనమిచ్చింది. సౌకర్యాలు నిల్ పున్నమి ఘాట్కు వచ్చిన సందర్శకులకు కావాల్సిన ఏర్పాటు చేయడంలో నిర్వహకులు పూర్తిగా విఫలమయ్యారు. మంగళగిరి చెందిన కొంతమంది యువతులు గ్యాలరీ 5కు చెందిన పాస్లు తీసుకువస్తే ఆ గ్యాలరీ ఎక్కడో చెప్పేవారే కరువయ్యారు. చివరకు రెండవ నెంబర్ గ్యాలరీ ఖాళీగా వుందని తెలుసుకుని అక్కడకు వెళ్లి కూర్చుని రేస్లను తిలకించారు. ఏ గ్యాలరీ ఎక్కడ ఉందో అధికారులే చెప్పలేకపోతున్నారని ప్రజ్ఞ సాక్షికి వివరించింది. రేస్ల గురించి సమాచారం చెప్పేవారే కరువయ్యారు. ఆఖరి రోజుపైనే అందరి దృష్టి రెండవ రోజు తగినంత మంది సందర్శకులు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదివారం అదే పరిస్థితి ఉంటే ప్రతిష్ట దెబ్బతింటుందని భారీగా ప్రేక్షకుల్ని తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పవిత్ర సంగమం వద్దకు రేస్లు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తొలుత చెప్పింది. వాస్తవంగా భవానీఘాట్ వరకు మాత్రమే బోట్లు నడుస్తున్నాయి. పవిత్ర సంగమం వద్దకు వచ్చిన వారు రేస్లు సరిగా కనపడటం లేదని చెప్పారు. -
పసిడి పతక పోరుకు రవి కుమార్ అర్హత
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ రవి కుమార్ ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో ఫైనల్కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. రొమేనియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో రవి 10–8తో తురొబోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. నేడు జరిగే స్వర్ణ పతక పోరులో జపాన్కు చెందిన తొషిహిరోతో రవి తలపడతాడు. ఒకవేళ రవి గెలిస్తే ఈ ఈవెంట్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్గా గుర్తింపు పొందుతాడు. 2017లో బజరంగ్ పూనియా (65 కేజీలు), ఓంప్రకాశ్ (70 కేజీలు) రజత పతకాలు గెలిచారు. -
కృష్ణా నదిలో పవర్ బోటింగ్ రేస్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎఫ్1 హెచ్2ఓ వరల్డ్ చాంపియన్షిప్ పోటీలకు అమరావతి వేదిక కానుంది. 14 ఏళ్ల తర్వాత ఈ పవర్ బోటింగ్ రేస్ భారత్లో జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన దాదాపు 350 మంది డ్రైవర్లు నవంబర్ 16 నుంచి 18 వరకు కృష్ణా నదిలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. తొలిసారి ఇద్దరు మహిళా డ్రైవర్లు కూడా ఎఫ్1 హెచ్2ఓ రేస్లో పాల్గొంటుండటం విశేషం. 2018 గ్రాండ్ ప్రి సీజన్లో మొత్తం ఏడు రేస్లకు గాను ఇప్పటికే పోర్టిమావో (పోర్చుగల్), లండన్, ఎవియాన్ (ఫ్రాన్స్), చైనాలలో రేస్లు జరిగాయి. ఐదో రేస్ను ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్వహిస్తున్నారు. తర్వాతి రెండు యూఏఈలో జరుగుతాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ మెగా పవర్ బోట్ రేసింగ్ ఈవెంట్కు యూనియన్ ఇంటర్నేషనల్ మోటోనాటిక్ (యూఐఎం) గుర్తింపుంది. ఈ పోటీల్లో అమరావతి పేరుతో జట్టు కూడా బరిలో ఉంది. స్వీడన్కు చెందిన జొనాస్ అండర్సన్, ఎరిక్ ఎడిన్ ఈ జట్టు డ్రైవర్లుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా అన్నారు. గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బోట్ రేసింగ్ను పెద్ద సంఖ్యలో చూసేందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్1 హెచ్2ఓ ప్రతినిధి మార్కో పీట్రినీ, స్పాన్సర్ ఇండియా ఎక్స్ట్రీమ్కు చెందిన సందీప్ మండవ కూడా పాల్గొన్నారు. -
బజరంగ్ కొత్త చరిత్ర
బుడాపెస్ట్ (హంగేరి): ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ప్రపంచ చాంపియన్షిప్లోనూ మెరిశాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో ఈ హరియాణా రెజ్లర్ స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ రెజ్లర్గా కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 2013 ప్రపంచ చాంపియన్షిప్లో బజరంగ్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న బజరంగ్ ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ ఫేవరెట్స్లో ఒకరిగా బరిలోకి దిగాడు. తనపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణించి ఒక్కో ప్రత్యర్థిని ఓడిస్తూ అంతిమ సమరానికి అర్హత పొందాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో బజరంగ్ 4–3తో అలెజాండ్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)ను ఓడించాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 5–3తో తుల్గా తుముర్ (మంగోలియా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–0 తో సెయుంగ్చుల్ లీ (దక్షిణ కొరియా)పై, తొలి రౌండ్లో 9–4తో రోమన్ అశారిన్ (హంగేరి)పై నెగ్గాడు. ఆదివారమే జరిగిన ఇతర విభాగాల్లో భారత రెజ్లర్లు నిరాశ పరిచారు. సందీప్ తోమర్ (57 కేజీలు), దీపక్ (92 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... సచిన్ రాఠి (79 కేజీలు) తొలి రౌండ్లో ఓడిపోయారు. నేడు జరిగే ఫైనల్లో టకుటో ఒటోగురో (జపాన్)తో బజరంగ్ తలపడతాడు. ఒకవేళ బజరంగ్ గెలిస్తే భారత్ తరఫున ప్రపంచ చాంపియన్ అయిన రెండో రెజ్లర్గా గుర్తింపు పొందుతాడు. ఇప్పటివరకు భారత్ తరఫున సుశీల్ కుమార్ (66 కేజీలు; 2010లో) ఒక్కడే విశ్వవిజేతగా నిలిచాడు. గతంలో భారత్ తరఫున అమిత్ (55 కేజీలు; 2013లో), బిషంబర్ (57 కేజీలు; 1967లో) రజతాలు... రమేశ్ (74 కేజీలు; 2009లో), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు; 2015లో), సందీప్ (66 కేజీలు, 2013లో) కాంస్య పతకాలు సాధించారు. -
భారత షూటర్ల కొత్త చరిత్ర
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. గతంలో ఎన్నడు లేని విధంగా 11 స్వర్ణాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. పోటీల ముగింపు రోజు శుక్రవారం రెండు స్వర్ణాలు, ఓ రజతం భారత్ ఖాతాలో చేరడంతో... మొత్తంగా 27 పతకాల (11 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో మూడో స్థానంతో ముగించింది. మన షూటర్లు చివరి రోజు జూనియర్ విభాగంలో రెండు స్వర్ణాలు... సీనియర్ విభాగంలో ఓ రజతం సాధించారు. జూనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో పదహారేళ్ల విజయ్వీర్ 572 పాయింట్లతో పసిడి పతకం సాధించాడు. టీమ్ విభాగంలో విజయ్వీర్ (564), రాజ్కన్వర్ సింగ్ సంధు (564), ఆదర్శ్ సింగ్ (559)లతో కూడిన భారత జట్టు 1695 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. కొరియా (1693), చెక్ రిపబ్లిక్ (1674) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నాయి. సీనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో గురుప్రీత్ సింగ్ 579 పాయింట్లతో రజతం సాధించాడు. టీమ్ విభాగంలో గురుప్రీత్, అమన్ప్రీత్ సింగ్, విజయ్ కుమార్లతో కూడిన భారత బృందం 1699 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్కు క్వాలిఫయింగ్ ఈవెంట్గా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ రెండు ఒలింపిక్ బెర్త్లను సొంతం చేసుకుంది. అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండీలా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ బెర్త్లు సాధించారు. -
విశ్వ కిరీటానికి విజయం దూరంలో...
జగజ్జేతగా అవతరించడానికి తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మరో అవకాశం లభించింది. వరుసగా రెండో ఏడాది ఆమె ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతేడాది గ్లాస్గో వేదికగా నొజోమి ఒకుహారా (జపాన్)తో 110 నిమిషాల సుదీర్ఘ తుది సమరంలో ఓడిపోయిన సింధు... ఈసారి స్వదేశానికి విశ్వ విజేతగా తిరిగొచ్చేందుకు మరో విజయం దూరంలో ఉంది. గత ఏడాది కాలంలో సింధు ఐదు మెగా ఈవెంట్స్లో ఫైనల్లోకి ప్రవేశించి ఐదుసార్లూ తుది మెట్టుపై బోల్తా పడింది. ఆరో ‘ఫైనల్’ను ఆమె చిరస్మరణీయం చేసుకోవాలని... చైనా గడ్డపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలని ఆశిస్తూ... బెస్టాఫ్ లక్... సింధు! నాన్జింగ్ (చైనా): భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకునేందుకు పీవీ సింధు ఇంకొక్క విజయం దూరంలో నిలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో వరుసగా రెండో ఏడాది సింధు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–16, 24–22తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో రెండుసార్లు (2014, 2015) విశ్వవిజేత, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో ఏడో సీడ్ మారిన్ 13–21, 21–16, 21–13తో హీ బింగ్జియావో (చైనా)పై గెలిచింది. మారిన్తో ముఖాముఖి రికార్డులో సింధు 5–6తో వెనుకంజలో ఉంది. అయితే మారిన్తో జరిగిన గత నాలుగు మ్యాచ్ల్లో మూడుసార్లు సింధునే గెలుపొందడం విశేషం. వెనుకబడి... పుంజుకొని గతేడాది దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో... ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సెమీఫైనల్లో యామగుచి చేతిలో ఓడిపోయిన సింధుకు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లోనూ సింధు తొలుత వెనుకబడి ఆ తర్వాత తేరుకొని విజయం దక్కించుకోవడం ఆమె మెరుగైన ఆటతీరుకు నిదర్శనం. తొలి గేమ్ ఆరంభంలో అనవసర తప్పిదాలతో సింధు వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. కానీ పాయింట్ల ఖాతా తెరిచిన తర్వాత ఆమె ఆటతీరు గాడిలో పడింది. స్కోరు 4–8 వద్ద సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 9–8తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత యామగుచి ధాటికి సింధు మళ్లీ 10–12తో వెనుకబడింది. కానీ పట్టుదలతో ఆడిన ఈ హైదరాబాద్ అమ్మాయి జూలు విదిల్చింది. కళ్లు చెదిరే స్మాష్లు... డ్రాప్ షాట్లు సంధించి వరుసగా 8 పాయింట్లు గెలిచి 18–12తో ముందంజ వేసింది. 12–19 నుంచి 20–19 వరకు... ఇక రెండో గేమ్లోనూ తొలుత యామగుచినే ఖాతా తెరిచింది. పాయింట్ల కోసం ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా ఎక్కువసార్లు యామగుచినే పైచేయి సాధించింది. 6–2తో... 8–7తో... 11–7తో... 16–12తో... ఇలా ఆధిక్యం పెంచుకుంటూ పోయిన యామగుచి 19–12తో గేమ్ సొంతం చేసుకోవడానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే ఇక్కడే సింధు అద్భుతం చేసింది. నమ్మశక్యంకాని రీతిలో విజృంభించి వరుసగా 8 పాయింట్లు దక్కిం చుకొని 20–19తో విజయం ముంగిట నిలిచింది. అయితే యామగుచి తర్వాతి పాయింట్ను సాధించి స్కోరును 20–20తో సమం చేసింది. స్కోరు 22–21 వద్ద 41 షాట్లతో కూడిన ర్యాలీని యామగుచి గెలిచి మళ్లీ స్కోరును 22–22తో సమం చేసింది. పట్టువదలని సింధు 23–22తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత యామగుచి కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో సింధు ఖాతాలో మరో పాయింట్ చేరడంతోపాటు విజయం కూడా ఖాయమైంది. ఇంకా నా లక్ష్యం పూర్తి కాలేదు. గతే డాదితో పోలిస్తే ఈసారి ఫైనల్లో మెరుగైన ఫలితం వస్తుందని భావిస్తున్నాను. మారిన్తో నేడు జరిగే తుది సమరానికి పకడ్బందీగా సమాయత్తం కావాలి. నా ఆటతీరుపై తనకు... తన ఆటతీరుపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఫైనల్లో నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. జపాన్ క్రీడాకారిణులు యామగుచి, ఒకుహారా సుదీర్ఘ ర్యాలీలు ఆడతారు. ఈ ఇద్దరితో ఆడే సమయంలో ఏకాగ్రత, సహనం, నిలకడ కోల్పోకూడదు. యామగుచితో రెండో గేమ్లో నేను వెనుకబడిన సమయంలో ఎలాంటి ఆందోళన చెందలేదు. చివరి పాయింట్ వరకు పోరాడాలని, పుంజుకోవాలని ప్రయత్నించాను. – పీవీ సింధు -
ఫైనల్లోకి తెలుగు తేజం సింధు
నాంజింగ్ (చైనా) : ప్రపంచ చాంపియన్షిప్లో తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో వరుసగా ఐదోసారి బరిలోకి దిగి నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు స్వర్ణపోరుకు సిద్ధమైంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, జపాన్కు చెందిన అకానె యామగుచిపై 21-16, 24-22తో వరుస గేముల్లో విజయం సాధించింది. స్వర్ణం కైవసం చేసుకునేందుకు సింధు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. పసిడి పోరులో స్పెయిన్కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి కరోలినా మారిన్తో సింధు తలపడనుంది. తొలిగేమ్లో ప్రత్యర్థిని ఇరుకున పెట్టిన సింధు రెండో గేమ్లో తన శక్తిని కూడగట్టుకుని సత్తా చాటింది. తొలిగేమ్లో తొలుత యామగుచి ఆధిక్యం ప్రదర్శించినా 12-12తో సింధు సమం చేసింది. ఆపై ఆరు పాయింట్లు సాధించి 18-12లో ఆధిక్యంలో కనిపించిన సింధు.. చివరికి 21-16తో గేమ్ నెగ్గింది. రెండో గేమ్ మాత్రం సుదీర్ఘ ర్యాలీలు, ప్లేస్మెంట్లతో రెండో గేమ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఓ దశలో యామగుచి 19-12కు ఆధిక్యంలో నిలిచి రెండో గేమ్ను నెగ్గేలా కనిపించింది. కానీ మళ్లీ పుంజుకున్న సింధు 19-19తో స్కోరు సమం చేసింది. ఆపై 20-20, 21-21 ఇలా సాగిన ఉత్కంఠభరిత గేమ్ను 24-22తో సింధు నెగ్గి.. మ్యాచ్ను సొంతం చేసుకుంది. కీలకమైన క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్ల్లో సింధు జపాన్ క్రీడాకారిణులను ఓడించటం గమనార్హం. -
తగని ప్రశ్న తగిన జవాబు
ప్రశ్న: ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్షిప్స్ వంటి పెద్ద పెద్ద పోటీల ఫైనల్స్లో మీరు గెలవలేకపోతున్నారు! ఇకముందైనా ఓడిపోకుండా ఉండేందుకు మీరేం చేయబోతున్నారు? పి.వి.సింధు : నేను చాలా ఆకలిగా ఉన్నాను. బిగ్ టైటిల్స్ కొట్టాలని రగిలిపోతున్నాను. అలాగని బాధలో ఏం లేను. నాకు తెలుసు.. ఏదో ఒక రోజు నేను గెలిచి తీరుతాను. ఓడినా, గెలిచినా వంద శాతం గెలిచి తీరేందుకే నేను ఆడతాను. మిగతా ప్లేయర్లు తక్కువేం కాదు. అవతలి వైపుకు మనం కొట్టే స్ట్రోక్స్ బట్టి విజయావకాశాలు ఉంటాయి. అనూహ్యంగా జరిగే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మిస్సింగ్స్ కూడా గెలుపోటములను నిర్ణయిస్తాయి. చైనాలోని నంజింగ్లో సోమవారం ప్రారంభం అవుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలకు సిద్ధమవుతున్న వరల్డ్ నం.3, గతేడాది రన్నరప్ అయిన పి.వి.సింధు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానం. ►స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్లో గత ఏడాది జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ చాంపియన్షిప్స్ ఉమెన్స్ సింగిల్స్ పోటీలలో పి.వి.సింధు రన్నరప్గా నిలిచారు. -
ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు
గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం... ఈ ఏడాది ఆగస్టులో వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి... ఇప్పుడు తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో అదే ఫలితం.... పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో విక్టరీకి ‘ఫినిషింగ్ టచ్’ ఇవ్వలేకపోయింది. ఫైనల్లో పరాజయం అనంతరం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఓటమికంటే ఓడిన తీరు తనను ఎక్కువగా బాధ పెట్టిందని తెలిపింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే... ఫైనల్ పరాజయంపై... చాలా బాధగా ఉంది (ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ)... వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఇలాగే జరిగింది. మ్యాచ్ ముగిశాక చాలా సేపు వరకు కూడా కోలుకోలేదు. నా బాధను దాచుకోలేక ఒంటరిగా వెళ్లి ఏడ్చేశాను. చాలా కష్టపడి చాలా బాగా ఆడిన మ్యాచ్ ఇది. అసలు ఎలా ఓడానో అర్ధం కావడం లేదు. 19–19 వద్ద ఉన్నప్పుడు కూడా పరాజయం గురించి భయపడలేదు. నా వైపు నుంచి ఎలాంటి అనవసర తప్పిదాలు చేయలేదు. ఆఖరి రెండు పాయింట్లపై... నిజానికి ఆ రెండు కూడా నేను ర్యాలీలుగానే ఆడాలని భావించాను. దురదృష్టవశాత్తూ షటిల్స్ నెట్ను దాటలేకపోయాయి. వాటిలో ఒక్క పాయింట్ వచ్చినా ఫలితం భిన్నంగా ఉండేదేమో. మ్యాచ్ నాణ్యత గురించి చెప్పాలంటే అంతా గొప్పగా సాగింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే లీగ్ మ్యాచ్లో నేను ఓడించిన యామగుచి వేరు. ఫైనల్లో ఆడిన యామగుచి వేరు. ఫిట్నెస్పరంగా సమస్యలు... ఇంత సుదీర్ఘమైన మ్యాచ్లో అలసిపోవడం, మధ్యలో ఆటగాళ్లు ఇబ్బంది పడటం సహజం. ఆమెకు కూడా అలాగే అయింది. ఇటీవల చాలా మంది ర్యాలీలు ఎక్కువగా ఆడుతున్నారు. దానికి నేను కూడా సిద్ధమయ్యే వచ్చాను. అయితే డిఫెన్స్ కూడా బలంగా ఉండటం ముఖ్యం. ఆటపరంగా గెలిచేందుకు నేను ఏం చేయగలనో అంతా చేశాను కానీ చివర్లో అంతా చేజారింది. కీలక ఫైనల్ మ్యాచ్లలో ఓటములపై... నాకు కూడా ఫైనల్ ముగిశాక ఒకుహారా మ్యాచే గుర్తుకొచ్చింది. ఆటలో గెలుపోటములు సహజం కానీ కొన్ని విషయాల్లో నేను మరింత మెరుగు పడాల్సి ఉంది. 2017 సంవత్సరం చాలా బాగా సాగింది. నా కెరీర్లో ఒకే ఏడాది ఎక్కువ మ్యాచ్లు గెలిచిన సంవత్సరం ఇది. ఫైనల్స్లో గెలిస్తే ఇంకా బాగుండేది కానీ రన్నరప్ కూడా మంచి ఫలితమే. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ మొదలు పెడతాను. వరల్డ్ నంబర్వన్ కూడా సాధించే అవకాశం ఉంటుంది కదా. ‘చాలా హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఇద్దరూ బాగా ఆడారు. ఇద్దరూ గెలిచేలా కనిపించారు. అయితే యామగుచి కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించింది. చివర్లో సింధు కొంత అలసిపోవడంతో కొన్ని సార్లు అనుకున్న రీతిలో సరైన షాట్లతో స్పందించలేదు. కాస్త జలుబుతో కూడా బాధపడుతుండటంతో పదే పదే విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆటపరంగా నేను సంతృప్తి చెందాను. గత మ్యాచ్లలో ప్రదర్శనను బట్టి సింధు గర్వపడవచ్చు. ఈ ఓటమితో ఆమె బాధ పడటం సహజం. 2017లో ఆమె వరుసగా పెద్ద సంఖ్యలో టోర్నీలు ఆడింది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోకుండానే గెలిచింది. సుదీర్ఘ ర్యాలీలు సహజంగా మారుతున్నాయి కాబట్టి సమస్య లేదు. ఇక్కడ కొంత అలసట కనిపించినా... నా దృష్టిలో ఫిట్నెస్పరంగా బ్యాడ్మింటన్ సర్క్యూట్లో ఆమె అత్యుత్తమ క్రీడాకారిణులలో ఉంటుంది. కాబట్టి నాకు ఆమె ఫిట్నెస్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆమె తన తప్పులు సరిదిద్దుకొని మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. – ‘సాక్షి’తో పుల్లెల గోపీచంద్, భారత కోచ్ -
ఉషు వరల్డ్ చాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఉషు వరల్డ్ చాంపియన్ షిప్లో భారత్కు తొలి స్వర్ణం లభించింది. రష్యాలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారిణి పూజా కాడియన్ 75 కేజీల విభాగం ఫైనల్లో రష్యా ప్లేయర్ ఈవ్ గేనియా స్టెపనోవాపై విజయం సాధించి స్వర్ణం పొందింది. ఈ విజయంతో ఈ క్రీడలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పూజా కాడియన్ గుర్తింపు పొందారు. ఇక ఈ విభాగంలో భారత్కు పతకం రావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక పురుషుల 45 కేజీల విభాగంలో రమేశ్ చంద్ర సింగ్ కాంస్య పతకం గెలుపొందారు. -
ప్రసారకర్తల ఇష్టమేనా!
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్లో సైనా నెహ్వాల్ మ్యాచ్ షెడ్యూల్ విషయంలో విమర్శలు వచ్చాయి. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అనంతరం కోలుకునేందుకు తగినంత సమయం ఇవ్వకుండానే సెమీ ఫైనల్ ఆడించడం ఆమె ప్రదర్శనపై ప్రభావం చూపించిందని వినిపించింది. ఇందులో ప్రసారకర్తల పాత్ర ఉందని తేలింది. ఈ తరహాలో వారి ఇష్టానుసారం షెడ్యూల్లో మార్పులు చేయరాదని సైనా కోచ్ విమల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘సైనాను చూస్తే బాధగా ఉంది. సెమీస్ కోసం ఆమెకు తగినంత సమయం ఇవ్వలేదు. ముందు రోజు రాత్రి ఆఖరి మ్యాచ్ ఆమెదే. మరుసటి రోజు ఉదయమే సెమీస్ ఆడించారు. షెడ్యూలింగ్లోనే సమస్య ఉంది. టీవీ ప్రసారకర్తలకు దీనిని నిర్ణయించే హక్కు ఉండరాదు. ఈ విషయంలో అధికారులదే తప్పు. శ్రీకాంత్కు కూడా ఇదే సమస్య ఎదురైంది’ అని విమల్ కుమార్ వ్యాఖ్యానించారు. -
శభాష్ ...సాయిప్రణీత్
ఈ సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్న భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్ ప్రపంచ చాంపియన్షిప్లో మరో ముందడుగు వేశాడు. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్న ఈ తెలుగు తేజం రెండో రౌండ్లో ఓటమి అంచుల్లో ఉన్న దశలో పట్టుదలతో పోరాడి గట్టెక్కాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరోవైపు ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్, 12వ సీడ్ సైనా నెహ్వాల్ అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గ్లాస్గో (స్కాట్లాండ్): అత్యున్నత వేదికపై అదరగొట్టే ఆటతీరును ప్రదర్శించేందుకు వచ్చిన అవకాశాన్ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. వరుసగా ఐదో ప్రపంచ చాంపియన్షిప్లోనూ పతకం గెలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. పురుషుల సింగిల్స్లో భమిడిపాటి సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్... మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ తమ ప్రత్యర్థులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 19వ ర్యాంకర్ సాయిప్రణీత్ 14–21, 21–18, 21–19తో ప్రపంచ 26వ ర్యాంకర్ ఆంథోనీ సినిసుకా జిన్టింగ్ (ఇండోనేసియా)పై గెలుపొందగా... శ్రీకాంత్ 21–9, 21–17తో లుకాస్ కోర్వి (ఫ్రాన్స్)ను ఓడించాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో సమీర్ వర్మ (భారత్) 20–22, 9–21తో 16వ సీడ్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాగా... 13వ సీడ్ అజయ్ జయరామ్ 21–13, 21–18తో మార్క్ కాల్జు (నెదర్లాండ్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ‘బై’ పొందిన సైనా నెహ్వాల్ రెండో రౌండ్లో 21–11, 21–12తో సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సైనా వరుసగా ఎనిమిదోసారి ప్రపంచ చాంపియన్షిప్లో ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో తన్వీ లాడ్ (భారత్) 9–21, 19–21తో సుంగ్ జీ హున్ చేతిలో, రితూపర్ణ దాస్ (భారత్) 16–21, 13–21తో 16వ సీడ్ క్రిస్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్) చేతిలో ఓడిపోయారు. వరుసగా 8 పాయింట్లు... జిన్టింగ్తో 72 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సాయిప్రణీత్ పుంజుకున్నతీరు అద్భుతం. తొలి గేమ్ను కోల్పోయిన ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండో గేమ్లో కోలుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్లో జిన్టింగ్ దూకుడుగా ఆడి 18–12తో ఆధిక్యంలోకి వెళ్లి విజయానికి మూడు పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే ఈ ఏడాది సింగపూర్ ఓపెన్, థాయ్లాండ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన సాయిప్రణీత్ ఓటమి దిశగా పయనిస్తున్నా విజయంపై ఆశలు వదులుకోలేదు. కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సాయిప్రణీత్... నమ్మశక్యంకాని రీతిలో విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి 20–18తో విజయం అంచుల్లోకి వచ్చాడు. జిన్టింగ్ ఒక పాయింట్ గెలిచినా, వెంటనే సాయిప్రణీత్ మరో పాయింట్ సాధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) లేదా చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్; ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; రెండో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా నెహ్వాల్; ఎన్గాన్ యి చెయుంగ్ (హాంకాంగ్)తో పీవీ సింధు తలపడతారు. మరోవైపు మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) 22–24, 21–19, 15–21తో రెండో సీడ్ కామిల్లా రైటర్జుల్–క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) చేతిలో... ఆరతి సారా సునీల్–సంజన సంతోష్ (భారత్) 14–21, 15–21తో యిక్సిన్ బావో–జియోహాన్ యు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన–పూర్వీషా 21–13, 16–21, 8–21తో ముస్కెన్క్–పియెక్ (నెదర్లాండ్స్) చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–శ్లోక్ 14–21, 21–19, 14–21తో మిన్ చున్–చెంగ్ హెంగ్ సు (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
లీ చోంగ్ వీకి షాక్
పురుషుల సింగిల్స్లో మంగళవారం పెను సంచలనం నమోదైంది. ప్రపంచ మాజీ నంబర్వన్, రెండో సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) 21–19, 22–24, 21–17తో లీ చోంగ్ వీపై అద్భుత విజయం సాధించి ఆశ్చర్యపరిచాడు. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో లీ చోంగ్ వీ తొలి గేమ్ను కోల్పోయి, రెండో గేమ్లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. అయితే నిర్ణాయక మూడో గేమ్లో లెవెర్డెజ్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. ఒకదశలో 11–15తో వెనుకబడిన లెవెర్డెజ్ పట్టువిడవకుండా పోరాడి స్కోరును సమం చేయడమే కాకుండా ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా దానిని కాపాడుకొని గెలుపొందాడు. పదోసారి ప్రపంచ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన 34 ఏళ్ల లీ చోంగ్ వీ ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. 2005లో కాంస్యం నెగ్గిన ఈ మలేసియా దిగ్గజం 2011, 2013, 2015లలో రజత పతకాలు గెలిచాడు. 2014లోనూ లీ చోంగ్ వీ రజతం గెలిచినా... ఆ ఏడాది డోపింగ్లో పట్టుబడటంతో అతని నుంచి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. -
'ఇప్పటికీ నేనే గ్రేటెస్ట్'
లండన్: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ పోటీల్లో 100 మీటర్ల రేసులో బరిలోకి దిగి కాంస్య పతకంతో సరిపెట్టుకోవడం తన ఆధిపత్యాన్నిఎంతమాత్రం తగ్గించదని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ అభిప్రాయపడ్దాడు. ఇప్పటికీ తానే గ్రేటెస్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ' ప్రపంచ గ్రేటెస్ట్ అథ్లెట్లలో నేను ఒక్కడ్ని అని ఎప్పుడో నిరూపించుకున్నా. లండన్ వ్యక్తిగత పరుగులో కాంస్య పతకంతో సరిపెట్టుకోవడం నా ఆధిపత్యాన్ని ఏమీ తగ్గించదు. నా అత్యుత్తమ పదర్శనిని ఇచ్చా. కాంస్య పతకం నన్ను నిరూత్సాహానికి గురి చేయడం లేదు. కాకపోతే నాపై కాస్త ఒత్తిడి పడింది. సరైన ఆరంభాన్ని ఇవ్వకపోతే వెనుకబడిపోతాను అనే విషయంపై ఒత్తిడికి లోనయ్యా. అదే నన్ను రేస్ లో వెనుకబడటానికి కారణం కూడా కావొచ్చు. అయితే కొద్ది తేడాలో మాత్రం ప్రథమ స్థానాన్ని కోల్పోయా. ఇక తిరిగి పుంజుకోవడమే నా ముందున్న కర్తవ్యం'అని బోల్ట్ పేర్కొన్నాడు. లండన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ తరువాత కెరీర్ కు గుబ్ బై చెప్పబోతున్న బోల్ట్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి జరిగిన 100 మీటర్ల రేసులో మాత్రం తన జోరు కొనసాగించలేకపోయాడు. 9.95 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. అమెరికా స్టార్ స్పింటర్ జస్టిన్ గాట్లిన్ ఈ సారి బోల్ట్ను వెనక్కి నెట్టి స్వర్ణం ఎగరేసుకుపోయాడుగాట్లిన్ 9.92 సెకన్లలో పరుగును పూర్తి చేయగా క్రిష్టియన్ కోలెమన్( అమెరికా) 9.94 సెకన్లు, జమైకా స్టార్ ఉసేన్ బోల్ట్ 9.95 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేసి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. -
సొంతగడ్డపై బోల్ట్ చివరి రేస్
కింగ్స్టన్: జమైకా మేటి స్ప్రింట్ రన్నర్ ఉసేన్ బోల్ట్ తన సొంతగడ్డపై చివరి విజయాన్ని అందుకున్నాడు. 2002లో తాను ప్రొఫెషనల్ కెరీర్ను ప్రారంభించిన ట్రాక్పైనే శనివారం రాత్రి జరిగిన 100 మీటర్ల రేసును 10.03 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ ఏడాది బోల్ట్ తలపడిన తొలి 100 మీటర్ల ఈవెంట్ ఇదే కావడం విశేషం. వచ్చే ఆగస్టులో లండన్లో జరగనున్న వరల్డ్ చాంపియన్షిప్ తర్వాత బోల్ట్ రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇదే చివరి పోటీ కావడంతో తమ అభిమాన ఆటగాడి ప్రదర్శనను చూడటానికి అభిమానులు పోటెత్తారు. దాదాపు 30 వేల మంది అభిమానుల కేరింతల మధ్య విజయాన్నందుకున్న 30 ఏళ్ల ఈ జమైకన్ చిరుత చివరిసారిగా ట్రాక్ను ముద్దాడి ప్రేక్షకులను అలరించాడు. ఈ పోటీలో కొత్త రికార్డు నెలకొల్పడం కన్నా తన అభిమానులను అలరించడమే ధ్యేయంగా బరిలోకి దిగినట్లు గతేడాది రియో ఒలింపిక్స్లో మూడు స్వర్ణాలు నెగ్గిన బోల్ట్ చెప్పాడు. -
ప్రపంచ చాంపియన్షిప్కు మనోజ్, కవీందర్, సతీశ్ అర్హత
తాష్కెంట్: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని సద్విని యోగం చేసుకున్న భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (69 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), కవీందర్ సింగ్ బిష్త్ (52 కేజీలు) ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్కు అర్హత సాధించారు. ఆసియా చాంపియన్షిప్లో భాగంగా చివరి రోజు జరిగిన ‘బాక్స్ ఆఫ్ బౌట్’లలో మనోజ్ 3–2తో లియు వీ (చైనా)పై... సతీశ్ 5–0తో ము హైపెంగ్ (చైనా)పై గెలుపొందగా... కవీందర్కు తన ప్రత్యర్థి సలామ్ అబ్దుల్ (మలేసియా) నుంచి వాకోవర్ లభించింది. ఇంతకుముందే శివ థాపా, సుమీత్ సాంగ్వాన్, వికాస్ కృషన్, అమిత్ ప్రపంచ చాంపియన్షిప్ బెర్త్ సాధించారు. -
హారిక ‘హ్యాట్రిక్’
ప్రపంచ చాంపియన్షిప్లో వరుసగా మూడోసారి సెమీస్కు టెహరాన్ (ఇరాన్): మరోసారి టైబ్రేక్లో పైచేయి సాధించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక... ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్షిప్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నానా జాగ్నిద్జె (జార్జియా)తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ టైబ్రేక్లో హారిక 1.5–0.5తో విజయం సాధించింది. తొలి గేమ్లో తెల్లపావులతో ఆడిన హారిక 53 ఎత్తుల్లో గెలిచి... నల్ల పావులతో ఆడిన రెండో గేమ్ను 49 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. అంతకుముందు మంగళవారం నిర్ణీత రెండు గేమ్ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్ నిర్వహించారు. గురువారం జరిగే సెమీఫైనల్ తొలి గేమ్లో తాన్ జోంగి (చైనా)తో హారిక తలపడుతుంది. ఈ టోర్నీలో హారిక విజయాలన్నీ టైబ్రేక్లోనే ఖాయం కావడం గమనార్హం. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో హారిక వరుసగా మూడోసారి సెమీఫైనల్కు చేరడం విశేషం. 2012, 2015లలో హారిక సెమీస్లో ఓడి కాంస్య పతకాలను గెల్చుకుంది. -
ఒలింపిక్ పతకమే అత్యున్నతం
పీవీ సింధు అభిప్రాయం ముంబై: ప్రపంచ చాంపియన్షిప్స్లో పతకం సాధించడం కన్నా ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో పోడియం మీద నిలబడటం అన్నింటికన్నా అత్యుత్తమమని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్పష్టం చేసింది. 2013, 14 ప్రపంచ చాంపియన్షిప్స్లో తను కాంస్యాలు సాధించి భారత్ తరఫున రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇవేవీ ఒలింపిక్స్ పతకానికి సాటిరావని అభిప్రాయపడింది. ‘ప్రపంచ చాంపియన్షిప్స్ కన్నా ఒలింపిక్స్ చాలా పెద్ద ఈవెంట్. ఏ క్రీడాకారుడికైనా అంతిమ లక్ష్యం ఒలింపిక్ పతకం సాధించడమే. ఎందుకంటే అక్కడ ఉండే పోటీ, పరిస్థితులు అన్నీ విభిన్నం. రియో గేమ్స్ నా తొలి ఒలింపిక్స్. దీంతో చాలా ఉద్వేగంగా ఉన్నాను. భారత్ నుంచి ఈసారి ఏడుగురు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. మా నుంచి అందరూ పతకాలు ఆశిస్తున్న విషయం తెలుసు. దీనికోసం శాయశక్తులా పోరాడతాం’ అని సింధు తెలిపింది. -
క్వార్టర్స్లో సైనా పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ పారిస్: ప్రపంచ చాంపియన్షిప్లో రజత పతకం సాధించిన తర్వాత పాల్గొన్న మూడో టోర్నమెంట్లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్కు నిరాశ ఎదురైంది. జపాన్ ఓపెన్లో, డెన్మార్క్ ఓపెన్లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఈ హైదరాబాద్ అమ్మాయి తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 9-21, 15-21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. కశ్యప్ రెండు నెలలు దూరం మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో పారుపల్లి కశ్యప్, ప్రణయ్, అజయ్ జయరామ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో జరిగిన మ్యాచ్లో కశ్యప్ స్కోరు 11-21, 21-13. 2-4 వద్ద గాయం కారణంగా వైదొలిగాడు. కాలి పిక్కలో గాయం కారణంగా కశ్యప్ రెండు నెలలపాటు ఆటకు దూరమయ్యాడు. ఇతర మ్యాచ్ల్లో ప్రణయ్ 15-21, 8-21తో ఎన్జి కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో, అజయ్ జయరామ్ 18-21, 8-21తో తియాన్ హువీ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. -
భారీ గుమ్మడికాయల పోటీ
-
భారత్కు 11 పతకాలు
పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్ బకింగ్హామ్షైర్ (ఇంగ్లండ్): పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత షట్లర్లు సత్తా చాటారు. ఈ టోర్నీలో మన ఆటగాళ్లు మొత్తం 11 పతకాలు గెలుచుకున్నారు. ఇందులో నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో (ఎస్ఎల్ 4 కేటగిరీ) తరుణ్ తన టైటిల్ను నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ తరుణ్ 18-21, 21-10, 21-15తో ల్యూకాస్ మాజుర్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ (ఎస్ఎల్ 3 కేటగిరీ)లో ప్రమోద్ భగత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో భగత్ 16-21, 21-3, 21-16తో డిఫెండింగ్ చాంపియన్ ఫామ్ ట్రంగ్ (వియత్నాం)పై సంచలన విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ (ఎస్ఎస్3 ఎస్ఎల్4)లో స్వర్ణ, రజతాలతో పాటు మిక్స్డ్ డబుల్స్లో కూడా భారత్ స్వర్ణం గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్ ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. -
నర్సింగ్ ‘కంచు’పట్టు
లాస్ వెగాస్ (అమెరికా) : భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ ప్రపంచ చాంపియన్షిప్లో అదరగొట్టాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్కు కాంస్య పతకాన్ని అందించాడు. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో నర్సింగ్ ‘బై ఫాల్’ పద్ధతిలో జెలిమ్ఖాన్ ఖాదియెవ్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. నర్సింగ్ కాంస్య పతక ప్రదర్శనతో భారత్కు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్కు ఒక బెర్త్ ఖాయమైంది. హోరాహోరీగా జరిగిన ఈ బౌట్లో మహారాష్ట్రకు చెందిన నర్సింగ్ యాదవ్ ఒకదశలో 4-12 పాయింట్లతో వెనుకబడ్డాడు. అయితే చివరి నిమిషంలో నర్సింగ్ తన ప్రత్యర్థిని ఎత్తిపడేసి ఉడుంపట్టు పట్టాడు. దీంతో రిఫరీ బైఫాల్ పద్ధతిలో నర్సింగ్ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు జరిగిన రౌండ్లలో నర్సింగ్ 14-2తో హనోక్ రచమిన్ (ఇజ్రాయెల్)పై; 4-3తో సోనెర్ దిమిత్రాస్ (టర్కీ)పై; 16-5తో లివాన్ లోపెజ్ (క్యూబా)పై నెగ్గి సెమీస్కు అర్హత సాధించాడు. అయితే సెమీస్లో పురెవ్జావ్ (మంగోలియా) చేతిలో నర్సింగ్ ఓడిపోయాడు. మరోవైపు భారత్కే చెందిన అరుణ్ కుమార్ (70 కేజీలు) క్వార్టర్ఫైనల్లో 0-10తో జేమ్స్ మాల్కమ్ గ్రీన్ (అమెరికా) చేతిలో ఓడగా, అమిత్ కుమార్ (57 కేజీలు), సుమిత్ (125 కేజీ)లు ప్రిక్వార్టర్స్లోనే వెనుదిరిగారు. -
ఈ ఏడాది ఇక ‘పరుగు’ లేదు
ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఈ ఏడాది పరుగుకు పుల్స్టాప్ పెట్టేశాడు. ఇటీవల చైనాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన ఈ జమైకా స్టార్ వచ్చే ఏడాది ఆరంభం వరకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బోల్ట్ డైమండ్ లీగ్ ఫైనల్లో బరిలోకి దిగడం లేదు. ఒలింపిక్స్కు ముందు ఎలాంటి గాయాలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోల్ట్ ప్రకటించాడు. -
జపాన్ ఓపెన్పై సైనా గురి
రెండో రౌండ్లో సింధుతో పోటీ! టోక్యో: ప్రపంచ చాంపియన్షిప్లో రజతం సాధించి మంచి ఊపు మీదున్న నంబర్వన్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇక జపాన్ సూపర్ సిరీస్పై గురి పెట్టింది. నేటి (మంగళవారం) నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. రెండో సీడ్గా బరిలోకి దిగుతున్న సైనా బుధవారం తన తొలి మ్యాచ్లో బుసానన్ ఒంగ్బుమ్రంగ్పన్ (థాయ్లాండ్)ను ఎదుర్కొంటుంది. ఇందులో నెగ్గితే రెండో రౌండ్లో తెలుగు తేజం పీవీ సింధును ఢీకొనే అవకాశం ఉంది. గతేడాది ఇండియా గ్రాండ్ప్రి గోల్డ్ ఫైనల్లో తలపడిన తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యర్థులుగా ఆడలేదు. పురుషుల విభాగంలో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కె.శ్రీకాంత్ ఒక్కడికే సీడింగ్ దక్కింది. తను స్కాట్ ఇవా న్స్ (ఐర్లాండ్)తో తొలిరౌండ్ ఆడతాడు. పి.కశ్యప్, ప్రణయ్, సాయి ప్రణీత్ కూడా ఆడనున్నారు. మహిళల డబుల్స్లో భారత్ నుంచి గుత్తా జ్వాల-అశ్విని.. ప్రద్య్నా గాద్రె-సిక్కిరెడ్డి జంటలు తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాయి. -
ఓవర్ కాన్పిడెన్సే ముంచింది: వికాశ్ కృష్ణ
ఒవర్ కాన్సిడెన్స్ వల్లే ఫైనల్ మ్యాచ్ ఓడిపోయానని భారత్ బాక్సర్ వికాస్ కృష్ణ అన్నాడు. ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ యువ బాక్సర్ .. ఉబ్జెకిస్తాన్ బాక్సర్ చేతిలో ఓడిపోవడానికి కారణాలు వివరించాడు. తన కెరీర్ లో అది టఫ్ బౌట్ అని చెప్పిన ఈ యూత్ ఒలింపిక్స్ ఛాంపియన్.. మ్యాచ్ గెలిచే సత్తా తనలో ఉందని గుర్తుచేసుకున్నాడు. ప్రత్యర్థి సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేశానని చెప్పాడు. ఛాంపియన్ షిప్ మ్యాచ్ ఓటమి ఇప్పటికీ జీర్ణం కావడం లేదని వాపోయాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కు క్వాలిఫై కావడం కాస్త ఉపశమనమని అన్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ కు పూర్తి స్ధాయిలో సంసిద్దం కావాలని వివరించాడు. దీని కోసం అమెరికాలో కానీ, బ్రిటన్ లో కానీ శిక్షణ కు వెళ్లనున్నట్లు తెలిపాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో క్యూబా, రష్యా, కజకిస్తాన్ ల నుంచి గట్టి పోటీ ఉంటుందని చెప్పాడు. 2011 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన ఈ హర్యానా బాక్సర్ ఈ ఈవెంట్ లో నే రియో ఒలింపిక్స్ కి క్వాలిఫై అయ్యేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. -
భారత్కు నాలుగో స్థానం
బ్యాంకాక్ : ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఓ రజతం, మూడు కాంస్యాలతో మొత్తం 16 పాయింట్లు సాధించింది. ఓవరాల్గా 28 దేశాలు పాల్గొన్న ఈ టోర్నీలో కజకిస్తాన్ (42 పాయింట్లు) విజేతగా నిలిచింది. వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ చాంపియన్షిప్కు ఈ ఈవెంట్ ద్వారా భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించారు. -
జకార్తాలో జైహింద్
-
జకార్తాలో జైహింద్
భారత స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందే జకార్తాలో మువ్వన్నెలు రెపరెపలాడాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై సైనా నెహ్వాల్ మరోసారి చైనా గోడను బద్దలు కొట్టింది. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించినా ఇన్నాళ్లూ అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్షిప్ పతకాన్ని సైనా ఖరారు చేసుకుంది. ఏకంగా ఐదుసార్లు ఈ మెగా టోర్నీ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన ఈ హైదరాబాదీ... ఆరో ప్రయత్నంలో అద్భుతం చేసింది. యిహాన్ వాంగ్పై విజయంతో తొలిసారి ఈ మెగాటోర్నీలో సెమీస్కు చేరింది. ఇక ఓడినా కాంస్యం ఖాయం. గెలిస్తే మెరుగైన పతకం... ఏదైనా సైనా కెరీర్ పరిపూర్ణమైనట్లే. - ప్రపంచ చాంపియన్షిప్లో సైనాకు పతకం - క్వార్టర్స్లో యిహాన్పై అద్భుత విజయం - సింధు, జ్వాల-అశ్వినిలకు నిరాశ జకార్తా: గతంలో తనకెంతో కలిసొచ్చిన జకార్తా నగరంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి జూలు విదిల్చింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్షిప్ పతకాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సైనా నెహ్వాల్ 21-15, 19-21, 21-19తో ఆరో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)పై గెలిచి సెమీఫైనల్కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్షిప్ పతకాన్ని నెగ్గాలని ఆశించిన పీవీ సింధు... రెండోసారి ఈ ఘనత సాధించాలనుకున్న గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంటకు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సింధు 17-21, 21-19, 16-21తో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హున్ చేతిలో పరాజయం పాలవ్వగా... జ్వాల-అశ్విని జంట 23-25, 14-21తో ఫుకుమాన్-కురుమి యోనావో (జపాన్) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. ఆద్యంతం హోరాహోరీ గతంలో తొమ్మిదిసార్లు యిహాన్ వాంగ్ చేతిలో ఓడి, కేవలం రెండుసార్లు నెగ్గిన సైనాకు ఈసారీ తీవ్ర ప్రతిఘటనే ఎదురైంది. అయితే కీలకదశలో సైనా దూకుడుగా ఆడి నిర్ణాయక పాయింట్లను సంపాదించింది. సుదీర్ఘ ర్యాలీల్లో కొన్నిసార్లు సైనా, మరికొన్నిసార్లు యిహాన్ పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో గేమ్ చివరి దశలో సైనా కళ్లు చెదిరే స్మాష్ల ధాటికి యిహాన్ అనవసర తప్పిదాలు చేసింది. స్కోరు 20-19 వద్ద సైనా కొట్టిన స్మాష్కు రిటర్న్ ఇవ్వలేకపోయిన యిహాన్ షటిల్ను కోర్టు పక్కకు కొట్టింది. దాంతో సైనా విజయం ఖాయమైంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్కు చేరిన ఆనందంలో సైనా తన రాకెట్ను గాల్లోకి విసిరేసి సంబరం చేసుకుంది. - గతంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్కు చేరిన సైనా నాలుగుసార్లు చైనా క్రీడాకారిణుల (2009లో లిన్ వాంగ్; 2010లో షిజియాన్ వాంగ్; 2011లో జిన్ వాంగ్; 2014లో లీ జురుయ్) చేతిలో, మరోసారి కొరియా ప్లేయర్ (2013లో బే యోన్ జు) చేతిలో ఓడిపోయింది. - జకార్తాలోనే జరిగే ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో సైనా మూడుసార్లు (2009, 2010, 2012) టైటిల్ సాధించి, మరోసారి రన్నరప్గా (2011లో) నిలిచింది. శనివారం జరిగే సెమీఫైనల్లో అన్సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)తో సైనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 2-1తో ఫనెత్రిపై ఆధిక్యంలో ఉంది. మరో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) ఆడుతుంది. మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
చాంపియన్షిప్ లో తెలుగు తేజాల ముందంజ
జకర్తా : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో తెలుగు తేజాలు ముందంజ వేశారు. మూడో రౌండ్ లోకి పీవీ సింధూ, రెండో రెండో లోకి కిడాంబి శ్రీకాంత్ ప్రవేశించారు. లైని జార్స్ ఫెల్డ్పై 11-21, 21-17, 21-16 తేడాతో సింధూ విజయాన్ని సాధించింది. తొలి సెట్ కోల్పోయిన ఈ భారత స్టార్ షట్లర్ ఆ తర్వాత పుంజుకుంది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన సింధూ పదకొండో సీడ్ గా బరిలోకి దిగిన విషయం విదితమే. 50 నిమిషాల పాటు జరిగిన పోరులో లైని జార్స్ ఫెల్డ్పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మూడో రౌండ్లో ఒలింపిక్ చాంపియన్, మూడో సీడ్ క్రీడాకారిణి లీ ఝరయ్తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఆస్ట్రేలియాకి చెందిన మైఖెల్ ఫారిమన్ పై 21-10, 21-13 తేడాతో ఘన విజయాన్ని సాధించాడు. రెండు గేముల్లోనూ తన ఆధిక్యాన్ని ప్రదర్శించి కేవలం 24 నిమిషాల్లోనే ప్రత్యర్ధి ఆటకట్టించాడు. చైనీస్ తైపేయి ఆటగాడు హ్సు జెన్ హోతో తలపడనున్నాడు. గతేడాది జరిగిన డెన్మార్క్ ఓపెన్లో వీరిద్దరి మధ్య జరిగిన ఏకైన మ్యాచ్ లో గెలుపొందడం శ్రీకాంత్ కు కలిసొచ్చే అంశం. -
కశ్యప్ శుభారంభం
రెండో రౌండ్లోకి ప్రణయ్ సిక్కి రెడ్డికి మిశ్రమ ఫలితాలు {పపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జకార్తా: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ చాంపియన్షిప్లో శుభారంభం చేశారు. గతేడాది తొలి రౌండ్లోనే నిష్ర్కమించిన హైదరాబాద్ ప్లేయర్ కశ్యప్... తొలిసారి ఈ మెగా ఈవెంట్లో ఆడుతోన్న కేరళ ఆటగాడు ప్రణయ్ తమ ప్రత్యర్థులపై కేవలం 31 నిమిషాల్లో గెలుపొందడం విశేషం. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో పదో సీడ్ కశ్యప్ 21-17, 21-10తో ఎరిక్ మెజెస్ (నెదర్లాండ్స్)పై... 11వ సీడ్ ప్రణయ్ 21-12, 21-16తో అలెక్స్ యువాన్ (బ్రెజిల్)పై విజయం సాధించారు. ఎరిక్తో జరిగిన మ్యాచ్లో తొలి గేమ్లో కశ్యప్ ఒకదశలో 6-12తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే తేరుకున్న అతను వరుసగా ఆరు పాయింట్లు సాధించి స్కోరును 12-12తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరితో ఆధిక్యం దోబూచులాడినా చివరకు కశ్యప్ గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో మాత్రం మొదటి నుంచే కశ్యప్ ఆధిపత్యం చలాయించాడు. ఒకసారి వరుసగా ఆరు పాయింట్లు, మరోసారి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే దూకుడును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. రెండో రౌండ్లో ఎకిరింగ్ (ఉగాండ)తో ప్రణయ్; తియెన్ మిన్ (వియత్నాం)తో కశ్యప్ ఆడతారు. మరోవైపు హైదరాబాద్కే చెందిన డబుల్స్ ప్లేయర్ సిక్కి రెడ్డికి మిశ్రమ ఫలితాలు లభించాయి. మిక్స్డ్ డబుల్స్లో తొలి రౌండ్లోనే ఓడిన సిక్కి రెడ్డి, మహిళల డబుల్స్లో మాత్రం ముందంజ వేసింది. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ ద్వయం 13-21, 17-21తో లియావో మిన్ చున్-చెన్ సియో హువాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడీ 16-21, 21-15, 21-14తో ఇసాబెల్ హెర్ట్రిచ్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ మరో మ్యాచ్లో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (భారత్) జోడీ 18-21, 21-10, 22-24తో ద్రెమిన్-దిమోవా (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. దాంతో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ (భారత్) జంట 17-21, 21-11, 21-11తో ఖాఖిమోవ్-కుజ్నెత్సోవ్ (రష్యా) జోడీపై గెలిచింది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో లినీ జార్స్ఫెల్డ్ (డెన్మార్క్)తో పీవీ సింధు; పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఫారిమన్ (ఆస్ట్రేలియా)తో శ్రీకాంత్; పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కాయ్ యున్-లూ కాయ్ (చైనా)లతో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో లాన్సాక్-లెఫెల్ (ఫ్రాన్స్)లతో మోహితా-ధాన్యా తలపడతారు. -
పదేళ్లకే ప్రపంచ చాంపియన్షిప్లో...
బహ్రెయిన్ చిన్నారి అల్జైన్ తారిఖ్ సంచలనం కజాన్ (రష్యా): చాలామంది చిన్నారులు ఈత కొలనులోకి దిగేందుకు తటపటాయించే వయస్సులోనే ఆ చిన్నారి ఏకంగా ప్రపంచ చాంపియన్షిప్లో బరిలోకి దిగింది. మేటి స్విమ్మర్లతో పోటీపడింది. తన ఈవెంట్లో అందరికంటే ఆఖరున నిలిచినప్పటికీ అందరి మనస్సులను గెలుచుకుంది. ఆ చిన్నారి ఎవరోకాదు బహ్రెయిన్కు చెందిన 10 ఏళ్ల అల్జైన్ తారిఖ్. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో భాగంగా శుక్రవారం జరిగిన 50 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్ తొలి హీట్స్లో బరిలోకి దిగడంద్వారా అల్జైన్ తారిఖ్... ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పోటీపడిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. తన రేసును 41.13 సెకన్లలో ముగించిన అల్జైన్ 64 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో చివరి స్థానంలో నిలిచింది. ‘ఇంతమంది ప్రేక్షకుల సమక్షంలో గతంలో ఎప్పుడూ స్విమ్మింగ్ చేయలేదు. దాంతో పోటీకి సిద్ధమయ్యేందుకు వస్తున్న సమయంలో కాస్త గాబరా కలిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనడమే నా లక్ష్యం. నేనెంతో అభిమానించే మేటి స్విమ్మర్లతో ఇక్కడ ఫొటోలు దిగాను. వారి నుంచి మెళకువలను నేర్చుకుంటాను’ అని నాలుగేళ్ల ప్రాయంలో స్విమ్మింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన అల్జైన్ తెలిపింది. ప్రపంచ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు కనీస వయసు నిబంధనను ఇటీవలే అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (ఫినా) తొలగించడంతో అల్జైన్కు ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశం లభించింది. అండర్-12 విభాగంలో బహ్రెయిన్ నంబర్వన్గా ఉన్నందుకు అల్జైన్ను ప్రపంచ చాంపియన్షిప్కు ఆమె కోచ్ ఎంపిక చేశారు. అల్జైన్ తల్లి స్కాట్లాండ్ దేశీయురాలు కాగా... తండ్రి తారిఖ్ సలీమ్ బహ్రెయిన్కు చెందినవారు. ‘అల్జైన్ వారంలో ఐదు రోజులు శిక్షణ తీసుకుంటుంది. యూఏఈ, ఖతార్, జోర్డాన్లలో జరిగిన అంతర్జాతీయ మీట్స్లో ఆమె బరిలోకి దిగింది. అల్జైన్కు 14 ఏళ్లు వచ్చాక మెరుగైన శిక్షణ కోసం బ్రిటన్కు మకాం మార్చే ఆలోచనలో ఉన్నాం’ అని తారిఖ్ తెలిపారు. -
చైనా గోడను దాటితేనే...
- సైనా, సింధులకు పతకావకాశాలు - ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ‘డ్రా’ విడుదల జకార్తా (ఇండోనేసియా): అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ చాంపియన్షిప్ పతకాన్ని సాధించాలన్నా... వరుసగా మూడోసారి ఈ మెగా ఈవెంట్ లో పతకం నెగ్గాలన్నా... భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. వచ్చే నెల ఆగస్టు 10 నుంచి 16 వరకు జకార్తాలో జరిగే ఈ ప్రతిష్టాత్మక పోటీలకు సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. సైనా నెహ్వాల్ రెండో సీడ్గా, సింధు 11వ సీడ్గా ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సైనా రెండో రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్) లేదా కాటీ టాల్మోఫ్ (ఎస్తోనియా)లతో ఆడుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గితే మూడో రౌండ్లో ఈ హైదరాబాద్ అమ్మాయికి 14వ సీడ్ సయాకా తకహాషి (జపాన్) ఎదురయ్యే అవకాశముంది. ఈ రౌం డ్ను అధిగమిస్తే సైనాకు క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా ఆరో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) ఉండవచ్చు. క్వార్టర్స్లో గెలిస్తే సైనాకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. మరోవైపు సింధుకు కూడా తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో లిన్ జార్స్ఫెల్డ్ (డెన్మార్క్) లేదా చోలీ మాగీ (ఐర్లాండ్)తో ఆడనున్న సింధుకు మూడో రౌండ్లో మూడో సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ లీ జురుయ్ (చైనా) ఎదురయ్యే అవకాశముంది. గత రెండు ప్రపంచ చాంపియన్షిప్లలో కాంస్య పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు ఈసారీ పతకం నెగ్గాలంటే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ లీ జురుయ్పై నెగ్గితే సింధు క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా) లేదా తొమ్మిదో సీడ్ నోజోమి ఒకుహారా (జపాన్)తో తలపడుతుంది. క్వార్టర్స్ దశను దాటితే సింధుకు కాంస్యం ఖాయమవుతుంది. మొత్తానికి సైనా, సింధు పతకావకాశాలు చైనా క్రీడాకారిణులతో జరిగే మ్యాచ్ ఫలితాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి మూడో సీడ్ శ్రీకాంత్, పదో సీడ్ కశ్యప్, 11వ సీడ్ ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. తొలి రౌండ్లో ఫారిమన్ (ఆస్ట్రేలియా)తో శ్రీకాంత్; ఎరిక్ మాజిస్ (నెదర్లాండ్స్) తో కశ్యప్; అలెక్స్ (బ్రెజిల్)తో ప్రణయ్ ఆడతారు. పురుషుల డబుల్స్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్; మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప; సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె; ధాన్యా నాయర్-మొహితా సహదేవ్; మిక్స్డ్ డబుల్స్లో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్; సిక్కి రెడ్డి-కోనా తరుణ్ జంటలు బరిలో ఉన్నాయి. ఓవరాల్గా ప్రపంచ చాంపియన్షిప్ పోటీల చరిత్రలో భారత్ నుంచి తొలిసారి 18 మంది పాల్గొంటున్నారు. -
మైమరిపించిన జలకన్యలు
-
జ్వాలను ‘టాప్’లో చేర్చండి!
ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: టార్గెట్ ఒలింపిక్ పోడి యం (టాప్) పథకంలో గుత్తా జ్వాలకు చోటు ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదికి ప్రత్యేక లేఖ రాశారు. జ్వాలతో పాటు ఆమె డబుల్స్ భాగస్వామి అశ్విని పొన్నప్పలకు ‘టాప్’ ద్వారా ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరారు. ఇటీవల కెనడా ఓపెన్ టైటిల్ నెగ్గిన జ్వాల, శుక్రవారం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి తమకు అండగా నిలవాలని అభ్యర్థించింది. ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం మొదలు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు, ఇతర ఘనతల గురించి ప్రధానికి రాసిన లేఖలో సీఎం ప్రస్తావించారు. సంబంధిత అధికారులకు తగు సూచనలివ్వాలని విజ్ఞప్తి చేసిన కేసీఆర్, భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించే సామర్థ్యం జ్వాల-అశ్విని జోడీకి ఉన్నట్లు తాను విశ్వసిస్తున్నానన్నారు. అంతకు ముందు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావు కూడా జ్వాలను అభినందించారు. -
స్పాన్సర్ కోసం ఖడే ఎదురుచూపులు
ముంబై : వీర్ధావల్ ఖడే... భారత్లో ఫాస్టెస్ట్ స్విమ్మరే కాకుండా జాతీయ రికార్డులతో పాటు 2008 ఒలింపిక్స్లో దేశం తరఫున అత్యంత పిన్న వయస్సు (17)లో ప్రాతినిధ్యం వహించిన ఈతగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే 24 ఏళ్ల అనంతరం ఆసియా గేమ్స్ 50మీ. బటర్ఫ్లయ్ విభాగంలో దేశానికి ఓ పతకం (కాంస్యం) అందించగలిగాడు. ఇంత సాధించినా... రష్యాలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్స్కు వెళ్లేందుకు స్పాన్సర్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇది ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడంతో 24 ఏళ్ల ఖడేకు ఇందులో పాల్గొనడం అత్యంత ముఖ్యం. ‘స్పాన్సర్ను వెతుక్కోవడం చాలా కష్టం. దీంతో వరల్డ్ చాంపియన్షిప్స్లో పాల్గొనేందుకు నా సొంత డబ్బులు రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నేను తహశీల్దార్గా కూడా పనిచేస్తున్నాను కాబట్టి పూర్తిగా స్విమ్మింగ్కు సమయం కేటాయించలేకపోతున్నాను. రెండింటినీ సమన్వయం చేయడం చాలా కష్టం’ అని ఖడే అన్నాడు. మరోవైపు ఖడే సమస్యను క్రీడా శాఖతో ఈనెల 8న చర్చిస్తామని భారత స్విమ్మింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి కమలేష్ నానావతి చెప్పారు. -
రెజ్లర్ సుశీల్కు గాయం
ప్రపంచ చాంపియన్షిప్కు దూరం న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రపంచ చాంపియన్షిప్కు దూరమయ్యాడు. సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు లాస్వెగాస్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ఇది తొలి క్వాలిఫయింగ్ ఈవెంట్. ‘ప్రాక్టీస్ సమయంలో నా కుడి భుజానికి గాయమైంది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చా రు. ప్రస్తుతానికైతే ఈ గాయం ఎప్పుడు నయమవుతుందో చెప్పలేను. దీంతో ఈనెల 6,7న జరిగే సెలక్ష న్ ట్రయల్స్కు అందుబాటులో ఉండలేకపోతున్నా ను. ఈ కారణంగా ప్రపంచ చాంపియన్షిప్లోనూ ఆడనట్టే. ఈ టోర్నీ అనంతరం వచ్చే ఏడాది మరో ఆరు క్వాలిఫయింగ్ టోర్నీలు ఉంటాయి. వీటిలో పాల్గొని సత్తా చూపాలనుకుంటున్నాను’ అని లండన్ ఒలింపిక్స్లో రజతం సాధించిన సుశీల్ చెప్పాడు. -
బౌలింగ్ బలంతోనే సంచలనం
► టీమ్ ఇండియాకు అదే అత్యవసరం ► ‘క్వార్టర్స్’ తర్వాత అదే విజయ సోపానం ► ‘సాక్షి’తో మాజీ అంతర్జాతీయ అంపైర్ పార్థసారథి విశాఖ సిటీ డెస్క్: కనీస వసతులు లేని కాలంలో.. క్రికెట్ అంటే కేవలం పెద్ద నగరాలకు పరిమితమయ్యే తరుణంలో.. అంతర్జాతీయ మ్యాచ్లు అంటేనే అబ్బురపడే సమయంలో.. ఇరవై ఏడేళ్ల కిందట ఓ వన్డే మ్యాచ్ను విశాఖకు తీసుకు రావాలంటే.. అందుకు ఎంత శ్రమించాలి! ఎంత దీక్షతో పని చేయాలి! క్రికెట్ అంటే ప్రాణం పెట్టే కొందరు వ్యక్తులు అంత తాపత్రయపడ్డారు కాబట్టే అంతర్జాతీయ మ్యాచ్ల వేదికగా విశాఖ స్థానం స్థిరపడింది. అలా శ్రమపడ్డ వాళ్లలో కీలకంగా నిలుస్తారు జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) కార్యదర్శి కె.పార్థసారథి. అంతే కాదు.. ఓ నిర్వాహకుడిగా మాత్రమే కాక, ఓ అంతర్జాతీయ అంపైర్గా ఆయన విశాఖకు చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చారు. ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్లకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇప్పటికీ విశాఖ క్రికెట్కు దిశానిర్దేశం చేయడంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు. ఆటంటే అవధుల్లేని ఇష్టం ఉన్న ఆయన ఇప్పటి ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన వివిధ అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు. సాక్షి: పదకొండో ప్రపంచకప్ ప్రత్యేకతలేమిటి? పార్థసారథి: చాలా రోజులకు మళ్లీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. నలభై అయిదు రోజులపాటు క్రికెట్ అభిమానులకు ఇక పండగే పండగ. అక్కడి బౌన్సీ పిచ్లు దృష్టిలో పెట్టుకుంటే పోటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బౌలింగ్ బలం ఉన్న జట్లకు ఇది అపూర్వ అవకాశం. ఇక భారత్ విషయానికి వస్తే దాదాపు పూర్తిగా కొత్త కుర్రాళ్లతో బరిలోకి దిగుతున్న జట్టు ఇది. యువరాజ్ సింగ్, గంభీర్ వంటి సత్తా ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టి రాయుడు, బిన్నీ వంటి ఫ్రెషర్స్ మీద ఆశలు పెట్టుకుని ధోనీ సేన ప్రపంచకప్ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సాక్షి: ఎవరెవరి అవకాశాలు ఎలా ఉంటాయి? పార్థసారథి: ఇక స్వదేశం కాబట్టి సహజంగానే ఆస్ట్రేలియాకు అవకాశాలు బాగుంటాయి. కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే భారత్ కచ్చితంగా ముందంజ వేస్తుందనిపిస్తోంది. నా లెక్క ప్రకారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ సెమీస్కు చేరవచ్చు. ఈ జట్లలో ఆ రోజు ఎవరికి కలిసివస్తే ఆ జట్టు క్లిక్ అయిందన్నమాటే. బౌలింగ్లో రాణిస్తేనే భారత్ ముందంజ వేస్తుందన్నది స్పష్టం. సాక్షి: ఈసారి వాతావరణం ఎలా ఉందంటారు? పార్థసారథి: నిజం చెప్పాలంటే 2011 నాటి హైప్ ఈసారి లేదని చెప్పాలి. అప్పుడు భారత్లో జరగడం వల్ల ఆ ఉత్సాహం ఉందని కాదు.. ప్రపంచమంతా ఆ టోర్నీని ఎంతో ఆసక్తిగా గమనించింది. ఈసారి అంత ఉత్సాహం కనిపించడం లేదు. సాక్షి: టీ20 ప్రభావం కారణమంటారా? పార్థసారథి: కొంతవరకు కావచ్చు. ఇప్పటి మార్పులతో క్రికెట్లో మునుపటి థ్రిల్ తగ్గుతోందన్నది నా అభిప్రాయం. సాక్షి: గత ప్రపంచకప్ టోర్నీలతో పోలిస్తే ఈసారి ఆట తీరెలా ఉందంటారు? పార్థసారథి: ఇప్పటి క్రికెట్లో స్థాయి తగ్గిందన్నదే నా వ్యాఖ్య. ఒకప్పుడు ఆటలో వైవిధ్యం ఉండేది. ఇంత రక్షణ ఉపకరణాలు (ప్రొటెక్టివ్ గేర్) లేకుండా భయపెట్టే ఫాస్ట్బౌలింగ్ను అప్పటి ఆటగాళ్లు ఎదుర్కొనే వారంటే వాళ్ల సత్తా అర్ధమవుతుంది. ఇప్పుడా పరిస్థితి లేదు కదా. టెక్నిక్ విషయంలోనూ అప్పటి ఆటగాళ్లే అగ్రగాములని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రారంభం నుంచి భారీ షాట్లే ప్రధానంగా ఆట సాగుతోంది. బౌలింగ్లో అంత డెప్త్ కనిపించడం లేదు. స్పిన్ పరిస్థితి చూస్తేనే అది అర్ధమవుతుంది. సాక్షి: ఆట మీద దీని ప్రభావం ఉంటుందా? పార్థసారథి: టెస్ట్లలో సైతం ఆ పరిస్థితి కనిపిస్తోంది కదా. అయిదు రోజుల టెస్ట్లు నాలుగు రోజుల్లో ముగిసిపోతున్నాయంటే క్వాలిటీ ఎలా ఉందో చెప్పవచ్చు. ఫీల్డింగ్ మెరుగుపడ్డ విషయం వాస్తవమే కానీ, ఇప్పటి వాళ్ల కన్నా సోల్కర్, వెంకట్రాఘవన్ వంటి వాళ్లు ఎక్కువ సాహసంతో ఫీల్డింగ్ చేసే వాళ్లనుకుంటాను. సాక్షి: మీరు స్వదేశంలో, విదేశాల్లో అంపైరింగ్ చేశారు. 1996లో వరల్డ్కప్ టోర్నీలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు. అప్పటికి ఇప్పటికి అంపైరింగ్ స్థాయి ఎలా ఉందంటారు? పార్థసారథి: అంపైరింగ్ స్థాయి బాగా మెరుగుపడింది. ఇది సాంకేతిక అభివృద్ధి వల్ల కలిగిన మార్పు కాదు. అంపైర్లు తమ స్థాయిని మెరుగు పర్చుకునేలా బీసీసీఐ చేపట్టిన చర్యల కారణంగా ఈ మార్పు కనిపిస్తోంది. సాంకేతికంగా మార్పులు మంచివే కావీ ఎప్పుడైనా అంపైర్ తనంత తానుగా తీసుకునే నిర్ణయాలను గౌరవించడమన్నదే మంచిదని నా అభిప్రాయం. మైదానం మీద ఉన్న అంపైర్ నిర్ణయానికి ప్రాధాన్యం ఇవ్వడమే మంచిదన్నది నా ఉద్దేశం. కెమెరా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు కూడా పూర్తిగా కచ్చితమని చెప్పడం కష్టం కదా.. సాక్షి: వివాదాస్పదమైన డీఆర్ఎస్ (డెసిషన్ రిఫరల్ సిస్టమ్) గురించి? పార్థసారథి: అంపైర్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉంటే మంచిది. ఇంకా దాని మీద అపీల్ ఏ మేరకు సబబో? బీసీసీఐ ఈ విషయంలో మొగ్గు చూపడం లేదు కానీ ఐసీసీ నిర్ణయం కాబట్టి తలవొగ్గక తప్పేట్టు లేదు. ఆటలో మార్పులు అనివార్యం కదా.. తప్పదు మరి. -
ఆనంద్, కార్ల్సన్ నాలుగో గేమ్ డ్రా
సోచి (రష్యా): ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో భాగంగా భారత్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ మధ్య బుధవారం జరిగిన నాలుగో గేమ్ డ్రాగా ముగిసింది. నల్లపావులతో ఆడగా, కార్ల్సన్ తెల్లపావులతో పోటీ పడ్డాడు. నాలుగో గేమ్ ఫలితం తేలకపోవడంతో ఇరువురు క్రీడాకారులు రెండేసి పాయింట్లతో సముజ్జీలుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన మొదటి గేమ్ డ్రాగా ముగిసింది. రెండో గేమ్ లో కార్ల్సన్, మూడో గేమ్ లో ఆనంద్ విజయం సాధించారు. -
దెబ్బకు దెబ్బ
సోచి (రష్యా): శక్తివంతమైన ప్రారంభం... స్పష్టమైన అం చనా... మంచి సాంకేతికత... శ్రేష్టమైన సమయపాలన.. వెర సి ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్కు తొలి విజయం. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో మంగళవారం జరిగిన ప్రపంచ చాంపియన్షిప్ మూడో గేమ్లో ఆనంద్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. తెల్లపావులతో ఆడుతూ 34 ఎత్తుల్లో కార్ల్సన్ను ఓడించాడు. నాలుగేళ్ల తర్వాత ఆనంద్ క్లాసిక్ విభాగంలో కార్ల్సన్పై తొలిసారి గెలిచాడు. 2010 లండన్ క్లాసిక్ టోర్నీలో భాగంగా కార్ల్సన్పై చివరిసారి 77 ఎత్తుల్లో గెలిచిన ఆనంద్ ఆ తర్వాత ఈ నార్వే ప్లేయర్పై ఈ విభాగంలో నెగ్గలేకపోయాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్, కార్ల్సన్ 1.5-1.5 పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. నాలుగో గేమ్ బుధవారం జరుగుతుంది. తొలి రెండు గేముల్లో మంచి ఓపెనింగ్ చేసినా స్వయం తప్పిదాలతో తడబడిన ఆనంద్ ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం చేయలేదు. ఒకదశలో ఆనంద్ వేసిన ఎత్తులను కార్ల్సన్ అర్థం చేసుకోలేకపోయాడు. -
పైచేయి ఎవరిదో!
సోచి (రష్యా): సొంతగడ్డపై ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని విశ్వనాథన్ ఆనంద్... మళ్లీ విజయాన్ని సొంతం చేసుకొని ప్రపంచ చదరంగంపై పట్టు సాధించాలని మాగ్నస్ కార్ల్సన్.... ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య శనివారం ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్కు తొలి గేమ్తో తెరలేవనుంది. గత ఏడాది చెన్నైలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో ఆనంద్కు కనీసం ఒక్క గేమ్ కూడా నెగ్గే అవకాశం ఇవ్వకుండా కార్ల్సన్ నెగ్గినతీరు అందర్నీ అబ్బురపరిచింది. అదే సమయంలో ఆనంద్ ఓడిన విధానం ఆందోళన కలిగించింది. ఏడాది తిరిగేలోపు మళ్లీ వీరిద్దరూ ప్రపంచ టైటిల్ కోసం సిద్ధమయ్యారు. ఈసారీ కార్ల్సన్ను ఫేవరెట్గా పరిగణిస్తున్నప్పటికీ... ఆనంద్ను మాత్రం తక్కువ అంచనా వేయడంలేదు. గత ఏడాది మాదిరిగా ఏకపక్షంగా కాకుండా... ఈసారి పోరు నువ్వా నేనా అన్నట్లు సాగే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు. {పపంచ చాంపియన్ అయ్యాక... క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి మళ్లీ ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్కు అర్హత పొందిన రెండో క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. గతంలో అనతోలి కార్పోవ్ (రష్యా-1987, 1990లో) రెండుసార్లు ఈ విధంగా అర్హత సాధించాడు. విక్టర్ కార్చునోయ్ తర్వాత పెద్ద వయస్సులో క్యాండిడేట్స్ టోర్నీ నెగ్గిన రెండో ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. కార్చునోయ్ 46 ఏళ్లకు (1977లో), ఆనంద్ 44 ఏళ్లకు ఈ టోర్నీని గెలిచారు. ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) ప్రపంచ చాంపియన్గా నిలిచిన తొలి చెస్ ప్లేయర్గా మాగ్నస్ కార్ల్సన్ గుర్తింపు పొందాడు. 24 ఏళ్ల తర్వాత అదే ప్రత్యర్థుల మధ్య వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్షిప్ మ్యాచ్ జరగనుంది. గతంలో కాస్పరోవ్ (రష్యా), అనతోలి కార్పోవ్ (రష్యా) ఈ విధంగా ఐదుసార్లు (1984, 1985, 1986, 1987, 1990) తలపడ్డారు. ముఖాముఖి అన్ని టైమ్ ఫార్మాట్ (క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్) లలో కలిపి ఆనంద్, కార్ల్సన్ ముఖాముఖిగా 79 సార్లు తలపడ్డారు. క్లాసికల్ ఫార్మాట్లో 38 సార్లు పోటీపడగా.. ఆనంద్ ఆరుసార్లు, కార్ల్సన్ ఏడుసార్లు గెలిచారు. మిగతా గేమ్లు ‘డ్రా’ అయ్యాయి. వేదిక 2014 వింటర్ ఒలింపిక్స్కు వేదికగా నిలిచిన రష్యాలోని సోచి పట్టణంలోని ఒలింపిక్ మీడియా సెంటర్. సమయం భారత కాలమానం ప్రకారం అన్ని రౌండ్ల గేమ్లు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మొదలవుతాయి. గేమ్ జరిగేదిలా... తొలి 40 ఎత్తులకు 120 నిమిషాలు. ఆ తర్వాత 20 ఎత్తులకు 60 నిమిషాలు. ఆ తర్వాత మరో 15 నిమిషాలు. 61వ ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు అదనంగా 30 సెకన్లు కలుస్తాయి. {పతి గేమ్ ప్రారంభ సమయానికి కనీసం 10 నిమిషాల ముందే ఇద్దరు ఆటగాళ్లు భద్రత తనిఖీల కోసం వేదిక వద్దకు చేరుకోవాలి. ఇద్దరు ఆటగాళ్లు 30వ ఎత్తులోపు ‘డ్రా’ కోసం ప్రతిపాదన చేయకూడదు. తప్పనిసరి అయితే చీఫ్ ఆర్బిటర్ అంగీకారంతోనే ఇలా జరగాలి. గేమ్ సందర్భంగా ఆటగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చీఫ్ ఆర్బిటర్ కనిష్టంగా ఐదు వేల యూరోలు జరిమానా విధిస్తారు. -
ప్రపంచ ఛాంపియన్గా అద్వానీ
బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. సింగపూర్ క్రీడాకారుడు గిల్క్రిస్ట్పై 6-2 తేడాతో గెలిచాడు. తాను ఏడో స్వర్గాన్ని అధిగమించానని ఈ సందర్భంగా అద్వానీ చెప్పాడు. తన ఆశయం సగమే పూర్తయిందని, మరో ఫార్మాట్లో ఇంకా విజయం సాధించాలని అన్నాడు. మంచి వార్త కోసం అందరూ వేచి చూడాలని చెప్పాడు. అప్పుడే ఎవరూ అభినందనలు తెలపొద్దని కూడా అన్నాడు. ఇప్పటివరకు పంకజ్ అద్వానీ 150కి పైగా అంతర్జాతీయ ట్రోఫీలు వశమయ్యాయి. -
టాప్-10లో సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... తన ర్యాంక్ను కూడా మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ఆమె రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్లో నిలిచింది. సైనా నెహ్వాల్ మాత్రం ఏడో ర్యాంక్లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో కె.శ్రీకాంత్ 22వ ర్యాంక్కు ఎగబాకగా, పారుపల్లి కశ్యప్ ఒక స్థానం కోల్పోయి 28వ ర్యాంక్తో సరిపెట్టుకున్నాడు. మహిళల డబుల్స్లో జ్వాల-అశ్విని 21వ ర్యాంక్లో కొనసా గుతున్నారు. -
అనుభవంతో అన్నీ నేర్చుకుంటా
ప్రతిసారీ 100 శాతం ప్రదర్శన ఇవ్వలేం బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా తన ఆటలో ఎంతో మార్పు వచ్చిందని, తప్పులు సరిదిద్దుకొని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. డెన్మార్క్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన సింధు, మంగళవారం స్వస్థలం చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడింది. ‘ఏడాది కాలంలో ఎంతో మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించాను. నా ఆట కూడా ఎంతో మెరుగైంది. అయితే ప్రతిసారీ 100 శాతం ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు. అనుభవం పెరిగిన కొద్దీ తప్పులనుంచి పాఠాలు నేర్చుకుంటున్నాను. నా మొదటి కాంస్యంతో పోలిస్తే ఇదే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది’ అని సింధు చెప్పింది. ప్రపంచ చాంపియన్షిప్లో వరుసగా రెండో ఏడాది పతకం సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ‘చాలా ఆనందంగా ఉంది. సెమీస్కు ముందు మ్యాచ్లలో అలసిపోవడం వల్ల ఓడానని సాకు చెప్పను. కరోలినా చాలా బాగా ఆడింది. ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే ప్రస్తుత నా లక్ష్యం’ అని సింధు వెల్లడించింది. సంతృప్తిగా ఉంది టోర్నీలో భారత ఆటగాళ్ల ప్రదర్శన ఓవరాల్గా తనకు సంతృప్తినిచ్చిందని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ‘సింధు పతకం నిలబెట్టుకోవడం సాధారణ విషయం కాదు. సైనాకు అదృష్టం కలిసి రాలేదు. కశ్యప్, శ్రీకాంత్ల నుంచి మరింత మంచి ఫలితాలను ఆశించినా సాధ్యం కాలేదు’ అని గోపి చెప్పారు. మరో వైపు పెద్ద టోర్నీలలో చైనా క్రీడాకారిణులను పరిమిత సంఖ్యలో అనుమతించాలన్న సైనా వ్యాఖ్యలపై స్పందిస్తూ...ఆ అవసరం లేదని, టాప్ టోర్నీల్లో టాప్ ప్లేయర్లు ఆడటం సరైందేనని అభిప్రాయ పడ్డారు. -
వరల్డ్ బ్యాడ్మింటన్ : సింధూకు కాంస్య పతకం
-
కాంస్య ‘సింధూ’రం
►సెమీస్లో ఓడిన హైదరాబాద్ అమ్మాయి ►ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో వరుసగా రెండో కాంస్యం ► ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్గా గుర్తింపు కోపెన్హాగెన్: గతేడాది ప్రపంచ చాంపియన్షిప్లో తాను సాధించిన కాంస్యం గాలివాటం కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నిరూపించింది. వరుసగా రెండో ఏడాది ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ హైదరాబాద్ అమ్మాయి కాంస్యం సాధించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 17-21, 15-21తో ప్రపంచ 10వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయినా... కాంస్య పతకం దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్లో అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు కనీసం 15 పాయింట్లను నెట్ వద్ద సమర్పించుకుంది. ఆమె కొట్టిన చాలా షాట్లు నెట్కు తగిలాయి. కొన్నిసార్లు కరోలినా చక్కటి ప్లేస్మెంట్స్తో పాయింట్లు రాబట్టింది. తొలి గేమ్లో ఒకదశలో 2-6తో వెనుకబడిన సింధు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 8-6తో ముందంజ వేసింది. కానీ కీలకదశలో తప్పిదాలు చేసి తేరుకోలేకపోయింది. 10-15తో వెనుకబడిన సింధు స్కోరును సమం చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయింది. తుదకు 21 నిమిషాల్లో తొలి గేమ్ను కోల్పోయింది. గత రెండు మ్యాచ్ల్లో తొలి గేమ్ను కోల్పోయి పుంజుకున్న సింధు ఈసారి మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ఒకదశలో సింధు 11-9తో రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత తడబాటుకు లోనైంది. సింధు ఒత్తిడిలో ఉందనే విషయాన్ని గ్రహించిన కరోలినా సమయస్ఫూర్తితో ఆడుతూ వరుసగా నాలుగు పాయింట్లు సంపాదించి 16-12తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు సంచలనం నమోదు చేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో సింధు 19-21, 21-19, 21-15తో అద్భుత విజయం సాధించింది. కెరీర్లో షిజియాన్పై సింధుకిది నాలుగో విజయం కావడం విశేషం. గత ప్రపంచ చాంపియన్షిప్లోనూ సింధు క్వార్టర్ ఫైనల్లో షిజియాన్ను ఓడించింది. సైనాకు ఐదోసారి నిరాశ మరో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు నిరాశ ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సైనా 15-21, 15-21తో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. సైనా తాను ఆడిన ఐదు ప్రపంచ చాంపియన్షిప్లలోనూ క్వార్టర్ ఫైనల్ దశలోనే నిష్ర్కమించడం గమనార్హం. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్కు లభించిన నాలుగు పతకాలూ కాంస్యాలే కావడం గమనార్హం. 1983లో కోపెన్హాగెన్లోనే జరిగిన పోటీల్లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కు తొలి కాంస్యాన్ని అందించాడు. 2011లో లండన్లో జరిగిన పోటీల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప మహిళల డబుల్స్ విభాగంలో భారత్ ఖాతాలో రెండో కాంస్యాన్ని జతచేశారు. 2013లో చైనాలోని గ్వాంగ్జూలో జరిగిన పోటీల్లో... ఈ ఏడాది కోపెన్హాగెన్లో జరిగిన పోటీల్లో పి.వి.సింధు మహిళల సింగిల్స్లో భారత్కు రెండు కాంస్యాలు అందించింది. -
సైనా, శ్రీకాంత్ ముందంజ
కోపెన్హాగెన్: ప్రపంచ చాంపియన్షిప్లో తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో భారత స్టార్ షట్లర్ సైనా 21-11, 21-9తో రష్యా షట్లర్ నటాలియా పెర్మినోవాపై అలవోకగా విజయం సాధించింది. సైనా 31నిమిషాల్లోనే వరుస గేమ్ల్లో మ్యాచ్ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 21-11, 11-21, 21-12తో ఇజ్టక్ ఉత్రోసా (స్లొవేనియా)పై పోరాడి గెలిచాడు. 47 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో శ్రీకాంత్ మూడు గేమ్ల్లో నెగ్గాడు. మరో భారత షట్లర్ అజయ్ జయరామ్ కూడా రెండో రౌండ్లో ప్రవేశించాడు. కాగా మిక్స్డ్ డబుల్స్లో భారత జోడీ అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్ ఓటమి చవిచూశారు. -
నాకు గుర్తింపు దక్కడం లేదు!
‘డబుల్స్’ అంటే అలుసెందుకు? గుత్తా జ్వాల వ్యాఖ్య న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నీల్లో పలు పతకాలు సాధించినా... దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదని అగ్రశ్రేణి డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుతా జ్వాల వాపోయింది. ప్రస్తుతం వివాదాలు మరచి ఉబెర్ కప్పై దృష్టి సారించానని, రియో ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతానని చెప్పింది. 30 ఏళ్ల ఈ హైదరాబాదీ ఇటీవల జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో కాంస్య పతకంతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచినప్పటికీ... కేవలం ‘డబుల్స్’ ముద్రతో అంతగా లైమ్లైట్లోకి రాలేకపోయింది. దీనిపై బాహటంగానే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై విమర్శలు గుప్పించిన జ్వాల డబుల్స్ అంటే చిన్న చూపెందుకని మరోసారి ప్రశ్నించింది. దశాబ్దానికిపైగా నిలకడైన కెరీర్ను కొనసాగిస్తున్న జ్వాల దీనిపై మాట్లాడుతూ ‘నేను సాధించిన పతకాలకు నజరానాలు అడగడం లేదు. నగదు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. నేనూ మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ననే గుర్తింపు కావాలి. ‘సింగిల్స్’లాగే నా విజయాలను గౌరవిస్తే చాలు’ అని చెప్పింది. ఒలింపిక్స్ (లండన్)లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తాను మేటి అంతర్జాతీయ చాంపియన్షిప్లలో పతకాలు సాధించానంది. అయినా... ఇంకా తానేం నిరూపించుకోవాలో అర్థం కావడం లేదని పేర్కొంది. ఇలాంటి ఘనవిజయాలున్న తన స్థానాన్ని భర్తీచేసే క్రీడాకారిణి ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా బాయ్కు చురకలంటించింది. ‘ఎవరి మద్దతు లేకుండానే అనుకున్నవి సాధించాను. నా పతకాలను అసోసియేషన్ (బాయ్) గుర్తించకపోగా... లేని సాకుతో ఏకంగా వేటుకూ యత్నించారు. అయినా అన్నీ భరించాను. న్యాయపోరాటం చేశాను. ఏబీసీలో మళ్లీ నన్ను నేను నిరూపించుకున్నాను’ అని తెలిపింది. తన భాగస్వామి అశ్విని పొనప్ప కూడా రాణిస్తున్నా... ‘డబుల్స్’ నీడనే మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఆరునెలలుగా నరకం అనుభవించానని తిరిగి ఏబీసీ పతకంతో విమర్శలకు ప్రదర్శనతోనే బదులిచ్చానని జ్వాల పేర్కొంది. మానసిక స్థైర్యంతోనే ఇది సాధ్యమైందని, తాజా పతకంతో తమ జోడి స్థైర్యం పెరిగిందని, ఇదే జోరుతో ముందడుగు వేస్తామని చెప్పింది. -
కోర్టులో ‘బాక్సింగ్’
దిల్బాగ్ ఆరోపణలపై న్యాయస్థానానికి అఖిల్ న్యూఢిల్లీ: భారత బాక్సర్ దిల్బాగ్సింగ్పై మరో బాక్సర్, కామన్వెల్త్ క్రీడల మాజీ విజేత అఖిల్కుమార్ పరువునష్టం దావా వేశాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్షిప్ కోసం జరిగిన సెలక్షన్ ట్రయల్స్ విషయంలో దిల్బాగ్ తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను అఖిల్ ఈ చర్యకు దిగాడు. గత ఆగస్టులో జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో... అఖిల్ శిష్యుడైన మన్దీప్ జాంగ్రా చేతిలో దిల్బాగ్ ఓడిపోయాడు. అయితే అఖిల్ తన శిష్యుడిని గెలిపించేందుకు అక్రమాలకు పాల్పడ్డాడని, సెలక్షన్ కమిటీని ప్రభావితం చేశాడని మాజీ జాతీయ చాంపియన్ అయిన దిల్బాగ్ ఆరోపించాడు. జాతీయ కోచ్ జి.ఎస్.సంధూ పైనా ఆరోపణలు చేశాడు. దీంతో దిల్బాగ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిల్.. అందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశాడు. జాతీయ బాక్సింగ్ సమాఖ్య కూడా షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయినా దిల్బాగ్ వెనక్కి తగ్గకపోవడంతో చండీగఢ్లోని జిల్లా కోర్టులో అఖిల్ పిటిషన్ దాఖలు చేశాడు. -
ప్రపంచ చాంపియన్షిప్పైనే దృష్టి!
కొత్త వ్యూహాలకు ఆనంద్ పదును చెన్నై: క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో టైటిల్ సాధించిన విశ్వనాథన్ ఆనంద్ తదుపరి లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాడు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లు... ప్రపంచ చాంపియన్షిప్లో తనపై గెలిచిన మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)ను ఓడించే అన్వేషణలో పడ్డాడు. ఈ ఏడాది జరిగే చాంపియన్షిప్లో తిరిగి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఆనంద్ ఉన్నాడు. ‘నా ఆలోచననలకు పదునుపెట్టే పని ఇప్పటికే మొదలైంది. ఏం చేయాలి... ఎలా ముందడుగు వేయాలనే ప్రాథమిక అంశాలపై ఇది వరకే కసరత్తు చేశాను. రాబోయే నెలల్లో వీటిపైనే నా దృష్టి ఉంటుంది. ఈ నెల కాస్త విరామం ఇచ్చినా, ఆలోచనలకు మాత్రం విశ్రాంతి లేదు’ అని అన్నాడు. ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత సూపర్ గ్రాండ్మాస్టర్ ఆనంద్ తిరిగి కిరీటం చేజిక్కించుకునే వ్యూహాలు పన్నుతున్నాడు. ‘నన్ను కంగుతినిపించిన కార్ల్సెన్తో పోరు ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలో కూడా తెలుసు... కానీ అవన్నీ ఇప్పుడే బహిర్గతం చేయలేను. అనుకున్నది సాధించేందుకు ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తాను’ అని 44 ఏళ్ల ఆనంద్ చెప్పాడు. టోర్నీలో కావాల్సిందల్లా ఉత్సాహపరిచే విజయాలేనన్నాడు. అది ఆరంభ రౌండ్లలో లభిస్తే తిరుగు ఉండదని అతను అభిప్రాయపడ్డాడు. ఇప్పటి తన జోరు ప్రత్యర్థుల్ని ఒత్తిడిలోకి నెడుతుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ... ‘ఇప్పుడే ఎలా చెబుతాం. ప్రపంచ చాంపియన్షిప్కు ముందు జరిగే టోర్నీల్లో ముందు గాడిన పడాలి. ప్రత్యర్థుల్ని ఓడించాలి. అప్పుడే ఒత్తిడిని పెంచగలం’ అని ఆనంద్ అన్నాడు. సందీపన్ చందాతో తిరిగి జతకడతానని చెప్పాడు. నార్వేలో అతనితో పనిచేశానని... చక్కని వ్యూహాలను రూపొందించడంలో చందా సిద్ధహస్తుడని చెప్పాడు. -
పంకజ్ అద్వానీ ఓటమి
బీజింగ్: ప్రపంచ చాంపియన్షిప్కు ముందు సన్నాహక టోర్నీ అయిన చైనా ఓపెన్ స్నూకర్లో భారత క్రీడాకారులు పంకజ్ అద్వానీ, ఆదిత్య మెహతా నిరాశపరిచారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో అద్వానీ 1-5 (8-81, 74-0, 25-83, 8-73, 10-72-10, 42-62)తో రికీ వాల్డెన్ (ఇంగ్లండ్) చేతిలో... ఆదిత్య మెహతా 4-5 (52-60, 57-52, 1-69, 79-49, 0-81, 62-48, 22-73, 62-40, 36-71)తో మార్క్ కింగ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయారు. ఇక ప్రపంచ చాంపియన్షిప్ ఇంగ్లండ్లోని షెఫ్ఫీల్డ్లో ఈ నెల 16న మొదలు కానుంది. -
ఆనంద్కు నిరాశ
జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్షిప్లో ఓటమి తర్వాత తాను పాల్గొన్న రెండో టోర్నమెంట్లోనూ భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్కు నిరాశ ఎదురైంది. లండన్ క్లాసిక్ చెస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్... మంగళవారం ముగిసిన జ్యూరిచ్ క్లాసిక్ టోర్నీలో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆరుగురు అగ్రశ్రేణి గ్రాండ్మాస్టర్ల మధ్య క్లాసిక్, ర్యాపిడ్ విభాగాల్లో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ ఐదు పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే) 10 పాయింట్ల తో విజేతగా నిలువగా... ఫాబియానో (ఇటలీ), అరోనియన్ (అర్మేనియా) తొమ్మిది పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానాన్ని సంపాదించారు. ర్యాపిడ్ విభాగంలో ఆనంద్ ఐదు గేమ్లు ఆడగా... అరోనియన్, నకముర, ఫాబియానో చేతిలో ఓడిపోయి... కార్ల్సన్, గెల్ఫాండ్లతో ‘డ్రా’ చేసుకున్నాడు. -
ఆనంద్ శుభారంభం
లండన్: ప్రపంచ చాంపియన్షిప్లో పరాజయం తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. బుధవారం మొదలైన లండన్ క్లాసిక్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో ఆనంద్ తొలి విజయం సాధించాడు. గ్రూప్ ‘ఎ’లో ల్యూక్ మెక్షేన్ (ఇంగ్లండ్)తో జరిగిన తొలి గేమ్లో ఆనంద్ నల్లపావులతో ఆడుతూ 46 ఎత్తుల్లో గెలిచాడు. మొత్తం 16 మంది పాల్గొంటున్న ఈ టోర్నీలో ఒక్కో గ్రూప్లో నలుగురికి చోటు కల్పించారు. లీగ్ దశ గేమ్లు ముగిశాక ఒక్కో గ్రూప్ నుంచి ఇద్దరు చొప్పున క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధిస్తారు. గ్రూప్ ‘ఎ’లో ఆనంద్తోపాటు ల్యూక్ మెక్షేన్, మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), ఆండ్రియా ఇస్ట్రాటెస్కూ (ఫ్రాన్స్) ఉన్నారు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. ఆనంద్ బుధవారం 44వ వడిలోకి అడుగుపెట్టాడు.