Anil Ravipudi
-
చిరు సినిమా: నో లవ్ ట్రాక్.. మెగాస్టార్తో అనిల్ మాస్టర్ ప్లాన్!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఇంకా సెట్పైకి వెల్లలేదు కానీ.. అనిల్ మాత్రం అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేశాడు. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్లోనే చిరు సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఈ కథ కూడా కామెడీ పంథాలోనే సాగుతుందని హింట్ ఇచ్చేశాడు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారట. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంద్ర తర్వాత చిరంజీవి రాయలసీమ నేపథ్యంలో సినిమా చేయలేదు. ఇంద్రలో కూడా సీమ యాసను పూర్తిగా వాడలేదు. కానీ ఈచిత్రంలో చిరంజీవి పూర్తిగా రాయలసీమ యాసలోనే మాట్లాడతారట. డైలాగుల విషయంలోనూ అనిల్ జాగ్రత్త పడుతున్నారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రలకు భూమిక, మృణాల్ ఠాకుర్లను ఎంపిక చేసినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం: అనిల్ రావిపూడి
‘‘మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. చిరంజీవి హీరోగా తాను తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ని స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్ హీరోగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇక చిరంజీవిగారితో చేయనున్న సినిమాకి సంబంధించిన కథని సిద్ధం చేసేందుకు వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ని సెంటిమెంట్గా భావిస్తాను. ఇక్కడే నా సినిమాలకు సంబంధించిన కథలు రాసుకుంటుంటాను. ఆ స్క్రిప్ట్లను శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించడం సెంటిమెంట్గా భావిస్తాను. చిరంజీవిగారితో తీసే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది. ‘గ్యాంగ్లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్’లో చిరంజీవిగారిని ఈ చిత్రంలో చూస్తారు. ఒక నెలలో మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. మే ఆఖరిలో లేదా జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా పాల్గొన్నారు. – ‘సాక్షి’, సింహాచలం -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సాంగ్ రికార్డ్
హీరో వెంకటేశ్తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం 92 కేంద్రాల్లో 50రోజులు పూర్తి చేసుకుంది.అయితే, సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని ‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఇప్పటి వరకు ఈ లిరికల్ వీడియో సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్లో తక్కువ సమయంలోనే ఈ మార్క్ అందుకున్న పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో కేవలం మూడు వారాల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో 2 గంటలా 24 నిమిషాలు ప్రదర్శితమవగా.. జీ5లో కేవలం 2 గంటలా 16 నిమిషాల నిడివితో సినిమాను ఉంచారు. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించారు. -
ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. ఆడియన్స్కు బిగ్ ట్విస్ట్!
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి- వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే టీవీలతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్కు వచ్చేసింది. అయితే ఓటీటీ వర్షన్లో సినీ ప్రియులకు షాకిచ్చారు సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్. ఈ సినిమా నిడివిని తగ్గించి విడుదల చేశారు. థియేటర్లలో 2 గంటల 24 నిమిషాలు ఉన్న ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల రన్టైమ్తో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు ఎనిమిది నిమిషాల సీన్స్ తొలగించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.అయితే థియేటర్ వర్షన్ నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి తొలగించారని ఇటీవల వార్తలొచ్చాయి. అవి ఓటీటీలో యాడ్ చేస్తారంటూ భావించారు. ముఖ్యంగా సినిమా ఫ్లాష్బ్యాక్లో మీనాక్షి చౌదరి, వెంకటేశ్ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ను యాడ్ చేయనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ అలా జరగపోగా.. ఉన్న నిడివి కాస్తా తగ్గడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం నేడు ఓటీటీలో, టీవీలో ఒకేసారి ముందుకు వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ రావిపూడి భవిష్యత్తులో కుదిరితే హీరోగా సినిమా చేస్తానన్నాడు. ఆ సినిమాకు హీరోయిన్గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకోండి, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని యాంకర్ అనడంతో అతడు ఆశ్చర్యపోయాడు.దారుణమైన కథలు ప్రచారం..ఆ కామెంట్కు అనిల్ స్పందిస్తూ.. మా మధ్య కెమిస్ట్రీలు, ఫిజిక్స్లు ఏం లేవు. ఇప్పటికే మా గురించి యూట్యూబ్లో రకరకాలుగా రాస్తున్నారు. నాయనా.. నేనేదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నాను. వీళ్లేమో యూట్యూబ్లో వాయిస్ ఓవర్తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు నా భార్యకు, కుటుంబానికి వాట్సాప్లో పంపిస్తున్నారు. నా గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబూ.. దీనిపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశాను.ఎలాంటి కెమిస్ట్రీ లేదుమర్యాదగా ఆ వీడియోలు యూట్యూబ్లో నుంచి తీసేయండి. లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. నాకెటువంటి కెమిస్ట్రీలు లేవు. నా గురించే కాదు చాలామంది గురించి ఇలాగే కథలు అల్లుతున్నారు. వ్యూస్ కోసం లేని కథను అందమైన వాయిస్ ఓవర్తో రిలీజ్ చేస్తున్నారు. చాలామంది అది నిజమని నమ్ముతున్నారు. దానివల్ల చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నారు. లేనిపోనివి రాయకండి అని అనిల్ రావిపూడి కోరాడు.చదవండి: సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్ -
చిరు-అనిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్..
-
చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
డైరెక్టర్ అనిల్ రావిపూడికి విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ (ఫొటోలు)
-
లేడీ ఓరియంటెడ్ పవర్ఫుల్ చిత్రం.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
ఆనంది, వరలక్ష్మిశరత్కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం శివంగి. ఈ చిత్రాన్ని దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్పై నరేష్ బాబు నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి చేతుల మీదుగా శివంగి ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. సోఫాలో డైనమిక్ గా కూర్చున్న ఆనంది స్టన్నింగ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 7న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్ మ్యూజిక్ అందిస్తున్నారు. Happy to Unveil the Title & First look Poster of #Shivangi Movie.Congratulating the entire team for the grand success of the film.@anandhiActress @varusarath5 @Bharanidp #NareshBabuP #AHKaashif #SamjithMohammed #RaghuKulakarni @Teju_PRO @RainbowMedia_ @firstcopymovies pic.twitter.com/z5bXujUECT— Anil Ravipudi (@AnilRavipudi) February 19, 2025 -
చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్..
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విక్టరీ వేడుక (ఫొటోలు)
-
ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు భయ్యా!
అయితే సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు కావొస్తోంది. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆడియన్స్కు బిగ్ ట్విస్టే ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అదేంటో చూసేయండిట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..అయితే ఓటీటీ రిలీజ్పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనైనా ఓటీటీకి వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో కాస్తా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆడియన్స్కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్..త్వరలోనే సంక్రాంతి వస్తున్నాం మీ ముందుకు వస్తుందని జీ తెలుగు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే వెంకీమామ సంక్రాంతి బ్లాక్బస్టర్ ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయితే ఓటీటీ విడుదలపై మాత్రం ఎలాంటి తేదీని రివీల్ చేయలేదు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలోనే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025 -
'గోదారి గట్టు మీద రామచిలకవే... ' వీడియో సాంగ్ వచ్చేసింది
హీరో వెంకటేశ్ సంక్రాంతి రేసులో విన్నర్గా నిలిచారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్లో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే, ఈ మూవీకి భారీ బజ్ క్రియేట్ చేసిన ఒక సాంగ్ ఇప్పుడు వీడియో వర్షన్ను విడుదల చేశారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించి ఈ చిత్రం జనవరి 14న విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రమోషనల్ విషయంలో చేసిన మ్యాజిక్తో ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 310 కోట్లకు పైగానే రాబట్టింది. వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఆ పాట సినిమాకు ప్రధాన బలమైంది. ఈ సాంగ్కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆడియో లిరిక్స్ ఇప్పటి వరకు 170 మిలియన్ల మార్క్ను దాటింది. థియేటర్స్లో ఈ పాటకు ప్రేక్షకులు లేచి మరీ చిందులు వేశారు. ఇప్పటికే యూట్యూబ్, ఇన్స్టా రీల్స్ను ఓ ఊపు ఊపేసిన ఈ పాటను చాలా మంది రీక్రియేట్ కూడా చేశారు. ఇప్పుడు పూర్తి వీడియో సాంగ్ను మీరూ చూసేయండి. -
వచ్చే సంక్రాంతి కోసం చిరు మెగా ప్లాన్
-
ఈ సక్సెస్ చాలా పాఠాలు నేర్పింది: ‘దిల్’ రాజు
‘‘ఇండస్ట్రీలో బడ్జెట్ కాదు.. కథే ముఖ్యం. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం. కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని విజయాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అయితే కాంబినేషన్స్ అంటూ నాలుగైదేళ్లుగా మేం తడబడుతున్నాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunam) హిట్తో అనిల్ మళ్లీ మాకు ఒక రహదారి వేసి ఇచ్చాడు. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్. అయితే వాళ్లు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి.90 శాతం ఫెయిల్యూర్స్, కేవలం 10 శాతం మాత్రమే సక్సెస్ ఉండే ఇండస్ట్రీ ఇది. 20 ఏళ్లుగా మాతో ప్రయాణం చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్కి ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లు షేర్ రాబట్టింది. ఓ రీజినల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న రూ. 300 కోట్ల గ్రాస్ నంబర్ మా మూవీతో చూడబోతున్నందుకు హ్యాపీ’’ అని తెలిపారు. ‘‘20 ఏళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్కి ఉన్న విలువ ఇప్పుడు లేదు. ఇలాంటి సమయంలో వాళ్లు తలెత్తుకునేలా చేసిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’’ అని శిరీష్ పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ సాయికృష్ణ, రాజేశ్, హరి, శోభన్, ఎల్వీఆర్ మాట్లాడారు. -
భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరాలు (ఫొటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి
తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇళ్లు, కార్యాలయల్లో మూడు రోజులుగా ఐటీ సోదాలు (Income Tax Raids) జరుగుతున్నాయి. పుష్ప 2, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్రాజు ఇంట్లో, ఆఫీసులో.. సుకుమార్ ఇంట్లో.. అలాగే మైత్రీమూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.పండక్కొచ్చారుతాజాగా ఈ ఐటీ సోదాలపై విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh) స్పందించారు. మొదట ఈ ప్రశ్న ఎదురవగానే.. అవునా? నిజమా? అంటూ ఆశ్చర్యపోతున్నట్లు నటించారు. ఆ తర్వాత అన్నీ బానే జరిగిపోతాయన్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నామని మేము టైటిల్ పెట్టాం కదా.. వాళ్లు కూడా మేమూ సంక్రాంతికి వస్తున్నామని వచ్చారని చమత్కరించారు. ఇది సాధారణమేదిల్ రాజుపైనే కాదు, చాలామంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లకోసారి ఐడీ రైడ్స్ జరగడం సర్వసాధారణమేనని పేర్కొన్నారు. తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేవన్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటివరకు రూ.230 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.చదవండి: రామ్గోపాల్వర్మకు మూడు నెలల జైలు శిక్ష -
ఆ విషయంలో నేను శ్రీమంతుడిని: అనిల్ రావిపూడి
‘‘దర్శకుడిగా బ్లాక్బస్టర్ మూవీ తీయాలనే నా కలని తొలి సినిమా ‘పటాస్’తోనే నెరవేర్చుకోగలిగాను. నా బలం ఏంటో విశ్లేషించుకుంటూ, నా గత చిత్రాల ప్రభావం ప్రస్తుత మూవీస్పై పడకుండా జాగ్రత్త పడుతూ, ఆడియన్స్కు దగ్గరయ్యేలా కథ రాసుకోవడమే నా సక్సెస్ సీక్రెట్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi ). ‘పటాస్, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో అగ్ర దర్శకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి నేటి (జనవరి 23)తో పదేళ్లు. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు. ∙నా పదేళ్ల కెరీర్లో నేను చేసిన ప్రతి సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్రతి సినిమాకు ఒకొక్క మెట్టు ఎక్కించి, ఫైనల్గా ఈ ‘పొంగల్కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో ఆడియన్స్ నాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఆడియన్స్ నుంచి నాకు లభించిన ప్రేమే నా ఆస్తి. ఆ విషయంలో నేను శ్రీమంతుడిని. ఇక నా కెరీర్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్, వన్ వీక్లో రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ మూవీస్కి ఈ బలం ఉందని ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie)తో ఆడియన్స్ స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చారనిపిస్తోంది. ‘పటాస్’కు ముందు దర్శకుడ్ని కావడానికి నేను ఎక్కని కాంపౌండ్ లేదు. చాలామంది హీరోలను కలిశాను. నన్ను నమ్మి, కల్యాణ్రామ్గారు చాన్స్ ఇచ్చారు. అందుకే నా సక్సెస్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.దర్శకులు ఈవీవీగారితో కొందరు నన్ను పోల్చడాన్ని బిగ్గెస్ట్ కాంప్లిమెంట్గా భావిస్తున్నాను. గొప్ప బాధ్యత కూడా. జంధ్యాలగారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన నాకో స్ఫూర్తి. థియేటర్స్ లో ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉండి కథ రాసుకుంటాను. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటారు. అసలు నా బలం ఏమిటి అనేది అనలైజ్ చేస్తాను. ప్రతి సినిమాకి ముందు సినిమా తాలూక క్యారెక్టర్స్, రిసంబులెన్స్ పడకుండా జాగ్రత్త పడతాను. ఆటోమేటిక్ గా సినిమా ఫ్రెష్ గా ఉంటుంది.వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. చిరంజీవిగారితో నెక్ట్స్ మూవీ చేయబోతున్నాను. నాగార్జునగారితో ‘హలో బ్రదర్’లాంటి మూవీ చేయాలని ఉంది. -
'సంక్రాంతి వస్తున్నాం' మూవీ.. వారం రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన టాలీవుడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vastunnam Movie) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పొంగల్ బరిలో నిలిచిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రికార్డ్ను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో క్రేజీ మార్క్ను అధిగమించింది.ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ను దాటేసింది. ఐదు రోజుల్లోనే రూ.165 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ చిత్రంలో వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. వెంకటేశ్ కుమారుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు(రేవంత్) ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు.ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్..గతంలో ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్టైం హిట్గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ బ్లాక్బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.The OG of Sankranthi has conquered every region with unanimous dominance 💥💥💥#SankranthikiVasthunam grosses a sensational ₹203+ crores in its first week❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD FOR A REGIONAL FILM 🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam in cinemas now. Victory @venkymama… pic.twitter.com/QFg59gZ7Ri— Sri Venkateswara Creations (@SVC_official) January 21, 2025 -
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్పై అనిల్ రావిపూడి.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam Movie). ఈ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీమామ. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.200 కోట్లక దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఇటీవల హైదరాబాద్లో సక్సెస్ మీట్ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.(ఇది చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!)అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యాంకర్ సుమతో ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం -2 కథ అక్కడి నుంచే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ సంక్రాంతికే వస్తామని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని.. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి.. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అద్భుతంగా ఉందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.ఓవర్సీస్లో రికార్డ్ వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. సంక్రాంతికి వస్తున్నాం 2 కథ అక్కడ మొదలవుతుంది - #AnilRavipudi#SankranthikiVasthunam#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary #TeluguFilmNagar pic.twitter.com/ekTYLB9cpQ— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunnam Movie)తో వెంకటేశ్ ఖాతాలో మరో విక్టరీ పడింది. ఈ సినిమాకు ఎవరూ ఊహించని రేంజ్లో వసూళ్లు వస్తున్నాయి. పొంగల్కు రిలీజైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం తక్కువ బడ్జెట్ చిత్రం. కానీ బలమైన కామెడీ కంటెంట్.. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్ల ముందు క్యూ కట్టించేలా చేస్తోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది.రూ.200 కోట్లకు చేరువలో..అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టినట్లు చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సినిమా యూనిట్ తాజాగా చిట్చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు. ఈ భేటీలో ఒకరినొకరు ప్రశ్నలు అడుక్కున్నారు.మీనాక్షి స్థానంలో..సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చేయకపోతే ఆ పాత్ర ఇంకెవరు చేసేవారు? అలాగే నేను చేయకపోతే నా స్థానంలో ఇంకెవర్ని తీసుకునేవారు? అని ఐశ్వర్య.. అనిల్ రావిపూడిని ప్రశ్నించింది. అందుకు అనిల్.. ఐశ్వర్య చేయకపోతే నిత్యామీనన్, మీనాక్షి స్థానంలో పూజా హెగ్డే చేసేదన్నారు. ఆ పాత్రల్లో మమ్మల్ని తప్ప ఎవర్నీ ఊహించుకోలేదంటారేమోనని ఎదురుచూశాను అని ఐశ్వర్య పంచ్ వేసింది.ప్రభాస్తో నటించాలనుందన్న మీనాక్షిదీంతో అనిల్.. నిజం చెప్పాలంటూ భాగ్యం పాత్రను ఐశ్వర్య రాజేశ్ తప్ప ఇంకెవరూ అలా చేయలేరు, అలాగే పోలీస్ పాత్ర చేసిన మీనాక్షిలో ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఉందని కవర్ చేశాడు. ఏ హీరోతో పని చేయాలని ఉందన్న ప్రశ్నకు మీనాక్షి.. అందరు హీరోలతో నటించాలనుందని.. అందులో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడంది. ఐశ్వర్య.. జూనియర్ ఎన్టీఆర్తో పని చేయాలనుందని తెలిపింది. అనిల్ రావిపూడి.. చిరంజీవితో చేయాలనుందని, వేరే భాషల్లో అయితే విజయ్ను డైరెక్ట్ చేయాలనుందన్నాడు. A storm of love at the theaters and a reign of dominance at the box office 🔥#BlockbusterSankranthikiVasthunam grosses a MASSIVE 161+ Crores Worldwide in 5 Days💥💥All Areas in Profit Zone and heading towards 200Cr+ Gross mark ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/ocLq3HYfE9… pic.twitter.com/s7zfzGwT4e— Sri Venkateswara Creations (@SVC_official) January 19, 2025 చదవండి: 'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..? -
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్.. మూడు రోజుల్లోనే క్రేజీ మార్క్!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.కాగా.. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మూడు రోజులకే వందకోట్ల మార్క్ను అధిగమించి మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది.ఓవర్సీస్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.చదవండి: కట్టెల పొయ్యిపై చేపల పులుసు వండిన నాగ చైతన్యఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ.Any centre, single hand ~ Victory @venkymama 🔥🔥🔥106Cr+ Gross worldwide in 3 Days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥❤️🔥❤️🔥The OG of Sankranthi has set the box office on fire, bringing festive celebrations alive in theatres 💥— https://t.co/ocLq3HYNtH… pic.twitter.com/AR5ZlaPvjR— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీమామ కెరీర్లోనే ఆల్టైమ్ రికార్డ్
వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'పండగకి వచ్చారు.. పండగని తెచ్చారు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)'సంక్రాంతికి వస్తున్నాం' కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. పండగకి వచ్చారు ~ పండగని తెచ్చారు ❤️🔥❤️🔥❤️🔥#SankranthikiVasthunam grosses 45CRORE+ Worldwide on its first day at the box office🔥Victory @VenkyMama’s ALL TIME CAREER HIGHEST OPENING EVER 💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶@anilravipudi @aishu_dil… pic.twitter.com/V8A7Tha5lE— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025 -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
విజయ్ చివరి సినిమా రీమేక్? ఉన్నదంతా కక్కేసిన నటుడు.. అనిల్ అసహనం
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దీనికంటే ముందు ఆయన భగవంత్ కేసరి సినిమా (Bhagavanth Kesari Movie) చేశాడు. దీనికి అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈయన కామెడీని పక్కన పెట్టి మొదటిసారి ఎమోషనల్ డ్రామా పండిచే ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలోనే సక్సెసయ్యాడు. 2023లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది.ఒకే సినిమాను ఐదుసార్లు చూసిన విజయ్అయితే ఈ సినిమాపై తమిళ స్టార్ విజయ్ (Vijay) మనసు పారేసుకున్నాడట! ఒకటీరెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు చూశాడట! ఈ విషయాన్ని తమిళ నటుడు వీటీవీ గణేశ్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈవెంట్లో వెల్లడించాడు. గతేడాది చెన్నైలో హీరోను విజయ్ను కలిశాను. నాకు అనిల్ రావిపూడి ఫ్రెండ్ అని విజయ్కు తెలుసు. తన చివరి సినిమాను అనిల్ను డైరెక్ట్ చేయమని అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. భగవంత్ కేసరి సినిమాను విజయ్ ఐదుసార్లు చూశాడు.పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉన్నా..తనకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. తనకోసం తమిళంలో ఈ సినిమా తీస్తావా? అని అనిల్ రావిపూడి (Anil Ravipudi)ని పిలిచి అడిగాడు. కానీ అందుకు అనిల్ ఒప్పుకోలేదు. తాను రీమేక్ చేయనని ముఖం చెప్పి వచ్చేశాడు. నలుగురైదుగురు పెద్ద డైరెక్టర్లు విజయ్ చివరి సినిమా చేసేందుకు లైన్లో నిల్చుంటే అనిల్ మాత్రం చేయనని చెప్పి వచ్చేశాడు అని చెప్పుకొచ్చాడు. ఇంతలో అనిల్ రావిపూడి మధ్యలో కలుగజేసుకుంటూ సినిమానే చేయను అనలేదు, రీమేక్ చేయనన్నాను అని క్లారిటీ ఇచ్చాడు.అప్పుడు నేనూ చూశాగణేశ్ మళ్లీ మాట్లాడుతూ.. విజయ్ ఆ సినిమాను అయిదుసార్లు ఎందుకు చూశాడా? అని నేనూ భగవంత్ కేసరి చూశాను. అప్పుడు నాకు.. అనిల్ బానే తీశాడనిపించింది అని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ చివరి సినిమా ఏదై ఉంటుందన్న చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి వద్దన్నప్పటికీ మరో డైరెక్టర్తో భగవంత్ కేసరి రీమేక్ చేస్తాడా? లేదా? ఇంత మంచి ఆఫర్ను అనిల్ ఎందుకు వదులుకున్నాడు? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ 69 వ సినిమాయే చివరి చిత్రమని అందరూ భావిస్తున్నారు. దీని తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నాడు.చదవండి: గేమ్ ఛేంజర్కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే? -
ఆ సాంగ్ విని అర్థరాత్రి రెండు గంటలకు డ్యాన్స్ చేశా: వెంకటేశ్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో విక్టరీ వెంకటేశ్(venkatesh) ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. యూట్యూబ్లో మిలియన్లకొద్ది వ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ పాట మొదట వెంకటేశ్తో పాడించాలని అనుకోలేదట మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఆ ఆలోచన లేదట. కానీ వెంకటేశ్ పాడతానని అనడంతో ట్రై చేశారట. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ పాట గురించి వెంకటేశ్ కూడా మాట్లాడారు. తనకు బాగా నచ్చడంతోనే ఆ పాట పాడినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పాట వినగానే తెలియకుండా డ్యాన్స్ చేశాడట.‘అనిల్ రావిపూడి(Anil Ravipudi) నాకు ఈ పాటను షేర్ చేసి వినమని చెప్పారు. అర్థరాత్రి 2 గంటలకు ఆ సాంగ్ వింటూ తెలియకుండా డాన్స్ చేశాను. ఎదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్ లో ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే ఉంది. ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది’ అని వెంకటేశ్ అన్నారు. అలాగే రమణ గోగుల పాడిన పాటకు బాగా నచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాట పాడడం, దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు.ముచ్చటగా మూడోదిఅనిల్ రావిపూడి, వెంకేటశ్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కూడా దిల్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రాలే. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈచిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.ప్రమోషన్స్లో సూపర్ హిట్ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో మొదటి చిత్రం గేమ్ ఛేంజర్ అల్రెడీ రిలీజైంది. రేపు(జనవరి 12) బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్తో ‘సంక్రాంతికి వస్తున్నాం’రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్లలో విషయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముందంజలో ఉంది. అన్నింటికంటే చివరిగా రిలీజ్ అవుతున్నప్పటికీ.. మిగతా రెండు సినిమాల కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించాయి. డిఫరెంట్ ప్రమోషన్స్తో సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లారు. ఒక పక్క అనిల్ రావిపూడి హీరోయిన్లు, మరోపక్క విక్టరీ వెంకటేశ్, అందరూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని చేశారు. కేవలం ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా టీవీ షోలు, కామెడీ షోలు అన్నింటిల్లోనూ పాల్గొన్నారు. వెంకటేశ్ అయితే గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ప్రమోషన్లలో సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలో రానిస్తుందో లేదో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. -
సంక్రాంతికే రావాలనుకున్నాం: అనిల్ రావిపూడి
‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘బ్లాక్ బస్టర్ ΄పొంగల్...’ అనే పాట వెంకటేశ్గారికి చాలా నచ్చింది. దీంతో ఆయనే స్వయంగా ఆ పాట పాడతానని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. కానీ ఆయన 20 నిమిషాల్లో ఆ పాట పాడటంతో సంగీత దర్శకుడు భీమ్స్ కూడా షాక్ అయ్యాడు’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ వెంకటేశ్గారితో నేను తీసిన ‘ఎఫ్ 2’ (2019) సంక్రాంతికి వచ్చి, విజయం సాధించింది. ‘ఎఫ్ 3’ కూడా సంక్రాంతికి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. మా కాంబోలో మూడో సారి చేసే సినిమాని ఎలాగైనా పండగకి తీసుకొస్తే బావుంటుందని సినిమా ఆరంభం అప్పుడే సంక్రాంతికి రావాలనుకున్నాం. కథ అనుకున్నప్పుడే ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్కి ఫిక్స్ అయ్యాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్కి సంబధించినది. సెకండ్ హాఫ్లో నాలుగు రోజుల ప్రయాణం సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర వెంకటేశ్గారిది. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ట్రైలర్ అందరికీ బాగా నచ్చింది. థియేటర్స్కి వచ్చాక సినిమా అద్భుతంగా నచ్చితే మూవీ బ్లాక్ బస్టరే.⇒ కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి, గొప్పగా తీస్తే సరిపోదు. థియేటర్స్కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం. ఈసారి ప్రమోషన్పై ఎక్కువ ఫోకస్ పెట్టాం. వెంకటేశ్గారి లాంటి పెద్ద స్టార్ హీరో సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్కి చాలా హెల్ప్ అయ్యింది. నేను హీరోలకి ఫ్యాన్గానే ఉంటాను. రిలేషన్ని పాజిటివ్గా ఉంచుతాను కాబట్టి వాళ్ల నుంచి కూడా అంతే ప్రేమ వస్తుంది.⇒ ‘దిల్’ రాజుగారితో ‘పటాస్’ సినిమాతో నా ప్రయాణం ఆరంభమైంది. రాజుగారు, శిరీష్ గారు అంటే నా కుటుంబం లెక్క. మాది పదేళ్ల ప్రయాణం. ఇక ఉమెన్ సెంట్రిక్గా ఒక స్పోర్ట్స్ స్టోరీ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ నేపథ్యంలో మూవీ చేస్తాను. ‘ఎఫ్ 4’ సినిమా కచ్చితంగా ఉంటుంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి కూడా ఫ్రాంచైజీలు చేసుకునే అవకాశం ఉంది. -
72 రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పూర్తి.. నాలుగు నిమిషాలే వృథా!
సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా రెండున్నర గంటల సినిమాను దాదాపు 3 గంటలకు పైగా నిడివితో షూట్ చేస్తాడు. ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ సినిమా అయినా సరే ఎడిటింగ్లో అరగంట సీన్స్ అయినా ఎగిరిపోతాయి. చాలా తక్కువ మంది మాత్రమే కావాల్సిన నిడివి మేరకు మాత్రం చిత్రీకరణ చేస్తారు. వారిలో పూరీ జగన్నాథ్, ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడా లిస్ట్లోకి అనిల్ రావిపూడి(Anil Ravipudi)ని కూడా ఎక్కించొచ్చు. ఎడిటింగ్కి అవకాశం లేకుండా ముందే లెక్కలు వేసుకొని సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.నాలుగైదు నిమిషాలే వృథాసాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. రాజమౌళి లాంటి వాళ్లు అయితే మూడు ఏళ్లకు పైనే సమయం తీసుకుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్ర కేలవం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. అది కూడా స్టార్ హీరో సినిమా. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie). ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి బరిలో..అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్(venkatesh) సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటించారు. సంక్రాంతికి కానుకగా.. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతి బరిలో మరో రెండు బడా సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఇక బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెంకటేశ్తో ఫోటోలు దిగిన 3 వేల మంది ఫ్యాన్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విడుదల నేపథ్యంలో విక్టరీ వెంకటేశ్ తన అభిమానులతో పోటోలు దిగారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విజయం కోసం చిత్ర యూనిట్ సరికొత్తగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడుతుంది. తాజాగా వెంకటేశ్ 3000 మందికి పైగా అభిమానులతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేశ్కు జోడీగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. వినూత్నమైన ముక్కోణపు క్రైమ్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకు మహారాజ్' వంటి చిత్రాలతో పోటీ పడి వాటికి మించిన ప్రమోషన్స్తో ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరైంది. -
వెంకీ మామ పాత్రల్లో హీరోయిన్స్.. వీరిద్దరిని గుర్తు పట్టారా?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రంలో వెంకీ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు . ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. అయితే అందరిలా రోటీన్గా కాకుండా కాస్తా డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల సాంగ్ రిలీజ్ సమయంలోనూ అందరికంటే భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఈ సారి ఏకంగా వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలను ఎంచుకున్నారు. అదేంటో మీరు చూసేయండి.ఈ మూవీ మీనాక్షి చౌదరి, ఐశ్వర్వ రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా వీరిద్దరిని వెంకీ గెటప్లోకి మార్చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరిని వెంకీ చిత్రం బొబ్బిలి రాజాలో రాజా పాత్ర గెటప్లో ముస్తాబు చేశారు. అలాగే ఐశ్వర్య రాజేశ్ వెంకటేశ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం చంటి పాత్ర గెటప్లో సందడి చేసింది. వీరిద్దరికి సంబంధించిన వీడియోలను చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఇద్దరు హీరోయిన్లు వెంకీ మామ వేషధారణలో డ్యాన్స్తో అదరగొట్టేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా అనిల్ రావిపూడి జయం మనదేరా చిత్రంలోన మహదేవ నాయుడు పాత్ర, ఘర్షణ చిత్రంలోని డీసీపీ రామచంద్ర పాత్రలో దిల్ రాజు సందడి చేశారు.కాగా.. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి మూడో సాంగ్ కూడా విడుదలైంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ ఆలపించడం. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. Let's celebrate the new year with a very special interview, "VENKY MAMAs tho #SankranthikiVasthunam" ❤️🔥Presenting @aishu_dil as CHANTI from #CHANTI 😍Stay tuned for the next one and keep guessing 😉#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/jYNxMrAbGl— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 Ayyo Ayyo Ayayyoooo 😄Presenting @Meenakshiioffl as RAJA from #BobbiliRaja 😍Stay tuned for the next one and keep guessing 😉#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/btrn9IedG6— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024 -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం.. బ్యాట్ పట్టి, స్టెప్పులేసిన వెంకీమామ (ఫోటోలు)
-
ఈసారి సంక్రాంతి నాదే అంటున్న వెంకీ మామ
-
పెదవుల పైన మెరుపులు మెరిశాయే...
‘‘నా లైఫ్లోనున్న ఆ ప్రేమ పేజీ తీయనా... పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..’ అంటూ మొదలవుతుంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘మీనూ...’ పాట. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటించారు. ఈ ట్రయాంగిల్ క్రైమ్ కామెడీ సినిమాను ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘మీనూ...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిశాయే... తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిశాయే... ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే...’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రణవీ ఆచార్యతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడారు. -
సంక్రాంతి కోసం ప్రేమ పేజీలు ఓపెన్ చేసిన వెంకీ
హీరో వెంకటేష్ కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి మరో అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే ఈ పాట కూడా మ్యూజికల్ హిట్గా నిలవనుంది.అనంత శ్రీరామ్ రచించిన ఈ సాంగ్ను భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య ఆలపించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్ కానుంది. -
చిరంజీవితో సినిమా.. అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
-
చిరంజీవితో సినిమా.. అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు
డైరెక్టర్ అనిల్ రావిపూడి.. టాలీవుడ్లో ఈ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు తన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.. పటాస్,రాజా ది గ్రేట్, ఎఫ్2,సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర'లో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. త్వరలో ఈ చిత్రం విడుదలపై ప్రకటన రానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను నిర్మించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండనుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. త్వరలో అధికారికంగా ఈ కాంబినేషన్పై ప్రకటన రానుంది.అనిల్ రావిపుడి కూడా ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన చిన్నతనం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వేంకటేశ్ చిత్రాలను చూస్తూ పెరిగానని అనిల్ గుర్తు చేసుకున్నారు. వాళ్లతో సినిమా చేయడం తన లక్ అని ఆయన అన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వేంకటేశ్లతో కలిసి సినిమా చేశాను. ఇప్పుడు చిరంజీవితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. 2025 ఏప్రిల్లో అనిల్- చిరుల సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఇక చిరు ఇటీవలే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనిల్ సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. -
వెంకటేష్ బర్త్డే కానుక.. రెండో సాంగ్ ప్రోమో అదిరిపోయింది
హీరో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ యూనిట్ నుంచి శుభాకాంక్షలు చెబుతూ రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..' అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు మీను.. అంటూ సాగే పాట నుంచి ప్రోమో రిలీజ్ అయింది. పూర్తి సాంగ్ త్వరలో విడుదల కానుంది.వెంకటేష్ తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్లో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్తో సంక్రాంతి రేసులో ఉన్న ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. -
స్టయిలిష్గా...
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా గురువారం (డిసెంబరు 12) వెంకటేశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఆయన స్టయిలిష్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలోని రెండో పాట ‘మీనూ... ప్రోమోను నేడు రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. -
18 ఏళ్ల తర్వాత 'సంక్రాంతి' కోసం సాంగ్ పాడిన రమణగోగుల
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఈసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న సినిమా పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.‘గోదారి గట్టు మీద రామచిలకవే... గోరింటాకెట్టుకున్న చందమామవే..!’ అంటూ సాగే ఈ సాంగ్కు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఈ పాటను ఆలపించడం విశేషం. ఫిమేల్ లిరిక్స్ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. -
విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం'. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో మీరు చూసేద్దాం.మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..'ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మరో డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఈ అవకాశమిచ్చిన అనిల్ రావిపూడి సార్కు థ్యాంక్స్.' అని అన్నారు.కాగా.. ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంచకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. నా 3 కోరికలలో ఒకటి ఈ సినిమాలో తీరింది - Actress #MeenakshiChaudhary#Venkatesh #AnilRavipudi @SVC_official #SankranthikiVasthunam #TeluguFilmNagar pic.twitter.com/aL1Bx7JERI— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2024 -
సంక్రాంతి బరిలో వెంకీమామ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న సంక్రాంతి వస్తున్నాం. వెంకీ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల టైటిల్ ప్రకటించిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంటకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నా.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ENTERTAINMENT LOADED 😎FUN READY TO FIRE 🔥The Blockbuster combo of Victory @VenkyMama and Hit Machine Director @AnilRavipudi is all set for a VICTORIOUS HATTRICK this Sankranthi 💥💥💥#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.… pic.twitter.com/m0isUz0FdA— Sri Venkateswara Creations (@SVC_official) November 20, 2024 -
డబ్బింగ్ స్టార్ట్
హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపిస్తారు.ఈ పోలీసాఫీసర్ భార్యగా ఐశ్వర్యా రాజేష్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. కాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యాయి. ‘‘ఇప్పటివరకూ జరిపిన షూటింగ్తో తొంభై శాతం సినిమా పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే డబ్బింగ్ ఆరంభించాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్కి మరో కారు గిఫ్ట్
సినిమా హిట్ అయితే ఆ ఆనందంలో నిర్మాతలు.. సదరు హీరో, దర్శకులకు బహుమతులు ఇవ్వడం సాధారణమైన విషయం. అయితే మూవీ రిలీజైన ఏడాది దాటిపోయిన తర్వాత కూడా కారు బహుమతిగా ఇచ్చే నిర్మాతలు ఉంటారా? అంటే టాలీవుడ్లో ఉన్నారనిపిస్తోంది. ఆయనే సాహు గారపాటి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్గా ఇచ్చారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!)అనిల్ రావిపూడి గత సినిమా 'భగవంత్ కేసరి'. గతేడాది దసరాకు రిలీజైంది. మరీ అద్భుతం కానప్పటికీ ఓ మాదిరిగా ఆడింది. ఇందులో బాలయ్య-శ్రీలీల.. తండ్రి కూతురు పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అప్పట్లోనే నిర్మాత సాహు గారపాటి.. అనిల్కి టయోటా వెల్ఫైర్ కారు బహుమతిగా ఇచ్చారు.తాజాగా ఇప్పుడు మళ్లీ అదే మోడల్ మరో కారుని గిఫ్ట్గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర కోటిన్నర రూపాయలు పైనే. ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్తో సినిమా చేస్తున్నాడు. దీనికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ అనుకుంటున్నారు. పేరుకి తగ్గట్టే ఇది సంక్రాంతి పండగకి రిలీజ్ అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ) -
అతిథి ఆన్ సెట్
వెంకటేశ్ సినిమా సెట్స్లో సందడి చేశారు బాలకృష్ణ. హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ట్రైయాంగిల్ క్రైమ్ డ్రామా చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే పొల్లాచ్చిలో ఈ సినిమాకు చెందిన ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణ ముగిసింది.ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సెట్స్లోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. ఈ అతిథి తమ సెట్కి రావడంతో యూనిట్ సంబరపడిపోయింది. ఈ సందర్భంగా క్లిక్మనిపించిన ఫొటోలను షేర్ చేసింది చిత్రబృందం. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
నాటకం అమ్మలాంటిది – అనిల్ రావిపూడి
‘‘నాటకం అమ్మలాంటిది. సినిమా అనేది ఆ అమ్మకి బిడ్డలాంటిది. నాటకాల గురించి ఈ తరానికి చాలా కొద్దిగా తెలిసి ఉంటుంది. కానీ, నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగాన్ని ఏలిన చాలామంది గొప్పనటులు ఉన్నారు. అలాంటి నాటకరంగాన్ని నేపథ్యంగా ఎంచుకుని మంచి కాన్సెప్ట్తో తీసిన ‘ఉత్సవం’ సినిమా విజయోత్సవం జరుపుకోవాలి’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జు¯Œ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనిల్ రావిపూడి అతిథిగా çహాజరయ్యారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు దిలీప్ ప్రకాష్. ‘‘కళ కోసం జీవితాలన్నీ అంకితం చేసిన 150 కుటుంబాలు ఉన్నాయి. వారి అంకితభావం చూసి ‘ఉత్సవం’ సినిమా తీశా’’ అని అర్జు¯Œ సాయి తెలిపారు. ‘‘ఉత్సవం’ చాలా మంచి సినిమా’’ అని సురేష్ పాటిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనూప్ రూబె¯Œ్స, లిరిక్ రైటర్ అనంతశ్రీరామ్, రైటర్ రమణ గోపిశెట్టి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడారు. -
పొల్లాచ్చికి పోదాం
పొల్లాచ్చికి పోదాం అంటున్నారట హీరో వెంకటేశ్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సిని మాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, అతని మాజీ ప్రేయసి... ఇలా మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్లో ్రపారంభమైంది. అయితే హీరో వెంకటేశ్ పాల్గొనని సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. కాగా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల రెండో వారంలో పొల్లాచ్చిలో ్రపారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో వెంకటేశ్తో పాటు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ కూడా పాల్గొంటారట. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. -
ఆలస్యంగా మొక్కు చెల్లించిన దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. శుక్రవారం (జూలై 5న) నాడు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నాడు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడాడు. భగవంత్ కేసరి సినిమా తర్వాత శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవాలనుకున్నాం. అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు ఆ మొక్కులు సమర్పించాం అని తెలిపాడు.సినిమాల గురించి తెలియజేస్తూ.. వెంకటేశ్తో ఓ సినిమా మొదలుపెట్టాం. ఆయనతో ఇది నా మూడో సినిమా. దిల్ రాజు బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది ఎఫ్ 4 కాదు.. మరో జానర్లో ట్రై చేస్తున్నాం. ఇది కామెడీ ఎంటర్టైనర్గా ఉండనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అని పేర్కొన్నాడు. కాగా అనిల్ రావిపూడి గతేడాది భగవంత్ కేసరితో హిట్ అందుకున్నాడు. బాలకృష్ణ హీరోగా నటించగా షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ మూవీ లాంగ్ రన్లో దాదాపు రూ.140 కోట్లు రాబట్టింది.చదవండి: దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్ -
హీరో వెంకటేష్ భార్యగా ‘ఐశ్వర్య రాజేష్’ (ఫొటోలు)
-
వెంకీ సరసన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?
ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్. శైలేశ్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం వెంకీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ వెంకీ సరసన మరో హీరోయిన్ కనిపించనుంది. తాజాగా కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేశ్ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఫుల్ యాక్షన్ కథాచిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Welcoming on board, the talented @aishu_dil as the EXcellent Wife in #VenkyAnil3 ❤️Victory @VenkyMama #DilRaju #Shirish #BheemsCeciroleo @YoursSKrishna @SVC_official #SVC58 pic.twitter.com/YQy5RlmMDp— Anil Ravipudi (@AnilRavipudi) July 2, 2024 -
వెంకటేశ్- అనిల్ రావిపూడి హ్యాట్రిక్ సినిమా
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా ప్రకటన వచ్చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఇప్పటికే ఎంపిక చేశారు. తాజాగా మరో పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్ని తీసుకున్నట్లు దర్శకుడు అనిల్రావిపూడి ప్రకటించారు.అయితే, తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టును స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆయన పూజలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ కావడంతో ఈ ప్రాజెక్ట్పై ఫ్యాన్స్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమని దర్శకుడు అన్నారు. ఇందులో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారని ముందే అనిల్ రివీల్ చేశాడు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్టైనర్ మూవీ అని ఆయన అన్నాడు. ఈ నెల 3 నుంచి ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. -
కథ విన్నారా?
హీరో వెంకటేష్ నుంచి మరో కొత్త సినిమా కబురు వినే సమయం ఆసన్నమైందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్సిరీస్ నెక్ట్స్ సీజన్స్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు వెంకటేష్. ఈ సిరీస్ షూటింగ్ను పూర్తి చేసుకున్న తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమా సెట్స్లో ఆయన జాయిన్ అవుతారని తెలుస్తోంది.కాగా ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీకి రైటింగ్ టీమ్లో పనిచేసిన నందు అనే వ్యక్తి ఓ కథను వెంకటేష్కి వినిపించడంతో, ఆయన సానుకూలంగా స్పందించారట. దీంతో ఈ కథకు తుది మెరుగులు దిద్ది మళ్లీ వెంకటేష్కి వినిపించనున్నారట నందు. అన్నీ కుదరితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ భోగట్టా. -
ముహూర్తం కుదిరింది
‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ఈ మూడు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను అధికారికంగా వెల్లడించి, వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను పూర్తి చేశారట దర్శకుడు అనిల్ రావిపూడి. మరోవైపు ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్లో తన వంతు షూటింగ్ను పూర్తి చేశారట వెంకటేశ్. దీంతో వెంకటేశ్–అనిల్ల కాంబినేషన్లోని సినిమా ప్రారంభోత్సవానికి జూలై మొదటివారంలో ముహూర్తం కుదిరిందని తెలిసింది. అదే నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. అలాగే ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్గా నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
F4 పై అనిల్ రావిపూడి ఫోకస్..
-
యేవమ్ అంటే...
చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్రాజ్, అషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘యేవమ్’. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. చాందినీ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ వికారాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. తెలంగాణ కల్చర్కు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. నేను మొదటిసారి పోలీసాఫీసర్గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. సైకలాజికల్ ఎమోషన్స్ చాలా ఉంటాయి’’ అన్నారు. ‘‘యేవమ్’ అంటే ‘ఇది ఇలా జరిగింది’ అని అర్థం. విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నలుగురు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో కలుసుకుని, అక్కడి నుంచి వారి ప్రయాణాన్ని మొదలు పెడితే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథాంశం’’ అన్నారు ప్రకాశ్. -
ఆగస్టులో క్రైమ్ కామెడీ స్టార్ట్
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఓ మాజీ పోలీసాఫీసర్, అతని భార్య, ఆ పోలీసాఫీసర్ మాజీ ప్రేయసి... ప్రధానంగా ఈ మూడు పాత్రల నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది.ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను జూలై చివర్లో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ షూటింగ్తో వెంకటేశ్ బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సిరీస్ చిత్రీకరణ పూర్తయ్యాక అనిల్ రావిపూడి డైరెక్షన్లోని సినిమా సెట్స్లోకి వెంకటేశ్ ఎంట్రీ ఇస్తారని ఊహించవచ్చు. -
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. మరోవైపు ఐపీఎల్లో ఈసారి హైదరాబాద్ జట్టు దంచికొట్టే ఫెర్ఫార్మెన్స్ ఇస్తోంది. దీంతో జనాలు దృష్టి క్రికెట్ పైకి మళ్లింది. ఈ క్రమంలోనే థియేటర్లకు ప్రేక్షకులు రావడమే తగ్గించేశారు. ఈ క్రమంలోనే మొన్నీమధ్య ఓ సినిమా ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కొన్ని కామెంట్స్ చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపాయి. ఇప్పుడు వాటిపై మళ్లీ ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రీసెంట్గా 'కృష్ణమ్మ' సినిమా ఈవెంట్కి హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి.. 'ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు. సాయంత్రం థియేటర్లకు వచ్చి మూవీస్ చూడండి' అని కాస్త ఘాటుగానే చెప్పాడు. దీంతో సినిమాల కంటే ఐపీఎల్ బెస్ట్, సినిమాలు చూడకపోయినా కొంపలేం మునిగిపోవు అని నెటిజన్స్ రిటర్న్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో తాజాగా మరో కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూనే అసలేం జరిగిందో చెప్పుకొచ్చాడు.'మే 19న డైరెక్టర్స్ డే వేడుకలు చేస్తున్నాం. ఆ రోజు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఈ మధ్య ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు మరో రకంగా జనాల్లోకి వెళ్లాయి. నేను ఆ ఈవెంట్ కి వెళ్లే ముందు ఓ డిస్ట్రిబ్యూటర్ని కలిశాను. వేసవిలో ఐపీఎల్ వల్ల కూడా సినిమాలు సరిగా ఆడట్లేదని చెప్తే ఆ ఫ్లోలో అలా మాట్లాడేశాను. ఐపీఎల్ చూడండి. సినిమాలు కూడా చూడండి. నేనూ ఐపీఎల్ చూస్తా. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు' అని అనిల్ రావిపూడి.. వివాదాస్పద కామెంట్స్కి పుల్స్టాప్ పెట్టేశాడు.(ఇదీ చదవండి: ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి) -
ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి
టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కృష్ణమ్మ. అతీరా రాజ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. మే 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు కొరటాల శివ, అనిల్ రావిపూడి, రాజమౌళి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ముసుగేసి గుద్దితే..ఈ కార్యక్రమంలో జక్కన్న మాట్లాడుతూ చిత్ర యూనిట్ను మెచ్చుకున్నాడు. టైటిల్, టీజర్, ట్రైలర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. సత్యదేవ్కు స్టార్డమ్ తెచ్చే సినిమా కృష్ణమ్మ అవ్వాలని కోరాడు. చివర్లో అనిల్ రావిపూడి వెనకాల కెమెరా పట్టుకుని తిరుగుతూ అతడి మీద ముసుగేసి గుద్దితే వారికి రూ.10 వేలు ఇస్తానని బంపరాఫర్ ఇచ్చాడు.రాజమౌళిని ఇరికించేసిన డైరెక్టర్అనిల్ రావిపూడి మీద ఈ రేంజులో ఫైరవడానికి కారణం లేకపోలేదు. అతడు స్టేజీపైకి వచ్చీరావడంతోనే దేవర అప్డేట్ చెప్పాలని కొరటాల శివను, మహేశ్బాబుతో చేస్తున్న మూవీ జానర్ ఏంటి? కథేంటి? అని రాజమౌళిని ఇరికించేశాడు. అందుకే జక్కన్న ఇలా తనదైన స్టైల్లో నాలుగు కొట్టమని కౌంటర్ వేశాడు. ఇది విని షాకైన అనిల్ రావిపూడి.. పది వేలంటే నిజంగానే కొట్టేస్తారు.. దయచేసి ప్రైజ్మనీ తగ్గించండి అని కోరాడు. వీరిద్దరి స్పీచ్లు ప్రస్తుతం వైరల్గా మారాయి.చదవండి: రోజుకు 12 గంటలు పని చేయించుకున్నారు.. డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు! -
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విక్టరీ వినోదం
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ (ఈ చిత్రాల్లో వరుణ్ తేజ్ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘‘వెంకటేశ్గారితో మూడోసారి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో ఆరోసారి, భీమ్స్తో తొలిసారి.. 2025 సంక్రాంతికి ‘విక్టరీ వినోదం’తో కలుద్దాం’’ అని ఈ సినిమా గురించి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఓ మాజీ పోలీస్ ఆఫీసర్, అతని మాజీ ప్రేయసి, అతని భార్య... ఈ ముగ్గురి పాత్రల చుట్టూ సాగే క్రైమ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. -
వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే?
-
ఆరంభం అప్పట్నుంచేనా..?
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ (వరుణ్ తేజ్ మరో హీరో) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ్రపారంభించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని, సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్ర యూనిట్ టార్గెట్ అని సమాచారం. -
Premalu Movie: ‘ప్రేమలు’ సినిమా సక్సెస్మీట్ (ఫొటోలు)
-
వెంకటేశ్కి జోడీగా...
హీరోయిన్గా మీనాక్షీ చౌదరి ప్రస్తుతం ఫుల్ఫామ్లో ఉన్నారు. తమిళ హీరో విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, వరుణ్ తేజ్ ‘మట్కా’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, విశ్వక్ సేన్ పదో చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు ఈ యంగ్ బ్యూటీ. కాగా మీనాక్షీకి హీరోయిన్గా మరో సూపర్ చాన్స్ వచ్చిందని టాక్. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత త్రిష పేరు వినిపించింది. తాజాగా మీనాక్షీ చౌదరి పేరు తెరపైకి వచ్చింది. వెంకీ వంటి స్టార్ హీరో సినిమా కాబట్టి మీనాక్షీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చేసినట్టేనని అంటున్నారు ఫిల్మ్నగర్ వాసులు. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని ఫిల్మ్నగర్ సమాచారం. ఇంకా.. కథ రీత్యా ఇందులో ఓ గెస్ట్ రోల్ ఉందని, ఈ పాత్రలో రవితేజ లేదా బాలకృష్ణ కనిపిస్తారని భోగట్టా. -
ఆ హిట్ ఫ్రాంచైజీలోకి త్రిష.. జోడీ కుదిరిందా?
హీరో వెంకటేశ్, హీరోయిన్ త్రిష నాలుగోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. వీరిద్దరూ గతంలో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (2007), ‘నమో వెంకటేశ’(2010), ‘బాడీగార్డ్’(2012) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ హిట్ జోడీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. వెంకటేశ్, వరుణ్ తేజ్లతో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాలు తీసి, హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి. ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్ 4’ సినిమా ఉంటుందని ‘ఎఫ్ 3’ క్లైమాక్స్లో హింట్ ఇచ్చింది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజే తాజాగా వెంకీ–అనిల్ కాంబినేషన్ లో మూడో సినిమా నిర్మించనున్నారట. ఈ మూవీలో హీరోయిన్గా త్రిషని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అంటే.. దాదాపు పుష్కరకాలం తర్వాత వెంకటేశ్–త్రిష మరోసారి జోడీగా నటించనున్నారన్నమాట. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్ను ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్తో అనిల్ రావిపూడి తెరకెక్కించేది ‘ఎఫ్ 4’ సినిమానా? లేక మరొక చిత్రమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
చిరు మూవీతో వెంకీ సాహసం.. F2 రిపీట్ అవుద్దా..!
-
సీక్వెల్ కోసం వెంకటేశ్– అనిల్ రావిపూడి ప్లాన్
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల (వరుణ్ తేజ్ మరో హీరో) కోసం కలిసి పని చేసిన హీరో వెంకటేశ్–దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల అనిల్ రావిపూడి ఓ కథను వెంకటేశ్కు వినిపించారట. ఈ కథ బాగా నచ్చడంతో వెంకీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. అయితే వెంకటేశ్–అనిల్ రావిపూడి కాంబినేషన్లోని సినిమా ‘ఎఫ్ 4’ అవుతుందా? లేక వేరే కొత్త కథా? అనే విషయాలపై స్పష్టత రావాల్సింది. మరి... వెంకటేశ్–అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా సెట్స్ పైకి వెళ్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
3 సం|| వెండితెరకు మహేష్ బాబు దూరం
-
మెకానిక్ రెడీ
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. నాగ మునెయ్య (మున్నా) నిర్మించారు. ఈ సినిమాని తెలుగు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మూవీ టీజర్కు సంబంధించిన పోస్టర్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి, సినిమా హిట్టవ్వాలన్నారు. -
అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘మెకానిక్’ పోస్టర్
మణి సాయి తేజ,రేఖ నిరోషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్... ట్యాగ్ లైన్. ముని సహేకర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మునెయ్య(మున్నా) నిర్మిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 15 న విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా ఈ మూవీ టీజర్కు సంబంధించిన పోస్టర్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశాడు. కాగా, ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘నచ్చేసావే పిల్లా నచ్చేసావే’ పాట యూట్యూబ్లో 8 మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండిండ్లో ఉంది. ఇదే సినిమా నుంచి రిలీజ్ అయినా ‘టులెట్ బోర్డ్ ఉంది నీ ఇంటికి’అనే మరోపాట 1.6 మిలియన్స్తో దూసుకెళ్తోంది. ఇలా విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు సునీత మనోహర్, సంధ్య జనక్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోను వచ్చే డిసెంబర్ 15 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
భగవంత్ కేసరి మూవీ సక్సెస్.. దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్!
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్ల అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి దక్కుతున్న ఆదరణతో చిత్రబృందం సంతోషంలో మునిగిపోయింది. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన టొయోటా కారును బహుమతిగా అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. #BhagavanthKesari Producers @Shine_Screens gifted a brand new Toyota Vellfire car to the sensational director @AnilRavipudi for the tremendous Success of #BlockBusterBhagavanthKesari 👌🔥#NandamuriBalakrishna @sahugarapati7 pic.twitter.com/wDeXaLfPs5 — manabalayya.com (@manabalayya) November 27, 2023 -
‘సౌండ్ పార్టీ’ ప్రతి పంచ్కి నవ్వాను: అనిల్ రావిపూడి
‘సౌండ్ పార్టీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి పంచ్ కి నవ్వాను. ఈ మధ్యకాలంలో ఇంత హిలేరియస్ గా చూసిన ట్రైలర్ ఇదే. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంది. ఈ సినిమా విజయంతో వీజే సన్నీ కెరీర్లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను’అని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’.ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించింది.ఈ ఈవెంట్కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై సౌండ్ పార్టీ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రంతో సన్నీ కెరీర్ మలుపు తిరగాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. సన్నీ మాట్లాడుతూ.. మంచి స్టార్ కాస్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరోయిన్ హ్రితిక చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా రూపంలో నాకు ఒక బ్యూటిఫుల్ డాడీని శివన్నారాయణ గారి రూపంలో ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి డాడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ప్రేక్షకులకు మా చిత్రాన్ని ఆదరించి మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా’అని అన్నారు. ‘ఈ చిత్రం రెండు గంటలపాటు కంటిన్యూగా నవ్విస్తుంది సినిమా. సన్నీ చాలా ఎనర్జిటిక్ హీరో. తను నా లక్కీ చార్మ్. హీరోయిన్ హ్రితిక క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’ అని డైరెక్టర్ సంజయ్ శేరీ అన్నారు. ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా అందంగా ఉంటాయి అని నిర్మాతలు రవి, మహేంద్ర అన్నారు. -
Bhagavanth Kesari Movie Success Meet: ‘భగవంత్ కేసరి’ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
ఫ్యాన్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..!
-
Bhagavanth Kesari Success Meet: ‘భగవంత్ కేసరి’ మూవీ విజయోత్సవ యాత్ర (ఫోటోలు)
-
భగవంత్ కేసరికి సీక్వెల్? అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతోంది. సోమవారం ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సంద్భంగా అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముందుగా భగవంత్ కేసరి సినిమా కోసం తనతో కలిసి పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ధైర్యం తనకు లేదన్నాడు. ఇప్పటికే భగవంత్ కేసరి సినిమా బరువును తనపై వేసుకుని నలిగిపోయానని, సీక్వెల్ గురించి తర్వాత చూద్దామని అన్నాడు. బాలయ్య బాబు శక్తినిస్తే అప్పుడు భగవంత్ కేసరి 2 తీస్తామని పేర్కొన్నాడు. సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. చదవండి: ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, స్ట్రీమింగ్ అప్పటినుంచే! -
Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్
హీరో బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమా.. నిన్న(గురువారం) థియేటర్లలో రిలీజైంది. మరీ అంత సూపర్ అని చెప్పలేం గానీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య, శ్రీలీల యాక్టింగ్ బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.30 కోట్లకు పైనే గ్రాస్ వచ్చింది. దీంతో శుక్రవారం 'భగవంత్ కేసరి' సక్సెస్ మీట్ పెట్టారు. ఇందులోనే మాట్లాడుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ విషయమై సారీ చెప్పాడు. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) ఇంతకీ ఏమైంది? భగవంత్ కేసరి సినిమాలో పోలీస్ అధికారి, ఖైదీ పాత్రల్లో బాలయ్య కనిపించాడు. అతడి పెంపుడు కూతురిగా శ్రీలీల నటించింది. గత సినిమాలతో పోలిస్తే శ్రీలీల ఇందులో సెటిల్డ్గా యాక్ట్ చేసింది. ఎమోషన్స్ సీన్స్తో పాటు క్లైమాక్స్లో యాక్షన్ సీన్స్ కూడా చేసి ఆశ్చర్యపరిచింది. అయితే ఇందులో శ్రీలీల పోషించిన విజ్జి పాత్ర తండ్రిగా శరత్ కుమార్ కాసేపు కనిపించారు. జైలర్ రోల్ చేశారు. కానీ ఆయన చనిపోయారని టీవీలో చెప్పినప్పుడు సీఐ అని స్క్రోలింగ్ వేస్తారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ అనిల్ రావిపూడిని అడిగారు. అనిల్ ఏం చెప్పాడు? 'పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం గొప్ప విషయం. మీ సునిశీత పరిశీలన, సూక్ష్మ బుద్దికి హ్యాట్సాఫ్. జైలర్ని సీఐ అని న్యూస్ చెప్పడం మా తప్పే. మా వాళ్లు పొరపాటుగా అలా వేసి ఉంటారు. అందుకు క్షమాపణలు' అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఇకపోతే సినిమా బ్లాక్బస్టర్ అంటున్నారు గానీ తొలిరోజు వసూళ్లలో చిరు 'భోళా శంకర్'ని బాలయ్య దాటలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి) భగవంత్ కేసరి విస్ఫోటనం🔥#BhagavanthKesari Grosses 32.33 Crores Worldwide on DAY 1 & emerges as a DASARA WINNER💥 - https://t.co/rrWPhVwU6B Enjoy #BlockbusterDawath in cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/C8i2VTpeb5 — Shine Screens (@Shine_Screens) October 20, 2023 -
‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అనిల్ రావిపూడి అంటే కామెడీ.. బాలయ్య అంటే మాస్. ఈ రెండింటికి భిన్నంగా ‘భగవంత్ కేసరి’ ఉంటుందని చిత్రబృందం మొదటి నుంచి వచ్చింది. దీంతో బాలయ్యను అనిల్ ఎలా చూపించారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది. అందుకే ‘భగవంత్ కేసరి’పై బాలయ్య ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ట్విటర్లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. బాలయ్యను కొత్తగా చూపించినప్పటికీ.. నెరేషన్ చాలా ఫ్లాట్గా ఉందని అంటున్నారు. నటన పరంగా బాలయ్య పర్వాలేదనిపించినా.. అనిల్ రావిపూడి కథనం సరిగా లేదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. శ్రీలీల అయితే తెరపై కొత్తగా కనిపించించిందని చెబుతున్నారు. Just Now Completed My show 🤩 Movie Mathram Excellent Ra ayya 💥💥 Thaman anna BGM ayithey Next Level🥵💥💥 Anil Anna New Version 🔥🔥 My Rating 3/5 #BhagavanthKesari #Balakrishna pic.twitter.com/5TxGl3Z7dY — Rebel Star (@Pranay___Varma) October 19, 2023 #BhagavanthKesari 🔥 I don’t care 👉#NBK #kcpd acting 👉#thaman BGM 👉#srileela pure innocent acting 👉different zoner script 👉 #AnilRavipudi direction👌Hittu bomma😍Kcpd babu🦁 @NBKTrends @MusicThaman @sreleelaa @AnilRavipudi @Nandamurifans pic.twitter.com/b2qNevmZgw — Shanmukh Koyyalamudi (@shanmukh_k_95) October 18, 2023 Anil Ravipudi gave a decent commercial film that’s not of typical Balayya style & not a typical Anil film either. Though a couple of ideas & emotions didn’t work👎 , majority action blocks were pure blast💥 so, Absolutely kakapoyina, to an extent KCPD🔥(2.75/5) #BhagavanthKesari pic.twitter.com/N4b1HZcVKC — Kittu (@Kalyanchowdaryy) October 18, 2023 Just finished watching #BhagavanthKesari movie, it was very nice movie and treat to watch #NandamuriBalakrishna garu with @AnilRavipudi way of present. I really enjoyed the movie. Especially the new dialogs #NBK Screen Presence and other artists performances Simply superb 👌 pic.twitter.com/DqN6fGlNUg — Murali Aari (@murali173) October 18, 2023 #BlockBusterBhagavanthKesari 🔥💥 @AnilRavipudi Unanimous B L O C K B U S T E R 💥🔥 Hatrick for #Balayya 🥁🥁#JaiBalayya 🔥🤙🤙 Happy ga velli movie chudandi.. Balayya Never Before, Archakam🥁#Balayya iche High peaks 💥🦁#BhagavanthKesari 🤙🤙🥁🥁 BhagavanthKesariOnOct19th pic.twitter.com/5TVQXt2kUu — ROHIT CHOWDARY K 🇮🇳 (@ROHITCHOWDARYK2) October 18, 2023 #BhagavanthKesari Review: Subtle yet MASS!#Balayya telangana dialect🔥#BalaKrishna & #SreeLeela bonding👌🏻#AnilRavipudi Dialogues💥 Story is routine but #NBK subtle acting, emotions & underlying msg itself is a worth Good Family Watch! Rating:3.25/5#BhagavanthKesariReview pic.twitter.com/nYN3Ac637l — World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) October 19, 2023 Just finished watching #BhagavanthKesari movie, it was very nice movie and treat to watch #NandamuriBalakrishna garu with @AnilRavipudi way of present. I really enjoyed the movie. Especially the new dialogs #NBK Screen Presence and other artists performances Simply superb 👌 pic.twitter.com/DqN6fGlNUg — Murali Aari (@murali173) October 18, 2023 -
సినిమా రిలీజ్కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?
'భగవంత్ కేసరి' సినిమాతో బాలకృష్ణ.. ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. కానీ 'లియో' దెబ్బకు బాలయ్య చిత్రానికి అనుకున్నంతగా హైప్ రాలేదు. బుకింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు చిత్ర నిర్మాతలు ఓ విషయంలో నష్టపోయారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: విజయ్ 'లియో' దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!) బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తీసిన సినిమా భగవంత్ కేసరి. ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ ఓ మాదిరి అంచనాలే ఏర్పడ్డాయి. అక్టోబరు 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ కోసం బాలయ్య 'దంచవే మేనత్త' పాటని రీమిక్స్ చేశారు. తాజాగా ప్రమోషన్స్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించాడు. రెండోవారం నుంచి ఈ పాటని సినిమాకు జోడీస్తామని అన్నాడు. కానీ ఇప్పుడీ విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా 'భగవంత్ కేసరి' ప్రివ్యూ వేయగా.. సినిమా చూసినోళ్లు ఈ రీమిక్స్ పాట గురించి ప్రస్తావించారట. ఓవరాల్ మూవీలో ఇది సెట్ కాలేదని, అతికించినట్లు ఉందని అన్నారట. దీంతో ఈ పాటని సినిమాలో పెట్టే ఆలోచన పూర్తిగా విరమించుకున్నారట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఈ సాంగ్ కోసం ఖర్చు చేసిన రూ.3.5 కోట్లు నిర్మాతలు నష్టపోయినట్లే. మరి ఇది నిజమా కాదా అనేది మరో వారం ఆగితే తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి
స్టార్ హీరోయిన్ శ్రీలీల వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా తన టాలెంట్తో డ్యాన్స్,నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే మాటకు చెక్ పెడుతూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా నేడు నిలిచింది. ఓ వైపు యంగ్ హీరోలతో ఆడిపాడుతూనే మరోవైపు 'భగవంత్ కేసరి'లో సీనియర్ హీరో బాలకృష్ణకు కుమార్తెగా నటించింది. ఇదొక్కటి చాలు ఆమె తీసుకునే నిర్ణయాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో చెప్పడానికి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకు ఏమాత్రం తగ్గకుండా తను నటించిదని ట్రైలర్లోనే అర్థం అవుతుంది. (ఇదీ చదవండి: ప్రేక్షకుల గుండెల్ని తాకిన నయని పావని.. ఈ కారణంతో నో రీ ఎంట్రీ) తాజాగా శ్రీలీల, అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఎలాంటిదో రివీల్ చేశాడు. మొట్టమొదటిసారిగా, దర్శకుడు అనిల్ రావిపుడు తాను ఎప్పుడూ అందరితో పంచుకోని విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. స్టార్ హీరోయిన్ శ్రీలీల కుటుంబంతో ఆయనకు ఉన్న రిలేషన్షిప్ను మొదటిసారి బయటపెట్టాడు. శ్రీలీల అమ్మగారు డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని అదే ఊరు తన అమ్మమ్మగారిదని అనిల్ తెలిపాడు. శ్రీలీల తల్లి స్వర్ణ తనకు సిస్టర్ వరుస అవుతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ లెక్కన అనిల్కు శ్రీలీల కోడలు అవుతుంది. భగవంత్ కేసరి సెట్స్లో అందరి ముందూ అనిల్ణు డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం 'మామయ్య' అంటూ ఆట పట్టించేదట. శ్రీలీల పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ఆమె పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే కానీ తన అమ్మమ్మ ఊరు అయిన పొంగులూరుకు ప్రతి ఏటా వస్తూనే ఉంటుందని అనిల్ తెలిపాడు. (అమ్మో ఏంటి ఈ అందం శ్రీలీల ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేష్ బాబుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
-
Bhagavanth Kesari Press Meet: బాలయ్య ‘భగవంత్ కేసరి’ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
Bigg Boss 7 : శ్రీలల మాటలకు సిగ్గుతో మొగ్గలేసిన అమర్దీప్
బిగ్బాస్ హౌస్లో సండే అంటే ఫన్ డే అన్నట్లే. వారమంతా ఎలా ఉన్నా.. వీకెండ్లో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతి వారం ఎవరో ఒక గెస్ట్ రావడం.. వాళ్లతో కలిసి కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడడం.. చిలిపి ప్రశ్నలు.. ఇలా ఆదివారం ఎపిసోడ్ చాలా సరదాగా గడిపోతుంది. ఈ వారం కూడా బిగ్బాస్ షోకి అతిథులుగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, అందాల తార శ్రీలీల వచ్చారు. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్లో భాగంగా వీరిద్దరు బిగ్బాస్ షోకి వచ్చినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమతుంతుంది. బిగ్బాస్ రియాల్టీ షోకి అనిల్ రావిపూడి పెద్ద అభిమాన్ని. తన సినిమాలు ఉన్న లేకపోయినా. ప్రతి సీజన్కి మాత్రం వచ్చేస్తాడు. ఈసారి వచ్చి రావడంతో తనదైన పంచులతో ఇచ్చిపడేశాడు. పనిలో పనిగా.. సీజన్ సీజన్కి టీఆర్పీతో పాటు మీ గ్లామర్ కూడా పెరిగిపోతుందంటూ నాగార్జునను పొగిడేశాడు. హౌస్మేట్స్ గురించి చెబుతూ.. తేజ కాలేజీలో తన జూనియర్ అని.. బాగా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పాడు. ఇక శోభాశెట్టిని క్రాకర్ అని..అందరిని ఒక ఆట ఆడిస్తోందని చెప్పాడు. ఇక అమర్దీప్ లేచి.. ‘శ్రీలీల గారు మీరు ఏం చెప్పట్లేదండి’ అని అనగా..‘మీరు చాలా బాగున్నారండి’అని ఆమె చెప్పింది. అయితే మనోడికి అర్థం కాలేదేమో..సింపుల్గా థ్యాంక్యూ అండి అని కూర్చోబోయాడు. వెంటనే నాగార్జున కలగజేసుకొని..ఆమె ఎం చెప్పిందో అర్థమయిందా? నువ్వు చాలా బాగున్నావని చెప్పింది అని అనగా.. అమర్ సిగ్గుతో మొగ్గలేశాడు. -
ఒక ఓవర్ అయిపోయింది.. ‘భగవంత్ కేసరి’ కొత్తగా ట్రై చేశా: అనిల్ రావివూడి
‘ఇప్పటి వరకు నేను ఆరు సినిమాలు చేశాను. అంటే ఒక ఓవర్ అయిపోయింది. ఇకపై కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాను. కంప్లీట్ హానెస్ట్ ఇంటెన్స్ డ్రామా తో ఓ సినిమా చేయాలనిపించి..భగవంత్ కేసరి చేశాను. ఈ చిత్రం చాలా ఏళ్లు గుర్తిండిపోతుంది’ అని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అనిల్ రావిపూడి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నా గత సినిమాకు పూర్తి భిన్నంగా భగవంత్ కేసరి ఉంటుంది. కొత్తగా ఓ సినిమా ట్రై చేద్దామని ఇది చేశాను. దానికి బాలకృష్ణ రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. కథ అద్భుతంగా కుదరడంతో పాటు మంచి స్టార్ కాస్ట్ దొరికింది. ఈ చిత్రం కచ్చితంగా చాలా ఏళ్లు గుర్తిండిపోతుంది. ► ‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్ బాబు గారితో ఒక ఆర్మీ కథ చేయాలని ఫిక్స్ అయి చేశాం. ‘భగవంత్ కేసరి' లో చాలా గోల్స్ వున్నాయి, ఆర్మీకి పంపడంతో పాటు అమ్మాయిని స్ట్రాంగ్ ఎలా చేయాలనే క్యారెక్టరైజేషన్ కూడా వుంటుంది. అమ్మాయి కి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఎలా వీక్ అయ్యింది? ఎలా స్ట్రాంగ్ చేయాలి ? దాని బ్యాక్ డ్రాప్ గోల్ ఆర్మీని తీసుకున్నాం. 'అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి' అనే అండర్ లైన్ బ్యూటీఫుల్ కంటెంట్ ఉంది. ► ఈ చిత్రానికి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ని పరిశీలించాం. అయితే బాలయ్య బాబు టైటిల్ అంటే ఒక ఫోర్స్ ఉండాలి. బ్రో ఐ డోంట్ కేర్ కంటే ఏదైనా ఒక పేరు వుంటే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు ఇలా పేర్లు వునప్పుడు ఎక్కువ రోజులు ప్రేక్షకులతో సినిమా ట్రావెల్ అవుతుందని భగవంత్ కేసరి అని పెట్టాం. దీనికి నేలకొండ అనే పేరు చేర్చి ఎన్ బికే గా కాయిన్ చేయడంతో మరింత ఆకర్షణ వచ్చింది. ► భగవంత్ కేసరి లో ఎంటర్ టైన్మెంట్ చాలా సెటిల్ గా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా చాలా సహజంగా చేశాం. లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చాలా రియలిస్టిక్ గా చేశాం. అలాగే నా మార్క్ ఫన్ టింజ్ సినిమాలో అక్కడక్కడ టచ్ అవుతూనే ఉంటుంది. ► ఈ చిత్రంలో అర్జున్ రామ్ పాల్ విలన్గా చేశాడు. బాలయ్యకు ఎదురుగా నిలబడే పాత్ర అది. అర్జున్ రాం పాల్ గారిని ఓ శాంతి ఓం లో చూసిననప్పటినుంచి ఇష్టం. ఆయన వాయిస్, ప్రజన్స్ చాలా బావుటుంది. తెలుగులోకి తీసుకొస్తే బావుటుందని ఆయన కలవడం జరిగింది. ఆయన కూడా చాలా ఎక్సయిట్ అయ్యారు. అయితే ఆయన ముందే భాష విషయంలో ఒక నిర్ణయంతో ఉన్నారు. ప్రామ్టింగ్ చేయను నేర్చుకొని చెప్తా అన్నారు. ముందే డైలాగ్స్ ఇవ్వమని చెప్పారు. ప్రతి డైలాగుని బట్టిపట్టారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. ► ప్రస్తుతం నా దృష్టి మొత్తం భగవంత్ కేసరి విడుదల పైనే ఉంది. విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. ఐతే ఏది చేసినా డిఫరెంట్ గా ఛాలెంజింగ్ గా చేయాలని ఉంది. -
Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
వరంగల్: ‘భగవంత్ కేసరి’ సినిమా ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
డైరెక్టర్ను కత్తి పట్టుకుని బెదిరించిన బ్రహ్మాజీ, ఎందుకంటే?
నటుడు బ్రహ్మాజీ కత్తిపట్టుకుని డైరెక్టర్ను బెదిరించాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు అనిల్ రావిపూడి. మైకు పట్టుకుని బిజీగా ఉన్న అనిల్ రావిపూడి దగ్గరకు వెళ్లి అతడి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కత్తితో బెదిరించేంత గొడవ ఏం జరిగిందా? అనుకోకండి.. ఇక్కడుంది బ్రహ్మాజీ కదా.. తన కుమారుడి సినిమా రిలీజ్ డేట్ కాస్త వెరైటీగా అనౌన్స్ చేశాడు. ఫన్ అండ్ ప్రమోషన్ కలిపి అనిల్ రావిపూడితో రిలీజ్ డేట్ చెప్పించాడు. ఈ క్రమంలోనే ఈ సరదా స్కిట్ చేశారు. స్కిట్లో భాగంగా.. సినిమా షూటింగ్లో ఉన్న అనిల్ రావిపూడి దగ్గరకు బ్రహ్మాజీ వెళ్లి డిస్టర్బ్ చేస్తాడు. అన్న, ఒక వీడియో పెట్టవా? స్లమ్డాగ్ హస్బెండ్ సినిమా రిలీజ్ డేట్ చెప్పవా? అని అడుగుతాడు. మొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ అన్నావ్, సాంగ్ అన్నావ్.. పదేపదే వస్తానే ఉంటవా? నన్ను వదిలెయ్ అని కసురుకోవడంతో బ్రహ్మాజీ తన దగ్గరున్న కత్తికి పని చెప్పాడు. మెడ దగ్గర కత్తి పెట్టడంతో అనిల్ రావిపూడి.. స్లమ్డాగ్ హస్బెండ్ జూలై 29న రిలీజ్ అవుతుందని చెప్పాడు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను నవ్విస్తోంది. ఇకపోతే బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం స్లమ్డాగ్ హస్బెండ్. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రణవి మానుకొండ హీరోయిన్గా నటించింది. ఇందులో ఓ శునకం ముఖ్యపాత్రలో కనిపించనుండగా.. జూలై 29న గ్రాండ్గా రిలీజవుతోంది. Funny Banter Between @actorbrahmaji & Blockbuster director @AnilRavipudi 😅 #SlumDogHusband hits the screens on 29th July@SanjayROfficial @Pranavimanukon2@ar_sreedhar @Appireddya @Mic_Movies @RelianceEnt @kvrajendra @GskMedia_PR @saregamasouth pic.twitter.com/TrKHqyhhvz — BA Raju's Team (@baraju_SuperHit) July 23, 2023 చదవండి: ఇంతదాకా వచ్చెందుకు సిగ్గెందుకో? ముఖం దాచుకున్న లైగర్ బ్యూటీ -
నారాయణతో సుధాకర్కి బ్రేక్ వస్తుంది: అనిల్ రావిపూడి
‘‘నారాయణ అండ్ కో’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సుధాకర్ నా స్నేహితుడు. తనతో నాది లాంగ్ జర్నీ. తనకి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో చక్కని టేకాఫ్ వచ్చింది. ‘నారాయణ అండ్ కో’తో మంచి బ్రేక్ వస్తుందనుకుంటున్నాను’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సుధాకర్ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి బ్రదర్స్తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. (చదవండి: 'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్) ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకులు అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అతిథులుగా హాజరై, ‘నారాయణ అండ్ కో’ విజయం సాధించాలి అన్నారు. సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ– ‘‘నారాయణ అండ్ కో’ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా’’ అన్నారు. ‘‘ఇది ఫ్యామిలీ ఫండింగ్ మూవీ. చాలామంది సపోర్ట్తో ఈ సినిమా చేశాం’’ అన్నారు దర్శక–నిర్మాత చిన్నా పాపిశెట్టి. -
బాలయ్య కోసం రూట్ మార్చుకున్న అనిల్ రావిపూడి
-
అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. I have always enjoyed working with @AnilRavipudi sir. I have huge respect for both him and Nandamuri Balakrishna sir. So reading these baseless news articles about me and a song in their new film, is very upsetting. Please do your research before you make baseless allegations. — Tamannaah Bhatia (@tamannaahspeaks) May 20, 2023 -
NBK108: నందమూరి ఫ్యాన్స్కి ఉగాది సర్ప్రైజ్
ఉగాది పండుగ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిరావిపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుంది. బాలయ్య 108వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం, పాపులర్ నటుడు కన్నుమూత అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల బ్లాక్బస్టర్ హిట్తో ఈ చిత్రంపై భారీ అంచానలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్లుక్ పోస్టర్ బాలయ్య లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రంలో కాజల్తో పాటు ధమాకా బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. Celebrate this UGADI with the Arrival of #NBKLikeNeverBefore 🔥 Presenting the FirstLook of Natasimham #NandamuriBalakrishna from #NBK108 💥 This time,beyond your imagination!@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna pic.twitter.com/i1zP90B0aB — Shine Screens (@Shine_Screens) March 22, 2023 -
బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్.. షూటింగ్ షురూ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్లో జోరుమీదుంది. ఇప్పటికే కమల్హాసన్లో ఇండియన్-2 లో నటిస్తున్న కాజల్ ఇప్పుడు మరో బడా ప్రాజెక్ట్లో నటిస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా కాజల్ నటించబోతోందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటినే నిజం చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ టీం ఆమెకు వెల్కమ్ ఆన్బోర్డ్ అంటూ స్వాగతం పలికింది. బాలయ్యతో కాజల్ నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో కాజల్తో పాటు ధమాకా బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో ఇది 108వ చిత్రం కావడంతో ఇప్పటికే ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
ఇంజినీరింగ్ విద్యార్థులపై దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్
సాఓఇ, బాపట్ల: నాలుగు సంవత్సరాలు కష్టపడి ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులందరూ నా దృష్టిలో సూపర్ స్టార్సేనని సినీ దర్శకుడు రావిపూడి అనీల్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థుల కలయికలో భాగంగా యంగ్ డైరెక్టర్ రావిపూడి అనీల్ విజ్ఞాన్లోని విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అనీల్ మాట్లాడుతూ అవకాశాలనేవి మన దగ్గరకు రావని.. విద్యార్థులే వాటికి ఎదురెళ్లి తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. దాని సాధించేంతవరకు కష్టపడాలన్నారు. వినూత్న ఆలోచనలకు కాసింత క్రియేటివిటీ, టెక్నాలజీను ఉపయోగించుకుంటే జీవితంలో విద్యార్థులు ముందుకు దూసుకెళ్లి పోవచ్చన్నారు. ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చదవండి: (అదే నా కోరిక.. నటనకు బ్రేక్ ఇచ్చయినా ఆ విషయాలు తెలుసుకుంటా) -
NBK108 : అనిల్ రావిపూడితో బాలయ్య యాక్షన్ సినిమా ప్రారంభం
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో NBK108 అనే క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ అయ్యింది. ముహూర్తం షాట్కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్బోర్డ్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తం షాట్కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. షూటింగ్ కూడా నేడు(గురువారం)ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య ఇంతకుముందెప్పుడూ కనిపించని డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారట. శ్రీలీల ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. Here's a cherishing glimpse from our #NBK108 Opening Puja Ceremony🪔 Kickstarted the Shoot Today😎#NBK108Begins❤️🔥 Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna #CRamPrasad #Rajeevan #TammiRaju #VVenkat @Shine_Screens pic.twitter.com/RWhIjtCMzy — Shine Screens (@Shine_Screens) December 8, 2022 -
ఆకట్టుకుంటున్న ‘ఆనందమో ఆవేశమో..’ మెలోడీ సాంగ్
శివ బాలాజీ , ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సిందూరం. ఈ సినిమా లోని మొదటి పాటను తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ‘ఆనందమో ఆవేశమో..’ అంటూ సాగే ఈ మెలోడీకి బాలాజీ లిరిక్స్ అందించగా, సింగర్ అభయ్ జోధ్ పుర్కర్ అద్భుతంగా ఆలపించారు. హరి గౌర సంగీతం సమకూర్చాడు. హీరోహీరోయిన్ల మధ్య లవ్ సాంగ్ గా చిత్రీకరించిన ఈ పాట వినడానికి ఎంతో మనోహరంగా ఉంది. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి సైతం ఈ సాంగ్ గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యడం విశేషం. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు. -
కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో ప్రారంభమయ్యేది అప్పుడే!
నవ్వు.. మనసులోని అలజడులను, టెన్షన్లను పక్కకు నెట్టేస్తుంది. మనసుకు స్వాంతన చేకూరిస్తుంది. అలాంటి ఆహ్లాదకరమైన హాస్యాన్ని అందించడానికి ముందుకొస్తోంది ఆహా. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోని డిసెంబర్ 2 నుంచి ప్రసారం చేయనుంది. పాపులర్ కమెడియన్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, 3 సినిమాలతో స్టార్ డైరక్టర్గా అందరి మన్ననలు పొందిన అనిల్ రావిపూడి ఈ షో ద్వారా ఓటీటీకి రంగప్రవేశం చేస్తున్నాడు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోకి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. సుడిగాలి సుధీర్, దీపిక పిళ్లై ఈ షోను హోస్ట్ చేయగా సెలబ్రిటీ కమెడియన్స్ వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ స్టాక్స్ గా ఉంటారు. ప్రేక్షకులకు చక్కటి నవ్వులతో గిలిగింతలు పెట్టడానికి వారందరూ సిద్ధమవుతున్నారు. ఈ షోలో మూడు రౌండ్స్ ఉంటాయి. స్టాక్ (కమెడియన్)కి లైవ్ ఆడియన్స్ ఓట్లు వేస్తారు. అక్కడ ఎక్కువ ఓట్లు గెలుచుకున్నవారు ఛైర్మన్ మనసు గెలుచుకుని టాప్ స్టాక్గా పేరు తెచ్చుకుంటారు. 10 ఎపిసోడ్లుగా సాగుతుంది ఈ షో. నిర్విరామంగా వినోదాన్ని పంచుతూ, ప్రతి వీకెండ్నీ నవ్వులమయం చేయబోతోంది. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్తో ఓటీటీలోకి ప్రవేశిస్తున్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “హాస్యంలోని కోణాలను ఆవిష్కరించడానికి ఇంత గొప్ప ప్లాట్ఫార్మ్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా నేను చేసిందంతా ఆఫ్ కెమెరాలోనే. ఇప్పుడు ఆడియన్స్కు నేను సరికొత్తగా పరిచయం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది” అన్నాడు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ, “ఇన్నేళ్లుగా ప్రేక్షకులు నా పట్ల చూపిస్తున్న ఆదరణకు, ప్రేమను ధన్యవాదాలు. వాళ్లు నా మీద పెట్టుకున్న నమ్మకం ఇస్తున్న ప్రోత్సాహంతోనే నేను ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నాను. గడపగడపలోనూ ఈ షో ద్వారా నవ్వులు పూయిస్తాననే నమ్మకం ఉంది. ఈ షోని చూసి నా ఫ్యాన్స్ ఎంతలా ఆస్వాదిస్తారో చూడాలని ఉత్సాహంగా ఉంది" అన్నాడు. చదవండి: పబ్లిక్గా టచ్ చేశాడు, చేయి పట్టుకుని లాగాను: సుష్మితా సేన్ టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే -
కామెడీ షోతో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్
ప్రముఖ తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడి 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' షోను ఓటీటీ వేదికగా లాంచ్ చేయబోతున్నారు. ''అరే.. స్టాక్స్ దమ్ము లేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిల్లిపోతుంది'' అంటున్నారు అనిల్. హాస్య చతురత, సరదాగా నవ్వే గుణం, నలుగురి ముఖాల్లోనూ నవ్వులు పంచే గుణం కన్నా గొప్ప క్వాలిటీ ఇంకేం ఉంటుంది? ఎవరు ఎలాంటి మూడ్లో ఉన్నా సెట్ చేసేది కామెడీనే. ఈ నవంబర్ నుంచి అదే పనిలో ఉండబోతున్నారు అనిల్ రావిపూడి. కడుపుబ్బ నవ్వించే కామెడీ షో 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' నవంబర్ నుంచి మొదలు కానుంది. ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ షో ట్రైలర్కి విశేషమైన స్పందన వచ్చింది. వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ చేసిన కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సుడిగాలి సుధీర్ ఈ షోతోనే ఓటీటీలో అడుగుపెడుతున్నారు. ఈ షో గురించి, ఆహా ద్వారా ఓటీటీలో అడుగుపెడుతునందుకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ప్రతిభావంతులైన నటులతో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్'కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోలో నేను కూడా భాగం అయినందుకు సంతోషిస్తున్నాను. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు. నవంబర్లో ఈ కామెడీ స్టాక్ ఎక్సేంజ్ ఆహాలో ప్రసారం కానుంది. చదవండి: ఆటోలో ప్రయాణించిన నటుడు, వీడియో వైరల్ ఇనయ అదిరిపోయే ట్విస్ట్.. షాకైన సూర్య, శ్రీహాన్ -
ఫ్రస్టేషన్ సాంగ్ని విడుదల చేసిన అనిల్ రావిపూడి
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'స్లమ్డాగ్ హజ్బెండ్'. దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్గా పరిచయం అవుతున్నారు. మైక్ మూవీస్పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఇట్ ఈజ్ ప్రస్టేషన్ సాంగ్.. అనే పాటని దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా, రాహుల్ సిప్లిగంజ్తో కలిసి భీమ్స్ సిసిరోలియో పాడారు. ఈ సాంగ్లో నటుడు సునీల్ తళుక్కున మెరిశారు. -
ట్రైలర్ చాలా నచ్చింది
‘‘కృష్ణ వ్రింద విహారి’ రెండున్నరేళ్ల ప్రయాణం. కోవిడ్ కారణంగా చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ సినిమా నిర్మాతలైన మా అమ్మానాన్న ధైర్యంగా నిలబడి సినిమాని గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.. ఇలాంటి అమ్మానాన్నకు కొడుకుని కావడం నా అదృష్టం’’ అని నాగశౌర్య అన్నారు. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ చాలా నచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంది. ఈ సినిమా శౌర్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘అనీష్ కృష్ణ నాకో మంచి సినిమా ఇవ్వబోతున్నారనే నమ్మకం ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది.. ఫలితం ఏదైనా శిరస్సు వంచి తీసుకుంటా.. మీ (ప్రేక్షకుల) నమ్మకం పోగొట్టుకోను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని నాగశౌర్యగారు బలంగా నమ్మారు కాబట్టే పాదయాత్ర చేశారు’’ అన్నారు అనీష్ ఆర్. కృష్ణ. -
'ఘంటసాలకు భారతరత్న వస్తే అవార్డుకే అందం'
స్వాతంత్ర సమరయోధుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారతరత్న వచ్చేందుకు మనమంతా కృషి చేయాలని ప్రముఖ టాలీవుడ్ దర్శకులు ఆదిత్య, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్రం అవార్డు ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నీలిమ గడ్డమణగు వ్యాఖ్యాతగా సెప్టెంబర్ 18న వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అంశంపై అమెరికాలోని శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ' మీరందరు విదేశాల్లో ఉండి కూడా ఘంటసాలకి భారతరత్న రావాలన్న మీ ప్రయత్నాలకు మా అందరి తరఫున అభినందనలు. ముఖ్యంగా ఘంటసాల కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం, అందరినీ కలుపుకొని పోవడం అభినందనీయం. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఘంటసాల జాతీయ సంపద.. స్వాతంత్ర సమరయోధుడు. వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వేల పాటలు పాడటం ఇలా అన్ని విధాలుగా వారు భారతరత్నకు అర్హులు' అని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమం గురించి ఈ మధ్యనే విన్నా. ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకే అందం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు అందిస్తే మా నాన్న నాకు ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని అందించారు. అదే మా నాన్న నాకిచ్చిన వారసత్వం. ఆయన పాటలు, సాహిత్యాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తానని' తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ 'ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మా ముందు తరాల వారికీ ఆయన ఒక దేవుడు. సంగీతం లో గాన గంధర్వుడు. మంచి గాయకుడే కాకుండా 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాకు ఘంటసాల పాటలు అంటే చాలా ఇష్టం. ఆయన సంగీత దర్శకత్వం వహించిన రెండు సినిమాలు మాయాబజార్, గుండమ్మ కథ. ఆ సినిమాలో వారు పాడిన పాటలు ఇప్పటికి ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన శతజయంతి ఉత్సవాలు జరపడం గొప్ప విషయం. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఆయనకు భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు. ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలని కోరారు. విదేశాల్లోని తెలుగు సంస్థలు, ఇతర సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో గతంలో ఘంటసాల కార్యక్రమాలకు సాంకేతిక సహాయం అందించిన ప్రమీలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, ప్రముఖ సింగర్స్ గీత మాధురి, మాళవిక, ఇండియన్ ఐడల్ రన్నరప్ రోహిత్, అనురూప్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, శంకర్ నేత్రాలయ, యూఎస్ఏ బోర్డు సభ్యులు సౌమియా నారాయణన్, లక్ష్మయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్
నటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఖడ్గం మూవీతో ఒకే ఒక్క చాన్స్ అంటూ అమాయకపు మాటలతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైంది. చివరిగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: హాట్టాపిక్ బిగ్బాస్ కంటెస్టెంట్స్ పారితోషికం, ఎవరెవరికి ఎంతంటే..! సెకండ్ ఇన్నింగ్స్లో ఆడపదడపా చిత్రాలు చేస్తూ.. పలు డాన్స్, కామెడీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె ‘మసూద’ అనే హార్రర్ చిత్రంలో నటిచింది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆమె సరిలేరు నీకెవ్వరు మూవీ, ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్కి తల్లిగా చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో ఆమె చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్కి మదర్గా చేయడం ప్లస్ అయ్యిందా? మైనస్అయ్యిందా? అని హోస్ట్ ప్రశ్నించగా.. రెండూ అని సమాధానం ఇచ్చింది. చదవండి: ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ నాకు మైనస్ అయ్యింది: సంగీత షాకింగ్ కామెంట్స్ ఆ తర్వాత అనిల్ రావిపూడి వచ్చి తనకు కథ వివరించారని చెప్పంది. ఇక ఇప్పుడు అనిల్ని చూస్తే ‘రేయ్ ఇలా చేశావ్ రా నన్ను’ అని తింటుకుంటాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సంగీత. ఆ తర్వాత అవకాశం వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా అని కూడా సంగీతని అడగ్గా.. ఓ సినిమా షూటింగ్ కి రెండు రోజులు వెళ్లానని, ఆ తర్వాత వాళ్లు చిత్రం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా సరిలేరు నీకెవ్వరులో సంగీత హీరోయిన్గా తల్లిగా ‘అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అంటూ తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించ్చింది. -
ఎఫ్-3 మూవీని వెంకీ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు: పరుచూరి
అనిల్ రావిపూడి తెరెకెక్కించిన ఎఫ్-2తో పోలిస్తే ఎఫ్-3 అంత బాలేదని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాపై పరుచూరి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పరుచూరి పలుకులు వేదికగా ఎఫ్-3 మూవీపై తన రివ్యూను వీడియో ద్వారా విడుదల చేశారు. ఎఫ్-2లో భార్యభర్తల మధ్య పెత్తనం అనే అంశం అందరికీ కనెక్ట్ అయ్యింది. అనిల్ రావిపూడికి మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. కానీ రీసెంట్గా నేను ఎఫ్-3 సినిమాను చేశాను. గతంలో 'శ్రీ కట్న లీలలు'లో మేము చేసిన పొరపాటే అనిల్ రావిపూడి ఈ సినిమాలోని సెకండాఫ్లో చేశారనే అనుమానం నాకు కలిగింది. సెకండ్ ఆఫ్లో మురళీ శర్మ కొడుకుగా వెంకీని చూపించడం అతకలేదు. మన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలా చూపించడం సహా సెకండాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అర్థం పర్థం లేనట్లు అనిపించింది. కాస్త లాజిక్ లేకున్నా వెంకటేశ్ ఒప్పుకోడు. ఈ పాత్రను ఎలా ఓకే చేశాడో అర్థం కావడం లేదు. కుటుంబం మొత్తం హోటల్ నడుపుకుంటూ ఉంటే మెహ్రీన్ మాత్రం వేరే ఇంట్లో పనిమనిషిగా చేయడం అంతగా నప్పలేదు. ఇలా ఎన్నో తప్పులున్నా చివరి 20నిమిషాలే ఎఫ్-3ని బతికించాయి అని పరుచూరి చెప్పుకొచ్చారు. -
అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘లెహరాయి’ మూవీ సెకండ్ సాంగ్
‘లెహరాయి’ చిత్రం నుంచి మరో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. రామకృష్ణ పరమహంస దర్శకుడిగా పరిచమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టాలెంటెడ్ రంజిత్, సౌమ్య మీనన్ హీరోహీరోయన్లు నటిస్తున్నారు. ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రామేశ్, సీనియర్ నరేశ్, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదలై ‘గుప్పెడంత’ ఫస్ట్సాంగ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ అంటూ సాగే ఈ పాటను సింగర్ సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్థలో మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ సినమాను నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామాని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. -
NBK108: నెవర్ బిఫోర్ పాత్రలో బాలయ్య
ఎఫ్ 3 హిట్తో జోరుమీదున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే నందమూరి బాలకృష్ణతో కలిసి మాస్ మూవీతో ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్లో NBK108 సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే కదా! సెంటిమెంట్, యాక్షన్ను సమపాళ్లలో మిక్స్ చేయనున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు పొందుపరుస్తూ ఓ వీడియో వదిలింది చిత్రయూనిట్. ఇదివరకెన్నడూ చూడని పాత్రలో బాలయ్యను చూడబోతున్నారని చెప్పింది. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడని, షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. Eternally Grateful & Super Thrilled to show our NATA SIMHAM #NandamuriBalakrishna garu in a never before role❤️🔥 Happy to be joining hands with the Musical Sensation, dear brother @MusicThaman ⚡️& @ShineScreens for this Exciting Endeavour #NBK108 @sahugarapati7 @harish_peddi pic.twitter.com/apAdRVLjD9 — Anil Ravipudi (@AnilRavipudi) August 11, 2022 చదవండి: తాప్సీ మూవీని నిషేధించి, గుణపాఠం చెప్దామంటున్న నెటిజన్లు ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ -
సూపర్ స్టార్ బర్త్డే.. మహేశ్కు చిరు, వెంకీల స్పెషల్ విషెస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నేటితో 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. మంగళవారం(ఆగస్ట్ 9) మహేశ్ బర్త్డే సందర్భందగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ దగ్గుబాటితో పాటు ప్రముఖ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లిలు మహేశ్కు స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే మహేశ్’ అంటూ రాసుకొచ్చారు. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻 Wishing @urstrulyMahesh a happy birthday. 💐🎂 pic.twitter.com/7fDFnDDtwi — Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2022 వెంకటేశ్ ట్వీట్ చేస్తూ.. ‘హ్యపీ బర్త్డే చిన్నోడా’ అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలోని వారిద్దరి ఫొటోను షేర్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, సురేందర్ రెడ్డి, అడవి శేష్ పలువురు సినీ ప్రముఖులు మహేశ్కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఇక ఫ్యాన్ హంగామా అయితే మాములుగా లేదు. సోషల్ మీడియాను మహేశ్ బర్త్డే విషెష్ చెబుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్లో మహేశ్ బాబు బర్త్ డే ట్యాగ్ నెంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. Happy birthday dearest @urstrulyMahesh! Wishing you love and laughter this year Chinnoda ❤️ pic.twitter.com/jPcmyazO8v — Venkatesh Daggubati (@VenkyMama) August 9, 2022 Happy Birthday @urstrulymahesh anna! Wishing you lots of joy and success as always! — Jr NTR (@tarak9999) August 9, 2022 Happiest birthday to the most humble Superstar, an Amazing Director's Hero and more than that an incredible human being @urstrulyMahesh garu ♥️🤗 Wish you many More Blockbuster Hits sir! ✨#HBDSuperstarMahesh pic.twitter.com/QedO98qVjV — Anil Ravipudi (@AnilRavipudi) August 9, 2022 Happiest Birthday @urstrulyMahesh Sir... Wishing my brother all the more Happiness and the Best of everything always.. 🤗🤗 #HBDSuperstarMahesh pic.twitter.com/kkIYoStoGx — Vamshi Paidipally (@directorvamshi) August 9, 2022 Happy Birthday Superstar @urstrulyMahesh.. You are a heart-throb not only for the fans but also for the directors.. Keep Amazing all of us!!#HBDSuperStarMahesh pic.twitter.com/bCJ1dM1Sp8 — Sreenu Vaitla (@SreenuVaitla) August 9, 2022 Happy Birthday to the actor class apart and a true gentleman @urstrulyMahesh anna. Wishing you all the love and success 🤗 #HBDSuperstarMaheshBabu pic.twitter.com/A66F9r2RtS — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 9, 2022 Many many happy returns of the day sir 🤗 .@urstrulyMahesh So beautiful how the world is celebrating your birthday & we, the #Major team, are happy to have received your mentorship, love & support. You’ve been a guiding light and inspiration. Lots of love sir & happy birthday :) — Adivi Sesh (@AdiviSesh) August 9, 2022 -
ఆ నాలుగు సినిమాలు సక్సెస్ అవ్వాలి: అనిల్ రావిపూడి
‘‘తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.. కోవిడ్కి ముందు పరిస్థితుల కోసం అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ‘జ్యాపి స్టూడియోస్’ నిర్మిస్తున్న నాలుగు సినిమాలూ మంచి విజయాలు సాధించాలి’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ ‘జ్యాపి’ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ‘జ్యాపి’ యాప్ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి స్థాపించిన ‘జ్యాపి స్టూడియోస్’ బ్యానర్ని దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ‘జ్యాపి స్టూడియోస్’ నిర్మాణంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం ‘జగమే మాయ’ పోస్టర్ని నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ రిలీజ్ చేశారు. ఆ సంస్థ నిర్మిస్తున్న రెండో చిత్రం ‘పతంగ్’ పోస్టర్ని దర్శకుడు అనుదీప్ విడుదల చేయగా, మూడో సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నారు. సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందనున్న నాలుగో చిత్రం పోస్టర్ని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ లాంచ్ చేశారు. ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం నిర్మాణం అంటే ఒక సవాల్గా మారిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని ఆశిస్తున్నాం’’ అన్నారు. నటీనటులు ధన్యా బాలకృష్ణ, రాజ్ తరుణ్, సుహాస్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘పంచతంత్ర కథలు’ మూవీ రివ్యూ బిగ్బాస్ ఎంట్రీపై స్పందించిన బేబీ హీరోయిన్ -
‘లక్కీ లక్ష్మణ్.. మంచి కాఫీలాంటి సినిమా’
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్, మోక్ష హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఎ.ఆర్. అభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రం బృందంగా ఇటీవల ఈ మూవీ ఫస్ట్లుక్ను విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్లుక్ లాంచ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్కీ లక్ష్మణ్ మూవీ ఫస్ట్లుక్ చాలా బాగుందని, దర్శక, నిర్మాతలకు ఇది తొలి చిత్రమే అయిన మూవీ బాగా తీశాకరన్నారు. అలాగే లక్కీ లక్ష్మణ్ మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం హీరో సోహైల్ మాట్లాడుతూ.. అనిల్ అన్న చేతుల మీదుగా తన మూవీ ఫస్ట్లుక్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, తన బిజీ షెడ్యూల్లో సైతం తమ మూవీ ఫస్ట్లుక్ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన మూవీ దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారన్నాడు. ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్పుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్తో నిర్మించారని సోహైల్ తెలిపాడు. నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులకు ఒక మంచి కాఫీలాంటి సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయానంద్ కీత. -
‘‘ఎఫ్ 3’ ట్రిపుల్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అఫీషియల్: బాలకృష్ణ-అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్
బాలకృష్ణ మంచి జోరు మీదున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న ఆయన తాజాగా 108వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. శుక్రవారం బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా 108వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డబుల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్లో ఎన్బీకే 108 సినిమా రూపొందనుంది. వినూత్న కథనంతో భారీ ఎత్తున ఈ చిత్రం తెరకెక్కనుంది. మాస్ పల్స్ తెలిసిన అనిల్ రావిపూడి.. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలకృష్ణను చూపించేందుకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఎఫ్ 3: బ్లాక్బస్టర్ అంటే ఇట్టా ఉండాల!
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. నవ్వుల బొనాంజా ఎఫ్ 2కి సీక్వెల్గా తెరకెక్కిన ఈ మూవీ అంతకంటే బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుడు కాసేపు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా నచ్చేసిన ఎఫ్ 3 మే 27న రిలీజైంది. కేవలం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన మూవీ వీకెండ్ను బాగా వాడుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.110 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇప్పటికే నిర్మాతలకు లాభాలు కూడా వచ్చాయని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమాలో మెహరీన్, తమన్నా కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించాడు. 👌🔥🎉🎉💥💥💯 https://t.co/k2Ue1BPRsr — Anil Ravipudi (@AnilRavipudi) June 6, 2022 The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 చదవండి: నిఖిల్ మూవీ 'స్పై' గ్లింప్స్ చూశారా? నిజంగానే ఆరోజు తమన్నాతో గొడవపడ్డా.. ఎఫ్ 3 డైరెక్టర్ -
తమన్నాతో గొడవ నిజమే, రెండు రోజులు..: అనిల్ రావిపూడి
పటాస్తో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు అనిల్ రావిపూడి. ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతూనే వచ్చింది. అపజయం అనేదే తెలియని ఈ డైరెక్టర్ ఇటీవలే ఎఫ్ 3తో మరో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అనిల్కు, హీరోయిన్ తమన్నాకు మధ్య గొడవలు జరిగాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకే తమన్నా ఎఫ్ 3 ప్రమోషన్స్కు కూడా రాలేదని వార్తలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై అనిల్ స్పందిస్తూ.. 'ఎక్కువమంది ఆర్టిస్టులతో పని చేసినప్పుడు చిన్నచిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. తమన్నాది పెద్ద గొడవేం కాదు. ఒకరోజు రాత్రి షూటింగ్ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది. దానికామె పొద్దున్నే జిమ్ చేసుకోవాలి, టైం లేదు, వెళ్లిపోవాలి అని మాట్లాడింది. అలా రెండురోజులు మా మధ్య కొంత హీట్ నడిచింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుకున్నాం. వేరే సినిమా షూటింగ్స్లో ఉండటం వల్ల తను ప్రమోషన్స్కు రాలేకపోయింది' అని చెప్పుకొచ్చాడు. కొంత సమయం తీసుకున్నా సరే ఎఫ్ 4 చేస్తానన్నాడు అనిల్ రావిపూడి. కాగా మే 27న రిలీజైన ఎఫ్ 3 సినిమా 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది. చదవండి: అల్లు అర్జున్కి మహేశ్ బాబు థ్యాంక్స్.. చాలా హ్యాపీగా ఉందంటూ ట్వీట్ అమ్మ ముందే అలా చేశాడు, వర్జినిటీ కోల్పోయా: నటి -
స్టేజ్పై డ్యాన్స్ చేసిన వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి..
F3 Success Meet Vizag, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మహిళా ప్రేక్షకుల ఆదరణ వల్లే ఎఫ్–3 (F3) సినిమా అఖండ విజయం సాధించిదని ప్రముఖ హీరో వెంకటేశ్ తెలిపారు. ఆర్.కె.బీచ్ దరి గోకుల్పార్కులో శనివారం రాత్రి ఎఫ్–3 ఫన్టాస్టిక్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తనకెప్పుడూ స్పెషల్ అన్నారు. తన తొలి సినిమా కలియుగ పాండవులు షూటింగ్ విశాఖ బీచ్రోడ్డులోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్హిట్ సినిమాలను విశాఖలో చిత్రీకరించామన్నారు. తాను నటించిన దృశ్యం–2, నారప్ప వంటి సినిమాలు ఓటీటీలో మాత్రమే విడుదల కావడంతో తన అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారని పేర్కొన్నారు. ఎఫ్–3 సినిమాకు అభిమానులు విజయం చేకూర్చారని సంతోషం వ్యక్తం చేశారు. మరో హీరో వరుణ్తేజ్ మాట్లాడుతూ 'అభిమానుల ఆదరణే తమకు వందకోట్ల ఆదాయంతో సమానం. విశాఖ నోవాటెల్ హోటల్లోనే దర్శకుడు అనిల్ ఎఫ్–3 సినిమా కథ రాసుకున్నారు. మళ్లీ అవకాశం వస్తే కథ వినకుండానే వెంకటేశ్తో సినిమా చేస్తాను.' అని పేర్కొన్నారు. నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ విశాఖలో ఆర్య, పరుగు సినిమా షూటింగ్ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అమెరికాలో కూడా ఇదే ఆదరణ లభించడం అపూర్వమన్నారు. ఈ రోజుకు సినిమా విడుదలై 9 రోజులవుతుందని.. రూ.100 కోట్ల గ్రాస్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జగదాంబ వంటి 1,100 సీట్లు ఉన్న థియేటర్లో ఎఫ్–3 హౌస్ఫుల్స్తో నడుస్తోందని జగదాంబ థియేటర్ అధినేత జగదీష్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్–4 త్వరలోనే ప్రకటిస్తామన్నారు. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 'విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు ముందు నేను చేసిన చాలెంజ్తో మీడియా కూడా షాక్ అయింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను నేను, హీరో వెంకటేశ్ ఎంతో రుచి చూశాం' అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ కేవలం ప్రేక్షకులను నవ్వించడానికే ఈ సినిమా తీశానన్నారు. ఈ సినిమాలో ఆలీ పాత్ర నచ్చిందా అని ప్రేక్షకులను అడిగారు. తనకు ఎఫ్–2 కంటే ఎఫ్–3 సినిమా అంతకుమించి ఆనందం ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చాలా బాగా పండాయన్నారు. తన సినిమా కథలన్నీ వైజాగ్లోనే రాసుకున్నానని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఎఫ్–3 చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. ఇదే రోడ్డుపై ఎన్నో షూటింగ్లు చేశానని నటుడు అలీ చెప్పారు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో వెంకటేశ్, వరుణ్తేజ్, అనిల్ సినిమాలోని ఓ పాటకు నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. సే నో టు ప్లాస్టిక్ ఎఫ్–3 విజయోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ విశాఖలో ఆదివారం నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామన్నారు. విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నట్లు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాత దిల్రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యపడుతుందన్నారు. -
ఎఫ్ 3 ఓటీటీకి వచ్చేది అప్పుడేనట, మూవీ టీం క్లారిటీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ హీరోలుగా నటించిన తాజా చిత్ర ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే 27)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుండటంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. చదవండి: OTT: 3 వారాలకే అమెజాన్లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్, కానీ.. ఇప్పటికే ఈ సినిమా రిలీజై 6 రోజులు అవుతున్న థియేటర్లో ఏమాత్రం ఈమూవీ క్రేజ్ తగ్గలేదు. వసూళ్ల పరంగా కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.46 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తి ఎదురు చూసే వారు కూడా లేకపోలేరు. థియేటర్లో ఈ సినిమా చూడని వారు నెల రోజుల్లో డిజిటల్ వేదికగా చూడోచ్చులే అని ధీమాగా ఉండి ఉంటారు కొందరు. అలాంటి వారికి తాజాగా ఎఫ్ 3 టీం షాకిచ్చింది. చదవండి: మేనేజర్ను ఒంటరిగా కలిస్తే ఎక్కువ డబ్బులిస్తామన్నారు అప్పుడే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే చాన్సే లేదని చెప్పేశారు. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్లు వీడియో రిలీజ్ చేశారు. ఎఫ్ 3 మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ మూవీని థియేటర్లో చూడని వారు ఓటీటీలో చూడొచ్చని అనుకుంటున్నారేమో.. కానీ మరో 8 వారాల వరకు ఎఫ్ 3 ఓటీటీకి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాను థియేటర్లో చూడాల్సిందే. ఈ మూవీ థియేట్రికల్ రన్కు రెండు నెలలకు ముందుగా ఎఫ్ 3 డిజిటల్ ఎంట్రీ ఇచ్చేది లేదని వారు తేల్చిచెప్పారు. -
నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి
Anil Ravipudi Says I Have 3 Families Comments Viral In F3 Success Meet: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, బ్యూటిఫుల్ హీరోయిన్స్ మెహరీన్, సోనాల్ చౌహన్ కలిసి నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ 'ఎఫ్ 3' (F3). ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మే 27న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటివరకు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'థంబ్నేయిల్స్ పెట్టుకోండి. నాకు మూడు ఫ్యామీలులు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటే మరో ఫ్యామిలీ ఇక్కడున్న నా చిత్రబృందం. అలాగే నా మూడో కుటుంబం ప్రేక్షకులు.' అని అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ భార్యతో కలిసి నటించిన యశ్ సినిమా.. -
రామ్ చరణ్, తలపతి విజయ్ సినిమాలపై దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
-
తమన్నాకి అనిల్ రావిపూడి మధ్య గొడవ?
-
అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ
Comedian Ali Comments On F3 Movie In Success Meet: ‘‘ఎఫ్ 3’ చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కు వస్తున్నారు’’ అని వెంకటేశ్ తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం (మే 30) ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ‘‘ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా తీశారు అనిల్ రావిపూడి. థియేటర్లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ‘‘45 ఏళ్లుగా నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చేశాను. ప్రపంచంలోని నలుమూలల నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ‘మీ పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయి’ అని అభినందిస్తున్నారు. నాకు నా ‘మాయలోడు’ సినిమా గుర్తొచ్చింది’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది సరి కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్ 3’ సక్సెస్ ఓ నిదర్శనం’’ అని తెలిపారు అలీ. చదవండి: నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ -
F3 రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ మల్టీస్టారర్గా, అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ఎఫ్3. మే 27న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోష్ని కనబరిచింది. రెండో రోజు ఈ చిత్రం 9.85కోట్ల షేర్ రాబట్టింది. (చదవండి: ఎఫ్3 మూవీ రివ్యూ) ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండో రోజు రూ.8.4 కోట్లను వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు రూ.18.77 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్లోనూ ఎఫ్3కి మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికాలో ఈ చిత్రం 750కే డాలర్లను రాబట్టింది. వారాంతంలో ఈ చిత్రం అక్కడ 1 మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్డాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్3 రెండు రోజుల కలెక్షన్స్: ► నైజాం - 8.16 కోట్లు ► సీడెడ్ - 2.38 కోట్లు ► ఈస్ట్ - 1.28 కోట్లు ► వెస్ట్ - 1.22 కోట్లు ► ఉత్తరాంధ్ర - 2.22 కోట్లు ► గుంటూరు- 1.42 కోట్లు ► కృష్ణా - 1.17 కోట్లు ► నెల్లూరు - 85 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- 1.20 కోట్లు ►ఓవర్సీస్-3.60 కోట్లు ►మొత్తం 23.50 కోట్లు(షేర్) -
ఎఫ్3ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం
విక్టరి వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఎఫ్ 3 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలై ఫస్ట్ షో నుంచే హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంపై మూవీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, హీరోలు వెంకటేశ్, వరుణ్ తేజ్లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎఫ్ 3 టీం ఆడియన్స్కు కృతజ్ఞతలు తెలిపింది. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. మా చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు, యూనివర్షల్గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొంది. హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. కుటుంమంతా కలిసొచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్కి వెళ్లి చూసిన సినిమా ఎఫ్ 3నే. దేవి థియేటర్లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్టైనర్ తీసుకునందుకు సంతోషంగా ఉంది. అనిల్ రావిపూడి ఎఫ్ 3కి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3ని ఎంజాయ్ చేయాలి’ అని కోరుకున్నారు . దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుండి 'ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్' అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షకులు థియేటర్లో పడిపడి నవ్వుతున్నారు. ఎఫ్ 2 కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 3 రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హాగ్ ఇచ్చాను. వెంకటేష్ గారికి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్ ఇమేజ్ ఉండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో వెంకటేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎఫ్ 3ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిందుకు ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు. ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళండి... హాయిగా నవ్వుకోండి’ అని పేర్కొన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ మూవీ మాకు చాలా ప్రత్యేకమైనంది. వెంకటేష్ గారి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’ తెలిపారు. -
F3 మూవీ (ఫొటోలు)
-
F3: ట్రైలర్ చూసి ‘ఏంటి పిచ్చోడిలా చేస్తున్నావ్’ అన్నారు!
‘ఎఫ్ 3 నవ్వుల పండగలా ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు’ అన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 3. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు(మే 27న) థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వరుణ్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఎఫ్ 2 సక్సెస్తో ఎఫ్ 3 భాద్యత పెరుగుతుంది కదా.. మీకు ఎలా అనిపించింది? ‘ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. అయితే ఆ భాద్యతంతా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారు. మాకు అనిల్ గారిపై నమ్మకం ఎక్కువ. ఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3చేయాలని నిర్ణయించుకున్నారు. ఎఫ్ 3 డబ్బు నేపధ్యంలో చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. హిలేరియస్గా అనిపించాయి. వెంకటేశ్ గారు, నేను ఎఫ్ 2 థియేటర్లో చూశాం. ప్రేక్షకులు ఆనందాన్ని చూసి తప్పకుండా ఎఫ్ 3 చేయాలని నిర్ణయించుకున్నాం. ఎఫ్ 2కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3లో ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఎఫ్ 3 ఒక నవ్వుల పండగలా ఉంటుంది’ అన్నాడు. ఎఫ్ 3లో నత్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది? ‘ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం .. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడం కూడా కష్టం. ఫన్ డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్ను డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా ఉంటుంది.. అతనికి కనబడదు... వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ట్ చేశాం. అది హిలేరియస్గా వర్కౌట్ అయ్యింది’ అని చెప్పకొచ్చాడు. నత్తి కోసం స్పెషల్గా హోం వర్క్ ఏమైనా చేశారా? ‘అనిల్ రావిపూడి గారు నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డాను. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన ఉండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఈజీ అయ్యింది. అయితే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. కానీ, అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ఎఫ్ 3లో ఫన్ ఎవరికి? ఫస్ట్రేషన్ ఎవరికి? డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు .. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్ని హిలేరియస్గా చూపించారు. వెంకటేశ్ గారితో మరోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది? వెంకటేశ్ గారితో కల్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలసి పని చేయడం లక్కీగా ఫీలవుతున్నా. వెంకటేశ్ గారు అంటే నాకు పర్శనల్గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్లా ఉంటారు. పెద్దనాన్నతో(చిరంజీవి) ఆయనకి ఉండే బాండింగ్, అనుభవాలు ఇలా చాలా విషయాలు చెబుతుంటారు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి.. మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేశ్ గారు చాలా లైట్ హార్టడ్. క్రమశిక్షణగా ఉంటారు. ఆయన్ని చూసి సెట్స్కి రెండు నిమిషాల్ ముందే వెళ్ళేవాడిని. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. పాజిటివ్గా ఆలోచిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్స్ ప్రోసెస్ కూడా మారింది. ఇది చాలెజింగ్గా అనిపిస్తుందా ? ఇప్పుడు కథల ఎంపిక మారింది. అయితే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి. ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ? ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ అయ్యారు. ‘ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్’ అని సర్ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా రిజర్వ్డ్ గా ఉంటా. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు. ‘మెగా ఫ్యామిలీ’ ట్రైలర్ డైలాగ్ మెగాఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ? పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్ ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారు? చాలా బావున్నాడు. మేం ఇద్దరం కలసి జిమ్కి వెళ్తున్నాం. నెల క్రితమే షూటింగ్ కూడా మొదలుపెట్టాం. -
బిగ్బాస్ నాన్స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్!
బిగ్బాస్ నాన్స్టాప్ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. తెలుగు బిగ్బాస్ చరిత్రలో ఓ మహిళ విన్నర్గా నిలవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగు బిగ్బాస్ విన్నర్గా నిలిచి బిందు మాధవి చరిత్ర సృష్టించింది. టాస్క్లో.. మాటల్లో ఆడపులిలా రెచ్చిపోయిన బిందుకి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇది వరకు ఆమె తెలుగులో పలు చిత్రాల్లో చేసిన రానీ గుర్తింపు ఒక్కసారిగా బిగ్బాస్ నాన్స్టాప్తో తెచ్చుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: కరణ్ జోహార్ బర్త్డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్ ఈ నేపథ్యంలో బిందుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏకంగా ఆమె ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఇండస్ట్రీలో వరుస హిట్స్తో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్రావిపూడి తదుపరి ప్రాజెక్ట్లో నటించే చాన్స్ కొట్టేసిందని వినికిడి. కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ ప్రమోషన్తో బిజీగా ఉన్నాడు. దగ్గుబాటి హీరో విక్టరి వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించి ఈ చిత్రం రేపు(మే 27న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని అనంతరం ఆయన బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. చదవండి: రాత్రి 11 గంటలు, కానిస్టేబుల్ వల్ల అభద్రతకు గురయ్యా: హీరోయిన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా అనేసరికి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో బిందు మాధవిని ఓ కీ రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్ను ఖరారు చేసినట్లు సమాచారం. అంతేకాదు మరో యువ నటి శ్రీలీలా బాలయ్య కూతురిగా కనిపించబోతుందట. మరి ఇందులో బిందు మాధవి రోల్పై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బాలయ్య కోసం తన కామెడీ టచ్ను పక్కన పెట్టి యాక్షన్పై దృష్టి పెట్టానని అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. -
అలా చేస్తే ప్రేక్షకులకు మనం బోర్ కొట్టం : అనిల్ రావిపూడి
కొన్ని సినిమాలు చేయడానికి హీరోలు ఇమేజ్ దాటి రావాలి. బాలీవుడ్లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు స్టార్డమ్ పక్కనపెట్టి ఎంటర్టైన్ చేస్తుంటారు. టాలీవుడ్కు లక్కీగా వెంకటేశ్ దొరికారు. ఆయన బోర్డర్ దాటి కూడా కొన్ని సీన్స్ చేసేస్తాడు. కామెడీ సినిమాలు చేసేటప్పుడు అలానే ఉండాలి. ఎఫ్3లో వెంకటేశ్ గారి రేచీకటి ట్రాక్ చాలా బాగుంటుంది’అని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎఫ్3’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు.. మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్గా ఎఫ్3 ఎఫ్ 2లో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ తో కొత్త కథ చెప్పాం. అందులో భార్యభర్తల ఫస్ట్రేషన్ ఉంటే ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్. ఇది ఇంకా కనెక్ట్ అయ్యే పాయింట్. డబ్బు చుట్టూ వుండే ఆశ అత్యాశ కుట్ర మోసం ఇవన్నీ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యాయి. ఎఫ్ 2 సక్సెస్ తో ఆర్టిస్టలందరూ మంచి ఎనర్జీతో పని చేశారు. సునీల్, మురళీ శర్మ, అలీ గారు ఇలా కొంత మంది ఆర్టిస్ట్ లు కొత్తగా యాడ్ అయ్యారు. మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్ గా ఎఫ్3 ఉంటుంది. నత్తి..చాలా ఇబ్బంది తెచ్చింది ఎఫ్ 2 నుంచి ఎఫ్ 3కి వచ్చేసరికి అంచనాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. ఫన్ డోస్ పెంచడానికి ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ చేయగలం. అందుకే వెంకటేశ్కు రేచీకటి, వరుణ్తో నత్తి యాడ్ చేశాం. అయితే అవే క్యారెక్టరైజేషన్స్ ప్రధానంగా సినిమా ఉండదు. నైట్ సీన్స్ వచ్చినపుడు ఆ ఫన్ వాడుకుంటాం, వరుణ్ నత్తి మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు. అది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా దాదాపు ముఫ్ఫై చోట్ల ఆ మ్యానరిజం వచ్చింది. ప్రతిసారి కొత్తగా ఉంటుంది. ఇది నిజంగా చాలెజింగ్ అనిపించింది. మాట అడ్డుపడినప్పుడల్లా కొత్త మ్యానరిజం చేయాలి. అనుకున్నపుడు ఈజీగా అనిపించింది కానీ ప్రాక్టికల్ గా చాలా కష్టమైంది. ప్రతిసారి కొత్త మ్యానరిజం అంటే.. సీన్ కంటే ఎలాంటి మ్యానరిజం ఇవ్వాలనే ఒత్తిడి ఎక్కువ ఉండేది. ఎఫ్4లో మూడో హీరో ఎఫ్ 2 ఫినిష్ అయ్యాక ఎఫ్ 3 గురించి అలోచించినపుడు మూడో హీరో ఆలోచన వచ్చింది. అయితే అది ట్రంప్ కార్డు . అది ఇప్పుడే వాడేస్తే మళ్ళీ వాడుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే ఆ ఐడియాని పక్కన పెట్టేశాం. ఎఫ్ 2 స్టార్ కాస్ట్ తోనే వీలైనంత ఫన్ జనరేట్ చేశాం. ఐతే మూడో హీరో కార్డు మాత్రం ఎఫ్ 4లో కానీ తర్వాత సినిమాలో కానీ తప్పకుండా వాడాలి. తేడాలు ఉన్నాయి ఎఫ్2లోని పాత్రలు ఎలా ప్రవర్తిసాయో.. ఎఫ్3లోనూ అలానే ఉంటాయి. అయితే ఎఫ్ 2లో వెంకటేష్ గారికి ఫ్యామిలీ లేదు. ఇందులో ఉంటుంది. ఎఫ్ 2లో వరుణ్ కి ఫ్యామిలీ వుంది. ఇందులో లేదు. ఇలా ప్రతిచోట మీకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. క్లైమాక్స్తో అందరూ కనెక్ట్ అవుతారు ఈ చిత్రంలో హీరోయిన్స్ అనే కాదు.. ప్రతి పాత్ర అత్యాశ గానే ఉంటుంది. డబ్బు ఎలా త్వరగా సంపాయించాలనే ఆశతోనే ఉంటారు. వారి ప్రయత్నాల్లో జరిగే ఫన్ ఇందులో ఉంటుంది. ఎంత ఫన్ ఉంటుందో అంత మంచి కంటెంట్ వుంటుంది. ఎఫ్ 2లో ఇచ్చిన ముగింపు అందరికీ నచ్చింది. ఇందులో డబ్బు గురించి చెప్పే ఫైనల్ కంటెంట్ కూడా అందరికీ నచ్చుతుంది. డబ్బుతో మనం ఎలా ఉండాలనేది చెప్తాం. ఈ కంటెంట్ కి అందరూ కనెక్ట్ అవుతారు. వింటేజ్ సునీల్ని చూస్తారు ఈ చిత్రంలో ఉండే నటులు ఆ పాత్రలకు వారే కరెక్ట్ అనిపించింది. సునీల్ గారు అంటే నాకు ప్రత్యేక అభిమానం. పదేళ్ళ తర్వాత ఆయన హిలేరియస్ రోల్ చేస్తున్నారు. మళ్ళీ వింటేజ్ సునీల్ ని చూస్తాం. అలీ గారిది కూడా అద్భుతమైన పాత్ర. టెర్రిఫిక్ గా చేశారు. ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేయడానికి చాలా కష్టపడ్డాం. కార్వాన్ లన్నీ చూస్తే మినీ మియాపూర్ బస్ డిపోలా వుండేది. ఎవరు ముందు వస్తే వాళ్ళ షాట్ తీసుకుంటూ వెళ్లేవాళ్లం. అన్నపూర్ణ గారు, వై విజయ గారు కొంచెం త్వరగా వస్తారు. వాళ్ళ షాట్స్ ముందే తీసేవాళ్ళం. కరోనా సమయంలో వాళ్ళపై ఎక్కువ కేర్ తీసుకున్నాం. వెంకటేష్ గారు ఇంకా కేరింగ్గా ఉంటారు. మా టీంలో ఆయనొక్కరినే కరోనా టచ్ చేయలేదు. కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత ఎఫ్3లో పూజా యాడ్ అయింది. ముగ్గురు హీరోయిన్స్ తో 'ఊ హ ఆహా ఆహా' పాటని తీశాం. తర్వాత వచ్చే సెలబ్రేషన్స్ పాట కొంచెం స్పెషల్ గా ఉండాలని ఒక స్టార్ హీరోయిన్ గెస్ట్ గా వస్తే బావుంటుదని భావించాం. కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది తను. నత్తి కొత్తగా అనిపించింది జంధ్యాల గారి ఆహా నా పెళ్ళాంట సినిమాలో బ్రహ్మానందం గారు చేసిన పాత్ర నా ఫేవరేట్. నత్తిని ఒక హీరో పాత్రకి యాడ్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. దీనిపై ఎవరైనా వివాదం చేస్తే ‘ఆహా నా పెళ్లంట’ ప్రేరణతోనే చేశాని చెబుతా(నవ్వుతూ..). నత్తి అనేది పోషకార లోపం వల్ల వచ్చిందని సినిమాలో చూపించాం. దిల్ రాజుతో చాలా కంఫర్ట్బుల్ దిల్ రాజుగారితో ప్రయాణం కంఫర్ట్ బుల్ గా ఉంటుంది. నాకు ఏం కావాలో ఆయనకి తెలుసు. ఒక ఫోన్ కాల్ తో పనైపొద్ది. దిల్ రాజు గారి సినిమా అంటే నాకు హోం బ్యానర్ లాంటింది. అలా చేస్తే ప్లాప్ నుంచి బయటపడతాం నేను మాస్ సినిమాలు చేయలానే ఇండస్ట్రీకి వచ్చాను. అయితే కామెడీ ఉంటేనే నా సినిమా ఫుల్ ఫిల్ అవుతుంది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ .. ఈ మూడు సినిమాల్లో ఎంత మాస్ ఉందో అంత కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. ఇంకా లార్జ్ స్కేల్ ఆడియన్స్ కి రీచ్ కావాలని ఎఫ్ 2 ని ఒక స్ట్రాటజీ ప్రకారం చేశాను. ఎఫ్ 2 ఓవర్సిస్ లో 2 మిలియన్ కొట్టింది. ఎక్కడ ఖాళీ ఉందో చూస్తూ సినిమాలు చేయాలి. ఎఫ్ 2తో ఒక కామెడీ బ్రాండ్ వచ్చేసింది. దాన్ని సరిచూసుకోవడానికి సరిలేరు నీకెవ్వరు లో ట్రైన్ ఎపిసోడ్ పెట్టుకున్నాం. అది ఫుల్ యాక్షన్ మాస్ సినిమా. ఇప్పుడు ఎఫ్ 3తో మళ్ళీ ఫ్యామిలీ సినిమా చేశాం. తర్వాత చేయబోయే బాలయ్యగారి సినిమా మాస్. సినిమాకి సినిమాకి డిఫరెన్స్ చూపించుకుంటూ వెళితే ఫస్ట్ మనం బోర్ కొట్టం. మార్కెట్ లో ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారనేదాని చెక్ చేసుకున్నట్లయితే ఫ్లాప్ అవ్వాకుండా బయటపడవచ్చు. అది తర్వాత ఎంత హిట్ అవుతుందనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు. అందుకే టికెట్ల రేట్లు పెంచలేదు ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళడానికి వీలుగా ఉంటే ఒకటికి రెండుసార్లు చూస్తారు. నిజానికి ఎఫ్ 3కి కూడా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అయితే టికెట్ ధర ఆడియన్స్ కి కంఫర్ట్ గా ఉండటం ముఖ్యం. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. వరుణ్ని చూసి సర్ప్రైజ్ అవుతారు ఎఫ్ 2తో పోల్చుకుంటే ఎఫ్ 3లో వెంకటేశ్, వరుణ్లతో పని చేయడంలో ఇంకా కంఫర్ట్ పెరిగింది. ఎఫ్3తో వరుణ్, వెంకటేశ్ బాగా క్లోజ్ అయ్యారు. ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలనే దానిపై వాళ్ళమధ్య ఒక అండర్ స్టాడింగ్ వచ్చింది. వరుణ్ తేజ్ కామెడీ పరంగా ఇందులో అద్భుతంగా చేశారు. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. వెంకటేష్ గారికి ధీటుగా చేశారు వరుణ్ తేజ్. మరింత ఫవర్ఫుల్ పాత్రలో బాలయ్య సెప్టెంబర్- అక్టోబర్ లో బాలయ్య సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాం.బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే సినిమా ఉంటుంది. ఫన్ ఉంటుంది కానీ అంత బిగ్గర్ గా వుండదు. మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ లోకి వస్తాం. -
F3 Movie: అలా ఉండటమే నాకు ఇష్టం : వెంకటేశ్
‘ప్రతి సినిమా నా తొలి మూవీలాగే భావిస్తా. ఎఫ్-3 కూడా అలానే చేశా. కామెడీ చేయడం నాకు ఇష్ఠం. హీరో పాత్ర ఇలా ఉండాలి..అలా ఉండాలి అని అనుకోను. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తూ చేస్తాను’ అని విక్టరీ వెంకటేశ్ అన్నాడు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్తో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-3.అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు.. ► అనుకోకుండా నా గత రెండు చిత్రాలు(నారప్ప, దృశ్యం-2) ఓటీటీలో వచ్చాయి. రెండేళ్ల తర్వాత థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. గుంపుగా సినిమా చూస్తే వచ్చే కిక్ వేరు. ఎంటర్టైన్మెంట్ సినిమాలు బిగ్స్క్రీన్పై చూస్తే బాగుంటుంది. ఎఫ్-3 థియేటర్స్లో చూడాల్సిన సినిమా. అందరికి నచ్చుతుంది ► కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. స్నేహితులతో కానీ, ఇంట్లో కానీ నేను జోకర్గానే ఉంటాను. ► అనిల్ రావిపూడి రచన నాకు చాలా ఇష్టం. ఆయన పాత్రలను చాలా నేచురల్గా తీర్చిదిద్దుతాడు. మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాం. ఈవీవీ గారి మాదిరే అనిల్ కామెడీ బాగా పండిస్తాడు. అనిల్ నుంచి చాలా నేర్చుకున్నా. ► మన చుట్టూ ఉన్న జనాలను చూసే నేను అన్ని నేర్చుకుంటా. ఎఫ్-3లో కామెడీ చాలా బాగుంటుంది. డిఫరెంట్ వాయిస్ యూజ్ చేశా. ► ఈ సినిమాలో రేచీకటి పాత్రను పోషించాను. అలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. సినిమా మొత్తం రేచీకటి ఉండదు. కొంతవరకు మాత్రమే ఉంటుంది. కథలో భాగంగా ఈ చిత్రంలో నా పాత్రకు రేచీకటి ఉంటుంది. ► ఎఫ్3 ఏ స్థాయిలో హిట్ అవుతుందో నేను చెప్పలేను కానీ..ఎఫ్2 కంటే హిలేరియస్గా ఉంటుందని మాత్రం చెప్తా. ► ఈ జానర్ సినిమాలే చేయాలని ఏమి అనుకోలేదు. ఆడియన్స్కు ఏం ఇష్టమో అది ఇస్తే చాలు. వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోవాలి అంతే. దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పని చేసుకుంటూ వెళ్లాలి. ► కోవిడ్ తర్వాత ఓటీటీ ప్రాధాన్యత పెరిగింది. రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేశా. కోవిడ్ టైంలో ఖాలీగా ఉండడంతో.. ఓటీటీ కోసం వెబ్ సిరీస్ చేశా. అది చాలా చాలెంజింగ్ అనిపించింది. త్వరలోనే వెబ్సిరీస్లోని నా లుక్ విడుదల కాబోతుంది. ► సల్మాన్ఖాన్తో తీయబోయే చిత్రంలో బ్రదర్ పాత్రని పోషిస్తున్నాను. ► మల్టీస్టారర్ చిత్రాలకు నేను ఎప్పటికీ సిద్దంగానే ఉంటాను. మంచి కథ దొరికితే ఏ హీరోతోనైనా కలిసి నటిస్తా. ► బాక్సాఫీస్ నెంబర్లను నేను నమ్మను. కానీ నిర్మాతలకు లాభాలు రావాలని ఆశిస్తాను.అలాగే ఫ్యాన్స్ని, అడియన్స్ని అలరిస్తే చాలు అనుకుంటా. ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటాను. ► సెట్లో నేను నిర్మాత మాదిరే ఆలోచిస్తాను. ఏదైనా వృధా అయితే చాలా బాధ కలుగుతుంది. సినిమా షూటింగ్కు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం నసగా ఉంటంది. కానీ మూవీ హిట్ అయితే మాత్రం అవన్నీ మర్చిపోతారు. ► పాన్ ఇండియా చిత్రాలు అనేది కేవలం బిజినెస్ మాత్రమే. నా సినిమాకు పాన్ ఇండియా స్థాయి మార్కెట్ ఉందనుకుంటే..అంతటా విడుదల చేస్తారు. లేదంటే ఇక్కడే రిలీజ్ చేస్తారు. పాన్ ఇండియా స్థాయి కథలు వస్తే.. నేను చేయడానికి సిద్దమే. ► టాక్ షోలకు హోస్టింగ్గా చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు అది సెట్ కాదు. ఒక్క సీన్ మళ్లీ మళ్లీ చేయడం నాకు కష్టం. సింగిల్ టేక్ యాక్టర్గా ఉండడమే నాకు ఇష్టం. ► కోవిడ్ టైమ్లో షూటింగ్స్ చాలా కష్టంగా జరిగాయి. మన ముందు ఉన్న ఆర్టిస్ట్కు కరోనా ఉందో లేదో తెలియదు. మేము ఏమో మాస్క్ తీసి డైలాగ్స్ చెప్పాలి. చాలా భయమేసేది. షూటింగ్ అయిపోగానే క్యారివాన్లోకి వెళ్లి ఆవిరి పట్టేవాడిని. ఈ రెండేన్నరేళ్లలో నేను కోవిడ్ బారిన పడలేదు. నేను ఇప్పటికీ మాస్కులు ధరిస్తున్నాను. ఇప్పుడు చాలా మంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గుంపులు ఉన్నప్పుడు జాగ్రత్తగా మాస్కులు ధరిస్తేనే మంచిదని నా భావన. ► వివేకానంద బయోపిక్ తీయాలనుకున్నాడు కానీ ఇప్పటీకీ కుదరలేదు. ఇప్పుడు బయోపిక్ తీయాలని లేదు. నాన్నగారి(ప్రముఖ నిర్మాత రామానాయుడు) బయోపిక్ స్క్రిప్ట్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను. ► ఎఫ్2లో మాదిరి ఎఫ్3లో ఎలాంటి కొత్త ఆసనాలు ఉండవు. కానీ కామెడీ మాత్రం అంతకు మించి ఉంటుంది. ప్రతి సన్నీవేశం నవ్వులు పూయిస్తాయి. ఈ జనరేషన్ పిల్లలను కూడా అలరించడం అదృష్టంగా భావిస్తున్నాను. ► దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు. అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ► నేను సెట్స్కి వెళ్లగానే నిర్మాతగానే ఆలోచిస్తా. ప్లానింగ్ సరిగ్గా లేకుంటే షూటింగ్ లేట్ అయి, డబ్బులు వృథా అవుతాయి. ప్లానింగ్ విషయంలో అందరూ కరెక్టుగా పని చేయాలి.. ‘పాన్ ఇండియా’ అన్నది బిజినెస్ మాత్రమే. దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ► ప్రస్తుతం నేను, రానా చేస్తోన్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పూర్తి కావస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్తో ఓ సినిమా చేస్తున్నాను. త్రివిక్రమ్తో సినిమా చర్చలు జరుగుతున్నాయి. -
బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్.. అనిల్ రావిపూడి క్లారిటీ
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. NBK 108 వర్కింగ్ టైటిల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలను పెంచుకున్నారు. మాస్ హీరో బాలయ్యతో కామెడీ డైరెక్టర్ అనిల్ ఎలాంటి నేపథ్యం ఉన్న సినిమాను తీయబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అంతేకాదు.. ఈ సినిమా స్టోరీ ఇదే.. ఇందులో హీరో చెల్లిగా పలానా హీరోయిన్ నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టాడు అనిల్ రావిపూడి. బాలకృష్ణతో తీయబోయే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాడు. (చదవండి: బింధుమాధవి పెళ్లిపై ఆమె తండ్రి ఏమన్నాడంటే..) ఎఫ్3 సినిమా ప్రమోషన్స్లో భాగంగా అనిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ సినిమా కోసం అందరితో పాటు నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కామెడీని పక్కన పెట్టి తెరపై బాలయ్యను కొత్తగా చూపించబోతున్నా. నా మార్క్ కామెడీ సీన్స్ ఉంటాయి కానీ.. పూర్తిస్థాయి కామెడీ అయితే ఈ చిత్రంలో ఉండదు. ఇందులో బాలయ్య 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయన కూతురిగా శ్రీలీల నటిస్తుంది. పోకిరి, అర్జున్రెడ్డి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలను చూస్తే.. హీరో పాత్ర సినిమాను నడిపిస్తుంది. ఆ టెంప్లేట్లో సినిమా చేద్దామని ప్రయత్నిస్తున్నా. ఆ తరహా పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు’అని అనిల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడి చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. విక్టరీ వెంకటేశ్, వరుణ్తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 చిత్రం మే 27న విడుదల కానుంది. -
ఈ సినిమా హిట్ కాకపోతే ఇకపై మీ ముందుకు రాను
‘‘నా సినిమా థియేటర్స్లో రిలీజై మూడేళ్లవుతోంది. ‘దృశ్యం 2’, ‘నారప్ప’ ఓటీటీకి వెళ్లిపోయాయి. నా ఫ్యాన్స్ కొందరు నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు ‘ఎఫ్ 3’ సినిమా ఈ నెల 27న థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా నాపై ప్రేమను చూపిస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ‘ఎఫ్ 3’ సినిమా మీ కోసమే... మీరందరూ థియేటర్స్కు వచ్చి ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ‘ఎఫ్ 2’ను హిట్ చేశారు. ‘ఎఫ్ 3’ కూడా హిట్ అవుతుంది. అనిల్ మంచి స్క్రిప్ట్తో సినిమా చేశాడు. వరుణ్ తేజ్ బాగా చేశాడు’’ అని వెంకటేశ్ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ‘ఫన్టాస్టిక్’ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులయింది. ‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ గ్లామర్గా ఉందంటే కారణం సాయి శ్రీరామ్గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఫిదా, ఎఫ్ 2 ఇప్పుడు ‘ఎఫ్ 3’.. ‘దిల్’ రాజుగారితో ఈ సినిమా నాకు ఓ హ్యాట్రిక్లా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ జనరేషన్లో అనిల్గారి కన్నా కామెడీని ఇంకా ఎవరూ బాగా తీయలేరని నాకు అనిపిస్తోంది. వెంకటేశ్గారు చాలా మల్టీస్టారర్ ఫిలింస్ చేశారు. కానీ ఆయనతో రెండోసారి వర్క్ చేసే అవకాశం నాకు మాత్రమే లభించింది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’ సినిమాయే మాకు శత్రువు. ఎందుకంటే ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అందుకని ‘ఎఫ్ 2’కి మించిన వినోదాన్ని ‘ఎఫ్ 3’లో ఇచ్చేందుకు మేం స్క్రిప్ట్ నుంచే కష్టపడ్డాం. నవ్వడం చాలా ఈజీ. కానీ కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం. నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లను నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. అందుకే ‘దిల్’ రాజుగారితో వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో దాదాపు 35మంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరు లేకపోతే ‘ఎఫ్ 3’ లేదు. ఈ సినిమాలో గొప్ప కంటెంట్ కూడా ఉందని భావించి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. వరుణ్ తేజ్ నాకు ఓ బ్రదర్లాంటి వాడు. వరుణ్లో ఇంత మంచి కామెడీ టైమింగ్ ఉందా? అని ఆడియన్స్ అంటారు. వెంకటేశ్గారు స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. కానీ కామెడీ చేసేప్పుడు ఆయన ఇమేజ్ను పక్కన పెట్టి పెర్ఫార్మ్ చేస్తారు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. నవ్వలేకపోవడం ఒక రోగం. నవ్వించడం ఒక భోగం. రెండేళ్లు కరోనా పరిస్థితులను ఫేస్ చేశాం. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్లో చూసి హ్యాపీగా నవ్వుకోండి’’ అని అన్నారు. ‘ఎఫ్ 3’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఎఫ్ 2’లోలానే వెంకటేశ్, వరుణ్ తేజ్లు ‘ఎఫ్ 3’లోనూ అద్భుతంగా చేశారు. హీరోల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ‘ఎఫ్ 2’లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ‘ఎఫ్ 3’లో నలుగురు హీరోయిన్స్ని పెట్టారు అనిల్. రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ.. ఇలా ఫుల్ఫ్యాక్డ్గా ఉంది సినిమా. దేవిశ్రీకి మా బ్యానర్లో ఇది 13వ సినిమా. ‘ఎఫ్ 2’కు మించి ‘ఎఫ్ 3’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రామానాయుడుగారి తర్వాత ‘దిల్’ రాజుగారినే నేను మూవీ మొఘల్గా పిలుస్తాను. మనిషి జీవితంలో నవ్వుకు ఎంత అవసరం ఉందో చెప్పే సినిమా ‘ఎఫ్ 3’. 45 ఏళ్లుగా నేను నమ్మింది నవ్వునే. ఈ సినిమాలోని చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్ను నవ్విస్తాయి. హ్యాట్సాఫ్ టు డైరెక్టర్ అనిల్ రావిపూడి. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సినిమా హిట్ కాకపోతే నేను ఇకపై మీ ముందు (ప్రేక్షకులు) నిలబడను’’ అన్నారు. ‘‘ఎఫ్ 3’ సినిమా చూస్తూ, నవ్వుతారు. అది మన ఇమ్యూనిటీని పెంచుతుంది’’ అన్నారు సునీల్. ‘‘పవన్ కల్యాణ్గారి ‘తమ్ముడు’ సినిమా తీసిన దర్శకుడు అరుణ్ ప్రసాద్ బాబాయ్ కొడుకే అనిల్ రావిపూడి. అనిల్ అనే మొక్కను ‘దిల్’ రాజు పెంచారు. ఈ చెట్టు నీడ కింద ఇప్పుడు చాలా మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీలోని అందరూ బాగుంటారు. అందుకే ‘ఎఫ్ 3’ సినిమాను థియేటర్స్లోనే చూడాలని కోరుతున్నాను’’ అన్నారు అలీ. వై. విజయ, ప్రగతి, తులసి, 30 ఇయర్స్ పృథ్వీ, ప్రదీప్, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. చదవండి 👉🏾 బిగ్బాస్ నాన్స్టాప్ ఫైనల్ విన్నర్ బిందు మాధవి.. విజయ్ దేవరకొండతో సమంత లిప్లాక్ సీన్ ? -
బిగ్బాస్ ఓటీటీ గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది
బిగ్బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం హౌస్లో బాబా భాస్కర్, అరియానా, అనిల్, మిత్ర శర్మ, అఖిల్, బిందు మాధవి, యాంకర్ శివ ఉన్నారు. ఇలా ఏడుగురు కంటెస్టెంట్లు ఫినాలేకు చేరుకోవడం తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి. కాగా నేడు (మే 21) సాయంత్రం గ్రాండ్ ఫినాలే జరగనున్నట్లు హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో గ్రాండ్ ఫినాలేను మరింత హుషారెత్తించేందుకు వచ్చిన మేజర్, ఎఫ్ 3 సినిమా టీమ్స్ స్టేజీపై సందడి చేశాయి. బిగ్బాస్ ఓటీటీలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం స్టేజీపై సందడి చేశారు. స్పెషల్ గెస్ట్గా వచ్చిన అనిల్ రావిపూడి ఓ సూట్కేసుతో బిగ్బాస్ హౌస్లోకి వెళ్లాడు. అంటే హౌస్లో ఉన్న ఏడుగురిలో ఎవరో ఒకరు ఆ సూట్కేసును తీసుకునే అవకాశాలున్నాయి. అయితే పది లక్షల వరకు డబ్బున్న ఆ సూట్కేసును అరియానా గ్లోరీ ఎగరేసుకుపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బిగ్బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి టైటిల్ సొంతం చేసుకుందంటూ నెట్టింట బిందుమాధవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ఎలాగైనా ట్రోఫీ సొంతం చేసుకోవాలన్న అఖిల్ ఆశలు అడియాశలయ్యాయని మరోసారి అతడు రన్నరప్గా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ గ్రాండ్ ఫినాలే సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రసారం కానుంది. చదవండి 👉🏾 గుట్కా యాడ్ ఎఫెక్ట్: నలుగురు స్టార్ హీరోలపై కేసు ఆ నటిని పెళ్లాడనున్న రష్మిక మందన్నా మాజీ ప్రియుడు -
అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘కరణ్ అర్జున్’ ట్రైలర్
అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కరణ్ అర్జున్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తాగా మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘కరణ్ అర్జున్’ ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఒక యంగ్ టీమ్ ఎంతో రిస్క్ చేసి పాకిస్థాన్ బార్డర్లో షూటింగ్ చేశారు. ట్రైలర్ లాగే సినిమా కూడా బాగుటుందని ఆశిస్తూ... టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ... ‘‘ఎఫ్ 3 ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నా కూడా మాకు టైమ్ ఇచ్చి మా కరణ్ అర్జున్ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. ట్రైలర్ లో విజువల్స్, లొకేషన్స్ బావున్నాయంటూ అనిల్ రావిపూడి గారు ప్రత్యేకంగా చెప్పడంతో పాటు మా టీమ్ అందరినీ మెచ్చుకోవడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్నితెరకెక్కించాం. పాకిస్థాన్ బార్డర్లో ఎంతో రిస్క్ చేసి షూటింగ్ చేశాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటూ థియేటర్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. కంటెంట్ని నమ్ముకుని చేసిన సినిమా ఇది’’ అన్నారు. కాగా రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల నిర్మించిన ఈ సినిమాకు రోషన్ సాలూరి సంగీతం అందించారు. -
అందుకే ఎఫ్3 మూవీ టికెట్ల రేట్లను పెంచలేదు : దిల్ రాజు
‘ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన మూవీ. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్ కి రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం’అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.. ఆ విశేషాలు.. ఎఫ్ 3 స్టోరీ గురించి అనిల్ రావిపూడి మీకు ఎప్పుడు చెప్పారు ? ఎఫ్ 2 విడుదలకు ముందే అనిల్ కు ఎఫ్ 3 ఐడియా వచ్చింది. ఎఫ్ 2పెద్ద హిట్ అయితే ఎఫ్ 3 చేద్దామని చెప్పారు. మేము అనుకున్నట్లే ఎఫ్ 2 పెద్ద విజయం సాధించింది. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత స్క్రిప్ట్ ని పూర్తి చేసి నటీనటులందరినీ మళ్ళీ ఒక్కదగ్గరి చేర్చి సెట్స్ పైకి వెళ్లాం. ఎఫ్ 3 కథ చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో సినిమా చూసిన తర్వాత దానికి మించిన నవ్వుకున్నాను. ఎఫ్ 3 నాన్ స్టాప్ ఎంటర్ టైనర్, కంప్లీట్ ఫన్ రైడ్. ఎఫ్ 2 తో పోల్చుకుంటే ఎఫ్ 3 లో ఎలాంటి ఫన్ వుంటుంది ? ఎఫ్ 2లో ప్రేమ, పెళ్లి.. అందులో వున్న ఫస్ట్రేషన్ ని హిలేరియస్ గా చూపించి చివరికి భార్యల పాయింట్ ఆఫ్ వ్యూ ని కూడా చూడాలని చెప్పి అందరికీ నచ్చేలాగ ఎఫ్2ని హ్యుమరస్ గా చేశాం. ఎఫ్ 3 విషయానికి వస్తే.. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి.. ఇవి పంచభూతాలు. ఇవి లేకుండా మనిషి బ్రతకలేడు. ఈ పంచభూతాలతో పాటు ఆరో భూతం డబ్బు కూడా మనిషి బ్రతకడానికి అంతే అవసరం. డబ్బు లేకుండా మనిషి బ్రతకలేడు. చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి మనిషి బ్రతకడానికి డబ్బు ఈ రోజు తప్పనిసరైపోయింది. బంధాలు, బిజినెస్సులు అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగేకథ ఎఫ్ 3. అనిల్ అద్భుతంగా రాశాడు, తీశాడు. అనిల్ లో నాకు నచ్చే అంశం కథ కంటే కధనం పై ఎక్కువ ద్రుష్టి పెడతాడు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తున్నామా లేదా అని చూస్తాడు. ఎఫ్ 3 ఆర్టిస్టులకు భోనంజా లాంటింది. ఇంతమంది ఆర్టిస్ట్ లని పెట్టుకొని అద్భుతమైన ఫన్ క్రియేట్ చేశాడు అనిల్. సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ప్రేక్షకుడిగా ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. సినిమా రన్ టైం 2గంటల 28నిమిషాలు వుంటుంది. ఇందులో 90 నిమిషాలు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు. అంత ఫన్ రైడ్ గా వుంటుంది. సినిమా టికెట్ల రేట్లని పెంచకుండా యాధాతధంగా ఉంచడానికి కారణం ? కరోనా ప్యాండమిక్ తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్ లు పెరిగాయి. ఇదే సమయంలో ఆడియన్స్ ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. ఇందులో మంచి ఫలితాలు కూడా సాధించాం. ఐతే ఇక్కడ పరిశీలించిన అంశం ఏమిటంటే.. చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి దూరమౌతున్నారు. అలాగే రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్ కి రావడం తగ్గిపోవడం గమనించం. టికెట్ల ధరలు వారికి అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్ కి రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ధరలు తగ్గించిన దాని ప్రకారం మీ బడ్జెట్ ని రీచ్ కాగలరని భావిస్తున్నారా ? నాకు థియేట్రికల్ రెవెన్యు కిక్ ఇస్తుంది. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూడటంలోనే ఒక ఆనందం ఉంటుంది. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్...సెకండ్ వీక్ ఇలా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడంలోనే ఒక కిక్ ఉంటుంది. ఎఫ్ 3 కి తప్పకుండా రిపీట్ ఆడియన్స్ వస్తారు. థియేటర్లు ఆడియన్స్ తో కళకళలాడుతాయి. ప్రేక్షకులు ఎఫ్ 3ని మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఎఫ్ 3ని పాన్ ఇండియా స్థాయిలో చేసే ఆలోచన రాలేదా ? పాన్ ఇండియా విడుదల చేయాలంటే దానికి సేఫరేట్ గా హోం వర్క్ చేయాలి. బాలీవుడ్ లో కూడా ప్రేక్షకుడు థియేటర్ లోకి రావాలంటే స్క్రిప్ట్ దశ నుండే ప్లాన్ చేయాలి. ఎఫ్ 3వరకూ మాకు పాన్ ఇండియా ఆలోచలేదు. మీ బ్యానర్ లో మార్వెల్ లాంటి సూపర్ హీరో సినిమాలు వచ్చే అవకాశం ఉందా ? హాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా.. మార్వెల్, అవతార్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలే నిలబడుతున్నాయి. తెలుగులో ఈ ట్రెండ్ మొదలైయింది. రాజమౌళి గారు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ తో దీనికి శ్రీకారం చుట్టారు. మేము కూడా ఒక మూడు కథలపై పని చేస్తున్నాం. రెండేళ్ళలో ఒకటి, రెండు పెద్ద సినిమాలు మా బ్యానర్ నుండి ప్రకటించే అవకాశం వుంది. ఎఫ్3 కి టికెట్ రేట్లు తగ్గించిన నేపధ్యంలో మంచి రెస్పాన్స్ వస్తే.. మిగతా సినిమాలు కూడా ఇదే పద్దతి ఫాలో అయ్యే అవకాశం ఉందా ? మొన్న సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెరిగాయి. ఆ రేట్లు నేను పెంచానని విమర్శించారు. నైజంలో దిల్ రాజు రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనే పెంచేశాడని సులువుగా అనేస్తారు. కానీ తెర వెనుక బోలెడు కథ ఉంటుంది. నిర్మాతలు, హీరోలు ఇలా బోలెడు లెక్కలు వుంటాయి. అందుకే టికెట్ రేట్లు తగ్గిస్తూ మొదట నేను ఒక అడుగు వేస్తున్నా. ఇది కనుక సక్సెస్ ఐతే అందరూ ఇదే ఫాలో అవుతారు. ప్రస్తుతానికి అందరూ ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మల్టీ ప్లెక్స్ లో చార్జీలు ఎలా ఉండబోతున్నాయి ? ప్రసాద్, జీఎంబీ లాంటి ప్రైమ్ మల్టీ ప్లెక్స్ 250 ప్లస్ జీఎస్టీ.. మిగతావి జీఎస్టీ కలుపుతూ 250. హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ 150ప్లస్ జీఎస్టీ.. జిల్లాలు జీఎస్టీ కలుపుతూ 150. 250లో మాకు వచ్చేది 25రుపాయిలే. ఇక థియేటర్ ఉండటం వలన ఎదో అద్భుతమైన లాభాలు వచ్చేస్తున్నాయనే అపోహ కూడా ఉంది. కర్నూల్ లో 15కోట్లు పెట్టి మల్టీ ప్లెక్స్ లో ఇన్వెస్ట్ చేశాం. పదేళ్ళు లీజు. పదిహేను కోట్లను వడ్డీతో సహా రిటర్న్ తెచ్చుకోవాలి. లెక్క చూసుకుంటే రూపాయి వడ్డీ వస్తుంది. పదిహేను కోట్ల మీద నెలకి పదిహేను లక్షలు వస్తుందని అనుకుందాం. కానీ పదేళ్ళలో ఈ పదిహేను కోట్లు పోయి జీరో అవుతుంది. దీని ప్రకారం చూసుకుంటే నష్టమే. మల్టీ ప్లెక్స్ అన్నిటిలో ఈ సమస్య వుంది. షేర్ మార్కెట్ కోసం కార్పోరేట్ కంపెనీలు చేస్తున్న ఒక అపోహ ఇదంతా. నైజాంలో మొత్తం 450 థియేటర్లు ఉన్నాయి. ఇందులో మా సంస్థకు 60 వున్నాయి. దిల్ రాజు నైజం మొత్తం కంట్రోల్ పెట్టుకున్నాడని చాలా మంది అంటారు. కానీ 60 థియేటర్లతో నేను కంట్రోల్ లో పెట్టుకునేది ఏమీ ఉండదు. కానీ మిగతా వాళ్ళు మా మాట ఎందుకు వింటారంటే.. ఎవరైనా రూపాయి డబ్బు మాకు అడ్వాన్స్ గా ఇస్తే సినిమా అయిపోగానే రెండు మూడు వారాల్లో వారి ఖాతా సెటిల్ చేసుకొని వెళ్ళిపోతారు. మాకు ఇచ్చిన డబ్బు అంత సేఫ్ గా వుంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం వలన ఆటోమేటిక్ గా మాకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు కారణాల వల్ల మేము నెంబర్ వన్ గా వున్నా తప్పితే ఏదో కంట్రోల్ చేసి కాదు. ఓటీటీలు కూడా పెద్ద సినిమాలకు ముందస్తు ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి .. దీన్ని ఎలా చూస్తారు ? ప్రేక్షకుడు ఇలా కూడా చూస్తాడా ? అని వాళ్ళు ఒక టెస్ట్ చేసుకుంటున్నారు. ఎఫ్ 3లో మూడో ఎఫ్ కి మీనింగ్ అంటే ఏం చెప్తారు ? ఫన్, ఫస్ట్రేషన్.. బీకాజ్ ఆఫ్ ఫైనాన్స్. ( నవ్వుతూ ) ఎఫ్ 4 ఉంటుందా ? అనిల్ మంచి ఐడియా చెప్పాడు. నెక్స్ట్ వుంటుంది. ఎఫ్3 ఐడియా వెంకటేష్, వరుణ్ తేజ్ కి చెప్పినపుడు వారి రియాక్షన్ ఏంటి ? ఎఫ్ 2పెద్ద సక్సెస్. మళ్ళీ అదే కాంబినేషన్ లో సినిమా అంటే అందరూ ఎక్సయిట్ అయ్యారు. వెంకటేష్ గారు మీతో ఎంత సరదాగా వుంటారు ,ఆయన మీకు ఇచ్చిన సర్ ప్రైజ్ ఏమైనా ఉందా? 'కలియుగ పాండవులు' సమయంలో నేను వెంకటేష్ గారికి ఫ్యాన్ని. వారం రోజులు ముందు టికెట్ బుక్ చేసుకొని సుదర్శన్ థియేటర్లో సినిమా చూశా. నువ్వు నాకు నచ్చావ్ సినిమా నైజంలో విడుదల చేసినప్పుడు ఆయనతో యాక్సస్ పెరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం మొదటిసారి కలిసి పని చేశాం. వెంకటేష్ గారు ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన హీరో. నిర్మాత కోసం ఎక్కువ ఆలోచిస్తారు. లొకేషన్ లో ఏదైనా వృధా అవుతుంటే తట్టుకోలేరు. రామానాయుడు గారు ఆయన నేర్పించిన గొప్ప లక్షణం అది. ఇక లొకేషన్ లో ఆయన చాలా హుషారుగా వుంటారు. మొదటిసారి మీ బ్యానర్ సీక్వెల్ చేస్తున్నారు కదా .. ఎలా అనిపించింది ? అనిల్ రావిపూడి చాలా స్మార్ట్ గా ప్లాన్ చేశారు. ఎఫ్ 3లో పాత్రలు తీసుకొని కొత్త కథని చెప్పాడు. ఓ రెండు చోట్ల ఎఫ్2 గుర్తుకు వస్తుంది తప్పితే మిగతా అంతా ఫ్రెష్ గా ఉంటుంది. వెంకటేష్ కి రేచీకటి, వరుణ్ కి నత్తి ఇలా అన్నీ కొత్త ఎలిమెంట్స్ హిలేరియస్ గా చేర్చాడు. -
నార్త్ వాళ్లకు ఇప్పుడు ఆ భయం మొదలైంది: అలీ
‘సౌత్ సినిమాలు అంటే నార్త్ వాళ్లకు ఒకప్పుడు బాగా ప్రేమ ఉండేది. ఇప్పుడు ఇంకా ప్రేమ వచ్చింది. అలాగే వీళ్లు మనల్ని తొక్కేస్తున్నారనే భయం కూడా వాళ్లకు మొదలైంది’ అని కమెడియన్ అలీ అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. స్టార్ ఇమేజ్ ఉంది. 43 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ మధ్య కాలంలో మీ స్పీడ్ తగ్గింది. ఎందుకు? బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీల సీరియల్ చేశా. ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే ఆ సీరియల్ చేశా. ఎందుకంటే ఆయన నన్ను హీరో చేశాడు. స్టార్ దర్శకుడిగా ఉన్న ఆయన.. అందరినీ ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనకా ముందు ఆలోచించకుండా చేసేస్తా. ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో మాకు క్యారెక్టర్ ఇస్తున్నారు. సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే..అలీగారు ఎందుకు ఈ సినిమాలో నటించాడు? అని అందరు అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడం లేదు. కథ విని నా క్యారెక్టర్ బాగుంటేనే సినిమా చేస్తా. కొత్త వాళ్లకు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎఫ్ 3లో పూర్వ అలీగారిని చూడగలమా? తప్పకుండా చూస్తారు. నా క్యారెక్టర్లో అంత సత్తా ఉంది. లొకేషన్లో కూడా టెక్నీషయన్స్ బాగా ఎంజాయ్ చేశారు. శిరీష్ గారు అయితే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని అనిల్ చెప్పారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎఫ్3లో మీ క్యారెక్టర్ పేరు? పాల బేబీ. వడ్డీకి తిప్పే క్యారెక్టర్ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం.. సినిమా ఎండింగ్లో మీకు ఆ విషయం తెలుస్తుంది (నవ్వుతూ..). సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా మంది ఆరిస్టులు నటించారు. ఎవరెలా చేశారు? ఒకరిని మించి ఒకరు నటించారు. ఎవ్వరినీ తగ్గించలేం. చిన్న క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకం. ‘కొన్ని సీన్స్ మిస్ అయిపోయామే.. మళ్లీ వెళ్లాలిరా’ అనేలా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. వెంకటేశ్, వరుణ్తేజ్ కామెడీ టైమింగ్ గురించి? వాళ్లు పుట్టిందే ఇండస్ట్రీలో. ఇద్దరూ బాగా చేశారు. వారితో పాటు మిగతా నటీనటులు కూడా చక్కగా నటించారు. సినిమాల్లో హీరోలిద్దరికి ఓ లోపం ఉంది. వెంకటేశ్కు రేచీకటి అయితే.. వరుణ్కు నత్తి.. మరి మీకేముంది? నాకు గన్ ఉందిగా (నవ్వుతూ..) అనిల్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సినిమాలో ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ అనిల్లో అది కొంచెం కూడా కనిపించదు. అందరు వచ్చారా? టిఫిన్ చేశారా? ఓకే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని సింపుల్గా అనేస్తాడు. అతి తక్కువ వయసులో ఇంతమంది ఆర్టిస్టులను మేంటేన్ చేయడం అనేది గొప్ప విషయం. ఒకప్పుడు రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావు సినిమాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది. అనిల్లో అంత సత్తా ఉంది కాబట్టే.. దిల్ రాజు గారు కూడా ఎంత మంది ఆర్టిస్టులు కావాలంటే.. అంతమందిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలాంటి నిర్మాత దొరకడం అనిల్ అదృష్టం. వెంకటేశ్తో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుంది? ఆయనతో నేను చేసిన సినిమాలు అన్ని కామెడీ చిత్రాలే. కామెడీ చేయడంలో చిరంజీవి, వెంకటేశ్, మోహన్బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్బాబు ఎక్స్పర్ట్స్ పొలిటికల్ కెరీర్ గురించి? నన్ను హీరోగా క్రియేట్ చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి అయితే.. పొలిటికల్ లీడర్గా క్రియేట్ చేయబోతున్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిగారే. ఆయన నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. నామీద నమ్మకం పెట్టుకోండి అన్నారు అంతే. ఏదో ఒకరోజు కాల్ వస్తే వెళ్తా.. మీ సమక్షంలోనే(మీడియా) ఆ విషయాన్ని పంచుకుంటా(నవ్వుతూ..) ఫైనల్గా ఎఫ్3 గురించి ఏం చెప్తారు? ఇది ఒక అద్భుతమైన సినిమా. పైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది. కొత్త సినిమాల గురించి? అంటే సుందరానికి, ఎఫ్3, లైగర్, ఖుషీ, ఒకే ఒక జీవితం సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నా. కన్నడలో ధృవ సర్జా మూవీలో నటిస్తున్నాను. ఓ నేపాలి సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నా. ఒకప్పుడు మనం సినిమాల్లో అవకాశం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు నార్త్వాళ్లను మనం తెచ్చుకునేవాళ్లం. మనం యాక్టింగ్ నేర్పించి, డబ్బింగ్ చెప్పించి డబ్బులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు సౌత్ వాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని పిలుస్తున్నారు. -
ఎఫ్ 3లో సోనాలి చౌహాన్ రోల్పై స్పందించిన అనిల్ రావిపూడి
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటాడు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఒకదానికి ఒకటి అంతకుమించి అన్నట్టుగా ఉంటాయి. అనిల్ రావిపూడి సినిమాల్లో యాక్షన్ సీన్స్తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. అందుకే ఆయన రూపొందించి పటాస్ సినిమా నుంచి ఎఫ్ 2 వరకు మూవీ వరకు ఒకదానికి మించి మరోకటి హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తెరకెక్కంచి చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 2కు ఇది సీక్వెల్. ఈ చిత్రం మే 27 థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన మీడియాతో ముచ్చటించాడు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన ఎఫ్ 3 ట్రైలర్లో తమన్నా, మెహ్రీన్లతో పాటు సోనాలి చౌహాన్ మూడో హీరోయిన్గా కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో సోనాలి రోల్పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆమె క్యారెక్టర్ ఏంటీ? తన రోల్ అనిల్ ఎలా డిజైన్ చేశాడనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో మెదిలే ప్రశ్న. ఈ ఇంటర్య్వూలో అనిల్కు సోనాల్ చౌహాన్ రోల్పై ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. ‘ఆమె పాత్రను గురించి మాత్రం అడగొద్దు .. అది సస్పెన్స్. సోనాల్ పాత్ర ఏమిటి? ఆమె ఏం చేస్తుందనేది తెరపై చూడాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తే ఆ కిక్కుపోతుంది’ అంటూ ఆయన మరింత ఆసక్తిని పెంచేశాడు. కాగా ఈ సినిమాలో విక్టరి వెంకటేశ్, వరుణ్ తేజ్లు హీరోలు కాగా తమన్నా, మెహ్రీన్ కౌర్ నటించారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్లు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్లో కనిపించనుంది. -
అదే అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్: సునీల్
అనిల్ రావిపూడి గ్రేట్ ఆల్ రౌండర్. అతనిలో గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు. ప్రతి సీన్ అతనే చేసి చూపిస్తాడు. నా టైమింగ్ నా కంటే అనిల్ కే బాగా తెలుసు.ఇంతమంది స్టార్ కాస్ట్తో ఈ మధ్య కాలంలో ఎవరూ సినిమా తీయలేదు. తీసినా ఇంతమంది ఆర్టిస్ట్ లకి వేరే సినిమాలకి సర్దుబాటు చేస్తూ తీయలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నవ్వుతూ ఉంటాడు. ఆయనను చూసిన వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ, స్మెల్ వస్తుంది. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. ఆయన ఎంత ఎనర్జిటిక్, పాజిటివ్గా ఉంటారో ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి’అన్నారు నటుడు సునీల్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణ లో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సునీల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. ఎఫ్ 3 లోకి ఎలా వచ్చారు ? 'కామెడీ రాసే వాళ్ళు తగ్గిపోయారు. మనం కలసి చేస్తే బావుంటుంది కదా'' అని 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడితో చెప్పా. 'తప్పకుండ చేద్దాం అన్నగారు.. మీ 'సొంతం' సినిమా పదేపదే చూస్తుంటా. మీ టైమింగ్ లోనే మాట్లాడుతుంటాం. మనం కలసి చేద్దాం' అన్నారు అనిల్. చెప్పినట్లే ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చారు. ఎఫ్ 3లో వింటేజ్ సునీల్ ని చూస్తారు. ఎఫ్3లో మీ పాత్ర సినిమా అంతటా ఉంటుందా? సినిమా అంతా వుంటుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం వుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది. నేను వరుణ్ తేజ్ ఒక బ్యాచ్, వెంకటేష్ గారు , రఘుబాబు ఒక బ్యాచ్, తమన్నా ఫ్యామిలీ ఒక బ్యాచ్, పృద్వీగారు, స్టంట్ శివ ఒక బ్యాచ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఒక బ్యాచ్, వెన్నల కిషోర్, రాజేంద్రప్రసాద్ గారు ఒక బ్యాచ్.. మళ్ళీ అందరం కలసి ఒక బ్యాచ్.. అందరం కలసి తర్వాత కామెడీ మాములుగా వుండదు. నాన్ స్టాప్ నవ్వులే. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో ఉంటుంది. ఎఫ్2 - అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్.. మరి ఎఫ్3 అంటే మీరేం చెప్తారు ? ఫన్ & ఫ్రస్ట్రేషన్..మూడు రెట్లు (నవ్వుతూ). ఐతే ఫ్రస్ట్రేషన్ లో కూడా ఫన్ వుంటుంది. ఫ్యామిలీ అంతా థియేటర్ కి వెళ్లి గట్టిగా నవ్వుకొని, మళ్ళీ వెళ్దాం అనుకునే సినిమా ఎఫ్ 3. వరుణ్ తేజ్లో నచ్చిన బెస్ట్ క్వాలిటీ? వరుణ్ తేజ్ అప్పియరెన్స్ చుస్తే రష్యా సినిమాలో కూడా హీరోగా పెట్టేయొచ్చు. హాలీవుడ్ కటౌట్ ఆయనది. ఆలాంటి అప్పియరెన్స్ వున్న వరుణ్ గారు.. ఒక మిడిల్ క్లాస్ రోల్ చేయడం సర్ప్రైజింగా అనిపిస్తుంది. చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి తెలుసు. హీరో అయిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. 'అన్నా' అని పిలుస్తారు. వరుణ్ గారిలో చాలా ఫన్ వుంది. ఈ సినిమాతో అది బయటికి వచ్చింది. దీని తర్వాత ఆయన నుండి ఫన్ ఓరియంటడ్ సినిమాలు కూడా వస్తాయి. ఎఫ్3 లో మీరు ఫేస్ చేసిన చాలెంజ్ ఏంటి ? ఎఫ్ 3, పుష్ప .. ఒకే సమయంలో షూట్స్ లో పాల్గొన్న. రెండూ డిఫరెంట్ రోల్స్. ఒక కామెడీ , రెండు విలనీ. పొద్దున్న కామెడీ చేసి రాత్రికి విలనీ చేయడం కాస్త చాలెజింగ్ అనిపించింది. ఇప్పుడు కామెడీ సినిమాలు చేసే దర్శకులు తగ్గిపోయారు కదా.. ఆర్టిస్ట్ గా మీ మీద ఎలాంటి ప్రభావం వుంటుంది? నామీద కంటే ప్రేక్షకుల మీద ఆ ప్రభావం ఎక్కువ వుంటుంది. నవ్వించే సినిమాలు చేయడం అంత తేలిక కాదు. నవ్వించడం కూడా అంత తేలిక కాదు. సరదాగా నవ్వుకొని వుంటే ఇమ్యునిటీ పెరుగుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా.. సో.. కామెడీ సినిమాలు ఎక్కువ రావాలి. ప్రేక్షకులని నవ్వించాలి. సీరియస్ పాత్రలతో పోల్చుకుంటే కామెడీ చేయడమే కష్టం. అన్ని జోనర్ సినిమాలూ రావాలి. కానీ కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను. సీరియస్ రోల్స్ ఈజీ అంటున్నారు. కలర్ ఫోటోలో చాల సెటిల్ గా చేశారు.. దీనికి కూడా క్రాఫ్ట్ మీద కంట్రోల్ కావాలి కదా ? నిజమే. అయితే ఆ క్రెడిట్ ఇప్పుడు వస్తున్న యంగ్ దర్శకులకు దక్కుతుంది. నా సినిమాలు స్కూల్ , కాలేజీ డేస్ లో చూశారు. ఇప్పుడు వాళ్ళు అప్డేటడ్ వర్షన్. నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చిందే కలర్ ఫోటో. ఎక్కువ కామెడీ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు కదా .. మీ వరకూ ఏం ప్లాన్స్ చేస్తున్నారు ? నిజానికి నేను ప్లాన్ చేయడం మానేశాను. నా కోసం నేచర్ ఏం ప్లాన్ చేస్తుందో గుర్తిస్తున్నాను. కామెడీ చేయమన్నా ఓకే, పదహారేళ్ళ అమ్మాయికి ఫాదర్ గా చేయమన్నా ఓకే. అయితే వచ్చిన అవకాశానికి న్యాయం చేయడానికి వంద శాతం కష్టపడతాను. ఐతే నా వరకూ కామెడీ చేసి నవ్వించడమే ఇష్టం. ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయా ? తమిళ్, కన్నడ, బాలీవుడ్ నుంచి విలన్ పాత్ర సంప్రదించారు. బాలీవుడ్ నుంచి కొన్ని కామెడీ రోల్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి. రెండు ఓకే చేశాం. త్వరలోనే వివరాలు చెప్తాం. మీ స్నేహితుడు త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు ? తన కొత్త సినిమాలో నేను వుంటాను. అవకాశం వున్న ప్రతి చోట నన్ను పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆఖరికి 'భీమ్లా నాయక్' సాంగ్ లో కూడా పెట్టారు ( నవ్వుతూ) ఎఫ్ 3లో వెంకటేష్ , వరుణ్ తేజ్ ఫెర్ఫార్మేన్స్ ఎలా ఉండబోతుంది ? వెంకటేష్ గారి టైమింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎఫ్ 3లో ఆయన స్టీల్ ది షో. వరుణ్ తేజ్ గారిని ఇప్పటివరకూ ఇంత కామెడీ చేసిన రోల్ లో చూసి వుండరు. ఎఫ్ 3 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు. ఈ సినిమాకి ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వుంటారు. కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ -శంకర్ గారి సినిమా చేస్తున్నా. మరో 13 చిన్న , మీడియం సినిమాలు కూడా వున్నాయి. అందరికీ అందుబాటులో వుండాలని నిర్ణయించుకున్నా. ఒక నాలుగు పెద్ద సినిమాలు చేస్తే మరో పది చిన్న సినిమాలు చేయాలని భావిస్తున్నాను. -
ఎఫ్ 3 ఒక మంచి ట్రీట్లా ఉంటుంది – వెంకటేశ్
‘‘అందరి అభిమానులకు, కుటుంబ ప్రేక్షకులకు ‘ఎఫ్ 3’ చిత్రం ఒక ట్రీట్లా ఉంటుంది. అందరూ వచ్చి చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్ని హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ ప్రేక్షకులకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకున్నాం. ‘ఎఫ్ 3’లో రే చీకటి ఉన్న పాత్ర చేశా’’ అన్నారు. (చదవండి: నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్ వీడియో వైరల్) వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ ‘ఎఫ్ 3’ ఫ్రెష్నెస్ని, నవ్వులను తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత అందరూ ఏమీ ఆలోచించకుండా మీ కుటుంబాలతో కలిసి వచ్చి ‘ఎఫ్ 3’ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ‘ఎఫ్ 2’ అనేది ప్రాక్టీస్ మ్యాచ్లాంటిది.. ‘ఎఫ్ 3’ అనేది మెయిన్ మ్యాచ్.. ఈ మ్యాచ్లో సిక్స్ కాదు.. బాల్ స్టేడియం బయటకి వెళుతుంది. మీ అందరికీ ‘ఎఫ్ 3’ నచ్చుతుంది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ –‘‘ఎఫ్ 3’ ట్రైలర్లో చూపించింది కొన్ని నవ్వులు మాత్రమే.. సినిమాలో అంతకుమించిన నవ్వులను మీ కోసం దాచి ఉంచాం. ‘ఎఫ్ 3’లో మోర్ ఫన్ అని పెట్టాం. ఈ రోజు ట్రైలర్కి వచ్చిన స్పందనను బట్టి చెబుతున్నాం.. ‘ఎఫ్’ ఫర్ ఫ్యామిలీ. ఎంటర్టైన్మెంట్ చేయడంలో వెంకటేశ్గారు ఎవరెస్ట్.. ఆ ఎవరెస్ట్ పక్కన నటించేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ని చూస్తే ‘ఇంత కామెడీ చేయగలడా?’ అంటారు. ఈ ఫ్రాంచైజీని నిర్మించడానికి సపోర్ట్ చేసిన నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. అలీ మాట్లాడుతూ – ‘‘ఈ చంటి (వెంకటేశ్ని ఉద్దేశించి) ‘ఎఫ్ 3’లో మామూలుగా చేయలేదు. ఇక్కడ మా చంటి (వరుణ్ తేజ్ని ఉద్దేశించి).. వీరిద్దరూ ఈ సినిమాని తమ భుజాలపై మోశారు’’ అన్నారు. -
అల్టీమెట్ ఫన్ ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది..
F3 Movie Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2కు సీక్వెల్గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ తాజాగా ఎఫ్-3 ట్రైలర్ను విడుదల చేశారు. చదవండి: వైజాగ్లో రామ్చరణ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్ 'ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదే.. కానీ ఆరవ భూతం ఒకటుంది అదే డబ్బు' అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'డబ్బు ఉన్నవాడికి ఫన్.. లేని వాడికి ఫ్రస్టేషన్, సీక్వెల్లో కూడా వీడికి సేమ్ డైలాగ్స్.. అంతేగా, అంతేగా'..వంటి డైలాగులు ఆకట్టకుంటున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్లు హీరోయిన్లుగా నటించారు. -
ఇన్నాళ్ల కెరీర్లో ఆ సినిమా కష్టమనిపించింది: ఎడిటర్
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్న క్రమంలో ఈ చిత్రానికి పని చేసిన స్టార్ ఎడిటర్ తమ్మిరాజు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న 'ఎఫ్ 3' విశేషాలు.. ► మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది? నేను పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 1998లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆవిడ్ ఎడిటర్గా కెరీర్ మొదలుపెట్టాను. తర్వాత ప్రసాద్ ల్యాబ్లో 14ఏళ్ల పాటు ఆవిడ్ ఎడిటర్గా చేశాను. దర్శకుడు రాజమౌళి గారితో 18 ఏళ్ళు ప్రయాణం చేశాను. శాంతి నివాసం సీరియల్ నుంచి బాహుబలి 2 వరకూ రాజమౌళిగారితో పని చేశాను. దర్శకుడు అనిల్ రావిపూడితో పటాస్ నా ఫస్ట్ మూవీ. తర్వాత ఆయన సినిమాలన్నీ చేశాను. ఇప్పటివరకూ దాదాపు 30సినిమాలకు ఎడిటర్గా చేశాను. ► ఎఫ్ 2 తో ఎఫ్ 3 కథ ఎలా ఉండబోతుంది ? ఎఫ్ 2లో పెళ్లి, తర్వాత వచ్చే కష్టాలు .. ఇలా వినోదాత్మకంగా చూపించాం. ఎఫ్ 3 డబ్బు చుట్టూ తిగిరే కథ. మానవసంబంధాలు డబ్బుతో ముడిపడి వున్నాయి. ఈ పాయింట్ ఎఫ్ 3లో చాలా ఫన్ ఫుల్గా చూపించాము. ► ఎఫ్ 2 కి ఎఫ్ 3 పోలికలు వస్తాయా ? ఎఫ్ 2 ఫ్రాంచైజ్ గా వస్తున్న సినిమా ఎఫ్ 3. ఎఫ్ 2 క్యారెక్టర్లు ఉంటాయి కానీ ఎఫ్ 3 కథ మాత్రం పూర్తిగా భిన్నం. లీడ్ క్యారెక్టర్లు తీసుకొని కథని కొత్తగా చెప్పాం. ► కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం ఎలా వుంటుంది ? కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అనిల్ రావిపూడిగారి సినిమాల్లో కామెడీ పంచులు అన్నీ బావుంటాయి. దానిలో ఏది ట్రిమ్ చేయలన్నా కష్టంగా వుంటుంది. ఐతే ఓవరాల్ ఫ్లో చూసుకొని కథకు ఏది అవసరమో అదే ఉంచుతాం. ► దర్శకుడు అనిల్ రావిపూడి గారితో వర్క్ చేయడం ఎలా వుంటుంది ? అనిల్ రావిపూడిగారితో వర్క్ చేయడం చాలా పాజిటివ్గా వుంటుంది. ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల పక్షమే ఆలోచిస్తుంటారు. పటాస్ సినిమా నుంచి మా మధ్య అద్భుతమైన సింక్ కుదిరింది. ► ఎడిటర్ అభిప్రాయాన్ని దర్శకులు గౌరవిస్తారా ? ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా చర్చలు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ప్రీ ప్రొడక్షన్ ఎంత చక్కగా చేస్తామో పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ కూడా అంతే జాగ్రత్తగా చేస్తే మంచి సినిమా వస్తుంది. రషస్ మొదట ఎడిటర్ చూస్తాడు. ఎడిటర్ చెప్పే సూచనలని దర్శకులు గౌరవిస్తారు. ► పాన్ ఇండియా సినిమాల ప్రభావం ఎడిటింగ్ పై ఎలా వుంటుంది ? నేను బాహుబలి 2కి చేశా. రాజమౌళి గారు క్రెడిట్ ఇచ్చారు. అన్ని భాషలు తెలిసిన ఎడిటర్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తారు. ► రీషూట్స్ విషయంలో ఎడిటర్ పాత్ర ఎలా వుంటుంది ? దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ .. అందరూ కూర్చుని చర్చించిన తర్వాత ఏది అవసరమో, కాదో నిర్ణయం తీసుకుంటారు. ► కథ వింటారా ? నేను కథ వినను. కథ వింటే ఇలా వుంటుందని ఫిక్స్ అయిపోతాం. రష్లో అది లేకపోతే ఇలా ఎందుకైయిందనే ప్రశ్న తలెత్తుతుంది. నా వరకూ రష్ ప్రకారం ఎడిటింగ్ చేస్తా. ► ఎడిటింగ్ కి సిజీకి ఎలాంటి సంబంధం వుంటుంది ? చాలా వుంది. బ్లూ మ్యాట్స్ ఎక్కువగా తీసుకున్నారు. అక్కడ ఏం వుంటుందో తెలీదు. దాని దృష్టిలో మనం ఎడిట్ చేసుకోవాలి. కొన్ని సార్లు అనుకున్న విజన్ రాకపోవచ్చు. మళ్ళీ చర్చించి వర్క్ చేయాల్సివుంటుంది. ► ఇన్నాళ్ళ కెరీర్ లో కష్టమనిపించిన సినిమా ? 'మిర్చి' కి అసోసియేట్ ఎడిటర్ గా చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాను. పటాస్ సినిమాకి కూడా చాలా కష్టపడ్డాం. ► సినిమా విజయం అయినప్పుడు మిగతా వారితో పోల్చుకుంటే ఎడిటర్ కి తక్కువ క్రెడిట్ వస్తుంది కదా ? సినిమా సక్సెస్ దర్శకుడిదే. దర్శకుడి విజన్తోనే ఎడిటర్ పని చేయాలి. అతను తీసిన రష్ను ఎడిట్ చేయాలి. కాబట్టి సక్సెస్ క్రెడిట్ దర్శకుడికే చెందాలి. ఐతే మాకు రావాల్సిన గురింపు కూడా వస్తుంది. ► లీకేజీలు గురించి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు ? సినిమా వర్క్ జరుగుతున్నపుడు పుటేజ్ చాలా చోట్లకి వెళుతుంది. ఐతే పని చేసే వాళ్ళకి లీక్ చేయడం తప్పు అనే సంస్కారం వుండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్వయం నియంత్రణ వుంటేనే లీకేజీలని ఆపగలం. ► ఎఫ్ 4 కూడా వుంటుందా ? ఇంకా అనుకోలేదు. ఐతే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంది. ► చేస్తున్న కొత్త సినిమాలు ? కళ్యాణ్ రామ్ గారితో బింబిసార, మైత్రి మూవీ మేకర్స్ సినిమా, నాగశౌర్య కృష్ణ వ్రింద విహారి సినిమాలు చేస్తున్నా. చదవండి: 'నేను ఏమైనా తప్పు చేశానా అని సరదాగా అడిగారు' యూట్యూబ్లో 'సర్కారు వారి పాట'కే మెజారిటీ.. -
ఎఫ్-3 నుంచి బిగ్ అప్డేట్.. పేలనున్న ఫన్ బాంబ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-2కు సీక్వెల్గా వస్తున్న చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ మరో బిగ్ అప్డేట్ను అనౌన్స్ చేశారు. రేపు(సోమవారం) ఉదయం 10.08 నిమిషాలకు ‘బ్లాస్టింగ్ టుమారో’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో టీజర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ బ్లాస్ట్ ఏంటో తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్లు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్లు హీరోయిన్లుగా నటించారు. పూజా హెగ్టే ఓ స్పెషల్ సాంగ్లో కనిపించనుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. The FUN BOMB is ready to EXPLODE 💣 Blasting Tomorrow @ 10:08 AM💥#F3Movie #F3OnMay27 @VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @sonalchauhan7 @Mee_Sunil @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/rI6H4NtJ5A — Sri Venkateswara Creations (@SVC_official) May 1, 2022 -
ఫిలిం జర్నలిస్టులకు ‘చిరు’ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ (ఫోటోలు)
-
జర్నలిస్టులకు నిర్మాతలు చేయూత ఇవ్వాలి : తలసాని
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జర్నలిస్టులే పెద్ద ఆస్తి. సినిమా జర్నలిస్టులకు చేయూత ఇచ్చేందుకు ప్రతి నిర్మాత కనీసం ఒక లక్ష రూపాయలు జర్నలిజం ఫండ్ కింద పెడితే బాగుంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్’(టీఎఫ్జేఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘టీఎఫ్జేఏ’ సభ్యులకు మెంబర్షిప్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అతిథుల చేతుల మీదుగా అందచేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.ఐదు లక్షలు విరాళం ప్రకటించారు. నటుడు చిరంజీవి మాట్లాడుతూ... ‘నేను ‘ప్రాణం ఖరీదు’సినిమా చేస్తున్నప్పుడు నా గురించి ఓ ఆర్టికల్ రాస్తే బాగుండని కోరుకున్న. ఆ సమయంలో చెన్నైలోని ఓ జర్నలిస్ట్ నా గురించి రాసినప్పుడు చాలా ఆనందపడ్డా. ఆ జర్నలిస్టు (దివంగత పాత్రికేయుడు పసుపులేటి రామారావు)ను పిలిచి థ్యాంక్స్ చెప్పాను’అని గుర్తు చేసుకున్నారు. కరోనా వేళ పరిశ్రమలోని 24క్రాఫ్ట్స్కి ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ) పెట్టినప్పుడు సినిమా జర్నలిస్టులను కూడా నిత్యావసర సరుకులు అందించామన్నారు. తాము చేసింది చాలా తక్కువని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ప్రెసిడెంట్: వి లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు 1. ఎం చంద్ర శేఖర్ 2. జి శ్రీనివాస్ కుమార్ జనరల్ సెక్రటరీ: వై జె రాంబాబు జాయింట్ సెక్రటరీలు 1. జి వి రమణ 2. వంశీ కాకా కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ కార్య నిర్వాహక కమిటీ 1. పి రఘు 2. వై రవిచంద్ర 3. జి జలపతి 4. కె ఫణి 5. కె సతీష్ 6. రెంటాల జయదేవ్ 7. వడ్డి ఓం ప్రకాష్ 8. సురేష్ కొండేటి -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ కొడుకు?
టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు స్టార్ హీరోగా సత్తా చాటుతున్న రవితేజకు మహాధన్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్లో మహాధన్ కనిపించాడు. ఇక అప్పటి నుంచి హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ అంటూ వార్తలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇదివరకే స్పందించిన రవితేజ అతని చదువు పూర్తవగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కాలేజీ నేపథ్యంలో సాగే ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ని మహాధన్తో తీయడానికి రవితేజను సంప్రదించగా ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజా ది గ్రేట్ సినిమాతో రవితేజకు హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. -
F3 Movie: ఉర్రూతలూగిస్తున్న ‘ఊ..ఆ..ఆహా..ఆహా’ సాంగ్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 2019 లో సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించిన ‘ఎఫ్2’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్కి మంచి స్పందన విచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నీ కోర మీసం చూస్తుంటే...నువ్వట్టా తిప్పేస్తుంటే... ఊ ఆ అహా అహా! నీ మ్యాన్లీ లుక్కేచూస్తుంటే... మూన్ వాక్ చేసే నా హార్టే' 'ఊ ఆ అహా అహా!' అంటూ ఈ సాంగ్ సాగింది. ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ , దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.సునిధి చౌహాన్ , లవితా లోబో, సాగర్,ఎస్పీ అభిషేక్ అద్భుతంగా ఆలపించారు. తమన్నా, మెహ్రీన్ గ్లామర్, స్పెసీ డాన్స్తో పాట ఉర్రూతలు ఊగిస్తుంది. చీర కట్టుతో పాటు పాశ్చాత్య దుస్తుల్లోనూ హాట్ హాట్గా కనిపించి, కనువిందు చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. -
పూజా హెగ్డె ఐటమ్ సాంగ్ షురూ.. ఇక మరింత ఫన్
Pooja Hegde F3 Movie Item Song Starts: ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సుమారు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడుతూ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్గా మారింది ఈ బ్యూటీ. ఇటీవల 'అరబిక్ కుతు' సాంగ్లో విజయ్తో కలిసి అదరగొట్టింది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణి'గా జిగేలుమనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ల మల్టీస్టారర్ 'ఎఫ్ 3' సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ పాట చిత్రీకరణను శుక్రవారం (ఏప్రిల్ 15) న ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోలో సుమారు 7 ఎకరాల్లో వేసిన అద్భుతమైన సెట్లో ఈ పార్టీ నెంబర్ను షూట్ చేయనున్నారు. శుక్రవారం నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఈ సాంగ్లో పూజా హెగ్డేతోపాటు సినిమాలోని హీరోహీరోయిన్లు కూడా ఆడిపాడనున్నారట. ఒకే స్క్రీన్పై బుట్టబొమ్మ, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీరన్ పిర్జాదా, సోనాల్ చౌహన్ కనిపించడం నిజంగా ఫన్గానే ఉండనుంది. ఈ పాటను రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మిస్తున్నారు. 'ఎఫ్ 3' చిత్రం నవ్వులు పూయించడానికి మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ఆ స్టార్ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే Lets get this party started💃 The Ravishing beauty @hegdepooja joins #F3Movie to add spice to our SPECIAL PARTY SONG🎶#F3OnMay27@VenkyMama @IAmVarunTej@AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/SNZRyJFbD1 — Sri Venkateswara Creations (@SVC_official) April 15, 2022 -
నాటు.. నాటు పాటకు రాజమౌళి, రావిపూడి స్టెప్పులు.. వీడియో వైరల్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం కొనసాగుతుంది. మార్చి 25న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆర్ ఆలిండియా రికార్డులను బద్దలు కొట్టింది. రాజమౌళి మ్యాజిక్కి, కొమురం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ల నటనకి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. మూవీ విడదలై రెండు వారాలు గడుస్తున్నా.. ప్రేక్షకుల ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాలోని ‘నాటు, నాటు’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట కోసం చరణ్, తారక్లు వేసిన స్టెప్పులు.. థియేటర్స్లో ఈలలు వేయించింది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తారక్, చెర్రీల హుక్ స్టెప్పులేసి అలరించారు. సినిమా ప్రమోషన్స్లో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు సైతం ఈ హుక్ స్టెప్పులేని ఆకట్టుకున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ‘నాటు నాటు’పాటకి స్టెప్పులేసి అలరించాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం నైజాం ఏరియాలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టిన నేపథ్యంలో నైజాం పంపిణీదారుడు, నిర్మాత దిల్ రాజు ‘ఆర్ఆర్ఆర్’టీమ్కి విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకీ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో పాటు పలువు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి స్టెప్పులేశాడు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ని అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. సక్సెస్ పార్టీలో నాటు నాటు స్టెప్స్ కి తనతో కలిసి డాన్స్ వేయాలని అడగ్గా.. రాజమౌళి ఓకే చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సక్సెస్ పార్టీలో నాటు నాటు పాటకి కాలు కదిపారు. వీరిద్దరు డాన్స్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న దిల్రాజు, తారక్, చరణ్లతో పాటు మిగిలిన సినీ ప్రముఖలు ఈలలు, కేకలు వేస్తూ స్టేజ్ని హోరెత్తించారు. ప్రస్తుతం రాజమౌళి, అనిల్ రావిపూడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Our Director @ssrajamouli fulfilled the promise he made to @Tarak9999 in @AnilRavipudi’s interview. #RRRMovie THANK YOU THANK YOU THANK YOU….🤩🔥🌊🌟 pic.twitter.com/d6iXFmxQ7y — RRR Movie (@RRRMovie) April 4, 2022 -
హిట్ కాంబినేషన్, ఆ హీరోయిన్లే కావాలంటున్న డైరెక్టర్స్!
ఓ సినిమా హిట్టయితే.. ఆ హీరో–దర్శకుడిది హిట్ కాంబినేషన్ అంటారు. ఆ కాంబినేషన్లో అభిమానులు మరో సినిమాని ఎదురు చూస్తారు కూడా. ఇప్పుడు కూడా ‘హిట్ కాంబినేషన్’ షురూ అయింది. అయితే ఇది హీరోయిన్–డైరెక్టర్ కాంబినేషన్. ‘రిపీట్టే..’ అంటూ ఒక సినిమా తర్వాత వెంటనే తన మరో సినిమాకి ఆ హీరోయిన్నే ఎంపిక చేశారు కొందరు దర్శకులు. ఆ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం. దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్తో పూజా హెగ్డేకి ‘అరవిందసమేత వీరరాఘవ’ తొలి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్. ఆ వెంటనే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి పూజకు చాన్స్ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మహేశ్బాబుతో చేయనున్న సినిమాకి కూడా హీరోయిన్గా పూజా హెగ్డేనే తీసుకున్నారు త్రివిక్రమ్. సేమ్ ఒకప్పుడు త్రివిక్రమ్తో సమంత ఇలా వరుసగా మూడు సినిమాలు (‘అత్తారింటికి దారేది’ (2013), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అ ఆ’ (2016) చేశారు. ఇప్పుడు పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా త్రివిక్రమ్లానే పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ (2017), ‘గద్దలకొండ గణేష్’ (2019) చిత్రాల్లో హీరోయిన్గా నటించారు పూజా హెగ్డే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘భవదీయుడు భగత్సింగ్’లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ నటిస్తారు. రెండు భాగాల సినిమా కాబట్టి ఈ కాంబినేషన్ రిపీట్ కావడం సహజం. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’లో ఓ హీరోయిన్గా నటించిన తమన్నా ఈ చిత్రం సీక్వెల్ ‘ఎఫ్ 3’లోనూ నటిస్తున్నారు. ఏప్రిల్ 27న ‘ఎఫ్ 3’ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ముందు మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంకోవైపు ‘క్రాక్’ (2021) సినిమాకి ముందు దాదాపు మూడేళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రుతీహాసన్. ఈ గ్యాప్ తర్వాత ‘క్రాక్’ హిట్తో టాలీవుడ్లో శ్రుతి సందడి మొదలైంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా శ్రుతీహాసన్నే తీసుకున్నారు గోపీచంద్ మలినేని. ఇక తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. ‘గూఢచారి’ తర్వాత శోభితా వెంటనే మరో తెలుగు సినిమా చేయలేదు. హిందీ సినిమాల్లో నటించారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆమె యాక్ట్ చేసిన తెలుగు చిత్రం ‘మేజర్’. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్గా నటించినవారిని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. చదవండి: అనన్య గ్లామరస్గానే కనిపించాలి.. ఆమెకు అవసరం: చుంకీ పాండే -
F3 Movie: ఆడియన్స్కి హోలీ ట్రీట్, స్పెషల్ వీడియో చూసేయండి
F3 Movie Team Shares Special Video: ‘ఎఫ్ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్ 3’ టీమ్. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత మే 27న ఎఫ్ 3ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించింది. ఇక నేడు హోలీ పండగ సందర్భంగా ఫ్యాన్స్ ట్రీట్ ఇచ్చింది ఎఫ్ 3 టీం. ఈ మేరకు నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ పేజీలో ఈ మూవీ అప్డేట్ ఇస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. చదవండి: ‘రాధేశ్యామ్’పై వర్మ షాకింగ్ కామెంట్స్, మూవీకి అంత అవసరం లేదు.. ఈ సినిమాలోని నటీనటుల నవ్వులను పంచుతూ ఓ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫ్రస్ట్రేషన్ లేని ఫన్తో ఈ వీడియోలో నటీనటులు కనిపించడంతో బాగా ఆకట్టుకుంటుందో. ఫస్ట్ హీరో వెంకటేశ్తో స్టార్ అయిన ఈ వీడియో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, నటి ప్రగతి, సునీల్, ఆలీ ఇలా అందరూ నవ్వులు పూయిస్తూ కనిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం టీంలో సందడి చేస్తూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు, ప్రేక్షకులు చాలా బాగుందని మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమా చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: Vidya Balan: నాతో దారుణంగా ప్రవర్తించారు, 6 నెలలు అద్ధంలో చూసుకోలేదు.. #F3Movie Family wishes you all a very Happy & Safe Holi ♥️ May the festival of colours fill your lives with lots of happiness 🌈✨#HappyHoli@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @ThisIsDSP @adityamusic @SVC_official @f3_movie #F3OnMay27 pic.twitter.com/hlp7aGGrUz — Sri Venkateswara Creations (@SVC_official) March 18, 2022