Bride groom
-
యేటి వదినీ... పిల్ల దొరికిందా...
యేటి మంగొదినా పండుగ అయిపొయింది.. మాఘమాసం వచ్చిసింది.. మన రాజేష్ కోసం పిల్లను చూస్తున్నారా లేదా.. యేటి మరి.. ఇంకెన్నాళ్లు ఉంచుతావు.. ఎంత ఉంచితే అంతెక్కువ కట్నం వస్తాదని గట్రా లెక్కేస్తున్నావా యేటి అంది వరలక్ష్మి .. లేదొదినా అదేట్లేదు .. సూత్తన్నాము.. మేము చూసిందాన్ని వాడు నచ్చడం లేదు.. వాడికి నచ్చిందేమో మాకు కుదరడంలేదు.. అన్నిటికి మించి ఇప్పుడు ఆడపిల్లలు కూడా బోలెడు లెక్కలేస్తాన్నారు..అంటూ చెబుతోంది మంగ... 'ఆ నీ నోటికి భయపడి ఎవరూ ఇవ్వడం లేదని చెప్పొచ్చుగా.. లోలోన అనుకుంది వరలక్ష్మి.. అయినా నాకెందుకులే అని ఊరుకుని.. లేదులే వదినా నీకు కోడలు అవ్వాలంటే ఎవరికో బీభత్సంగా రాసిపెట్టి ఉండాలి.. అంటూ కవరింగ్ ఇచ్చింది. వాస్తవానికి మంగమ్మ పేరులోనే అమ్మ ఉందికానీ మనిషి మాత్రం మహంకాళీ అని చుట్టుపక్కల పేరు.. నోరు తెరిస్తే శృతి ఆరున్నరకు చేరుతుంది.. మామూలోళ్ళంతా పరారవ్వాల్సిందే.. ఇప్పటికే పెద్దకోడలు ఈమెకు దండం పెట్టేసి మొగుడు సూర్యనారాయణతో పట్నంలో వేరుకాపురం పెట్టేసింది.. ఇప్పుడు చిన్నోడు రాజేష్ కోసం పిల్లను చూస్తున్నారు. కానీ మంగమ్మ నోటికి జడిసి ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు..మాకేమో కట్నం ప్రసక్తి లేదు.. పిల్ల బాగుంటే చాలు... బుద్ధిమంతురాలైతే ఇంకా మేలు.. అయినా మనం అడిగినా లేకున్నా ఆడపిల్లకు ఇవ్వాల్సినవి వాళ్ళు ఇస్తారు కదా వదినా అంటూ అసలు విషయం చెప్పింది మంగమ్మ. అయినా ఈరోజుల్లో మీలాగా కట్నం వద్దంటున్నవాళ్ళు ఎవరున్నారు.. నువ్వంటే మంచిదానివి కాబట్టి సరిపోయింది అని అంటూనే దీనికి కట్నం వద్దట కానీ డబ్బున్న సంబంధాలే చూస్తోంది అని మనసులోనే బుగ్గలు నొక్కుకుంది వరలక్ష్మి. పోనీ వాడికి ఎవరైనా నచ్చినపిల్ల ఉందేమో చూడలేకపోయావా సలహా ఇచ్చింది వరలక్ష్మి.. ఊరుకో వదినీ.. వాడికేం తెలుసు.. నోట్లో వేలెడితే కొరకలేని అమాయకుడు.. వాడికి నచ్చడం ఏంది... వాడి చెడ్డీలు. బనీన్లు కూడా నేనే కొనాలి.. నా మాటే వాడికి వేదం.. గర్వంగా చెప్పింది.. మంగమ్మ.. ఎంతైనా నువ్వు లక్కీ వదినా.. అటు అన్నయ్యను.. ఇటు పిల్లలను ఆడిస్తున్నావు అనేసింది వరలక్ష్మి.. అదేటి అంతమాట అనేశావు అంది మంగమ్మ.. ఆడించడం అంటే వాళ్లంతా నీ కనుసన్నల్లో ఉంటారు అంటున్నా.. అంటూ కవర్ చేసేసింది వరలక్ష్మి.. మొత్తానికి ఆ చుట్టుపక్కల ఆరేడు మండలాలు.. మూడు నియోజకవర్గాలు కవర్ చేసినా మంగమ్మాకొడుక్కి పిల్ల దొరకలేదు.. పిల్లలు ఉన్నా ఈమె నోటికి జడిసి ఇవ్వడం లేదు. చూసిచూసి ఈవిడకు విసుగొచ్చింది.. అలాగని నోటిని కంట్రోల్ చేసుకుని మంచిగా ఉండడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.. పైగా ఇన్నేళ్ళపాటు గయ్యాళి బ్రాండ్ దక్కించున్న మంగమ్మ ఇప్పటికిప్పుడు అమాయకపు కన్నాంబ పాత్రలోకి మారడం కష్టమే.. అందుకే ఇక ఆమె పెళ్లి విషయాల ప్రస్తావన ఆపేసింది.ఓరోజు తెల్లారేసరికి కార్లో దిగాడు రాజేష్.. పక్కన దండలతో ప్రమీల.. తాను చూస్తున్నది కలయా నిజమా .. తెలీక కాసేపు మంగమ్మ అలాగే కొయ్యలా నిలబడిపోయింది. ఒరేయ్ రాజేష్ ఏందిరా ఇది అని అడిగింది.. అవునమ్మా ఇక నీ నోటి బ్రాండ్ దెబ్బకు నాకు పెళ్లవ్వదని అర్థం ఐంది.. అందుకే ఇదిగో పక్కూరి వజ్రమ్మ కూతుర్ని చేసుకున్నాను.. ప్రమీల నాతోబాటే ఉద్యోగ చేస్తోంది.. అన్నాడు.. వజ్రమ్మ అంటే తనను మించిన నోటి దురుసు.. తనది మండల్ లెవెల్ అయితే ఆమెది జిల్లా లెవెల్.. ఆపిల్లతో తనకొడుకు ఎలా వేగుతాడో అనుకుంటూనే మరి వేరే మార్గం లేక దిష్టి తీసి ఇంట్లోకి పిలిచింది.. సిమ్మాదిరప్పన్న -
అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా..
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని, బ్రహ్మదేవుని నిర్ణయం ప్రకారం ఎవరెవరి ఎప్పుడు, ఎవరితో వివాహం జరగాలో నిశ్చయమవుతుందని అంటారు. ఆలోచిస్తే ఇది కొందవరకూ నిజమేనని అనిపిస్తుంది. హర్యానావాసి అమిత్, ఫ్రాన్స్కు చెందిన సీసెల్ జంటను చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని పల్వాల్ జిల్లాలోని కలువా గ్రామానికి చెందిన అమిత్ నర్వార్(30) ఫ్రాన్స్ యువతి సీసెల్ను వివాహమాడటం ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 12న వీరి వివాహం పాల్వాల్లోని విష్ణు గార్డెన్లో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా విదేశీ వధువును చూసేందుకు ఊరిజనమంతా తరలివచ్చారు. ఈ సందడిలో సదరు విదేశీ యువతి తన భర్త, అత్తామామలతో కలసి నృత్యం చేసి అందరినీ అలరించారు. అమిత్ నర్వార్ ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో 2019లో యోగా టీచర్గా పనిచేసేవారు. ఆ సమయంలో అతని దగ్గర యోగా నేర్చుకునేందుకు ఫ్రాన్స్ నుంచి సీసెల్ మార్లీ వచ్చారు. ఈ కోర్సు రెండు నెలల పాటు సాగింది. ఈ నేపధ్యంలో అమిత్, సీసెల్ ప్రేమలో పడ్డారు. యోగా కోర్సు ముగిసిన అనంతరం సీసెల్ తిరిగి ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఆ తరువాత వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకోసాగారు.ఇదిలా ఉండగా అమిత్ కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం చేయాలనుకున్నారు. అయితే అమిత్ తన ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అమిత్ చేస్తున్న ఉద్యోగాన్ని, ఇంటిని విడిచిపెట్టి 2022లో ఫ్రాన్స్కు వెళ్లారు. అప్పటికే సీసెల్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. డబ్బుకు ఇబ్బంది లేకపోవడంతో అమిత్, సీసెల్ లివ్ ఇన్ రిలేషన్ షిప్లో 2022 నుంచి 2024 వరకు ఉన్నారు. ఇదే సమయంలో సీసెల్ తండ్రి క్యాన్సర్తో మరణించారు. ఆ తర్వాత సీసెల్, అమిత్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలవారికీ చెప్పారు. వారు ఓకే చెప్పడంతో సీసెల్ తమ కుటుంబసభ్యులతో సహా భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 12న అమిత్, సీసెల్ల వివాహం ఘనంగా జరిగింది.ఇది కూడా చదవండి: Vallabhbahi Patel: ‘ఉక్కు మనిషి’ చివరి రోజుల్లో.. -
‘మామయ్యా’ అనే పిలుపు కోసం..
చాలామంది అన్నదమ్ములు తమ సోదరికి జన్మించిన సంతానాన్ని అమితంగా ప్రేమిస్తుంటారు. వారి చేత ‘మామయ్యా..’ అని పిలిపించుకోవాలని తపన పడిపోతుంటారు. అయితే ఈ మెట్లనన్నింటినీ దాటేసిన ఒక మేనమామ తన మేనకోడలికి పెళ్లిలో ఘనమైన కానుకను సమర్పించుకున్నాడు. హర్యానాలోని రేవాడీలో ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు ఇచ్చిన కానుక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన వితంతు సోదరి కుమార్తెకు కానుకగా ఇచ్చేందుకు అతను సోదరి ఇంట్లో రూ.500 నోట్ల కట్టలను కుప్పలుగా పోశాడు. మేనకోడలికి ఖరీదైన కానుకను అందించిన ఆ వ్యక్తి పేరు సత్బీర్. అతను క్రేన్ వ్యాపారి. సత్బీర్ తన మేనకోడలి పెళ్లిలో ఆమెకు విలువైన నగలు కూడా బహూకరించాడు. సత్బీర్ మొత్తంగా ఒక కోటి, ఒక లక్షా పదకొండు వేల నూటొక్క రూపాయలను పెళ్లి కుమార్తెకు కానుగా ఇచ్చాడు. ఈ ఘటనలో నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసిన యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసల్వాస్ రేవారి.. ఇది జైపూర్-ఢిల్లీ హైవేకి ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఈ ప్రాంతానికి చెందిన సత్బీర్ సోదరి వివాహం సిందర్పూర్లో జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి ఆమె భర్త మృతి చెందాడు. సత్బీర్ సోదరికి ఒక కుమార్తె ఉంది. తన మేనకోడలి పెళ్లి సందర్భంగా సత్బీర్ తన ఊరి ప్రజలతోపాటు తన సోదరి ఇంటికి చేరుకున్నాడు. పెళ్లిలో సత్బీర్ తన మేనకోడలికి ఇచ్చిన కానుకను చూసి స్థానికులు ఆశ్యర్యపోయారు. ఈ సంద్భంగా సోదరి ఇంటిని సత్బీర్ రూ.500 నోట్ల కట్టలతో నింపేశాడు. కోటి రూపాయలకుపైగా మొత్తాన్ని తన మేనకోడలికి బహూకరించాడు. ఇది కూడా చదవండి: ఆ గనిలో మహిళలకే పని.. కారణమిదే! भाई ने विधवा बहन के घर लगा दिया रुपयों का ढेर, करोड़ों का भात बना चर्चा का विषय#rewari #haryana #bhaat pic.twitter.com/SYi95UEREl — Punjab Kesari Haryana (@HaryanaKesari) November 27, 2023 -
పెళ్లింట విషాదం.. పెళ్లైన తెల్లారే ఇలా..
సాక్షి, సిద్దిపేట: పెళ్లి కట్టిన తోరణాలు వాడనే లేదు.. వివాహానికి వచ్చిన బంధువులు వెళ్లనే లేదు. అంతలోనే పెళ్లింట విషాదం నెలకొంది. వరుడు అకాల మరణం పొందాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే.. వరుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగిన మరుసటి రోజే విద్యుత్ షాక్తో వరుడు మృతి చెందాడు. వెంకటాపూర్కు చెందిన నిరంజన్ సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా సిద్దిపేట పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, నిరంజన్కు సోమవారం పెళ్లి రిసెప్షన్ జరగాల్సి ఉంది. కాగా, సోమవారం ఉదయం తాను ఉంటున్న ఇంటి వద్ద రిసెప్షన్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో లైటింగ్ తీగలు తగిలి కరెంట్ షాక్తో నిరంజన్ మృతిచెందాడు. దీంతో, ఎంతో ఆనందంగా ఉన్న పెళ్లింట విషాదం నెలకొనడంలో కుటంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. జీవితాంతం తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త అకాల మరణంతో వధువు బోరున విలపిస్తోంది. ఇది కూడా చదవండి: తీవ్ర విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు.. -
నెల క్రితం పెళ్లి.. శ్మశానవాటికి సమీపంలోకి వెళ్లి
అన్నానగర్(చెన్నై): తిరువారూర్ జిల్లా ముత్తుప్పేట సమీపంలోని కోవిలూరు శ్మశాన వాటిక సమీపంలో సోమవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకుని యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రజలు ముత్తుపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుతురపూండి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు జరిపిన విచారణలో అతను ముత్తుపేట సమీపంలోని కోవిలూరు ఉత్తర అటవీ ప్రాంతానికి చెందిన మణికంఠన్ కుమారుడు సంతోష్ (20) అని తేలింది. మంగళూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. పెళ్లికి నిరాకరించడంతో యువతి ముత్తుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి రాజీ చేసి నెల క్రితం పెళ్లి చేశారు. ఈ క్రమంలో అతను సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే..
జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్లయిన వారిని సెటిల్ అయ్యారని కూడా అంటుంటారు. అయితే పెళ్లి విషయంలో వివిధ దేశాల్లో పలు రకాలైన సంప్రదాయాలున్నాయి. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకలు రోజుల తరబడి కూడా జరుగుతుంటాయి. అయితే ఆ దేశంలో పెళ్లి వేడుక అన్ని ప్రాంతాలకన్నా భిన్నంగా జరుగుతుంది. అక్కడ యువకులు ఒక్కరోజు కోసం పెళ్లికొడుకులుగా మారతారు. అమ్మాయి కూడా ఒక్కరోజు కోసం వధువుగా మారుతుంది. ఇంతకీ ఇలాంటి వింత వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? పూర్తి వివరాలు.. ఇటువంటి వింత వివాహం చైనాలో జరుగుతుంది. ఇటీవలి కాలంలో చైనాలో వింత వివాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇటువంటి విధానం లేదు. తాజాగా ఒక్కరోజు కోసమే ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లేమీ జరగవు. సాదాసీదాగా, రహస్యంగా ఈ వివాహాలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా చైనాలో ఇటువంటి వివాహాల తంతు పెరిగిపోయింది. ఈమధ్య కాలంలొ చైనాలలోని యువకులకు వివాహం జరగడం అత్యంత కష్టదాయకంగా మారింది. పెళ్లికి అత్యధికంగా సొమ్ము ఖర్చుపెట్టాల్సి రావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చైనాలో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీనిని అధిగమించేందుకే యువకులు ఒకరోజు పెళ్లికి సిద్దం అవుతున్నారు. తద్వారా తమ బ్రహ్మచర్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలోనైతే ఎవరైనా వ్యక్తి పెళ్లికాకుండా మరణిస్తే, ఆ మృతదేహానికి వివాహం జరిపిస్తారు. ఇటీవలి కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లిపేరట భారీ వ్యాపారం జరుగుతోంది. పెళ్లికాని యువకులకు ఒక్క రోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఇలాంటి ఒక్కరోజు వధువులకు కూడా చైనాలో డిమాండ్ పెరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి.. -
పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన పాపులర్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీలో ఒక మహిళ తన వివాహంలో జరిగిన పెద్ద పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. పెళ్ళిలో తన భర్త సంతకం చెయ్యాల్సిన చోట మామగారు సంతకం పెట్టడంతో మామగారితోనే వివాహమైనట్టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వారు సర్టిఫికెట్ ఇచ్చారని, ప్రస్తుతం తనకు ఇద్దరు భర్తలని చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియా ప్రఖ్యాత బ్రేక్ ఫాస్ట్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీ కార్యక్రమంలో ఆరోజు ఫోన్ చేసిన వారందరినీ తమ జీవితంలో జరిగిన పేద పొరపాట్లగురించి చెప్పమని అడిగారు వ్యాఖ్యాత. దీంతో కిమ్ అనే ఒక మహిళ తాన్ పెళ్ళిలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. నా పెళ్ళికి సాక్షులుగా సంతకం చేయడానికి మా మామగారు అత్తగారు తప్ప ఇంకెవ్వరూ లేరు. సరిగ్గా పెళ్లి సమయానికి మా అత్తగారు మామగారితో పాటు సాక్షి సంతకం చెయ్యమని నా భర్తను కోరారు. దీంతో వారిద్దరూ ఒకే లైన్ సంతకం చేశారు. తీరా సర్టిఫికెట్లో చూస్తే వధువు అని ఉన్న చోట నా సంతకం ఉంటే వరుడు అని ఉన్నచోట మాత్రం నా భర్తతో పాటు మా మామగారి పేరు కూడా ఉంది. ఆ సర్టిఫికెట్ ను ఇంకా మార్చకుండా అలాగే భద్రం చేసుకున్నానని తెలిపింది. ఇది కూడా చదవండి: కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..? -
భారీ వర్షాలు.. మండపానికి వెళ్లలేని పరిస్థితి.. ఆ ఐడియాతో వాళ్ల పెళ్లి జరిగిపోయింది!
పెళ్లి అంటే జీవితంలో ముఖ్యమైన రోజు. మరిచిపోలేని రోజు కూడా. అందుకే బంధువులు, స్నేహితులు, అతిథుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకుంటారు. కొందరు విమానంలో, పడవలో, చివరకు నీటి అడుగున ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు తమ వివాహాలను ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు.. కొందరి వివాహాలు మాత్రం తాము అనుకున్నట్లు కాకుండా పరిస్థితులు బట్టి మరోలా జరుగుతున్నాయి. తాజాగా ఓ జంట పెళ్లి మండపంలో కాకుండా ఆన్లైన్లో చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఉత్తర భారతంలో భారీ వర్షాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ రోడ్లు స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ జంట మండపానికి వెళ్లడం కుదరలేదు. వేదమంత్రాలు, పెద్దల ఆశీస్సులతో పెళ్లి పీటలు ఎక్కాలని భావించిన ఓ జంటకు అనూహ్యంగా ప్రకృతి అడ్డుతగిలింది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కటి కావడానికి ఇవేవీ అడ్డంకి కాబోవని ఆ దంపతులు భావించారు. అందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించారు. వీడియో కాన్ఫరెన్స్లో వారి వివాహం జరుగుతోందని అందరికీ తెలియజేసి, పెళ్లికి సంబంధించిన ఆన్లైన్ లింక్ను అందరికీ పంపారు. అనంతరం వారి పెళ్లిని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ ఆన్లైన్ వెడ్డింగ్లో ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని ఆ నవ దంపతులకు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. పెద్దలు నిర్ణయించిన సరైన సమయానికి ఆన్లైన్లో పెళ్లి చేసుకుని తమ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చదవండి: లైకులు, కామెంట్ల కోసం చావు వార్తని సోషల్ మీడియాలో.. -
వైరల్ వీడియో: పెళ్లిలో ట్విస్ట్ ఇచ్చిన వరుడు.. చెట్టుకు కట్టేసి..
ప్రతాప్గఢ్: కాసేపట్లో వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యేవారు. ఇంతలో వరుడి మదిలో మెదిలిన ఓ ఆలోచనే అతడిని చిక్కుల్లో పడేసింది. దీంతో, వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులందరూ బందీలు మారారు. వరుడిని చెట్టుకి కాట్టేశారు వధువు తరఫు బంధువులు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. ప్రతాప్గఢ్లోని మంధాతా కొత్వాలి ప్రాంతానికి చెందిన ఇద్దరికి వివాహం నిశ్చయించారు ఇరు కుటుంబా సభ్యులు. దీంతో, పెళ్లి వేడుక ప్రారంభమైంది. వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వేడుకకు బంధువులంతా తరలివచ్చారు. కొద్ది క్షణాల్లో వధువు మెడలో జయమాల వేసే సమయం ఆసన్నమైంది. అంతలోనే పెళ్లి కొడుకు అదనపు కట్నం డిమాండ్ చేశాడు. దీంతో, వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం, అదనపు కట్నం విషయంలో ఎంతసేపు వరుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నాడు. వరుడి కుటుంబ సభ్యులు కూడా అతడివైపు మొగ్గుచూపారు. దీంతో, విసుగెత్తిన వధువు కుటుంబ సభ్యులు.. ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేశారు. అనంతరం, వరుడిని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వరుడు మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని వధువు తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. इस लइका का जयमाल हो गया था .. उसके बाद परिजन दहेज की डिमांड करने लगे। जिसके बाद लड़की के परिजन ने दूल्हे साहेब को पेड़ से बांध दिया। वीडियो यूपी के प्रतापगढ़ से है ।। pic.twitter.com/obOG9BpLMB — हम लोग We The People (@ajaychauhan41) June 15, 2023 ఇది కూడా చదవండి: చిన్న వర్షానికే వందే భారత్ రైలులో వర్షపు నీరు లీక్.. వీడియో వైరల్ -
గుర్రం మీద రావాల్సిన వరుడు అలా వచ్చేసరికి...
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఒక విచిత్ర వివాహం సర్వత్రా చర్చాంశనీయంగా మారింది. వరుడు కల్యాణమండపానికి ప్రత్యేక రీతిలో వచ్చిన విధానం అందరినీ ఆకర్షించింది. దీనిని చూసినవారంతా పెళ్లికొడుకును అభినందించలేకుండా ఉండలేకపోయారు. చక్కగా అలంకరించిన కారులోనే లేదా గుర్రం మీదనో నూతన వరుడు కల్యాణమండపానికి చేరుకోవడాన్ని చూసేవుంటాం. వీటికి భిన్నంగా ఏ వరుడైనా ప్రవర్తిస్తే అందరూ అతనిని వింతగా చూస్తారు. ఇటువంటి ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. వరుడు తనదైన ప్రత్యేక రీతిలో వధువు ఇంటికి తన బంధుబలగంతో సహా చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటాలని భావిస్తూ వాధ్వానీ కుటుంబం ఈ వినూత్న ప్రయోగం చేసింది. ఇందుకోసం వారు సైకిళ్లను వినియోగించారు. కుటుంబ సభ్యులు కూడా.. వరునితో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులంతా సైకిళ్లపై ఊరేగింపుగా కల్యాణమండపానికి చేరుకున్నారు. ఈ ఊరేగింపు ఇండోర్లోని లాల్బాగ్ గార్డెన్ నుంచి ఖాల్సా గార్డెన్ ఖాతీవాలా ట్యాంక్ వరకూ సాగింది. దీనికి వారు ‘మినీ బారాత్’ అనే పేరుపెట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తేజాజీ నగర్ పరిధిలోని లింబూదీలో ఉంటున్న అన్మోల్ వాద్వానీకి ఇండోర్లోని డింపుల్తో జూన్ 11న వివాహం నిశ్చయమయ్యింది. తన వివాహ వేడుక ఎప్పటికీ గుర్తుండిపోవాలని, అందరికీ స్ఫూర్తినివ్వాలనే తన ఉద్దేశాన్ని వరుడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీనికి వారు సమ్మతించడంతో వారంతా సైకిళ్లపై ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నారు. పర్యావరణ హితం కోరుతూ వారంతా ఈ నిర్ణయానికి మద్దతు పలికారు. వీరిని చూసిన స్థానికులు నూతన వరుడిని అభినందనలతో ముంచెత్తారు. కాగా వరునితోపాటు అతని తరపువారంతా సైకిళ్లపై ఊరేగింపుగా రావడంతో ఆడపెళ్లివారు మొదట ఆశ్చర్యపోయినా, తరువాత వారి సదుద్దేశాన్ని తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్! -
భోజనం చేస్తుండగా.. వధూవరులు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు!
అన్నానగర్(చెన్నై): తిరువారూరు జిల్లా కొత్తూరులో నూతన దంపతులు చేసిన నృత్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొత్తూరుకు చెందిన శేఖర్, కొలంజి దంపతుల కుమారుడు విజయ్కి కడలూరు జిల్లా చిదంబరానికి చెందిన వల్లియన్ –మలర్ దంపతుల కుమార్తె హంసవల్లికి గురువారం అక్కరైకోటలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో పెళ్లి జరిగింది. అనంతరం వరుడి ఇంట్లో అతిథులకు భోజనం వడ్డించారు. వారు భోజనం చేస్తుండగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ నృత్యం చేయడం ప్రారంభించారు. ఈ వీడియోను వరుడు విజయ్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. చదవండి: అయితే నీతులు చెప్తారు, లేదా తప్పుని కప్పిపుచ్చు కోవడానికి కథలు చెప్తారు... -
వధువు పరార్... 13 రోజులు పెళ్లి దుస్తులతో వేచివున్న వరుడు.. ఎట్టకేలకు ఏమయ్యిందంటే..
మన దేశంలో పెళ్లిళ్లు ఎంతో వేడుకగా జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లిళ్లలో ఒక్కోసారి అనుకోని ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అటువంటి ఊహకందని ఉదంతం రాజస్థాన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్ కుమార్తో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి వేడుకలో భాగంగా వరుని తరుపు వారంతా మే 3న పెళ్లికుమార్తె ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. వారికి పెళ్లి కుమార్తె తరుపువారు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. మే 4న ఉదయం వివాహ తంతులో భాగంగా మండపంలోకి పెళ్లి కుమార్తెను తీసుకురావాలని పురోహితుడు కోరాడు. అయితే ఇందుకోసం కొద్దిసేపు వెయిట్ చేయాలని పెళ్లి కుమార్తె తరపువారు చెప్పారు. పెళ్లికుమార్తె మనీషా తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న ఒక బంధువుతోపాటు ఆక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా హడలిపోయారు. ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లి ముస్తాబు చేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందని, తరువాత కడుపు నొప్పి వస్తున్నదని చెప్పి టాయిలెట్కు వెళ్లిందన్నారు. తరువాత తన మామ కుమారుడు భరత్కుమర్తో బయటకు వెళ్లిపోయిందన్నారు. కాగా బంధువులు ఎంత నచ్చచెప్పినా ఆమె ఈ వివాహానికి ఒప్పుకోలేదు. ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది. అయితే ఆమెపై అమితమైన ప్రేమ కలిగిన వరుడు.. పెళ్లి అలంకరణలో భాగంగా తాను ధరించిన పగడీ కూడా తీయకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతవరకూ పెళ్లి మండపాన్ని అలంకరణతోనే ఉంచారు. అయితే ఎట్టకేలకు బంధువులంతా ఒప్పించి పెళ్లి కుమార్తెను మే 15న కల్యాణ మండపానికి తీసుకురాగలిగారు. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
నిశ్చితార్ధం చెడగొట్టి ఆమెతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ముహుర్తం టైమ్కి..
సాక్షి, సంగారెడ్డి: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పి ఎంతో కష్టం మీద పెళ్లికి ఒప్పించారు. తీరా.. పెళ్లి సమయానికి వరుడు వివాహ వేడుక నుంచి పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కాగా, వరుడు వెళ్లిపోడానికి కారణం తెలిసి అక్కడున్న వారంత ఖంగుతిన్నారు. ఈ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అతనికి తమ కూతురుని ఇవ్వడానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాకుండా.. ఈ ఏడాది జనవరిలో ఇదే జిల్లా కంగ్టి మండలానికి చెందిన ఓ యువకుడితో అమ్మాయికి నిశ్చితార్థం జరిపించారు. ఇక, తన లవర్ పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియుడు రంగంలోకి దిగాడు. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తికి ఫోన్ చేసి తాను యువతిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. దీంతో, ఈ విషయాన్ని పెళ్లి కూతురు పేరెంట్స్ చెప్పి అతను పెళ్లికి నిరాకరించాడు. దీంతో, వధువు పేరెంట్స్ చేసేదేమీ లేక.. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకున్నారు. అనంతరం, పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కొండాపూర్ మండలంలోని ఒక గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే, పెళ్లికి కొద్ది గంటలే సమయం ఉందనగా వరుడు ప్లేట్ ఫిరాయించాడు. తనకు కట్నంగా రూ.15 లక్షలు ఇస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చున్నాడు. దీంతో, అంత ఇవ్వలేమని రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అనంతరం.. అందరి కళ్లుగప్పి పెళ్లి పీటలపై నుంచే పరారయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా, ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధిత వధువు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్పూర్ మధ్య.. వందేభారత్ -
వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి!
లక్నో: పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే వేడుక. అయితే ఇటీవల చూస్తే.. పీటల వరకు వచ్చిన వివాహాలు ఏదో ఒక కారణంగా ఆగిపోతున్నాయి. తాజాగా ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దని వరుడుకి షాకిచ్చింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంటూ తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి జిల్లాలో చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరివురి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం వరుడు అతని బంధువులు ఊరేగింపుగా పెళ్లి మండపంలోకి చేరుకున్నారు. కాసేపటి తర్వాత వరడు, వధువు ఇద్దరూ కలిసి వేదికపైకి వెళ్లారు. పెళ్లి తతంగాలు మొదలు పెట్టారు ఇరువైపు బంధువులు. ఈ క్రమంలో వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో మద్యం సేవించిన వరుడి స్నేహితులు పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేస్తూ గోల చేశారు. దీంతో స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. వారితో పాటు వరుడు కూడా వింత పనులు చేస్తూన్నాడు. మాల వేస్తుండగా వరుడు మద్యం సేవించాడని వధువు గమనించింది. కోపంతో స్టేజి దిగి నేరుగా తన గదిలోకి పెళ్లికి నిరాకరించింది. కుటుంబ పెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలిపాయి. చదవండి: భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా బెంగళూరు మహానగరపాలక సంస్థ రిపోర్టు -
పెళ్లి చేసుకోవాలిని ఒత్తిడి.. మండపంలో విషం తాగిన వధూవరులు
భోపాల్: పెళ్లి చేసుకుని నూరేళ్లు కలిసి జీవించాల్సిన వధూవరులు విషం తాగి అర్థాంతరంగా తమ జీవితాన్ని ముగించాలనుకున్నారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా, పెళ్లికుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో పెళ్లి జరుగుతోంది. అయితే వివాహం సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగి ఈ విషయాన్ని వధువుకు తెలియజేశాడు. వరుడు విషం సేవించాడని తెలిసిన వెంటనే వధువు కూడా తాగింది. వధూవరుల బంధువుల వారిద్దరినీ హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు వరుడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. వధువు పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా తన పెళ్లి చేసుకోవాలని వధువు ఒత్తిడి చేస్తోందని వరుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కెరీర్ దృష్ట్యా తమ పెళ్లికి రెండేళ్లు గడువు కావాలని కోరడంతో యువతి వినక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి జరుగుతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు! -
పెళ్లి మండపానికి వరుడు రాలేదని.. ఊహించని షాకిచ్చిన వధువు!
ఇటీవల పెళ్లి మండపాలలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ వరుడు తన పెళ్లి సంగతిని కూడా మరిచిపోయి మండపానికి వెళ్లలేదు. ఇక వరుడి రాక కోసం వేచి చూసి విసుగుచెందిన వధువు అతనికి ఊహించని షాకిచ్చింది. ఈ వింత ఘటన బీహార్లోని భాగల్పూర్లోని సుల్తాన్గంజ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వరుడు తన పెళ్లి రోజు ఆనందంతో ఫుల్గా మందు తాగి ఆ మత్తులో మండపానికి వెళ్లాలన్న విషయాన్ని మరచి నిద్రపోయాడు. ఇరువర్గాల కుటుంబ సభ్యులు వివాహ వేదిక వద్ద వరుడి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎంత సేపు ఎదురుచూసిన అతను రాలేదు. వివాహం మరుసటి నాడు స్పృహలోకి రావడంతో వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే వరుడు నిర్లక్ష్యపు ధోరణి చూసిన ఆమెకు చిరాకు వచ్చింది. ఈ పెళ్లికి నిరాకరించింది. తన బాధ్యతలను కూడా సరిగా అర్థం చేసుకోని వ్యక్తితో తన జీవితాన్ని గడపలేనని తెగేసి చెప్పింది. దీంతో వాయిద్యాలు, డీజే సౌండ్లు హోరెత్తాల్సిన మండపం కాస్త సైలెంట్గా మారిపోయింది. పెళ్లి ఏర్పాట్లకు ఖర్చు చేసిన డబ్బును వరుడి కుటుంబీకులు తిరిగి ఇవ్వాలని వధువు కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వరుడి బంధువులు కొందరిని బందీలుగా చేయడంతో అక్కడి పరిస్థితి విషమించింది. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు. చివరికి ఈ కేసు సద్దుమణిగినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో.. ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ జిల్లాలోని తిర్వా కొత్వాలి ప్రాంతంలో వధువుకు 12వ తరగతి మార్కులు సరిపోవని భావించిన వరుడు తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. -
మండపంలోనే బోరున ఏడ్చేసిన వధూవరులు.. వీడియో వైరల్!
పెళ్లి.. పేరుకి రెండు అక్షరాలైన దీని బంధం మాత్రం నూరేళ్లు ఉంటుంది. వివాహం ద్వారా ఇద్దరు వ్యక్తులు.. మూడు ముళ్ల బంధంతో.. నలుగురి సమక్షంలో ఒకటై జీవితాంతం జీవిస్తారు. అందుకే జీవితంలో ఇదొక మధురమైన క్షణంగా భావిస్తుంటారు. అంతటి ప్రత్యేక రోజు కనుకే పెళ్లి మండపంలో ఆనందంతో పాటు కాస్త హడావుడి, కాస్త గందరగోళం వాతావరణం ఉంటుంది. ఇటీవల వివాహ వేదికలపై ఏదో ఒక వింత ఘటనలు జరగడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ పెళ్లి వేదికపై మరో వింత ఘటన చోటు చేసుకుంది. ఒకటే ఏడుపు... పెళ్లంటేనే సందడి. బంధు మిత్రుల హడావుడి, మర్యాదలు, ఆత్మీయుల కలయికలు ఇలాంటి వాటితో అక్కడ వాతావరణమంతా పండుగను తలపిస్తుంది. వధూవరుల తరపు కుటుంబ సభ్యులకు ఈ సమయంలో వారి ఆనందాన్ని అవధులు ఉండవు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మాంగళ్య ధారణ జరిగే సమాయానికి వధూవరులు కుటుంబసభ్యుల కళ్లలో ఆనందాన్ని కన్నీళ్ల రూపంలో బయటపెడుతుంటారు. ఇటీవల ఓ పెళ్లిలో.. వధూవరులు ఇద్దరూ వేదికపైనే ఏడ్వడం ప్రారంభించారు. వారిద్దరూ కలిసి ఒకటై జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అనే ఆనందం కాస్త కన్నీళ్లుగా మారి బయటపడ్డాయి. ఇద్దరు ఒకరి నొకరు చూసుకుంటూ ఏడ్వడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనంతటిని వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. రిసెప్షన్ వేదికపై ఉండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. View this post on Instagram A post shared by 𝗪𝗲𝗱𝗱𝗶𝗻𝗴_𝗰𝗼𝘂𝗽𝗹𝗲❤ (@wedding_couple_photography_20) -
ఇదేందయ్యా ఇది.. వరుడికి డిఫరెంట్గా స్వాగతం పలికిన అత్తామామ!
పెళ్లి వేడుక అనగానే కుటుంబ సభ్యులు, బంధువులతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఇక, వివాహ వేడుకలో వరుడు ఎంట్రీ ఏ రేంజ్లో ఉంటుందో సోషల్ మీడియాలో చాలా వీడియోలే చూసి ఉంటారు. కానీ.. వీరి పెళ్లిలో వరుడికి దక్కిన అరుదైన ఎంట్రీ చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వరుడికి సిగరెట్ వెలిగించి పెండ్లి వేడుకకు వధువు తల్లితండ్రులు ఆహ్వానిస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. కాగా, ఈ వీడియోలో వరుడు కూర్చుని ఉండగా అత్తా మామలు అతడికి సిగరెట్ అందించి వారే వెలిగించడం కనిపిస్తుంది. పెళ్లి వేడుకకు పెండ్లి కొడుకును స్వీట్లు, బీడీ, పాన్తో అత్తగారు స్వాగతిస్తారు. ఇక, ఈ వీడియోను పెళ్లికి హాజరైన జుహీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, తమ ప్రాంతంలోని ఆచారం కోసమే వరుడు, వధువు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. వరుడు సిగరెట్ తాగలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ ఆచారం దక్షిణ గుజరాత్లోని కొన్ని గ్రామాలు, బీహార్, ఒడిషాలోనూ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేం ఆచారంరా బాబు అంటూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. View this post on Instagram A post shared by Joohi K Patel (@joohiie) -
Crime: వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ, అంతలోనే..
క్రైమ్: పెళ్లి సంబురంలో ఉన్న ఆ వరుడికి ఒక్కసారిగా షాక్ తగిలింది. మెడలో కరెన్సీ నోట్ల దండతో గుర్రమెక్కి ఊరేగాలనుకుంటే.. ఆ ఫీట్ బెడిసి కొట్టింది. రయ్మని దూసుకొచ్చిన ఓ కుర్రాడు.. ఆ నోట్ల దండతో ఉడాయించాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఢిల్లీ మాయాపూరి ప్రాంతంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సరాసరి ఆ పెళ్లి బృందం నేరుగా పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల సాయంతో బృందాలను పంపించి.. సాయంత్రంకల్లా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని 14 ఏళ్ల కుర్రాడికి గుర్తించారు. చోరీకి ముందు ఆ దండలో మొత్తం 329 నోట్లు ఉన్నాయట. అయితే.. పోలీసులు మాత్రం 500 నోట్లు 79 మాత్రమే రికవరీ చేయగలిగారు. -
ఆదిలాబాద్: కుప్పకూలిన పెళ్లి కొడుకు.. కన్నుమూత!
సాక్షి, ఆదిలాబాద్: మరి కొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. కానీ, విధి ఆ యువకుడి జీవితంతో ఆడుకుంది. కాళ్లకు రాసిన పారాణి ఆరిపోక ముందే అర్ధాంతంరంగా అతని జీవితం ముగిసిపోయింది. రెండు వైపులా కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఉట్నూరుకి చెందిన సత్యనారాయణకు(34), జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ఓ యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నెల 27న అతని వివాహం జరగాల్సి ఉంది. ఆ ఇంటికి పెద్ద కొడుకు కావడంతో పెళ్లి వేడుకలు ఘనంగా చేయాలని భావించారు. సత్యనారాయణే.. తన పెళ్లి పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి దాకా పనులు చేస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. ఆపై అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం అతను కన్నుమూసినట్లు తెలుస్తోంది. కార్డియాక్ అరెస్ట్తోనే సత్యనారాయణ కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే సత్యనారాయణ.. అదీ వివాహనికి కొద్ది గంటల ముందే కన్నుమూయడంతో ఆ ఊరు ఊరంతా విషాదంలో కూరుకుపోయింది. -
AP: లవ్ ఇన్ సింగపూర్.. మధురవాడలో పెళ్లి!
మధురవాడ(భీమిలి): వారి భాషలు.. మతాలే కాదు.. దేశాలు కూడా వేర్వేరు. అయినా వారి ప్రేమకు అవేమీ అడ్డుకాలేదు. సింగపూర్లో వారి పరిచయం ప్రేమగా మారగా.. మధురవాడలోని ఎంవీవీ సిటీలో పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. మధురవాడలో స్థిరపడ్డ పెండిమి శ్రీనివాస్, ఫిలిప్పీన్స్కు చెందిన జమేలాహ్ వివాహం గురువారం హిందూ సంప్రదాయ పద్ధతిలో అంగరంగవైభవంగా జరిగింది. నగరంలోని శాలిపేటకు చెందిన శ్రీనివాస్ విశాఖ బుల్లయ్య కళాశాలలో డిగ్రీ పూర్తి తర్వాత పుణెలో ఎంబీఏ చదివారు. ఉద్యోగరీత్యా ఏడేళ్ల కిందట సింగపూర్ వెళ్లి అక్కడ హెచ్పీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. సింగపూర్లోనే శాప్(సిస్టమ్ అప్లికేషన్ ప్రొవైడర్)లో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్కు చెందిన జమేలాహ్తో 4 ఏళ్ల కిందట పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించారు. మన దేశంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో మధురవాడలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా.. వీరిద్దరికీ కెనడాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. త్వరలోనే కెనడా వెళ్లనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. -
ఆ ఆటోడ్రైవర్ నిజాయితీకి ఫిదా.. ఏకంగా మనువాడింది
అతనొక ఆటోడ్రైవర్. అయినా ఆమె అతన్ని అర్థం చేసుకుని ఇష్టపడింది. అతని నిజాయితీ ఆమెను బాగా ఆకర్షించింది. స్వదేశీ-విదేశీ అభ్యంతరాలు, ఆస్తిపాస్తుల అంతరాల్ని పక్కన పెట్టింది. మనసులో మాట బయటపెట్టి.. అతన్ని ఒప్పించింది. ఐదేళ్లుగా వాళ్ల ప్రేమ ప్రయాణం సాగింది. డేటింగ్ పేరుతో ఎక్కడ మోసం చేస్తుందేమోనని ఆ కుర్రాడి కుటుంబం కంగారు పడింది. దేశం కానీ దేశం నుంచి అల్లుడు అనేసరికి ఆమె తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. కానీ, వాళ్ల ప్రేమ కొనసాగింది. చివరికి.. మనసైన వాడిని అతని సంప్రదాయ పద్ధతుల్లోనే వివాహం ఆడింది. బెల్జియంకు చెందిన కెమిల్ తన కుటుంబం పాటు ఐదేళ్ల కిందట కర్ణాటక విజయనగర జిల్లా హంపికి టూర్ మీద వచ్చింది. ఆ సమయంలో హంపి జనతా ప్లాట్కు చెందిన ఆటోడ్రైవర్ అయిన అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఇక్కడ ఉన్నన్నిరోజులు వాళ్ల గైడ్గా ఉన్నాడు రాజు. ఎక్కడా మోసం చేయకుండా ప్రయాణికులతో, విదేశీయులతో అతను వ్యవహరించిన తీరు, నిజాయితీ ఆమెను విపరీతంగా ఆకర్షించాయి. పైగా తనకు వచ్చే సంపాదనలో అతను కొంత దానం చేస్తున్నాడని తెలిసి.. ఆ మంచి మనసును ఇష్టపడిందామె. ఈ క్రమంలో అతన్ని ప్రేమిస్తున్నట్లు తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. మొదట ఆలోచనలో పడ్డా.. కూతురి సంతోషం కోసం వాళ్లు అంగీకరించారు. పెద్దల సమక్షంలోనే ఆమె అతనికి ప్రపోజ్ చేసింది. తన ఇంట్లో వాళ్లను అడిగి.. ఆమె ప్రేమకు అంగీకారం తెలిపాడతను. అలా.. వాళ్ల ప్రేమ.. పెద్లల సమక్షంలోనే పెరిగి పెద్దైంది. అయితే.. కరోనా సమయంలో వాళ్ల వివాహం జరగాల్సి ఉంది. బెల్జియంలో గ్రాండ్గా పెళ్లి ప్లాన్ చేశారు ఆమె తల్లిదండ్రులు. ఈలోపు.. కరోనా పరిణామాలతో ఆ పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కెమిల్ బెల్జియంలో సామాజిక వేత్త. ఈ గ్యాప్లో వాళ్ల బంధం మరింత బలపడింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా రాజునే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. చివరికి వాళ్ల ఇంట్లో వాళ్లు.. రాజు తల్లిదండ్రులతో మరోసారి పెళ్లి సంప్రదింపులు మొదలుపెట్టారు. చివరికి.. భారత్లోనే పెళ్లి బాజాలు మొగాయి. ఇవాళ(శుక్రవారం 25-11-2022) హంపీ విరూపాక్షేశ్వర ఆలయంలో పెద్దలు, బంధు మిత్రుల నడుమ ఘనంగా వివాహం జరిగింది. హంపీకి చెందిన అంజీనప్ప కుమారుడు అనంతరాజుకి, బెల్జియంకు చెందిన జీప్ పిలిఫ్ మూడవ కుమార్తె కెమిల్ ఏడగుడులతో ఒక్కటవ్వడం స్థానికంగా ఆకట్టుకుంది. -
40 రోజుల్లో 32 లక్షల వివాహాలు.. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా!
పెళ్లి.. ఇది రెండక్షరాలే, కానీ ఇద్దరు వ్యక్తులు ఒక్కటై జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దీని విశిష్టత ఇప్పటికీ అలానే ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో మాత్రం గతంతో పోలిస్తే చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. గతంలో వివాహాలు వరుడు లేదా వధువు ఇళ్లలో జరిగేవి, లేదంటే వారి ప్రాంతానికే పరిమితంగా ఉండేవి. అయితే మారుతున్న ట్రెండ్, డబ్బు సంపాదన పెరగడంతో ప్రతి ఒక్కరూ వివాహాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరిగే లక్షలాది జంటల వివాహ వేడుకల సందడి దేశ వ్యాపార లావాదేవీలకు మరింత ఊపు ఇవ్వనున్నాయి. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వరకు దేశ వ్యాప్తంగా 32లక్షల వివాహాలు, వాటి ద్వారా సుమారు రూ.3.75లక్షల కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. సీఏఐటి.. దేశవ్యాప్తంగా 4,302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో 35 నగరాల పరిధిలో కెయిట్ అనుబంధ రీసెర్చ్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఈ సీజన్లో కేవలం ఢిల్లీలోనే 3.5 లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని, దీని వల్ల ఢిల్లీలోనే దాదాపు ₹75,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని (సీఏఐటి)CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపు 25 లక్షల వివాహాలు, ₹3 లక్షల కోట్లు ఖర్చు అయినట్టు అంచనా. మొత్తంగా ఈ పెళ్లిళ్ల సీజన్లో, మార్కెట్లలో పెళ్లి కొనుగోళ్ల ద్వారా దాదాపు ₹3.75 లక్షల కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ తదుపరి దశ జనవరి 14 నుంచి ప్రారంభమై జూలై వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. As per the latest survey conducted by the research wing of CAIT, about 32 lakh weddings will be solemnised between 4th Nov- 14th Dec 2022. Estimated business flow in this period is likely to be 3.75 lakh crore. About 75000 crore business expected in Delhi alone: @praveendel pic.twitter.com/dxJv4JPw0q — Confederation of All India Traders (CAIT) (@CAITIndia) November 7, 2022 చదవండి: ‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ! -
మార్కెట్లో పెళ్లి కొడుకుల విక్రయం.. ఎక్కడో కాదు మన దేశంలోనే!
పట్నా: పెళ్లైన కొత్తలో మూవీలో హైటెక్ మ్యారేజ్ బ్యూరో పేరుతో సునీల్ పెళ్లికొడుకులను విక్రయానికి పెడతాడు. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసినట్లు పెళ్లి కొడుకులను కొనుగోలు చేయటం వింటే వింతగా ఉంది కదా?. అయితే.. అలాంటి మార్కెట్ ఒకటి నిజ జీవితంలో ఉందని మీకు తెలుసా? బిహార్లోని మధుబని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలోని చెట్ల కిందే ప్రతిఏటా 9 రోజుల పాటు ఈ పెళ్లి కొడుకుల విక్రయాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం సుమారు 700 ఏళ్ల నుంచి వస్తున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు తమ కుమార్తెలను తీసుకుని ఈ మార్కెట్కు వస్తారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ మార్కెట్లో వేల మంది పెళ్లి కొడుకులు వారి కుటుంబ సభ్యులతో వస్తారు. సంప్రదాయ ధోతి, కుర్తా లేదా షీన్స్, టీషర్ట్ ధరిస్తారు. వారి ఆస్తులు, విద్యా అర్హతలను బట్టి వారికి రేటు నిర్ణయిస్తారు. పెళ్లి కొడుకును కొనుగోలు చేసే ముందు అతడి అర్హతలు, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తారు ఆడపిల్లల కుటుంబ సభ్యులు. అలాగే జన్మదినం, పాఠశాల ధ్రువపత్రాల వంటివి అడుగుతారు. వరుడిని వధువు ఎంపిక చేసుకున్న తర్వాత ఇరువురి కుటుంబాలు మిగతా కార్యక్రమాలు చేపడతాయి. వివాహాన్ని ఆడపిల్ల కుటుంబమే నిర్వహిస్తుంది. కర్నాత్ వంశపాలన కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విభిన్న గోత్రాల ప్రజల మధ్య పెళ్లిళ్లు చేసేందుకు రాజా హరిసింగ్ దీనిని ప్రారంభించినట్లు వెల్లడించారు. మరోవైపు.. వివాహాలు కట్నం లేకుండా చేయటమే దీని లక్ష్యంగా మరికొందరు తెలిపారు. Groom market’ In this unique 700-year-old tradition, the aspiring husbands stand in public display, Village famous for its ” annual “groom market” in India’s Bihar state -in Madhubani district Dowry though illegal in India, is prevalent and has a high social acceptance pic.twitter.com/G5428fE2Kz — Elmi Farah Boodhari (@BoodhariFarah) August 4, 2022 ఇదీ చదవండి: కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు -
ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!
గత ఐదేళ్లుగా సరైన జోడి కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ, దొరకట్లేదు. సంబంధాల కోసం ఎంతో డబ్బు ఖర్ఛు చేశాం.. ఫలితం లేదు. ఏం చేయను.. తప్పట్లేదు అంటూ ఆ యువకుడు చేసిన పని ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తనకు నచ్చిన, తనను మెచ్చిన అమ్మాయిని వెతుక్కోవడం కోసం తమిళనాడులోని విల్లపురానికి చెందిన ఎమ్మెస్ జగన్ వినూత్న చర్యకు దిగాడు. ‘పేరు: ఎమ్మెస్ జగన్. వయస్సు: 27 ఏండ్లు. జీతం నెలకు నలభైవేలు. నాకు వధువు కావలెను’ అంటూ కులం, ఇతర వివరాలతో పాటు మధురై అంతటా రోడ్ల కూడళ్లలో బ్యానర్లు, వాల్ పోస్టర్లు వేశాడతను. ఓ కంపెనీలో మేనేజర్గా పని చేసే జగన్.. పార్ట్ టైంలో డిజైనర్గా కూడా పని చేస్తున్నాడు. నా పనిలో భాగంగా ఎంతో మంది కోసం.. ఎన్నో పోస్టర్లు డిజైన్ చేశా. నా కోసం ఎందుకు డిజైన్ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఇలా అంటున్నాడు ఆ యువకుడు. ఎంతో మంది అమ్మాయిని చూస్తామంటూ డబ్బులు కూడా తీసుకున్నారు. కానీ, ఎవరూ సరిపోయే జోడిని తేలేకపోయారు. అందుకే ఈ ప్రయత్నం అంటున్నాడు అతను. అయితే.. పోస్టర్లు పెట్టాక ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? అంటే.. అబ్బే లేదంట. కేవలం.. మ్యారేజ్ బ్రోకర్లు మాత్రమే ఫోన్లు చేస్తున్నారట పాపం. నైంటీస్లో పుట్టిన తనకు ఇదొక టఫ్ టైం అంటున్నాడు ఎమ్మెఎస్ జగన్. ఇంటర్నెట్లో మీమ్స్తో పాటు కొంతమంది ఫోన్ కాల్స్ చేసి.. పాపం అతన్ని పెళ్లి చూపులంటూ ఏడ్పించారట కూడా. కానీ, ఎవరినీ పట్టించుకోకుండా ఈ ప్రయత్నం ఆపనంటున్నాడు అతను. ఒకవేళ.. త్వరలో మంచి సంబంధం గనుక కుదిరితే.. కృతజ్ఞతలతో మరొక పోస్టర్ తయారు చేస్తాడంట. -
పెళ్లి ఊరేగింపు: దోస్తును కాల్చి చంపిన పెళ్లికొడుకు
మన పెళ్లిళ్లకు హడావిడి మామూలుగా ఉండదు. అయితే.. ఆర్భాటాలు, దర్పం ప్రకటించుకునే క్రమంలో అతిపోకడలకు పోతుండడంతో.. అనర్థాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వివాహ వేడుకలో విషాదం నింపింది. తన స్నేహితుడినే కాల్చి చంపేశాడు ఓ పెళ్లి కొడుకు. పెళ్లి ఊరేగింపులో తన చిన్ననాటి స్నేహితుడినే కాల్చి చంపేశాడు పెళ్లి కొడుకు. అయితే అది పొరపాటుగానే జరిగింది. ఉత్తర ప్రదేశ్ సోన్భద్ర జిల్లా బ్రహ్మనగర్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఘటనలో టైంలో కొందరు వీడియోలు తీయగా.. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనీష్ మదేషియా అనే వ్యక్తి వివాహంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మనీష్ స్నేహితుడు బాబూ లాల్ యాదవ్ ఆర్మీలో జవాన్గా పని చేస్తున్నాడు. పెళ్లి కొడుకు రథంపై ఊరేగింపు టైంలో.. తన దగ్గరి గన్నే మనీష్ చేతిలో పెట్టి గాల్లోకి కాల్పులు జరపమన్నాడు బాబూ లాల్. అయితే.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన మనీష్.. గన్ను కిందకు దించగానే ట్రిగ్గర్ నొక్కుకుపోయి బుల్లెట్ బాబూ లాల్ శరీరంలోకి దూసుకుపోయింది. బాధితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఘటనకు సంబంధించి మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త పెళ్లి కొడుకు మనీష్ మేదషియాను అరెస్ట్ చేశారు. అలాగే మరో ఐదుగురిపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. నేరం రుజువైతే మనీష్కు రెండు నుంచి ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. మన దేశంలో వివాహ తదితర వేడుకలు, ప్రార్థన స్థలాలు సహా బహిరంగ ప్రాంతాల్లో లైసెన్స్ తుపాకులతో కాల్పులు జరిపినా.. చట్టరీత్యా నేరం. दूल्हे ने की हर्ष फायरिंग, आर्मी के जवान की हुई मौत। यूपी के @sonbhadrapolice राबर्ट्सगंज का #ViralVideo #earthquake #breastislife #fearwomen #Afghanistan pic.twitter.com/7laX9OUIqD — RAHUL PANDEY (@BhokaalRahul) June 23, 2022 थाना रॉबर्ट्सगंज पुलिस द्वारा हर्ष फायरिंग में हुई हत्या से सम्बन्धित 01 नफर अभियुक्त को किया गिरफ्तार, कब्जे से आलाकत्ल 01 अदद पिस्टल मय 04 अदद जिन्दा व 01 अदद फायरशुदा कारतूस बरामद । pic.twitter.com/8gfevb7r96 — Sonbhadra Police (@sonbhadrapolice) June 22, 2022 -
పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఏడుపు ఒక్కటే తక్కువ!
ఫేస్బుక్ ప్రేమ ఎంత పనిచేసింది. ఎన్నో ఆశలతో ఆమెతో కొత్త జీవితం ప్రారంభిలానుకున్న వరుడికి పెళ్లైన కాసేపటికే గుండె బద్దలయ్యే నిజం తెలిసింది. వధువు అంత పనిచేస్తుందని అతను కలలో కూడా అనుకొని ఉండడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాలు జిల్లాకు చెందిన అలోక్ కుమార్ మిస్త్రీకి ఒడిశాలోని పఢా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా 15 రోజులకే ప్రేమగా మారింది. దీంతో మే 24న జాజ్పుర్లోని ఛండీఖోల్లో మేఘనను అలోక్ కలిశాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో, వీరి గురించి కుటుంబ సభ్యులకు చెప్పి వారిని ఒప్పించారు. అనంతరం వీరిద్దరికీ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. కాగా, అదే రోజు సాయంత్రం వరుడి ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ అతిథి వరుడికి పెద్ధ షాకిచ్చాడు. పెళ్లికూతురును మేఘన అని కాకుండా మేఘనాథ్ అని పిలిచాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వధువు(అతని) పేరు మేఘన కాదు మేఘనాథ్ అని, అతను తమకు దగ్గరి బంధువే చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న కుబుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు.. అతడిని చితకబాదుడు. గ్రామస్తులు కూడా ఫేక్ వధువును పట్టుకుని కొట్టారు. అనంతరం అతను అబ్బాయి అని తెలిశాక పొడవాటి జుట్టును కత్తిరించారు. అనంతరం మేఘనాథ్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా పెళ్లి పెటాకులు కావడంతో వరుడి హృదయం ముక్కలైంది. ఇది కూడా చదవండి: అందర్నీ ఆశ్చర్యపరిచేలా వధువు ఎంట్రీ!.. వరుడు షాక్ -
బరాత్లో పెళ్లి కొడుకు ఓవరాక్షన్.. డ్రైవింగ్ రాకున్న కారు నడిపి..
సాక్షి, నల్లగొండ: జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటుచేసుకుంది. చండూరు మండలం గట్టుప్పల్ పెళ్లి వేడుకల్లో వరుడు చేసిన తప్పిదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది వివరాల ప్రకారం.. గట్టుప్పలకు చెందిన మల్లేష్ వివాహం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన యువతితో బుధవారం జరిగింది. కాగా, వివాహమైన తర్వాత వధువరులు కారులో వరుడి స్వగ్రామానికి వచ్చారు. దీంతో వరుడి ఇంటి వరకు దోస్తులు డీజే పాటలతో బరాత్ను ఏర్పాటు చేశారు. కాగా, వరుడి ఇంటికి కొద్ది దూరం ఉండగా.. మల్లేష్, వధువు కారులోని నుంచి దిగి బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేశారు. అనంతర వచ్చా కారులో కూర్చుకున్నారు. ఇదిలా ఉండగా.. బరాత్ను ఎంజాయ్ చేయడానికి కారు డ్రైవర్ కిందకు దిగడంతో వరుడు మల్లేష్.. డ్రైవర్ సీటులో కూర్చున్నాడు. తనకు డ్రైవింగ్ రాకపోయినా కారు నడిపే ప్రయత్నం చేశాడు. దీంతో కారు ఒక్కసారిగా డ్యాన్స్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే డ్యాన్స్ చేస్తున్న సాయిచరణ్ మృతిచెందాడు. ఈ క్రమంలో కారు నడిపిన మల్లేష్, సురేష్, గౌతమ్, ఆనంద్లకు గాయాలయ్యాయి. కాగా, బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పెళ్లి కొడుకు మల్లేష్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: కోర్టును ఆశ్రయించిన ప్రజ్ఞారెడ్డి.. పుల్లారెడ్డి కొడుకు, మనవడికి నోటీసులు జారీ -
పెళ్లి మధ్యలో సొమ్మసిల్లిన వరుడు.. వధువుకి షాక్
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అనడం ఏమోగానీ.. పచ్చని పెళ్లి పందిట్లోనే రద్దు అవుతున్నాయి. అయితే బలవంతంగా పెళ్లితో ఒక్కటై.. జీవితాంతం నరకం అనుభవించే బదులు.. ముందుగానే ఆపేయడం మేలని అనుకుంటున్నారు చాలామంది. అలాంటి ఘటనే ఇప్పుడు చెప్పుకోబోయేది. పెళ్లి వేడుకలో అమ్మాయి, అబ్బాయి తరఫు బంధువులు అందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటున్నారు. కాసేపట్లో తన పెళ్లి అయిపోతుందని పెళ్లి కొడుకు సంబరపడిపోతున్నాడు. అయితే, అలసిపోయి పెళ్లి కొడుకు స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో అతడిని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు ముఖంపై నీళ్లు చల్లి, తలపాగా తీయబోయాడు. అదే సమయంలో వరుడి విగ్గు ఊడిపోయింది. ఇంకేం.. పెళ్లి కూతురు సహా బంధువులు అంతా షాకయ్యారు. పెళ్లి కొడుకుకి బట్టతల ఉందని తమకు ముందుగా ఎందుకు చెప్పలేదని, ఇంత మోసం చేస్తారా? అంటూ నిలదీశారు. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని పెళ్లికూతురు స్పష్టం చేసింది. దీంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే పెళ్లి వేడుక వద్దకు వచ్చారు. ఇరు కుటుంబాలను సముదాయించి, గొడవను ఆపారు. కానీ, పెళ్లిని మాత్రం జరపలేకపోయారు. చివరి నిమిషంలో పెళ్లి రద్దు కావడంతో వరుడు తీవ్ర నిరాశ చెందాడు. అంతా వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ముందుగా తెలిసినా తమ అమ్మాయి సిద్ధమై ఉండేదేమోనని, ఇలా మోసం చేసి చేయడంతో ఆమెకు సహించడం లేదని బంధువులు చెప్తున్నారు. చదవండి: తాళి కట్టే సమయానికి కుప్పకూలిన వధువు.. భలే ట్విస్ట్ -
క్షణంలో పెళ్లి.. సొమ్మసిల్లి పడిపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు.. ఏం చేసిందంటే!
భువనేశ్వర్: ఇటీవల కొన్ని వివాహాలు పీటలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. అయితే అందులో కొన్నింటికి వరుడు కారణమైతే, మరికొన్నింటికి వధువు కారణంగా నిలుస్తున్నారు. గతంలో పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెప్తుంటారు. మరి ఇప్పుడు అదే పెద్దలు చూడట్లేదేమో, మండపం వరకు వచ్చిన వివాహాలు చివరి నిమిషంలో పుల్స్టాప్ పడుతున్నాయి. తాజాగా ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలోనూ ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. కల్యాణ ఘడియల శుభవేళలో మంగళ వాద్యాలు మారుమోగుతున్న పెళ్లి పందిరిలో అకస్మాతుగా నిశ్శబ్దం ఆవరించింది. వరుడు సొమ్మసిల్లి పోయాడు. దీంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. కాసేపటి తర్వాత తేరుకన్న వరుడు వధువు పాపిట కుంకుమ పెట్టే క్షణంలో ఆమె అందరికీ షాకిస్తూ పెళ్లికి నిరాకరించింది. ఇంతకు ముందే తనకు వేరే వ్యక్తితో వివాహం జరిగినట్లు ప్రకటించి వేదిక నుంచి వైదొలగింది. బాలాసోర్ జిల్లా బలియాపాల్ ఠాణా రెమూ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఊహాతీత ఘటన చోటు చేసుకుంది. చదవండి: భార్యను కాటు వేసిన కొండచిలువ.. భర్త ఏం చేసాడంటే? -
పెళ్లి రోజు వరుడు సర్ప్రైజ్.. గిఫ్ట్ చూసి ఏడ్చేసిన వధువు!
జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేమైనది. అందుకే యువతీ యువకులు వారి పెళ్లి రోజున స్పెషల్స్, సర్ప్రైజ్లు ప్లాన్ చేసుకుంటూ జీవితంలో మరచిపోని రోజులా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు, మెహందీ ఫంక్షన్లు, హల్దీ వేడుకలతో హడావిడీ చేస్తున్నారు. అంతేనా ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం అవి నెటిజన్లను ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహా ఓ జంట వీడియో గత సంత్సరం నెట్టింట ప్రత్యక్షమైంది. తాజాగా ఆ వీడియో మరో సారి వైరల్గా మారి హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏముందంటే.. వెడ్డింగ్ డే అనేది ప్రతి జంటకు ప్రత్యేకమైన రోజు. అందుకే తమ కుటుంబ సభ్యులు, బంధువులతో, స్నేహితులతో కలిసి ఎప్పటికీ గుర్తుండేలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటితో పాటు తమ జీవిత భాగస్వామికి ఏదైనా మరచిపోని బహుమతిని ఇచ్చేందుకు తాపత్రయ పడడం కూడా సహజమే. అయితే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి తన భార్యకు స్పెషల్ గిఫ్ట్తో ఆశ్యర్యపరిచాడు. ఎలా అంటారా.. బ్రెజిల్లో ఉంటున్న వధువు తల్లిదండ్రులను విమానంలో పిలిపించి ఆమెకు స్పెషల్ సర్ప్రైజ్లా ప్లాన్ చేశాడు ఓ వరుడు. ఇక వెడ్డింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన వధువు తన తల్లిదండ్రలను చూడగానే ఆనందంతో ఒక్కసారిగా వారి ఏడవడం మొదలుపెట్టింది. అనంతరం వారిని కౌగిలించుకుని తన సంతోషాన్ని కనీళ్ల రూపంలో వారికి తెలిపింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సర్ప్రైజ్ బాగుంది బాస్ అంటు కామెంట్ పెట్టారు. Husband surprises bride by flying her parents from Brazil to their wedding. ☺️☺️ pic.twitter.com/eBZnOj1R5X — made me smile (@mademe__smile) May 4, 2022 చదవండి: Viral video: చైనా వికృత చర్యలు! బలవంతంగా కరోనా పరీక్షలు -
ఇండియన్ అబ్బాయి.. ఆఫ్రికా అమ్మాయి.. అలా ఒకటయ్యారు!
తిరువొత్తియూరు(చెన్నై): కోవైకి చెందిన యువకుడు ఆఫ్రికాకు చెందిన యువతిని ప్రేమించి తమిళ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు. వివరాలు.. ఆఫ్రికా దేశమైన కెమెరూన్లోని ఓ సంస్థలో కోవైకి చెందిన ముత్తు మారియప్పన్ పని చేస్తున్నాడు. ఇతను పనిచేస్తున్న సంస్థలో వాల్మీ ఇనాంగో అనే ఆఫ్రికా యువతి అకౌంటెంట్గా పనిచేస్తోంది. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. ఈ మేరకు తమిళ సంప్రదాయం ప్రకారం కోవై తుడియలూర్లో ఉన్న ఓ వివాహ మండపంలో వివాహం జరిపించారు. వివాహ వేదిక పైకి వాల్మీఇనాంగో పట్టు చీర ధరించి తమిళ సాంప్రదాయంలో మెరిసింది. మారిముత్తు వధువు మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత వీరిద్దరూ క్రైస్తవ ఆచారం ప్రకారం ఉంగరాలు మార్చుకున్నారు. కాగా, వివాహానికి వధువు తరుపున హాజరైన ఆఫ్రికా వాసులు పట్టు పంచెలు, పట్టు చీరలు కట్టుకుని హాజరుకావడం అందరినీ ఆకట్టుకుంది. ఽ చదవండి: ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు -
ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? గొంతు కోసే పరిస్థితి ఎందుకు?
కొన్ని పద్ధతులు మారాలేమో. నిశ్చయ తాంబూలాల సమయంలో పెద్దల సమక్షంలో ‘ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?’ అని అడగాలేమో. వధువు, వరుడికి అక్కడ ఒక ఆప్షన్ దొరుకుతుంది. శుభలేఖలు వేసే ముందైనా ‘ఈ పెళ్లి నిజంగానే నీకు ఇష్టం కదా’ అని మళ్లీ తప్పక అడగాలి. ఏమంటే పిల్లల మనసులు పెద్దలు ఊహించినట్టుగా లేవు. పెద్దలు తమ ఆకాంక్షలకు తగినట్టుగా ఉండమని కోరగలరేగాని బలవంతం చేయలేరు. ఇష్టం లేని పెళ్లి నిశ్చయం అయ్యిందని వరుడి గొంతు కోసే నిస్సహాయ స్థితికి వధువు చేరిందంటే ఆమె నోరు తెరిచి చెప్పేపరిస్థితి లేదనా? చెప్పినా వినే దిక్కు లేదనా?పెళ్లికి ‘నో’ అంటే ‘నో’ అనే అర్థం చేసుకోక తప్పదు. ఒక అవగాహన. పెద్దలు కుదిర్చిన పెళ్లి’ అనే మాట మనకు సర్వసాధారణం. మన దేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లికే ప్రథమ మర్యాద, గౌరవం, అంగీకారం. పెద్దలు కుదిర్చాక ఇక ఏ సమస్యా ఉండదు బంధువులకు, అయినవారికి, స్నేహితులకు, సమాజానికి. కాని ఆ కుదిర్చిన పెళ్లిలో వధువుకు వరుడో... వరుడికి వధువో నచ్చకపోతే? జీవితాంతం అది సమస్య కదా. దానిని మొదట ఇప్పుడు చర్చించాలి. తాజా సంఘటన: మెడ కోసిన వధువు అనకాపల్లిలో పుష్ప అనే అమ్మాయికి రామునాయుడు అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది. మే 20న పెళ్లి. కాని అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం లేదు. దాంతో అబ్బాయి ప్రాణం తీస్తే ఈ పెళ్లి బాధ తప్పుతుందని వెర్రి ఆలోచన చేసింది. అబ్బాయిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి సర్ప్రైయిజ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి కళ్లకు తన చున్నీ కట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది. కాని అబ్బాయి బతికాడు. అమ్మాయి తనను తాను ఏమైనా చేసుకునేదేమో తెలియదు. పోలీసులు ప్రాథమిక విచారణ చేసి ఆ అమ్మాయి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని అనుకుంటోందని చెప్పారు. మరి తల్లిదండ్రులకు ఈ సంగతి చెప్పిందో లేదో తెలియాలి. వాళ్లు ఆ అమ్మాయిని పెళ్లి ఇష్టమో లేదోనని అడిగారో లేదో తెలియదు. అనవసరంగా ఇంత ప్రమాదం వచ్చి పడింది. పెళ్లి ఎందుకు? అబ్బాయి, అమ్మాయి కలిసి జీవించడానికి. ఫలానా అమ్మాయిని చూసొచ్చాం చేసుకో అంటే ముఖం కూడా చూడకుండా చేసుకున్న రోజులు ఉన్నాయి. నామమాత్రంగా పెళ్లి చూపుల్లో చూసుకుని చేసుకున్న రోజులు ఉన్నాయి. కాని ఇవాళ అలా లేదు. అమ్మాయి, అబ్బాయి చాలా విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. వారి భవిష్యత్తు గురించి వారికి ఏవో నిర్ణయాలు ఉంటాయి. లేదా ఇష్టాలు ఉంటాయి. లేదా ఏదైనా ప్రేమ ఉండొచ్చు. ఇవన్నీ లేకపోయినా కేవలం తెచ్చిన సంబంధం నచ్చకపోవచ్చు. ‘ఆ సంబంధానికి ఏమైంది... మంచి సంబంధం’ అని తల్లిదండ్రులు అబ్బాయినిగాని, అమ్మాయినిగాని ఒప్పించి, సర్దిపుచ్చి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, బలవంతం చేసి పెళ్లి చేయదలిస్తే, దాని నుంచి బయటకు పోలేము... పూర్తిగా చిక్కిపోయాము అని వధువుగాని, వరుడుగాని అనుకుంటే వారికి ఒక ఆప్షన్ కుటుంబం నుంచి సమాజం నుంచి ఏమైనా ఉందా? నిశ్చితార్థంలో పెద్దల సమక్షంలో... పెళ్లిలో నిశ్చితార్థం ప్రధానం. ఆ సమయంలో పెద్దలు ఉంటారు. తల్లిదండ్రుల పిల్లల మంచికేనని విశ్వసించి పిల్లల బాగుకోసమేనని ఆ నిశ్చితార్థం జరుపుతున్నా... వారికి గట్టి వ్యతిరేకత ఉంటే అది చెప్పుకునే వీలు నిశ్చితార్థానికి ముందు వధువుకు, వరుడికి ఇవ్వొచ్చేమో ఆలోచించాలి. పెద్దల సమక్షంలో ‘ఈ పెళ్లి నీకు ఇష్టమేనా’ అని వధువును, వరుణ్ణి అడిగి వారి భావాలు చదివి, అంగీకారం తెలుసుకుని ముందుకుపోవడం లో తప్పు ఏముంది? తల్లిదండ్రులు పెడుతున్న ఇబ్బంది ఆ సందర్భంలో పెద్దలకు చెప్పుకునే చాన్స్ ఇవ్వొచ్చు కదా. భవిష్యత్తు ప్రమాదం నివారించిన వాళ్లం అవుతాము. లేదా శుభలేఖలు వేసే ముందు తల్లిదండ్రులే తమ అనుమానాలు పోయేలా ‘ఈ పెళ్లి నిజంగా నీకు ఇష్టమేనా?’ అని పిల్లల మేలు కాంక్షించి అడగాలి. వారి సంతోషం కోసమే కదా తల్లిదండ్రులు జీవించేది. వారి సంతోషాన్ని పూర్తిగా కాకపోయినా ఏదో ఒక మేర అంగీకారం వచ్చే సంబంధం కుదిరేవరకు ఆగడంలో మేలే తప్ప కీడు లేదు. గుసగుసలు వద్దు బంధువులకు, స్నేహితులకు అన్నీ తెలుస్తాయి. ఫలానా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నదని కచ్చితంగా తెలుస్తుంది. ఆ సందర్భంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు శత్రువులు కాదు. కాని ఇష్టాలను గౌరవించడం లేదంతే. ఈ విషయం తెలిసినప్పుడు బంధువులు, స్నేహితులు మనకెందుకులే అని ఊరుకోకూడదు. గుసగుసలు పోవద్దు. ఆ తల్లిదండ్రులకు లేదా పిల్లలకు ఏ మేరకు నచ్చచెప్పగలరో చూడాలి. కుదర్దు అని అమ్మాయి, అబ్బాయి గట్టిగా చెప్తే కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి. పెళ్లి విషయంలో పిల్లలతో సంపూర్ణంగా చర్చించే సన్నిహితత్వం తల్లిదండ్రులకు ఉండాలి. అది ప్రధానం. వారితో మాట్లాడండి. వారు చెప్పేది వినండి. అలాగే అబ్బాయిలూ అమ్మాయిలూ మీరేం అనుకుంటున్నారో మనసు విప్పి తల్లిదండ్రులకు చెప్పండి. వివరించండి. లేదా ఒక తెల్లకాగితం మీద రాసి అందజేయండి. అంతేగాని నచ్చని పెళ్లి విషయంలో తీవ్ర నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. అందరూ అందమైన వైవాహిక జీవితం నిర్మించుకోవాలని కోరుకుందాం. పెళ్లిపీటల మీద అడగలేము... కానీ... చాలా సినిమాలలో పెళ్లి జరిగే ఉత్కంఠ సన్నివేశాలుంటాయి. అబ్బాయికో అమ్మాయికో పెళ్లి ఇష్టం ఉండదు. కాని ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పే ఆప్షన్ ఉండదు. నాటకీయంగా అరిచి చెప్పడమో, ఆత్మహత్య చేసుకోవడమో తప్ప. ఇదే పెళ్లి రిజిస్టార్ ఆఫీసులో జరగాలంటే ముందు నోటీసు పెడతారు, అభ్యంతరాలు తెలపమంటారు, తర్వాత సంతకాలు చేసే ముందు పెళ్లి ఇష్టమేనా అని అడుగుతారు. ఈ ఆప్షన్ వివాహంలో ఏదో ఒక స్థానంలో ఎందుకు ఉండకూడదు? కాలానికి తగిన ఒక చిన్న ప్రజాస్వామిక ఆప్షన్ ఇవ్వొచ్చా? -
అనకాపల్లి పుష్ప: హత్యాయత్నం కేసు నమోదు
అనకాపల్లి: పుష్ప అనే యువతి తనకు కాబోయే భర్త గొంతుకోసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు మంగళవారం సాయంత్రం.. మీడియాకు వెల్లడించారు. పెళ్లి ఇష్టంలేకనే కాబోయే భర్తపై దారుణానికి పాల్పడిందని డీఎస్పీ సునీల్ కేసు వివరాల్ని వెల్లడించారు. రాము నాయుడు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితుడి వివాహం కోసం ఊరు వచ్చాడు. ఈ విషయం తెలిసి రామునాయుడికి పుష్ప ఫోన్ చేసి.. ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తా బయటకు రమ్మని పిలిచింది. పెద్దవాళ్ల అనుమతితో అమ్మాయి, అబ్బాయి స్కూటీపై వెళ్లారు. వడ్డాది వద్ద స్కూటీ ఆపిన యువతి గిఫ్ట్ కొంటానని షాపులోకి వెళ్లింది. షాపులో ఏం కొన్నావని రామునాయుడు అడిగితే, కత్తి కొనుకొచ్చిన పుష్ప ఏం మౌనంగా ఉండిపోయింది. అక్కడ్నించి ఆ అబ్బాయిని విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రమం వద్దకు తీసుకెళ్లింది. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను కళ్లు మూసుకోమని చెప్పింది. మీడియాతో డీఎస్పీ సునీల్ సూసైడ్ చేసుకుంటుదేమోనని అతడు సరిగా కళ్లు మూసుకోకపోవడంతో తన చున్నీ తీసి అతడి కళ్లకు గంతలు కట్టింది పుష్ప. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న చాకుతో అబ్బాయి గొంతు కోసి, పెళ్లి ఇష్టంలేకనే గొంతు కోసినట్టు రామునాయుడితో చెప్పింది. అయితే, ఆమె ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందేమోనని ఆ యువకుడు భయపడ్డాడు. అందుకే గాయాన్ని, రక్తస్రావం లెక్కచేయకుండా ఆమెను వెంటపెట్టుకుని బయల్దేరాడు. గొంతు నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుండడం గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రిలో చేర్చారని డీఎస్పీ వెల్లడించారు. కాగా, ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని ఆ యువతి చెప్పిందని, దైవ చింతనతో జీవితం గడపాలని ఆ యువతి భావిస్తోందని డీఎస్పీ తెలిపారు. ఓం శాంతి ఆశ్రమంలో గడపాలని ఆమె కోరుకుంటోందని చెప్పారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆశ్రమంలో గడపడానికి పెద్దలు ఒప్పుకోరని భావించి కాబోయే భర్తపై దాడి చేసిందని తెలిపారు. యువతిపై సెక్షన్ 307 ప్రకారం.. హత్యాయత్నం కేసు నమోదు చేశామని, బుచ్చెయ్యపేట పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ సునీల్ చెప్పారు. -
కాబోయే భర్త పీక కోసిన కేసు.. నోరు విప్పిన పుష్ప
సాక్షి, అనకాపల్లి: కాబోయే భర్తపై యువతి హత్యాయత్నానికి ప్రయత్నించిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బాధితుడు రామునాయుడిపై దాడి చేసినట్లు నిందితురాలు పుష్ప పోలీసుల ముందు ఒప్పుకుంది. తనకు అసలు పెళ్లే వద్దని చాలాసార్లు తల్లిదండ్రులకు చెప్పానని, అయినా వాళ్లు వినలేదని పుష్ప పోలీసులకు వెల్లడించింది. అయినా తల్లిదండ్రుల బలవంతంతో రామునాయుడితో వివాహానికి సిద్ధపడింది పుష్ప. ఈ క్రమంలో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. బాధితుడిపై ఘోరానికి పాల్పడిందట. చాలా కాలంగా భక్తి మైకంలో ఉన్న పుష్ప.. తనకు పెళ్లి వద్దని, దేవుడి భక్తురాలిగా ఉండిపోతానంటూ తల్లిదండ్రులకు పలుమార్లు చెప్పిందట. అయితే ఇప్పటికే రెండు పెళ్లి చూపులు రద్దు కావడంతో మూడోసారి ఎలాగోలా పుష్పను ఒప్పించారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో కాబోయే భర్తను బయటకు తీసుకెళ్లి చంపాలని పుష్ఫ ప్లాన్ వేసింది. సరదాగా బయటకు వెళ్దామంటూ కోరింది. కత్తి కనిపించకుండా కూడా వెంట తీసుకెళ్లింది. గుడి దగ్గర రామునాయుడు కళ్లకు చున్నీ కట్టి.. సర్ప్రైజ్ అంటూ గొంతు కోసేసింది. టైం బాగుండి.. ప్రాణాలతో బయటపడ్డాడు రామునాయుడు. ఈ ఘటన జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించగా.. సోషల్ మీడియాలో ఈ ఘటనపై మీమ్స్ పేలుతున్నాయి. గాయపర్చిన తర్వాత కూడా.. దాడి తర్వాత రక్తంతో రామునాయుడు షర్టు తడిచిపోవడంతో.. పుష్ప భయందోళనకు లోనైంది. రక్తం కారకుండా పుష్ప చున్నీనే గొంతుకు కట్టుకుని ఆమె కూడా బైక్ ఎక్కించుకుని రామునాయుడు రావికమతం ఆస్పత్రికి బయలుదేరాడు. మార్గంమధ్యలో పరిస్ధితి విషమంగా ఉండటంతో బైక్ను రోడ్డు పక్కన ఆపి సొమ్మసిల్లిపోయాడు. అక్కడ ఉన్న ఓ యువకుడు రామునాయుడు పరిస్ధితిని చూసి.. రావికమతం ఆస్పత్రిలో ఇద్దరినీ విడిచి వెళ్లిపోయాడు. -
45 వెడ్స్ 25.. నాడు వైరల్గా మారింది.. నేడు విషాదంతో ముగిసింది
సాధారణంగా వివాహాలు చాలా మంది చేసుకుంటుంటారు. అయితే అందులో కొన్ని మాత్రమే వైరల్గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. అందులో ఒకటి 45 వెడ్స్ 25 పెళ్లి స్టోరీ. అప్పట్లో సోషల్మీడియాలో చక్కర్లు కొట్టి వైరల్ కాగా తాజాగా ఆ వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో విషాదాంతమైంది. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిద్య గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన శంకరప్పకు 45 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు వచ్చినా అవి పెళ్లి పీటలు వరకు వెళ్లేవి కాదు. ఇంతలో అప్పటికే వివాహమై భర్త నుంచి విడిపోయిన 25 ఏళ్ల మేఘనను శంకరప్ప కలిశాడు. అనంతరం మేఘన శంకరప్పను ప్రేమించి 2021 అక్టోబర్లో పెళ్లి చేసుకుంది. ఈ వివాహం అప్పట్లో వైరల్గా మారి నెట్టింట హల్ చల్ చేసింది. అయితే పెళ్లైన తర్వాత శంకరప్పకు చెందిన రూ.2.5 కోట్ల భూమిని అమ్మాలని మేఘన ఒత్తిడి తెచ్చింది. దీనికి శంకరప్ప అమ్మ ఒప్పుకోలేదు. దీంతో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతుండడంతో చెట్టుకు ఉరేసుకుని శంకరప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: విషాదం.. పరీక్ష హాల్లో కుప్పకూలిన అనుశ్రీ -
వధువు చేసిన పనికి.. పెళ్లిబట్టలతోనే అలిగి వెళ్లిపోయిన వరుడు.. చివరికి..
యశవంతపుర( బెంగళూరు): వధువు ఎడమ చేతితో అన్నం తినడాన్ని జీర్ణించుకోలేక వరుడు ఆమెను వదిలేసి వెళ్లగా పోలీసులు సర్ది చెప్పి తీసుకొచ్చారు. ఈఘటన కార్వార జిల్లా దాండేళి కొళగి ఈశ్వర దేవస్థానంలో శుక్రవారం జరిగింది. జోయిడాకు చెందిన కబీర్ కాతు నాయక్ అనే యువకుడికి యల్లాపురకు చెందిన అమ్మాయితో శుక్రవారం ఉదయం కొళగి ఈశ్వర దేవస్థానంలో వివాహం జరిగింది. ( చదవండి: వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెచ్చి.. ) అనంతరం వధూవరులు భోజనానికి కూర్చున్నారు. వధువు ఎడమ చేతితో అన్నం తినడాన్ని గమనించిన వరుడు.. తనకు ఈ అమ్మాయి వద్దని చెబుతూ పెళ్లిబట్టలతోనే బయటకు వెళ్లిపోయాడు. కంగుతిన్న అమ్మాయి కుటుంబ సభ్యులు 112 పోలీస్ సహాయవాణికి సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని వరుడిని తీసుకొచ్చి సర్దిచెప్పి వివాదం సద్దుమణిగేలా చేశారు. -
యుద్ధం ముగియాలి.. హైదరాబాద్ వరుడికి ఉక్రెయిన్ వధువుతో వివాహం
మొయినాబాద్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దం త్వరలో ముగిసిపోయి వెంటనే శాంతిస్థాపన జరగాలని కోరుతూ చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకుడు రంగరాజన్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నగరంలో జరిగిన ఉక్రెయిన్ వధువు లియుబోవ్, హైదరాబాద్ వరుడు ప్రతీక్ రిసెప్షన్లో ఆయన పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్వామివారి శేషమాల, శేషవస్త్రాలను వారికి అందజేసి ఆయురారోగ్యం, సత్ సంతానంతో కలిసిమెలిసి ఉండాలని దీవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్, రష్యా యుద్ధం త్వరగా ముగియాలని చిలుకూరు వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా రక్తపాతం, అల్లకల్లోలం నెలకొందన్నారు. కోవిడ్తో ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఈతరుణంలో యుద్ధంతో బీతావహ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎన్నారై అమ్మాయి కావాలెను! రూ.30 లక్షల వరకు ఎదురు కట్నం కూడా ఇస్తాం!!
అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తాడు? ఆస్తులెన్ని ఉన్నాయి? కుటుంబ నేపథ్యం ఏంటీ ? అతని గుణగణాలు.. ఇవన్నీ అక్కడ జాన్తా నహీ అక్కడ. అమెరికా వెళ్లే అవకాశం అబ్బాయికి ఉందా ? కనీసం అతని బంధువులైనా కెనడా, యూస్లో ఉంటున్నారా ? ఇవే ఇప్పుడు పెళ్లికి ప్రతిపాదికగా మారాయి. కొత్తగా వచ్చిన ఈ ట్రెండ్తో గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో యువకులు పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ దాని పక్కనే ఉన్న మెహ్సానా జిల్లాలలో ఎన్నారై క్రేజ్ పీక్స్కి చేరుకుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఎన్నారై హోదా ఉన్న అబ్బాయికే తమ అమ్మాయిని ఇచ్చి కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ జిల్లాలో ప్రముఖంగా ఉన్న కొన్ని సమాజిక వర్గాల్లో ఈ విష ధోరణి ఎక్కువగా ఉంది. లీగల్గానో ఇల్లీగల్గానో అమెరికా లేదా కెనడా వెళ్లగలిగే అబ్బాయిలకే ఇక్కడ పెళ్లిల్లు అవుతున్నాయి. చివరకి వేలు విడిచిన చుట్టమైనా విదేశాల్లో ఉంటేనే కనీసం పెళ్లి చూపుల వరకైనా పిలుస్తున్నారు. లేదంటే అంతే సంగతులు అన్నట్టుగా మారింది పరిస్థితి. మరోవైపు ఎన్నారై అమ్మాయిలకు పాటిదార్ సమాజ్లో ఫుల్ డిమాండ్ పెరిగింది. ఎన్నారై అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు ఎదురు కట్నం ఇచ్చేందుకు ఇక్కడ కుటుంబాలు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు రూ. 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఎన్నారై యువతులకు ఎదురు కట్నంగా ఇచ్చేందుకు చాలా మంది అబ్బాయిలు రెడీ ఉన్నారు. ఇటీవల అక్రమంగా అమెరికా వెళ్లే ప్రయత్నంలో కెనాడా సరిహద్దులు దాటుతూ ఓ కుటుంబం చనిపోయిన ఘటనతో ఈ ఎన్నారై పిచ్చి గురించి బయటి ప్రపంచానికి తెలుస్తోంది. చదవండి:చలికి తాళలేక అమెరికా సరిహద్దులో చనిపోయిన నలుగురు భారతీయులు -
మెడలో దండ సరిగా వేయలేదని కోపంతో వధువు ఏం చేసిందంటే!
లక్నో: ఇటీవల కాలంలో కొన్ని వివాహాలు వింత కారణాలతో పెళ్లి పీటలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. మంటపం వరకు వచ్చిన పెళ్లి కాస్త.. వరుడు లేక వధువు చేసిన పని ఇరువరిలో ఎవరికో ఒకరికి నచ్చక మధ్యలోనే పెళ్లిని ఆపేస్తున్నారు. ఈ తరహా రద్దు వివాహాలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్గా మారతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్లోని బిదునా పోలీస్ సర్కిల్ పరిధిలోని నవీన్ బస్తీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఔరయ్యా జిల్లాలోని ఓ ప్రాంతంలో పెళ్లి జరగాల్సి ఉంది. ఆ వివాహ వేడుకలో అక్కడ సాంప్రదాయం ప్రకారం వరమాల కార్యక్రమం జరగాలి. అయితే అసలు సమస్యంతా ఇక్కడే వచ్చింది. వరమాల కార్యక్రమంలో.. వరడు దండను వధువు మెడలో వేయకుండా విసిరడంతో వధువుకి కోపం వచ్చింది. దీంతో వధువు పెళ్లి వద్దంటూ తెగేసి చెప్పేసింది. చివరకు ఆమె కుటుంబ సభ్యలు ఎంత చెప్పినా వినలేదు. ఈ విషయమై ఇరు కుటుంబాలు వాగ్వాదానికి కూడా దిగారు. విషయం తేల్చేందుకు పోలీసులను పిలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి పెళ్లి రద్దు చేసుకుని ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. -
రోడ్డుపై మోకాల్లోతు మంచు.. మంటపానికి వరుడు ఏలా వెళ్లాడంటే!
Heavy snowfall in Shimla: సాధారణంగా మంటపానికి వధూవరులు కారు మీద, గుర్రాల మీద చేరుకోవడం సహజమే. అయితే ఓ వరుడు మాత్రం జేసీబీ మీద మంటపానికి చేరుకున్నాడు. అయితే ఇదేదో సరదాకి అనుకున్నారంటే పొరపాటు. అసలు ఏం జరిగిందంటే! మనం ప్రస్తుత శీతాకాలంలో చలికి గజగజ వణికిపోతున్నాం. అలాంటిది హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో చలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ మంచు ఏకంగా మోకాల్లోతు ఏర్పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడికి పెళ్లి జరగాల్సింది. అయితే మంచు కారణంగా రోడ్డుపై ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీంతో అతను ఆ రోడ్డు పై వెళ్లేందుకు అనువుగా ఉంటుందని జేసీబీ బుక్ చేసుకుని వధువు ఇంటికి వెళ్లి అక్కడి నుంచి మంటపానికి చేరుకున్నాడు. ఆ తర్వాత చేయాల్సిన తతంగాన్ని పూర్తి చేశాడు. అనంతరం వధువు అదే జేసీబీలో ఎక్కించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. Because of heavy Snowfall going on in Himachal,a barat was ferried in Two JCB Machines in a Snow Bound are of Shimla district in Himachal ..Watch this video of Barat in JCBs ..Himachali Rocks pic.twitter.com/OU6hDDVQea — Anilkimta (@Anilkimta2) January 24, 2022 -
పెళ్లిలో డ్యాన్స్ చేసిన వధువు.. ఆ తరువాత వరుడు మారిపోయాడు.. చివర్లో ఏం జరిగిందంటే
Tamil Nadu groom slaps bride: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసినందుకు వరుడు తనను చెంపదెబ్బ కొట్టాడని ఓ వధువు ఆ పెళ్లిని రద్దు చేసుకుని అంతేనా అదే ముహూర్తంలో తన బంధువును పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రిటీలో చోటుచేసుకుంది. పన్రుటికి చెందిన వధువు, పెరియకట్టుపాళయానికి చెందిన వరుడితో గతేడాది నవంబర్ 6న నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం జనవరి 20న కడంపుల్యూర్ గ్రామంలో జరగాల్సి ఉంది. వివరాల ప్రకారం.. జనవరి 19న వివాహానికి ముందు వధూవరుల బృందం మంటపానికి చేరుకున్నారు. అనంతరం డీజేకు వధూవరులు ఆనందంగా డ్యాన్స్ చేశారు. అయితే, వధువు బంధువు జంట చేతులు పట్టుకుని వారితో కలిసి నృత్యం చేయడంతో విషయాలు గందరగోళంగా మారినట్లు సమాచారం. వధువు తన బంధువులతో కలిసి ఢీజేకి స్టెప్పులు వేస్తోంది. అది నచ్చని వరుడు వేదికపైకి వచ్చి అందరి ముందు వధువును చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.వధువు కూడా ఈ చర్యతో వివాహాన్ని వద్దని తన తల్లదండ్రులకి తెగేసి చెప్పింది. వధువు కుటుంబానికి వారి బంధువులలో తగిన వరుడిని చూసి ముందు అనుకున్న ముహూర్తానికి ఆమెకు పెళ్లి జరిపించారు.తిరస్కరించిన వరుడు పన్రుటి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పెళ్లి ఏర్పాట్ల కోసం తన కుటుంబం రూ. 7 లక్షలు ఖర్చు చేసి పరిహారం ఇప్పించాలని కోరినట్లు వరుడు తెలిపాడు. -
వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్.. క్రియేటివిటీతో పిచ్చెక్కించారు
Minnal Murali Wedding Invitation: మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన రోజులు కొన్ని ఉంటాయి. ఇక ఆ రోజులని ఎప్పటికీ గుర్తుండి పోవాలని ఏవేవో చేస్తుంటాం .అలాంటి రోజుల్లో ఒకటే పెళ్లి రోజు. ఇటీవల వివాహ వేడుకలను చూస్తే.. వధూవరులు తమ వివాహ వేడుక సంథింగ్ స్పెషల్ గా జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్, వెరైటీ ఇన్విటేషన్, సంగీత్ ఇలా ఒక్కటేమిటి అన్నిట్లో ప్రత్యేకతని కోరుకుంటున్నారు. తాజాగా ఓ సినిమా క్యారెక్టర్ లోని పాత్రో పెళ్ళికొడుకు ఉండి.. పెళ్లి కూతురితో కలిసి చేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇటీవల మలయాళంలో విడుదలైన 'మిన్నాళ్ మురళి' చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అంతే గాక ఇది మలయాళంలో ప్రేక్షకులతో పాటు ఇతర భాషలోనీ సినీ ప్రేమికులకు కూడా విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే మిన్నాళ్ మురళి.. ఇండియన్ సూపర్ మ్యాన్. ఈ వీడియోలో.. మిన్నాళ్ మురళీ క్యారెక్టర్ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోలో తానే మిన్నాళ్ మురళిగా గెటప్ వేసు కొని తనకు కాబోయే భార్యను రౌడీల నుండి రక్షించి, తన దరికి ప్రమాదం రానివ్వకుండా ఎప్పుడు తన వెంటే ఉండి తనను కాపాడుకుంటూ ప్రేమలో పడేస్తాడు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీడియో కాన్సెప్ట్ రూపొందించిన వాడిని క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. వాట్ ఏ క్రియేటివిటీ అంటూ కితాబుల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Athreya jibin (@photography_athreya) -
నిశ్చితార్థం బాగానే జరిగింది.. తీరా పెళ్లి పత్రికలు పంచుతుండగా..
సాక్షి,పెద్దకడబూరు( కర్నూలు): నిశ్చితార్థం అయ్యాక వరుడు పెళ్లి వద్దంటున్నాడని, తమకు న్యాయం చేయాలని వధువు బందువులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి డీఎస్పీ వినోద్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొందు మడుగుల రమేష్ మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని ఇంద్ర నగర్కు చెందిన అంజలికి పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన రవితో పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చయించారన్నారు. నిశ్చితార్థం కూడా పూర్తయి, పెళ్లి తేదీని నిర్ణయించి పత్రికలను బంధువులకు పంచినట్లు తెలిపారు. తీరా ఇప్పుడు పెళ్లికొడుకు తనకు పెళ్లి ఇష్టం లేదని దాటవేస్తున్నాడన్నారు. రవితో పెళ్లి జరిపించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. స్పందించిన డీఎస్పీ వరుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి యువతికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. చదవండి: వివాహేతర సంబంధం.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు.. చివరకు -
కలల రాణిని పెళ్లి దుస్తుల్లోచూసి.. ఒక్కసారిగా ఏడ్చిన వరుడు! బ్యూటిఫుల్ కపుల్..
Groom starts crying when he sees bride on wedding day: పెళ్లి రోజున గర్ల్ ఫ్రెండ్ను పెళ్లికూతురి డ్రెస్లో చూసి ఆనందభాష్పాలను దాచలేకపోయాడా పెళ్లికొడుకు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అసలేంజరిగిందంటే.. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న అలెగ్జాండ్రియాను చూసిన వరుడు డెమెట్రియస్ క్యాషరీస్ భావోధ్వేగంతో కన్నీరు పెట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. బ్యూటిఫుల్ వైట్ పెవిలియన్ గౌను ధరించిన వధువు పుష్పగుచ్చం పట్టుకుని తండ్రితోపాటు రావడం చూసిన వరుడు తన కన్నీళ్లను ఆపుకోలేకపోతాడు. దీనిని సంబంధించిన వీడియోను మగ్నోలియా రోడ్ ఫిల్మ్ కంపెనీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు భిన్న కామెంట్ల రూపంలో ప్రశంజల జల్లును కురిపిస్తున్నారు. ‘ఓమై గాడ్! ఈ వీడియో నన్ను కూడా ఏడిపిస్తోంది. మీకు శుభాకాంక్షలు' అని ఒకరు, ‘ఈ వీడియో నిజమైన ప్రేమను తెలియజేస్తుంది. మీరిద్దరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నారని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. నాకు మీరు తెలియకపోయినా.. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చాలా భావోధ్వేగంతో కామెంట్ చేశారు. మరి మీరేమంటారు.. చదవండి: Dental Care Tips In Telugu: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా? ఐతే ఇలా చేయండి.. View this post on Instagram A post shared by Magnolia Road Film Co. (@magnoliaroadfilmco) -
పెళ్లిపీటలపై అరుదైన ఘటన
మండ్య(బెంగళూరు): ఈ ఇంటర్నెట్ యుగంలో మంగళవారం ఒక పెళ్లివేడుకలో వధూవరులు పుస్తకావిష్కరణ గావించి సాహిత్యానికి పెద్దపీట వేసిన అరుదైన ఘటన మండ్యలో చోటు చేసుకుంది. సాహితీవేత్త త.నా.శి. జగన్నాథ్ రచించిన పుస్తకాన్ని నూతన జంట వినుత– సంతోష్లు ఆవిష్కరించి అతిథులకు కానుకగా అందజేశారు. మరో ఘటనలో.. పర్యావరణ రక్షణపై సమీక్ష హోసూరు: పర్యావరణ పరిరక్షణపై జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖాధికార్లతో సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ జయచంద్రభానురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శుద్ధీకరించిన తాగునీటి వినియోగం, పరిశ్రమల్లో కాలుష్య నివారణ, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడం, వర్షపునీరు నిల్వ ప్రాంతాల పరిరక్షణ వంటి విషయాలపై వివిద శాఖాధికార్లతో చర్చించారు. హోసూరు ఆర్డీవో తేన్మోళి, అధికారులు సెంథిల్ కుమార్, పరమశివం, వేడియప్పన్, మరియ సుందరం పాల్గొన్నారు. చదవండి: గ్రామంలో నాగుపాము కలకలం -
వరుడిని అక్కడ కొట్టిన వధువు .. పట్టించుకోకుండా పరిగెత్తింది..చివర్లో వచ్చి..
పెళ్లయిన తరువాత వధూవరుల మధ్య చనువు పెంచటానికి వారితో ఆటలు ఆడించటం మామూలే. ఆటలంటే మనకి తెలిసి.. బిందెలో ఉంగరం వేసి తీయడం.. పూల బంతితో ఆట లాంటి నాజూకువి ఉంటాయి. అయితే బయట దేశాల్లో అలా కాదు మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్తుంటారు. అలా ఓ కొత్త జంట ఆడిన ఆట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఆ జంట ఏ ఆట ఆడారంటే... కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్లోని కార్లియాన్ బే హోటల్ గార్డెన్లో వధూవరులు రౌండర్స్ బాల్ ఆడారు. మొదటగా పెళ్లి కుమారుడు మ్యాట్ చెస్టర్ఫీల్డ్ బాల్ వేయగా, పెళ్లి కుమార్తె సారా చెస్టర్ఫీల్డ్ దాన్ని బ్యాట్తో కాస్త గట్టిగానే కొట్టింది. అది నేరుగా వెళ్లి వరుడి ప్రైవేటు భాగంలో తగిలింది. అంతే మనోడు కుప్పకూలి కిందపడి గిలగిల్లాడసాగాడు. ఈ సీన్ చూస అక్కడి వాళ్లు పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. పాపం మ్యాట్కు దెబ్బ తగలిందన్న విషయం వధువుకి తెలియక.. నవ్వుకుంటూ, గెలుపుకోసం చుట్టూ పరిగెత్తింది. కార్నిష్ వీడియోగ్రాఫర్ గ్రాంట్ అలెగ్జాండర్ ఈ సీన్ని తన కెమారాలో బంధించగా, వధువు సోదరి హేలీ మెక్డొనాల్డ్ వీడియోను టిక్టాక్కు షేర్ చేసింది. పక్కనున్న వాళ్లు అతడి దగ్గరకి వచ్చి ఓదార్చారు. ఆ కొద్దిసేపటి తర్వాత వధువు కూడా వరుడి దగ్గరకు వచ్చి.. ఆర్ యూ ఓకే బేబీ అంటూ ఓదార్చింది. కానీ అప్పటికే అతడి ముఖం బాధతో ఎర్రగా మారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. నాకే పోటీగా వచ్చేలా ఉన్నాడు.. -
డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!
పెళ్లిళ్ల సీజన్ వస్తే కళ్యాణమండపాలు ఏ విధంగా కళకళలాడుతాయో సోషల్ మీడియాలో కూడా వధువరులు వీడియోలతో నిండిపోతుంటాయ్. ఈ రోజుల్లో యువతీయువకుల వివాహ క్షణాలు వారికి చాలా ముఖ్యమైనవే కాకుండా మధురమైనవి కూడా. ఒకప్పుడంటే వాటని మనం వీడియో రూపంలో భద్రపరిచి చూసుకోవాలి. అయతే నేటి నెటిజన్ యుగంలో ఇలాంటి మధర క్షణాలున్న కొందరి వీడియోలు వైరల్గా మారి సోషల్ మీడియాలో కనపడుతుంటాయి. ఈ రోజుల్లో పెళ్లంటే డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. తాజాగా ఓ పెళ్లిలో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట దూసుకుపోతోంది. ఇటీవల పెళ్లిలో.. వధూవరులు ఇద్దరూ స్టెప్స్ వెయ్యాల్సిందేనంటూ బంధువులు, స్నేహితులు బలవంతంగానైనా చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... అలా అందరి ముందూ డాన్స్ చెయ్యాలంటే కొంతమంది ఇబ్బంది పడేవాళ్లు ఉన్నారు. తాజాగా ఓ వీడియోలో కూడా ఓ వరుడు డాన్స్ వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. వధువు మాత్రం అందరి ముందు డ్యాన్స్ ఇరగదీసింది. సింపుల్గా.. సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదనే చెప్పాలి. ఆ వధువు డాన్స్ చూసి వరుడే కాదు... పెళ్లికి వచ్చిన వారంతా స్టన్ అయ్యారనుకోండి. అందరూ ఆమె చేస్తున్న డ్యాన్స్కి ఫిదా అయ్యి తన వైపే చూస్తున్నారు. వారే కాక నెటిజన్లు కూడా వధువు డ్యాన్స్ సూపర్ అంటు కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by ||•__couple__official__•|| (@couple_official_page) -
ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది.. ఎందుకంటే!
వాషింగ్టన్: సాధారణంగా వివాహాలంటే మండపంలోనో, గుడిలోనో లేదా ఇంటి దగ్గర చేసుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ జంట మాత్రం తమ పెళ్లిని రెండు దేశాల సరిహద్దుల మధ్య చేసుకుంది. ఎందుకలా అనుకుంటున్నారా! దానికి ఓ కారణం ఉందిలెండి. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాలో నివసిస్తున్న కరెన్ మహోనీ, బ్రియాన్ రేకు వివాహం జరగాల్సి ఉంది. అయితే వధువు అమెరికాలోని న్యూయార్క్లో ఉండగా, కెనడాలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఇటీవల కరోనా కారణంగా ఆయా దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడా మధ్య ఉన్న ఆంక్షల కారణంగా వధువు కుటుంబ సభ్యులు ఈ పెళ్లి కోసం న్యూయార్క్కు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ జంట ఈ వేడుక తమ కుటుంబ సభ్యుల మధ్యే జరగాలని నిర్ణయించుకున్నారు. అందుకు వేదికను ఏకంగా సరిహద్దు వద్దకు మార్చారు. అదృష్టవశాత్తు సరిహద్దు భద్రతా సిబ్బందిలో ఒకరు వాళ్లకు తెలియడంతో ఈ పని సులువుగా మారింది. దీంతో న్యూయార్క్లోని బర్కి, కెనడాలోని క్యూబెక్ మధ్య ఉన్న జమీసన్ లైన్ బోర్డర్ క్రాసింగ్లో వారి పెళ్లి వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ తతంగమంతా కెనడా సరిహద్దులో ఉన్న కరేన్ తల్లిదండ్రులు, నానమ్మ వీక్షించారు. ఈ రకంగా వివాహం చేసుకోవడంపై వధువు కరేనా... పెళ్లి అనేది ఎవరికైనా జీవితంలో ముఖ్యమైన రోజు. అలాంటి ప్రత్యేకమైన రోజుని నా తల్లిదండ్రులు, నానమ్మ సమక్షంలో జరగాలని నేను కోరుకున్నాను. మా కుటుంబ పెద్ద నానమ్మ ఒక్కరే. నా జీవితంలో సంతోషకరమైన రోజును చూడడంతో పాటు ఆ రోజు ఆమె నా దగ్గర ఉండాలనుకున్నానని తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటజన్లు వీరి ఐడియాను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Viral Video: సింగిల్గా ఉంటే సింహమైనా సైలెంట్గా ఉండాలి.. లేదంటే -
డ్యాన్స్ చేస్తూ కిందపడ్డ కొత్త జంట.. తగ్గేదేలే అంటూ వధువు వెంటనే లేచి..
ఇంటర్నెట్ వాడకం పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియా యూజర్ల సంఖ్య నానాటికీ పెరిగుతోంది. ఈ క్రమంలో కొందరు నెట్టింట పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలలో కొన్ని నెటిజన్లను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంటాయి. ఆ వీడియోలకు నెటిజన్లకు నచ్చుతున్నాయంటే వాటిలో ఏదో ఒక స్పెషాలిటీ ఉన్నట్టే. తాజాగా.. ఓ నూతన వధూవరులకు చెందిన వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తూ విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి రోజున ఏ జంటైనా సరదాగా, సంతోషంగా ఫుల్ జోష్తో ఉంటారు. ఫంక్షన్లు, బరాత్లు, అబ్బో బోలెడు కార్యక్రమాలంటూ ఆ పరిసరాలంతా ఒకటే హడావుడిగా ఉంటాయి. ఇక అక్కడ ఏ కార్యక్రమం జరిగిన అందులో వధూవరులే ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. అలా వెడ్డింగ్ ఈవెంట్లో ఓ జంట డ్యాన్స్ చేస్తూ వస్తారు. అంతలో వరుడు పెళ్లికూతురుని తన వెనుక ఎత్తుకుని డ్యాన్స్ చేయడం మొదలుపెడతాడు. ఓ మనిషిని ఎత్తుకొని డ్యాన్సంటే కష్టమే కదా.. అలా ఆ వరుడు బ్యాలెన్స్ తప్పడంతో వధువుతో పాటు ఇద్దరూ పడిపోయారు. దీంతో అక్కడున్న అతిథులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినా ఆ వధువు తగ్గేదేలా అనుకుంటూ.. వెంటనే లేచి మళ్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. అందుకే ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను నవ్విస్తోంది. ఈ వీడియోను చూసిన వారు నవ్వలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Surprise Love Storie’s 💘💍 (@surprizhikayeler) చదవండి: వామ్మో! ఒకే మొక్కకి 839 టమాటాలా!! -
వైరల్: వివాహం అయ్యాక.. వధువు కాళ్ల మీద పడ్డ వరుడు
పెళ్లంటే మూడు ముళ్ల బంధంతో ఇద్దరు ఒక్కటిగా మారే వేడుక. ఇక వివాహం మొదలైనప్పటి నుంచి ప్రతీది ఓ సంప్రదాయం ప్రకారం పాటించడం మన ఆనవాయితీ. అయితే గతంలో పోలిస్తే వీటిలో సందర్భానుసారంగా కొన్నింటిలో మార్పులు చోటు చేసుకున్నాయనే చెప్పాలి. పెళ్లిలో వధువు... వరుడి కాళ్ల మీద పడి మొక్కడం, అప్పడు వరుడు ఆమెను ఆశ్వీరదించడం ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్న ఈ ఆచారాన్ని మనం చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ వరుడు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించి ఆ వధువుతో పాటు నెటిజన్ల మనసును దోచుకున్నాడు. అసలు అంతలా ఆ వరుడు ఏం చేశాడు! ఓ పెళ్లి వేడుక అనంతరం.. వధువు ఆశీర్వాదం తీసుకోవడానికి వరుడి కాళ్ల మీద పడుతుండగా.. వెంటనే ఆ వరుడు ఆమెను అడ్డుకొని.. అతనే ఆమె కాళ్ల మీద పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఆ వధువు షాక్ అయ్యి వెంటనే తన కాళ్లను వెనక్కి జరుపుకుంటుంది. కానీ అతను మాత్రం భార్యభర్తలంటే ఇద్దరు సమానంగా భావించి ఆమె తన కాళ్ల మీద పడినప్పుడు తాను అలా చేస్తే తప్పేంటి అని ఈ రకంగా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వరుడి చేసిన పనికి ఫిదా అవుతున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Piyush Awchar (@mr_robin_hudd) చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం.. -
పెళ్లి బరాత్.. అంతలో సడన్గా పోలీసుల ఎంట్రీ !
సాక్షి, సనత్నగర్(హైదరాబాద్): సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మోతీనగర్లో శుక్రవారం తెల్లవారుఝామున నిర్వహించిన పెళ్లి బరాత్ (ఊరేగింపు) కలకలం సృష్టించింది. ఎటువంటి అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్కు చెందిన ఉదయ్కృష్ణ వివాహం గురువారం నిర్మల్లో జరిగింది. పెళ్లికూతురితో కలిసి మోతీనగర్కు చేరుకున్న ఉదయ్ కృష్ణకు బంధుమిత్రులు బరాత్ నిర్వహించారు. తెల్లవారుఝామున పెళ్లి బరాత్తో స్థానికంగా శబ్ధ కాలుష్యంతో ఇబ్బంది పడి స్నేహపురికాలనీకి చెందిన కొందరు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. దీంతో సనత్నగర్ గస్తీ సిబ్బంది వచ్చి పెళ్లి బరాత్ను అడ్డుకున్నారు. అయితే ఊరేగింపులో కొందరు మద్యం మత్తులో పోలీసులను దుర్భాషలాడుతూ నెట్టివేయడంతో పోలీసులు పెళ్లి కుమారుడు ఉదయ్కృష్ణ, అతని తండ్రి జానకిరామ్ మరి కొందరిపై కేసు నమోదు చేశారు. ఉదయాన్నే వీరిని తీసుకువచ్చేందుకు సనత్నగర్ ఎస్ఐ నర్సింహగౌడ్ తన సిబ్బందితో కలిసి వెళ్లారు. కేసు నమోదు కావడంతో పెళ్లి కొడుకు తండ్రి, మరి కొందరిని ఠాణాకు రమ్మని చెప్పారు. అయితే పెళ్లింట్లోకి పోలీసులు ప్రవేశించడం ఏమిటంటూ పోలీసులు వచ్చిన దృశ్యాలను వీడియో తీసి వైరల్ చేశారు. ఈ విషయమైన ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ మాట్లాడుతూ స్థానికుల ఫిర్యాదు మేరకే అనుమతి లేని పెళ్లి బరాత్ను అడ్డుకున్నామన్నారు. తమ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఊరేగింపునకు అనుమతి లేకపోవడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. చదవండి: అలిగి మండపం ఎక్కనన్న వధువు.. కారణం తెలిసి నవ్వుకున్న నెటిజన్స్ -
పెళ్లిలో స్నేహితులు ఇచ్చిన విచిత్ర బహుమతి..! వధువు షాక్
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైంది. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఉన్నంతలో ఎంతో ఘనంగా పెళ్లి వేడుకను చేసుకుంటున్నారు. అయితే, పెళ్లికి వచ్చే స్నేహితులు, బంధువు మిత్రులు సైతం ఆ వివాహ వేడుక మరింత గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంభందించిన వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వివాహానికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందటే.. వధూవరులిద్దరూ వేదికపై నిల్చోని ఉన్నారు. ఇంతలో వరుడు స్నేహితులు స్టేజీపైకి వచ్చారు. ఇంతలో మరో స్నేహితుడు వధువుకు ఒక విచిత్ర బహుమతిని అందజేశాడు. అది ఓపెన్ చేసిన చూసిన వధువు షాక్ అవడంతో పాటు.. కోపంతో, ఆమె ముఖం తిప్పింది. ఎందుకంటే.. ఆ గిఫ్ట్ బాక్స్లో పాలసీసా ఉంది. అయితే స్నేహితులు చేసిన చిలిపి పనికి అక్కడ ఉన్నవారంతా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రమ్లో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు అన్ని సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
వైరల్ వీడియో: పాపం పానీ పూరి కోసం..
జీవితంలో చాలా మంది పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టంగా భావిస్తుంటారు. పెళ్లి సమయంలో బంధువుల సందడులు, బావ మరదలు సరసాలు, చిన్నపిల్లల అల్లర్లు ఇలా చూసేందుకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. కొన్ని సార్లు వధూవరులు ఒకరినొకరు ఆట పట్టించడం లాంటివి జరుగుతుంటాయి. ఈ తరహాలోనే పానీ పూరి తినడం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వరుడుని వధువు ఆటపట్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వధువు పానీ పూరి తినిపిస్తుందని ఆశగా నోరు తెరుస్తాడు వరుడు, కానీ ఆమె నోటి దగ్గరకు తీసుకు వచ్చి వరుడుకి తినిపించుకుండా తానే తింటుంది. రెండోసారి ఏమైనా తినిపిస్తుందని మళ్లీ ఎదురుచూడగా, పాపం ఈసారి కూడా అతనికి నిరాశే ఎదురవుతుంది. ఇలా ఆ వధువు అతడిని సరదాగా ఆట పట్టిస్తున్న ఘటన ఉత్తర భారత దేశంలో జరిగింది. ఈ వీడియోను వధువు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం చక్కర్లు కొడతోంది. ఇప్పటకే ఈ వీడియోను 1.2 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Shivani Sharma Singh ▪Creator (@shivanisharmasinghh) చదవండి:41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు -
గుడిలో నా పెళ్లి సర్.. మమ్మల్ని వదిలేయండి!
సాక్షి, బెంగళూరు: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నిమిషాల్లో విహహం చేసుకోబోయే ఓ వరుడు విచిత్రమైన సంఘటన ఎదుర్కొన్నాడు. మాగడి రోడ్డులో ఆదివారం ఉదయం 10.30 గంటలకు కల్యాణ మండపానికి తన స్నేహితుడి బైక్పై బయలుదేరాడు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారాంతపు కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలియదా అంటూ వారిని ప్రశ్నించారు. బైక్ వెనక కూర్చున్న వరుడు స్పందిస్తూ.. నేను పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నాను సర్. సమయానికి ఏ వాహనం లేకపోవడంతో నా స్నేహితుడితో బైక్పై కల్యాణ మండపానికి వెళ్లుతున్నట్లు తెలిపాడు. తప్పించుకోవడానికి ఏ వంకా దొరకలేదా బాబు! పెళ్లంటూ ఎందుకు అబద్దం చెబుతున్నావని పోలీసులు గట్టిగా నిలదీశారు. దీంతో పెళ్లి కొడుకు తన జేబులో ఉన్న శుభలేఖను తీసి చూపించాడు. అప్పటికీ పోలీసులకు నమ్మకం కలగలేదు. కల్యాణ మండపంలో పెళ్లి చేసుకుందామని భావించగా అక్కడ అనుమతి దొరకలేదని దీంతో స్థానిక దేవాలయంలో పెళ్లి చేసుకుంటున్నానని ఆ యువకుడు పోలీసులకు వివరించాడు. ఇప్పటికే వధువు, ఆమె కుటుంబ సభ్యులు, తమ తల్లిదండ్రులు, బంధువులు గుడికి చేరుకున్నారని తెలిపాడు. ముహూర్తానికి సమయం మించిపోతోందని తనను విడిచిపెట్టాలని పోలీసులకు కోరుకున్నాడు. ఆ యువకుడు చెప్పింది నిజమని పోలీసులు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వివాహానికి పది నిమిషాల టైం పెట్టుకుని ఇప్పుడా వెళ్లేది అంటూ ఆ యువకుడి పెళ్లికి ముందస్తు శుభాకాంక్షలు చెప్పి వారిని వదిలిపెట్టారు. చదవండి: ఆ ట్యాంకర్ రాకుంటే...వందకు పైగా ప్రాణాలు గాల్లో కలిసేవి -
పెళ్లి బరాత్లో నవవధువు హల్చల్.. ఏం చేసిందంటే!
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అపూర్వ ఘట్టం. నిరుపేదల నుంచి కోటీశ్వరుల వరకు పెళ్లి జ్ఞాపకాలలో ఓలలాడని వారుండరు. అందుకే ప్రతి ఒక్కరూ బంధు పరివారం, ఆప్తమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటుంటారు. పెళ్లిలో రకరకాల తంతులు ఉంటాయి. అన్నింటిలోకి అప్పగింతలు ప్రత్యేకం. నూత్న వధువును అత్తారింటికి పంపిస్తూ తమ కూతుర్ని కష్టపెట్టకుండా చూసుకోవాలని వియ్యాలవారికి అప్పగిస్తారు తల్లిదండ్రులు. ఇటువంటి భావోద్వేగ క్షణాలను ఓ నవ వధువు అపూర్వ జ్ఞాపకాలుగా మలుచుకుంది. అప్పగింతలు, ఊరేగింపును విభిన్నంగా జరుపుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన స్నేహ సింఘి సిటీలోని ప్రముఖ కేఫ్ ఓనర్. ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించే స్నేహ తన మ్యారేజ్ వేడుకలను విభిన్నంగా చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకునేది. ఇటీవలే పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకున్న స్నేహ.. అప్పగింతల కార్యక్రమం తర్వాత జరిగే ఊరేగింపు (బరాత్) సందర్భంగా తనే కారు నడిపి అతిథులను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను స్నేహ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వెడ్డింగ్ రోజున తాను చేసిన ఈ పని తనకు మరింత ఆనందాన్నిచ్చిందని స్నేహ చెప్పింది. పెళ్లితంతు ముగిసిన తరువాత ఎరుపు రంగు లెహెంగా ధరించి తన భర్తతో కలిసి బయటకు వచ్చిన స్నేహ.. సిద్ధంగా పూలతో అలంకరించిన కారు డ్రైవర్ సీట్లో కూర్చుంది. పక్కనే భర్త సౌగత్ కూర్చొన్నారు. అప్పగింతల పాట, డప్పు వాద్యాల నడుమ స్నేహ ఒక పక్క ఆనందం మరోపక్క తన వారికి దూరంగా వెళ్తున్న బాధతో నెమ్మదిగా కారు నడుపుతూ ముందుకు సాగింది. పెళ్లి నాడే కారు నడిపిన స్నేహ అంతే బాధ్యతతో తన సంసార నౌకను కూడా సుఖంగా... సౌకర్యంగా నడపగలదని ఆశిద్దాం. View this post on Instagram A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1) -
వరుడికి షాక్.. రాత్రంతా వధువు కోసం చూసి
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కుమారుడు ఊరేగింపుగా తన ఇంటి నుంచి వివాహ మంటపానికి చేరుకున్నాడు. కానీ పెళ్లి కుమార్తె కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఓ రోజంతా ఎదురు చూసి.. చుట్టుపక్కలా అంతా వెతికి.. చివరకు కోపంతో ఇంటి బాట పట్టాడు. ఆ వివరాలు అజాంగఢ్ కొత్వాలి ప్రాంతం కాన్షి రాం కాలనీకు చెందిన యువకుడికి.. పక్క గ్రామం యువతితో వివాహం నిశ్చయమయ్యింది. ఇరు కుటుంబాల మధ్య ఓ మహిళ ఈ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చింది. రెండు కుటుంబాలకు అంగీకారం కావడంతో ఈ నెల 10న వీరిద్దరికి వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో 10వ తేది రాత్రి యువకుడు బరాత్గా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. ఎంతో సంతోషంగా మంటపానికి చేరుకున్న వరుడికి షాక్ తగిలింది. వధువు కనిపించడం లేదనే వార్త వినిపించింది. దాంతో ఆమె కోసం చుట్టుపక్కల మొత్తం వెదికారు. కానీ వధువు ఆచూకీ లభ్యం కాలేదు. (చదవండి: ప్రపంచపు అత్యుత్తమ వరుడు.. వధువు కోసం) ఆమె రాక కోసం వరుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు రాత్రంతా వధువు ఇంటి దగ్గరే వేచి ఉన్నారు. అయినప్పటికి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతేకాక ఈ వివాహ ప్రతిపాదన తీసుకువచ్చిన మహిళను బందీంచారు. అయతే పెళ్లి తేదీకి ముందు వరకు కూడా వరుడు, అతడి కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంటికి వెళ్లలేదని తెలిసింది. ఇక వివాహ ఏర్పాట్ల కోసం యువతి తన కుటుంబం నుంచి 20 వేల రూపాయలు తీసుకుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిన మహిళపై వరుడి కుటుంబం తీవ్రమైన ఆరోపణలు చేసిందని కొత్వాలి పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ షంషర్ యాదవ్ తెలిపారు. ఇరు వర్గాలు కాంప్రమైజ్ అయ్యి వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. -
వరుడి హత్య.. పరారీలో ఐదుగురు
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లై 24 గంటలు కూడా గడవకముందే వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. సరిపడా మద్యం పొయ్యలేదనే కారణంతో స్నేహితులే వరుడిని పొడిచి చంపేశారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్ పాలిముకిమ్ పూర్ గ్రామానికి చెందిన బబ్లూ(28) అనే వ్యక్తికి సోమవారం వివాహం జరిగింది. స్నేహితుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాడు చేశాడు. వివాహం పూర్తయిన తర్వాత రాత్రి తన స్నేహితులను కలుద్దామని వెళ్లాడు బబ్లూ. అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న అతడి స్నేహితులు తమకు మరింత మద్యం కావాలని బబ్లూని అడిగారు. అందుకు అతడు అంగీకరించకపోవడంతో వారి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. మాట మాట పెరిగింది. (వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్: పెళ్లి క్యాన్సిల్) అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న బబ్లూ స్నేహితులు విచక్షణ కోల్పోయి కత్తితో అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బబ్లూని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఈలోపే అతడు మరణించాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రామ్ఖిలాడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్: పెళ్లి క్యాన్సిల్
లక్నో : మద్యం మత్తులో స్నేహితులు చేసిన పనికి ఓ వ్యక్తి పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. వరుడి స్నేహితులు డ్యాన్స్ చేయాలంటూ వధువును బలవంతపెట్టడంతో పెళ్లి ఆపుచేసుకున్నారు ఆమె కుటుంబసభ్యులు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనౌజ్ జిల్లాకు చెందిన ఓ యువతికి బరేలీకి చెందిన యువకుడితో కొద్దినెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం పెళ్లి రోజు కావటంతో మేలతాళాలతో పెళ్లికూతురు తరుపు వారు బరేలిలోని పెళ్లి కుమారుడి ఇంటికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో తాళి కట్టే తరుణం ఆసన్నమవుతుందనగా.. పెళ్లి కుమారుడి స్నేహితులు పెళ్లి కూతుర్ని డ్యాన్స్ చేయాలంటూ బలవంతంగా డ్యాన్స్ చేసే వేదికపైకి లాక్కెళ్లారు. దీనిపై పెళ్లి కుమార్తె కుటుంబం అభ్యతరం తెలిపింది. ( బావమరదళ్ల ఆత్మహత్యాయత్నం ) దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులను రంగంలోకి దింపారు. అధికంగా కట్నం అడుగుతున్నారంటూ పెళ్లి కుమారుడి కుటుంబంపై పెళ్లి కూతురి కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసుల మధ్యవర్తిత్వంతో పెళ్లి కుమారుడి కుటుంబం 6.5 లక్షల రూపాయులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. పెళ్లి జరిపించటానికి వరుడి తరుపు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనకు మర్యాద ఇవ్వని వ్యక్తిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది. -
పెళ్లి పీటలపై వరుడుకి షాక్ ఇచ్చిన వధువు
సాక్షి, చెన్నై : కొద్దిసేపట్లో పెళ్లికూతురి మెడలో తాళికట్టే సమయం. పెళ్లి కొడుకు తాళిబొట్టు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. కాసేపట్లో తాను ఓ ఇంటివాడినవుతానని సంబరపడిపోతున్నాడు వరుడు. ఇంతలో అతగాడికి ఆగమంటూ పెళ్లికూతురు అభ్యర్థన. చివరి నిమిషంలో ఇదేమి ట్విస్ట్ అనుకుంటూ పెళ్లికొడుకు అయోమయంగా చూస్తున్నాడు. రీల్ సీన్ను తలపించేలా రియల్ సీన్ చోటు చేసుకుంది అక్కడ. సినిమా సీన్లనే తలదన్నేలా పెళ్లి కొడుకు ఆనంద్కు షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు ప్రియదర్శిని. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోతే హీరోయిన్ మొండికేసి చివరి నిమిషంలో ప్రేమించినవాడితో వెళ్లిపోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం..! అయితే ఇది తమిళనాడులో నిజంగానే జరిగింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానంటూ పెళ్లికూతురు తెగేసి చెప్పింది. దీంతో ఒక్కసారిగా వధూవరుల ఇరు కుటుంబాలతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులంతా అనుకోని ఈ పరిణామంతో అవాక్కు అయ్యారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఉదగ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించినవాడు అరగంటలో వస్తాడని అతడినే పెళ్లాడతానంటూ ప్రియదర్శిని ఖరాఖండిగా చెప్పేసింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఎంత నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకునేవరకూ వెళ్లింది పరిస్థితి. ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తున్నారంటూ నిలదీసింది. అయితే ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని పెళ్లికూతుర్ని బంధువులు ప్రశ్నించారు. మరోవైపు పెళ్లి మండపంలో జరిగిన అవమానం తట్టుకోలేని పెళ్లి కొడుకు ఆనంద్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అక్కడవరకూ బాగానే ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రేమికుడి పార్తీపన్ కోసం పెళ్లి కూతురు అరగంట, గంట వేచి చూసినా చివరకు అతగాడు మాత్రం రాలేదు. దీంతో పెళ్లికూతురుని కూడా ఆమె పెద్దలు మండపంలోనే వదిలేసి బాధను దిగమింగకుంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. -
ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానంటూ ..
-
సర్ప్రైజ్: ప్రతి ఒక్కరిని ఏడిపిస్తున్న వీడియో
న్యూఢిల్లీ: పెళ్లిలో వధువుకు వరుడు ఇచ్చిన సర్ప్రైజ్ ప్రతి ఒక్కరిని హృదయాలను హత్తుకుంటుంటోంది. డౌన్స్ సిండ్రోమ్(జన్యు సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న) చిన్నారులను పెళ్లిలో రింగ్ బేరర్లుగా ఉంచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పెళ్లి కూతురితో పాటు నెటిజన్లను సైతం కంటితడి పెట్టిస్తోంది. జానా హిషమ్ అనే ట్విటర్ యూజర్ సోమవారం ఈ వీడియోను షేర్ చేసింది. దీనికి ఆమె ‘పెళ్లి కూతురిని ఆశ్చర్యపరచడానికి పెళ్లి కుమారుడు డౌన్స్ సిండ్రోమ్తో బాధపడుతున్న విద్యార్దులను రింగ్ బేరర్లుగా ఉంచాడు. ఇది చూడగానే ఒక్కసారిగా వధువు నా కళ్లలో నీళ్లు తిరగాయి’ అంటూ ఆమె షేర్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె విద్యార్థులను రింగ్ బేరర్లు నియమించిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. (చదవండి: మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాం) పెళ్లి కూతురికి ఇలా సర్ప్రైజ్ ఇచ్చిన పెళ్లి కొడుకుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఈ జంట ఎప్పటికి ఆశ్వీర్వదించబడాలి’, ‘కన్నీళ్లు ఆగడం లేదు’, ‘ఇంతకంటే మంచి వీడియోను ఈ మధ్య కాలంలో చూడలేదు’ అంటూ నెటిజన్లు భావోద్యేగానికి లోనవుతున్నారు. రెండు నిమిషాలకు పైగా నిడివి గల ఈ వీడియోలో నూతన వధువరుల వైపు కొంతమంది చిన్నారులు తోడిపెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దుస్తులు ధరించి ఉన్నారు. వారు జంటలుగా వారి వైపు నుడుచుకుంటు రింగ్ను తీసుకురావడం చూసి పెళ్లి కూతురు ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. ఆమె కన్నీరు పెట్టుకుంటూ పెళ్లి కొడుకును హత్తుకుంది. ఎందుకంటే ఆ పిల్లలు అంతా డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న వారే. ఈ చిన్నారులంతా సదరు వధువు విద్యార్థులు. పెళ్లి కూతురిని సర్ప్రైజ్ చేసేందుకు పెళ్లి కొడుకు వారిని రింగ్బేరర్లుగా నియమించాడు. అయితే ఇది ఏప్రిల్ నాటి వీడియో అని తెలుస్తోంది. ఈ పెళ్లి ఎక్కడ జరిగింది, వధూవరులు ఎవరు అనే వివరాలు లేనప్పటికీ.. ఈ వీడియోలోని భావోద్వేగానికి వీక్షకులు కనెక్ట్ అవుతున్నారు. (చదవండి: సింగపూర్ సూపర్ పెంటహౌజ్ అమ్మకం) This groom surprised his bride by having her students with Down’s syndrome be the ring bearers and I’m a puddle of tears on the floor 😄 pic.twitter.com/PKv1SduZv4 — Jana Hisham (@JanaHisham) October 17, 2020 -
నిత్య పెళ్లి కొడుక్కి దేహశుద్ధి
సాక్షి, కరీంనగర్ : భార్య, కొడుకు ఉండగానే మరో మహిళతో కాపురం పెట్టిన నిత్యపెళ్లి కొడుక్కి, భార్య తరపు బంధువులు దేహశుద్ధి చేశారు. తాళ్లతో బంధించి చెప్పులతో, కర్రలతో చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన కొండి సంపత్ కరీంనగర్లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. 2016లో మానకొండూరు మండలం గూడూరుకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. వారికి బాబు జన్మించాడు. భార్య కొడుకు ఉండగా సంపత్ మరో మహిళతో కరీంనగర్లో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య భాగ్యలక్ష్మి బంధువులతో కలిసి కరీంనగర్కి వెళ్లి సంపత్ను రెండ్ హ్యాండెడ్గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గతంలో కూడా పెళ్లి పేరుతో నలుగురి మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభంచారు. సంపత్,భాగ్యలక్షిల పెళ్లి ఫోటోలు -
కొద్ది నిమిషాల్లో పెళ్లి.. మేకప్తో ఊరేగుతుండగా..
భువనేశ్వర్ : హత్యాకాండలో నిందితుడైన వ్యక్తి పెళ్లికొడుకు మేకప్తో ఊరేగింపులో ఉండగా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. లోగడ జరిగిన హత్యాకాండలో సదరు పెళ్లి కొడుకు ప్రధాన నిందితుడు. కొద్ది కాలంగా పోలీసులకు చిక్కకుండా అదృశ్యయ్యాడు. చివరికి పెళ్లికొడుకు ముస్తాబుతో మరి కొద్ది సమయంలో తాళి కట్టి దాంపత్య జీవనంలోకి అడుగిడే చివరి క్షణంలో పోలీసులకు చిక్కాడు. కటక్ జిల్లాలోని అఠొగొడొ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పెళ్లి కోసం కారులో ఊరేగుతున్న సమయంలో పోలీసులు గుర్తించి పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి మండపానికి వెళ్లాల్సిన ఘడియల్లో కటకటాల వైపు అడుగు వేయాల్సి రావడం విచారకరం. సమసర్పూర్ గ్రామానికి చెందిన యువతితో ఢెంకనాల్ జిల్లా తాలొబొరొకోట్ గ్రామానికి చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. అఠొగొడొ బీరొకిషోర్పూర్ శివ మందిరంలో వీరిద్దరి వివాహం జరిపించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లికి హాజరయ్యేం దుకు వరుడు ఊరేగుతున్న తరుణంలో గురువారం పోలీసులు నిందితుడైన వరుడిని అరెస్టు చేశారు. అఠొగొడొ సపువా వంతెన పరిసరాల్లో పోలీసులు వరుడిని అదుపులోకి తీసుకున్నట్లు కటక్ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ రాధా వినోద్ పాణిగ్రాహి తెలిపారు. హత్యాకాండలో సంబంధం ఆరోపణ కింద పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
ప్రపంచపు అత్యుత్తమ వరుడు.. వధువు కోసం
డెహ్రాడూన్ : ఓ వయసుకు వచ్చాక ఎవరికైనా పెళ్లి అనగానే ఉత్సాహం ఉరకలెత్తిస్తుంది. కాబోయే భార్యను తొలిసారి చూడాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఉండే ఆతృతే వేరు. ఆమె ఎక్కడున్నా సరే రెక్కల గుర్రం వేసుకుని ఇట్టే వాలిపోవాలని కలలుకంటుంటారు. భారతీయ సమాజంలో వివాహానికి అంతటి అనుబంధం ఉంది. ఉత్తరాఖండ్కు చెందిన ఓ యువకుడి తనకు కాబోయే భార్య కోసం చేసిన పని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిమాలయ రాష్ట్రంలో గల చిమోలీ జిల్లా సమీపంలోని ఓ కుగ్రామం బిజ్రా. ఆ గ్రామానికి వెళ్లాలంటే కాళ్లకు పనిచెప్పాల్సింది. ఎటు చూసిన ఎత్తయిన మంచు పర్వతాలు తప్ప మరేమీ కనిపించవు. ఈ గ్రామానికి కనీసం వాహన సదుపాయం కూడా లేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలో నుంచి కాలినడకన చేరుకోవాల్సింది. అయితే ఓ యువకు ఈ గ్రామంలోని యువతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి ఆమెను తొలిసారి చూడటానికి ఏకంగా నాలుగు కిలోమీటర్లు నడక ద్వారా చేరుకున్నాడు. ఎత్తయిన మంచుకొండలు ఓ వైపు, పైనుంచి వర్షాన్ని తలపించేలా కురుస్తున్న హిమపాతం మరోవైపు ఇవేవీ అతన్ని ఆపలేకపోయాయి. చేతిలో రక్షణగా గొడుగులు పట్టుకుని ఈ హిమాలయ కొండలను ఛేదించుకుంటూ పెళ్లి కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు అతని స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి నెట్టింట వైరల్గా మారాయి. ప్రేయసి కోసం పాట్లు అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం ప్రపంచపు అత్యుత్తమ పెళ్లికొడుకు అని ప్రశంసిస్తున్నారు. -
నీ ముక్కు చాలా పొడవు.. నిన్ను పెళ్లి చేసుకోలేను!
సాక్షి, బెంగళూరు: కాబోయే భర్త ముక్కు పొడవుగా ఉందంటూ ఓ యువతి నిశ్చితార్థం చేసుకున్నాక పెళ్లికి నిరాకరించింది. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న యువకుడి తరఫు బంధువులు లబోదిబోమంటున్నారు. కోరమంగలకు చెందిన జ్యోతిప్రకాష్ బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఓ మాట్రిమోనీ సైట్ ద్వారా హిమబిందు అనే యువతితో పరిచయం కాగా.. ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ మాట్లాడుకున్నారు. ఇద్దరి ఉద్యోగాలు, అభిరుచులూ నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాలు గతేడాది సెప్టెంబర్ 9న వీరి నిశ్చితార్థం నిర్వహించారు. యువతి కోరిక మేరకు తిరుపతిలో జనవరి 30 వివాహం చేసేందుకు నిర్ణయించారు. దీంతో యువకుడి బంధువులు తిరుమలలో 70 రూమ్లు బుక్చేశారు. రూ.4 లక్షలతో పెళ్లిదుస్తులు కొనుగోలు చేశారు. అంతలో తనకు పెళ్లి ఇష్టం లేదంటూ అక్టోబర్ 23న హిమబిందు కబురు పంపింది. పెళ్లికొడుకు ముక్కు పొడవుగా ఉందని.. ప్లాస్టిక్ సర్జరీతో సరిచేయించుకుంటే పెళ్లికి ఒప్పుకుంటానని షరతు విధించింది. అతని ఫోన్ నంబర్నూ బ్లాక్ చేసింది. దీంతో జ్యోతిప్రకాష్.. కుటుంబ సభ్యులతో కలిసి కోరమంగల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఏర్పాట్ల కోసం రూ.5 లక్షల వరకూ ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. -
వరుడి సూసైడ్ : వారిపైనే అనుమానం
దుండిగల్: తన కుమారుడి ఆత్మహత్యకు బంధువులే కారణమని మృతుడి తండ్రి శ్రీనివాసా చారి ఆరోపిస్తున్నాడు. ఆదివారం కొంపల్లి టీ–జంక్షన్లోని శ్రీకన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో పెళ్లి కొడుకు సందీప్ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయంటూ అతను పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్ చిన్నమ్మలు మాధవి, శారదలతో పాటు సందీప్ బాబాయ్ నాగరాజు, సందీప్కు సోదరుడి వరసైన శశాంక్లపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై సీఐ మహేశ్ స్పందిస్తూ సందీప్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని, అతని ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయన్నారు. అప్పటి వరకు ఏ విషయాన్ని నిర్ధారించలేమన్నారు. (చదవండి : పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య) -
ఫంక్షన్హాల్లో పెళ్లికుమారుడు ఆత్మహత్య
-
కాసేపట్లో పెళ్లి.. ఫంక్షన్హాల్లో తీవ్ర విషాదం!
సాక్షి, హైదరాబాద్: మరికాసేపట్లో పెళ్లి.. బంధుమిత్రపరివారం రాక మొదలైంది. పచ్చటి పందిరి, మేళతాళాలతో ఫంక్షన్హాల్ కూడా ముస్తాబైంది. కాసేపట్లో నూతన వధూవరులు పెళ్లిపీఠాలు ఎక్కాల్సి ఉంది. మూడుముళ్లు, ఏడు అడుగులతో దంపతులై కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కానీ, ఇంతలో ఏమైంది తెలియదు. పచ్చగా కళకళలాడుతున్న పెళ్లి ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. చక్కగా ముస్తాబై పెళ్లిపీఠాలు ఎక్కాల్సిన వరుడు ఉరిపోసుకున్నాడు. వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అతడు అంతలో తనువు అర్ధంతరంగా చాలించాడు. ఈ ఘోర విషాద ఘటన షేక్బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో పెళ్లి వేడుక నిండుగా జరుగుతుండగానే వరుడు సందీప్ అనూహ్యంగా ఉరేసుకొని చనిపోయాడు. ఉదయం పది గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయమే వరుడి కుటుంబసభ్యులు, బంధువులు ఫంక్షన్హాల్కు చేరుకున్నారు. ఫంక్షన్ హాల్లోని గదిలో వరుడికి మేకప్ చేస్తుండగా ఉదయం ఏడు గంటల సమయంలో ఒంటరిగా గదిలోపలి నుంచి సందీప్ గడియపెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి తెరవడంతో సందీప్ అప్పటికే ఉరికి వేసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పెళ్లిని రద్దు చేశారు. ఈ ఘటనతో ఫంక్షన్హాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. -
అధ్యక్షుడిని కలవడం కోసం వరుడి వేషంలో..
లక్నో: సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ మీద రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆజంఖాన్కు మద్దతుగా రాంపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాంపూర్ ప్రాంతంలో 144 సెక్షన్ని విధించారు. అయితే ఆ పార్టీ నాయకుడొకరు ఈ నిషేధాజ్ఞలను వినూత్న రీతిలో ఉల్లంఘించాడు. అఖిలేష్ను కలవడం కోసం ఏకంగా పెళ్లి కుమారుడి వేషంలో వచ్చాడు. ఆ వివరాలు.. రాంపూర్లో పర్యటిస్తున్న అఖిలేష్ను కలవడం కోసం సంభల్కు చెందిన ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, కార్యకర్తలతో కలిసి పెళ్లి కుమారుడి వేషంలో వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ.. ‘యోగి ప్రభుత్వం మా పార్టీ ఎంపీని టార్గెట్ చేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఆయన మీద దాదాపు 80 కేసులు పెట్టింది. వాటిల్లో బర్రె, మేక దొంగతనం కేసులు కూడా ఉండటం గమనార్హం. ఇవన్ని నిరాధార ఆరోపణలు. ప్రభుత్వం ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు ఆజం ఖాన్పైనే విశ్వాసం ఉంచుతార’ని పేర్కొన్నాడు. (చదవండి: గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు) ఆజం ఖాన్ ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములతోపాటు పేద రైతులనుంచి వ్యవసాయ భూములను కూడా స్వాహా చేశాడంటూ అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న యూపీ ప్రభుత్వం ఆజం ఖాన్ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించింది. అలాగే ఖాన్కు చెంది మహమ్మద్ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా) వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది. -
లారీనుంచి డ్రమ్ములు నూతన వధూవరులపై పడడంతో..
సాక్షి, మహానంది(కర్నూలు) : వారిద్దరికీ కొత్తగా పెళ్లి అయింది. పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు బంధుమిత్రులతో కలిసి మహానందికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నంద్యాల–గిద్దలూరు ఘాట్రోడ్డులో లారీపైన ఉన్న డ్రమ్ములు నూతన వధూవరుల బైక్పై పడ్డాయి. దీంతో బైక్ నడుపుతున్న శిరిగిరి శ్రీనివాసులు(32) తీవ్రంగా గాయపడి కోలుకోలేక మృతి చెందాడు. అలాగే ఆయన భార్య లక్ష్మీశిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన శిరిగిరి శ్రీనివాసులు మెడికల్ రెప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మీశిరీషతో ఈ నెల 16న వివాహం జరిగింది. మహానందీశ్వరుడిని దర్శించుకునేందుకు బైక్లపై లక్ష్మీశిరీష చెల్లెలు సృజన, మరదలు బిందు, బంధువులు శ్రీను, సుబ్బయ్య, వెంకట్లతో కలిసి ఉదయం మహానందికి వచ్చారు. మహానందీశ్వరుడిని దర్శించుకుని మూడు బైక్లలో వచ్చిన వీరు బయలు దేశారు. ముందు బైక్లో నూతన దంపతులు ఉన్నారు. అయితే పచ్చర్ల దాటిన తర్వాత గిద్దలూరు వైపు నుంచి ట్రైలర్ వాహనం వస్తుండగా.. గాజులపల్లె వైపు నుంచి వెళ్తున్న డీసీఎం లారీ ఢీకొట్టింది. దీంతో డీసీఎం లారీ కింద పడగా అందులో ఉన్న ఆయిల్ డ్రమ్ములు నూతన దంపతులు వెళ్తున్న బైక్పై పడ్డాయి. దీంతో వారు ఇద్దరూ తీవ్రగాయాలపాలయ్యారు. శ్రీనివాసులు మోచేయి విరగడంతో పాటు ఛాతీ, ఉదరభాగాన తీవ్రంగా గాయమైంది. వెంటనే లక్ష్మీశిరీష చెల్లెలు సృజన, ఇతరులు గుంటూరువైపు వెళ్తున్న కారును ఆపి గాజులపల్లెకు తీసుకుని వచ్చారు. అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శ్రీనివాసులు మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు లక్ష్మీశిరీషను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. నడుముల దగ్గర తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మహానంది ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
పెళ్లిళ్లు ఇలా కూడా ఆగిపోతాయా?
విచిత్రమైన కారణాలు ఈ మధ్య మూడు ముళ్ల బంధాన్ని ఒక్కటిగా మారకుండా అడ్డుకుంటున్నాయి. తాజాగా, బిహార్లో జరిగిన ఓ ఘటన ముక్కున వేలేసుకునేలా ఉంది. పెళ్లి కొడుకు ప్రవర్తన సరిగ్గా లేదంటూ వధువు పీటల మీది నుంచి వెళ్లిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... పట్నా: సరన్ జిల్లా చిట్రసెన్పూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొద్దిరోజుల క్రితం నిశ్చితార్థం అయ్యింది. శుక్రవారం వారిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరగాల్సింది. సర్వం సిద్ధమైన వేళ, మేఘాలు అలుముకుని దగ్గర్లో ఓ పిడుగు పడింది. ఆ శబ్ధం విన్న వరుడు తీవ్రంగా భయపడ్డాడు. అంతే వరుడు ఉత్త పిరికోడంటూ.. పెళ్లి వద్దే వద్దని చెబుతూ వధువు పీటల మీదినుంచి లేచింది. వధువు చేసిన పనితో నిశ్చేష్టులైన బంధువులు.. తేరుకుని ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. అయితే ఆ తరువాతే ఆ మండపం రణరంగంగా మారింది. మగ పెళ్లివారికీ, ఆడ పెళ్లివారికీ మధ్య పెద్ద గొడవే జరిగింది. విషయం తెలుసుకున్న సోనేపూర్ పోలీసులు అక్కడికొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు యత్నించినా లాభం లేకపోయింది. అయితే దాడి చేశారన్న వరుడి బంధువుల ఫిర్యాదుతో యువతి బంధువుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాసేపట్లో పెళ్లి..అంతలోనే పెళ్లి కొడుకు కాల్చివేత
-
గుర్రంపై ఊరేగాడని..
భిల్వారా : పెళ్లిరోజు గుర్రంపై ఊరేగాడని దళితుడిపై గ్రామస్తులు ప్రతాపం చూపారు. అగ్రవర్ణాలకే పరిమితమైన ఈ సంప్రదాయాన్ని హైజాక్ చేశాడంటూ దళితుడిని బలవంతంగా గుర్రంపై నుంచి కిందకు దించి దారుణంగా కొట్టారు. రాజస్థాన్ రాజధాని జైపూర్కు 250 కిమీ దూరంలోని భిల్వారా జిల్లా గోవర్థనపుర గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికొడుకుపై గ్రామస్తుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు తాము ప్రయత్నించినా పెద్దసంఖ్యలో చేరుకున్న అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయని పోలీసులు తెలిపారు. దళిత యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. పెళ్లి సందర్భంగా ఊరేగింపు నిర్వహించే దళిత పెళ్లికుమారులను అడ్డుకోవడం, వారిపై దాడిచేయడం వంటి ఘటనలు ఉత్తరాది రాష్ట్రాల్లో తరచూ చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఈ ఏడాది మార్చిలో ఓ దళితుడిని గుర్రంపై ఊరేగినందుకు అగ్రవర్ణాలకు చెందిన కొందరు హతమార్చిన ఘటన కలకలం రేపింది. -
ఒకరితో నిశ్చితార్ధం.. మరొకరితో పెళ్లి..!
సాక్షి, అన్నానగర్: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని మన పెద్దలు చెబుతుంటారు. అలంగుడిలో జరిగిన ఓ ఘటన అక్షరాల ఇది నిజమని చెబుతుంది. ఓ యువతి నిశ్చితార్ధం అయిన తర్వాత అదృశ్యం కావడంతో.. మరో యువతి పెళ్లి కూతురైంది. ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడంతో శుభం కార్డు పడింది. వివరాలివి.. పుదుకోట జిల్లా ఆలంగుడికి చెందిన ఓ యువతికి కరమ్పక్కుడి తాలుకా గిత్తానిపట్టి షణ్ముగనాథన్ కుమారుడు నదీష్ కి ఏప్రిల్ 4న పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 3వ తేదీన పెళ్లి కూతురు హఠాత్తుగా అదృశ్యమైంది. దీంతో వరుడి బంధువులు ఎలాగైనా పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ యువతి తండ్రి కార్తీక్ వివాహనికి ఒప్పుకోవడంతో ఏప్రిల్ 3వ తేదీ రాత్రే నిశ్చితార్ధం చేశారు. అదే మూహూర్తంలో కుమారమలై మురుగన్ సన్నిధిలో నదీష్కి, దేవదర్శినికి పెద్దలు వివాహం జరిపారు. పెళ్లికి ఒప్పుకున్న దేవదర్శినిని బంధువులు, స్నేహితులు ఆశీర్వదించారు. -
కాసేపట్లో పెళ్లి..అంతలోనే విషాదం
-
ఆ నవ వధువు ఇంకా షాక్లోనే..
సాక్షి, భువనేశ్వర్ : ఇటీవల ఓ పెళ్లిలో వచ్చిన కానుక పేలడం వధూవరుల కుటుంబాల్లో విషాధం నింపిన విషయం తెలిసిందే. గిఫ్ట్ ప్యాక్ బాంబు షాక్ నుంచి వధువు ఇంకా తేరుకోలేదని, భర్తను కోల్పోయానన్న వార్తను ఆమె జీర్ణించుకోలేక పోతుందని కుటుంబీకులు చెబుతున్నారు. ఆ వివరాల్లోకెళ్తే.. స్థానికంగా ఉండే సౌమ్య శేఖర్ సాహూకి రీమా అనే యువతితో ఈ నెల 18వ తేదీన వివాహం జరగ్గా.. 21వ తేదీన రిసెప్షన్ నిర్వహించారు. ఫిబ్రవరి 23న ఒడిషా బోలన్గిర్ జిల్లాలోని పట్నాఘడ్ లో రిసెస్పన్ గిఫ్ట్ ప్యాక్లను వరుడు చూస్తున్నారు. ఓ గిఫ్ట్ గట్టిగా ప్యాక్ చేయడంతో వంటింట్లోకి వెళ్లిన వరుడు సౌమ్య శేఖర్ చాకుతో ప్యాక్ ఓపెన్ చేయగానే పెద్ద శబ్ధంతో అది పేలిపోయింది. అతడి వెనకాలే వచ్చిన నానమ్మ అక్కడికక్కడే చనిపోగా, దంపతులు సౌమ్య శేఖర్, రీమాలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే వరుడు మృతిచెందగా, 35 శాతం కాలిన గాయాలతో ఉన్న నవ వధువు రీమాకు వైద్యులు ఇంకా చికిత్స చేస్తున్నారు. రీమా సోదరుడు శేఖర్ ఈ దారుణఘటనపై స్పందించారు. ‘నా సోదరి రీమాకు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్తో వివాహం చేశాం. కానీ కొన్ని రోజులకే ఇలా జరగుతుందని కలలో కూడా ఊహించలేదు. రీమా ఇంకా గిఫ్ట్ బాంబ్ పేలిన షాక్ నుంచి బయటకు రాలేదు. భర్త చనిపోయిన విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అయితే వంటింట్లోనే బాంబు పేలినా అక్కడే ఉన్న సిలిండర్ పేలలేదు. అయితే సిలిండర్ పేలకుండా ఉన్నందుకు రెండు కుటుంబాలు ప్రాణాలతో ఉన్నాయని సంతోషించాలా.. లేక సోదరి భర్త, అతడి నానమ్మ చనిపోయారని బాధపడాలో తెలయని పరిస్థితి మాది. నా సోదరికి శరీరం ఎడమభాగంలో తీవ్ర కాలిన గాయాలయ్యాయి. దెబ్బతిన్న ఎడమ చెవి, ఎడమ కన్ను పనిచేస్తాయో లేదో. ఆమె ఈ షాక్ నుంచి తెరుకోవడానికి మరింత కాలం పడుతుందని’వధువు సోదరుడు శేఖర్ వివరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పట్నాఘడ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత కేవీ సింగ్ దేవ్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ను కోరారు. మరోవైపు తమ రెండు కుటుంబాలకు శత్రువులు లేరని, ఎవరిపై అనుమానం లేదని చెప్పడంతో నిందితలును పట్టుకోవడంలో జాప్యం జరుగుతోందని పోలీసులు తెలిపారు. (చదవండి : పేలిన పెళ్లి కానుక.. ) -
అనైతిక బంధం.. వరుడు మృతి
సాక్షి, వరంగల్ : పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పాడె ఎక్కాడు. వరుసకు సోదరుడైన వ్యక్తితో అనైతిక బంధం కొనసాగిస్తున్న వధువే వరుడిపై పెట్రోల్ దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో చివరకు వరుడు ప్రాణాలు కోల్పోయాడు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వరుడు యాకయ్య శనివారం మృతి చెందాడు. గత ఆరు రోజుల క్రితం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన యాకయ్యపై పెట్రోల్ దాడి జరిగిన విషయం తెలిసిందే. అనైతిక బంధంతో వధువే వరుడిపై హత్యాయత్నం జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే వధువు అరుణ, ఆమె సోదరుడు బాలస్వామిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అసలేం జరిగిందంటే.. కంచనపల్లి గ్రామానికి చెందిన గొంగోళ్ల సామ్యేల్- యాదమ్మల కుమారుడు యాకయ్యకు మాదరం గ్రామానికి చెందిన అరుణతో ఈనెల 21న పెళ్లి చేయాలని ఇరువర్గాల కుటుంబసభ్యులు నిర్ణయించారు. వధువుకు మాత్రం ఈ వివాహం ఇష్టం లేదు. కారణం ఆమె గత మూడేళ్లుగా బాలస్వామితో ప్రేమలో ఉంది. కానీ, బాలస్వామి మరెవరో కాదు.. వధువుకు స్వయాన పెద్దమ్మ కొడుకు. పెళ్లిని ఆపేందుకు బాలస్వామితో కలిసి వధువు పథకం పన్నింది. మరోవైపు ఆదివారం 18వ తేది నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వరుడు కుటుంబం రాత్రి బంధువులతో హడావిడిలో ఉండగా వధువు అరుణ నుంచి యాకయ్యకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని బయటకు వచ్చి మాట్లాడమని అరుణ చెప్పడంతో వరుడు యాకయ్య బయటకు వచ్చాడు. అప్పటికే మాటువేసిన బాలస్వామి ఒక్కసారిగా యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న యాకయ్యను చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
వధువు అనైతిక సంబంధం.. వారిద్దరు అరెస్ట్
సాక్షి, వరంగల్, రఘునాథపల్లి: కాబోయే వరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో వధువు అరుణ, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసకు అన్నయ్య అయిన బాలస్వామితో కొనసాగించిన ప్రేమ వ్యవహారమే వరుడి హత్యాయత్నానికి దారి తీసిందని స్టేషన్ ఘణపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు గురువారం మీడియాకు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే వధువు అరుణ, వరుడు యాకయ్యకు ఇంటి బయటకు రప్పించగా.. అప్రమత్తంగా ఉన్న బాలస్వామి వరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన గొంగోళ్ల సామ్యేల్- యాదమ్మల కుమారుడు యాకయ్యకు మాదరం గ్రామానికి చెందిన అరుణతో ఈనెల 21న పెళ్లి చేయాలని ఇరువర్గాల కుటుంబసభ్యులు నిర్ణయించారు. వధువుకు మాత్రం ఈ వివాహం ఇష్టం లేదు. కారణం ఆమె గత మూడేళ్లుగా బాలస్వామితో ప్రేమలో ఉంది. కానీ, బాలస్వామి మరెవరో కాదు.. వధువుకు స్వయాన పెద్దమ్మ కొడుకు. పెళ్లిని ఆపేందుకు బాలస్వామితో కలిసి వధువు పథకం పన్నింది. మరోవైపు ఆదివారం 18 తేది నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వరుడు కుటుంబం రాత్రి బంధువులతో హడావిడిలో ఉండగా వధువు అరుణ నుండి యాకయ్యకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని బయటకు మాట్లాడమని అరుణ చెప్పడంతో వరుడు యాకయ్య బయటకు వచ్చాడు. అప్పటికే మాటువేసిన బాలస్వామి ఒక్కసారిగా యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న యాకయ్యను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అరుణ, బాలస్వామిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. -
వరుడి పేరుతో మోసం.. సెల్ఫోన్ పట్టించింది..!
సాక్షి, అన్నానగర్: చెన్నై సమీపం మాధవరంలో తన కూతురుకి వరుడు కావాలని ఇంటికి వచ్చి నగదు చోరీ చేసుకుని పరారైన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. పొన్నిఅమ్మన్ మేడుస్వామి నగరానికి చెందిన సుబ్రమణి(64). ఇతని భార్య కమలం. ఇంజినీర్గా పని చేస్తూ వస్తున్న తన కుమారుడికి సుబ్రమణి వరన్ను వెతికాడు. 13వ తేదీన 55 ఏళ్ల ఓ వ్యక్తి ఇతని ఇంటికి వచ్చాడు. అతను తిరువరంగడమ్కి చెందిన సంతాన గోపాలన్గా వారికి పరిచయం చేసుకున్నాడు. తరువాత సంతాన గోపాలన్ తన కుమార్తెకి వరుడిని చూస్తున్నానని వారిని నమ్మించాడు. దీంతో వారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని తెలిపారు. సాయంత్రం ఇంటికి వెళ్తానన్న అతనికి స్వీట్బాక్స్ ఇచ్చి పంపారు. కాగా మరుసటిరోజు కుమారుడి వివాహం కోసం బీరువాలో ఉంచిన రూ.1,85,000 నగదు కనిపించలేదు. సుబ్రమణికి సంతాన గోపాల్ మీద అనుమానంతో మాధవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ఫోన్ నెంబర్ పట్టించింది.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. సంతానగోపాలన్ మరచిపోయి సుబ్రమణికి ఇచ్చిన సెల్ఫోన్ నెంబర్ ఆధారంగా అతని అడ్రస్ కనిపెట్టారు. మంగళవారం తిరువరంగం వలైందాన్ వీధిలోని అతని ప్రత్యేక పోలీసులు పట్టుకుని చెన్నైకి తీసుకుని వచ్చారు. విచారణలో సుబ్రమణి ఇంట్లోని నగదు చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు అతని దగ్గర ఉన్న రూ.1,75,000 నగదుకు స్వాధీనం చేసుకున్నారు.