Indian Stock Market
-
స్టాక్ మార్కెట్లో ఎక్కువమంది అలాంటి ఇన్వెస్టర్లే..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో అత్యధిక శాతం మంది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లేనని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్పష్టం చేశారు. మార్కెట్లో లావాదేవీలు నిర్వహించే 11 కోట్లమందిలో కేవలం 2 శాతమే డెరివేటివ్స్లో పాలు పంచుకుంటుంటారని వివరించారు.మార్కెట్ పార్టిసిపెంట్లలో 98 శాతంమంది దీర్ఘకాలానికి మదుపు చేసేవారేనని పేర్కొన్నారు. ఇది దేశీయంగా క్రమశిక్షణ కలిగిన పెట్టుబడుల పద్ధతిని సూచిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి మెజారిటీ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడులకే కట్టుబడుతుంటారని తెలియజేశారు. తద్వారా ఇటీవల సింగపూర్లో జరిగిన బృంద చర్చలో భారత స్టాక్ మార్కెట్లు ప్రధానంగా ఊహాజనిత(స్పెక్యులేటివ్) ట్రేడింగ్పైనే ఆధారపడి కదులుతుంటాయన్న అభిప్రాయాలకు చెక్ పెట్టారు.పెట్టుబడులులేని పెట్టుబడిదారీవిధానం ప్రాధాన్యత సంతరించుకుంటున్నట్లు చౌహాన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఇలా స్పందించారు. ‘సంప్రదాయబద్ధంగా చూస్తే భారీ పెట్టుబడుల ద్వారా మాత్రమే సంపద సృష్టి జరుగుతుందన్నది వాస్తవమే అయినా ఇటీవల ఆధునిక సాంకేతికతలు రూల్స్ను తిరగరాస్తున్నాయి. ఏఐ, బ్లాక్చెయిన్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ తదితరాలు కనీస పెట్టుబడితోనే వ్యాపార విస్తరణకు దారి చూపుతున్నాయి. వెరసి ఎకనామిక్ మోడల్ సంప్రదాయ పెట్టుబడి ఆవశ్యకత విధానాల నుంచి దూరం జరుగుతోందంటూ’ వివరించారు. -
Trump Tariff War: భారత్ స్టాక్ మార్కెట్ ఉక్కిరిబిక్కిరి
-
‘ఫెడ్’ పంజా!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా బాండ్లపై రాబడులు ఏడు నెలల గరిష్టానికి, డాలర్ ఇండెక్స్ రెండున్నర ఏళ్ల గరిష్టానికి చేరుకోవడమూ ప్రతికూల ప్రభావం చూపాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు కొనసాగాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 964 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 79,218 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 23,952 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు.అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు గురువారం ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,153 పాయింట్లు పతనమై 79,029 వద్ద, నిఫ్టీ 322 పాయింట్లు పతనమై 23,877 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. రోజంతా భారీ నష్టాలతో ట్రేడయ్యాయి. ముఖ్యంగా వడ్డీరేట్ల ఆధారిత బ్యాంకులు, రియల్టీ షేర్లతో పాటు ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.30%, 0.28 శాతం బలహీనపడ్డాయి.ప్రపంచ మార్కెట్లపై ఫెడ్ ఎఫెక్ట్...ఆశించినట్లే ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ.. వచ్చే ఏడాది నుంచి రేట్ల తగ్గింపులో దూకుడు ఉండదంటూ సంకేతాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలో అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టపోయాయి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లు కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో యూరప్ మార్కెట్లు ఒక శాతం పతనమయ్యాయి. ఫెడ్ రిజర్వ్ ప్రకటన రోజు (బుధవారం రాత్రి) 3% నష్టపోయిన అమెరికా మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో రికవరీ బాటపట్టాయి. యూఎస్ స్టాక్ సూచీలు నాస్డాక్ 1%, డోజోన్స్ అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో సన్ఫార్మా(1%), హెచ్యూఎల్ (0.11%), పవర్గ్రిడ్(0.09%) మాత్రమే లాభపడ్డాయి. అత్యధికంగా బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 2.50% – 2% నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 1.20% అత్యధికంగా పడింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1.25%, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 1% నష్టపోయాయి. రిలయన్స్ (–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (–1%), టీసీఎస్(–2%), ఐసీఐసీఐ బ్యాంక్ (–2%), ఇన్ఫీ(1.50%), ఎల్అండ్టీ (1%) నష్టపోయి సూచీల పతనాన్ని శాసించాయి.నాలుగు రోజుల్లో రూ.9.65 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు భారీ నష్టం వాటిల్లింది. నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 2,915 పాయింట్ల (3.54%) పతనంతో రూ.9.65 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.449.76 లక్షల కోట్ల (5.29 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:44 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయి 24,563కు చేరింది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 81,402 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.78 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 1.24 శాతం ఎగబాకింది.యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
ఇజ్రాయిల్, ఇరాన్ టెన్షన్.. కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
-
రూ.8,430 కోట్లకు ఓయో ఐపీవో
న్యూఢిల్లీ: హోటల్ బుకింగుల స్టార్టప్ దిగ్గజం ఓయో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్చేసిన సంస్థలు మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ రూ. 8,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో సాఫ్ట్బ్యాంక్, ఏ1 హోల్డింగ్స్, చైనా లాడ్జింగ్ హాలిడేస్(హెచ్కే) తదితరాలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. 2013లో ఏర్పాటైన ఓయో ప్రపంచవ్యాప్తంగా 5,130 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో 71 శాతం మంది దేశీయంగా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం! నష్టాలలోనే...: కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచీ ఇప్పటివరకూ ప్రతీ ఏడాది నష్టాలనే నమోదు చేస్తున్నట్లు ఒరావెల్ స్టేస్ ప్రాస్పెక్టస్లో వెల్లడించింది. కొద్ది నెలలుగా కరోనా మహమ్మారి సవాళ్లు విసరడంతో బిజినెస్ మరింత డీలాపడినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ఓయోకు రూ. 3,944 కోట్ల నష్టాలు వాటిల్లగా.. అంతక్రితం ఏడాది(2019–20)లో రూ. 13,123 కోట్లుగా నమోదయ్యాయి. ఇక 2018–19లో దాదాపు రూ. 2,365 కోట్ల నష్టం ప్రకటించింది. జూలైకల్లా కంపెనీ రుణ భారం రూ. 4,891 కోట్లకు చేరింది. ఐపీవో నిధుల్లో కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు సెబీకి దాఖలు చేసిన దరఖాస్తులో ఓయో తెలియజేసింది. ఓయోలో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వ్యక్తిగత హోదాలో 8.21 శాతం, హోల్డింగ్ కంపెనీ ఆర్ఏ హాస్పిటాలిటీ ద్వారా మరో 24.94 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నారు. జపనీస్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ మరింత అధికంగా 46.62 శాతం వాటాను పొందింది. నిధుల వినియోగం ఇలా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధుల్లో అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు రూ. 2,441 కోట్లను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో ఓయో వెల్లడించింది. మరో రూ. 2,900 కోట్లను కంపెనీ విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లకు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. మిగిలిన పెట్టుబడులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కాగా.. ఇటీవల కొద్ది రోజులుగా యూనికార్న్ హోదా(బిలియన్ డాలర్ల విలువ) పొందిన పలు స్టార్టప్లు స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్ బాట పడుతున్నాయి. ఇప్పటికే జొమాటో లాభాలతో లిస్ట్కాగా.. డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎమ్, బ్యూటీ ప్రొడక్టుల ఆన్లైన్ రిటైలర్ నైకా, ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ సైతం పబ్లిక్ ఇష్యూకి రానున్న సంగతి తెలిసిందే. వివిధ చర్యల ద్వారా స్థూల లాభ మార్జిన్లను 2020లో నమోదైన 9.7 శాతం నుంచి 2021 మార్చికల్లా 33.2 శాతానికి మెరుగుపరచుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. చదవండి: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్ -
క్రాష్ మార్కెట్!
ముంబై: భారత స్టాక్ మార్కెట్లో రెండోరోజూ ‘బేర్’ బాజా కొనసాగింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో పాటు లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. మార్చి డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ æఓ) కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో అమ్మకాలకు మొగ్గుచూపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు సెంటిమెంట్ను బలహీనపరిచాయి. రూపాయి వరుసగా మూడో రోజూ 7 పైసలు క్షీణించడం కూడా ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 740 పాయింట్లు నష్టపోయి 48,440 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్ల పతనంతో 14,325 వద్ద స్థిరపడింది. మెటల్ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్ వరుస పతనంతో రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,611 పాయింట్లు, నిఫ్టీ 489 పాయింట్లను కోల్పోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు జరగడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రెండోరోజూ రూ.3,384 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,268 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 49 వేల దిగువకు సెన్సెక్స్... మునుపటి రోజు నష్టాల ముగింపునకు కొనసాగింపుగా మార్కెట్ బలహీనంగా మొదలైంది. సెన్సెక్స్ 49,202 వద్ద, నిఫ్టీ 14,571 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ రంగ షేర్లను ఎక్కువగా విక్రయించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 49 వేల స్థాయిని కోల్పోయింది. ఒక దశలో సెన్సెక్స్ 944 పాయింట్లును కోల్పోయి 48,236 వద్ద, నిఫ్టీ 285 పాయింట్లు నష్టపోయి 14,264 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మిడ్సెషన్ తర్వాత కొంత రికవరీ కన్పించినా చివరి గంట అమ్మకాలతో సూచీలు రెండోరోజూ భారీ నష్టాలతో ట్రేడింగ్ను ముగించాయి. ‘భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రేటు మళ్లీ పెరిగిపోతోంది. ఈ అంశం ఈక్విటీ మార్కెట్లలో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. డెరివేటివ్స్ ముగింపు తేది కావడం మరింత ప్రతికూలాంశంగా మారింది. సుదీర్ఘ ర్యాలీ తర్వాత దేశీయ మార్కెట్ దిద్దుబాటుకు గురై స్థిరీకరణ దిశగా సాగుతుంది. ఈ దశలో కోవిడ్ వ్యాప్తి భయాలు మార్కెట్ పతనానికి కారణమవుతున్నాయి’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రెండు రోజుల్లో రూ.6.9 లక్షల కోట్లు ఆవిరి మార్కెట్ భారీ పతనంతో గురువారం ఇన్వెస్టర్లు రూ. 3.69 లక్షల కోట్లను కోల్పోయారు. అంతకు ముందు ట్రేడింగ్ సెషన్లోనూ రూ.3.27 లక్షల కోట్ల సంపద ఆవిరవడంతో ఈ రెండు రోజుల్లో రూ.6.96 లక్షల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.200 లక్షల కోట్ల దిగువకు చేరుకొని రూ.198.78 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 3వ తేదీన బీఎస్ఈ ఇన్వెస్టర్ల సంపద రూ. 200 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్ సంస్థ ద్వారా ఇన్వెస్టర్లకు టోపీ
గుట్టువిప్పిన సెబీ ముంబై: పాకిస్తాన్లో రిజిష్టర్ అయిన ఒక సంస్థ ఇచ్చిన మోసపూరిత ఎస్ఎంఎస్లతో భారత్ స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్లు దెబ్బతిన్న ఉదంతమిది. ఇది బట్టబయిలుకావడంతో మార్కెట్ నియంత్రణా సంస్థ ఇక్కడ లిస్టయిన ధాన్యా ఫిన్స్టాక్ కంపెనీతో పాటు మరో 75 మందిని మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధించింది. బీఎస్ఈని తలపింపచేలా ‘బీఎస్ఈబుల్.ఇన్’ అనే పేరుపెట్టుకున్న పాక్ సంస్థ ధాన్యా ఫిన్స్టాక్ను కొనమంటూ ఇక్కడి ఇన్వెస్టర్లకు సిఫార్సు ఎస్ఎంఎస్లు ఇచ్చింది. స్వయంగా బీఎస్ఈ నుంచే ఈ మెసేజ్లు వచ్చాయన్న విశ్వాసంతో గతేడాది జూలై 27న పలువురు ఇన్వెస్టర్లు ధాన్యా ఫిన్స్టాక్ను కొనుగోలుచేశారు. అంతకుముందే ఆ కంపెనీ నుంచి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా పొందిన షేర్లను ఆ కంపెనీ యాజమాన్యానికి చెందినవారు విక్రయించేశారు. దాదాపు రూ. 5 కోట్ల పెట్టుబడితో పొందిన షేర్లను రూ. 107 కోట్లకు విక్రయించారు. ఆ రోజు కొన్న ఇన్వెస్టర్లు మరునాడు ఆ షేర్లను తిరిగి అమ్మడానికి ప్రయత్నిస్తే దాని ధర పతనమైపోయింది. -
విదేశీ పెట్టుబడులే కీలకం...
పెరుగుతున్న ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు * రూపాయి, ముడి చమురు ధరల కదలికలూ ముఖ్యమే * ఈ వారం మార్కెట్ గమనంపై విశ్లేషకుల అభిప్రాయం న్యూఢిల్లీ: ఆర్బీఐ కీలక రేట్ల తగ్గింపు అవకాశాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి ఈ వారం స్టాక్మార్కెట్పై ప్రధానంగా ప్రభా వం చూపనున్నాయి. వీటితో పాటు డాలర్తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల గమనం, శుక్రవారం వెలువడే జనవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు,.. ఈ అంశాలన్నీ తగిన ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నేడు (సోమవారం) సెలవు కారణంగా ఈ వారంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అందరి కళ్లూ ఆర్బీఐ పైనే... ఆర్బీఐ రేట్ల కోత అవకాశాలు మార్కెట్లో ఒకింత ఒడిదుడుకులకు కారణమవుతాయని నిపుణుల అభిప్రాయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.5 శాతానికే కట్టడి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించడం వల్ల ఆర్బీఐ కీలక రేట్లలో కోత కోయవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. దేశీయంగా మరే ప్రధాన సంఘటన ఏదీ లేనందున అందరి కళ్లు ఆర్బీఐ మీదనే ఉన్నాయని వివరించారు. ఫిబ్రవరిలో వచ్చిన నష్టాలన్నీ భర్తీ అయ్యేలా బడ్జెట్ స్టాక్ మార్కెట్ను పరుగులు పెట్టిస్తోందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(మిడ్క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు జరపడం కూడా కలసివస్తోందన్నారు. క్యూ4 ఫలితాల ప్రభావం... ఇక బడ్జెట్ ముగిసినందున కంపెనీలు వెల్లడించే జనవరి-మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలపైననే అందరూ దృష్టి సారిస్తారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. జీఎస్టీ వంటి కీలక బిల్లుల కారణంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కూడా ఇన్వెస్టర్లు గమనంలోకి తీసుకుంటారని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ తక్షణం ఆర్బీఐ నుంచి రేట్ల కోతను ఆశిస్తోందని వివరించారు. దీని తర్వాత కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, వర్షాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, సంస్కరణల అమలు... ఈ అంశాలన్నీ సమీప భవిష్యత్తులో మార్కెట్పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఏడేళ్లలో అత్యుత్తమ లాభాల వారం.. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,492 పాయింట్లు(6.4 శాతం) లాభపడి 24,646 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ పాయింట్లు(6.5 శాతం) లాభపడి 7,485 పాయింట్ల వద్ద ముగిశాయి. పాయింట్ల పరంగా చూస్తే స్టాక్ సూచీలకు ఇవి ఏడేళ్లలో అత్యుత్తమ లాభాలు కాగా, పర్సంటేజ్ పరంగా చూస్తే ఇవి నాలుగేళ్లలో అత్యుత్తమ లాభాలు. విదేశీ కొనుగోళ్ల జోరు.. ఈ నెల తొలి 4 ట్రేడింగ్ సెషన్లలోనే భారత స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 4,100 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు, సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. కాగా ఈ 4 రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు డెట్ మార్కెట్ నుంచి రూ.746 కోట్లు నికరంగా ఉపసంహరించుకున్నారు. ఇతర వర్ధ మాన దేశాలతో పోల్చితే మన దేశం పటిష్టంగా ఉందని, అందుకే విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఫండమెంటల్ రీసెర్చ్ వినోద నాయర్ చెప్పారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా పెరుగుతుండడం, బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉండడం కూడా కలసివచ్చిందని వివరించారు. కాగా ముడిచమురు ధరల పతనం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన వంటి అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి ఈ ఏడాది జనవరిలో రూ.11,126 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,521 కోట్లు వెరసి ఈ రెండు నెలల్లో రూ.16,648 కోట్ల నిధులు వెనక్కి తీసుకున్నారు. -
గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణ
చమురు ధరల గమనంతో లాభాల్లో ఒడిదుడుకులు ♦ చివర్లో లాభాల స్వీకరణతో తగ్గిన లాభాలు ♦ ప్లస్ 215 పాయింట్ల నుంచి ప్లస్ ♦ 50 పాయింట్లకు పరిమితమైన లాభాలు యూరప్ ప్యాకేజీకి తోడు జపాన్ కేంద్ర బ్యాంక్ కూడా ప్యాకేజీ ఇస్తుందన్న ఆశలతో భారత స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లోనే ముగిసింది. అయితే రోజులో గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ జరగడంతో ట్రేడింగ్ ముగింపులో స్వల్పలాభాలతోనే సూచీలు సరిపెట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు లాభపడి 24,486 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,436 పాయింట్ల వద్ద ముగిసింది. లోహ, కన్సూమర్ గూడ్స్, ఫార్మా, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. తగ్గిన లాభాలు... యూరప్, జపాన్ల ప్యాకేజీ ఆశలతో ఆసియా మార్కెట్లు ఎగిశాయి. అమెరికాలో తీవ్రమైన మంచు తుఫాన్ నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ మంచి లాభాలనే కళ్లజూసింది. సోమవారం వెలువడిన కొన్ని కంపెనీల క్యూ3 ఫలితాలు ఒకింత బావుండడం, షార్ట్ పొజిషన్ల కవరింగ్ కూడా సానుకూల ప్రభావం చూపించాయి. అమెరికా తూర్పు తీరంలో మంచు తుఫాన్ చెలరేగడంతో ఆయిల్ ఫ్యూచర్స్ పెరిగాయని, దీంతో మన మార్కెట్ లాభపడిందని బీఎన్పీ పారిబా మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్(ఈక్విటీ) శ్రేయాష్ దేవాల్కర్ చెప్పారు. అయితే యూరోప్ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా సాగడం, సోమవారం యూరప్ ట్రేడింగ్లో చమురు ధరల్లో కరెక్షన్ కారణంగా ఇక్కడి స్టాక్ మార్కెట్లో అమ్మకాలు పెరిగాయి. జనవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు మరో మూడు రోజుల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించడం, కొన్ని క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్, వాహన, విద్యుత్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం.. ఈ అంశాలన్నీ లాభాలను హరించివేశాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 15 షేర్లు లాభాల్లో ముగిశాయి. నేడు మార్కెట్లకు సెలవు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్కు నేడు(మంగళవారం) సెలవు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లు పనిచేయవు. వీటితో పాటు ఫారెక్స్, మనీ మార్కెట్, బులియన్, మెటల్స్, ఇతర టోకు ధరల కమోడిటీ మార్కెట్లన్నింటికి కూడా సెలవు. -
రెండో రోజూ నష్టాలే...
* 43 పాయింట్ల నష్టంతో 25,580కు సెన్సెక్స్ * 7 పాయింట్ల నష్టపోయి 7,785కు నిఫ్టీ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా ఆర్థిక వ్యవస్థపై తాజాగా రేగిన ఆందోళనలు కొనసాగడంతో వరుసగా రెండో రోజూ స్టాక్ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 43 పాయింట్లు నష్టపోయి 25,580 పాయింట్ల వద్ద. నిఫ్టీ చివరకు 7 పాయింట్ల నష్టంతో 7,785 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇది సెన్సెక్స్కు రెండు వారాల కనిష్ట స్థాయి. లోహ, ఆయిల్, గ్యాస్, రియల్టీ, యుటిలిటీస్, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఇటీవల పతనం కారణంగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న రియల్టీ, విద్యుత్తు, ఆయిల్, గ్యాస్ షేర్లో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. 25,745 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 25,767-25,514 పాయింట్లు, గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. నిఫ్టీ 68 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఏడాది చివరకు నిఫ్టీ @ 8,200: యూబీఎస్ అంచనా ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది చివరకు 8,200 పాయింట్లకు చేరుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం యూబీఎస్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. జీడీపీ అంచనా 7.6%. 2016-17లో 7.8% అంచనా. -
మూడో రోజూ లాభాల్లోనే...
► ఫెడ్ ఎఫెక్ట్ లేదంటున్న నిపుణులు ► 174 పాయింట్ల లాభంతో 25,494కు సెన్సెక్స్ ► 50 పాయింట్ల లాభంతో 7,751కు నిఫ్టీ అంతర్జాతీయ స్టాక్మార్కెట్ల మాదిరే భారత స్టాక్ మార్కెట్ కూడా బుధవారం లాభాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయని ఇన్వెస్టర్లు భావించారని దీంతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల బాటలోనే సాగాయని నిపుణులంటున్నారు. దీనికి తోడు ఇంధన షేర్లు పెరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 174 పాయింట్లు లాభపడి 25,494 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,751 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు రోజం తా లాభాల్లోనే ట్రేడయ్యాయి. వడ్డీరేట్లపై నిర్ణయాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం అర్థరాత్రి వెల్లడించనున్నది. ఆయిల్ షేర్లకు లాభాలు: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆరేళ్ల కనిష్ట స్థాయి నుంచి రికవరీ కావడంతో ఆయిల్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, కెయిర్న్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4% వరకూ పెరిగాయి. 2,000 సీసీ అంతకంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న డీజిల్ వాహన రిజిస్ట్రేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకూ సుప్రీం కోర్ట్ నిషేధం(ఢిల్లీలో) విధించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా 5.4 శాతం నష్టపోయింది. కాగా ఎన్ఎస్ఈకి చెందిన ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్ఎల్) సంస్థ మూడు గ్రూప్ ఇండెక్స్లను బుధవారం ప్రారంభించింది. ఆయా గ్రూప్ కంపెనీల పనితీరును ట్రాక్ చేయడానికి నిఫ్టీ టాటా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ మహీంద్రా గ్రూప్ ఇండెక్స్లను పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ విధానం ఆధారంగా రూపొందించామని ఐఐఎస్ఎల్ పేర్కొంది. -
గ్లోబల్ ట్రెండ్-మార్కెట్ ర్యాలీ
359 పాయింట్ల లాభంతో 25,842కు సెన్సెక్స్ 111 పాయింట్ల లాభంతో 7,843కు నిఫ్టీ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో భారత్ స్టాక్ మార్కెట్ కూడా గురువారం లాభాల్లో ముగిసింది. వడ్డీరేట్లను క్రమక్రమంగా పెంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ యోచిస్తోందని ఫెడ్ మినట్స్ వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు లాభాలను తెచ్చిపెట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 359 పాయింట్లు (1.41 శాతం)లాభపడి 25,842 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్లు(1.43 శాతం) లాభపడి 7,843 పాయింట్ల వద్ద ముగిశాయి. ఏడువారాల్లో సెన్సెక్స్ ఒక్క రోజులో ఇంత లాభపడడం ఇదే మొదటిసారి. ఫార్మా సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. రియల్టీ, ఐటీ, బ్యాంక్, ఆర్థిక సేవలు, ఆయిల్, ఎఫ్ఎంసీసీ, వాహన షేర్లు ర్యాలీ జరిపాయి. దశలవారీగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచడం వల్ల విదేశీ నిధులు ఒక్కసారిగా బయటకు తరలివెళ్లబోవనే అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మరోవైపు రూపాయి బలపడడం, ఎగుమతులకు 3 శాతం వడ్డీ సబ్సిడీ స్కీమ్ను కేంద్రం బుధవారం ప్రకటించడం సెంటిమెంట్కు ఊపునిచ్చాయి. స్వల్ప కాలిక ఊరటే.. అయితే ఇది షార్ట్కవరింగ్ ర్యాలీ అని, ఇది స్వల్పకాలమే ఉంటుందని కొంతమంది నిపుణులంటున్నారు. నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగిసిన తర్వాత కరెక్షన్ తప్పదని వారంటున్నారు. ఏడవ వేతన సంఘం తన నివేదికను కేంద్రానికి సమర్పిస్తున్న నేపథ్యంలో వాహన, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు జోరందుకున్నాయి. మారుతీ సుజుకీ, బజాజ్ ఆటోలు 3 శాతం వరకూ పెరిగాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ కంపెనీలు 1-3% రేంజ్లో పెరిగాయి. మరిన్ని ముఖ్యాంశాలు... రైలు రవాణాకు సంబంధించి 3 రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రైల్వే స్టాక్ట్స్ లాభపడ్డాయి. మౌలిక రంగానికి ఉత్తేజాన్నిచ్చే చర్యలు తీసుకోవడంతో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా, గాయత్రి ప్రాజెక్ట్స్ వంటి నిర్మాణ, ఇంజినీరింగ్ షేర్లు 13 శాతం వరకూ పెరిగాయి. అమెరికా చట్టాల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్కు నష్టాలు కొనసాగుతున్నాయి. బీఎస్ఈలో షేర్ ఇంట్రాడేలో 7 శాతం పతనమై చివరకు 2.6 శాతం నష్టంతో రూ.3,287 వద్ద ముగిసింది. మార్కెట్ డేటా... టర్నోవర్ (రూ.కోట్లలో) బీఎస్ఈ 2,554 ఎన్ఎస్ఈ (ఈక్విటీ విభాగం) 15,316 ఎన్ఎస్ఈ(డెరివేటివ్స్) 2,82,254 నికర అమ్మకాలు/కొనుగోళ్లు (రూ.కోట్లలో) ఎఫ్ఐఐ -343 డీఐఐ 234 -
మూడో రోజూ నష్టాలే..
ఫెడ్ ఫలితంపైనే అందరి దృష్టి * 214పాయింట్లు నష్టంతో 27,040కు సెన్సెక్స్ * 62 పాయింట్ల నష్టంతో 8,171కు నిఫ్టీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగిసింది. ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఇన్వెస్టర్ల వేచి చూసే ధోరణి కారణంగా స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 214 పాయింట్లు నష్టపోయి 27,040 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 8,171 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 8,200 పాయింట్ల దిగువన ముగియగా, ఇంట్రాడేలో సెన్సెక్స్ 27,000 పాయింట్ల దిగువకు పతనమైంది. అక్టోబర్ సిరీస్ డెరివేటివ్ల కాంట్రాక్టులు నేటితో ముగియడం, సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, బీహార్ ఎన్నికలు, రూపాయి పతనం, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం ప్రతికూల ప్రభావం చూపాయి. బ్యాంక్, వాహన, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్లు పెరగడంతో నష్టాలు పరిమితమయ్యాయని నిపుణులంటున్నారు. విద్యుత్ రంగ కంపెనీలకు ఇచ్చిన రూ. 1,820 కోట్ల రుణాలను 65 శాతం నష్టంతో ఆసెట్ రీస్ట్రక్చరింగ్ కంపెనీలు (ఏఆర్సీ)కు యాక్సిస్ బ్యాంక్ అమ్మేసింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో యాక్సిస్ బ్యాంక్ 7.3 శాతం పతనమై రూ. 483 వద్ద ముగిసింది. ఇండిగో ఐపీఓకు ఓవర్ సబ్ స్క్రిప్షన్ విమానయాన కంపెనీ ఇండిగో ఐపీఓ 1.55 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా రూ.3,018 కోట్లు సమీకరించాలని ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ మొదలై రెండో రోజైన బుధవారంనాడు రూ.4,000 కోట్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్(క్విబ్)కు కేటాయించిన వాటా 5.15 రెట్లు సబ్స్క్రైబ్ అయిందని కంపెనీ పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 19 శాతం, సంస్థాగతం కాని ఇన్వెస్టర్ల కేటగిరి వాటా 4 శాతం చొప్పున సబ్స్క్రైబ్ అయ్యాయని వివరించింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.832 కోట్ల నిధులు సమీకరించామని పేర్కొంది. మూడేళ్ల తర్వాత భారతీ ఇన్ఫ్రాటెల్ అనంతరం ఇదే అతిపెద్ద ఐపీఓ. 2012 డిసెంబర్లో భారతీ ఇన్ఫ్రా టెల్ రూ.4,000 కోట్ల సమీకరణకు గాను ఐపీఓకు వచ్చింది. -
లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాలు
42 పాయింట్ల నష్టంతో 27,646కు సెన్సెక్స్ ⇒ 300 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ ⇒ 8 పాయింట్ల నష్టంతో 8,366కు నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ, లాభాల స్వీకరణ కారణంగా భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. రెండు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ కంపెనీలు, బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 42పాయింట్లు పతనమై 27,646 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8 పాయింటు నష్టపోయి 8,366 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్రమైన ఊగిసలాటకు గురైంది. మరింత కన్సాలిడేషన్! ప్రధానమైన సానుకూలమైన సంఘటనలేమీ లేకపోవడంతో గత రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని నిపుణులంటున్నారు. అయితే ఎంపిక చేసిన సెన్సెక్స్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్కు స్వల్పనష్టాలే వచ్చాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతుండడం మరింత కన్సాలిడేషన్కు సూచిక అని జియోజిత్ బీఎన్పీ పారిబస్ హెడ్(టెక్నికల్ రీసెర్చ్) ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. 17 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు నష్టాల్లో, 12 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ షేర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.హెచ్డీఎఫ్సీ 2% క్షీణించింది. ఇదే బాటలో టాటా మోటార్స్ 1.95 శాతం, ఓఎన్జీసీ 1.6%, బజాజ్ ఆటో 1%, హిందూస్తాన్ యూనిలివర్ 0.8% చొప్పున పడిపోయాయి. ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే హీరో మోటొకార్ప్ 2 శాతం, విప్రో 1.6 శాతం, వేదాంత 1.4% చొప్పున పెరిగాయి. 1,453 షేర్లు లాభాల్లో, 1,289 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో 3,444 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,809 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 2,79,809 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్ఠర్లు రూ.48 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.451 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. -
షాక్ మార్కెట్
⇒ సెన్సెక్స్...27,000 దిగువకు...723 పాయింట్లు క్రాష్ ⇒ 228 పాయింట్లు పడిన నిఫ్టీ... 8,100 కిందికి ⇒ ఈ ఏడాది కనిష్ట స్థాయిలకు సూచీలు భారత స్టాక్ మార్కెట్ బుధవారం ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. జీఎస్టీ ఇతర ఆర్థిక సంస్కరణలు ఆశించినంతే వేగంగా లేవని ఆందోళన చెందిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడటంతో బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 723 పాయింట్లు క్షీణించి, 26,717 పాయింట్లకు పడిపోయింది. ఇక నిఫ్టీ 228 పాయింట్లు(2.74 శాతం) నష్టపోయి 8,097 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలకు ఈ ఏడాది ఇదే అత్యంత కనిష్ట స్థాయిలు. నాలుగు నెలల్లో సెన్సెక్స్ ఒక్క రోజులో అధికంగా నష్టపోయింది కూడా ఇదే. కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో అతి పెద్ద పతనం. లోక్సభలో జీఎస్టీ బిల్లు గట్టెక్కినప్పటికీ, రాజకీయ వ్యతిరేకత బాగా ఉండటంతో సంస్కరణల ప్రక్రియ ఆలస్యమవుతుందనే ఆందోళనతో ఎఫ్ఐఐల అమ్మకాలు వరదలా వెల్లువెత్తాయి. సేవల, తయారీ రంగాల్లో మందగమనం చోటు చేసుకోవడం, ఎఫ్ఐఐల పన్ను ఆందోళనలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఈ ఏడాది గరిష్ట స్థాయికి చేరడం, అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే ఉండడం ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న రెండు వారాల్లో దాదాపు రెండు డజన్ల చైనా కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఈ ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడానికి విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నారని నిపుణులంటున్నారు. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్ఐఐల రూ.9,000 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా సావరిన్ బాండ్ల విక్రయాలు పెరగడం కూడా భారత స్టాక్ మార్కెట్ పతన కారణాల్లో ఒకటి. అల్గోరిథమ్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్పై ట్రేడర్లు పిచ్చెత్తినట్లుగా అమ్మకాలు జరపడం కూడా స్టాక్ మార్కెట్ పతనానికి ఒక కారణమని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) జిగ్నేశ్ చౌదురి వ్యాఖ్యానించారు. నిఫ్టీకి కీలకమైన మద్దతుగా భావించిన 200 రోజుల సగటు కంటే నిఫ్టీ దిగువకు పడిపోవడంతో అల్గోరిథమ్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్పై అమ్మకాలు వెల్లువెత్తాయని వివరించారు. ఐదు నెలల కనిష్ట స్థాయికి సెన్సెక్స్ కీలక బిల్లులపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విభేదాల పట్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. బుధవారం సెన్సెక్స్ స్వల్ప లాభాలతో (27,473 పాయింట్ల వద్ద) ప్రారంభమైంది. ఆతర్వాత 27,501 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో 27,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 26,678 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 723 పాయింట్ల (2.63 శాతం) భారీ నష్టంతో 26,717 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, సిప్లా, ఐటీసీ తదితర బ్లూ చిప్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిఫ్టీ 228 పాయింట్లు(2.74 శాతం) నష్టపోయి 8,097 పాయింట్ల వద్ద ముగిసింది. ఎదురీదిన ఎయిర్టెల్... ఎంఎస్సీఐ గ్లోబల్ స్టాండర్ట్ ఇండెక్సెస్ సంస్థ ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్లో భారతీ ఎయిర్టెల్ వెయిటేజీని 1.3 శాతం నుంచి 2.6 శాతానికి పెంచిందన్న వార్తల కారణంగా 0.8 శాతం లాభంతో భారతీ ఎయిర్టెల్ 390కు పెరిగింది. సెన్సెక్స్ షేర్లలో పెరిగిన ఏకైక షేర్ ఇదే. ఇక మొత్తం 12 రంగాల బీఎస్ఈ సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, విద్యుత్, బ్యాంక్, లోహ, రిఫైనరీ, ఆరోగ్య సంరక్షణ రంగాల షేర్లు బాగా పతనమయ్యాయి. ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీలు 3-6% రేంజ్లో పడిపోయాయి. ఓఎన్జీసీ 3%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.5% చొప్పున పడ్డాయి. భెల్ 6.21% నష్టపోయింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా పతనమైన షేర్ ఇదే. ఇదే బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ 4.9%, ఎల్ అండ్ టీ 4.6%, మారుతీ సుజుకీ 4.2%, ఎన్టీపీసీ 4 శాతం, సిప్లా 3.9 శాతం, ఓఎన్జీసీ 3.9%, యాక్సిస్ బ్యాంక్ 3.8%, టాటా పవర్ 3.7% చొప్పున పడిపోయాయి. 2,147 షేర్లు నష్టపోగా, 590 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,565 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.20,654 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్లో రూ. 2,94,267 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,700 కోట్లు నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 1,455 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. రూ.2.89 లక్షల కోట్లు ఆవిరి... సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.99.11 లక్షల కోట్లకు చేరింది. 3 వారాల్లో 2,400 పాయింట్లు డౌన్ సంస్కరణలు జోరు పెరుగుతుందనే అంచనాలతో గత 9 నెలలుగా స్టాక్ మార్కెట్ పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో బీఎస్ఈ సెన్సెక్స్ 30,000 పాయింట్ల(జీవిత కాల గరిష్ట స్థాయి)కు కూడా చేరింది. అయితే ఎఫ్ఐఐల పన్ను ఆందోళనలు, సంస్కరణల జోష్ తగ్గడంతో గరిష్ట స్థాయి నుంచి 3,300 పాయింట్లు నష్టపోయింది. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వత లాభపడిన పాయింట్లలో సగం హరించుకుపోయింది. గత మూడు వారాల్లోనే దాదాపు 2,400 పాయింట్లు(8%)పతనమైంది. ఎఫ్ఐఐల కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) ఆందోళనలు, నిరాశకు గురిచేస్తున్న కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, సగటు కన్నా తక్కువగానే ఈ ఏడాది వర్షాలు ఉంటాయన్న అంచనాలు దీనికి ప్రధాన కారణాలని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ (రీసెర్చ్) హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. సల్మాన్కు శిక్షతో తగ్గిన ఈరోస్, మంధన.. ప్రముఖ హిందీ సినిమా నటుడు సల్మాన్ ఖాన్కు ఐదేళ్లు శిక్ష పడిన నేపథ్యంలో ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా, మంధన ఇండస్రీస్ షేర్లు క్షీణించాయి. మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన 2002 నాటి కేసులో సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల శిక్ష పడింది. దీంతో ఆయనతో సంబంధమున్న ఈ రెండు కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్ఎస్ఈలో ఈరోస్ ఇంటర్నేషనల్ షేర్ 6 శాతం క్షీణించి రూ.380కు, మంధన ఇండస్ట్రీస్ 3.5 శాతం తగ్గి రూ.265కు పడిపోయాయి. ఈరోస్ మార్కెట్ క్యాప్ రూ.213 కోట్లు క్షీణించి రూ.3,523 కోట్లకు, మంధన ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.38 కోట్లు క్షీణించి రూ.876 కోట్లకు తగ్గింది. సల్మాన్ ఖాన్ స్వచ్ఛంద సేవా సంస్థ బీయింగ్ హ్యుమన్ దుస్తుల డిజైనింగ్, మార్కెటింగ్, పంపిణీలకు మంధన ఇండస్ట్రీస్కు ఎక్స్క్లూజివ్ లెసైన్స్ ఒప్పందం ఉంది. ఇక ఈరోస్... సల్మాన్ ఖాన్తో రెండు సినిమాలు.. భజరంజి భాయ్జాన్, హీరో సినిమాలను నిర్మిస్తామని గత ఏడాది డిసెంబర్లో ప్రకటించింది. -
కొనసాగుతున్న రికార్డుల ర్యాలీ..
ఇంట్రాడే, ముగింపులో కొత్త శిఖరాలకు సూచీలు * 8,900 మార్క్ను దాటిన నిఫ్టీ, 75 పాయింట్లు ప్లస్ * 292 పాయింట్ల లాభంతో 29,571కు సెన్సెక్స్ ముంబై: భారత స్టాక్మార్కెట్లో ఇటీవల ప్రతిరోజూ రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగుస్తున్నాయి. సోమవారం రిపబ్లిక్డే సెలవు అనంతరం మంగళవారం ప్రారంభమైన మార్కెట్ రికార్డుల ర్యాలీని కొనసాగించింది. వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి 29,619, నిఫ్టీ 8,925 పాయింట్లను తాకాయి. చివరకు సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 29,571 పాయింట్ల వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 8,911 వద్ద ముగిశాయి. ఇవి రెండూ రికార్డ్ స్థాయి ముగింపులు. ఈ సూచీలు రికార్డ్ స్థాయిల వద్ద ముగియడం ఇది వరుసగా ఐదో రోజు. తాజా ర్యాలీలో నిఫ్టీ తొలిసారిగా 8,900 మార్క్ను దాటేసింది. ఉదయం ట్రేడింగ్లో మార్కెట్ స్థిరీకరణ సూచనలు కనిపించాయి. కానీ చివరి గంటలో బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు అనూహ్యంగా పెరిగిపోయాయి. వరుసగా 8 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 2,224 పాయింట్లు(8%), నిఫ్టీ 600 పాయింట్ల చొప్పన లాభపడ్డాయి. జోష్నిచ్చిన ఒబామా పర్యటన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలు మరింత పటిష్టం కానుండడం స్టాక్ మార్కెట్లలో జోష్ను పెంచింది. గ్రీస్ ఎన్నికల్లో సంస్కరణలను వ్యతిరేకించే సిరిజా పార్టీ విజయం సాధించడంతో ఆసియా మార్కెట్లు ఊగిసలాటకు గురైనా, భారత మార్కెట్లు దూసుకెళ్లాయి. ఒబామా పర్యటన సందర్భంగా భారత్లో వాణిజ్య వ్యాపార కార్యకలాపాల కోసం అమెరికా 400 కోట్ల డాలర్లు పెట్టుబడులు, రుణాల రూపంలో అందించనుండడం మార్కెట్లకు జోష్నిచ్చిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ వ్యాఖ్యానించారు. అమెరికాతో అణు బంధం బలపడుతున్న కారణంగా క్యాపిటల్ గూడ్స్, రక్షణ రంగ షేర్లు వెలుగులు విరజిమ్మాయి. భెల్, ఎల్ అండ్ టీ, పిపవావ్ డిఫెన్స్, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ షేర్లు 1-7 శాతం రేంజ్లో పెరిగాయి. సిప్లా 4.6%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.5%, ఐటీసీ 3%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.9%, టాటా మోటార్స్ 2.9 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.1 శాతం చొప్పున పెరిగాయి. కాగా, మంగళవారం విదేశీ ఇన్వెస్టర్ల రూ.953 కోట్ల నికర కొనుగోళ్లు జరపారు. దేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ.783 కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్ వరకూ బ్యాంక్ షేర్ల జోరు గత ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,224 పాయింట్లు లాభపడింది. దీంట్లో సగం వాటా (1,200 పాయింట్ల మేర) ఐదు ఆర్థిక రంగ షేర్లదే. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్ల పెరుగుదలతో సెన్సెక్స్ దూసుకుపోతుందని, వచ్చేవారంలో జరిగే పరపతి సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను మరోసారి తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పరుగులు పెడుతున్నాయని విశ్లేషకులంటున్నారు. కాగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్లు మంగళవారం నాటి ట్రేడింగ్లో గరిష్ట స్థాయిలను తాకాయి. మంచి పనితీరు, ఇటీవలి రేట్ల కోత, కొన్ని బ్యాంకులకు అనుబంధ బీమా, బ్రోకరేజ్ కంపెనీలు ఉండడం(బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు త్వరలో ఆమోదం పొందే అవకాశాలున్నాయి) వంటి కారణాల వల్ల ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు బాగా పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు. బడ్జెట్ వరకూ బ్యాంకింగ్ షేర్ల హవా కొనసాగుతుందని, బడ్జెట్ తర్వాత కరెక్షన్ ఉంటుందనేది వారి అభిప్రాయం. కాగా యాక్సిస్ బ్యాంక్ షేర్ రికార్డ్ స్థాయిని(రూ.598) తాకి 4.7% లాభంతో రూ.592 వద్ద ముగిసింది. ఈ షేర్ రూ.840కు చేరుతుందనేది మోర్గాన్ స్టాన్లీ అంచనా. -
28 వేల మార్కు సమీపంలో సెన్సెక్స్!
ముంబయి: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 28వేల మార్కుకు సమీపంలో ఉంది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల్లో కొనసాగుతోంది. ఇక ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించటంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. -
మోదీ టైమ్ బావుంది..!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మళ్లీ రిపీట్ అయ్యింది. సోమవారం మరోసారి భారత స్టాక్ మార్కెట్ సరికొత్త గరిష్టస్థాయిని నమోదుచేసింది. రోజుకో కొత్త రికార్డును నెలకొల్పడం సూచీలకు పరిపాటి అయిపోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనువేగంతో ప్రవేశపెట్టిన సంస్కరణలో, మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా టర్న్ ఎరౌండ్ అయిపోవడమో ఇందుకు కారణం కాదు. పలు ప్రపంచదేశాల బ్యాంకుల ‘ఈజీ మనీ పాలసీ’ ఫలితంగా అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ మార్కెట్ సూచీలన్నీ ఎగసిపోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి పొందిన చౌక డాలరు రుణాల్ని ఇన్వెస్టర్లు పలు దేశాల మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మన మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు 40 బిలియన్ డాలర్లు కుమ్మరించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ‘శుభదినాలు(మోదీ భాషలో అచ్ఛాదిన్)’ ఇంకా రాకపోయినా, బీఎస్ఈ సెన్సెక్స్ 28,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించడానికి కారణమిదే. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతున్నదన్న సంకేతాలేవీ ఇప్పటికీ కన్పించలేదు. దేశపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 5.7 శాతానికే పరిమితమైంది. సెప్టెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 2.5 శాతానికి పడిపోయింది. అక్టోబర్లో ఎగుమతుల వృద్ధి 5 శాతానికి తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వపు పన్ను వసూళ్లు పూర్తి ఆర్థిక సంవత్సరపు లక్ష్యంలో 37 శాతమే జరిగాయి. అందుకే వసూళ్లను పెంచుకునేందుకు డీజిల్, పెట్రోల్పై అదనపు ఎక్సయిజ్ సుంకం వడ్డించింది. మే నెలలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం , గత యూపీఏ ప్రభుత్వం అర్థాంతరంగా వదిలిపెట్టిన, ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్లో పడిన కొన్ని అంశాలపై (బీమా రంగంలో ఎఫ్డీఐని పెంచడం, సహజవాయువు ధరను పెంచడం వంటివి) నిర్ణయాలను ప్రకటించింది తప్ప, ఇప్పటివరకూ కొత్తగా తీసుకున్న విధాన చర్యలేవీ లేవు. రైల్వే బడ్జెట్లోగానీ, సాధారణ బడ్జెట్లో గానీ ప్రతిపాదించిన సంస్కరణలేవీ లేవు. దేశీయ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రతిబింబించే ఇన్ఫ్రా, పవర్ రంగాలు మెరుగుపడకపోగా, మరింత కుదేలైపోయాయి. ఆర్థిక రంగం వృద్ధిబాట పడుతున్నదన్నడానికి స్పష్టమైన సంకేతంగా భావించే బ్యాంకుల రుణ వితరణ పెరగలేదు. పైగా మూలధనం అవసరమైన రంగాల నుంచి రుణాలకు డిమాండ్ పడిపోయింది కూడా. ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటే కరెన్సీ కూడా బలపడేది. డాలరు బలాన్ని ఎదిరించలేక రూపాయి విలువ 8 నెలల కనిష్టస్థాయికి క్షీణించింది. అయినా మోదీ టైమ్ మాత్రం బావుంది. అంతర్జాతీయ స్టాక్, కమోడిటీ మార్కెట్ల అనుకూల ప్రభావం భారత్పై బాగా ప్రసరించింది. భారత్ అధికంగా దిగుమతి చేసుకునే చమురు, బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో గత కొద్ది నెలల్లో 30, 20 శాతం చొప్పున పడిపోయాయి. ఈ రెండు కమోడిటీల ధరల క్షీణతతో దిగుమతుల బిల్లు గణనీయంగా తగ్గిపోయింది. దాంతో పాటు కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వచ్చే డాలర్లు, చెల్లించే డాలర్ల మధ్య వ్యత్యాసం) ఆశ్చర్యకరంగా 1.7 శాతానికి పడిపోయింది. చెల్లింపుల సమతౌల్యస్థితి మెరుగుపడింది. ఇప్పుడు రిజర్వుబ్యాంక్ వద్ద 8 నెలలకు సరిపడా అవసరమైన డాలరు నిల్వలున్నాయి. ప్రపంచ కమోడిటీ మార్కెట్ల పుణ్యమా అని డీజిల్ ధరను భారీగా తగ్గించడంతో పాటు ఆ ఇంధనంపై నియంత్రణలు ఎత్తివేసిన ఘనతను మోదీ ప్రభుత్వం పొందగలిగింది. మనం అధికంగా దిగుమతి చేసుకునే వంటనూనెల ధరలు సైతం ప్రపంచ మార్కెట్లో తగ్గడంతో ఇక్కడ కూడా తగ్గు ముఖం పట్టాయి. చక్కెర, గోధుమలు, జొన్న వంటి వ్యవసాయోత్పత్తులు, వెండి, రాగి తదితర లోహాల ధరలు కూడా అంతర్జాతీయంగా పడిపోవడంతో దేశీయ ద్రవ్యోల్బణం గత కొద్ది సంవత్సరాల్లో ఎన్నడూ చూడనంత కనిష్టస్థాయికి పడిపోయింది. అక్టోబర్లో వినియోగ ద్రవ్యోల్బణం రేటు 5.5 శాతానికి తగ్గిపోయింది. టోకు ద్రవ్యోల్బణం రేటు 1.77 శాతానికి క్షీణించింది. ధరలు తగ్గిన ఫలితమంతా నరేంద్ర మోదీ ఖాతాలోకి వచ్చిచేరింది. ఆరేళ్ల నుంచి యూపీఏ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ప్రపంచ కమోడిటీ మార్కెట్లు మోది పగ్గాలు చేపట్టిన తర్వాత నాటకీయంగా చల్లబడ్డాయి. కానీ కేవలం కమోడిటీ ధరలు తగ్గినంత మాత్రాన దేశానికి మోదీ చెపుతున్న శుభదినాలు వస్తాయో రావో చెప్పలేం గానీ, ప్రస్తుతం ప్రధాని టైమ్ బావుందని చెప్పొచ్చు. -
పార్లమెంట్ సమావేశాలపై మార్కెట్ దృష్టి!
క్యూ2 జీడీపీ గణాంకాలపై కూడా: నిపుణుల అంచనా న్యూఢిల్లీ: రికార్డుల మీద రికార్డుల్ని సృష్టిస్తున్న భారత స్టాక్ మార్కెట్, వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మరిన్ని సంస్కరణలుంటాయన్న అంచనాలతో కొత్త గరిష్టస్థాయికి చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వారంలో వెల్లడికానున్న జీడీపీ గణాంకాలు మార్కెట్పై తక్షణ ప్రభావం చూపిస్తాయని, నవంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. గతవారం 288 పాయింట్లు ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ కొత్త రికార్డుస్థాయి 28,335 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,477 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇన్వెస్టర్లు ఆశించే సంస్కరణలు వుండవచ్చన్న అంచనాలతో మార్కెట్ తక్షణం సరికొత్త గరిష్టస్థాయికి పెరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జీఎస్టీకి సంబంధించిన బిల్లులు, బొగ్గు రంగ సంస్కరణల్ని ఈ సమావేశాల్లో ఆవిష్కరిస్తారన్న అంచనాలు మార్కెట్లో వున్నాయి. బీమా బిల్లు వంటివాటి ఆమోదం విషయంలో విపక్షాలు కఠినవైఖరిని అవలంబిస్తున్నా, తాము ఈ సమావేశాల్లో ముందుకు వెళతామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే ప్రకటించారు. నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు 27వ తేదీన ముగియనున్నందున మార్కెట్ ఈ వారం హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాలిక్ తెలిపారు. జీడీపీ డేటా 28న వెల్లడికానున్న సందర్భంగా కూడా సూచీల ఊగిసలాట వుండవొచ్చని ఆయన అన్నారు. అయితే విదేశీ పెట్టుబడుల ప్రవాహం, మార్కెట్ ఆశావహ దృక్పథం ఈ వారం సూచీల్ని గరిష్టస్థాయిలో స్థిరపడవచ్చని ఆయన వివరించారు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 8,100-8,500 మధ్య హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చనేది బొనాంజా పోర్ట్ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా. వచ్చేనెల తొలివారంలో జరగనున్న ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో అనుకూల ప్రకటన వెలువడవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని, వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు డిసెంబర్ 2నాటి సమీక్షలో వెలువడితే మార్కెట్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 20,000 కోట్లు భారత్ క్యాపిటల్ మార్కెట్లో నవంబర్ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దాదాపు రూ. 20,000 కోట్లు పెట్టుబడి చేశారు. ఇందులో ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ. 10,778 కోట్లు, రుణ పత్రాల మార్కెట్లో రూ. 8,870 కోట్లు పెట్టుబడి చేసినట్లు సెబీ తాజా గణాంకాల్లో వెల్లడైంది. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు లాభపడి 28,046.66 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 8,389.90 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఆయిల్, గ్యాస్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. -
స్వల్ప నష్టాల్లో ప్రధాన సూచీలు
ముంబై: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు క్షీణించి 27940, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 8357 వద్ద ముగిసాయి. హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, లుపిన్, టెక్ మహీంద్ర కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. బీపీసీఎల్, కెయిర్న్ ఇండియా, ఎన్ ఎమ్ డీసీ, సెసాగోవా స్టెరిలైట్, టాటా పవర్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా యూరప్ మార్కెట్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. -
నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్, నిఫ్టీ!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం ట్రేడింగ్ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో 27975 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 8362 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ధిక గణాంకాల్లో సానుకూల ప్రభావం, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో, విద్యుత్, కాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లు లాభపడటంతో.. ఆరంభంలో సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 28098 పాయింట్లను తాకింది. సిప్లా, సన్ ఫార్మా, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, లార్సెన్ లాభపడగా, బీపీసీఎల్, ఎన్ ఎమ్ డీసీ, కెయిర్న్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఐడీఎఫ్ సీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
లాభాలతో ముగిసిన సెన్సెక్స్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్లు లాభపడి 27,910 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 8,363 పాయింట్లు వద్ద ముగిసింది. -
నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 27837, నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 8327 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో .. నిఫ్టీ ఆరంభం 8337, గరిష్టం 8383, కనిష్టం 8304 పాయింట్లను, సెన్సెక్స్ 27919 ప్రారంభమై 28027 గరిష్టం, కనిష్టం 27764 పాయింట్లను తాకింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఐటీసీ, సన్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోల్ ఇండియా, బీహెచ్ఈఎల్ కంపెనీలు స్వల్ప లాభాల్లో, ఓఎన్ జీసీ, జిందాల్ స్టీల్, లార్సెన్, టాటా మోటార్స్, హిండాల్కో కంపెనీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
బుల్ జోరు, సెన్సెక్స్ న్యూ హై!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు కోనసాగుతోంది. సోమవారం ఆరంభంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 28027 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల వృద్ధితో 8383 పాయింట్లను నమోదు చేసుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల ప్రభావం, బ్లూచిప్ కంపెనీల షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ పరుగు కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హ్యాంగ్ సెంగ్ 389 పాయింట్లు, తైవాన్ 133 పాయింట్ల లాభాన్ని నమోదు చేసుకున్నాయి. సన్ ఫార్మా, ఐటీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లార్సెన్, జిందాల్ స్టీల్, సిప్లా, హిండాల్కో, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
బుల్ పరుగు వెనుక రహస్యమేంటి!
దేశ యువతకే కాదు.. భారత స్టాక్ మార్కెట్ వ్యవస్థకు నరేంద్రమోడీ ఉత్తేజాన్ని అందించారు. ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందు స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ.. నిస్తేజంగా ఉండేవి. ఎప్పడైతే నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారో.. మోడీతోపాటు సూచీలు కూడా పరుగులు పెట్టాయి. నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టాక కూడా ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పరుగు ఆపలేదు. తాజాగా ప్రధాన సూచీలు రికార్డులను తిరగరాస్తూ.. సరికొత్త గరిష్టస్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 28 వేల, నిఫ్టీ 8350 మార్కును తాకాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అంటే అక్టోబర్ 16 తేది నుంచి కేవలం 12 సెషన్స్ లో 2 వేల పాయింట్ల ర్యాలీని కొనసాగించింది. 2014 సంవత్సరాంతానికి సెన్సెక్స్ 30 వేల మార్కును చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009 తర్వాత ఇంత వేగంగా బుల్ ర్యాలీ కొనసాగడం ఇదే ప్రథమం. స్టాక్ మార్కెట్ లో బుల్ మార్కెట్ ర్యాలీ కొనసాగడం వెనుక కారణాలు పరిశీలిద్దాం! *సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీకి 30 శాతం మేరకు విదేశీ నిధుల ప్రవాహమే కారణమని అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 30 నాటికి 294 బిలియన్ల డాలర్ల మేరకు నిధుల ప్రవాహం కొనసాగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత దేశ వ్యాపార రంగ చరిత్రలో విదేశీ ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. ' అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గముఖం పెట్టడం కూడా సూచీలు పరుగు పెట్టడానికి కారణమని తెలుస్తోంది. క్రూడ్ ధరలు క్షీణించడంతో డీజీల్, పెట్రోల్ ధరలు తగ్గి ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి రావోచ్చని అంచనా వేస్తున్నారు. ' వచ్చే త్రైమాసిక పరపతి ద్రవ్య సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే ఊహాగానాలతో బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో సానుకూలత కనిపించింది. దాంతో బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. * ఈ సంవత్సరం 84 వేల కోట్ల రూపాయల మేరకు భారతీయ ఈక్వీటిల వాటాలను కొనుగోలు చేసినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. -
28 వేల మార్కును తాకిన సెన్సెక్స్!
భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీలు మరో నూతన గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. తొలిసారి సెన్సెక్స్ 28 వేల మార్కును, నిఫ్టీ 8363 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకాయి. విదేశీ మదుపుదారుల నిధుల ప్రవాహం కొనసాగడం, కార్పోరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల సానుకూలంగా ఉండటమనే అంశాలు మార్కెట్ బుల్ ర్యాలీకి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 27907 పాయింట్ల వద్ద ఆరంభమై 28006 పాయింట్ల గరిష్టాన్ని నమోదు చేసుకోగా, నిఫ్టీ 8351 వద్ద ఆరంభమై 8363 పాయింట్ల గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 98 పాయింట్ల వృద్ధితో 27856 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 8354 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, ఎస్ బీఐ, యాక్సీస్ బ్యాంక్, జీ ఎంటర్ టైన్ మెంట్, సన్ ఫార్మా కంపెనీలు లాభాల్ని, కెయిర్న్ ఇండియా, సెసా గోవా, ఎన్ ఎమ్ డీసీ, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్ కంపెనీలు నష్ట్రాల్ని నమోదు చేసుకున్నాయి. Follow @sakshinews -
లాభాలతో సెన్సెక్స్ ప్రారంభం!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 27943 పాయింట్ల, నిఫ్టీ 8348 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ఆరంభంలో నమోదు చేసుకున్న లాభాలను నిలబెట్టుకోలేక వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, జిందాల్ స్టీల్, జీ ఎంటర్ టైన్ మెంట్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ కంపెనీలు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డీఎల్ఎఫ్, ఎం అండ్ ఎం, గెయిల్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
నూతన గరిష్టస్థాయికి సెన్సెక్స్!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలత, కాపిటల్ గూడ్స్, ఆటో, బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ కంపెనీల షేర్లలో భారీ కొనుగోళ్ల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు రికార్డు స్థాయి లాభాలతో ముగిసాయి. శుక్రవారం నాటి మార్కెట్ లో 27439 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్...ఇంట్రాడే ట్రేడింగ్ లో 27894 గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. చివరకు 519 పాయింట్ల లాభంతో 27865 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 153 పాయింట్ల వృద్ధితో 8922 పాయింట్ల క్లోజైంది. సూచీ ఆథారిత కంపెనీ షేర్లలో ఐడీఎఫ్ సీ అత్యధికంగా 5.43 శాతం, హెచ్ డీఎఫ్ సీ, 3.87, లార్సెన్ 3.91, గెయిల్ 3.55, టాటా పవర్ 3.53 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. భారతీ ఎయిర్ టెల్, జీ ఎంటర్ టైన్ మెంట్ స్వల్ప నష్టాలతో ముగిసాయి. -
సెన్సెక్స్ రికార్డు ముగింపు!
-
సెన్సెక్స్ రికార్డు ముగింపు!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం రికార్డుస్థాయి లాభాలతో ముగిసాయి. గురువారం నాటి మార్కెట్ లో ప్రధాన సూచీలు నిఫ్టీ 8180 పాయింట్ల, సెన్సెక్స్ 27358 పాయింట్ల ఇంట్రాడే లైఫ్ టైమ్ హైని తాకాయి. మార్కెట్ ముగింపులో సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 27346 పాయింట్ల వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల వృద్ధితో 8169 వద్ద క్లోజయ్యాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 5 శాతం, హెచ్ సీఎల్ టెక్ 4, టెక్ మహీంద్ర 3, రిలయన్స్, ఇండస్ ఇండియా బ్యాంక్ లు 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. కెయిర్న్ ఇండియా, అంబుజా సిమెంట్స్, సిప్లా, సెసా స్టెరిలైట్, ఎం అండ్ ఎం కంపెనీల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. -
సెన్సెక్స్ లైఫ్ టైమ్ హై!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీ సెన్సెక్స్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్ డెరెవేటివ్ కాంట్రాక్టు ముగింపు రోజున సెన్సెక్స్ జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. 260 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ 27358 పాయింట్లను తాకింది. భారత ఆర్ధిక రంగంలో మోడీ సర్కార్ మరిన్ని సంస్కరణలు చేపట్టవచ్చనే వార్తలు, ఎఫ్ డీఐ నిబంధనల్ని సరళీకృతం చేస్తారనే అంశాలు మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి మార్కెట్ లో ఇన్పోసిస్,టీసీఎస్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ కంపెనీలు షేర్లు సెన్సెక్స్ బలపడటానికి ఊతమిచ్చాయి. -
కొనసాగుతున్న సెన్సెక్స్ జోరు!
ముంబై: గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, బ్లూచిప్ కంపెనీ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో కొనసాగుతున్నయి. డెరెవేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలను ఆర్జించాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 212 పాయింట్ల లాభంతో 27310, నిఫ్టీ 65 పాయింట్ల వృద్ధితో 8155 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 23 తేది తర్వాత మళ్లీ నిఫ్టీ 8100 మార్కుపైన ట్రేడ్ అవ్వడం ఇదే తొలిసారి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టెక్ మహీంద్ర, హెచ్ సీఎల్ టెక్ 4 శాతానికి పైగా లాభపడగా, డీఎల్ఎఫ్ 3 శాతం, ఇన్ఫోసిస్, టీసీఎస్ 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. కెయిర్న్ ఇండియా, ఎంఅండ్ఎం, టాటా పవర్, బీహెచ్ఈఎల్, లుపిన్ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఐదు వారాల గరిష్టానికి సెన్సెక్స్!
ముంబై: యూఎస్ ఫెడరల్ రిజర్వు పాలసీ సమావేశానికి ముందు గ్లోబల్ మార్కెట్ల సానుకూల స్పందన, మరికొన్ని సంస్కరణలు మోడీ సర్కారు చేపట్టవచ్చనే వార్తల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు కూడా పరుగులు పెట్టాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్ ఐదు వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. బుధవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 217 పాయింట్ల లాభంతో 27098 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల వృద్ధితో 8090 పాయింట్ల వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో హిండాల్కో, డీఎల్ఎఫ్ అత్యధికంగా 6 శాతానికి పైగా, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ 4 శాతానికి పైగా, టాటా మోటార్స్ 3.45 శాతం లాభపడ్డాయి. పీఎన్ బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఎన్ టీపీసీ, సన్ ఫార్మాలు స్వల్పంగా నష్టపోయాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు
ముంబై: వడ్డీ రేట్లలో కోత విధింపు, కార్పోరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాల్లో సానుకూలత, ఇతర సానుకూల అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 128 పాయింట్ల లాభంతో 26880 పాయింట్ల వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల వృద్దితో 8037 పాయింట్ల వద్ద ముగిసింది. సన్ ఫార్మా, సిప్లా, టాటా పవర్, బీపీసీఎల్, ఎస్ బీఐ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకోగా, లుపిన్ భారతీ ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్, జిందాల్ స్టీల్, పీఎన్ బీ కంపెనీలు స్వల్ప నష్టాలకు లోనయ్యాయి. -
స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ స్పందన, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ అంశాల ప్రభావంతో భారత స్తాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ క్రితం ముగింపుకు 98 పాయింట్లు కో్ల్పోయి 26752 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు క్షీణించి 7991 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో జిందాల్ స్టీల్, డీఎల్ఎఫ్ సుమారు 8 శాతం, హెచ్ యూఎల్ 5 శాతం, కెయిర్న్ ఇండియా 4 శాతం, టాటా మోటార్స్ 2.32 శాతం నష్టపోయాయి. బీహెచ్ఈఎల్ అత్యధికంగా 5 శాతం, కొటాక్ మహీంద్ర, ఇండస్ ఇండియా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అంబూజా సిమెంట్స్ స్వల్పంగా లాభపడ్డాయి. -
ఐటీ కంపెనీల షేర్లు విలవిల
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో ఐటీ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. మార్కెట్ అంచనాలను అధిగమించలేకపోయిన త్రైమాసిక ఫలితాల కారణంగా టీసీఎస్ నష్టాలకు లోనైంది. అలాగే టీసీఎస్ తో వీలిన వార్తలతో సీఎంసీ కంపెనీ షేరు భారీగా పతనమైంది. టీసీఎస్ 9 శాతానికి పైగా నష్టంతో 236 రూపాయల నష్టంతో 2441 వద్ద, సీఎంసీ 16 శాతం క్షీణించి 1832 రూపాయల వద్ద ముగిసాయి. టీసీఎస్ లో సీఎంసీ విలీనానికి రెండు కంపెనీల డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 1 : 1.26 నిష్పత్తి లేదా 100 సీఎంసీ షేర్లకు 79 టీసీఎస్ షేర్లు ఇవ్వడానికి ఇరు కంపెనీలు అంగీకరించారు. ఐటీ రంగ కంపెనీల షేర్లలో హెచ్ సీఎల్ టెక్ సుమారు 9 శాతంతో 150 రూపాయలు కోల్పోయింది. -
భారీ నష్టాల్లో సెన్సెక్స్
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం భారీ నష్టాలతో ముగిసాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో మొబైల్స్, కాపిటల్ గూడ్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ 350 పాయింట్ల నష్టంతో 25999 పాయింట్ల వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల పతనంతో 7748 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీల్లో అల్ట్రా టెక్ సిమెంట్స్ అత్యధికంగా 6.06 శాతం, హిండాల్కో 5.70, గ్రాసీం 4.86, ఎం అండ్ ఎం 4.31, సెసా గోవా 4.17 శాతం నష్టపోయాయి. డీఎల్ఎఫ్ 5 శాతం లాభపడగా, ఎన్ ఎమ్ డీసీ, ఐటీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు స్వల్ప లాభాల్ని నమోదు చేసుకున్నాయి. -
స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం స్వల్పంగా నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 34 పాయింట్ల నష్టంతో 26349 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు క్షీణించి 7854 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భెల్, బజాజ్ ఆటో, యాక్సీస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా పవర్ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్, బీపీసీఎల్, కెయిర్న్ ఇండియా, హెచ్ సీఎల్ టెక్, టాటా పవర్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
నష్టాల నుంచి తీరుకున్న సెన్సెక్స్!
హైదరాబాద్: ఆయిల్, గ్యాస్ కాపిటల్ గూడ్స్ రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాలు జరగడంతో ఓ దశలో భారీ నష్టాలకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు చివరకు లాభాలతో ముగిసాయి. ఓ దశలో సెన్సెక్స్ 177 పాయింట్ల నష్టానికి లోనైంది. మధ్యాహ్నం సమయానికి జోరందుకున్న సెన్సెక్స్... మార్కెట్ ముగింపు సమాయానికి 86 పాయింట్ల లాభంతో 26384 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల వృద్దితో 7884 వద్ద ముగిసింది. టాటా పవర్, ఎన్ ఎమ్ డీసీ, పీఎన్ బీ, టాటా స్టీల్, యాక్సీస్ బ్యాంక్ కంపెనీలు 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్ అత్యధికంగా 3.77 శాతం, ఎంఅండ్ఎం, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం, మెటల్, ఆటోమోబైల్, బ్యాంకు రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. శుక్రవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 339 పాయింట్ల నష్టంతో 26297 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు క్షీణించి 7859 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఇన్ఫోసిస్ అత్యధికంగా 6.63 శాతం, హెచ్ సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, భెల్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. జిందాల్ స్టీల్, టాటా మోటార్స్, ఎన్ ఎమ్ డీసీ కంపెనీల షేర్లు 5 శాతానికి పైగా, హిండాల్కో, సెసా గోవా సుమారు 5 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
ఇన్ఫోసిస్ కళకళ.. సెన్సెక్స్ వెలవెల!
2014-15 ఆర్ధిక సంవత్సరంలో రెండవ త్రైమాసిక (జూలై-సెప్టెంబర్) ఫలితాల్లో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ అంచనాలు అధిగమించింది. క్యూ2 ఫలితాల్లో 3096 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసుకుంది. గత వార్షిక ఆదాయంతో పోల్చుకుంటే వృద్దిరేటు 28.6 శాతం పెరిగింది. దాంతో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్ఫోసిస్ కంపెనీ షేరు విలువ భారీగా పెరిగింది. గురువారం నాటి మార్కెట్ లో ఇన్ఫోసిస్ 6.32 శాతం లాభంతో 3877 వద్ద ట్రేడ్ అవుతోంది. సిటీ గ్రూప్ డౌన్ రేటింగ్ తో గత కొద్దిరోజులుగా సర్దుబాటు గురైన ఇన్పోసిస్ తాజా ఫలితాలతో భారీ లాభాలను ఇన్వెస్టర్లు పంచుతోంది. అయితే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 218 పాయింట్లు క్షీణించి 26419 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల పతనంతో 7897 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లలో నాస్ డాక్ 90 పాయింట్లు కోల్పోగా, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. -
మూడో రోజు కూడా నష్టాల్లోనే...
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 25 పాయింట్ల నష్టంతో 26246 పాయింట్ల వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు క్షీణించి 7842 వద్ద ముగిసాయి. సూచీ ఆధారి కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 5.12 శాతం లాభపడగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఓఎన్ జీసీ కంపెనీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, విప్రో కంపెనీలు 4 నుంచి 5 శాతం మేరకు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, మెటల్, హెల్త్ కేర్, కాపిటల్ గూడ్స్ రంగాల కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 1.11 శాతంతో 296 పాయింట్లు నష్టపోయి 26271 పాయింట్ల వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల పతనంతో 7852 పాయింట్ల వద్ద ముగిసాయి. ప్రధాన సూచీలలో ఎన్ టీపీసీ, గెయిల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, విప్రో, టాటా మోటార్స్ స్వల్ప లాభాల్ని నమోదు చేసుకోగా, డీఎల్ఎఫ్, సెసాగోవా స్టెరిలైట్, జిందాల్ స్టీల్, హిండాల్కో, కెయిర్న్ ఇండియా కంపెనీలు 4 శాతం నుంచి 6 శాతం మేరకు నష్టాలతో ముగిసాయి. -
బక్రీద్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు!
న్యూఢిల్లీ: ఈద్ ఉల్ జుహా(బక్రీద్) పండగ సందర్భంగా హోల్ సేల్ కమాడిటి మార్కెట్లకు, మెటల్, స్టీల్ సోమవారం సెలవు ప్రకటించారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఫారెక్స్, మనీ, కమాడిటి ఫ్యూచర్ (ఎన్ సీడీఎక్స్, ఎంసీఎక్స్) మార్కెట్ల కూడా హాలీడే ప్రకటించారు. అయితే బులియన్ మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి. స్టాక్ మార్కెట్ లో అక్టోబర్ 2, దసరా, వారాంతపు సెలవు దినాల కారణంగా వరుసగా సెలవు దినాల్ని పాటిస్తోంది. మంగళవారం మార్కెట్ సూచీలన్ని తమ వ్యాపారా లావాదేవిలు ప్రారంభమవుతాయి. -
స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో్ సెన్సెక్స్ 62 పాయింట్లు క్షీణించి 26567 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 7945 పాయింట్ల వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో విప్రో అత్యధికంగా 3.18 శాతం, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీలు సుమారు 2 శాతం లాభపడ్డాయి. ఇండస్ ఇండియా బ్యాంక్, మారుతి సుజుకీ, టాటా పవర్, కెయిర్న్ ఇండియా, గెయిల్ కంపెనీలు సుమారు మూడు శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
ఒడిదుడుకులతో స్వల్ప లాభం!
రిజర్వు బ్యాంక్ పరపతి సమీక్ష నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఒడిదుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 26610 పాయింట్ల వద్ద ప్రారంభమై.. ఓ దశలో 26851 పాయింట్ల ఇంట్రాడే గరిష్ట స్థాయిని, 26481 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. అలాగే మరో ప్రధాన సూచీ నిఫ్టీ 7948 వద్ద ఆరంభమై 8030-7923 పాయింట్ల వద్ద కదలాడాయి. చివరకు సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 26630 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల 7964 వద్ద ముగిసాయి. జీఎంటర్ టైన్ మెంట్, బీపీసీఎల్, సన్ ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ, బజాజ్ ఆటో కంపెనీలు రెండు శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డిఎల్ఎఫ్ అత్యధికంగా 4.71 శాతం నష్టపోగా, భెల్, పరవ్ గ్రిడ్ కార్పోరేషన్, ఏసీసీ, జిందాల్ స్టీల్ కంపెనీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవు: ఆర్ బీఐ
ముంబై: రెండు నెలలకోసారి నిర్వహించే పరపతి ద్రవ్య సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. స్వల్ప కాలిక అవసరాల కోసం తీసుకున్న రుణాలపై బ్యాంకుల రిజర్వు బ్యాంకుకు చెల్లించే రెపో రేటు 8 శాతం, వాణిజ్య బ్యాంకులు డిపాటిజ్ చేసే స్వల్పకాలిక పొదుపుకు చెల్లించే రివర్స్ రెపోరేటు 7 శాతం, క్యాష్ రిజర్వు రేషియో (సీఆర్ఆర్) 4 శాతం రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఆర్ బీఐ నిర్ణయం తీసుకుంది. స్టాట్యూటరి లిక్విడిటి రేషియో(ఎస్ఎల్ఆర్) ను 22 శాతం, ఎన్ డీటీఎల్ లలో కూడా ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ అధికారులు నిర్ణయించారు. రిజర్వు బ్యాంకు నిర్ణయంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సానుకూలంగా స్పందించాయి. -
లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
ముంబై: పరపతి సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లలో మార్పులు లేకుండా రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయానికి భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సానుకూలంగా స్పందించాయి. ప్రారంభంలో స్వల్ప నష్టాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు మధ్యాహ్న సమయానికి లాభాల్ని నమోదు చేసుకున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి సెన్సెక్స్ 210 పాయింట్ల వృద్ధితో 268080 పాయింట్ల వద్ద, నిఫ్టీ 63 పాయింట్ల పెరుగుదలతో 8022 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జీఎంటర్ టైన్ మెంట్, హెచ్ డీఎఫ్ సీ, కోటాక్ మహీంద్ర, సన్ ఫార్మా, లార్సెన్ కంపెనీలు 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. యాక్సీస్ బ్యాంక్, గ్రాసీం, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్లో వ్యాపార కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాయి. -
లాభాలతో ముగిసిన సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. గత మూడు రోజులుగా నష్టాలకు గురవుతున్న సూచీలు లాభాలతో ముగియడం ఇన్వెస్టర్లకు కొంత ఊరట కలిగించింది. బ్లూచిప్ కంపెనీల షేర్లు ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హిండాల్కో, టాటా స్టీల్, సన్ ఫార్మా కంపెనీలు షేర్లు లాభాల బాట పట్టడంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 26626 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల వృద్ధితో 7968 వద్ద ముగిసాయి. ప్రధాన సూచీలు హిండాల్కో, జిందాల్ స్టీల్, డీఎల్ఎఫ్, ఎన్ ఎమ్ డీసీ, సన్ ఫార్మా కంపెనీల షేర్లు 4 శాతానికి పైగా లాభాలతో ముగిసాయి. డాక్టర్ రెడ్డీస్, గెయిల్, హెచ్ డీఎఫ్ సీ, ఐటీసీ, హీరో మోటోకార్ప్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు!
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు!
బ్యాంకింగ్, మెటల్, ఆయిల్, గ్యాస్, ఆటో, కాపిటల్ గూడ్స్ రంగాల కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 276 పాయింట్ల నష్టంతో 26468 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో 7911 వద్ద ముగిసాయి. తాజా పతనంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక నెల కనిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. ఐటీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా 7.70 శాతం జిందాల్ స్టీల్ నష్టపోగా, పీఎన్ బీ 6.15, ఎన్ ఎమ్ డీసీ 5.45, యాక్సీస్ బ్యాంక్ 4.82, హిండాల్కో 4.45 శాతం పతనమయ్యాయి. డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, గెయిల్, జీ ఎంటర్ టైన్ మెంట్, సిప్లాలు సుమారు 2 శాతం లాభపడ్డాయి. -
నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీలు బుధవారం నాటి ట్రేడింగ్ లో నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ 31 పాయింట్ల పతనంతో 26744 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 8002 వద్ద ముగిసాయి. హెచ్ యూఎల్, కోల్ ఇండియా, విప్రో, ఐటీసీ, ఇన్పోసిస్ కంపెనీలు లాభాలతో కొనసాగుతున్నాయి. పీఎన్ బీ, బీహెచ్ ఈఎల్, బీపీసీఎల్, టాటా పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీలు రెండు శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
అమ్మకాల ఒత్తిడిలో ప్రధాన సూచీలు
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీలు బుధవారం నాటి ట్రేడింగ్ లో ఒడిదుడుకులతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ మధ్యాహ్నం సమయానికి 11 పాయింట్ల పతనంతో 26764 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 8009 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హెచ్ యూఎల్, కోల్ ఇండియా, విప్రో, ఐటీసీ, ఇన్పోసిస్ కంపెనీలు లాభాలతో కొనసాగుతున్నాయి. పీఎన్ బీ, బీహెచ్ ఈఎల్, బీపీసీఎల్, టాటా పవర్, బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీలు రెండు శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
సిరియా ఎఫెక్ట్: భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: సిరియాపై అమెరికా దాడులు, యూరప్ మార్కెట్లలో ప్రతికూలత తదితర అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 1.6 శాతం నష్టంతో 431 పాయింట్లు కోల్పోయి 26775 వద్ద, నిఫ్టీ 1.6 శాతంతో 128 పాయింట్లు క్షీణించి 8017 వద్ద ముగిసాయి. మంగళవారం మార్కెట్ లో 2131 కంపెనీల షేర్లు క్షీణించగా, 886 కంపెనీల షేర్లు లాభాల్నినమోదు చేసుకున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 6.72 శాతం నష్టపోగా, సిప్లా, టాటా మోటార్స్, హిండాల్కో, టాటా స్టీల్ కంపెనీలు 3 శాతానికి పైగా నష్టాల్నినమోదు చేసుకున్నాయి. హెచ్ సీఎల్ టెక్, ఎన్ టీపీసీ, విప్రో, టెక్ మహీంద్ర, హెచ్ యూఎల్ కంపెనీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. -
నష్టాల నుంచి లాభాల్లోకి...
ముంబై: ఇంట్రాడే ట్రేడింగ్ లో ఊగిసలాటకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. సోమవారం ట్రేడింగ్ లో నష్టాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు లాభాల్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 116 పాయింట్ల లాభంతో 27206 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల వృద్దితో 8146 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. టాటా మోటార్స్, ఓఎన్ జీసీ, ఐటీసీ, బీపీసీఎల్, ఇండస్ ఇండియా బ్యాంక్ లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, ఐడీఎఫ్ సీ, భెల్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
నష్టాల్లో సెన్సెక్స్ , నిఫ్టీ!
బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 121 పాయింట్ల నష్టంతో 26673 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పతనంతో 8076 పాయింట్ల వద్ద మధ్యాహ్నం సమయానికి ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, ఓఎన్ జీసీ, హీరో మోటోకార్ప్, బీపీసీఎల్, ఐటీసీ కంపెనీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టాటా స్టీల్, కొటాక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ 2 శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
స్వల్ప నష్టాల్లో ప్రధాన సూచీలు
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావం తదితర అంశాలు ప్రభావంతో సెన్సెక్స్ 61 పాయింట్ల నష్టంతో 26995 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 8085 వద్ద ముగిసాయి. సెన్సెక్స్ 27 మార్కు దిగువన ముగియడం గమనార్హం. ఐడీఎఫ్ సీ, ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, భెల్, హీరో మోటో కార్ప్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, సన్ ఫార్మా, ఓఎన్ జీసీ, కోల్ ఇండియా, ఎన్ ఎమ్ డీసీ, లుపిన్ లు నష్టాలతో ముగిసాయి. -
నష్టాలతో కొనసాగుతున్న సెన్సెక్స్!
ముంబై: గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, హెల్త్ కేర్, మెటల్, ఆటో రంగాల కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్ల నష్టంతో 26978, నిఫ్టీ 20 పాయింట్లు క్షీణించి 8075 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఐడీఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ, పీఎన్ బీ కంపెనీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఓఎన్ జీసీ, ఎన్ ఎమ్ డీసీ, లుపిన్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
సెన్సెక్స్ కు 208 పాయింట్ల నష్టం!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్, 208 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయాయి. ఈ మొత్తంలో ప్రధాన సూచీలు నష్టపోవడం గత నెల రోజుల వ్యవధిలో ఇదే తొలిసారి. సెన్సెక్స్ 27057 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8094 వద్ద ముగిసాయి. ఐడీఎఫ్ సీ, డీఎల్ఎఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, సెసా గోవా కంపెనీ షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. కెయిర్న్ ఇండియా, హీరో మోటోకార్ప్, బీపీసీఎల్, ఐటీసీ, కోల్ ఇండియా నష్టాలతో ముగిసాయి. -
నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: ఆయిల్, గ్యాస్ కంపెనీ షేర్లు పతనం, గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం తదితర అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఐడీఎఫ్ సీ, డీఎల్ఎఫ్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, టాటా పవర్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కెయిర్న్ ఇండియా, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఎం అండ్ఎం కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. మధ్యాహ్నం నమోదు చేసుకున్న నష్టాల నుంచి తేరుకుంది. చివరకు సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 27265 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8152 వద్ద ముగిసాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, సిప్లా, కోల్ ఇండియా, టాటా మోటర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీలు లాభాల్లో, టెక్ మహీంద్ర, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్, డీఎల్ఎఫ్ కంపెనీలు నష్టాల్లో ముగిసాయి. -
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్!
ముంబై: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నేటి ట్రేడింగ్ లో 27316 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. 27202 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో 27225 పాయింట్ల వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 8138 వద్ద ట్రేడ్ అవుతోంది. సిప్లా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్, టాటా పవర్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్ర, డీఎల్ఎఫ్, హెచ్ సీఎల్ టెక్, ఇన్పోసిస్, విప్రో కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
సెన్సెక్స్ మరో ధమాకా!
ముంబై: స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్ లో సెప్టెంబర్ 3 తేదిన నమోదు చేసిన జీవితకాలపు గరిష్టస్థాయి 27225 పాయింట్లని అధిగమించింది. తాజాగా సెన్సెక్స్ 27354 పాయింట్లను తాకి నూతన గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. ఐటీ, మెటల్, హెల్త్ కేర్, ఆటో, కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీ షేర్లు సెన్సెక్స్ కు పెరుగుదలకు మద్దతిచ్చాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 27354 గరిష్ట స్థాయిని, 27026 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 8173 పాయింట్ల రికార్డుస్థాయి వద్ద ముగిసింది. ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా 4.47 శాతం లాభపడగా, హిండాల్కో, అంబుజా సిమెంట్స్, ఓఎన్ జీసీ, గ్రాసీం రెండు శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఎన్ టీపీసీ, ఎన్ఎమ్ డీసీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎం అండ్ ఎం, టాటా పవర్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
మరో నూతన గరిష్టస్థాయికి సెన్సెక్స్!
ముంబై: బ్యాంకింగ్, హెల్త్ కేర్, కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నూతన గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. సోమవారం నాటి మధ్యాహ్నం ట్రేడింగ్ సమయానికి సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 27200 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల వృద్దితో 8140 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 27,248 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా 4.43 శాతం, గ్రాసీం, అంబుజా సిమెంట్స్, హిండాల్కో, జిందాల్ స్టీల్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పోరేషన్, యునైటెడ్ స్పిరిట్స్, కోటాక్ మహీంద్ర, మారుతి సుజుకీ, ఎం అండ్ ఎం నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
నష్టాలతో ముగిసిన సెన్సెక్స్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఎఫ్ఎమ్ సీజీ, బ్యాంకింగ్ రంగాల కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొనగా, కాపిటల్ గూడ్స్, ఐటీ, హెల్త్ కేర్, మెటల్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్ 54 పాయింట్ల పతనంతో 27031 పాయింట్ల వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 8086 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఎన్ఎమ్ డీసీ, డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్, ఏషియన్ పెయింట్స్, కొటాక్ మహీంద్ర కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. యునైటెడ్ స్పిరిట్, హెచ్ డీఎఫ్ సీ, కోల్ ఇండియా, హీరో మోటో కార్ప్, భెల్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్!
ముంబై: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 27085 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 8095 వద్ద ముగిసాయి. బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, ఎన్ టీపీసీ, హెచ్ డీఎఫ్ సీ, పవర్ గ్రిడ్ కార్పో కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్ 8 శాతానికి పైగా, భెల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్, హిండాల్కో కంపెనీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. -
నష్టాలతో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!
హైదరాబాద్: రియాల్టీ, కాపిటల్ గూడ్స్, ఇన్ ఫ్రా, ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాలు జరగడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ ఒడిగట్టడం, ఆసియా మార్కెట్లలో ప్రతికూల స్పందన, వివిధ అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 99 పాయింట్ల నష్టంతో 27040 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు క్షీణించి 8079 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. లుపిన్, సిప్లా, హెచ్ యూఎల్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, డీఎల్ఎఫ్ అత్యధికంగా 7 శాతానికి పైగా నష్టపోగా, జిందాల్ స్టీల్, భెల్, హిండాల్కో, పీఎన్ బీ కంపెనీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
8100 పైన ముగిసిన నిఫ్టీ!
ఐటీ, మీడియా, టెక్నాలజీ, ఆటో రంగాల కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మరోసారి జీవితకాలపు గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ప్రధాన సూచీల్లో నిఫ్టీ 8100 పైన ముగియడం ఇదే తొలిసారి. బుధవారం నాటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 120 పాయింట్ల వృద్ధితో 27139 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8114 వద్ద ముగిసింది. కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, టీసీఎస్ కంపెనీలు సుమారు మూడు శాతం లాభపడగా, గెయిల్, ఓఎన్ జీసీ, ఐటీసీ, బజాజ్ ఆటో, భెల్ కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకుంది. -
జీవితకాలపు గరిష్ట స్థాయికి సెన్సెక్స్!
ఐటీ, మీడియా, టెక్నాలజీ, ఆటో రంగాల కంపెనీల షేర్లు రాణించడంతో భారత ప్రధాన సూచీలు మరో జీవితకాలపు గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 27198 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంతో 27139 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల పెరిగి 8115 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్ టెల్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్ఎమ్ డీసీ లాభాల్లో, గెయిల్, జిందాల్ స్టీల్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఐడీఎఫ్ సీ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు
-
సెన్సెక్స్ రికార్డు ముగింపు!
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో పరుగులు పెట్టాయి. గత కొద్ది రోజులుగా బుల్ రన్ కొనసాగిస్తున్న ప్రధాన సూచీలు సోమవారం రోజున భారీగా లాభపడటమే కాకుండా.. జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 229 పాయింట్లతో 26987 పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్లతో 8027 పాయింట్ల వద్ద ముగిసాయి. జిందాల్ స్టీల్ అత్యధికంగా 6.44 శాతం లాభపడగా, హీరో మోటో కార్ప్, మారుతి సుజుకి, టాటా పవర్, గెయిల్ కంపెనీలు 4శాతానికి పైగా లాభపడ్డాయి. సన్ ఫార్మ, హెచ్ డీఎఫ్ సీ, ఐటీసీ, భెల్, టాటా మోటార్స్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
ఏడో రోజు కూడా లాభాల్లోనే
స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఏడో రోజు కూడా లాభాలతో ముగిసాయి. ఆగస్టు నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున సెన్సెక్స్ 78 పాయింట్ల లాభంతో 26638 పాయింట్ల, నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో 7954 పాయింట్ల వద్ద ముగిసాయి. ప్రధాన సూచీలు జీవితకాలపు గరిష్ట స్థాయి వద్ద ముగియడం విశేషం. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భెల్ అత్యధికంగా 5 శాతం లాభపడగా, బీపీసీఎల్, ఐడీఎఫ్ సీ, గెయిల్, ఓఎన్ జీసీ లు స్వలంగా లాభపడ్డాయి. జిందాల్ స్టీల్ సుమారు 5 శాతం నష్టపోగా, డీఎల్ఎఫ్ 3 శాతం, టాటా పవర్, టాటాస్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
గరిష్ట స్థాయి వద్ద సెన్సెక్స్, నిఫ్టీల ట్రేడింగ్!
ముంబై: ఆగస్టు నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సరికొత్త జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,674 పాయింట్ల, నిఫ్టీ 7,967 పాయింట్ల లైఫ్ టైమ్ హైని తాకాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 26624 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల పెరిగి 7954 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, గెయిల్, ఐడీఎఫ్ సీ, టాటా మోటార్స్ కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్ బీ, ఎస్ బీఐ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
సెన్సెక్స్ 117 పాయింట్ల లాభం
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 26560 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల వృద్దితో 7936 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,599-26,492 పాయింట్ల మధ్య, నిఫ్టీ 7,946-7,916 పాయింట్ల మధ్య కదలాడింది. 630 కోట్ల రూపాయల జరిమానా సుప్రీంకోర్టు విధించడంతో డీఎల్ఎఫ్ 4.57 శాతం నష్టపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో జిందాల్ స్టీల్, హెచ్ సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్ జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. భెల్, సెసా స్టెరిలైట్, ఐడీఎఫ్ సీ, కొటాక్ మహీంద్ర కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
స్వల్ప లాభాల్లో సెన్సెక్స్!
ఆటో రంగ కంపెనీల షేర్లు లాభాల పట్టడం, గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 111 పాయింట్ల లాభంతో 26554, నిఫ్టీ 29 పాయింట్ల వృద్దితో 7933 వద్ద కొనసాగుతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో 26599 పాయింట్ల, నిఫ్టీ 7,946 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో హెచ్ సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్ జీసీ, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్ టీపీసీ, భెల్, కొటాక్ మహీంద్ర, సెసా స్టెర్ లైట్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
రికార్డుస్థాయి నుంచి జారిన సెన్సెక్స్!
హైదరాబాద్: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు రికార్డు గరిష్ట స్థాయి నుంచి కిందికి జారాయి. ఆరంభంలో సాధించిన లాభాలు మార్కెట్ ముగింపు కల్లా ఆవిరిపోయాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల స్వల్ప లాభంతో 26437 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 7906 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,630-26,401, నిఫ్టీ 7968-7897 పాయింట్ల మధ్య కదలాడింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టీసీఎస్, భెల్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, మారుతి సుజికీ, హెచ్ యూఎల్ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. జిందాల్ స్టీల్, హిండాల్కో, టాటా స్టీల్, సెసా స్టెర్ లైట్, టాటా పవర్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిసాయి. -
నూతన గరిష్ట స్థాయికి సెన్సెక్స్!
హైదరాబాద్: ఆసియా మార్కెట్లలో సానుకూలత, ఫండ్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం, బ్యాంకింగ్, ఆయిల్,గ్యాస్, హెల్త్ రంగాల కంపెనీల షేర్లు లాభాల పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నూతన జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 172 పాయింట్ల లాభంతో 26696 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల వృద్ధి 7954 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సూచీ ఆధారిత కంపెనీల షేర్లలో భెల్, టీసీఎస్, కొటాక్ మహీంద్ర, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జిందాల్ స్టీల్, హిండాల్కో, కెయిర్న్ ఇండియా, సెసా స్టెరిలైట్, అల్ట్రా టెక్ సిమెంట్స్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
తొలిసారి 7900 మార్కుపైన నిఫ్టీ
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం ట్రేడింగ్ లో స్వల్ప లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 26419 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల వృద్ధితో 7913 వద్ద ముగిసాయి. నిఫ్టీ తొలిసారి 7900 పాయింట్ల మార్క్ పై ముగియడం విశేషం. బ్యాంకింగ్, ఐటీ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26508-26383 పాయింట్ల, నిఫ్టీ 7929-7900 పాయింట్ల మధ్య కదలాడింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టెక్ మహీంద్ర అత్యధికంగా 3.14 శాతం, హిండాల్కో 2.59, హెచ్ సీఎల్ టెక్ 2.52, ఎస్ బీఐ 2.32, బ్యాంక్ బరోడా 2.05 శాతం లాభాపడ్డాయి. కోల్ ఇండియా, బీపీసీఎల్, హెచ్ డీఎఫ్ సీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం స్వల్ప లాభాలతో ముగిసాయి. బుధవారం ముగింపుకు సెన్సెక్స్ 45 పాయింట్ల లాభంతో 26360 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల వృద్దితో 7891 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26464-26262 పాయింట్ల మధ్య, నిఫ్టీ 7919-7855 పాయింట్ల మధ్య కదలాడాయి. పీఎన్ బీ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బీఐ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్, యునైటెడ్ స్పిరిట్, ఎన్ టీపీసీ, సెసాగోవా, టాటాస్టీల్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
స్వల్ప లాభాల్లో సెన్సెక్స్!
హైదరాబాద్: మెటల్, హెల్త్ కేర్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 26351 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల వృద్దితో ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26464 పాయింట్ల, నిఫ్టీ 7919 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో పీఎన్ బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటాక్ మహీంద్ర, బజాజ్ ఆటో, ఎస్ బీఐ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. యునైటెడ్ స్పిరిట్, ఎన్ టీపీసీ, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, సెసా స్టెరిలైట్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
సెన్సెక్స్ కు 106 పాయింట్ల నష్టం!
హైదరాబాద్: ఆరు రోజుల వరుస నష్టాలకు తెరదించుతూ భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంతో 26314 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 7875 వద్ద క్లోజయ్యాయి. ఆయిల్ గ్యాస్, ఆటో, కాపిటల్ గూడ్స్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించాయి. సన్ ఫార్మా, సిప్లా, లుపిన్, టాటా పవర్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ లాభాల్ని నమోదు చేసుకోగా, ఓఎన్ జీసీ, ఐడీఎఫ్ సీ, టాటా మోటార్స్, అల్ల్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్ ఎం కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో వరుస లాభాలకు తెర దించుతూ భారత స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్ల నష్టంతో 26338 వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు క్షీణించి 7876 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సన్ ఫార్మా, సిప్లా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, కొటాక్ మహీంద్ర కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్ జీసీ, ఐడీఎఫ్ సీ, పీఎన్ బీ, అల్ట్రా టెక్ సిమెంట్, యాక్సీస్ బ్యాంక్ నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
రికార్డు గరిష్టస్థాయి వద్ద సెన్సెక్స్ క్లోజ్
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఆరవ రోజు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 26420 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల వృద్దితో 7897 వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాలపు గరిష్టస్థాయి వద్ద క్లోజవ్వడం విశేషం. బీపీసీఎల్, ఎంఅండ్ఎం, ఇండస్ ఇండియా బ్యాంక్ మూడు శాతానికి పైగా..టాటా మోటార్స్, యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీలు సుమారు మూడు శాతం లాభపడ్డాయి. నష్టపోయిన షేర్లలో హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, సన్ ఫార్మా, హిండాల్కోలు ఉన్నాయి. -
లైఫ్ టైమ్ హై వద్ద సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఆరవ రోజు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగంలో వివిధ రంగాల అభివృద్దికి ప్రభుత్వం సానుకూలంగా ఉందనే వ్యాఖ్యలతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 129 పాయింట్ల లాభంతో 26520 పాయింట్ల జీవితకాలపు గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. అలాగే నిఫ్టీ 7900 పాయింట్ల లైఫ్ టైమ్ హై మార్క్ ని తాకింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసా గోవా స్టెరిలైట్, యునైటెడ్ స్పిరిట్, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఇండస్ ఇండియా బ్యాంక్, బీపీసీఎల్ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, సిప్లా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: బ్యాంకింగ్, ఆటో, విద్యుత్, మెటల్, హెల్త్ కేర్ రంగాల కంపెనీల షేర్లతోపాటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల భారీగా కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 134 పాయింట్ల లాభంతో 26237వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల వృద్దితో 7832 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్ అత్యధికంగా 4 శాతం, టాటా పవర్, యాక్సీస్, టాటా మోటార్స్, భెల్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్ కంపెనీలు స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
సెన్సెక్స్ కు 259 పాయింట్ల నష్టం
హైదరాబాద్: ఇరాక్ లో నెలకొన్న పరిస్థితులు ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 259 పాయింట్ల పతనంతో 25329 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు క్షీణించి 7588 వద్ద ముగిసాయి. శుక్రవారం ట్రేడింగ్ లో సెసాగోవా అత్యధికంగా 5.92 శాతం నష్టపోగా, డీఎల్ఎఫ్ 4.31, భెల్ 4.31, టాటా పవర్ 3.74, ఐడీఎఫ్ సీ 3.35 శాతం నష్టపోయాయి. భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, సిప్లా స్వల్పంగా లాభపడ్డాయి. -
భారీ నష్టాల్లో సెన్సెక్స్!
హైదరాబాద్: అంతర్తాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలు, మెటల్, కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు కుప్పకూలడంతో భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన ప్రధాన సూచీలు మధ్యాహ్నం సమయానికి కూడా కోలుకోలేకపోయాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 280 పాయింట్ల నష్టంతో 25308 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 7561 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డీఎల్ఎఫ్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం, సెసా స్టెరిలైట్, భెల్ కంపెనీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, టీసీఎస్ కంపెనీలు స్వల్పంగా లాభపడ్డాయి. -
స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్
గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, ఐటీ కంపెనీ షేర్లు భారీగా క్షీణించడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ 76 పాయింట్ల నష్టంతో 25589 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు క్షీణించి 7649 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,778 -25,526, నిఫ్టీ 7,708 - 7,630 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య ఊగిసలాటకు గురైంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఏసీసీ, జిందాల్ స్టీల్, అంబుజా సిమెంట్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. పీఎన్ బీ, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్!
గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, ఫండ్స్, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ ఒడిగట్డడం, ఇతర అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లోకి నెట్టాయి. మధ్యాహ్నం (12.30) గంటల సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు క్షీణించి 25594 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 7654 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జిందాల్ స్టీల్, ఏసీసీ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, బీపీసీఎల్ కంపెనీలు లాభాల్లో, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టీసీఎస్, పీఎన్ బీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్!
బ్యాంకింగ్, మెటల్, ఆటో రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 242 పాయింట్లు క్షీణించి 25655 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు పతనమై 7672 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సెన్సెక్స్ 25,901 గరిష్టాన్ని, 25,621 కనిష్టాన్ని, నిఫ్టీ 7,740 గరిష్ట స్థాయిని, 7,658 కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. ఐటీసీ, పీఎన్ బీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సీస్ బ్యాంక్, జిందాల్ స్టీల్ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టెక్ మహేంద్ర కంపెనీలు లాభాలతో ముగిసాయి. -
నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలత, రిటైల్ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఒడిగట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సెన్సెక్స్ 81 పాయింట్లు క్షీణించి 25827, నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 7718 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భెల్, ఇన్పోసిస్, పవర్ గ్రిడ్, ఎషియన్ పెయింట్స్, ఎంఅండ్ ఎం కంపెనీల షేర్లు ప్రధాన సూచీలుకు మద్దతుగా నిలువగా, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్ జీసీ, అంబుజా సిమెంట్స్ కంపెనీలు సూచీలను నష్టాల వైపు లాగాయి. -
నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్
హైదరాబాద్: రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం ట్రేడింగ్ లో లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో 25908 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల వృద్ధితో 7746 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,928 గరిష్ట స్థాయిని, 25,562 పాయింట్ల కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7752 పాయింట్ల గరిష్ట స్థాయిని, 7638 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి. అల్ట్రా టెక్ సిమెంట్స్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, గ్రాసీం, ఎం అండ్ ఎం కంపెనీలు లాభాలతో, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్ సీఎల్ టెక్, ఎన్ ఎమ్ డీసీ, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
సెన్సెక్స్ కు 242 పాయింట్ల లాభం
ఐటీ, ఆటో, కాపిటల్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత ప్రధాన సూచీలు భారీ లాభాల్ని నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 25723 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల వృద్ధితో 7683 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్, ఇన్ఫోసిస్, హిండాల్కో, ఎన్ ఎండీసీ, జిందాల్ స్టీల్ కంపెనీలు 3 శాతానికి పైగా లాభాల్ని సాధించాయి. హెచ్ డీఎఫ్ సీ, సన్ ఫార్మ, భారతీ ఎయిర్ టెల్, సిప్లా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్!
గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాలు, రిటైల్ ఇన్వెస్టర్ల, ఫండ్ మేనేజర్లు కోనుగోళ్లకు మొగ్గు చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 151 పాయింట్ల లాభంతో 25630 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల వృద్ధితో 7656 వద్ద ముగిసాయి. మంగళవారం రిజర్వు బ్యాంకు కీలక త్రైమాసిక సమీక్ష చేపట్టనున్నందున ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఇన్పోసిస్ అత్యధికంగా 3.30 శాతం లాభపడగా, యునైటెడ్ స్పిరిట్, హెచ్ సీఎల్ టెక్, ఎన్ ఎమ్ డీసీ, టెక్ మహీంద్ర కంపెనీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హెచ్ డీఎఫ్ సీ, డీఎల్ఎఫ్, కోల్ ఇండియా, సిప్లా, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. -
సెన్సెక్స్ భారీ పతనం
గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గ చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 414 పాయింట్లు పతనమై 25480 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 7602 పాయింట్ల వద్ద ముగిసాయి. 1119 కంపెనీల షేర్లు మార్కెట్ మద్దతు నిలువగా, 1762 కంపెనీల షేర్లు నష్టాల వైపుకు లాగాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,862 గరిష్ట స్థాయిని, 25,459 పాయింట్ల కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7,716 గరిష్టాన్ని 7,593 కనిష్టాన్ని తాకాయి. హిండాల్కో, సిప్లా, రిలయన్స్, కొటాక్ మహీంద్ర, ఎన్ టీపీసీ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకోగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, మారుతీ సుజుకీ, అల్ట్రా టెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, డీఎల్ఎఫ్ కంపెనీలు లాభాలతో ముగిసాయి. -
నష్టాల్తో ముగిసిన సెన్సెక్స్!
-
సెన్సెక్స్ కు 192 పాయింట్ల నష్టం!
హైదరాబాద్: గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత ప్రభావంతో జూలై నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 192 పాయింట్ల నష్టంతో 25894 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 7721 వద్ద ముగిసాయి. సిప్లా, టాటా స్టీల్, బీపీసీఎల్, లుపిన్, గెయిల్ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఎన్టీపీసీ, హెచ్ సీఎల్ టెక్, ఐడీఎఫ్ సీ, యాక్సీస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నష్టాలతో ముగిసాయి. -
నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు అనుహ్యంగా నష్టాల నుంచి లాభాల్లోకి చేరుకున్నాయి. సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంతో 26073 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల వృద్దితో 7787 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,113 గరిష్ట స్థాయిని, 25850 పాయింట్ల కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7798 గరిష్ట స్థాయిని 7,707 కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 96 పాయింట్ల వృద్ధితో 26087వద్ద, 42 పాయింట్ల లాభంతో 7791 వద్ద ముగిసాయి. -
నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: కార్పోరేట్ ఫలితాల్లో ప్రతికూలత, విదేశీ, దేశీయ, రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం మధ్యాహ్నం సమయానికి నష్టాల్లో జారుకున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల నష్టంతో 25891 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల క్షీణించి 7719 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 4.58 శాతం, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, లుపిన్, గెయిల్, డీఎల్ఎఫ్ సుమారు 2 శాతం లాభపడి.. సూచీలకు మద్దతుగా నిలిచాయి. లార్సెన్ అత్యధికంగా 7.34 శాతం క్షీణించగా, జిందాల్ స్టీల్, సెసా స్టెర్ లైట్, టాటా మోటార్స్, టాటా పవర్ కంపెనీలు 2 శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
సెన్సెక్స్ కు 135 పాయింట్ల నష్టం!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టంతో 25991, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 7748 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,181 గరిష్టాన్ని, 25,900 పాయింట్ల కనిష్టాన్ని తాకగా, నిఫ్టీ 7,799 గరిష్ట స్థాయిని 7,722 కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. హెచ్ యూఎల్, హెచ్ సీఎల్ టెక్, పీఎన్ బీ, కెయిర్న్ ఇండియా, సన్ ఫార్మా కంపెనీలు స్వల్ప లాభాల్ని నమోదు చేసుకోన్నాయి. డీఎల్ఎఫ్ అత్యధికంగా 5.23 శాతం నష్టపోగా, కోల్ ఇండియా 3.18, అల్ట్రా టెక్ సిమెంట్స్, ఏసీసీ, బీపీసీఎల్ కంపెనీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
26 వేల దిగువన సెన్సెక్స్!
ఆటో, బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్, మెటల్ రంగాల కంపెనీల షేర్లులో అమ్మకాల ఒత్తిడి ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో 216 పాయింట్లు, నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయాయి. మధ్యాహ్నం 1.40 నిమిషాలకు సెన్సెక్స్166 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి ట్రేడ్ అవుతున్నాయి. కెయిర్న్ ఇండియా, హెచ్ సీఎల్ టెక్, పీఎన్ బీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఇండస్ ఇండియా బ్యాంక్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్, కోల్ ఇండియా, ఏసీసీ, అల్ట్రా టెక్ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు బ్రేక్ పడింది. శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు కోల్పోయి 26, 126 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 7790 వద్ద ముగిసింది. -
రికార్డు గరిష్టస్థాయికి సెన్సెక్స్, నిఫ్టీ
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలనుంచి లాభాల్లోకి చేరుకుని రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆరంభంలో రికార్డు స్థాయి నుంచి క్షీణించి లాభాలను నమోదు చేసుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోకి చేరుకున్నాయి. మధ్యాహ్నం మూడుగంటల సమయానికి సెన్సెక్స్ 96 పాయింట్లు లాభపడి 26244 పాయింట్లు వద్ద, 24 పాయింట్ల వృద్ధితో 7819 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా స్టీల్, హెచ్ సీఎల్ టెక్, హిండాల్కో, ఏషియన్ పెయింట్స్ లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఫలితాలు నిరాశపరచడంతో కెయిర్న్ ఇండియా 6.66 శాతం నష్టపోయింది. గెయిల్,డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, సిప్లాలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
నష్టాల్లోకి సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ప్రారంభమై.. సరికొత్త రికార్డు గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 26188 పాయింట్ల వద్ద ఆరంభమైంది ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26190, నిప్టీ 7802 గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. ఆతర్వాత వెంటనే గరిష్ట స్థాయి వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సెన్సెక్స్ , నిఫ్టీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతోతో 26089 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 7777 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హెచ్ సీఎల్ టెక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, విప్రో, టాటా స్టీల్, బీపీసీఎల్ కంపెనీలు లాభాల్లో, కెయిర్న్, టాటా మోటార్స్, గెయిల్, లార్సెన్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
టీసీఎస్ మార్కెట్ విలువ 5 లక్షల కోట్లు!
ముంబై: భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ కాపిటల్ కలిగిన తొలి కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అవతరించింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటల్ 5 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత టీసీఎస్ మార్కెట్ కాపిటల్ 5,06,703.34 (84 బిలియన్ డాలర్లు) కోట్లకు చేరింది. 2004లో లిస్టైన తర్వాత కంపెనీ ఈ ఘనతను సాధించడం ఇదే తొలిసారి. టీసీఎస్ తర్వాత ఇన్పోసిస్ (1,92,196.84 కోట్లు), హెచ్ సీఎల్ టెక్నాలజీ (1,07,880.18 ), విప్రో (1,40,474.31), టెక్ మహీంద్ర (50,374.76 ) అత్యధిక మార్కెట్ కాపిటల్ కలిగిన కంపెనీలుగా ఉన్నాయి. -
సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు ముగింపు
ఐటీ, ఆటో, ఆయిల్, గ్యాస్, బ్యాంకింగ్, ఫార్మా రంగాల కంపెనీ షేర్లు మద్దతుగా నిలవడం, గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత లాంటి అంశాలు భారత స్టాక్ మార్కెట్ ను నూతన చారిత్రాత్మక గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో నిఫ్టీ 7809, సెన్సెక్స్ 26,188 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఇన్పోసిస్ అత్యధికంగా 3.58 శాతం, బీపీసీఎల్ 3, హిండాల్కో 2.92, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.60, విప్రో 2.17 శాతం లాభాల్ని నమోదు చేసుకుని ప్రధాన సూచీలకు మద్దతుగా నిలిచాయి. అంబుజా సిమెంట్స్ 3.25 శాతం నష్టపోగా, అల్ట్రా టెక్ సిమెంట్స్ 2.73, ఏసీసీ 2.36, ఐడీఎఫ్ సీ 2.08, కొటాక్ మహీంద్ర 1.73 శాతం నష్ట్రాల్ని నమోదు చేసుకున్నాయి. -
26 వేల మార్కుపైన సెన్సెక్స్!
హైదరాబాద్: మెటల్, ఆయిల్, గ్యాస్, ఇన్ ఫ్రా, కన్స్యూమర్ డ్యురబుల్స్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. 26 వేల మార్కుపైనా సెన్సెక్స్ ముగిసింది. మంగళవారం ట్రేడింగ్ లో 310 పాయింట్ల లాభపడి 26025 పాయింట్ల వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల వృద్దితో 7767 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,050 గరిష్ట స్థాయిని, 25,780 కనిష్టస్థాయిని... నిఫ్టీ 7,773 గరిష్టస్థాయిని, 7,704 కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 5.03, రిలయన్స్ 3.34, హెచ్ డీఎఫ్ సీ 3.04, టీసీఎస్ 2.79, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.63 శాతం లాభపడ్డాయి. మారుతి సుజుకీ, లార్సెన్, పీఎన్ బీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎం అండ్ ఎం కంపెనీలు స్వల్ప నష్టాలతో నమోదు చేసుకున్నాయి. -
స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 73 పాయింట్ల లాభంతో 25715 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల వృద్దితో 7684 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా ఇండస్ ఇండియా బ్యాంక్ 3.21 శాతం, హెచ్ డీఎఫ్ సీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, గ్రాసీం కంపెనీలు 2 శాతానికి పైగా లాభాల్నినమోదు చేసుకున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,861 గరిష్ట స్థాయిని, 25,677 కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7,722 గరిష్ట స్థాయిని, 7,674 కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. డీఎల్ఎఫ్, ఐడీఎఫ్ సీ, టాటా పవర్, గెయిల్, ఇన్ఫోసిస్ కంపెనీలు సుమారు రెండు శాతం నష్టపోయాయి. -
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!
హైదరాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగైన ఫలితాల ప్రభావం, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 25769 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల వృద్దితో ట్రేడ్ అవుతున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో రియలన్స్, హెచ్ డీఎఫ్ సీ, గ్రాసీం, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసీసీ లు లాభాలతో కొనసాగుతున్నాయి. హిండాల్కో, ఇన్ఫోసిస్, డీఎల్ఎఫ్, గెయిల్, టాటా పవర్ కంపెనీలు నష్టాల్లో నమోదు చేసుకున్నాయి. -
మూడో రోజు కూడా సెన్సెక్స్...
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 80 పాయింట్లు లాభపడి 25,641 వద్ద, నిఫ్టీ 7,663 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 25,713 పాయింట్ల గరిష్ట స్థాయిని, 25,441 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఐడీఎఫ్ సీ, టీసీఎస్, హీరో మోటో కార్ప్, కొటాక్ మహీంద్ర, హెచ్ సీఎల్ టెక్ లు లాభాల్ని నమోదు చేసుకోగా, టాటా పవర్, అంబుజా సిమెంట్స్, హిండాల్కో, భెల్, గెయిల్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
లాభాల్లో సెన్సెక్స్!
రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, టీసీఎస్, బజాజ్ ఆటో త్రైమాసిక ఫలితాలు, గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పవనాలు భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలను వరుసగా మూడోరోజు కూడా లాభాల్లో నడిపించాయి. ఆరంభంలో సెన్సెక్స్ 60 పాయింట్ల లాభపడింది. నిన్నటి ముగింపుకు నిఫ్టీ సూచీ 16 పాయింట్ల వృద్దితో 7640 వద్దకు చేరుకుంది. టీసీఎస్, బజాజ్ ఆటో కంపెనీల ఫలితాలు మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపే అవకాశ ముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో జిందాల్ స్టీల్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, సెసా స్టెరిలైట్, లుపిన్ కంపెనీలు లాభాల్లో.. ఎంఎం, ఐడీఎఫ్ సీ, ఓఎన్ జీసీ, ఎస్ బీఐ, బీపీసీఎల్ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకర్లు, దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ ఏర్పడటంతో రూపాయి 2 పైసలు నష్టపోయి 60.17 వద్ద ట్రేడ్ అవుతోంది. -
లాభాలతో సెన్సెక్స్ ప్రారంభం!
ముంబై: బ్యాంకింగ్, కాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ రంగాల షేర్ల కొనుగోళ్లతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీ సెన్సెక్స్ 25322 పాయింట్ల ఆరంభమై.. 25377 పాయింట్ల గరిష్ట స్థాయిని, 25,284 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 7550 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐడీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, డీఎల్ ఎఫ్, హిండాల్కో, ఎస్ బీఐ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్ డీఎఫ్ సీ, గెయిల్, సెసా స్టెర్ లైట్, కోల్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేర్లలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
కొనసాగుతున్న సెన్సెక్స్ దూకుడు!
హైదరాబాద్: ఆరంభంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్వల్ప నష్టాలకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు చివర్లో రికార్డు గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. వారాంతంలో నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో 25962 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల వృద్ధితో 7751 వద్ద క్లోజయ్యాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 25,844 పాయింట్ల వద్ద ఆరంభమై...25,981 గరిష్ట స్థాయిని, 25,659 కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7,718 ప్రారంభమై 7,758 గరిష్ట స్థాయిని, 7,661 కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో పవర్ గ్రిడ్, రిలయన్స్, హెచ్ డీఎఫ్ సీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, గెయిల్ లాభాల్ని నమోదు చేసుకోగా, ఏసీసీ, సెసా స్టెర్ లైట్, విప్రో, జిందాల్ స్టీల్, యునైటెడ్ స్పిరిట్స్ నష్టాలతో ముగిసాయి. -
స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 25924 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదు చేసుకున్న తర్వాత ఉదయం 9.35 గంటలకు సాంకేతిక కారణాలతో బాంబే స్టాక్ ఎక్స్చెంజ్ ట్రేడింగ్ వ్యవహారాలు నిలిచిపోయాయి. అయితే మధ్యాహ్నం తర్వాత బీఎస్ ఈ ట్రేడింగ్ ఆరంభమైంది. ట్రేడింగ్ చివర్లో సెన్సెక్స్ 17 పాయింట్ల క్షీణించి 25823, నిఫ్టీ 10 కోల్పోయి 7714 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టాటా మోటార్స్, విప్రో, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, సిప్లా స్వల్ప లాభాలతో ముగిసాయి. హీరో మోటో కార్ప్, హిండాల్కో, టాటా పవర్, బజాజ్ ఆటో, ఓఎన్ జీసీ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
325 పాయింట్లతో సెన్సెక్స్ రికార్డు హై!
బ్యాంకింగ్, మెటల్, ఆటో మొబైల్, కాపిటల్ గూడ్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరందుకోవడం, బడ్జెట్ పై సానుకూలాంశాలు ఉండవచ్చనే అంచనాలతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,660 పాయింట్ల వద్ద ఆరంభమై, ఓ దశలో 25,864 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. చివరకు నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 25841 పాయింట్ల వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్దితో 7725 వద్ద ముగిశాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసా స్టెరిలైట్ అత్యధికంగా 4.69 శాతం, ఎన్ టీపీసీ 3.33, యునైటెడ్ స్పిరిట్ 2.76, భెల్ 2.75, హెచ్ డీఎఫ్ సీ 2.41 శాతం లాభపడ్డాయి. హెచ్ సీఎల్ టెక్, పీఎన్ బీ, గెయిల్, టెక్ మహీంద్ర, ఇన్పోసిస్ స్వల్పంగా నష్టపోయాయి. -
సెన్సెక్స్ సరికొత్త రికార్డు!
బ్యాంకింగ్, మెటల్, ఆటో మొబైల్, కాపిటల్ గూడ్స్ రంగాల్లో కొనుగోళ్లు ఊపందుకోవడం, బడ్జెట్ పై సానుకూలాంశాలు ఉండవచ్చనే అంచనాలతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో 25789 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని అధిగమించింది. బుధవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,660 పాయింట్ల వద్ద ఆరంభమై, ఓ దశలో 25,816 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. మధ్యాహ్నం ఒకటిన్నర సమయానికి 292 పాయింట్ల లాభంతో 25811 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 87 పాయింట్ల వృద్దితో 7722 వద్ద కొనసాగుతోంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసా స్టెర్ లైట్ అత్యధికంగా 3.63 శాతం, యునైటెడ్ స్పిరిట్స్, జిందాల్ స్టీల్, మారుతి సుజుకీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, గెయిల్, పీఎన్ బీ, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
102 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం లాభాలతో ముగిసాయి. ఆటో, మెటల్, కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు మద్దతు పలకడంతో ప్రధాన సూచీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 25516 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల వృద్దితో 7634 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,571 పాయింట్ల గరిష్టస్థాయిని 25,466 కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో హిండాల్కో అత్యధికంగా 6.73 శాతం, మారుతి సుజుకీ 5.93, టాటా మోటార్స్ 4.52, ఎం అండ్ ఎం 4.11, టాటా స్టీల్ 2.32 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఏషియన్ పేయింట్స్, విప్రో, టీసీఎస్, సన్ ఫార్మా, ఇన్పోసిస్ కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం ట్రేడింగ్ లో లాభాలతో కొనసాగుతున్నాయి. ఆటో, మెటల్, కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 25526 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల వృద్దితో 7636 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో హిండాల్కో అత్యధికంగా 6.67 శాతం, మారుతి సుజుకీ 4.43, టాటా మోటార్స్ 3.91, ఎం అండ్ ఎం 3.47, టాటా స్టీల్ 2.80 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఏషియన్ పేయింట్స్, విప్రో, టీసీఎస్, సన్ ఫార్మా, ఇన్పోసిస్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
314 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూకుడు!
హైదరాబాద్: కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం భారీ లాభాల్ని సాధించాయి. క్రితం ముగింపుకు ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో 25413 పాయింట్ల వద్ద, నిఫ్టీ 102 పాయింట్ల వృద్ధితో 7611 వద్ద ముగిసింది. సూచీ అధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్ అత్యధికంగా 5.39 శాతం లాభపడగా, ఐడీఎఫ్ సీ 5.26, పీఎన్ బీ 4.28, సన్ ఫార్మా 4.10, టాటా పవర్ 3.85 శాతం వృద్దిని సాధించాయి. యునైటైడ్ స్పిరిట్స్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్స్ స్వల్పంగా నష్టపోయాయి. -
సెన్సెక్స్ కు 251 పాయింట్ల నష్టం!
ముంబై: ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల చివరి రోజున సెన్సెక్స్ 251 పాయింట్ల నష్టంతో 25062 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 7493 వద్ద ముగిసాయి. సెన్సెక్స్ 25217 పాయింట్ల ఆరంభమై.. ఓదశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో 25309 పాయింట్ల గరిష్టస్థాయిని, నిఫ్టీ 25021 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో టెక్ మహీంద్ర, లార్సెన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, హెచ్ సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. ఓఎన్ జీసీ అత్యధికంగా 5.84 శాతం లాభపడగా, రిలయన్స్ 3.72, డీఎల్ఎఫ్ 3.15, ఎన్ టీపీసీ 2.90, గ్రాసీం 2.78 శాతం నష్టపోయాయి. -
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్..
హైదరాబాద్: ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 25158 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి 7526 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్, లార్సెన్, భెల్, హెచ్ సీఎల్ టెక్, విప్రో, కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్ జీసీ అత్యధికంగా 5 శాతానికి పైగా నష్టపోగా, రిలయన్స్, డీఎల్ఎఫ్, ఎన్ టీపీసీ, బీపీసీఎల్ కంపెనీలు 2 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
లాభాలతో పరుగులు పెట్టిన సెన్సెక్స్!
కాపిటల్ గూడ్స్, బ్యాంక్, మెటల్ రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో నాలుగు రోజుల నష్టాలకు తెరదించుతూ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 337 పాయింట్ల లాభంతో 25368 వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల వృద్ధితో 7580 పాయింట్ల వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బీపీసీఎల్, గెయిల్, డీఎల్ఎఫ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్ ఎమ్ డీసీ కంపెనీలు భారీగా సుమారు 4 శాతం లాభపడ్డాయి. కొటాక్ మహీంద్ర, సన్ ఫార్మా, ఇన్పోసిస్, కెయిర్న్ ఇండియా, టెక్ మహీంద్ర కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
వరుస నష్టాలకు బ్రేక్, లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
హైదరాబాద్: రిటైల్ ఇన్వెస్టర్లు, ఫండ్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో నాలుగు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 25287 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల వృద్దితో 7558 వద్ద ట్రేడ్ అవుతోంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో గెయిల్ అత్యధికంగా 2.84, సెసా గోవా 2.09, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.85, హెచ్ డీఎఫ్ సీ 1.82, బీపీసీఎల్ 1.77 శాతం లాభపడ్డాయి. హెచ్ సీఎల్, కొటాక్ మహీంద్ర, ఇన్పోసిస్, సన్ ఫార్మా, ఓఎన్ జీసీ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. Follow @sakshinews -
నాలుగవ రోజు కూడా నష్టాల్లోనే సెన్సెక్స్ !
ఇరాక్ లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. ఓ దశలో ఇంట్రాడే ట్రేడింగ్ సెన్సెక్స్ 25 వేల, నిఫ్టీ 7500 మార్కు దిగువకు పడిపోయింది. సోమవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 25,197 గరిష్ట స్థాయిని, 24,878 కనిష్టస్థాయిని, నిఫ్టీ 7,534 గరిష్ట స్థాయిని, 7,441 కనిష్టస్థాయిని తాకాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో 200 పైగా పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ మార్కెట్ చివరలో లో 74 పాయింట్ల నష్టంతో 25031 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 7493 వద్ద ముగిసాయి. అత్యధికంగా ఓఎన్ జీసీ 4.81 శాతం వృద్దిని సాధించగా, జిందాల్ స్టీల్ 2.73, హీరో మోటార్ కార్ప్ 2.48, భెల్ 2.32, ఏసీసీ 2.25 శాతం లాభంతో సెన్సెక్స్ కు మద్దతిచ్చాయి. ఐటీసీ అత్యధికంగా 6.18 శాతం నష్టపోగా, కొటాక్ మహీంద్ర 3.84, యునైటెడ్ స్పిరిట్ 3.18, ఇన్పోసిస్ 2.53, హెచ్ సీఎల్ టెక్ 1.72 నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో..
ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 96 పాయింట్ల కోల్పోయి 25105 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు క్షీణించి 7511 వద్ద ముగిసింది. ఎంఅండ్ఎం అత్యధికంగా 2.73 శాతం, టాటా పవర్ 2.69, హిండాల్కో 2.35, బీపీసీఎల్ 2.11, ఎన్ ఎమ్ డీసీ 1.98 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. యునైటెడ్ స్పిరిట్స్ అత్యధికంగా 3.04, కెయిర్న్ ఇండియా 1.39 శాతం, యాక్సీస్ బ్యాంక్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ స్వల్పంగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. -
సెన్సెక్స్ కు 44 పాయింట్ల నష్టం!
ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం కలుగవచ్చనే భయాందోళనల మధ్య భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఊగిసలాటకు లోనయ్యాయి. ఓదశలో 180 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో 25425 పాయింట్ల గరిష్టస్థాయిని, 25069 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు సెన్సెక్స్ 44 పాయింట్ల నష్టంతో 25201, నిఫ్టీ 17 పాయింట్లు కోల్పోయి 7606 పాయింట్ల వద్ద ముగిసాయి. అత్యధికంగా యునైటెడ్ స్పిరిట్ 7.18 శాతం, ఓఎన్ జీసీ 4.96, కోటాక్ మహీంద్ర 3.81, బీపీసీఎల్ 4.61, రిలయన్స్ 2.31 శాతం నష్టాల్ని, ఇండస్ ఇండియా బ్యాంక్, ఇన్పోసిస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. -
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. చమురు, ఆయిల్ రంగాల కంపెనీల షేర్లు పతనమవ్వడంతో 125 పాయింట్ల లాభంతో ఆరంభమైన సెన్సెక్స్ మధ్యాహ్న సమయానికి 115 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఓ దశలో సెన్సెక్స్ 25,069 పాయింట్ల, నిఫ్టీ 7,502 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సెన్సెక్స్ 157 పాయింట్ల నష్టంతో 25089, నిఫ్టీ 46 పాయింట్ల తేడాతో 7511 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్ జీసీ అత్యధికంగా 6.60 శాతం, యునైటెడ్ స్పిరిట్ 5.08, కోటాక్ మహీంద్ర 3.30, బీపీసీఎల్ 3.10, మారుతి సుజుకీ 2.22 శాతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, ఇన్పోసిస్, జిందాల్ స్టీల్, లుపిన్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
326 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్!
హైదరాబాద్: ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ఇరాక్ లో అతిపెద్ద రిఫైనరీపై మిలిటెంట్లు దాడులు జరపడంతో చమురు రంగ కంపెనీల షేర్లు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. దాంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్ 326 పాయింట్ల నష్టంతో 25194 వద్ద, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 7558 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సిప్లా 2.94 శాతం, హిండాల్కో 2.55, కొటాక్ మహీంద్ర 2.45, లుపిన్ 2.34, యునైటెడ్ స్పిరిట్స్ 2.01 శాతం నష్టపోయాయి. బీపీసీఎల్ 3.04, ఐడీఎఫ్ సీ 2.77, భెల్ 2.60, సన్ ఫార్మా 2.53, ఎన్ ఎమ్ డీసీ 2.45 శాతం నష్టాలతో ముగిసాయి. -
మూడో రోజు కూడా నష్టాల్లోనే..
హైదరాబాద్: అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి బలహీనపడటం, ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన, ఫండ్స్ అమ్మకాలు జరపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం 51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ఆరంభమైంది. ఆతర్వాత స్వల్ప ఒడిదుడుకులకు లోనైన సూచీలు మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 7519 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సూచీ అధారిత కంపెనీ షేర్లలో హెచ్ సీఎల్ టెక్ 2.91 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.90, అల్ట్రా టెక్ సిమెంట్స్ 1.69, భారతీ ఎయిర్ టెల్ 1.62, ఓఎన్ జీసీ 1.39 మేరకు లాభాల్లో కొనసాగుతుండగా, డీఎల్ఎఫ్ 2.97, హిండాల్కో 2.39, జిందాల్ స్టీల్ 2.23, ఎం అండ్ ఎం 2.15, టాటా పవర్ 1.85 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. -
సెన్సెక్స్ నష్టాలకు ఐటీ, హెల్త్ అడ్డుకట్ట!
ముంబై: ఐటీ, హెల్త్ కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ కోలుకుని స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ తోపాటు, మరో ప్రధాన సూచీ నిఫ్టీ కూడా వరుసగా రెండో రోజు కూడా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 37 పాయింట్లు కోల్పోయి 25239 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 7533 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25268 పాయింట్ల గరిష్ట స్థాయిని, 25063 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. సూచీ అధారిత కంపెనీ షేర్లలో గెయిల్ అత్యధికంగా 4.30 శాతం, బీపీసీఎల్ 3.72, డీఎల్ఎఫ్ 2.71, టీసీఎస్ 2.54, సన్ ఫార్మా 2.49 శాతం లాభాలను నమోదు చేసుకున్నాయి. ఎంఅండ్ఎం 2.51 శాతం, యాక్సీస్ బ్యాంక్ 2.47, లార్సెన్ 2.10, హెచ్ డీఎఫ్ సీ 1.84, టాటా మోటార్స్ 1.69 శాతం నష్టపోయాయి. -
స్టాక్ మార్కెట్ పై క్రూడ్ పంజా, భారీ నష్టాలు!
హైదరాబాద్: ఇరాక్లో సున్నీ మిలిటెంట్ల దాడితో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధర పెరుగడం, ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి 59.69 రూపాయలను నమోదు చేసుకోవడం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీగా నష్టపోయాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 348 పాయింట్ల పతనంతో 25228 పాయింట్ల వద్ద, నిఫ్టీ 108 పాయింట్ల నష్టంతో 7542 పాయింట్ల వద్ద ముగిసాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ స్థాయిలో పతనమవ్వడం గత నాలుగు నెలల్లో ఇదే తొలిసారి. క్రూడ్ ధర, పెరగడం, ద్రవ్య మార్కెట్ లో రూపాయి పతనం కావడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీయడంతో సుమారు 12 రంగాల కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీ అధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 8 శాతం, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, ఎన్ఎమ్ డీసీ, యాక్సీస్ బ్యాంక్, కంపెనీలు 45 శాతానికి పైగా నష్టపోయాయి. హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, హెచ్ యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్పోసిస్ కంపెనీల షేర్లు స్వల్పంగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. -
సెన్సెక్స్ 100 పాయింట్ల లాభం!
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ కంపెనీ షేర్లు లాభాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీల సెన్సెక్స్ లాభాల్ని నమోదు చేసుకుంది. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 25576 వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 7640 వద్ద క్లోజైంది. హెచ్ డీఎఫ్ సీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేర్లు లాభపడటమే కాకుండా సెన్సెక్స్ 80 పాయింట్ల లాభాన్ని సంపాదించిపెట్టాయి. టీసీఎస్, సన్ ఫార్మా, ఐటీసీ, టాటా మోటార్స్, హిండాల్కో, మారుతి సుజుకీ, ఎన్ టీపీసీ కంపెనీలు ఓ మాదిరి లాభాల్ని నమోదు చేసుకున్నాయి. భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా 3.76 నష్టపోగా, కోల్ ఇండియా 2.33, యాక్సీస్ బ్యాంక్ 1.96, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.80, భెల్ 1.44 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
'రికార్డు' తర్వాత 110 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్!
హైదరాబాద్: ద్రవ్యోల్బణ, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు ఒడిగట్టారు. పవర్, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల కంపెనీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ మార్కెట్లలో మిశ్రమ స్పందన, మే మాసానికి సంబంధించిన వాణిజ్య లోటు పెరిగిపోవడమనే అంశాల కారణంగా బుధవారం సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఓ దశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25735 పాయింట్ల రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరించడంతో ఆరంభంలో సాధించిన లాభాలను నిలుపుకోలేక సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. దాంతో 25,365 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుని.. చివరికి 25,473 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 7626 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఇన్పోసిస్ 3.84 శాతం, కొటాక్ మహీంద్ర 3.16, టీసీఎస్ 2.26, డాక్టర్ రెడ్డీస్ 1.54, హీరో మోటో కార్ప్ 1.47 శాతం లాభాల్ని నమోదు చేసుకోగా, డీఎల్ఎఫ్ అత్యధికంగా 5.29 శాతం నష్టపోగా, టాటా పవర్ 4.93, హిండాల్కో 4.18, ఎన్ ఎం డీసీ 3.87, కోల్ ఇండియా 3.83 శాతం మేరకు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
క్రితం ముగింపు వద్దే సెన్సెక్స్..
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు క్రితం ముగింపుకు చేరువగా క్లోజయ్యాయి. మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో జీవితకాలపు గరిష్ట స్థాయిని తాకిన సూచీలు లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్ని చవిచూశాయి. అయితే చివరికి సెన్సెక్స్ 3 పాయింట్లు లాభపడి 25583 వద్ద, నిఫ్టీ 1 నష్టంతో 7656 వద్ద ముగిసాయి. ఓ దశలో సెన్సెక్స్ 25347 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి తేరుకుంది. గత మూడు సెషన్లలో సెన్సెక్స్ 775 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ సూచీలోని యాక్సీస్ బ్యాంక్, ఎస్ బీఐ, హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, భెల్, బజాజ్ ఆటో, ఓఎన్ జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సెసా స్టెరిలైట్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. టీసీఎస్, విప్రో, సిప్లా, సన్ ఫార్మా, హిండాల్కో, హెచ్ యూఎల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్ సీలు లాభాలను నమోదు చేసుకున్నాయి. -
నష్టాల్లో సెన్సెక్స్!
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కాలంగా కొనసాగుతున్న బుల్ ర్యాలీకి మంగళవారం తాత్కాలికంగా తెరపడింది. ఐటీ, టెక్నాలజీ, రియాల్టీ, మెటల్, పవర్, బ్యాంకింగ్, ఆటో రంగాల కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ప్రధాన సూచీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. ఓదశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,347, నిఫ్టీ 7,579 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. అయితే మధ్యాహ్నం సమయానికి ఆరంభంలో నమోదు చేసిన నష్టాల్ని కొంత తగ్గించుకుని సెన్సెక్స్ 79 పాయింట్ల నష్టంతో 25501 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల పతనంతో 7,626 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సూచీ అధారిత కంపెనీ షేర్లలో టెక్ మహీంద్ర అత్యధికంగా 3.43 శాతం, విప్రో 2.34 శాతం, సిప్లా 2.13, హెచ్ సీఎల్ టెక్ 2.12, లుపిన్ 1.99 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్ 3.96 శాతం, సెసా గోవా 3.62 శాతం, టాటా స్టీల్ 3.30 శాతం, భెల్ 3.04, టాటా పవర్ 2.94 శాతం నష్టపోయాయి. -
భారీ నష్టాల్లో సెన్సెక్స్ (-321)
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ఐటీ, టెక్నాలజీ, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల బాట పట్టాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 321 పాయింట్ల పతనంతో 24234 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల క్షీణించి 7235 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఓదశలో సెన్సెక్స్ 24528 పాయింట్ల, నిఫ్టీ 7,325 గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ అత్యధికంగా 7.84 శాతం నష్టపోగా, జిందాల్ స్టీల్ 3.40, ఐడీఎఫ్ సీ 2.97, హెచ్ సీఎల్ టెక్ 2.83 విప్రో 2.81 శాతం నష్టపోయాయి. హిండాల్కో, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఎం అండ్ ఎం, అల్ట్రా టెక్ సిమెంట్స్, ఎన్ టీపీసీలు స్వల్ప లాభాల్ని నమోదు చేసుకున్నాయి. -
నష్టాల్లో కొనసాగుతున్న ప్రధాన సూచీలు
ఐటీ, టెక్నాలజీ, మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాల కంపెనీ షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం మధ్యాహ్న సమయానికి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో 24398 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు క్షీణించి 7292 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ అత్యధికంగా 7.16 శాతం నష్టపోగా, సెసా గోవా 2.71, విప్రో 2, కెయిర్న్ 1.79, హిండాల్కో 1.66 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. పీఎన్ బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్ టీపీసీ, టాటా పవర్, అల్ట్రా టెక్ సిమెంట్ కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టం!
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 24549 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 7318 వద్ద ముగిసాయి. ఓదశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 24,777 గరిష్టస్థాయిని, 24,422 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. జిందాల్ స్టీల్ అత్యధికంగా 5.96 శాతం, టెక్ మహేంద్ర 2.72, టాటా స్టీల్ 2.13, హిందాల్కో 1.73, అల్ట్రాటెక్ సిమెంట్ 1.30 లాభపడ్డారు. గెయిల్ 7.53 శాతం, భెల్ 5.21, పీఎన్ బీ 2.73 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.71, ఎస్ బీఐ 2.69 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్!
బ్యాంకింగ్, చమురు, గ్యాస్ రంగాల కంపెనీ షేర్లలో అమ్మకాలు జోరందుకోవడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం లాంటి అంశాలు భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. మధ్యాహ్నం సమయానికి నిన్నటి ముంగింపుకు సెన్సెక్స్ 178 పాయింట్ల నష్టంతో 24537 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు క్షీణించి 7306 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సూచీ అధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా గెయిల్ 6.61 శాతం, భెల్ 4.36, ఎం అండ్ ఎం 3.42, ఐడీఎఫ్ సీ 3.33, అంబుజా సిమెంట్స్ 2.59 శాతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, లుపిన్, అల్ట్రా టెక్ సిమెంట్, లార్సెన్, టెక్ మహీంద్ర కంపెనీల షేర్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. -
ఉదయం లాభాలు చివరికి ఆవిరి!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఆరంభంలో సాధించిన భారీ లాభాలు చివరికి ఆవిరయ్యాయి. ప్రధాన సూచీలు ఓ దశలో భారీ లాభాలతో నమోదు చేసుకున్నాయి. మార్కెట్ ముగింపులో ప్రధాన సూచీలలలో సెన్సెక్స్ 23 పాయింట్ల స్వల్ప లాభంతో 24716 పాయింట్ల వద్ద, నిప్టీ 8 పాయింట్ల నష్టంతో 7359 వద్ద ముగిసాయి. ఓదశలో ఇంట్రాడే ట్రేడిగ్ లో సెన్సెక్స్ 25175 పాయింట్ల, నిఫ్టీ 7504 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి. విదేశీ మదుపుదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో సెన్సెక్స్ మరోసారి 25 వేల మార్కును అధిగమించింది. అయితే రియాల్టీ, విద్యుత్, కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో నష్టాల్లోకి జారుకుంది. ఎం అండ్ ఎం, సెసా గోవా, హెచ్ సీఎల్ టెక్, విప్రో, టాటా పవర్ లు లాభాలను నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్, భెల్, ఐడీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా పవర్ లు 4 శాతానికి పైగా నష్టపోయాయి. -
మోడీ 'కిక్కు'తో 25 వేల మార్కు పైన సెన్సెక్స్!
నరేంద్రమోడీ విజయం అందించిన ఉత్సాహంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఉదయాన్నే ప్రధాన సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలలలో సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో 25115 పాయింట్ల వద్ద, నిప్టీ 120 పాయింట్ల వృద్దితో 7485 వద్ద కొనసాగుతున్నాయి. విదేశీ మదుపుదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో సెన్సెక్స్ మరోసారి 25 వేల మార్కును అధిగమించింది. సూచీ అధారిత కంపెనీ షేర్లలో ఎం అండ్ ఎం, లార్సెన్, కోల్ ఇండియా, ఓఎన్ జీసీ, కెయిర్న్ ఇండియా కంపెనీల షేర్లు 4 శాతానికి పైగా లాభాలతో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, హిండాల్కో, సిప్లా, హీరో మోటో కార్ప్, లుపిన్ కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
ఏకంగా 14వేల కోట్లు కుమ్మరించారు
న్యూఢిల్లీ: సంస్కరణలకు నూతనంగా ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వం ఊతమిస్తుందనే వార్తలకు విదేశీ సంస్థాగత మదపుదారులు సానుకూలంగా స్పందించారు. మే నెలలో ఏకంగా 14 వేల కోట్ల రూపాయల నిధులను భారతీయ స్టాక్ మార్కెట్ లో విదేశీ మదుపుదారులు పెట్టుబడి పెట్టారు. ఈక్వీటీ మార్కెట్ లో 84,777 కోట్ల రూపాయల మేరకు కొనుగోళ్లు చేశారని, 70,553 కోట్ల విలువైన షేర్లను అమ్మకాలు జరిపారని సెబీ వెల్లడించింది. మార్కెట్ లోకి నిధుల ప్రవాహం నికరంగా 14224 కోట్ల రూపాయలని సెబీ తెలిపింది. అదే మాదిరిగా 12037 కోట్లు డెబిట్ మార్కెట్ లోకి విదేశీ పెట్టుబడిదారులు నిధులను మళ్లించినట్టు సమాచారం. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 10 శాతం వృద్దిని సాధించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మే 6 తేదిన సెన్సెక్స్ 25 వేల మార్కును దాటిన సంగతి తెలిసిందే. -
భారీ లాభాల్లో సెన్సెక్స్ (+318), నిఫ్టీ (+90)
కాపిటల్ గూడ్స్, ఆయిల్,గ్యాస్,మెటల్, ఐటీ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీగా లాభపడ్డాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 319 పాయింట్ల లాభంతో 24693 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల వృద్దితో 7367 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఎస్ బీఐ అత్యధికంగా 9.63 శాతం, టాటా పవర్ 6.39, జిందాల్ స్టీల్ 5.95, పీఎన్ బీ 5.35, మారుతి సుజుకీ 5.34 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. హిండాల్కో, కొటాక్ మహీంద్ర, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్ బ్యాంక్ కంపెనీల షేర్లు 2 శాతం మేరకు నష్టపోయాయి. -
స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్
గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, రియాల్టీ, పవర్, బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ట్రేడింగ్ లో లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 24,374 వద్ద, నిఫ్టీ 23.50 పాయింట్ల వృద్దితో 7275 వద్ద ముగిసాయి. ఓ దశలో సెన్సెక్స్ 24524 పాయింట్ల ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదు చేసింది. ఉదయం సెన్సెక్స్, నిఫ్టీలు సాధించిన భారీ లాభాలు మార్కెట్ ముగింపుకు ఆవిరయ్యాయి. సూచీ అధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ 9.44 శాతానికి పైగా లాభపడగా, కోల్ ఇండియా 5.12 శాతం, మారుతి 4.41, ఎన్ టీ పీసీ 5.87.29, సెసా గోవా 3.95 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. -
లాభాలతో కొనసాగుతున్న సెన్సెక్స్
భారత స్టాక్ మార్కెట్ లో బుల్ రన్ కొనసాగుతునే ఉంది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, మెటల్, కన్యూమర్ డ్యూరబుల్స్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 24227 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల వృద్దితో 7293 వద్ద కొనసాగుతున్నాయి. సూచీ అధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ 11 శాతానికి పైగా లాభపడగా, కోల్ ఇండియా 5.20 శాతం, మారుతి 4.55, ఎన్ టీ పీసీ 4.29, సెసా గోవా 3.67 శాతం లాభాల్ని నమోదు చేసుకున్నాయి. హిండాల్కో, భెల్, హెచ్ డీఎఫ్ సీ, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
సెన్సెక్స్ కు మూడో రోజు కూడా లాభాలే!
నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ఘన విజయ ప్రభావంతో వరుసగా మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసాయి. వ్యాపారవర్గాలకు అనుకూలంగా ప్రభుత్వం ఉంటుందనే ఊహాగానాలు, నిధుల ప్రవాహం లాంటి అంశాల ప్రోత్సాహంతో ప్రధాన సూచీ సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంతో 24363 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల వృద్దితో 7263 పాయింట్ల వద్ద ముగిశాయి. సోమవారం నాటి మార్కెట్ లో సూచీ ఆధారి కంపెనీ షేర్లలో అత్యధికంగా భెల్ 15 శాతం లాభపడగా, కోల్ ఇండియా, ఎన్ టీపీసీ, పీఎన్ బీ లు 10 శాతం, ఓన్ జీసీ 8 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. టీసీఎస్, ఐటీసీలు, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ 5 శాతానికి పైగా నష్టపోగా, సన్ ఫార్మా 4.77 శాతం క్షీణించింది. -
సెన్సెక్స్ కు 650 పాయింట్ల లాభం!
హైదరాబాద్: ఎన్నికల తర్వాత నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చనే సానుకూల వార్తలతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెట్టాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో తొలిసారి సెన్సెక్స్ 23 వేల పాయింట్ల మార్కును అధిగమించింది. వారాంతపు ముగింపున 650 పాయింట్ల లాభంతో 22,994 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల వృద్దితో 6,858 వద్ద ముగిసాయి. ఓదశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 23,048.49 గరిష్టస్థాయిని, 22317 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి. ఇండెక్స్ షేర్లలో ఐడీఎఫ్ సీ అత్యధికంగా 8.06 శాతం లాభపడగా, అంబుజా సిమెంట్స్ 7.36, ఐసీఐసీఐ బ్యాంక్ 6.95, టాటా వపర్ 5.64, ఏసీసీ 5.62, కంపెనీల షేర్లు 5 శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. లుపిన్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.