bar
-
బార్లో అమ్మాయిలతో అసభ్య నృత్యాలు
సనత్నగర్: యువతులను ఎరగా వేసి..మందుబాబులకు కిక్కు పెంచి..అధిక బిల్లులు బాదుతున్న ఓ బార్ దోపిడీకి ఎస్ఓటీ పోలీసులు అడ్డుకట్ట వేశారు. 11 మంది యువతులతో పాటు 10 మంది బార్ సిబ్బంది, మందు బాబులను అదుపులోకి తీసుకుని సనత్నగర్ పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. మూసాపేట లక్ష్మీకళ థియేటర్ సమీపంలోని ఎవర్గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు కొంతమంది యువతులను ప్రత్యేకంగా నియమించుకుని..వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువతను రెచ్చగొడుతున్నారు. మద్యం మత్తులో ఉన్న మందు బాబుల వద్ద అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాలకు అనుమతులు లేకున్నా యువతులతో నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో 11 మంది యువతులను, 10 మంది బార్ సిబ్బంది, మద్యం ప్రియులను అదుపులోకి తీసుకున్నారు. బార్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం సనత్నగర్ పోలీసులకు అప్పగించారు. -
మద్యం షాపులు అప్పగించాలంటూ బార్లో టీడీపీ నేత వీరంగం
-
హిట్ అండ్ రన్ కేసు: నిందితుడు మందు తాగిన బార్ కూల్చివేత
ముంబయి: బీఎండబ్ల్యూ కారు హిట్ అండ్ రన్ కేసును మహారాష్ట్ర సర్కారు సీరియస్గా తీసుకుంది. కారును వేగంగా నడిపి మహిళ మృతికి కారణమైన మిహిర్ షాను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదానికి ముందు నిందితుడు మిహిర్ షా మందు తాగిన జుహూ తారారోడ్లోని బార్పైనా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.తాజాగా బుధవారం(జులై 10) బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ)అధికారులు బార్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసుల బందోబస్తుతో వచ్చి మరీ కూల్చివేత ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మిహిర్షా అధికార శివసేన పార్టీకి చెందిన నేత రాజేష్ షా కుమారుడు కావడంతో ప్రభుత్వంపై ఈ కేసులో ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. కాగా, ఆదివారం(జులై 7) ఉదయం వర్లిలో చేపలు కొనేందుకు బైక్పై వెళ్లిన దంపతులను వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. ఢీవ కొట్టడమే కాకుండా మహిళను ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలయింది. -
దర్శిలో బార్కు తాళం వేసిన టీడీపీ నేతలు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో నూతన సంస్కృతికి తెరలేచింది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే నరసరావుపేటకు చెందిన కొందరు వ్యక్తులు దర్శి వచ్చి ఓ బార్ అండ్ రెస్టారెంట్కు తాళాలు వేశారు. మూడు రోజులుగా బార్ అండ్ రెస్టారెంట్ తాళాలు ఇవ్వకుండా నిర్వాహకులను ఇబ్బందిపెడుతున్నారు. దీంతో ఎన్నడూ లేనివిధంగా ఈ కొత్తసంస్కృతి ఏమిటని జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు... ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు నరసరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు దర్శి వచ్చి పట్టణంలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్కు తాళాలు వేశారు. ఆ తర్వాత ‘పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం రండి..’ అని చెప్పి వెళ్లారని బార్లో పని చేసేవారు చెబుతున్నారు. నిర్వాహకులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. వారు తమకు సంబంధంలేదని, ఎక్సైజ్వారిని సంప్రదించండని చేతులు దులిపేసుకున్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులను నిర్వాహకులు కలవగా.. ‘బార్ మూసేస్తే పోలీసులను కలవండి. మాకు ఎలాంటి సంబంధం ఉండదు’ అని బదులిచ్చారు. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు.దీంతో మూడు రోజులుగా కేబీ బార్ అండ్ రెస్టారెంట్ తెరవలేదు. ఈ విషయంపై బార్ నిర్వాహకులు మాట్లాడుతూ ‘నరసరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు తమ బార్ అండ్ రెస్టారెంట్కు తాళాలు వేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళతాం’ అని చెప్పారు. -
బార్పై టీడీపీ శ్రేణుల దాడి...
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట శివారు జొన్నలగడ్డ రోడ్డులో తాను నిర్వహిస్తున్న పల్నాడు బార్ అండ్ రెస్టారెంట్పై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడిచేసి రూ.1.40 లక్షల విలువైన మద్యం అపహరించారని బార్ యజమాని, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు షేక్ నూరుల్ అక్తాబ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బార్కు బలవంతంగా తాళాలు వేశారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... ‘తొలుత గురువారం నాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి నూతన ఎమ్మెల్యేతో మాట్లాడుకున్న తర్వాతే బార్ వ్యాపారం చేయాలని చెప్పారు. ఈ మేరకు నేను బార్కు తాళాలు వేసి వెళ్లాను. అనంతరం రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు టీడీపీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో 20మంది బార్ వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టి కౌంటర్లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. అదే సమయంలో మీ యజమాని వచ్చి మా ఎమ్మెల్యేను కలవాలని వారు అక్కడున్న సిబ్బందిని హెచ్చరించారు. వారు వెంట తెచ్చుకున్న తాళాలను బార్కు వేసుకుని వెళ్లారు. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే బార్ వద్దకు వెళ్లి తాళాలను పరిశీలించి జిల్లా ఎస్పీ మలికాగార్గ్కు ఫోన్ చేసి విషయం తెలియజేశాను.’ అని షేక్ నూరుల్ అక్తాబ్ పేర్కొన్నారు. తాను ఎస్పీకి ఫోన్లో సమాచారం ఇచ్చిన వెంటనే రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రోశయ్య, పోలీసు సిబ్బంది వచ్చి పరిశీలించారని తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీసు అధికారులు, క్లూస్టీమ్, ఎక్సైజ్ ఎస్ఈబీ సీఐ నయనతార, ఎస్ఐలు వచ్చి పంచనామా చేసి స్టాకు వివరాలు తనకు ఇచ్చారని చెప్పారు. తన ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. -
పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం(మే27) తెల్లవారుజామున షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని ఓ బార్లో పనిచేస్తున్న డీజే సందీప్ను దుండగులు పాయింట్బ్లాక్ రేంజ్లో కాల్చి చంపారు. తొలుత ఆదివారం రాత్రి నలుగురు దుండగుల బ్యాచ్ బార్లోకి ప్రవేశించింది. బార్లో డీజే మ్యూజిక్ ప్లే చేస్తుండటంపై వారు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై డీజే సందీప్తో పాటు బార్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారు వెళ్లిపోయారు. గొడవ సద్దుమణిగిందనుకునేలోపు మళ్లీ సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో డీజే సందీప్ను తుపాకీతో ఛాతిపై కాల్చారు. వెంటనే సందీప్ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సందీప్ను ఛాతిపై తుపాకీతో కాల్చే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. -
ఎంత బరితెగింపు! సీజ్ చేసినా.. మద్యం బార్ నిర్వహణ
జడ్చర్ల: ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన మద్యం బార్ యథావిధిగా కొనసాగడం జడ్చర్లలో చర్చనీయాంశంగా మారింది. 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఓ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న బార్ నుంచి గత నెల 15న ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించి డీసీఎం వ్యాన్లో అక్రమంగా మద్యం తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బార్లో ఉండాల్సిన మద్యం కాటన్లు ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా బయటకు తరలించడంపై ఎక్సైజ్ అధికారులు విచారించి బార్ను సీజ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల నిబంధనలను బేఖాతరు చేస్తూ బార్ను నిర్వాహకులు యథావిధిగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేకరులు ఎక్సైజ్ సీఐ బాలాజీ దృష్టికి తీసుకెళ్లారు. తాము మద్యం బార్ను సీజ్ చేశామని, బార్ను మళ్లీ యథావిధిగా కొనసాగిస్తుండడంపై తమకు తెలిసిందన్నారు. మరోసారి విచారించి బార్ను సీజ్ చేస్తామని ఆయన తెలిపారు. -
బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి..
జమైకా: కుటంబసమేతంగా విహారయాత్రకు వెళ్లిన బ్రిటీషతను ఒక బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్ డ్రింకులను తాగే ప్రయత్నం చేసి అనారోగ్యం పాలై అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మృతి చెందిన సంఘటన జమైకాలోని సెయింట్ ఆన్స్ లో చోటు చేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్తా విషాదాంతమైంది. బ్రిటన్ కు చెందిన తిమోతి సదరన్(53) తన సహోదరి, పిల్లలతోపాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేద్దామని జమైకా వెళ్ళాడు. తీరా విహారయాత్రకు వెళ్లిన తర్వాత మద్యం సేవించకపోతే యాత్ర అసంపూర్తిగా ఉంటుందని భావించి వారు బస చేసిన హోటల్ దగ్గర్లో బార్లు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీశాడు. అక్కడికి దగ్గర్లోనే డికామెరూన్ క్లబ్ కరీబియన్ బార్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు తిమోతి. బార్ మెనులో మొత్తం 21 కాక్ టెయిల్ డ్రింకులు ఉండటంతో అత్యుత్సాహంతో అన్నిటినీ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ 12 రకాల కాక్ టెయిళ్ళు తాగేసరికి మొహం మొత్తి అక్కడితో సురాపానం ఆపేసి హోటల్ రూముకు వెళ్లిపోయాడు. అన్ని కాక్ టెయిళ్ళు తాగాక కడుపంతా కకావికలమై హోటల్ రూములో చాలాసేపు ఇబ్బంది పడినట్లు అతని కుటుంబసభ్యుల్లో ఒకామె తెలిపారు. అంబులెన్స్ కోసం ఎంత బిగ్గరగా కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. నొప్పితో విలవిల్లాడిపోయిన తిమోతి చాలాసేపు గగ్గోలు పెట్టి వాంతులు చేసుకున్నాక చలనం లేకుండా పడిపోయాడని, తర్వాత ఎంతగా పిలిచినా స్పందించలేదని ఆమె తెలిపారు. అక్కడే ఉన్న ఒక నర్సు అంబులెన్సుకు కబురు చేసిందనుకున్నాను. కానీ ఆమె కబురు చేయలేదు. ఈలోపే తిమోతి పల్స్ పడిపోయి చనిపోయాడని చెప్పారామె. పోలీసుల ప్రాధమిక విచారణలో అప్పటికే తెల్లవార్లూ బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్ లో ఇద్దరు కెనడాకు చెందిన యువతులు పరిచయమయ్యారు. వారిలో ఒకరి పుట్టినరోజు సందర్బంగా సవాలుగా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగే ప్రయత్నం చేశాడని ఆ కారణం చేతనే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో చనిపోయినట్లు వారు నిర్ధారించారు. ఇదిలా ఉండగా అత్యవసర సమయంలో సాయం చేయడానికి సిబ్బంది లేకపోవడం వలననే తిమోతి చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు! -
బార్ క్యాషియర్ దారుణహత్య
కర్ణాటక: బార్లో మద్యం తాగడానికి వచ్చిన యువకులు– సిబ్బంది మధ్య గొడవ జరిగి సిబ్బంది ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి శివమొగ్గ తాలూకాలోని ఆయనూరు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు బార్ క్యాషియర్ సచిన్ (27). నిందితులు ఆయనూరు తండాకు చెందిన నిరంజన్, సతీష్, అశోక్ నాయక్లు. నవరత్న బార్లో వీరు మద్యం తాగడానికి వచ్చారు. రాత్రి 11 గంటలకు.. బార్ మూసేయాలి, ఇక వెళ్లిపోవాలని సిబ్బంది వారికి సూచించారు. మందు తాగుతుంటే మధ్యలో ఇబ్బంది పెడుతారా అని తాగుబోతులు గొడవ పడ్డారు. దాంతో క్యాషియర్ సచిన్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా నువ్వేంటి మాకు చెప్పేది అని కత్తితో అతని పొట్టలో పొడిచారు. తరువాత బయట పోలీసులు ఉన్నప్పటికీ, బైక్లపై పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సచిన్ను బార్ సిబ్బంది ఆయనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేసి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. కుంసి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
ఇద్దరిని బలిగొన్న సెల్ఫీ సరదా
బాల్కొండ: నీటి అంచున సెల్ఫీ దిగాలన్న ఓ యువకుడి సరదా అతనితో పాటు మరొకరిని బలిగొన్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాణి పేట్కు చెందిన అబ్దుల్ ఫహీం (50) తన మరదలు కుమారుడు అబ్దుల్ బార్ (23), తన కుమారుడు అబ్దుల్ సాద్తో కలిసి బుధవారం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చారు. ప్రాజెక్ట్ దిగువన ఎస్కే ప్ గేట్ల వద్ద గోదావరిలోకి దిగారు. అక్కడ నీటి అంచున అబ్దుల్ బార్ సెల్ఫీ తీసుకోడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ఇది గమనించిన అబ్దుల్ ఫహీం.. అతన్ని రక్షించేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయా రు. ఒడ్డుపై నుంచి వీరిని చూస్తున్న అబ్దుల్ సాద్ గట్టిగా కేకలు వేశాడు. స మీపంలో ఉన్న మత్స్యకారులు వచ్చేలోపు ఇద్ద రూ నీటిలో పూర్తిగా ము నిగి పోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా నీట మునిగిన చోటనే సాయంత్రానికి ఇద్దరి మృత దేహాలూ లభ్యమయ్యాయి. -
బార్లో రగడ..పదిమంది అరెస్టు
బార్లో సిబ్బందికి, కస్టమర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనకు సంబంధించి పదిమందిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలోని బార్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నిన్న సాయంత్రం ముంబై బార్ సిబ్బందికి కస్టమర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడం వంటివి చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురు సిబ్బందిని, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Mumbai Bar Brawl Caught On Camera, 10 Arrested Read here: https://t.co/djgS4TaDUJ pic.twitter.com/3nTUca4O7f — NDTV Videos (@ndtvvideos) April 8, 2023 (చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్దే హవా! శరద్ పవార్) -
ఆ బార్తో నాకెలాంటి సంబంధం లేదు
నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు జీవం పోసి జాతీయ స్థాయిలో అవార్డు దక్కించకున్న నటి కీర్తి సురేష్. ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తన పంథాను మార్చుకుని గ్లామర్ వైపు దృష్టి సారించింది. అయితే అలాంటి పాత్రలు ఈ అమ్మడికి సరిపడలేదనే విమర్శలు వచ్చాయి. కీర్తీసురేష్ గ్లామరస్గా నటించిన చిత్రాల్లో సర్కారి వారి పాట చిత్రం మినహా మిగిలినవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో తమిళంలో అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో నటించిన సాని కాగితం చిత్రం కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది. విషయం ఏమిటంటే ఇది డిగ్లామర్ పాత్రే. తనకు జరిగిన అన్యాయంపై బాగా ప్రతీకారాలతో రగిలిపోయే పాత్రను కీర్తి సురేష్ సమర్థంగా పోషించి ప్రశంసలు అందుకుంది. అలా చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ దసరా అనే తెలుగు చిత్రంలో డిగ్లామర్ పాత్రలో నటించి మరోసారి నటిగా తన పరిణితిని చాటుకుంది. ఇక అసలు విషయానికి వస్తే దసరా చిత్రంలో సిల్క్ బార్ మద్యం దుకాణం కీలకంగా ఉంటుంది. కాగా బార్ ముందు నటి కీర్తి సురేష్ ఫొటోలు దిగి వాటిని తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. అందులో సిల్క్ బార్ సెట్ను తొలగించే ముందు తాను దాని ముందు ఫోటోలు దిగాలని, అంతకంటే ఆ బార్కు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్కు లైక్ల వర్షం కురుస్తోంది. -
బార్పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు..
ముంబై: మహారాష్ట్ర ముంబైలోని రెస్టారెంట్ అండ్ బార్పై రైడ్ చేసిన పోలీసులు లోపల చూసి షాక్ అయ్యారు. రహస్యంగా నిర్మించిన ఓ గదిలో 17 మంది మహిళలను చూసి అవాక్కయ్యారు. మరో నలుగురు మహిళలు బార్లో డాన్స్ చేస్తూ కన్పించారు. దహిసార్ ప్రాంతంలో శుక్రవారం ఈ దాడులు చేసిన పోలీసులు మొత్తం 19 మంది కస్టమర్లు, ఐదుగురు సిబ్బందితో పాటు బార్ మేనేజర్ను అరెస్టు చేశారు. సీక్రెట్ రూంలో రహస్యంగా దాచిన 17 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఇలాంటి రైడ్లు చేసినప్పుడు మహిళలను కన్పించకుండా దాచాలనే నిర్వహకులు రహస్యంగా ఓ గదిని నిర్మించి బలవంతంగా వారిని అందులో ఉంచారని అధికారులు తెలిపారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
బార్లోకి చొరబడి కాల్పులు.. 12 మంది మృతి!
మెక్సికో సిటీ: గుర్తు తెలియని కొందరు దుండగులు బారులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన సెంట్రల్ మెక్సికో ఇరాపుటో నగరంలో శనివారం రాత్రి జరిగింది. గ్వానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలోనే కాల్పుల ఘటన జరగటం ఇది రెండోది కావటం గమనార్హం. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు సిటీ ప్రభుత్వం తెలిపింది. నరమేధానికి పాల్పడిన దుండగుల కోసం భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. బార్లోకి చొరబడి కాల్పులు జరిపేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. గ్వానాజువాటో ప్రధానంగా ప్రపంచస్థాయి కార్ మేకర్స్కు తయారీ హబ్గా ఉంది. అయితే.. కొద్ది సంవత్సరాలుగా డ్రగ్స్ గ్యాంగ్స్ మధ్య భీకర పోరు జరుగుతుండటంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21న గ్వానాజువాటోలోని ఓ బార్లో కాల్పులు జరగటం వల్ల 10 మంది మరణించారు. 2018లో అధికారం చేపట్టిన అధ్యక్షుడు అండ్రెస్ మన్యూయెల్ లోపేజ్ ఒబ్రేడర్.. గ్యాంగ్ హింసలను తగ్గించారు. అయితే.. డ్రగ్స్ ముఠాలను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఇదీ చదవండి: రష్యా సైనిక శిక్షణ కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్నాడు
ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి ఉద్యోగాన్ని, ప్రియురాలిని కోల్పోయేలా చేసింది. చివరికి అతన్ని కటకటాలపాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే... ఆస్రేలియాలోని ఒక బార్లో పనిచేసే సర్వర్ డాన్ సాండర్స్కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలు డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలినియర్గా మారిపోయాడు. అతను ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ 13 కోట్ల నగదును పొందాడు. అసలేం జరిగిందటే.. అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతిసారి సారీ ట్రై ఎగైన్ అని రావడం పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా...మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషిన్ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్స్యాక్షన్ క్యాన్సిల్డ్ అని రావడం డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. ఐతే తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా రావడం లేదు. దీంతో సర్వర్ సాండర్స్కి దెబ్బకి తాగిన మత్తంతా దిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని చెబుతారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్ సాండర్స్ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలకు బ్యాంక్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్ అకౌంట్లోని కొంత సొమ్మును క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ 13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు. దీంతో ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బుతో విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారెన్ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. అతని మితిమీరిన జల్సాల కారణంగా బార్లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలలో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులకు ఏటీఎంలో ఫ్రాడ్ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు. తర్వాత పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్ సాండర్స్గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్ పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులు ఫ్రాడ్ కేసుల విషయమే చెబుతూ... ఆన్లైన్లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ఏదీఏమైన ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే కదా!. (చదవండి: ఫ్రీ బస్సులోనూ టికెట్ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్) -
బార్లో అర్ధరాత్రి కాల్పులు.. 14 మంది మృతి..
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్ సమీపంలోని సొవెటె టౌన్ షిప్లో దుండగుల ముఠా రెచ్చి పోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బార్పై తుపాకులతో కాల్పుల మోత మోగించింది. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ముఠా మినీబస్ ట్యాక్సీలో వచ్చి బార్లో ఒక్కసారిగా కాల్పులు జరిపిందని పోలీసులు తెలిపారు. ప్రాణ భయంతో అక్కడున్న వారు పరుగులు తీశారని పేర్కొన్నారు. మొదట 12 మంది మృతదేహాలు లభించాయని, ఆ తర్వాత మరో ఇద్దరు తీవ్ర గాయాల కారణంగా చనిపోయారని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బార్లో ఉన్నవారు ఉల్లాసంగా పార్టీ చేసుకుంటుండగా.. దుండగులు విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఈ దాడి చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం'
గచ్చిబౌలి (హైదరాబాద్): ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఐటీ కారిడార్లోని నాలెడ్జ్ సిటీలో ఐటీసీ కోహినూర్ స్టార్ హోటల్లో 24 గంటలు తెరిచి ఉండే ఒటినో రూఫ్ టాప్ హ్యాంగింగ్ బార్కు శనివారం రాత్రి 11.30 గంటలకు యూఎస్లో రీసెర్చ్ స్కాలర్, న్యూట్రీషియన్గా పనిచేస్తూ నగరంలో ఉండే రాజస్తాన్కు చెందిన ఓ యువతి (25)తో కలిసి విష్ణు, విక్రమ్లు వెళ్లారు. యువతికి పరిచయస్తుడైన మయాంక్ అగర్వాల్, అబ్రార్, సాదత్, అరీఫుద్ధీన్లతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి అదే బార్కు వచ్చారు. చదవండి: (నాగదోషం ఉన్నట్లు నమ్మించి.. పలుమార్లు అత్యాచారం) అర్థరాత్రి దాటిన తరువాత మయాంక్, సాదత్లు యువతిని పక్కకు పిలిచి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాక్సర్ విక్రమ్ దాడిలో అబ్రార్ గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అబ్రార్ శనివారం తెల్లవారు జామున రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఇవ్వక పోవడంతో తనపై లైంగిక దాడి చేస్తామని బెదిరించారని బాధిత యువతి సోమవారం రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. విక్రమ్ దాడిలో అబ్రార్, మయాంక్ వర్గం దాడిలో విష్ణు గాయపడ్డారని చెప్పారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని, సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధితురాలితో పాటు విష్ణు, విక్రమ్లు మంగళవారం సాయంత్రం రాయదుర్గం పీఎస్కు వచ్చారు. యువతి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా యువతి మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబీకులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. తగిన చర్యలు తీసుకోకుంటే మహిళా కమిషన్ను ఆశ్రయిస్తామని తెలిపారు. -
బార్ల సంఖ్య పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల సంఖ్య పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త బార్ పాలసీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, జిల్లాలు పెరిగిన బార్ల సంఖ్య పెంచకూడదని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. కాగా, 840 బార్ల లైసెన్స్లు మరో రెండు నెలలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈలోగా బార్ల లైసెన్స్లు పొందేందుకు వేలం, లాటరీ నిర్వహించాలని నిర్ణయించింది. -
పబ్గా కేఫ్ అండ్ బార్... అర్థనగ్న డ్యాన్సులతో హంగామా!
సాక్షి, హైదరాబాద్: మధ్య మండలంలోని రామ్గోపాల్ పేటలో (ఆర్ పేట) క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్గా మార్చేశాడు. అది చాలదన్నట్లు డ్యాన్స్ బార్ యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ రూపమిచ్చి క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్రావు వెల్లడించారు. క్లబ్ టెకీల మేనేజింగ్ డైరెక్టర్ సైతం మహిళ కావడం గమనార్హం. బోయిన్పల్లికి చెందిన జి.విజయ్కుమార్ గౌడ్ కొన్నాళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా, ఎన్.రవి దీనికి మేనేజర్/అకౌంటెంట్గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్గా పనిచేస్తున్నారు. సమయ పాలన లేకపోవడంతో పాటు డీజే నిర్వహణ, డిస్కో లైట్ల ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మారని, అంతటితో ఆగని క్లబ్ టెకీల నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ డ్యాన్స్ బార్గా మార్చేశారు. ఈ యువతులు తమ హావభావాలతో పాటు చర్యలతోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. డ్యాన్సర్లు అభ్యంతరకరంగా నృత్యం చేస్తూ వెళ్లి కస్టమర్ల పక్కన కూర్చోవడం, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేస్తూ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. దీనిపై మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్కు సమాచారం అందింది. ఎస్సై సీహెచ్ నవీన్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో క్లబ్ టెకీలపై దాడి చేశారు. నళిని రెడ్డి, ఎన్.రవి, సైదా జరీన్, బి.హరికృష్ణ, బి.ప్రకాష్లతో పాటు నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్ పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. పబ్లో రష్యన్ యువతులతో డ్యాన్సులు బంజారాహిల్స్: రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్లో రష్యన్ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎౖMð్సజ్శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు..పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇదే సమయంలో పబ్లో శనివారం రాత్రి అతిథులు పెద్దసంఖ్యలో రావడం, మద్యం మత్తులో తూలడంతో పాటు అక్కడున్న రష్యన్ యువతులతో కలిసి నృత్యాలు చేశారు. దీనికితోడు రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం,పబ్లోని శబ్ధాలకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పబ్ నిర్వాహకులైన దుర్గాప్రసాద్, చువాల్సింగ్లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పబ్బు..గబ్బు!) -
బార్లో అశ్లీల నృత్యాలు.. 64 మంది అమ్మాయిలతో..
శివాజీనగర(బెంగళూరు): నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న బార్పై సీసీసీ పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని రూ.1.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన 64 మంది మహిళలను కాపాడారు. నగరంలోని ఉప్పార పేటలో బార్లో డీజే పెట్టి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ( చదవండి: టీచర్ సులోచన మృతికి కారణాలు ఏంటి? ) మరో ఘటనలో.. క్రికెట్ బెట్టింగ్.. వ్యక్తి అరెస్ట్ బనశంకరి: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి రూ. లక్షకు పైగా నగదు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఐసీసీ మహిళా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వినోబానగర్లో నవాజ్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
బార్ నడుపుతున్న ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ!
మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన ఓ ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా బార్ను లీజుకు తీసుకుని చీకటి వ్యాపారం చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వ షాపులకు సరఫరా చేయాల్సిన మద్యాన్ని బార్కు మళ్లించి ప్రభుత్వ షాపుల్లో కృత్రిమ కొరత సృష్టించడమే కాకుండా.. అదే మద్యాన్ని సదరు బార్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని నిలదీసిన వ్యాపార భాగస్వామిపై సీఐ, ఎస్ఐ కిరాయి రౌడీలతో దాడులు చేయించగా.. ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో బాధితుడైన నాదెళ్ల వెంకట శివకుమార్ టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన ఆనందరెడ్డి తన భార్య నిర్మల పేరిట మదనపల్లె అవెన్యూ రోడ్డులో ఆనంద్ బార్ పేరిట గతంలోనే లైసెన్స్ పొందాడు. దీనిని ఎక్సైజ్ విభాగంలోని మదనపల్లె మద్యం డిపోలో పనిచేస్తున్న సీఐ జవహర్బాబు, ఎస్ఐ సురేష్కుమార్, స్థానిక ఏబీఐ కాలనీలో ఉండే నాదెళ్ల వెంకట శివకుమార్ కలిసి లీజుకు తీసుకున్నారు. కాగా, సీఐ, ఎస్ఐ ప్రభుత్వ మద్యం షాపులకు కేటాయించాల్సిన బీర్లు, ఖరీదైన మద్యాన్ని బార్కు మళ్లించి బ్లాక్ మార్కెట్లో విక్రయాలు సాగిస్తున్న విషయం భాగస్వాముడైన వెంకట శివకుమార్కు తెలిసింది. ఈ విషయాన్ని బార్ యజమాని ఆనంద్కు తెలియజేశాడు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్మాల్సిన మద్యాన్ని బార్లో అమ్మటం నేరం కాబట్టి ఆ నేరం తనపైకి వస్తుందన్న భయంతో 20 రోజుల క్రితం బార్కు తాళాలు వేసి తనకు సరుకు వద్దని సీఐ, ఎస్ఐలకు తెగేసి చెప్పాడు. ఆపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఐ జవహర్బాబు, ఎస్ఐ సురేష్కుమార్ ఆదివారం కిరాయి రౌడీలతో బార్ తలుపులు ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకున్న వెంకట శివకుమార్పై దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితుడు వెంకట శివకుమార్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు బార్ వద్దకు చేరుకుని ముగ్గురు రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని టూటౌన్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. -
బీరు కొనుగోలు ‘గొడవ’.. బార్లో యువకులపై నిర్వాహకుల దాడి
మేడిపల్లి: మద్యం సేవించడానికి బార్కు వెళ్లిన ఇద్దరు యువకులపై బార్ నిర్వాహకులు, సిబ్బంది దాడికి పాల్పడిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్నగర్కు చెందిన దంతూరి సాయి కృష్ణ, సాయిరాం స్నేహితులు. వారిరువురు మద్యం సేవించేందుకు సోమవారం ఉప్పల్ డిపో సమీపంలోని దర్బార్ బార్కు వెళ్లారు. బిల్లు చెల్లించే విషయంలో వెయిటర్కు వీరిద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో బార్ సిబ్బంది మూకుమ్మడిగా వీరిద్దరిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పక్కనే ఆస్పత్రిలో చేర్పించగా సమాచారం అందుకున్న బార్ సిబ్బందిలో మరికొందరు అక్కడికి వెళ్లి వారిని మరోసారి చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సాయి కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురిపై కేసు నమోదు.. బార్ నిర్వాహకులు, సిబ్బంది ఏడుగురిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కటిక కుమార్, జగన్, అమ్మోజు నవీన్, చెంచు వీరేశ్, సుదగాని నర్సింహ్మ, బర్ల రాజిరెడ్డి, చొక్కాల రాజవర్థన్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బార్ వద్ద ఆందోళన ... సాయి కృష్ణ, సాయిరాంపై దాడిని నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేతలు దర్బార్ బార్ వద్ద ఆందోళన నిర్వహించారు. బార్ అనుమతులను రద్దు చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన ఇద్దరు బారు నిర్వాహకులపై ఆందోళన కారులు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనంపై రాళ్లు వేయడంతో అద్దం పగిలిపోయింది. సంఘటనా స్థలానికి వచ్చిన మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్రావు, మేడిపల్లి ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
Hyderabad: మద్యం మత్తులో గ్యాంగ్వార్
సాక్షి, చిలకలగూడ (హైదరాబాద్): వారాసిగూడ చౌరస్తాలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్వార్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. వివరాల ప్రకారం.. వారాసిగూడ చౌరస్తాలోని ఓ మద్యం షాపులో నిబంధనలకు వ్యతిరేకంగా విశాలమైన సిట్టింగ్రూంను ఏర్పాటు చేసి మినీబార్ను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రెండు గ్రూపులు తమ స్నేహితులతో కలిసి మినీబార్లో మద్యం సేవిస్తున్నారు. రాత్రి 7 గంటలకు మద్యం మత్తులో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని గ్యాంగ్వార్కు దారితీసింది. చౌరస్తా నుంచి నాలుగు వైపుల ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రెండు గ్రూపులను చెదరగొట్టారు. ఫజల్, శివకుమార్లతోపాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మినీబార్లు ఏర్పాటు చేయడంతో తరచూ కొట్లాటలు జరుగుతున్నాయని, వారాసిగూడ చౌరస్తాలో మద్యం షాపులను అనుమతి ఇవ్వొద్దని ఆందోళనలు చేసిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
షాకింగ్: బార్లో సీక్రెట్ రూమ్.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు..
Mumbai Dance Bar Raid: అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఓ బార్పై పోలీసులు దాడులు చేశారు. బార్ మొత్తం వెతికినా వారికి అక్కడ తప్పుగా ఏం దొరకలేదు. కానీ అక్కడున్న ఓ అద్దంపై పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే అద్దాన్ని పగలగొట్టగా అక్కడ కనిపించిన దృశ్యం పోలీసులను షాక్కు గురయ్యారు. అద్దం వెనకాల ఓ సీక్రెట్ రూమ్ బయటపడింది. అందులోకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 యువతులు ఒకరి వెనక ఒకరు బయటకు వస్తుండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. సీక్రెట్ బేస్మెంట్లో ఈ చీకటి దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.అసలు ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే. వివరాలు.. ముంబై అంధేరిలోని దీప బార్పై ఆదివారం రాత్రి మహారాష్ట్ర పోలీసులు దాడులు చేశారు. దీప బార్లో యువతులను కస్టమర్ల ముందు వికృతంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సదరు బార్పై దాడులు చేశారు. అయితే పోలీసుల దాడి గురించి సమాచారం అందుకున్న బార్ యాజమాన్యం అప్రమత్తమై యువతలను వెంటనే అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఆపరేట్చేసే ఓ రహస్య గదిలోకి పంపారు. దీంతో పోలీసులు గంటలపాటు బార్ మొత్తం సెర్చ్ చేసిన ఎవరూ దొరకలేదు. వాష్రూం, కిచెన్, స్టోర్రూమ్లలో వెతికినా మొత్తం ఖాళీగా ఉంది. దీంతో బార్ ఓనర్, మేనేజర్, వెయిటర్స్ను పోలీసులు విచారించారు. కానీ తమ బార్లో అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్స్ చేయించడం లేదని, ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ ఆరోపణలు కొట్టిపారేశారు. చదవండి: నీతో శృంగారం నాకిష్టం లేదు.. భర్త జననాంగాన్ని కోసేసిన భార్య అయితే పోలీసులకు అప్పటికీ నమ్మకం కలగలేదు. అంతేగాక మేకప్ రూమ్లో తగిలించి ఉన్న పెద్ద అద్దం పోలీసులకు అనుమానాన్ని కలిగించింది. పోలీసులు ఆ అద్దాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా.. అది కుదరలేదు. అనంతరం పెద్ద సుత్తి తీసుకొచ్చి అద్దాన్ని పగలగొట్టారు. అప్పుడే అసలు విషయం బయట పడింది. అద్దం వెనకాల పెద్ద సొరంగంలా ఉన్న ఓ రహస్య గది ఉంది. ఆ గదిలోకి వెళ్లి చూడగా బార్ యాజమాన్యం గుట్టంతా బయటపడింది. కలుగులో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్లు ఈ సీక్రెట్ గదిలో నుంచి 17 మంది యువతులు బయటకు వచ్చారు. 17 మంది యువతలను పోలీసులు రక్షించి.. రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: జన్మించి నెల కూడా కాలేదు.. ఏడుస్తోందన్న కోపంతో కన్న తల్లే.. There are shocking cases from Mumbai, the capital of Maharashtra. Now, recently, 17 girls have been detained by the Social Service Branch of Mumbai Police in Deepa bar in Andheri last Sunday night. @DGPMaharashtra pic.twitter.com/wIpE2PMYFU — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 13, 2021 దీనికి సంబంధించిన వీడియోను ఓ ఎన్జీఓ ప్రెసిడెంట్ రాజ్ మజీ ట్విటర్లో షేర్చేశారు. దీంతో ఈ వీడియో సంచలనంగా మారింది. మోడ్రన్ డ్రెస్సులు ధరించి ఉన్న యువతులు ఆ గదిలో నుంచి ఒక్కొక్కరుగా బయట వస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే సీక్రెట్ రూమ్ను రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలో బెడ్స్, ఏసీలు అన్నీ ఉన్నాయి. అంతేగాక రహస్య గదిలో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. బార్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి.. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్! Deepa Bar Andheri pic.twitter.com/dJeGm5YDbI — 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) December 13, 2021 -
బార్ కొచ్చి రచ్చ చేసిన దెయ్యం.. వీడియో వైరల్
లండన్: సాధారణంగా ఈ ప్రపంచంలో దెయ్యాలకున్న క్రేజ్ ఇక మరి వేటికి ఉండదేమో. ఈ అంశంపై లెక్కకు మిక్కిలి పరిశోధనలు కూడా జరిగాయి.. జరుగుతున్నాయి. ఇక ఇంటర్నెట్లో దెయ్యాలకు సంబంధించిన వీడియోలు కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చూడబోతే ఇదేదో తాగుబోతు దెయ్యంలా ఉంది. అందుకే బార్కు వెళ్లి రచ్చ చేసింది. ఆ వివరాలు.. యూకే, సౌత్ వ్రాక్సాల్, విల్ట్షైర్లో ఉన్న లాంగ్ ఆర్మ్స్ బార్ వారం రోజుల క్రితం తన ట్విటర్లో ఓ వీడియోని షేర్ చేసింది. వీడియోలో రికార్డయిన దాని ప్రకారం బార్లో టేబుల్కి ఇరువైపులా ఓ మహిళ, వ్యక్తి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత మహిళ అక్కడ నుంచి లేచి వెళ్తుంది. ఆ వెంటనే టేబుల్ షెల్ఫ్లో ఉన్న ఓ గ్లాస్ దానంతట అదే కింద పడుతుంది. (చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి) ఈ సంఘటనతో బార్లో ఉన్నవారు ఒక్క క్షణం భయపడతారు. మహిళ అయితే ఆ షాక్ నుంచి త్వరగా కోలుకోలేకపోయింది. టేబుల్కి అవతల పక్క ఉన్న వ్యక్తి.. అక్కడ ఏమైనా ఉందేమోనని.. చేయి పెట్టి చూస్తాడు. కానీ వారికి ఏం కనిపించదు.. కనీసం తగలదు కూడా. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ బార్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదట. (చదవండి: ఆకాశంలో నాలుగు చుక్కలు.. గ్రహాంతర వాసులులేనా!?) గత కొన్నేళ్లుగా ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అక్కడ పని చేస్తున్న సిబ్బంది తెలిపారు. తాము కిచెన్లో పని చేస్తుండగా.. సడెన్గా ఎవరో వచ్చి.. దాని డోర్ లాక్ చేస్తారని.. కూర్చీలు, టేబుల్స్ కదిల్చినట్లు శబ్దాలు వస్తాయని తెలిపారు. ఈ సంఘటనలు చూసి మొదట్లో తాము భయపడ్డామని.. రానురాను అలవాటయ్యింది అని తెలిపారు. చదవండి: పబ్లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ -
బాబోయ్ బార్.. భయపడుతున్న యజమానులు
సాక్షి, సంగారెడ్డి: బార్షాప్ల లైసెన్స్లు పొందినవారు వాటిని ప్రారంభించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కోవిడ్ మూడో వేవ్ భయం వెంటాడుతుండటం, బారులో కూర్చుని మద్యం సేవించేందుకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుండడమే దీనికి ప్రధాన కారణం. జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా భయం వెంటాడుతోంది ► సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 22 బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం మరో 12 బార్లను మంజూరు చేసింది. జనాభా ప్రాతిపధికన ఈ కొత్త బార్లకు ఎక్సైజ్శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు తీసుకుని డ్రా ద్వారా ఎంపిక చేసింది. ► డ్రాలో గెలుపొందిన వ్యాపారులు బార్ను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు మూడు నెలలు గడువుంటుంది. అయితే కోవిడ్ మూడో వేవ్పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బార్ల లైసెన్సులు పొందిన వ్యాపారులు బార్లను ప్రారంభించడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ► బార్ల ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇచ్చిన మూడు నెలల గడువుకు తోడు మద్యం వ్యాపారులు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని ఎక్సైజ్శాఖ కమిషనరేట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు నెలల అదనపు గడువు కూడా మరో పక్షం రోజుల్లో ముగుస్తుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ► జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు బార్లు కూడా ప్రారంభం కాలేదు. సంగారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం నాలుగు కొత్త బార్లకు లైసెన్స్ మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం ఒకే ఒక కొత్త బారు తెరిచింది. ► జీహెచ్ఎంసీ పరిధిలోని బార్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డ్రాలో బార్ను దక్కించుకొని ఎక్సైజ్ ట్యాక్ను కట్టిన మద్యం వ్యాపారులు కొందరు తమ బార్ను తాము నిర్వహించకుండా, ఇతరులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ► జిల్లాలో కొత్తగా సంగారెడ్డి, సదాశివపేట్ పట్టణాల్లో రెండేసి చొప్పున బార్లు మంజూరయ్యాయి. జహీరాబాద్, నారాయణఖేడ్లలో ఒక్కో బార్ మంజూరైంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అమీన్పూర్ పరిధిలో రెండు బార్లు, బొల్లారంలో నాలుగు బార్లుకు లైసెన్స్లు మంజూరు చేసింది. ► జిల్లాలో కొత్త బార్లలో ఇప్పటివరకు నాలుగు బార్లు ప్రారంభమయ్యాయని సంగారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రిదేవి “సాక్షి’తో పేర్కొన్నారు. ► మెదక్ జిల్లాలో కొత్తగా మూడు బార్లకు డ్రా తీయగా, ఇప్పటివరకు రెండు బార్లు మాత్రమే ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. రామాయంపేట్కు మంజూరైన బార్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. చదవండి: Afghanistan: ‘శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారు’ -
బీర్ బాధలు.. బార్ ఓనర్ల కష్టాలు...ఇవే కారణాలు
సాక్షి, సిటీబ్యూరో: చిల్డ్ బీర్ అంటే మద్యం ప్రియులకు అదో క్రేజ్.. చాలా మంది అలాంటి బీర్నే ఇష్టపడుతారు..అయితే ఇటీవల నగరంలో బీర్ల వినియోగం తగ్గుముఖం పట్టింది. బీర్ తాగేందుకు వెనుకంజ వేస్తున్నారు.గతంలో పెంచిన బీర్ల ధరలను కొంతమేరకు తగ్గించినప్పటికీ వినియోగం పెరగకపోవడం గమనార్హం. శీతల పానీయా లు సేవించడం వల్ల కోవిడ్ వ్యాపించవచ్చుననే భావన వల్ల చాలా మంది బీర్ తాగేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో మద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ►గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 15 లక్షల కేసుల నుంచి 13 లక్షల కేసులకు రోజువారి విక్రయాలు తగ్గినట్లు అధికారుల అంచనా. ►కేవలం ఎండాకాలంలోనే కాకుండా సాధారణ వాతావరణంలోనూ బీర్ల అమ్మకాలు అసాధారణంగానే ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. కిక్ ఇచ్చే మద్యం వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ధరలు కూడా కారణమేనా... గత సంవత్సరం లాక్డౌన్ అనంతరం బీర్లపై రూ.30 వరకు పెంచారు. సహజంగానే కోవిడ్ దృష్ట్యా బీర్కు దూరంగా ఉన్న వారు ధరల పెంపుతో మరింత దూరమయ్యారు. దీంతో ప్రభుత్వం ఒక్కో బీర్పై రూ.10 తగ్గించింది. ► రూ.210 నుంచి రూ.200 కు, రూ.170 నుంచి రూ.160 కి ధరలు తగ్గాయి. ఈ కారణంగానైనా అమ్మకాలు పెరగవచ్చునని అంచనా వేశారు. అయినా ప్రయోజనం లేదు. ► బీర్ సేల్స్ పెద్దగా పెరగలేదు.‘అమ్మకాలు తగ్గడానికి ధరలే ప్రధాన కారణం. ఒక క్వార్టర్ లిక్కర్ కంటే ఇప్పటికీ బీర్ ధరే ఎక్కువ. అందుకే బీర్ కంటే లిక్కర్ సేవించడం నయమనే భావన ఉంది.’ అని ఎక్సైజ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కేవలం రూ.10 తగ్గించడం వల్ల అమ్మకాలు పెద్దగా ప్రయోజనం లేదని అన్నారు. కరోనా భయం కూడా సేల్స్ తగ్గడానికి కారణం కావచ్చు. మూసివేత దిశగా బార్లు మరోవైపు బార్లకు చల్లదనమే శాపంగా మారింది. చల్లటి వాతావరణంలో కోవిడ్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే కారణంతో మద్యం ప్రియులు బార్లకు వెళ్లడం తగ్గించారు. క్లోజ్డ్ బార్లకు బదులు ‘ఓపెన్ బార్’ను ఎంపిక చేసుకుంటున్నారు. సరదాగా నలుగురు కలిసి బార్కు వెళ్లే అలవాటు తగ్గింది.చాలా వరకు ఇంటి వద్ద మద్యం సేవించేందుకు ఇష్టపడుతున్నారు. ► తప్పనిసరి పరిస్థితుల్లో బార్లకు వెళ్లవలసి వచ్చినా ఒక్కరిద్దరు మాత్రమే కలిసి వెళ్లడం గమనార్హం.దీంతో గ్రేటర్లో చాలా బార్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ► సుమారు 404 బార్లలో 60 శాతం వరకు నష్టాల్లో నడుస్తున్నట్లు అంచనా. ఇప్పటికే 20 బార్లను మూసివేశారు.మరికొన్ని బార్లు లైసెన్సు ఫీజు కూడా చెల్లించలేని స్థితిలో మూసి వేత దిశగా ఉన్నట్లు తీస్తున్నట్లు ఎక్స్జ్ అధికారులు వెల్లడించారు. -
Viral Video: దేవతలా యోగా ఫోజు, పట్టుతప్పి..
ఆరోగ్యం కంటే.. అవతలి వాళ్లను ఆకర్షించడానికే చాలామందికి ఇప్పుడు యోగా ఉపయోగపడుతోంది. రకరకాల ఆసనాలతో ఇంటర్నెట్ అటెన్షన్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. ముఖ్యంగా సెలబ్రిటీలైతే రకరకాల భంగిమల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్లను వాళ్లు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ఓ యువతి విచిత్రమైన ఆసనం కోసం ప్రయత్నించి బొక్కాబోర్లా పడ్డ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ప్రమాదకరంగా ఉన్న ఫీట్ను ఆ యువతి ప్రయత్నించడం విశేషం. బార్ టేబుల్పై కొంచెం ఎత్తులో రెండు మందు బాటిళ్లపై కాళ్లు పెట్టి.. చాలా కష్టతరమైన ఫోజు కోసం ఆ యువతి ప్రయత్నించింది. దేవతా మూర్తి తరహాలో ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఇంకేం బ్యాలెన్స్ ఆగక వెల్లకిల్లా పడిపోయింది. Hold my beer while I do the goddess yoga pose 🍺🧘♀️ pic.twitter.com/dfQASdfL2S — 🍺 Hold My Beer 🍺 (@HldMyBeer) June 25, 2021 అయితే ఆ యువతికి ఏం జరిగిందనేది, వీడియో ఎక్కడిది? ఎప్పటిది? అనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. హోల్డ్ మై బీర్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి వైరల్ అయిన ఈ వీడియోను షేర్ చేస్తున్న పలువురు ‘డోంట్ ట్రై దిస్’ అనే క్యాష్షన్ను ఉంచుతున్నారు. ఫొటోలు: బమ్ చిక్..బమ్ చిక్..చెయ్యిబాగా -
స్లేటర్తో ఘర్షణపై వార్నర్ క్లారిటీ
మాలె: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ స్లేటర్లో ఇటీవల మాల్దీవ్స్లోని ఓ బార్లో కొట్టుకున్నట్లు వచ్చిన వార్త హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త కు సంబంధించి ఈ ఇద్దరు ఆస్ట్రేలియన్లు వివరణ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడంతో ఆసీస్ క్రికెటర్లు, సిబ్బంది మాల్దీవ్స్కు వెళ్లిన సంగతి తెలిసిందే. వాళ్లు అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు పయనమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేము గొడవ పడలేదు.. ఇది ఇలా ఉండగా మాల్దీవ్స్లోని ఓ బార్లో వార్నర్, స్లేటర్ గొడవపడినట్లు ద డైలీ టెలిగ్రాఫ్ ఓ స్టోరీ రాసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్న తాజ్ కోరల్ రిసార్ట్లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పింది. ఈ వార్త పై స్లేటర్, వార్నర్ స్పందించారు చెప్పారు. దీనిపై మొదటగా స్పందించిన స్లేటర్ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్ రోత్ఫీల్డ్కు చేసిన మెసేజ్లో.. నేను, వార్నర్ ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. మా మధ్య గొడవ జరిగే అవకాశమే లేదు. ఇదంతా పుకారే అని స్పష్టం చేశాడు. ఆ తర్వాత వార్నర్ కూడా తన వివరణగా.. మీకు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియడం లేదు. ఇటువంటి వార్తలు రాసే ముందు బలమైన ఆధారాలు ఉంటేనే రాయాలంటూ తెలిపాడు. కాగా గత వారం ఆస్ట్రేలియా ప్రధానిపై తీవ్రంగా మండిపడిన స్లేటర్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. భారత్ నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లపై నిషేధం విధించడంపై స్లేటర్ తీవ్రంగా మండిపడ్డాడు. ( చదవండి: కేకేఆర్ జట్టులో మరో ఆటగాడికి కరోనా ) -
వెలగపూడి బార్లో కల్తీ మద్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో లిక్కర్ మాఫియా.. కల్తీ లిక్కర్ డాన్ ఎవరంటే.. అందరూ ఠక్కున చెప్పే పేరు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఏడు నెలల కిందటి వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ దన్నుతో వెలగపూడి ‘లిక్కర్’ అక్రమాల జోలికి వెళ్ళేందుకు సాహసించలేని ఎక్సైజ్ పోలీసులకు ఇప్పుడు పగ్గాలొచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా వెలగపూడి సిండికేట్లో మార్పు వస్తుందని అధికారులు ఆశించారు. అయితే సదరు మాఫియా గతంలో మాదిరిగానే అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో మెరుపు దాడులు చేశారు. మద్యం కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ద్వారకా బస్టాండ్ ఎదుట ఉన్న దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ ఎవరిదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జీవీఎస్ఎన్ సత్యనారాయణ పేరిట ఉన్న ఈ బార్ను సతీష్ అనే టీడీపీ కార్యకర్త నిర్వహిస్తుంటాడు. వీరిద్దరూ వెలగపూడి బినావీులనేది లిక్కర్ సిండికేట్కే కాదు.. ఎక్సైజ్ అధికార వర్గాలందరికీ తెలిసిన వాస్తవం. కల్తీ, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ ఈ బార్ అండ్ రెస్టారెంట్పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అయితే అధికారం దన్నుతో గత ఐదేళ్ళుగా ఎవ్వరూ దాడులు చేసే సాహసం చేయలేదు. గురువారం పక్కాగా సమాచారం రావడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎక్సైజ్ ఈఎస్, టాస్క్ఫోర్స్ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఓసీ బ్రాండ్ మద్యంలో క్రేజీ డాల్ అనే చీప్ లిక్కర్ను, ఎంసీ బ్రాందీలో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీని కలిపి కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అప్పటికే కల్తీ చేసిన 17 ఫుల్ బాటిళ్ళను సీజ్ చేశారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలగపూడి.. విషయం బయటకు పొక్కకుండా కేసును నిర్వీర్యం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం కేసు మూలాల్లోకి వెళ్తారా.. లేదా కేవలం సిబ్బందికే పరిమితం చేస్తారా అనేది చూడాలి. -
‘జేమ్స్ బాండ్స్’కు స్పైబార్
‘ఎంఐ5, ఎంఐ6’ బ్రిటన్కు చెందిన రెండు గూఢచారి సంస్థలు. ఎంఐ5, అంటే మిలటరీ ఇంటలెజెన్స్ 5. ఇది దేశ అంతర్గత ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు పరిమితం కాగా, ఎంఐ6, అంటే మిలటరీ ఇంటలిజెన్స్ 6. అంతర్జాతీయ కార్య కలాపాలకు పరిమితం అవుతుంది. వీటిల్లో గూఢచారులుగా పనిచేసే సిబ్బంది ఎవరికి తమ వృత్తి వివరాలను వెల్లడించడానికి వీల్లేదు. చివరకు భార్యకు కూడా చెప్పరాదు. ఎవరైనా ఏదో గుమాస్తా ఉద్యోగమో చేస్తున్నట్లు చెప్పుకుంటారు. ఇక అస్తమానం విదేశాలు తిరిగే ఎంఐ6 గూఢచారులకు పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. అందుకేనేమో వారిలో ఎక్కువ మంది పెళ్ళిళ్లు చేసుకోరు. ఇంటా బయట తాము పడుతున్న పాట్ల గురించి ఎంత ఆప్త మిత్రులకైనా ఏమీ చెప్పుకోవడానికి వీల్లేదు. మరి వారు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలి ? ఎలా సేదతీరాలి? ఎంఐ5 గూఢాచారుల గురించి తెలియదుగానీ ఎంఐ6 గూఢాచారుల కోసం ఓ ప్రత్యేకమైన ‘స్పై బార్’ ఉందట. ఆ బారులోకి వెళ్లాక వారు ఏమైనా తాగవచ్చు. ఏమైనా మాట్లాడుకోవచ్చు. గోడలకు ఎలాంటి చెవులుండవట. ఈ విషయాన్ని మొట్టమొదటి సారిగా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎస్ఐఎస్) చీఫ్ సర్ అలెక్స్ యంగర్ తెలియజేశారు. రెండు ఇంటెలిజెన్స్ సర్వీసులు ఎస్ఐఎస్ పరిధిలోకి వస్తాయి, ఈ స్పైబార్ ఎంఐ6 ప్రధాన కార్యాలయంలో ఉందని ‘సీ’ కోడ్ నేమ్తో వ్యవహరించే సర్ అలెక్స్ చెప్పారు. ఈ ప్రధాన కార్యాలయం పశ్చిమ లండన్లోని ‘వాక్సాహాల్ వంతెన’కు సమీపంలో ఉంది. 20 అంతస్తులుగల ఆ భవనంలో ‘స్పైబార్’ ఏ అంతస్తులో ఉందో తెలపలేదు. బ్రిటన్ ఎస్ఐఎస్ తరఫున తెరపై ‘007 జేమ్స్ బాండ్’గా కనిపించే ప్రస్తుత పాత్రధారి డేనియల్ క్రేగ్ తాగే ‘మార్టిని’ మందు ఆ స్పైబార్లో దొరుకుతుందో, లేదో కూడా చెప్పలేదు. థేమ్స్ నది ఒడ్డున ఉన్న ఈ భవనంకు సరైన భద్రత కూడా లేదని ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి. థేమ్స్ నది గుండా ఓ నౌకలో వచ్చిన రష్యా గూఢాచారులు భవనంపైకి కాల్పులు జరిగినప్పుడు ఈ విమర్శలు వచ్చాయి. భవనానికి ఎక్కువ అద్దాలు ఉండడం కూడా భద్రతకు ముప్పు. -
బార్ల ‘మందు’చూపు
బార్ల నిర్వాహకులు ‘మందు’చూపుతో వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులను మచ్చిక చేసుకుని మద్యం నిల్వలను డంప్ చేస్తున్నారు. కోరిన మద్యం అందజేస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. వైన్ షాపులకు సరుకు సరఫరా కాకుండా చూస్తూ దందా సాగిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులను మామూళ్ల మత్తులో ముంచి మందు బాబులను పిండేస్తున్నారు. సాక్షి, అనంతపురం సెంట్రల్ : మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడంతో పాటు వేళలను కూడా మార్చింది. కానీ దీన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ సర్కార్ లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. బార్ల నిర్వాహకులతో కుమ్మక్కై మందుబాబుల జేబుకు చిల్లు పెడుతోంది. బార్ నిర్వాహకులకు కాసులపంట అక్టోబర్ 1 నూతన మద్యం పాలసీ అమల్లోకి రాగా.. అప్పటి వరకూ నడుస్తున్న ప్రైవేటు మద్యం దుకాణాలు రద్దయ్యాయి. వాటిస్థానంలో ప్రభుత్వమే దుకాణాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 247 మద్యం దుకాణాలున్న చోట 20 శాతం కుదించి 197 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇలా ఏటా 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించేలా ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చింది. దశల వారీగా మద్యానికి సామాన్యులకు దూరం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే ఇది కాస్తా బార్ల యజమానులకు కలసివస్తోంది. రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉండటం.. ఎక్సైజ్ అధికారుల ప్రోత్సాహం తోడు కావడంతో బార్ల నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. సరాఫరా నుంచే.. జిల్లాకు వచ్చిన స్టాకు మొత్తం బార్ల యజమానులు తన్నుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఎక్సైజ్ అధికారుల సహకారంతో రెండు నెలల ముందు నుంచి బార్లలో రూ.కోట్లు విలువజేసే మద్యాన్ని డంప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మందుబాబులు బార్ల వద్దకే క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమ్మకాలు భారీగా పెరిగాయి. రోజుకు రూ.లక్ష జరిగే బార్లు.. నేడు రూ.10 లక్షల వరకూ కౌంటర్ జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బార్ల యజమానులతో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కు కావడంతోనే ఇది సాధ్యమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనలన్నీ తూచ్ నిబంధనల ప్రకారం బార్లలో ఫుల్బాటిళ్లు మాత్రమే విక్రయించాలి. కానీ అనంతలో క్వాటర్ బాటిల్ నుంచి లభ్యమవుతున్నాయి. ఎక్సైజ్ అధికారులే అధికారికంగా బార్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం. కొన్ని బార్లలో లూజు విక్రయాలు కూడా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎంఆర్పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఫుల్బాటిల్పై రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. బార్లలో జరుగుతున్న అక్రమాల గురించి ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ కనీస తనిఖీలు చేయడం లేదు. జిల్లాలో ఎక్కడా ఒక్క కేసూ నమోదు కాని పరిస్థితి. దీని వెనుక ఎక్సైజ్ అధికారులకు నెలనెలా మామూళ్లకు ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బార్లలో దోపిడీ ఇలా.. బ్రాండ్ పేరు వైన్షాపు ధర(క్వాటర్) బార్ ధర(క్వాటర్) మ్యాన్షన్హౌస్ 150 180–200 ఎంసీ బ్రాందీ 140 170–190 మార్ఫియస్ 250 280–300 కింగ్ఫిషర్(స్ట్రాంగ్ బీరు) 130 160–170 నాకౌట్ 130 160–180 హేవర్డ్స్ (చీప్ లిక్కర్) 120 150–160 కొరియర్ గ్రీన్ విస్కీ 230 260–290 ఐబీ విస్కీ 150 180–190 -
‘చెప్పిందే రేటు.. ఇష్టముంటే తాగు’
కొత్త మద్యం విధానం అమలు.. పర్మిట్ గదులు ఎత్తివేత.. సమయం కుదింపు.. ఎక్కడి కెళ్లి తాగాలో అర్థం కాక మందుబాబులు బార్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఇష్టారాజ్యంగా ధరలు.. కల్తీ మద్యం విక్రయంతో ఒళ్లు, జేబులు గుల్ల అవుతుండడంతో బారు పక్కకెళ్లొద్దు రో సోదరా..అని అంటున్నారు. ఇదీ జిల్లాలో బార్ల పరిస్థితి. సాక్షి, చిత్తూరు అర్బన్ : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా దశలవారీగా మద్యం దుకాణాలు తీసేయడానికి ప్రయత్నిస్తుంటే.. ఇదే అదునుగా జిల్లాలోని కొందరు మద్యం బార్ల నిర్వాహకులు ధరలపై నియంత్రణ ఎత్తేసి ‘చెప్పిందేరేటు.. ఇష్టముంటే తాగు’ అన్నట్లు భారీగా దోచుకుంటున్నారు. స్వయాన జిల్లాలో ఆబ్కారిశాఖకు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ శాఖ అధికారులకు చీమకుట్టినట్లు కూడాలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ లక్ష్యానికి ప్రమాదం మద్యం దుకాణాలను దశలవారీగా తొలగించి, ఐదేళ్లలో మద్యాన్ని కేవలం ఫైవ్స్టార్ హోటళ్లకే పరిమితం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు జిల్లాలో ఉన్న 430 మద్యం దుకాణాల సంఖ్యను 344కు కుదించారు. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని తొమ్మిది గంటలకే పరిమితం చేశారు. 21 ఏళ్ల వయస్సు పైబడ్డవారికే మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇన్ని నిబంధనలు పెడితే కచ్చితంగా ఆ ప్రభావం విక్రయాలపై చూపుతుంది. ఆదాయం రాకున్నా పర్లేదని.. మహిళలకు ఇచ్చిన మాటకోసం ఓ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇదే అదునుగా చేసుకున్న జిల్లాలోని చాలామంది బార్ల నిర్వాహకులు మద్యం అమ్మకాలను విచ్చలవిడి చేశారు. ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లకు అనుమతి ఉన్నా వీటిని పాటించడంలేదు. చిత్తూరు నగరంలోని ఓ టీడీపీ నేతకు చెందిన మద్యం బార్లో ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండాపోయింది. ధరలు ఇష్టారాజ్యమేనా? ఇక మద్యం బార్లలో ఇటీవల ధరలు విపరీతంగా పెంచేశారంటూ మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. మద్యం దుకాణాలు ఉదయం 11 గంటలకు తెరచి.. రాత్రి 8గంటలకు మూసేస్తుండటం, పైగా గతంలో మద్యం దుకాణాల వద్ద ఉన్న పర్మిట్ గదులను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం బార్ల నిర్వాహకులకు బాగా కలిసొచ్చింది. మద్యం తీసుకుని ఎక్కడికెళ్లి తాగాలో తెలియక మందుబాబులు దుకాణాల్లో మద్యాన్ని కొనడానికన్నా.. బార్లలో తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకున్న బార్ల నిర్వాహకులు మద్యంపై ధరలను ఇçష్టప్రకారం పెంచేసి, విక్రయాలు చేస్తున్నారు. ఏసీలు లేకున్నా సర్వీసుటాక్స్ వేయడం, రెస్టారెంట్, జీఎస్టీ పేరు చెప్పి రూ.వెయ్యి బిల్లుకు రూ.1300 సైతం వసూలు చేస్తున్నారు. బయట రూ.వందకు దొరికే క్వార్టర్ మద్యాన్ని, బార్లో ఏకంగా రూ.180కు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ‘మాకు ఎమ్మార్పీ ఉండదు. ఇష్టం ఉంటే తాగు, లేకుంటే వెళ్లిపోవచ్చు’ అంటూ మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. సాంపిల్స్ తీసేవాళ్లేరీ... మరోవైపు బార్లలో లూజు విక్రయాలకు అనుమతి ఉండటంతో కొన్నిచోట్ల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు విని పిస్తున్నాయి. ప్రతినెలా మూడుసార్లు బార్లలో లూజు మద్యాన్ని సేకరించి ప్రయోగశాలకు పంపాల్సిన ఆబ్కారీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలేదు. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ లక్ష్యం నీరుగారడంతో పాటు ప్రమాదం కూడా పొంచివుంది. మదనపల్లెలో బార్లు – 6 రోజువారీ వ్యాపారం – రూ.7 లక్షలు చిత్తూరులో బార్లు – 7 రోజువారీ వ్యాపారం – రూ.9 లక్షలు తిరుపతిలో బార్లు – 18 రోజువారీ వ్యాపారం – రూ.1.20 కోట్లు బార్ అండ్ క్లబ్ – 1 రోజువారీ వ్యాపారం – రూ.4 లక్షలు టూరిజం బార్లు – 2 రోజువారీ వ్యాపారం – రూ.4 లక్షలు -
అమెరికా బార్లో కాల్పులు
కాన్సస్: అమెరికాలోని కాన్సస్ పట్టణంలోని టెక్విలా కేసీ బార్లో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. పాత కక్షలతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులకు ముందు నిందితులు ఇద్దరూ బార్లోనే ఉన్నారు. అయితే నిందితులకు, లోపల ఉన్న వారికి ఏవో భేదాభిప్రాయాలు రావడంతో ఈ ఇద్దరూ బయటకు వెళ్లి, రాత్రి 1.30 గంటలకు తుపాకులతో లోపలికి వచ్చారు. అనంతరం బార్లో ఉన్న వారిపై కాల్పులు జరపడం ప్రారంభించారని పోలీస్ అధికార ప్రతినిధి థామస్ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో బార్లో 40 మంది వరకూ ఉన్నారని వెల్లడించారు. కాల్పులు ప్రారంభం కాగానే లోపల ఉన్నవారంతా వివిధ మార్గాల గుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. కాల్పుల వెనుక జాత్యహంకార విద్వేషం ఉన్నట్లు తాము భావించడం లేదని పోలీసులు తెలిపారు. -
బార్కెళ్లిన మూడేళ్ల చిన్నారి.. వీడియో వైరల్
ఓ చిన్నారి బార్కెళ్లి ప్యాకెట్ పాలు కావాలని అడిగింది. ఆశ్యర్యపోయిన బార్ సిబ్బంది చిన్నారిని బాధపెట్టడం ఇష్టం లేక ఆ పాపకు పాలు సర్వ్ చేసి తిరిగి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో, స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. మైలా అండర్సన్ అనే మూడేళ్ల చిన్నారి సెలవులు ఎంజాయ్ చేయడానికి కుటుంబంతో కలిసి క్రొయేషియాలోని డుబ్రోవింక్ వెళ్లింది. అక్కడ కుటుంబంతో కలిసి ఓ హోటల్లో దిగింది. ఈ క్రమంలో ఓ రోజు తల్లిదండ్రులు ఇద్దరు సన్బాత్ కోసం స్విమింగ్ పూల్ దగ్గరకు వెళ్లారు. అలా వెళ్లేటప్పుడు మైలా కోసం పాల ప్యాకెట్ని ఆమె బ్యాగ్లో పెట్టడం మర్చిపోయారు. తల్లిదండ్రులతో కలిసి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లిన మైలాకు కొద్ది సేపటి తర్వాత ఆకలి వేయసాగింది. తల్లి దగ్గరకు వెళ్లి తాగడానికి పాలు కావాలని అడిగింది మైలా. తల్లి పాలు తీసుకురావడం మర్చిపోయానని చెప్పడంతో మైలా వెంటనే పక్కనే ఉన్న ఓ బార్లోకి వెళ్లింది. తనకు ఓ ప్యాకెట్ పాలు కావాలని అక్కడి సిబ్బందిని అడిగింది. ఏం చెప్పాలో అర్థంకాని సిబ్బంది ఇక్కడ గ్లాస్లు మాత్రమే దొరుకుతాయని చెప్పారు. అందుకు మైలా పర్వాలేదు.. ఓ గ్లాస్ చాలు అంటూ అక్కడే ఉన్న కుర్చీ మీద కూర్చుంది. తన ఆర్డర్ కోసం ఓపికగా ఎదురు చూడసాగింది. మైలా ధైర్యానికి ఆశ్చర్యపోయిన సిబ్బంది.. ఆ చిన్నారి కోరినట్లు ఓ గ్లాస్లో పాలు తీసుకు వచ్చారు. అవి తాగి మైలా అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను మైలా తండ్రి తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. నెటిజన్లు మైలా ధైర్యానికి ఫిదా అవుతున్నారు. ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. My daughter is actually something else. We told her there was no milk in the baby bag so she got out the pool and took herself to the bar to go and ask for some and the bar staff actually served her a glass 😂😂 pic.twitter.com/AxhKZK1Soj — Ben Anderson (@IAmBenAnderson) August 26, 2019 -
బార్గా మారిన మున్సిపల్ ఆఫీస్
-
సిండి ‘కేటుగాళ్లు’!
సాక్షి, మెదక్: జిల్లాలో మద్యం వ్యాపారులది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. సిండికేటుగా మారి అధిక ధరలతో విక్రయిస్తున్నా.. బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నా.. కృత్రిమ కొరత సృష్టించి బీర్లను వైన్స్ షాపుల నుంచి బార్లకు తరలించి అమ్మకాలు చేస్తున్నా.. వారిని అడిగే నాథుడే కరువయ్యాడు. వాటన్నింటినీ నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలతోపాటు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు కుమ్మక్కయ్యారు. సిండికేట్గా మారి అధిక ధరలతో విక్రయాలు చేస్తూ మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నారు. అవినీతికి అలవాటు పడ్డ పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులకు డబ్బుల ఎర చూపి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిమాండ్ ఉన్న బీర్లకు సంబంధించి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి అక్రమంగా బార్లకు తరలిస్తున్నారు. ఇదేక్రమంలో వైన్స్ దుకాణాల్లో మార్జిన్ ఎక్కువ వచ్చే.. డిమాండ్ లేని బీర్లను మద్యం ప్రియులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా.. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు వైన్స్లలో అదనంగా వసూళ్లు జిల్లాలోని కొల్చారం మండలంలో ఉన్న చిన్నఘణపూర్లో ఒక మద్యం డిపో ఉంది. ఇక్కడి నుంచి మెదక్, సంగారెడ్డి జిల్లాలకు మద్యం సరఫరా అవుతుంది. ఈ డిపో పరిధిలోని రెండు జిల్లాల్లో మొత్తం 99 వైన్స్ దుకాణాలు, 8 బార్లు ఉన్నాయి. ఇందులో మెదక్ జిల్లాకు సంబంధించి 37 వైన్స్ షాపులు, రెండు బార్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్.. ఇలా ప్రాంతాల వారీగా మద్యం వ్యాపారులు పలువురు సిండికేట్గా మారి ఒక్కో బీరు, వైన్, బ్రాందీ, విస్కీ సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 1,200కు పైగా ఉన్న బెల్ట్షాపులతోపాటు పలు దాబాలకు కూడా అనధికారికంగా మద్యం సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో రాత్రి 9.30 గంటలకే మూత మెదక్ పట్టణంలో ఐదు వైన్స్ షాపులు.. రెండు బార్లు ఉన్నాయి. వైన్స్ షాపులు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉండాలి. నిర్వాహకులు ఇటీవల రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్యనే క్లోజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం ప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో బార్లకు వెళ్లక తప్పడం లేదు. బార్ల నిర్వాహకులు ఒక్కో బీర్కు అదనంగా రూ.30 వరకు వసూలు చేస్తుండడంతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ అవుతున్నాయి. రెండు వైన్స్, రెండు బార్ షాపులు ఒక్కరివే కావడంతో.. మెదక్ పట్టణంలోని ఓ వ్యక్తి రెండు వైన్స్ షాపులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి ఇదే ప్రాంతంలో రెండు బార్ షాపులు ఉన్నాయి. బార్ షాపుల్లో అయితే బీరుకు అదనంగా రూ.30 వరకు సమకూరుతుండడం.. స్నాక్స్ ఇతరత్రా వాటికి బిల్లు కూడా వస్తుండడంతో సదరు వ్యక్తి నిర్దేశిత సమయం కంటే వైన్స్ షాపులను గంట, అరగంట ముందే బంద్ చేస్తున్నట్లు సమాచారం. రాత్రి ముందుగానే వైన్స్ దుకాణాలను బంద్ చేస్తే.. మద్యం ప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో బార్ షాపులకు వెళ్తారని ప్లాన్ వేసిన సదరు వ్యక్తి ఇతర వైన్స్ నిర్వాహకులతో కలిసి సిండికేట్ అయినట్లు మద్యం ప్రియుల ద్వారా తెలిసింది. వైన్స్లో మార్జిన్ బీర్ల అమ్మకాలకే మొగ్గు ఎండాకాలం బీర్ల కొరత పేరిట సదరు వైన్స్ దుకాణాల నిర్వాహకుడు కొత్త ఎత్తుగడకు తెరలేపాడు. ఎక్కువ మార్జిన్ వచ్చే డిమాండ్ లేని బీర్లను మద్యం ప్రియులకు అంటగడుతున్నారు. ఇదే సమయంలో ఎక్కువ డిమాండ్ ఉన్న బీర్లను తన బార్ షాపులకు తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రి పది గంటలకు మూసివేయాల్సిన వైన్స్ షాపులను తొందరగా బంద్ చేసి.. మద్యం ప్రియులు బార్ షాపులకు వెళ్లేలా చూస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు వైన్స్లు నిర్దేశిత సమయం కంటే ముందుగానే బంద్ చేస్తున్నా.. పలు వైన్స్ దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు గానీ.. పోలీసులు గానీ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలనెలా పలువురు అధికారులు, సిబ్బందికి మామూళ్లు అందుతుండడంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకుంటాం ఎమ్మార్పీకి మించి విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో నర్సాపూర్ ప్రాంతంలో పలు షాపులపై కేసులు నమోదు చేశాం. మెదక్ టౌన్ పరిధిలో నిర్దేశిత సమయం కంటే వైన్స్లను ముందుగానే బంద్ చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బార్కు వెళ్తే జేబు గుల్ల ఇటీవల ఓ ప్రాంతానికి టూర్ వెళ్లి వచ్చాను. ఫ్రెండ్స్ పార్టీ అంటే.. వారితో కలిసి మెదక్ పట్టణంలోని వైన్స్ షాపునకు వచ్చా. రాత్రి తొమ్మిదిన్నర కూడా కాలేదు. వైన్స్ షాప్ బంద్ ఉంది. ఇంకో దుకాణానికి వెళ్లా. అదీ మూసి ఉంది. ఇలా అన్ని వైన్స్ షాపులు మూసి ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో బార్కు వెళ్లాల్సి వచ్చింది. బిల్లు చూస్తే గుండె పోటు వచ్చినట్లయింది. జేబు గుల్ల అయింది. వైన్స్లో తీసుకుంటే సగం పైసలు కూడా కావు. – సురేష్, మెదక్ -
పట్ట పగలే బార్లో గొడవ
ఉప్పల్: పట్ట పగలే ఓ బారులో కొందరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకోగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవి బాబు కథనం మేరకు వివరాల ఇలా ఉన్నాయి. చిలుకానగర్ర్లోని న్యూరామ్నగర్కు చెందిన సింగిశెట్టి శ్రీకాంత్, సింగిశెట్టి ఉదయశంకర్ సోదరులు. ఇటీవల వీరి తల్లి మృతి చెందింది. అదివారం ఇంట్లో జరుగుతున్న కార్యక్రమానికి సాయినగర్కు చెందిన తన మేనమామ మెరుగు లక్ష్మణ్ కూడా పిలిచారు. అయితే గత 15 ఏళ్లుగా వీరికి మాటలు లేవు. సోమవారం ఉదయం కార్యక్రమం ముగిసిన అనంతరం లక్ష్మణ్ తనను ఇంటికి తీసుకెళ్లేందుకు తన కుమారుడు మెరుగు సాయిప్రసాద్(28)ను అక్కడికి రప్పించారు. మధ్యాహ్నం ముగ్గురు కలిసి మద్యం తాగారు. అనంతరం శ్రీకాంత్, సాయిప్రసాద్ కలిసి చిలుకానగర్లోని బార్కు వచ్చి మద్యం తాగుతుండగా అక్కడికి వచ్చిన ఉదయ్శంకర్ కూడా వారితో కలవడంతో ముగ్గురూ కలిసి మద్యం తాగారు. అనంతరం పాత తగాదాలు ప్రస్తావనకు రావడంతో ముగ్గురి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో శ్రీకాంత్, ఉదయశంకర్ కలిసి ప్రసాద్పై దాడి చేయడమేగాక బీరు సీసాతో తలపై గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో బార్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోగా గాయపడిన సాయిప్రసాద్ను చిలుకానగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లిన శ్రీకాంత్, ఉదయశంకర్ అక్కడ ప్రథమ చికిత్స అనంతరం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించినా వినకుండా క్యాబ్లో అతడి ఇంటికి పంపారు. ఆ తర్వాత కొద్ది సేపటికే సాయిప్రసాద్ పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సాయిప్రసాద్ తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్రెజిల్లో కాల్పులు.. 11 మంది మృతి
రియో డి జనీరా : బ్రెజిల్లోని పారా రాష్ట్రంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బెలెమ్లోని ఓ బార్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్లు, బైక్లపై వచ్చిన ఏడుగురు వ్యక్తులు బార్లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఓ నిందితుడిని పట్టుకోగా.. మిగిలినవారు పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక కారణాల గురించి ఇంకా తెలియలేదని అధికారులు పేర్కొన్నారు. -
నెత్తురోడిన అమెరికా
థౌజండ్ ఓక్స్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని థౌజండ్ ఓక్స్ నగరంలో ఉన్న బార్లోకి బుధవారం ప్రవేశించిన ఓ మాజీ సైనికుడు సెమీఆటోమేటిక్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమాయకుల్ని పొట్టనపెట్టుకున్న అనంతరం సదరు దుండగుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై వెంచుర కౌంటీ షెరిఫ్ జియోఫ్ డీన్ మాట్లాడుతూ.. ‘బోర్డర్లైన్ బార్ అండ్ గ్రిల్లో ప్రతి బుధవారం కాలేజ్ కౌంటీ నైట్ పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు వందలాది మంది కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ఇంతలో ఓ వ్యక్తి రాత్రి 11.30(స్థానిక కాలమానం) గంటలకు బార్లోకి ప్రవేశించాడు. వస్తూనే నాలుగువైపులా స్మోక్ బాంబులను విసిరాడు. విద్యార్థులు, ఇతర కస్టమర్లు పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా తన సెమీఆటోమేటిక్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. ఇలా 30 రౌండ్ల పాటు కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీస్ అధికారి రాన్ హెలుస్.. లోపల చిక్కుకున్న ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపారు. ఈ ఊచకోతకు పాల్పడిన వ్యక్తిని మాజీ మెరైన్ ఇయాన్ డేవిడ్ లాంగ్(28)గా గుర్తించామని జియోఫ్ డీన్ వెల్లడించారు. 12 మందిని పొట్టనపెట్టుకున్న అనంతరం ఇయాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇయాన్పై తీవ్రమైన నేరాభియోగాలు ఏవీ లేవనీ, చిన్నచిన్న కేసులు ఉన్నాయన్నారు. యూఎస్ మెరైన్ కోర్లో 2008–13 మధ్యకాలంలో ఇయాన్ పనిచేశాడన్నారు. ఇందులో భాగంగా 2010 నవంబర్ నుంచి 2011 జూన్ వరకూ అఫ్గానిస్తాన్లో విధులు నిర్వర్తించాడని పేర్కొన్నారు. అయితే ఈ దాడి ఎందుకు చేశారన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. యుద్ధవాతావరణంలో ఉండే వ్యక్తులు ఎదుర్కొనే పోస్ట్ ట్రుమాటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్డీ)తో ఇయాన్ ఇబ్బంది పడుతున్నాడన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో అతడిని అదుపు చేయడానికి కుటుంబ సభ్యులు ఏకంగా పోలీసులను పిలవాల్సి వచ్చిందన్నారు. కాగా, ఈ దాడి సందర్భంగా పలువురు యువతీయువకులు కిటికీలు అద్దాలు పగులగొట్టి, బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారని డీన్ పేర్కొన్నారు. మరికొందరు బాత్రూముల్లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామన్నారు. రెండువారాల్లో రెండోసారి అమెరికాలో రెండు వారాల వ్యవధిలో ఇలాంటి దాడి జరగడం ఇది రెండోసారి. పిట్స్బర్గ్లోని యూదు ప్రార్థనామందిరంపై జరిగిన విద్వేషదాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. కాగా, థౌజండ్ ఓక్స్ కాల్పుల ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కార్ల్ ఎడ్గర్(24) మీడియాతో మాట్లాడుతూ..‘20 మంది స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి ఇక్కడి బోర్డర్లైన్ బార్కు వచ్చాను. అనంతరం కొద్దిసేపటికే కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రాణాలు రక్షించుకోవడానికి మేమంతా తలోదిక్కు పరిగెత్తాం. ఇప్పుడు నా స్నేహితులను ఫోన్ చేస్తే కలవడం లేదు. ఈ ఘటన అనంతరం వాళ్లంతా తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకుని ఉండొచ్చు. గతేడాది లాస్ఏంజెలిస్లో ‘రూట్ 91’ సంగీత విభావరిపై జరిగిన కాల్పుల నుంచి నేను, నా స్నేహితులు తప్పించుకోగలిగాం. దాన్నుంచే తప్పించుకోగలిగినప్పడు ఈ కాల్పుల నుంచి వాళ్లు సురక్షితంగా బయటపడి ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. లాస్ఏంజెలిస్లోని సంగీత విభావరిపై ఓ ఉన్మాది దాడిలో 57 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. -
కాల్పులతో దద్దరిల్లిన అమెరికా
కాలిఫోర్నియా : అమెరికా మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలోని తౌజండ్ ఓక్స్ బార్లోని డాన్స్హాల్లో 29 ఏళ్ల వ్యక్తి జరిపిన కాల్పుల్లో 13 మంది (ఓ పోలీస్ అధికారితో సహా) మరణించారు. ఈ ఘటనతో అమెరికాలో గన్కల్చర్ మరోసారి చర్చనీయాంశమైంది. ఆత్మరక్షణ పేరిట తుపాకుల వినియోగానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడంపై విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో తుపాకులతో జరిపిన హింసాకాండ ఘటనలు కొన్ని... ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత పాశవికంగా జరిగిన తుపాకీ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించిన ఘటనలు... ►2017 అక్టోబర్ 1న నెవడా రాష్ట్రంలో లాస్వేగాస్లోని మాండలే బే రిసార్ట్, కాసినోలో జరుగుతున్న సంగీతోత్సవ వీక్షకులపై 64 ఏళ్ల స్టీఫెన్ పాడాక్ జరిపిన కాల్పుల్లో అత్యధికంగా 58 మంది మృతి చెందారు. 500 మంది వరకు గాయపడ్డారు ►2016 జూన్ 12న ఒర్లాండోలోని పల్స్ గే నైట్క్లబ్లో 29 ఏళ్ల సాదిక్ మతీన్ జరిపిన కాల్పుల్లో 49 మంది చనిపోయారు. 50 మందికి గాయాలయ్యాయి. ►2007 ఏప్రిల్ 16న వర్జీనియాలోని వర్జీనియాటెక్ యూనివర్సిటీలో 23 ఏళ్ల విద్యార్ధి సీఉంగ్ హ్యుచో రెండుచోట్ల వరస కాల్పులకు తెగబడగా 32 మంది మరణించారు ►2012 డిసెంబర్ 14న కనెక్టికట్లోని న్యూటౌన్లో 20 ఏళ్ల అడం లాంజా జరిపిన కాల్పుల్లో 27 మంది మృత్యువాతపడ్డారు. వారిలో ఆరేడేళ్ల వయసున్న పిల్లలు 20 మంది, ఏడుగురు పెద్దవారున్నారు ►2017 నవంబర్ 5న టెక్సాస్లోని సదర్లాండ్ స్ప్రింగ్స్లోని చిన్న చర్చిలో ప్రార్థన చేస్తున్న వారిపై డెవిన్ ప్యాట్రిక్ కెల్లీ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో 25 మంది హతమయ్యారు ►1991 అక్టోబర్ 16న టెక్సాస్లోని కిలీన్లో 35 ఏళ్ల జార్జి హెన్నార్డ్ అనే వ్యక్తి తన ట్రక్తో ఓ కెఫిటేరియా గోడను ఢీకొట్టి ఆ తర్వాత తుపాకీతో 23 మందిని కాల్చి చంపాడు. 2018లో ఇప్పటివరకు కొన్ని వందల సంఖ్యలో కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా అందులో పది మంది అంతకు పైగా హతులైన ఘటనలు కొన్ని... ►తాజాగా కాలిఫోర్నియాలోని తౌజండ్ ఓక్స్లో జరిగిన ఘటనలో 13 మంది చనిపోయారు ►అక్టోబర్ 27న పెన్సిల్వేనియా లోని పిట్స్బర్గ్లో జరిగిన కాల్పుల్లో 11 మంది మృత్యువాత ►మే 18న టెక్సాస్లోని సాంతా ఫేలో జరిగిన కాల్పుల్లో 10మంది మరణం ►ఫిబ్రవరి 14న ఫ్లోరిడాలోని పొంపనో బీచ్ (పార్క్ల్యాండ్)లో తుపాకి కాల్పులకు 17 మంది మృతి గత మూడేళ్లలో... నేషనల్ సేఫిటీ కౌన్సిల్, నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్, తదితర సంస్ధల అంచనాల మేరకు ►2017లో 346 సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకోగా, 437 మంది హతమయ్యారు. 1,802 మందికి గాయాలయ్యాయి ►2016లో 383 కాల్పుల ఘటనల్లో 456 మంది మృతి చెందగా, 1,537 మంది గాయపడ్డారు ►2015లో 333 తుపాకీ కాల్పుల సంఘటనల్లో 367 మంది మరణించారు. 1,328 మంది గాయపడిన వారిలో ఉన్నారు -
కాలిఫోర్నియా పబ్లో కాల్పులు: 12 మంది మృతి
న్యూయార్క్ : అమెరికాలోని కాలిఫోర్నియా నగరానికి చెందిన థౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని ఓ బార్లో గురువారం ఉదయం ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో పోలీస్ అధికారి, గన్మెన్ సహా 12 మంది మరణించారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున పబ్లోకి చొచ్చుకువచ్చిన దుండగుడు తొలుత హ్యాండ్గన్తో పలుమార్లు కాల్పులు జరిపిన తర్వాత పొగబాంబులు విసిరి మరోసారి కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ఏబీసీ న్యూస్ ఛానెల్ వెల్లడించింది. నిందితుడు 30 సార్లు కాల్పులు జరిపాడని, బార్ నుంచి అందరూ చెల్లాచెదురైన తర్వాత సైతం తనకు కాల్పుల శబ్ధం వినిపించిందని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. కాలిఫోర్నియాలోని బోర్డర్లైన్ బార్ అండ్ గ్రిల్ అనే పబ్లో కాల్పులు జరిగాయని స్ధానిక సమాచార వెబ్సైట్ వెంచురా కంట్రీ స్టార్ పేర్కొంది. కాగా దుండగుడి కాల్పుల ఘటనపై స్ధానిక అగ్నిమాపక విభాగం ట్వీట్ చేసింది. ఘటనా ప్రదేశానికి ప్రజలు దూరంగా ఉండాలని, పలువురికి తీవ్రగాయాలయ్యాయని, పెద్దసంఖ్యలో అంబులెన్స్లు అవసరమని పేర్కొంది. కాల్పుల కలకలం చోటుచేసుకున్న సమయంలో బోర్డర్లైన్ బార్లో పెద్దసంఖ్యలో యువకులున్నారని, ఘటన నేపథ్యంలో ఒకరిని ఒకరు గుర్తించిన అనంతరం హగ్ చేసుకుంటూ కనిపించిన వీడియోను వెంచురా కంట్రీ స్టార్ రిపోర్టర్ పోస్ట్ చేశారు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. కాగా, అమెరికాలో స్కూళ్లు, పబ్లు, రెస్టారెంట్లు సహా బహిరంగ ప్రదేశాల్లో దుండగులు కాల్పులతో విరుచుకుపడుతున్న ఘటనలు పలుమార్లు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. -
బార్లో గాంధీ వాల్పెయింటింగ్.. ఆగ్రహం!
దుబాయ్ : భారత జాతిపిత మహాత్మా గాంధీకి దుబాయ్లో తీవ్ర అవమానం జరిగింది. గాంధీ ఫోటోను పోలివుండే పెయింటింగ్ను బార్ యాజమాన్యం మద్యంసేవించే ప్రాంతంలో వేసింది. దీనిపై భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. గాంధీ పెయింటింగ్ కలిగి ఉన్న ఫోటోను యాజమాన్యం ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో ఈ విషయం భారతీయుల దృష్టికి వచ్చింది. ఆ ఫోటోలో మహిళలు, పురుషులు మద్యం సేవిస్తూ వెనుక గాంధీ పెయింటింగ్ కనిపిస్తూ ఉంటుంది. దీనిని దుబాయ్లోని భారత ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లగా బార్ యాజమాన్యంపై న్యాయ బద్దంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సెప్టెంబర్ 28న దుబాయ్లోని అల్ మన్ఖుల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటనపై దుబాయ్లోని భారత న్యాయవాది అంజనా భాటియా మాట్లాడుతూ.. భారతీయూల మనోభావాలు దెబ్బతినేలా జాతిపిత గాంధీ పెయింటింగ్ను బార్లో వేశారని, పెయింటింగ్ ముందు మహిళలు అసభ్యకరంగా మద్యం తాగుతూ డ్యాన్స్ చేస్తున్నారని విమర్శించారు. భారత్లో ఇలాంటి చర్యలు శిక్షించ తగ్గ నేరంగా భావిస్తారని.. యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకునేలా పోరాడతామన్నారు. భారతీయుల ఎక్కువగా ఉపాధి పొందే దుబాయ్లో గాంధీని ఇలా అవమానించడం తమకు ఎంతో నిరశ కలిగిందని న్యాయవాది అన్నారు. -
కిక్కురు చాలెంజ్!
అనగనగా ఒక దిబ్బరాజ్యం. ఆ రాజ్యానికి ప్రభువు డబ్బరాజు. ఆ రాజ్యంలో రోడ్లు లేవు. బార్లు ఉన్నాయి. ఆ రాజ్యంలో బస్సులు లేవు. బార్లు ఉన్నాయి. ఆ రాజ్యంలో ఉద్యోగాలు లేవు. బార్లు ఉన్నాయి.ఆ రాజ్యంలో సంతోషాలు లేవు బార్లు ఉన్నాయి. సౌకర్యాలు లేవు....బార్లు ఉన్నాయి!‘యథారాజా తథాప్రజా’ అంటారు మాటవరుసకి.కానీ ఇక్కడ అది అక్షరాల నిజం. దిబ్బరాజ్యం రాజు డబ్బరాజు గజతాగుబోతు. ఆయన బాటలోనే ప్రజలు మత్తుగా నడుస్తున్నారు. తూలుతూ నడుస్తున్నారు. అకారణంగా ఎవరినో తిడుతూ నడుస్తున్నారు.రోజు రోజుకూ తాగుబోతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోవడంతో రాజ్యంలో వాంతిభద్రతల సమస్యతో పాటు శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తింది.అలాంటిలోజుల్లో ఒకరోజు మహామంత్రి మల్లయ్య రాజుగారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చి సీరియస్గా ఇలా అన్నాడు...‘‘అయ్యా! మీకు మందుచూపు తప్పా... ముందుచూపు బొత్తిగా లోపించింది. ఇలా అయితే మన దిబ్బరాజ్యంలో రాజ్యం మిగలదు. దిబ్బ మాత్రమే మిగులుతుంది. సోషల్మీడియా రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో మనకేమవుతుందిలే అనుకుంటే మన్ను మాత్రమే మిగులుతుంది. ఆ తరువాత తమ ఇష్టం’’‘‘ఇప్పుడేం చేయమంటారు?’’ ఆరో పెగ్గు అవలీలగా గుటుక్కుమనిపించి అడిగాడు రాజు.‘‘మీరు మందు మానేయండి... ప్రజలు కూడా మానేస్తారు’’ టీవీ యాంకర్లా వంకర్లు తిరుగుతూ సలహా ఇచ్చాడు మంత్రి.‘‘ఓస్... అంతేనా. ఇదే నా ఆన. ఈ ఫుల్బాటిల్ కంప్లీట్ చేసి.... ఇక ఈ జన్మలో మందు ముట్టను’’ అని భీషణ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా...‘‘ఈరోజు నుంచే రాజ్యంలో మందును నిషేధిస్తున్నాను’’ అని గట్టిగా అరిచాడు.‘‘నిషేధం విధించడం కంటే ప్రజలే స్వచ్ఛందంగా మందు మానేసేలా చేస్తే మంచిది మహారాజా’’ అన్నాడు మంత్రి.‘‘అలాగే’’ అంటూ చివరి పెగ్గు పూర్తి చేశాడు రాజు. ‘మందు మానేసిన వారికి లక్షరూపాయల క్యాష్ అవార్డ్’ ప్రకటించింది ప్రభుత్వం.కనీసం ముగ్గురు కూడా మానలేదు.‘మందు మానేసిన వారికి అయిదు ఎకరాల పొలం’ ప్రకటించింది ప్రభుత్వం.కనీసం ఇద్దరు కూడా మానలేదు.చివరిగా...‘మందుమానేసిన వారికి పది ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం, అంబాసిడర్ కారు, ఫ్రిజ్జు, ఒనిడా కలర్టీవీ....’ ఒకటా రెండా...ఇలా ఎన్నో ప్రకటించింది ప్రభుత్వం.అయినా సరే....కనీసం ఒక్కరు కూడా మానలేదు!రాజుగారు జుట్టు పీక్కుందామని ట్రై చేశారుగానీ... తనది బట్టతల అని గుర్తుకొచ్చి నిరాశగా సైలెంటైపోయారు. రాజుగారికి ఏంచేయాలో పాలు పోవడం లేదు.సరే. పాలు తాగి ఆలోచిద్దాం అనుకున్నాడు.వేడి వేడి పాలుతాగుతున్న రాజుగారి దగ్గరికి కూల్గా నడిచి వచ్చాడు మంత్రి.‘‘మంత్రివర్యా! ఒక్కడు కూడా రాజ్యంలో మందుమానలేదయ్య...ఏంచేయాలో పాలు పోక ఇలా పాలు తాగున్నాను. నువ్వు కూడా తాగుతావా? పంచదార వేయమంటావా వద్దా?’’ అడుగుతున్నాడు రాజు.‘‘పాలు–పంచదార–తొక్క–తోటకూర...ఇది కాదు మహారాజా ఈ టైమ్లో మనం ఆలోచించాల్సింది. మన రాజ్యంలో ఇకముందు ఒక్కడు కూడా మందు తాగవద్దు. మందు అనే మాట వినబడగానే ముందు వెనక చూడకుండా పరుగెత్తాలి...దీనికి బ్రహ్మాండమైన ఐడియా ఆలోచించాను’’ ఉత్సాహంగా చెప్పాడు మంత్రి.‘ఏమిటా ఐడియా?’’ మరింత ఉత్సాహంగా అడిగాడు రాజు.రాజుగారి చెవిలో ఏదో చెప్పాడు మంత్రి.రాజుగారి ముఖం మున్సిపాలిటీ వారి స్ట్రీటులైటులా వెలిగిపోయింది!రెండు నెలలు తిరక్కుండానే మంత్రిగారు అన్నంత పనీ అయింది. రాజ్యంలో అందరూ మద్యం మానేశారు! ‘‘రాజా! ఇప్పుడు చెప్పు...ఏ ఐడియా ద్వారా మంత్రిగారు మందుబాబులు మందు అంటేనే జడుసుకునేలా చేశారు?’’ విక్రమార్కుడిని అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఏమన్నాడంటే...‘‘భేతాళా! టైమ్లీ ఐడియా అని కొన్ని ఐడియాలు ఉంటాయి. ప్రతి కాలంలోనూ ఒక వేవ్లాంటిది, ట్రెండ్లాంటిది, పిచ్చిలాంటిది ఒకటి వస్తుంది. ఆ సమయంలోనే ఆ పిచ్చిలాంటి ట్రెండ్లోకి జంపైపోయి ఒక ఐడియా ప్లాన్ చేస్తే తిరిగే ఉండదు’’‘‘విక్రమార్కా! నువ్వు ఏంచెబుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు’’ అయోమయంగా అన్నాడు భేతాళుడు.‘‘ఇప్పుడు అందరినీ కిక్ ఎక్కిస్తున్నది ఏమిటి?’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘కికి’’ అన్నాడు భేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు...‘‘ఒక కికి చాలెంజ్ అనే ఏమిటి! ప్లాంకింగ్ చాలెంజ్, చోకింగ్ చాలెంజ్, ఫైర్ చాలేంజ్, కట్టింగ్ చాలెంజ్...ఒక్కటా రెండా! ఇలా ఎన్నో చాలేంజ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిబ్బరాజ్యం ‘కిక్కురు’ అనే చాలెంజిని విసిరింది. మందులో కాస్త నీళ్లు పోసుకొని ఎవరైనా తాగుతారు. కానీ అయిదు లీటర్ల నీళ్లలో అర క్వార్టరు మందుతో పాటు, చింతపండు పులుసు, కాస్త ఆముదం కలుపుకొని తాగాలి. ఇదే ‘కిక్కురు చాలెంజి’. ఊహించినట్లుగానే మందుబాబుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కిక్కురు చాలెంజిని స్వీకరించని వారిని లెక్కలోకి తీసుకోని పరిస్థితి వచ్చింది. వేలంవెర్రి మొదలైంది. ఎంతో వాటర్+ కొంతమందు+ చింతపండు పులుసు+ కొంత ఆముదం= విరేచనాలు. ఈ ఫార్ములా ప్రకారం రాజ్యంలో ఎటుచూసినా విరేచనాలే. ఈ దెబ్బతో మందుబాబులకు మందు మీద విరక్తి పుట్టడమే కాదు ఒకలాంటి భయం ఏర్పడింది. అలా కేవలం మూడు నెలలలో కాలంలోనే మందుబాబులంతా కిక్కురుమనకుండా మందు మానేశారు. కిక్కురు చాలెంజా మజాకా!’’ – యాకుబ్ పాషా -
ఎస్సూజ్ మీ.. ఈ బార్కు మందెక్కువైందా మాస్టారూ..
మందుబాబులూ.. ఒక్క పెగ్గుకే మీకు కిక్కెక్కాలా.. అయితే.. బ్రిటన్లోని డడ్లీలో ఉన్న క్రూక్డ్ హౌస్ బార్కు వెళ్లండి.. ఎందుకంటే.. అక్కడ ఒక్క పెగ్గుకే.. నిజంగా చెప్పాలంటే.. ఏమీ తాగకున్నా.. మీరు తూలుతారు.. ఎందుకంటే.. ఈ బారే కాస్త మందేసి.. తూలుతున్నట్లు ఉంటుంది మరి.. నమ్మడం లేదా.. ఓసారి ఫొటోను చూడండి.. కుడివైపుతో పోలిస్తే.. ఎడమ వైపు వంగినట్లు కనిపించడం లేదూ.. కుడివైపుతో పోలిస్తే.. ఎడమవైపు 4 అడుగులు కిందకు ఉంటుంది. దీని వల్ల ఈ బార్లోకి వెళ్లినవారు నడుస్తున్నప్పుడు చిన్నపాటి భ్రాంతికి లోనవుతారు. 1765లో ఈ భవంతిని నిర్మించారు. 1830లో ఇది బార్గా మారింది. ఇంతకీ ఇలా తూలడానికి కారణమేంటని అడిగితే.. స్థానికంగా జరిగిన మైనింగేనని అక్కడివారు చెబు తారు. దీని వల్ల అది ఓవైపు భూమిలోకి ఒరిగినట్లు అయిందట. స్థానిక అధికారులు వెంటనే స్పందించి.. తగు చర్యలు తీసుకోవడంతో పూర్తిగా ఒరిగిపోకుండా ఇలా మిగిలిపోయింది. అయితే.. ఇలా వాలిపోవడమే దానికి క్రేజ్ను తెచ్చిపెట్టింది. తాగకుండానే తూలిపోయే అనుభూతిని పొందడానికి వివిధ దేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు. -
బార్ ముసుగు తొలగించారు
భవానీపురం(విజయవాడ పశ్చిమం): విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ పక్కనే ఉన్న రాగమయి బార్ అండ్ రెస్టారెంట్ ముసుగు తొలగించారు. క్యాంటీన్ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వస్తున్నారని అధికారులు ఆ బార్ కనబడకుండా ముసుగు వేయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు క్యాంటీన్ ప్రారంభించి సుమారు ఒంటి గంట సమయంలో వెళ్లిపోవడంతో బార్ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి ముసుగు తొలగించి యథాతథంగా వ్యాపారం చేసుకున్నారు. ఈ తంతు చూసిన స్ధానికులు ముక్కున వేలేసుకున్నారు. అయినా తమకు ఆదాయ వనరుగా ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న టీడీపీ ప్రభుత్వం బార్లను ఎందుకు మూయిస్తుందని గుసగుసలాడుకున్నారు. కాకపోతే క్యాంటీన్ పక్కనే బార్ ఏమిటని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని అధికారులు ముందు జాగ్రత్తగా మసిపూసి మారేడుకాయ చేశారన్న విమర్శలు వినవచ్చాయి. గతంలో జక్కంపూడిలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులే బార్ యాజమాన్యాన్ని హెచ్చరించటంతో ఒక పూట వ్యాపారం పోతేపోయిందని భావించిన బార్ యాజమాన్యం కూడా ముసుగు వేసేసింది. -
మందుబాబులకు భలే మంచి చౌకబేరం!
ప్రజావసరాలను అనుగుణంగా పాలకులు పాలన చేయాలి. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. పేదలు నివసించే ప్రాంతాల్లో తక్కువ ధరకే భోజనం అందించేందుకు ప్రభుత్వం రూపొందించిన అన్నక్యాంటీన్లను పేదలు లేని ప్రాంతాల్లో ఏర్పాటుచేసి పథక లక్ష్యాలను విస్మరిస్తున్నారు. భవానీపురం ఆర్టీసీ వర్క్షాపు రోడ్డులో ఓ బార్ పక్కన ఏర్పాటుచేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. భవానీపురం: ‘భలే మాంచి చౌక బేరం..మించినన్ దొరకదూ...’ మందుబాబులారా త్వరపడండి అన్నటుగా ఉంది త్వరలో ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ను చూస్తుంటే. బార్లో తాగి హోటల్కెళ్లి తినాలంటే చాలా ఎక్కువైపోతుంది. ఎంచక్కా బార్ పక్కనే అన్న ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటుచేస్తున్న క్యాంటీన్కు వెళ్లి ఐదు రూపాయలకే శుభ్రంగా లాగించేయవచ్చు. మందు ఎక్కువై అడుగులు తడబడి అన్న క్యాంటీన్ ముందున్న అవుట్ఫాల్ డ్రెయిన్లో పడిపోతామన్న భయం లేదు. డ్రెయిన్పై బారున చప్టా కట్టేశారు. మందు ఎక్కువైతే దానిపైనే ఓ కునుకు తీయవచ్చు. ఇదీ గట్టు వెనుక ప్రాంతం విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో ప్రారంభానికి సిద్ధం అవుతున్న అన్న క్యాంటీన్పై స్ధానికులు వేస్తున్న చలోక్తులు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల తరహాలో ఆంధ్రప్రదేశ్లోకూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు నామమాత్రపు ధరకు టిఫిన్, భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉద్దేశ్యం మంచిదే అయినా క్యాంటీన్ ఏర్పాటుకు గట్టు వెనుక ప్రాంతంలో ఎన్నుకున్న ప్రదేశాలపైనే విమర్శలు వస్తున్నాయి. ఐరన్ యార్డ్, హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాలలో అయితే అక్కడి ముఠా కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి సరుకు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులు, చిరువ్యాపారులకు సదుపాయంగా ఉంటుంది. గొల్లపూడి బైపాస్ రహదారిపై అయితే ఆ మార్గంలో ప్రయాణించేవారికి హోటల్స్ లేవు కాబట్టి వారికి సదుపాయంగా ఉంటుంది. అంతేగానీ ఖాళీగా స్థలాలు ఉన్నాయి కదా అని ఉపయోగం లేని ప్రదేశాలలో ఏర్పాటు చేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో పోలీస్ కాలనీ లేఅవుట్లో కామన్ సైట్ (కాలనీవాసుల ప్రయోజనార్థం)గా వదిలిన ప్రదేశంలో క్యాంటీన్ ఏర్పాటుపై తొలుత కాలనీవాసులు అభ్యంతారాలు వ్యక్తం చేశారు. ఓపెన్ సైట్లపై తమకు అధికారం ఉందని నగరపాలక సంస్థ అధికారులు వారి అభ్యంతరాలను పక్కన పెట్టి యుద్ధప్రాతిపదికన క్యాంటీన్ నిర్మిస్తున్నారు. పైగా ఒక బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే నిర్మించడంపై బార్లో పూటుగా తాగి పక్కనే ఉన్న క్యాంటీన్లో ఏదో ఒకటి తినేయవచ్చని స్థానికులు జోకులు వేసుకుంటున్నారు. రెస్టారెంట్లో తినేందుకు అయ్యే ఖర్చుతో అదనంగా మరికొంత మద్యం సేవించి క్యాంటీన్లో తక్కువ ఖర్చుతో భోజనం చేయవచ్చని మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆర్టీసీ వర్క్షాప్, టైర్షాప్, డిపోలు ఉన్నప్పటికీ వారికి లోపల క్యాంటీన్లు ఉండటంతో వారు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. నివాసాలు, గోడౌన్లు, దుకాణాలు ఉన్న ఈ రోడ్డులో వారెవరూ అన్న క్యాంటీన్కు వచ్చే అవకాశం లేదు. భవానీపురం హౌసింగ్బోర్డు కాలనీలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ పక్కన మరొక క్యాంటీన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడికికూడా ప్రజలు వచ్చే అవకాశం లేదు. లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన నిర్మాణాన్ని ప్రభుత్వం ఎల్ అండ్ టి సంస్థకు అప్పగించింది. అయితే క్యాంటీన్ చుట్టూ ప్రహరి, క్యాంటీన్ ముందున్న అవుట్ఫాల్ డ్రెయిన్పై శ్లాబ్తో ఫుట్పాత్ నిర్మాణాన్ని నగరపాలక సంస్థకు అప్పగించింది. భారీ అవుట్ఫాల్ డ్రెయిన్పై దాదాపు వంద మీటర్లకుపైగా శ్లాబ్ వేసి ఫుట్పాత్గా తయారుచేశారు. దీనిని లక్షలాది రూపాయల ప్రజాధనంతో ఏర్పాటు చేయడమేమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో అభివృద్ధి పనులు చేయమంటే కార్పొరేషన్ అప్పుల్లో ఉందని మొత్తుకునే మేయర్ కోనేరు శ్రీధర్, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇవి కనిపించవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
బీరు గ్లాసు తెచ్చిన తంటా!
బెల్జియంలోని బ్రూగ్స్లో ఓ బీర్వాల్ అని చాలా ఫేమస్ బార్ ఉంది. అక్కడ రోజుకు దాదాపు 1600 గ్లాసుల బీరు అమ్ముడు పోతుందట. అంత ఫేమస్ అది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది బీరు గురించి కాదు. ఆ బీరు పోసిచ్చే గ్లాసుల గురించి..! ఎందుకంటే ఆ షాప్ వాళ్లే ప్రత్యేకంగా తయారు చేయించుకున్న గ్లాసుల్లో వారు బీరు సర్వ్ చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడే ఆ షాప్ యాజమాన్యానికి ఓ చిక్కు వచ్చి పడింది. ఆ ప్రత్యేకమైన గ్లాసులే వారికి తల నొప్పిగా మారాయి. ఎందుకంటే అవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని అక్కడికొచ్చిన కస్టమర్లు వాటిని ఇంటికి తీసుకెళ్తున్నారట. బార్ గోడలపై గ్లాసులను దయచేసి తీసుకెళ్లకండి అని పెద్ద పెద్ద అక్షరాలతో నాలుగు భాషల్లో చేసిన విజ్ఞప్తులను కూడా పట్టించుకోకుండా వాటిని దొంగిలిస్తున్నారట. ఇక చేసేదేం లేక బారు ఎంట్రన్స్లలో గ్లాస్ స్కానర్లను పెట్టి మరీ వారి గ్లాసులను కాపాడుకోవాల్సి వస్తోందట. బార్లోపలికి వచ్చి వెళ్లే వారందరినీ స్కాన్ చేసి గ్లాసులుంటే వారికి సున్నితంగా చెప్పి వారి గ్లాసులు వారు తీసుకుంటున్నారట. -
బెంగళూరులో అగ్ని ప్రమాదం : ఐదుగురు సజీవదహనం
-
ముంబైని వణికిస్తున్న అగ్ని ప్రమాదాలు
సాక్షి,ముంబై: దేశ వాణిజ్య రాజధాని నగరం ముంబై సోమవారం ఉదయం మరో అగ్నిప్రమాదంతో ఉలిక్కి పడింది. ముంబై సెషన్స్ కోర్టులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఆందోళనకు గురిచేసింది. కోర్టు భవనంలోని మూడో అంతస్థులో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దీనికిగల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం అధికారి చెప్పారు. సౌత్ ముంబై యూనివర్సిటీ ప్రాంగణానికి సమీపంలోని కోర్టు భవనంలో నేటి ఉదయం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అగ్ని మాపక విభాగానికి సమాచారం అందించారు. దాదాపు అయిదు ఫైర్ ఇంజీన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తూ తాజా సమాచారం ప్రకారం ఇంకా కోర్టు కార్య కలాపాలు ప్రారంభం కాకపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా గత 20 రోజుల్లో నగరంలో ఇది ఐదో అగ్ని ప్రమాదం. డిసెంబర్ 18 న ముంబైలోని సకి నాకా-కుర్లా ప్రాంతంలో ఒక చిరుతిండి దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పన్నెండు మంది మృతి చెందారు. డిసెంబరు 29 న కమలా మిల్స్ ఆవరణలో ప్లబ్ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. జనవరి 4 న జరిగిన మరొక సంఘటనలో, ఇద్దరు పిల్లలు సహా నలుగురు వ్యక్తులు మరణించగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనవరి 6న సినీ విస్తా స్టూడియో ప్రమాదంలో టెలివిజన్ సీరియల్ ప్రొడక్షన్ యూనిట్కు చెందిన ఓ వ్యక్తి(20) చనిపోయాడు. -
బార్ లో అగ్ని ప్రమాదం : ఐదుగురు సజీవ దహనం
బెంగళూరు(కర్ణాటక) : ఓ బార్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ లోని కైలాష్ బార్ లో సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. -
వేధింపులతో బార్ నిర్వాహకుడు ఆత్మహత్య
-
అదృష్టం ‘బారులా’ తెరుచుకుంది!
– ఆళ్లగడ్డ బార్కు అత్యధికంగా 22 మంది పోటీ – డోన్కు ఒక్కరే దరఖాస్తు – ఎమ్మిగనూరులో రెండు షాపులకు ఒక్క దరఖాస్తు రాని వైనం కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బార్ లైసెన్స్ల ఎంపిక కోసం శుక్రవారం సునయన ఆడిటోరియంలో జాయింట్ కలెక్టర్–2 రామస్వామి, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ సీ.శ్రీరాములు ఆధ్వర్యంలో లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 11 బార్ లైసెన్స్ల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా ఎనిమిదింటికి లక్కీ డిప్ ద్వారా లైసెన్స్లను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలోని ఆదోనిలో మూడు, ఎమ్మిగనూరులో మూడు, గూడూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు మునిసిపాలిటీల్లో నూతనంగా ఒక్కో బార్ ఏర్పాటు కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 11 బార్లకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించగా 9 బార్లకు మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయి. - ఎమ్మిగనూరులో మొత్తం మూడు బార్లకు అనుమతి రాగా, కేవలం ఒక్కదానికే మాత్రమే మూడు దరఖాస్తులు రాగా వాల్మీకి శంకరయ్యను అదృష్టం వరిచింది. మిగిలిన రెండింటికి ఒక్క దరఖాస్తు రాలేదు. - అత్యధికంగా ఆళ్లగడ్డలో ఏర్పాటు కానున్న బార్కు 22 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ లక్కీడిప్లో పి.తుకారం అనే వ్యక్తిని లక్కు వరించింది. - నందికొట్కూరులో 16 మందిలో ఒంకారేశ్వరెడ్డికి దక్కింది. - ఆదోని మూడింటిలో మొదటి దానికి కే.రామన్న, రెండో దానికి కేపీరాజు, మూడోదానికి రాంపుల్లయ్యకు లక్కు కలసి వచ్చింది. - ఆత్మకూరులో ఏడుగురులో విజయరవీంద్ర నాయక్, డోన్లో ఏకైక దరఖాస్తు దారుడు బీ.శ్రీనివాసులుగౌడ్ను ఎంపిక చేసినట్లు జేసీ–2 రామస్వామి ప్రకటించారు. మహిళలను వరించని విజయం.. బార్ లైసెన్స్లను దక్కించుకునేందుకు ముగ్గురు మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఆత్మకూరులో వీ.హరిత, ఆళ్లగడ్డలో వెంకటలక్ష్మీ, నందికొట్కూరు నుంచి మానస అనే మహిళలు లక్కీడిప్లో పాల్గొన్నారు. అయితే ముగ్గురిలో ఒకరిని కూడా లక్కు వరించలేదు. మరోవైపు బార్లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా యువకులు ఉండడం గమనార్హం. దరఖాస్తులతోనే 1.42 లక్షల ఆదాయం... బార్ లైసెన్స్ల దరఖాస్తుల ఫీజు ప్రభుత్వానికి రూ. 1.42 లక్షల ఆదాయాన్ని సమకూర్చింది. మొత్తం 71 దరఖాస్తుల నుంచి ఒక్కో దానికి రూ. రెండు లక్షల ప్రకారం చలానాలను స్వీకరించారు. లక్కీ డిప్ ద్వారా ఎంపికైనా, ఎంపిక కాకపోయినా దరఖాస్తు కోసం చెల్లించిన రూ.2లక్షలను వెనక్కి ఇవ్వరు. డోన్లో చక్రం తిప్పిన డిప్యూటీ సీఎం అనుచరులు డోన్లో డిప్యూటీ సీఎం అనుచరులు చక్రం తిప్పడంతో బార్ లైసెన్స్ కోసం కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్నా బి.శ్రీనివాసులు గౌడ్కు అధికారులు లైసెన్స్ను మంజూరు చేశారు. – వివాదాస్పదమైన గూడూరు బార్ ఎంపిక బార్ లైసెన్స్లను దక్కించుకునేందుకు టీడీపీ నేతలు పోటీ పడ్డారు. గూడూరు బార్ లైసెన్స్ను దక్కించుకునేందుకు కోడుమూరు నియోజకవర్గ ఇన్చారీ విష్ణువర్దన్రెడ్డి, ఎమ్మెల్యే మణిగాంధీ ఎత్తుకు పైఎత్తులు వేశారు. ఇక్కడ బార్ ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించగా మొత్తం నలుగురు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దరఖాస్తుకు లోకల్ బాడీ అథారిటీ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ను జత చేయకపోవడంతో మణిగాంధీ అనుచరుల దరఖాస్తులన్నీ రిజెక్ట్ అయ్యాయి. విష్ణువర్దన్రెడ్డి అనుచరుడు కరుణాకర్కు మాత్రం నగర కమిషనర్ ట్రేడ్ లైసెన్స్ను జారీ చేయడంతో ఆయన దరఖాస్తును అధికారులు ఒకే చేశారు. అయితే కమిషనర్ తమ వాళ్లకు ట్రేడ్ లైసెన్స్లను జారీ చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి గూడూరులో ఏర్పాటు చేయనున్న బార్ లైసెన్స్ లక్కీడిప్ విజేత ఎంపిక వాయిదా వేయించారు. అయితే ఈ విషయంపై కోర్టుకు వెళ్తానని కరుణాకర్ ప్రకటించారు. డోన్లో ఒక దరఖాస్తు వచ్చినా లైసెన్స్ ఇచ్చారని, గూడూరులో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. -
బస్సు గుద్దేసినా దులిపేసుకొని బార్లోకెళ్లాడు
లండన్: సహజంగా ఏదైనా వాహనం దగ్గర నుంచి వేగంగా దూసుకెళితేనా మనకు చెమటలు పట్టేస్తాయి. అమ్మో ఎంత ప్రమాదం తప్పింది అని మనసులో అనుకోవడమే కాకుండా ఆ విషయాన్ని ఇంట్లో వారితో సహా ఓ నలుగురితో పంచుకుంటాం. అలాంటిది ఏకంగా బస్సు ఢీకొడితే.. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడినా ఆ షాక్లో నుంచి అంత తేలికగా బయటకు రాగాలమా.. కానీ, బ్రిటన్లో ఓ వ్యక్తి మాత్రం ప్రమాదం జరిగింది బాబోయ్ అని చూసిన వాళ్లు అనుకుంటుండగానే తాఫీగా దులిపేసుకొని ఏం చక్కా బార్ షాపులోకి నడుచుకుంటూ వెళ్లి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో రికార్డయిన ప్రకారం బ్రిటన్లో గత శనివారం కంట్రోల్ తప్పిన ఓ బస్సు రోడ్డు దాటి వస్తున్న ఓ వ్యక్తిని అదుపు తప్పి అమాంతం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కాస్త ఫుట్బాల్లో గాల్లో ఎగిరి పాదచారుల మార్గంపై పడ్డాడు. బస్సు ధ్వంసం కూడా అయింది. అది చూసిన వారంతా ఓమై గాడ్ అని అతడి వద్దకు పరుగులు తీస్తుండగా అతడే స్వయంగా లేచి ఏదో జారి కిందపడిన వ్యక్తి మాదిరిగా దులిపేసుకొని అందరిమాదిరిగానే అక్కడే ఉన్న బార్ షాపులోకి వెళ్లి ఫుల్లుగా మందేశాడు. ఈ వీడియో కూడా బార్ షాపు సీసీటీవీ కెమెరాలోనే రికార్డయింది. -
మద్యం తాగి.. నకిలీ నోటిచ్చి దొరికాడు
షాద్నగర్ క్రైం: పూటుగా మద్యం తాగారు.. రాత్రి సమయం కావడంతో బార్ నిర్వాహకుడ్ని బిల్లు విషయంలో బోల్తా కొట్టించాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా తమ వద్ద ఉన్న పిల్లలు ఆడుకునే నోట్లను బిల్లు కట్టేందుకు ఇచ్చి అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన షాద్నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని జైభవాని బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించేందుకు సోలీపూర్ తండాకు చెందిన పొర్ర శంకర్ తన మిత్రుడైన కొత్తూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన తోట యాదగిరితో కలిసి వచ్చాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు పూటుగా మద్యం సేవించారు. రాత్రి సమయం కావడంతో నకిలీ నోట్లు ఇచ్చి బయట పడదామని నిర్ణయించుకుని పిల్లలు ఆడుకునే నకిలీ రూ. 2వేల నోట్లను రెండింటిని నిర్వాహకుడికి ఇచ్చారు. అనుమానం వచ్చిన బార్ నిర్వాహకుడు పరిశీలించి చూడగా నకిలీ నోట్లని తేలడంతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. తోట యాదగిరి అక్కడి నుండి పారిపోవడంతో పొర్ర శంకర్ను పట్టుకుని బార్ నిర్వాహకులు పోలీసులకు అప్పజెప్పారు. బార్ నిర్వాహకుడు అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ శ్రీనివాస చారి తెలిపారు. -
బార్ ఓనర్ అతి తెలివి...
ఓ బార్ ఓనర్ అతి తెలివి ప్రదర్శించాడు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా పాటించాడు. ఓ ఐడియాతో తన వైన్ షాప్ మూత పడకుండా కాపాడుకున్నాడు. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులకు 300 మీటర్ల దూరంలోపు వైన్ షాప్లు ఉండాలి అన్న నిబంధను పాటించాడు. కేరళలోని ఎర్నాకులం జాతీయ రహదారి 17కు ఆనుకుని ఐశ్వర్య పేరుతో ఓ బార్ ఉంది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం 300 మీటర్లలోపు మద్యం షాపులు ఉండకూడదు. అలా ఉంటే మూతేయాల్సిందే. అదే కష్టం ఐశ్వర్య బార్కు వచ్చింది. దీంతో బార్ మూసేయాల్సిన పరిస్థితి. కానీ ఆబార్ ఓనర్ అతి తెలివి ఉపయోగించి తప్పించుకున్నాడు. జాతీయ రహాదారికి 300మీటర్ల దూరంలో ఉన్న షాప్ మెయిన్గేట్ను మూసివేశాడు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశాడు. దేవస్థానాల్లో దర్శనం కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్ల తరహాలో వెనక్కి ముందుకు సుమారు 300 మీటర్లుకు పైగా క్యూలైన్లు ఏర్పాటు చేశాడు. దీంతో కోర్టు నిబంధనలు ఉల్లంఘించకుండా తన బార్ మూత పడకుండా కాపాడుకున్నాడు.దీనికోసం సుమారు లక్షన్నర రూపాయలను వదిలించుకోవాల్సి వచ్చింది. ఇదే బాటలో నడవటానికి పలు బార్లు, వైన్ షాప్ ఓనర్లు సిద్దమౌతున్నారు. -
హైదరాబాద్లో ‘సైకిల్స్’ రెస్టారెంట్
• ఒకేచోట ఫుడ్, సైకిళ్ల విక్రయం • జూబ్లీహిల్స్లో చిక్లో కేఫ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెస్టారెంట్, బార్, సైకిల్ స్టోర్.. అన్నీ ఒకేచోట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. చెన్నైలో విజయవంతంగా నడుస్తున్న చిక్లో కేఫ్ ఇప్పుడు హైదరాబాద్లో అడుగు పెట్టింది. సైకిళ్ల తయారీ దిగ్గజం టీఐ సైకిల్స్, హాస్పిటాలిటీ రంగంలో ఉన్న అబ్సొల్యూట్ స్పెషాలిటీ సంయుక్తంగా చిక్లో కేఫ్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నాయి. ఇక్కడి జూబ్లీహిల్స్లో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రంలో టీఐ సైకిల్స్కు చెందిన బీఎస్ఏ, హెర్క్యూలెస్, ట్రాక్ అండ్ ట్రయల్తోపాటు రిడ్లే, బియాంకీ, కనోండేల్, మోంగూస్, ష్విన్, మోంట్రా వంటి విదేశీ బ్రాండ్ల సైకిళ్లు కొలువుదీరాయి. రూ.5 వేలు మొదలుకొని రూ.8 లక్షల వరకు ధరగల మోడళ్లను ఇక్కడ విక్రయిస్తారు. అద్దెకు సైతం సైకిళ్లు లభిస్తాయి. విక్రయాలను ప్రోత్సహించేందుకే..: 160 సీట్ల సామర్థ్యం గల రెస్టారెంట్తోపాటు బార్ సైతం చిక్లో కేఫ్లో అదనపు ఆకర్షణ. సైకిళ్ల విక్రయాలను ప్రోత్సహించేందుకే ఈ కాన్సెప్ట్ను పరిచయం చేశామని టీఐ సైకిల్స్ ప్రెసిడెంట్ అరుణ్ అలగప్పన్ తెలిపారు. అబ్సొల్యూట్ స్పెషాలిటీ వ్యవస్థాపకుడు ఆశిష్ థడానితో కలసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. యూరప్, జపాన్ తర్వాత భారత్లోనే ఇలాం టి కేఫ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. గుర్గావ్, బెంగళూరు, కోయంబత్తూరులో ఏప్రిల్ నాటికి చిక్లో కేఫ్లను ఏర్పాటు చేస్తామన్నారు. మూడేళ్లలో 20 దాకా కేంద్రాలను నెలకొల్పుతామని చెప్పారు. ఒక్కో సెంటర్కు రూ.4 కోట్ల దాకా వ్యయం అవుతోంది. -
అవి విలాసాల బార్లు
బీచ్లో మద్యం అమ్మకాలకు సన్నాహాలు 470 జీవోతో గేట్లు తెరిచిన ప్రభుత్వం నిన్న బీచ్ లవ్.. నేడు బీర్ లవ్ పేరుతో తీరం విషతుల్యం అడ్డగోలు నిర్ణయాలపై సర్వత్రా ఆగ్రహం ఆరిలోవలో ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో ఆందోళన బాటలో ప్రజా సంఘాలు నిన్న బీచ్ లవ్ ఫెస్టివల్ అన్నారు.. నేడు బీచ్లో బార్లకు గేట్లు బార్లా తెరుస్తున్నారు.. వీటన్నింటికీ సర్కారు పెట్టుకున్న ముద్దుపేరు.. పర్యాటక రంగ అభివృద్ధి..సంప్రదాయాలను కాలరాసే.. ప్రమాదాలకు హేతువులయ్యే ఇటువంటివి వద్దని ప్రజాసంఘాలు, పార్టీలు మొత్తుకుంటున్నా.. ఉద్యమాలు చేస్తున్నా సర్కారు చలించడంలేదు.. పైగా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. ఆదాయా మార్గాలను అణగదొక్కుతున్నారని ఎదురుదాడికి తెగబడుతోంది. విదేశీ విధానాల దిగుమతికే మొగ్గుచూపుతోంది. బీచ్ లవ్ ఫెస్టివల్ను ఆపేదిలేదని తెగేసి చెప్పిన పాలకులు.. తాజాగా ఎక్సైజ్ చట్టంలో సవరణలతో బీచ్లలో బార్ల పేరుతో మద్యం అమ్మకాలకు గేట్లు తెరుస్తోంది. అసలే సముద్రతీరాన్ని చూస్తే నగరవాసులే కాకుండా.. పర్యాటకులు అలలతోఆడుకోవాలని సంబరపడటం సహజం. ఆ సంబరంలో మునిగి.. కడలికి బలవుతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు..అలాంటిది ఇప్పుడు తీరంలోనే మద్యం అందుబాటులోకి వస్తే.. తాగిన మైకంలో మరెంత మంది బలవుతారో.. ఊహిస్తేనే భయమేస్తుంది. మరి సంక్షేమ సర్కారుకు మాత్రం ఆదాయం తప్ప.. ఇంకేమీ కనిపించడం లేదు.. ఆలోచించడం లేదు. విశాఖపట్నం:ఆదాయం సమకూర్చుకోవడానికి టీడీపీ సర్కారు యువతను ఫణంగా పెట్టడమే పనిగా పెట్టుకుంది. విశాఖ మహా నగరంలో విష సంస్కృతికి దారులు వేస్తోంది. పాశ్చాత్య పోకడలను రుద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు విశాఖలో ఏ చోట చూసినా ఇదే చర్చ. ఫిబ్రవరిలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలాది విదేశీ ప్రేమ జంటలను తెచ్చి ఇక్కడ తీరంలో తాగినంత మందు పోసి చిందులేయించడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై నగర ప్రజ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ప్రజా, మహిళా సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలూ, టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ మండిపడుతున్నాయి. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి. ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. ఇంకా ఆ వేడి చల్లారకముందే ప్రభుత్వం బీచ్లు, పర్యాటక ప్రాంతాలు, ఫుడ్ పార్లర్లలో మద్యం, బీర్ల అమ్మకాలకు లెసైన్సులు మంజూరు చేస్తామంటూ మరో వివాదానికి తెరలేపింది. ఇప్పటికే పెరిగిన ఆగడాలు ఇప్పటికే బీచ్లు, పబ్లిక్ పార్కులు, నగర శివార్ల మందుబాబుల ఆగడాలకు అడ్డాగా మారిపోయింది. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న వారు వీరి చేష్టలతో పడుతున్న అవస్థలన్నీ ఇన్నీ కావు. కళాశాల విద్యార్థులు పెడదారి పడుతున్నారు. వీరిని ఆ దారి నుంచి తప్పించేందుకు పాటుపడాల్సిన ప్రభుత్వమే విచ్చలవిడిగా పార్లర్లు, బీచ్లు, పర్యాటక కేంద్రాల్లో స్వేచ్ఛగా మద్యం తాగే ఏర్పాట్లు చేస్తుండడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రభుత్వం ఇంతలా బరి తెగిస్తోందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ప్రశాంతతకు మారుపేరైన విశాఖను విషతుల్యం చేయవద్దని, ఆదాయం కోసం పాడు చేయవద్దని వేడుకుంటున్నారు. ‘మద్యాన్ని అందుబాటులోకి తెస్తే అక్కడికి వచ్చిన వారు అదుపు తప్పి అఘాయిత్యాలకు పాల్పడితే విశాఖ ఏమవుతుంది? దానికుున్న మంచి పేరు ఏమవుతుంది? శాంతిభద్రతల సమస్య తలెత్తితే పరిస్థితి ఏమిటి? విదేశీయులు మన సంస్కృతిని గొప్పగా అనుసరిస్తుంటే.. పాశ్చాత్య సంస్కృతిని ఇక్కడ పెంచి పోషించడానికి ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం చూపిస్తుంది?’ ఇవన్నీ విశాఖ వాసులు, విశాఖను ప్రేమించే వారి నుంచి వెల్లువెత్తుతున్న ప్రశ్నలు. పర్యాటకరంగం అభివృద్ధికి ఇలాంటి అడ్డగోలు అనుమతులిస్తారా? అంటూ నిలదీస్తున్నారు. రోజూ వేలాదిగా బీచ్లకు, పర్యాటక ప్రాంతాలకు వచ్చే స్థానికులు వెనక్కి పోయే ప్రమాదం కూడా ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. మరో ఉద్యమానికి సన్నద్ధం విశాఖ వాసులు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బీచ్ లవ్ ఫెస్టివల్ను రద్దు చేసే దాకా విశ్రమించబోమని వివిధ వర్గాలు ఆందోళన పథంలో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం బార్, బీర్లు అందుబాటులో ఉంచడానికి వీలుగా జారీ చేసిన 470 నంబరు జీవోను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని మహిళా, ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే శుక్రవారం ఆరిలోవలో ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించాయి. శనివారం జగదాంబ జంక్షన్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నాయి. -
యువకులపై బార్ సిబ్బంది దౌర్జన్యం
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఉన్న చాంపియన్ బార్ అండ్ రెస్టారెంట్ (లోటస్ ఫుడ్సిటీ) నిబంధనలకు నీళ్లొదిలింది. రాత్రీ పగలు తేడా లేకుండా, నిబంధనలు ఏమాత్రం పాటించకుండా పబ్లు, బార్లు నడుపుతూ అక్కడికి వచ్చిన యువకులపై దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడడం తరచూ జరుగుతోంది. నిత్యం సీఎం చంద్రబాబు ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తున్నా ఎక్సైజ్ అధికారులకు పట్టడం లేదు. శనివారం అర్ధరాత్రి లోటస్ ఫుడ్ సిటీలో డిజి ఏర్పాటుచేసి పెద్ద పెద్ద శబ్దాలతో చిందులేస్తూ మద్యం తాగుతున్నారు. లోపల ఏర్పాటు చేసిన ఒక బల్బు పగలడంతో మీరే పగలగొట్టారంటూ లోటస్ ఫుడ్సిటీ సిబ్బంది వచ్చిన యువకులతో ఘర్షణకు దిగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి గుంటూరు నుంచి ఆ మార్గంలోనే రావడంతో ముందు ఉన్న గేటు మూసివేసి యువకులను లోపలే బంధించారు. దీంతో రెచ్చిపోయిన వారు ఫుడ్సిటీ సిబ్బందిపై తిరగబడ్డారు. సిబ్బంది ముగ్గురు యువకులను చితకబాదారు. బల్బు పగలగొట్టిందని తాము కాదని చెబుతున్నా వినకుండా దాడి చేశారు. విషయం తెలుసుకున్న విలేకరులు అక్కడికి వెళ్లగా వారిపై కూడా దౌర్జన్యం చేసి సెల్ఫోన్లు, కెమెరాలు లాక్కొన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తమ వెనుక రాజకీయ నాయకులున్నార ంటూ దుర్భాషలాడారు. నిబంధనలెక్కడ.. నిబంధనలకు విరుద్ధంగా రేయింబవళ్లు మద్యాన్ని అమ్ముతూ తమ జేబులు నింపుకొంటున్నా, అసలు రేటు కంటే ఎక్కువకు అమ్ముతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్పీడ్బార్కి అనుమతి ఉందంటూ 24 గంటలూ నిర్వహించినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. రోజూ ముఖ్యమంత్రి తిరిగే ఈ రహదారిలో ఇలా బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లు నిర్వహిస్తే అరాచకశక్తులు దాన్ని ఆసరాగా చేసుకునే అవకాశం ఉందని పలువురు ఉన్నత స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బార్లో అగ్ని ప్రమాదం, 13 మంది మృతి
13 మంది దుర్మరణం ర్యోన్ (ఫ్రాన్స్): ఉత్తర ఫ్రాన్స్లోని ర్యోన్ పట్టణంలో శనివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. ఘటనలో మరో ఆరుగు రు గాయాలపాలయ్యారు. ఓ బార్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా, కేకు కోస్తున్న సమయం లో కొవ్వొత్తుల నుంచి వచ్చిన మంటలు పక్కకు వ్యాపించి క్షణాల్లో పాలిస్టిరీన్ సీలింగ్ను తాకాయి. కాలిపోతున్న సీలింగ్ నుంచి విషవాయువులు వెలువడడంతో వాటిని పీల్చిన 13 మంది మరణించారు. ఘటనపై ప్రధాని మాన్యుయేల్ వాల్స్ విచారం వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాల్లో ఫ్రాన్స్లో జరిగిన అతిపెద్ద అగ్నిప్రమాదం ఇదే. -
మద్యం సరఫరా చేయలేదని..
సాక్షి, విజయవాడ : అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. శుక్రవారం రాత్రి 12 గంటలు దాటిన తరువాత కూడా తాము కోరిన వెంటనే మద్యం సరఫరా చేయలేదన్న ఆగ్రహంతో ఒక బార్పై టీడీపీ నాయకులు ఇద్దరు వీరంగం వేశారు. బార్ సిబ్బందిపై దాడి చేశారని సమాచారం. తెలుగు మహిళా విభాగంలో ఒక కీలక నేత భర్త, ట్రావెల్స్ నడిపే వ్యక్తి టీడీపీలో కీలకనేతగా చెలామణి అవుతున్నారు. నగరంలో ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా ఎంపీ కార్యాలయం సమీపంలో తను, తన భార్య ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తు ఉంటాడు. ఆయన తన సన్నిహితుడితో కలిసి శుక్రవారం రాత్రి స్వర్ణ ప్యాలెస్ సమీపంలోని ఓ బార్కు వెళ్లారు. మద్యం తాగిన తరువాత, బార్ సమయం ముగిసిందని సిబ్బంది వారిని బయలకు పంపేశారు. కొద్దిదూరం వెళ్లిన తరువాత తిరిగి మద్యం కావాలంటూ బార్కు వచ్చారు. అప్పటికే బార్ను సిబ్బంది మూసివేయడం చూసి వారితో ఘర్షణకు దిగారు. తాను అధికారపార్టీ నాయకునని కూడా చూడకుండా మందు సరఫరా చేయడానికి నిరాకరిస్తావా? అంటూ బార్ నిర్వాహకులు, సిబ్బందిపై దాడిచేశారని, బార్ను ధ్వంసం చేశారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బార్ సిబ్బంది చేసేదేమీ లేక ఒంటి గంట సమయంలో వారికి కావాల్సిన మద్యం ఇచ్చి సాగనంపారని తెలిసింది. బార్ నిర్వాహకుడికి నగరానికి సమీపంలోని నియోజకవర్గం ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో, ఆయన దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్లారని తెలిసింది. తమ పార్టీ నాయకుల ఘనకార్యం గురించి విన్న ఆ ఎమ్మెల్యే నివ్వెరపోయి రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. -
బార్లో అగ్ని ప్రమాదం, 13 మంది మృతి
-
బార్ ముందు బారికేడ్లు..!
జనం రద్దీని తట్టుకునేందుకుసినిమా హాళ్లు, బస్సు, రైల్వే స్టేషన్లలో టిక్కెట్టు క్యూ కౌంటర్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు మద్యం దుకాణాలు వారు కూడా బారికేడ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. రద్దీ సమయాల్లో మందుబాబుల తోపులాటను నివారించే ముందు జాగ్రత్త చర్య ఇది. రహమత్నగర్ డివిజన్ రాజీవ్గాంధీ నగర్లోని ఓ మద్యం దుకాణం ముందు ఇలా బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. -
రమ్య మృతిపై ఎక్సైజ్ శాఖ కొరడా
-
తాగడానికి నకిలీ లైసెన్సు!
బంజారాహిల్స్: నకిలీ గుర్తింపు కార్డుతో ఒక యువకుడు బార్లోకి ప్రవేశించి మద్యం తాగుతుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -10లోని ఎమ్మెల్యే, ఎంపీల కాలనీలో నివసించే విశేష్ అగర్వాల్ (19) ఢిల్లీలోని ఓ ప్రభుత్వ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. వారం క్రితం నగరానికి వచ్చాడు. ఎక్సైజ్ పోలీసులు, పోలీసులు గత మూడు రోజుల నుంచి అన్ని పబ్లు, బార్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ 21 ఏళ్లలోపు యువకులకు ప్రవేశం కల్పించరాదంటూ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. మంగళవారం రాత్రి విశేష్ అగర్వాల్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లోని గ్లోకల్ బార్ అండ్ రెస్టారెంట్కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ను చూపించి లోనికి వెళ్లాడు. ఆ డ్రైవింగ్ లైసెన్స్పై పుట్టిన సంవత్సరం 1994 అని ఉండటంతో బౌన్సర్లు అనుమతించారు. సరిగ్గా రాత్రి 10 గంటలకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తన సిబ్బందితో కలిసి గ్లోకల్ బార్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విశేష్ అగర్వాల్ వద్ద గుర్తింపు కార్డు తనిఖీ చేయగా దానిపై పుట్టిన సంవత్సరం 1997 అని ఉంది. ఎలా అనుమతించారని బార్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా 1994 పుట్టినతేదీతో డ్రైవింగ్ లైసెన్స్ చూపించాడని చెప్పగా పోలీసులు తనిఖీలు చేయగా అతడి వద్ద రెండు డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నట్లు తేలింది. అసలు డ్రైవింగ్ లైసెన్స్పై ఉన్న 1997ను 1994గా మార్ఫింగ్ చేయించి నకిలీ ఐడీ కార్డుతో లోనికి ప్రవేశించినట్లు విశేష్ అగర్వాల్ ఒప్పుకొన్నాడు. మోసం చేసినందుకు అతనిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 468, 471 కింద కేసు నమోదు చేసి బుధవారం అరెస్టు చేశారు. -
తలసాని సోదరుడి బార్పై కేసు
రాంగోపాల్పేట: నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న ఓ బార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సోదరుడు శంకర్యాదవ్ గాస్మండిలో శివ బార్ను నిర్వహిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బార్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఉత్తర మండలం డీసీపీ ప్రకాశ్రెడ్డితో పాటు మార్కెట్, లాలాపేట, గోపాలపురం ఇన్స్పెక్టర్లు తమ సిబ్బంది దాడి చేశారు. బార్లో మద్యం విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నా.. వాటిని ఉల్లంఘించి విక్రయిస్తుండటంతో కేసు -
ఎవరిదో..?
డోసు ఎక్కువైతే మందుబాబులు తమను తాము మరిచిపోయి... వీరంగం వేయడం చూస్తుంటాం. అలాగే మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర విలువైన వస్తువులను మర్చిపోవడమో, పారేసుకోవడమో చేస్తుంటారు. అయితే బ్రిటన్లోని యార్క్షైర్లో ఓ దివ్యాంగుడు చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గురుడు బాగా తాగేసి... తన కృత్రిమకాలును బార్ ముందు వదిలేసి వెళ్లిపోయాడు. పరిస్థితిని బట్టి చూస్తుంటే ఫూటుగా తాగి... చేతిలో బీరు బాటిల్తో బయటకు వచ్చిన అతను బార్ మూతపడ్డాక దాని ముందే పేవ్మెంట్పై కూర్చొని మందుకొట్టాడు. ఆ క్రమంలో కృత్రిమకాలును తీసి పక్కన అలా నిలబెట్టాడు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయినట్లున్నాడు. ఎందుకంటే కృత్రిమకాలు వెనకే సగం ఖాళీ చేసిన బీరు సీసా కూడా కనిపిస్తోంది. ఈ కాలును ఫొటో తీసి యార్క్షైర్ ఫేస్బుక్ పేజీలో ఎవరో పోస్ట్ చేశారు. ‘రాత్రి ఎవరైనా డోంకస్టర్లో కృత్రిమకాలును పోగొట్టుకున్నారా?’ అని క్యాప్షన్ పెట్టారు. దాంతో రకరకాల కామెంట్లతో ఈ ఫొటో సోషల్ సైట్లలో చక్కర్లు కొట్టింది. -
30 శాతం మంది నకిలీ లాయర్లే!
దేశంలో నకిలీ లాయర్లను ఏరిపారేసే ప్రక్రియ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతోమంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని, వారిని వెతికి పట్టుకునేందుకు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారు కనీసం 30 శాతం మందికి నకిలీ డిగ్రీలున్న విషయం బయటపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నకిలీ లాయర్లను వెతికి పట్టుకునేందుకు బీసీఐ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఒకప్పుడు న్యాయవాద వృతిని చేపట్టాలనుకున్నవారు బీసీఐ సర్టిఫికెట్తో రిజిస్టర్ అయితే సరిపోయేది. కానీ తాజాగా అమల్లోకి తెచ్చిన పద్ధతి ప్రకారం వెరిఫికేషన్ సమయానికి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నవారంతా బీసీఐ సర్టిఫికెట్తో పాటు పదోతరగతి, బోర్డు సర్టిఫికెట్లను, ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఈ నేపథ్యంలో కొత్త ఫార్మాట్లో తిరిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు బీసీఐ ఛైర్మన్ చెప్పారు. లాయర్లు సమర్పించిన సర్టిఫికెట్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియ సదరు విశ్వవిద్యాలయాలు, బోర్డుల సహాయంతో 2016 సంవత్సరం చివరినాటికి పూర్తవుతుందని మనన్ కుమార్ మిశ్రా వెల్లడించారు. బీసీఐ రిజిస్ట్రేషన్ ఉండి ఐదేళ్లుగా ప్రాక్టీస్లో లేని న్యాయవాదులను పరిశీలనలో భాగంగా లాయర్లుగా గుర్తించినా.. తిరిగి ప్రాక్టీస్ కు మాత్రం అనుమతించే అవకాశం లేదన్నారు. ఈ నూతన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో బార్ కౌన్సిల్... వివిధ రాష్ట్రాల్లో న్యాయవాదుల అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి న్యాయవాదికీ అకాడమీ సర్టిఫికెట్ తప్పనిసరి అని, దాంతో ఏ కోర్టులోనైనా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుందని మిశ్రా చెప్పారు. దేశంలో 20 శాతం లాయర్లు సరైన 'లా' డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారని బీసీఐ ఛైర్మన్ గతేడాది చెప్పారు. అకాడమీలను ప్రారంభించి, నకిలీ న్యాయవాదులను నిర్మూలించేందుకు సహకరించాలని అప్పట్లో కేంద్రాన్ని నిధుల కోసం ఆశ్రయించారు. అయితే అప్పటికే న్యాయమూర్తులకు శిక్షణ ఇచ్చే జ్యుడీషియల్ అకాడమీలను పొడిగిస్తూ, న్యాయవాదులకు, న్యాయవ్యవస్థలో పనిచేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ ఆఫీసర్ల వంటి వారికి కూడా తగిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, న్యాయ శాఖ బీసీఐకి హామీ ఇచ్చింది. -
ప్రేమికుల రోజుకు రిషికపూర్ సందేశం!
ప్రేమికుల రోజుకు వయసుతో పని లేదంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్. ప్రేమను పంచుకోడానికి వయసుతో సంబంధం లేదని సందేశం ఇస్తున్నారు. వాలెంటైన్స్ డే ప్రతివారూ జరుపుకోదగ్గ రోజన్న విషయం... ప్రతివారికీ తెలియాలని ఆయన ట్వీట్ చేశారు. లవ్.. రొమాన్స్ యువతకు మాత్రమే పరిమితం కాదంటున్నారు. ఏభై ఏళ్ళ వివాహ జీవితాన్ని పూర్తి చేసిన రిషికపూర్.. దంపతుల్లో ఉండే ప్రేమను నిరూపించే ఓ హార్ట్ టచ్చింగ్ వీడియోను యూట్యూబ్.. కాట్ ఇన్ యాక్షన్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. ఒకరికోసం ఒకరు అనేందుకు ఇప్పుడా వీడియో తార్కాణంగా నిలుస్తోంది. ఒకరి ఆహారంపట్ల ఒకరు శ్రద్ధ చూపించడం, సమయానికి మందులు గుర్తు చేయడం, ఇంటిపనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం ఇవన్నీ ప్రేమను నిలబెడతాయని... ఆప్యాయత అనురాగాన్నీ పెంచుతాయని, నిస్వార్థంగా బతికేలా చేస్తాయని ఆ దంపతులను చూస్తే అర్థమౌతుంది. ఇప్పటిదాకా ఆమె దృష్టిలో నేనొక్క పని కూడా సరిగా చేయలేదని.. అయితే వివాహ జీవితం 54 ఏళ్ళు సజావుగా సాగిపోయిందని రిషికపూర్ నవ్వుతూ చెప్తున్నారు. జీవితాంతం వాలెంటైన్ గా ఉండాలనుకున్నవారు మరి ఆ అన్యోన్య దాంపత్యాన్ని వీక్షించాల్సిందే... So true.... You never too old for Valentines Day! Well done Sarah https://t.co/5KQs94GSqz — Rishi Kapoor (@chintskap) February 11, 2016 -
మలేసియా విలన్లతో... కపాలి
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ఏం చేసినా సంచల నమే. విశేషం ఏమిటంటే, మొన్నటి దాకా ‘కపాలి’లో రజనీకాంత్ పెరిగిన గడ్డంతో కనిపించిన ఫోటోలే బయటకొచ్చాయి. తాజాగా, రజనీకాంత్ నున్నగా గడ్డం గీసు కొని, అందమైన మీసకట్టుతో గ్లామర్గా అనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఒకపక్క శంకర్ దర్శకత్వంలో ‘రోబో 2.0’ సినిమా ప్రారంభమైనా, మరోపక్క ‘కపాలి’ చిత్రంతో ఆయన బిజీ బిజీగా ఉన్నారు. యువ తమిళ దర్శకుడు పి. రంజిత్ దర్శకత్వంలో, అగ్ర నిర్మాత ‘కలైపులి’ ఎస్. థాను ఈ గ్యాంగ్స్టర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా ఫోటోల్లో రజనీకాంత్ మలేసియాకు చెందిన యాక్టర్ నార్మన్ హకీమ్తో కలసి ఉన్నారు. సంగతేమి టయ్యా అంటే... నార్మన్ ఈ చిత్రంలో ఒక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి, ప్రసిద్ధ చైనీస్ యాక్టర్ జెట్లీ ‘కపాలి’లో విలన్గా నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, చివరకు అవన్నీ వట్టి గాలివార్తలని తేలింది. మలేసియన్ నటుడు రోస్యమ్ నోర్, తైవాన్కు చెందిన యాక్టర్ విన్స్టన్ ఛావోలు ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలు ధరిస్తున్నారు. మొత్తానికి, ‘కపాలి’ సెట్స్లోని రజనీ తాజా గెటప్ స్టిల్స్ సినీ ప్రియుల్లో చర్చనీయాంశమయ్యాయి. వచ్చే ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాదికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి ‘మహాదేవ’ అని టైటిల్ అనుకుంటున్నట్లు భోగట్టా. బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఈ చిత్రంలో కథానాయిక. అలాగే, ‘అట్టకత్తి’ దినేశ్, కలై అరసన్, జాన్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ‘బాషా’ తరువాత మళ్ళీ చాలారోజులకు రజనీ కాంత్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాల కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే! -
రాత్రి 12 వరకూ బార్లలో మద్యం విక్రయాలు!
* అదనంగా గంట సమయం పెంచేందుకు సీఎం గ్రీన్సిగ్నల్ * కొత్త సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం * ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిన ఉత్తర్వులు * మద్యం దుకాణాలకు సమయం పొడిగింపునకు నో సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లలో మద్యం అమ్మకాల సమయాన్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్త సంవత్సరం నుంచే జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే రిటైల్ మద్యం దుకాణాలకు మాత్రం అమ్మకాల సమయాన్ని పొడిగించలేదు. పోలీస్ శాఖ అభ్యంతరం తెలపడంతో మద్యం దుకాణాల సమయాన్ని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం బార్లలో మద్యం అమ్మకాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుండగా... జనవరి ఒకటి నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు సాగుతాయి. మద్యం మినహా ఆహార పదార్థాల (రెస్టారెంట్) విక్రయాలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతాయి. దేశంలో పారిశ్రామికంగా, పర్యాటకపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి వరకు మద్యాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గత ఫిబ్రవరిలోనే ఎక్సైజ్ శాఖ నుంచి నివేదిక కోరింది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఆబ్కారీ మంత్రి పద్మారావు గౌడ్ కూడా మద్యం విక్రయాల సమయాన్ని పెంచాలని సీఎంకు సూచించారు. ఇతర మెట్రో నగరాల్లో అర్ధరాత్రి వరకు బార్లలో మద్యం అందుబాటులో ఉంటుండగా.. హైదరాబాద్లో స్టార్ హోటళ్లు మినహా ఇతర బార్లలో రాత్రి 11 గంటల వరకే మద్యం లభిస్తోంది. హైదరాబాద్, జిల్లా కేంద్రాలు మినహా మిగతా ప్రాంతాల్లో రాత్రి 10.30 గంటలకే బార్లను మూసేస్తున్నారు. రిటైల్ మద్యం దుకాణాలను రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలన్న ఉత్తర్వులు కూడా హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో అధికారికంగా మద్యం దుకాణాలు, బార్లు తెరిచి ఉంచే సమయాన్ని మరో గంట పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రెండు నెలల క్రితమే ఫైలును రూపొందించి ఆర్థిక శాఖతో పాటు ఎక్సైజ్ మంత్రి సంతకాలు చేసి సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపించారు. దీనిపై రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో చర్చించిన సీఎం... బార్ల నిర్వహణ సమయాన్ని మరో గంట పెంచేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. రిటైల్ దుకాణాలకు పెంచితే సమస్యలు రాష్ట్రంలో మద్యం రిటైల్ దుకాణాలను రాత్రి 10 గంటల దాకా తెరిచి ఉంచవచ్చు. కానీ జిల్లాల్లో 9.30కే మూత పడుతున్నాయి. దీంతో మద్యం దుకాణాల సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పెంచాలన్న అంశంపై చర్చ జరిగింది. కానీ దీనిపై పోలీస్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాత్రి 10 గంటల వరకు దుకాణాలు ఉంటేనే రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో తాగి గొడవలకు పాల్పడుతున్నారని... 11 గంటల వరకు పెంచితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆ శాఖ పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బార్లకు మాత్రమే సమయం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికలు ముగిశాక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
అర్ధరాత్రి బార్పై పోలీసుల దాడి
-
మద్యంసేవిస్తూ వ్యక్తి మృతి
హయత్నగర్: బార్లో మద్యం సేవిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్ డివిజన్లోని శుభోదయకాలనీలో నివసించే కర్రోళ్ల కృష్ణ (45) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం హయత్నగర్లోని ఓ బార్లో మద్యం సేవిస్తూ టేబుల్ మీద కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం సేవిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బార్కు వెళ్తే చావబాదారు
హైదరాబాద్: మద్యం తాగేందుకు బార్కు వెళ్లిన యువకులపై నిర్వాహకులు దాడి చేసి గాయపర్చిన ఘటన ఉప్పల్లో జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండజిల్లా వలిగొండ మండలం ఎదులాపురం గ్రామానికి చెందిన విష్ణు(32), కాసుల లక్ష్మణస్వామి (31) బోడుప్పల్ బుద్దానగర్లో నివాసం ఉంటూ డీసీఎం డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఇద్దరూ మంగళవారం రాత్రి ఉప్పల్లోని విక్టరీ బార్కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం బిల్లు చెల్లించే విషయంలో బార్ నిర్వాహకులు, సిబ్బంది విష్ణు, లక్ష్మణస్వామిలతో గొడవకు దిగారు. రూ.300 బిల్లు అయితే వెయిటర్కు లక్ష్మణస్వామి రూ.500 ఇచ్చాడు. వెయిటర్ మిగతా రూ.200 తిరిగి ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బార్ సిబ్బంది లక్ష్మణస్వామిపై పిడిగుద్దులు గుద్ది బార్ పై నుంచి కింది మెట్లపైకి తోశారు. మెట్లపై పడటంతో లక్ష్మణస్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న లక్ష్మణస్వామి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరో బాధితుడు విష్ణు ఫిర్యాదు మేరకు పోలీసులు బార్ యజమాని, సిబ్బందిపై సెక్షన్ 324 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బార్కు వెళ్తే చావబాదారు
ఉప్పల్లో ఘటన యువకుడి పరిస్థితి విషమం బార్ నిర్వాహకులపై కేసు నమోదు ఉప్పల్: మద్యం తాగేందుకు బార్కు వెళ్లిన యువకులపై నిర్వాహకులు దాడి చేసి గాయపర్చిన ఘటన ఉప్పల్లో జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండజిల్లా వలిగొండ మండలం ఎదులాపురం గ్రామానికి చెందిన విష్ణు(32), కాసుల లక్ష్మణస్వామి (31) బోడుప్పల్ బుద్దానగర్లో నివాసం ఉంటూ డీసీఎం డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఇద్దరూ మంగళవారం రాత్రి ఉప్పల్లోని విక్టరీ బార్కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం బిల్లు చెల్లించే విషయంలో బార్ నిర్వాహకులు, సిబ్బంది విష్ణు, లక్ష్మణస్వామిలతో గొడవకు దిగారు. రూ.300 బిల్లు అయితే వెయిటర్కు లక్ష్మణస్వామి రూ.500 ఇచ్చాడు. వెయిటర్ మిగతా రూ.200 తిరిగి ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బార్ సిబ్బంది లక్ష్మణస్వామిపై పిడిగుద్దులు గుద్ది బార్ పై నుంచి కింది మెట్లపైకి తోశారు. మెట్లపై పడటంతో లక్ష్మణస్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న లక్ష్మణస్వామి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరో బాధితుడు విష్ణు ఫిర్యాదు మేరకు పోలీసులు బార్ యజమాని, సిబ్బందిపై సెక్షన్ 324 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వీడని ముడి
జనవరి, 2015... లాస్ ఏంజిల్స్ (అమెరికా)లోని ఓ బార్. ‘‘ఏమైనా ఈ మందులో ఉండే కిక్కే వేరు డేవిడ్. ఇది ఏ మనిషినీ తనలా ఉండనివ్వదు’’... మరో పెగ్గు లాగించేం దుకు సిద్ధమవుతూ అన్నాడు డెన్నిస్ డావెర్న్. అప్పటికే మత్తు బాగా ఎక్కేసింది. మాటలు ముద్దగా వస్తున్నాయ్.‘‘ఇక చాల్లే డెన్నిస్. ఇప్పటికే ఎక్కు వైంది. పద పోదాం’’ అన్నాడు డేవిడ్. ‘‘నిజం చెప్తున్నాను డేవిడ్. ఫ్రెండంటే నువ్వే. అన్ని సమయాల్లోనూ నాకు తోడున్నావ్. నా మంచికోసం తపన పడు తుంటావ్. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు గర్వంగా అనిపిస్తుంది. నీ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. నీతో ఎలాంటి రహస్యాన్నైనా పంచుకోవాలనిపిస్తుంది.’’ డేవిడ్ నవ్వాడు. ‘‘నీకూ నాకూ మధ్య ఇంకా రహస్యాలున్నాయంటావా?’’ నిట్టూర్చాడు డెన్నిస్. ‘‘నువ్వలా అంటే నాకు గిల్టీగా ఉంది. నీ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. నీ దగ్గర ఓ పెద్ద రహస్యాన్ని దాచాను’’... భోరుమన్నాడు డెన్నిస్. తాగిన మైకంలో ఏం మాట్లాడు తున్నాడో తెలియడం లేదు అనుకున్నాడు డేవిడ్. ‘‘సరే పోనియ్. పద వెళ్దాం’’ అంటూ లేచాడు. డెన్నిస్ అతని చేయి పట్టుకున్నాడు. కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. కూర్చున్నాడు డేవిడ్. ‘‘నేను చెప్పేది నిజమేరా డేవిడ్. నేను నీ దగ్గర ఓ నిజం దాచాను. మన స్నేహానికి ద్రోహం చేశాను. ఇప్పటికైనా నీకు ఆ విషయం చెప్పి నా పాపాన్ని కడిగేసుకుంటాను. నీకు నటాలీ ఉడ్ గుర్తుంది కదా?’’ డేవిడ్ భృకుటి ముడిపడింది. ఉందన్నట్టు తలూపాడు. ‘‘యాక్సిడెంట్లో చనిపోయింది కదా?’’ అన్నాడు. ‘‘లేదురా. తనది యాక్సిడెంట్ కాదు. మర్డర్. ఆ విషయం నాకు తెలుసు. కావాలనే దాచిపెట్టాను.’’ ఉలిక్కిపడ్డాడు డేవిడ్. ఏం మాట్లాడు తున్నాడు డెన్నిస్? నటాలీది హత్యా? డేవిడ్ హావభావాల్ని గమనించే స్థితిలో లేడు డెన్నిస్. ఆ రోజు ఏం జరి గింది, ఎలా జరిగింది అన్నీ తన మానాన తను చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు. పది నిమిషాల తర్వాత ‘‘డెన్నిస్’’ అన్న ఓ గంభీరమైన పిలుపు అతడి మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. ‘‘ఎవరూ’’ అంటూ తల పెకైత్తాడు. ఎదురుగా ఉన్న పోలీసుల్ని చూసి బిత్తరపోయాడు. కంగారుగా స్నేహితుడి వైపు చూశాడు. ‘‘సారీ డెన్నిస్. నువ్వు ద్రోహం చేసింది నాకు కాదు. న్యాయానికి. అందుకే పోలీసుల్ని పిలిచాను’’ అనేసి వడివడిగా వెళ్లిపోయాడు డేవిడ్. పోలీసులు డెన్నిస్ని తీసుకుని స్టేషన్కి బయలుదేరారు. ‘‘నేను మీకు నిజం ఎప్పుడో చెప్పాను కద సర్. మళ్లీ కొత్తగా అడుగుతారేంటి? నటాలీది యాక్సిడెంట్.. అంతే.’’ ఇన్స్పెక్టర్ నవ్వాడు. ‘‘తాగినోడు నిజమే చెప్తాడన్న విషయాన్ని నేను కూడా నమ్ముతాను మిస్టర్ డెన్నిస్. కాబట్టి మత్తు దిగాక ఇప్పుడు నువ్వు చెప్తున్నదానికంటే, ఇందాక మత్తులో నువ్వు మాట్లాడినదాన్నే నేను పట్టించుకుంటాను. నిజం చెప్పు.’’పరిస్థితి అర్థమైంది డెన్నిస్కి. బార్లో తాను మాట్లాడినదంతా పోలీసులు విన్నారన్న విషయం స్పష్టమైంది. ఇక నిజాన్ని దాచడంలో అర్థం లేదు. అందుకే నోరు విప్పాడు. నిజం చెప్పాడు. అతను చెప్పింది విని అవాక్కయ్యారు పోలీసులు. ముప్ఫై మూడేళ్లుగా అల్మరాలో పడివున్న హాలీవుడ్ నటి నటాలీ ఉడ్ కేస్ ఫైలును మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్నారు. తలుపు తెరవగానే గుమ్మంలో కనబడిన పోలీసుల్ని చూసి ఖంగు తిన్నాడు రాబర్ట్ వాగ్నర్. ‘‘ఏం జరిగింది?’’... నింపాదిగా అందామన్నా అతడి గొంతు వణికింది. ‘‘నటాలీ కేసును మళ్లీ ఓపెన్ చేస్తున్నాం. మీ సహకారం కావాలి.’’ ఇన్స్పెక్టర్ మాట వింటూనే ముఖం తిప్పుకున్నాడు రాబర్ట్. ‘‘సారీ. అదంతా జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ గాయాన్ని రేపకండి. దయచేసి వెళ్లిపోండి’’ అనేసి దబ్బున తలుపు మూసేసిన రాబర్ట్ మీద ఒక్క క్షణంలో వంద రకాల సందేహాలు తలెత్తాయి ఇన్స్పెక్టర్కి. నిజానికి ఆ సందేహాలు ముప్ఫై మూడేళ్ల క్రితమే పోలీసుల్లో తలెత్తి ఉంటే నటాలీకి న్యాయం ఎప్పుడో జరిగివుండేది. నటాలీ ఉడ్... హాలీవుడ్ చరిత్రలో ఆమెదొక అందమైన పేజీ. మహా అందగత్తె నటాలీ. బాలనటిగా కెరీర్ని ప్రారంభించింది. టీనేజ్లో అడుగుపెట్టాక టీవీ సీరియళ్లలో రాణించింది. హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు సంపాదించింది. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి హీరోయిన్గా ఎదిగింది. విజయాల బాటలో సాగిపోయింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సైతం అందుకుంది. చిన్న వయసులోనే స్టార్గా వెలిగింది. అందం... పేరు... డబ్బు... పలుకు బడి... అన్నీ ఉన్న అమ్మాయికి ఓ అబ్బాయి మనసులో చోటు దొరకడం ఎంతసేపు! అందుకే ఆమె రాబర్ట్ వాగ్నర్ మనసులో తేలిగ్గానే స్థానం సంపాదించింది. అతడు హీరో. ఆమె నటి కాక ముందు నుంచీ అతడి ఫ్యాన్. తన పద్దెనిమిదో పుట్టినరోజున అతణ్ని వెతుక్కుంటూ షూటింగ్ స్పాట్కి వెళ్లింది నటాలీ. తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడైన రాబర్ట్తో తన మనసులోని మాట చెప్పింది. అతడి ఇష్టాన్ని గెల్చుకుంది. సంవత్సరం తిరిగేసరికల్లా అతడి భార్య స్థానంలోకి వెళ్లింది. కానీ నాలుగేళ్లలోనే వారి బంధం బీటలు వారింది. విడాకులకు దారి తీసింది. అయితే ఆ యెడబాటు వారిద్దరినీ మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. నటాలీ జీవితంలోకి గ్రెగ్సన్ అనే వ్యక్తి రెండో భర్తగా వచ్చినా, మొదటి భర్త జ్ఞాపకాలు ఆమెను వెంటాడాయి. దాంతో రెండో పెళ్లి కొన్ని నెలల్లోనే విఫలమయ్యింది. అటు రాబర్ట్ కూడా నటాలీ కోసం పరితపిం చాడు. దాంతో ఇద్దరూ మళ్లీ పెళ్లాడారు. పాత కాపురాన్ని కొత్తగా మొదలుపెట్టారు. ఓ ఆడపిల్లకి తల్లిదండ్రులయ్యారు. ఉత్తమ జంటగా అందరి ప్రశంసలనూ పొందారు. కానీ ఆ ఆనందమంతా మరో తొమ్మిదేళ్లలో ఆవిరవనుందనీ, నటాలీ జీవితంలో ఓ పెద్ద తుఫాను రేగబోతోందనీ ఎవ్వరూ ఊహించలేదు. నవంబర్ 28, 1981. సమయం రాత్రి రెండు కావస్తోంది. లాస్ ఏంజిల్స్ పోలీసులకు ఓ షాకింగ్ వార్త అందింది... శాంటా క్యాటలీనా ఐల్యాండ్కి పిక్నిక్కి వెళ్లిన నటాలీ ఉడ్... బోటు షికారు చేస్తూ నీళ్లలో పడిపోయిందని, తన జాడ తెలియడం లేదని. పోలీసులు అప్రమత్త మయ్యారు. రెస్క్యూ టీములతో ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు. కానీ ఆ రాత్రంతా ఆమె జాడ తెలియలేదు. ఉదయం ఎనిమిది కావస్తుండగా నటాలీ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆమె మరణవార్త అభిమానులందరినీ కన్నీటి సంద్రంలో ముంచేసింది. అసలు నటాలీ ఎలా మరణించింది అన్న సందేహం ఎందరి మెదళ్లనో తొలిచేసింది. పోలీసులు కూడా రకరకాలుగా విచారించారు. భర్త రాబర్ట్ వాగ్నర్, తన తాజా చిత్రం ‘బ్రెయిన్ స్టార్మ్’లో సహ నటుడు అయిన క్రిస్టఫర్ వాకెన్తో కలిసి వీకెండ్ పిక్నిక్కి వెళ్లింది నటాలీ. వాళ్ల ముగ్గురితో పాటు బోటులో కెప్టెన్ డెన్నిస్ డావెర్న్ మాత్రమే ఉన్నాడు. ఆ ముగ్గురూ ఒకటే మాట చెప్పారు... అర్ధరాత్రి వరకూ నటాలీ అందరితో సంతోషంగానే గడిపిందని, పడుకోడానికి గదిలోకి వెళ్లిన ఆమె ఎప్పుడు బయటకు వచ్చిందో, ఎప్పుడు నీళ్లలోకి జారిపడిందో తెలియదని. అది నిజం కాదనడానికి పోలీసులకు కూడా ఎలాంటి ఆధారాలూ లభించలేదు. దాంతో నటాలీది యాక్సి డెంటల్ డెత్ అని నిర్ధారించి కేసు క్లోజ్ చేశారు. కానీ ముప్ఫై మూడేళ్ల తర్వాత డెన్నిస్ నోరు విప్పి కొత్త కథనాన్ని విని పించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇంతకీ డెన్నిస్ చెప్పిన నిజం ఏమిటి? ఆ రోజు రాత్రి పదకొండు గంటల వరకు భర్త, స్నేహితుడితో కలిసి మందు తాగుతూ ఎంజాయ్ చేసింది నటాలీ. తర్వాత తన గదిలోకి వెళ్లి పడుకుంది. కాసేపటి తర్వాత మెలకువ వచ్చిందామెకి. భర్త అప్పటికీ వచ్చి పడుకోకపోవడంతో అతణ్ని వెతుక్కుంటూ బోటంతా కలియ దిరిగింది. చివరికి క్రిస్టఫర్ గదిలో, ఒక ఊహించని స్థితిలో భర్తని చూసి షాకైంది. క్రిస్టఫర్తో రాబర్ట్ ఉండకూడని భంగిమలో ఉన్నాడు. చేయకూడని పనులు చేస్తున్నాడు. వాళ్లిద్దర్నీ అలా చూసి తట్టుకోలేకపోయింది నటాలీ. భర్తని బయటకు లాక్కొచ్చింది. ఇద్దరూ కాసేపు గొడవ పడ్డారు. పావుగంట తర్వాత ఆ గొడవ ఆగిపోయింది. ‘‘ఇద్దరూ వెళ్లి పడుకుని ఉంటారని అనుకున్నాను సర్. కానీ కాసేపటి తర్వాత రాబర్ట్ నా దగ్గరికొచ్చాడు. నటాలీ నీటిలో పడిపోయిందన్నాడు. నేను కంగారు పడ్డాను. కానీ ఆయన మాత్రం నిమ్మళంగా ఉన్నాడు. ఆమెను వెతికే ప్రయత్నం చేయలేదు. చాలాసేపటి వరకూ పోలీసులకూ కబురు పెట్టలేదు. దాదాపు నలభై నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు. పెద్దవాళ్ల గొడవల్లో ఇరుక్కోకూడదని నేనారోజు నిజం చెప్పలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు డెన్నిస్. దాన్నిబట్టి నటాలీని ఆమె భర్తే నీటిలోకి తోసి ఉంటాడంటున్నారు పోలీ సులు. ఆ విషయాన్ని నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వయసు మీదపడిన రాబర్ట్ విచారణకు సహకరించ ట్లేదు. అయినా అతడిని నేరస్తుడిగా నిరూ పించే ఆధారాల కోసం వేట సాగుతూనే ఉంది. ఆ వేట ఎప్పుటికైనా ముగు స్తుందా? నిజం గెలుస్తుందా? ముప్ఫై మూడేళ్ల తర్వాతైనా నటాలీకి న్యాయం జరుగుతుందా? ఏమో... దేవుడికెరుక! నటాలీకి నీళ్లంటే చాలా భయం. సినిమాల్లో స్విమ్మింగ్ సన్నివేశాలుంటే కంగారుపడేది. ధైర్యం చెప్పి ఆమెతో ఆ సన్నివేశాలు చేయించు కునేవారు దర్శకులు. ఆ బలహీనతనే రాబర్ట్ వాడుకున్నాడని కొందరు అంటుంటారు. అసలామెని వదిలించుకోవడానికే అలాంటి పిక్నిక్ ప్లాన్ చేశాడని మరికొందరంటారు. - సమీర నేలపూడి -
గ్రేటర్ పరిధిలో కొత్తగా మరో 117 బార్లు
-
15,000 మందికో బార్
* జనాభా ప్రాతిపదికన ఏర్పాటు * గ్రేటర్ పరిధిలో కొత్తగా మరో 117 బార్లు * ఆదాయం పెంచుకొనేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరిన్ని బార్ల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ జనాభా ప్రాతిపదికన బార్లకు లెసైన్సులు మంజూరు చేయాలన్న ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. దీంతో సగటున 15 వేల జనాభాకు ఒకటి చొప్పున బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ లెక్కన గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 117 కొత్త బార్ల ఏర్పాటుకు అవకాశముంది. ఇక రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఇప్పటికీ బార్లు లేవు, ఆయా పట్టణాల్లో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న లిక్కర్ మాఫియా బార్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇప్పటివరకు మంత్రాంగం సాగించింది. జనాభా ప్రాతిపదికన అర్హత ఉన్నా బార్ల ఏర్పాటుకు కొందరు ముందుకు వచ్చినా అనుమతులు మంజూరు కాలేదు. కానీ తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మున్సిపాలిటీలతో పాటు నగర పంచాయతీల్లోనూ బార్లు తెరుచుకోనున్నాయి. త్వరలోనే కొత్త బార్లకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. మూడు నెలల లెసైన్స్.. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలకు అనుమతులు ఉండగా.. 2,112 మద్యం దుకాణాలు గత నెలాఖరు వరకు కొనసాగాయి. వీటిలో 96 దుకాణాల వ్యాపారులు లెసైన్సులు రెన్యూవల్ చేసుకోకపోవడంతో ప్రస్తుతం 2,016 దుకాణాలు కొనసాగుతున్నాయి. రెన్యువల్ కాని 96 దుకాణాలకు తోడు ఎవరూ తీసుకోని మరో 104 దుకాణాలకు మూడునెలల లెసైన్సుల కోసం జిల్లాల వారీగా మంగళవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక రాష్ట్రంలో జూన్ నెలాఖరు వరకు 766 బార్లు కొనసాగగా.. రెన్యువల్ చేసుకోని కారణంగా 31 బార్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పడిపోతున్న రెవెన్యూను కాపాడుకునేందుకు ఎక్సైజ్ శాఖ కొత్త బార్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ చేసిన సిఫారసుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోగా కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానించి, అర్హత గల ప్రాంతాల్లో మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే జూన్కు ముందు వివిధ ప్రాంతాల్లో బార్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల్లో 75 తిరస్కరణకు గురయ్యాయి. ఈసారి మాత్రం జనాభా ప్రాతిపదికన అర్హత గల దరఖాస్తులకు లెసైన్సులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రేటర్లోనే 117 కొత్త బార్లు రాష్ట్రవ్యాప్తంగా 766 బార్లకు లెసైన్సులు ఉండగా.. వాటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 516 ఉన్నాయి. కొత్తగా ప్రభుత్వం లెసైన్సులు మంజూరు చేస్తే హైదరాబాద్లోనే మరో 117 బార్లకు అవకాశం లభించనుంది. ధూల్పేట, సికింద్రాబాద్ యూనిట్లలో బార్లను పెంచాలని భావిస్తున్నారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని మెదక్ జిల్లా ప్రాంతంలో ప్రస్తుతం 15 బార్లు మాత్రమే ఉండగా.. వాటి సంఖ్యను రెట్టింపు చేసే ఆలోచనలో ఆబ్కారీ శాఖ ఉంది. ఇక మహబూబ్నగర్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 5 నగర పంచాయతీలు ఉండగా.. అక్కడున్న బార్ల సంఖ్య 10 మాత్రమే, మద్యం మాఫియా ఇక్కడ బార్ల ఏర్పాటును అడ్డుకుంటోందన్న ఆరోపణలున్నాయి. -
బ్రాందీ కోసం గాంధీని లేపేశారు