Credit
-
రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు జమ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బుధవారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తంగా 17.03 లక్షల రైతుల అకౌంట్లకు ఇవాళ రైతుభరోసా నిధులు జమ కానున్నట్లు సమాచారం. నాలుగు పథకాల అమలులో భాగంగా.. గణతంత్ర దినోత్సవంనాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. అయితే ఆరోజు సెలవు రోజు కావడంతో.. ఆ మరుసటిరోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగుభూమికి రూ.569 కోట్లను చెల్లించింది. ఇక భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి రోజున 18,180 కుటుంబాలకు మొదటి విడతగా రూ.6 వేల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజున ఆర్థికశాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. రైతు భరోసా నగదు జమ ఆలస్యం అవుతుండడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
మళ్లీ ‘మైక్రో’ పడగ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ జిల్లాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ పడగ విప్పుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. పెద్ద నగరాలు, పట్టణాలు, సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్రాంచీలు తెరిచాయి. పేదలు, మధ్య తరగతి వారి ఆర్థిక అవసరాలు, బలహీనతలను ఆసరాగా తీసుకుని వ్యాపారం చేస్తున్నాయి. మహిళలే టార్గెట్గా, వారిని గ్రూపులుగా చేసి అప్పులు ఇస్తున్నాయి. ఒకరు కట్టకుంటే మిగతా వారంతా కలసి కట్టాలనే నిబంధనలు పెడుతూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒకవేళ వాయిదాలు కట్టలేకపోతే... ‘చస్తే చావండి.. డబ్బులు మాత్రం కట్టండి’ అంటూ తీవ్రంగా వేధింపులకు దిగుతున్నాయి. ఈ మైక్రో ఫైనాన్స్ల వలలో చిక్కి వేలాది కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. సంపాదించే కాసింత కూడా వడ్డీలకే సరిపోవడం లేదంటూ.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. రిజర్వు బ్యాంకు నిబంధనలు అంటూ... మైక్రో ఫైనాన్స్ సంస్థలు పది నుంచి ఇరవై మంది వరకు మహిళలను గ్రూపుగా చేసి.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆధార్కార్డు, పాన్కార్డు జిరాక్స్లు తీసుకుని రుణాలు ఇస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకులుగా రిజిస్టర్ చేయించుకుని చట్టబద్ధంగానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో చూపుతున్నాయి. వివిధ పేర్లతో ముందుగానే కోతలు పెడుతున్నాయి. అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు గ్రూపులో ఒక్కో మహిళకు రూ.30వేల చొప్పున అప్పుగా ఇస్తారు. ఇందులోనూ బీమా, ప్రాసెసింగ్ ఫీజు పేరిట రూ.2 వేలు ముందే కోతపెట్టి.. రూ.28 వేలు మాత్రమే మహిళల చేతికి ఇస్తారు. ఈ అసలు, వడ్డీ కలిపి వారానికి రూ.800 చొప్పున ఏడాది పాటు చెల్లించాలి. అంటే రూ.28 వేలకుగాను.. మొత్తంగా రూ.44,800 కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ వారమైనా వాయిదా సమయానికి చెల్లించకుంటే.. అదనంగా రూ.100 జరిమానా కింద వసూలు చేస్తారు. అసలు లక్ష్యం పక్కదారి పట్టి.. స్పందన, కీర్తన, ఫిన్కేర్, ఒరిగో, సౌత్ ఇండియా, అన్నపూర్ణ, యాక్సిస్, పిరమిల్, ఐ రిఫ్, క్రిస్, బంధన్, ఎపాక్, హోమ్ లోన్స్ ఫైనాన్స్, వెరిటాస్ మైక్రో ఫైనాన్స్, ప్యూజియన్ బ్యాంకు, ఆశీర్వాద్ బ్యాంకు, ఎఫ్ఎఫ్ఎల్, ఫెడరల్ బ్యాంకు వంటి సంస్థలు మైక్రో ఫైనాన్స్ చేస్తున్నాయి. వాస్తవానికి పేదలకు తక్కువ మొత్తంలో రుణాలు సులువుగా అందించడం, ఆర్థిక చేయూత ద్వారా పేదరికాన్ని తగ్గించడం లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ వ్యవస్థల లక్ష్యం. సూక్ష్మరుణాల ద్వారా వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి తోడ్పడాలి. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పోటాపోటీగా పాగా.. అడ్డగోలు వడ్డీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన టాప్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు తెలంగాణలోనూ పాగా వేశాయి. అవి రూ.8 వేల నుంచి రూ.50 వేల వరకు మహిళలకు రుణాలు ఇస్తున్నాయి. రుణాలు ఇచ్చే సమయంలోనే కాల పరిమితిని బట్టి 36 శాతం వరకు వడ్డీ పడుతుందని ఒప్పంద పత్రంలోనే పేర్కొంటున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కోరకంగా డాక్యుమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, బీమా వంటివాటి పేరిట రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు రుణంలో ముందే కోతపెడుతున్నాయి. అన్నీ కలిపి లెక్కేస్తే.. పేరుకు 36 శాతం అయినా, 50శాతం దాకా వడ్డీ పడుతున్న పరిస్థితి. పేదలు ఈ వడ్డీల భారం భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆవేదనతో ప్రాణాలు తీసుకోవడానికీ ప్రయత్నిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకే అంటూ.. 2008లోనూ ఇలాగే మైక్రో ఫైనాన్స్ వేధింపులు పెరిగిపోవడంతో.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కఠిన చర్యలు చేపట్టారు. మైక్రో ఫైనాన్స్ వసూళ్లపై కొంతకాలం మారటోరియం విధించారు. ఈ సమస్య పరిష్కారం కోసం 2010 అక్టోబర్ 14న ఒక ఆర్డినెన్స్ తెచ్చేందుకు నాటి ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేధింపులకు పాల్పడే మైక్రో ఫైనాన్స్ నిర్వహకులకు కనీసం మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించాలని.. ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయితే ఇప్పుడు రూటు మార్చిన మైక్రో ఫైనాన్స్ సంస్థలు బ్యాంకుల పేరిట ఆర్బీఐ నిబంధనలంటూ దందాకు శ్రీకారం చుట్టాయి. సంపాదన.. అప్పు, వడ్డీ కిందకే పోతోంది చిన్న వ్యాపారానికి పెట్టుబడి కోసం మైక్రో ఫైనాన్స్లో రూ.85 వేల రుణం తీసుకున్నాం. వారానికి రూ.1,400 చొప్పున 90 వారాలు చెల్లించాలి. రోజూ గిన్నెలు విక్రయించగా వచ్చే మొత్తంలో కొంత ఇంటి అవసరాలకుపోగా మిగతా అంతా ఫైనాన్స్కు చెల్లిస్తున్నా. ఒక్కోసారి వ్యాపారం సాగకపోయినా వాయిదా మాత్రం చెల్లించాల్సి వస్తోంది. ఏ మాత్రం ఆలస్యమైనా జమానత్ ఉన్నవారిపై ఒత్తిడి తెస్తున్నారు. 20 ఏళ్ల నుంచి చేస్తున్న ఈ చిన్నపాటి వ్యాపారంతో సంపాదించిందంతా అప్పు, వడ్డీకే పోతోంది. – బానాల శంకర్, కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లా అటువంటి రుణాలతో మోసపోవద్దు మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి అధిక వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరైనా భద్రత, సెక్యూరిటీ లేని సంస్థల నుంచి రుణాలు పొందేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి లోన్లతో మోసపోవద్దు. సభ్యులను బ్యాంకు సిబ్బంది లేదా తోటి సభ్యులు ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలి. – పి.సంపత్రావు, డీఎస్పీ, భూపాలపల్లి ఈ చిత్రంలోని వ్యక్తి పేరు దుబాసి సాయికృష్ణ (27). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఉండేవారు. ఆయన భార్య రజిత పేరిట మైక్రో ఫైనాన్స్లో రుణం తీసుకున్నారు. ఆ వాయిదాలు చెల్లించలేకపోవడంతో వేధింపులు ఎదురయ్యాయి. దాంతో నూతి అనిల్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.20వేలు అప్పు చేసి.. ఆ వాయిదాలు కట్టారు. కానీ ఈ అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో సాయికృష్ణను నిలదీసిన అనిల్.. అతడి సెల్ఫోన్ లాక్కుని వెళ్లాడు. సాయికృష్ణ ఈ అవమానం భరించలేక ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ కేసులో అప్పు ఇచ్చి వేధించిన నూతి అనిల్ జైలుకు వెళ్లాడు. కానీ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు బలవంతపు వసూళ్లు చేస్తున్నా చర్యలు లేవు.నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆవాల భారతి భర్త పదేళ్ల కిందే మరణించాడు. ఆమె గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గాజులు, బొమ్మలు, దండలు అమ్ముతూ.. కొడుకు, కూతురును పోషించుకుంటోంది. ఇటీవల వ్యాపారం కోసం మైక్రో ఫైనాన్స్లో రూ.50 వేలు రుణం తీసుకుని వారానికి రూ.5 వేలు చెల్లిస్తోంది. గిరాకీ సరిగా లేక ఇబ్బంది ఎదురైనా రుణం వాయిదా చెల్లించాల్సి వస్తోందని.. లేకుంటే జమానత్ దారుపై ఒత్తిడి తెచ్చి వసూలు చేసుకుంటున్నారని వాపోతోంది. ఈ వాయిదాలు చెల్లించడం కోసం మరో ఫైనాన్స్లో రుణం తీసుకుని కడుతున్నానని... సంపాదించే కాస్త కూడా వడ్డీలకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించండి
న్యూఢిల్లీ: వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన మేర రుణ వితరణ చేయాలంటూ బ్యాంక్లను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, డైరీ, ఫిషరీస్కు రుణ వితరణ పురోగతిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు మంగళవారం ఢిల్లీలో అధికారులతో కలసి సమీక్షించారు. ప్రభుత్వరంగ బ్యాంక్లు (పీఎస్బీలు), నాబార్డ్, వ్యవ సాయ అనుబంధ రంగాలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీల తరఫున ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ వితరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్లు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నాగ రాజు కోరారు. అలాగే ఈ దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి, ఉపాధి కల్పన పరంగా అనుబంధ రంగాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ రుణ వితరణ సాఫీగా సాగేందుకు సమావేశాల నిర్వహణ/మదింపు చేపట్టాలని బ్యాంక్లను ఆదేశించారు. చేపల రైతులను గుర్తించి, వారికి కేసీసీ కింద ప్రయోజనం అందే దిశగా రాష్ట్రాలకు సహకారం అందించాలని నాబార్డ్ను సైతం కోరారు. -
అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
సెప్టెంబర్ ముగుస్తోంది.. అక్టోబర్ నెల మొదలవడానికి మరికొన్ని రోజుల మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెలలో మాదిరిగానీ వచ్చే నెలలో (2024 అక్టోబర్) కూడా ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వంటివాటికి సంబంధించిన చాలా నిబంధలను మారతాయి. ఈ కథనంలో వచ్చే నెలలో ఏ రూల్స్ మారుతాయనే విషయం తెలుసుకుందాం..స్మాల్ సేవింగ్ స్కీమ్2024 అక్టోబర్ 1 నుంచి స్మాల్ సేవింగ్ రూల్స్ మారనున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాల వంటి పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు ఖాతాలు కొత్త సర్దుబాట్లకు లోబడి ఉంటాయి. రెగ్యులర్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్ (NSS) ఖాతాలపై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కొన్ని అకౌంట్స్ క్రమబద్దీకరించాల్సి ఉంటుంది.ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలుఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 నుంచి మీరు రూ. 10వేలు ఖర్చు చేయడం ద్వారా రెండు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు.. తరువాత క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్ను అన్లాక్ చేస్తాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మార్పులువచ్చే నెల ప్రారంభం నుంచే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్దులో కొన్ని మార్పులు జరగనున్నాయి. స్మార్ట్బై ప్లాట్ఫామ్లో.. యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే.. అందులో వచ్చే రివార్డ్ పాయింట్స్ కేవలం ప్రొడక్ట్కు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు 1వ తేదీ నుంచి స్మార్ట్బై పోర్టల్ ప్రతి క్యాలెండర్ త్రైమాసికానికి 50,000 రివార్డ్ పాయింట్ల చొప్పున తనిష్క్ వోచర్ల కోసం రివార్డ్ పాయింట్ల రిడీమ్ను పరిమితం చేస్తుంది. ఈ మార్పులు ఇన్ఫినియా, ఇన్ఫినియా మెటల్ కార్డ్లకు మాత్రమే వర్తిస్తాయి.ఇదీ చదవండి : ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంటీడీఎస్ వడ్డీ రేట్లుకేంద్ర బడ్జెట్ సమయంలో సెక్షన్ 194DA - జీవిత బీమా పాలసీకి సంబంధించి చెల్లింపును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇది అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. సెక్షన్ 194G - లాటరీ టిక్కెట్ల విక్రయంపై కమీషన్ తదితరాలను కూడా 5 నుంచి 2 శాతానికి తగ్గించాలని పేర్కొన్నారు. ఇది కూడా 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. కమిషన్ లేదా బ్రోకరేజీ చెల్లింపులు, హెచ్యూఎఫ్లు చేసే అద్దె చెల్లింపులు వంటి వాటికి అక్టోబర్ 1 నుంచి టీడీఎస్ రేట్లు తగ్గుతున్నట్లు సమాచారం. -
అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి
డబ్బు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అప్పుల ఊబిలో చిక్కుకోవాల్సిందే. మనకు తెలిసిన చాలామంది, మరీ ముఖ్యంగా జీతం తీసుకుంటున్నవారు తరచూ అప్పులు చేయడం గమనిస్తుంటాం. బాధ్యతా రహితంగా డబ్బు తీసుకుంటే భవిషత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పు చేస్తున్న చాలామందికి దాని తీవ్రత తెలియక మళ్లీ అదే పనిచేస్తుంటారు. అప్పు ఉచ్చులో చిక్కుకుంటున్నామని సూచించే కొన్ని సంకేతాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐలకు చెల్లిస్తుంటే క్రమంగా అప్పుల్లోకి జారుకుంటున్నారని తెలుసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ పెరుగుతున్న క్రమంలో చాలామంది ఈజీ ఈఎంఐలు, డిస్కౌంట్లు, సేల్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చుతో ఇబ్బందులు తప్పవు. అప్పు మిమ్మల్ని మరింత ఊబిలో పడేస్తుంది. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాలంటే మాత్రం వచ్చే ఆదాయంలో ఈఎంఐలు 50శాతం కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.రోజువారీ ఖర్చుల కోసం అప్పురోజువారీ ఆర్థిక అవసరాల కోసం తరచు అప్పు తీసుకుంటే మాత్రం మీ ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులకు అప్పు తీసుకుంటే రుణఊబిలోకి వెళ్లే ప్రమాదం ఉంది.క్రెడిట్ కార్డుతో జాగ్రత్తతీసుకున్న అప్పులను తీర్చడానికి క్రెడిట్ కార్డ్లను ఉపయోగించడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు తీయడానికి భారీగా చార్జీలు వసూలు చేస్తారు. ఇది 2.5శాతం నుంచి 3.5శాతం వరకు ఉంటుంది. వార్షిక ప్రాతిపదికన, అసోసియేటెడ్ వడ్డీ 35శాతం నుంచి 50శాతం వరకు చేరవచ్చు.పేమెంట్లను చెల్లించకపోవడంక్రెడిట్ కార్డ్ డ్యూ డేట్లోపు పేమెంట్ చెల్లించాలి. అందులో మినిమం డ్యూ కడితే సరిపోతుందనుకోవద్దు. మిగిలిన డ్యూ మొత్తాన్ని నెలవారీగా వడ్డీ విధిస్తారు. అది మరింత ప్రమాదకరం. దాంతో మీ సిబిల్ స్కోర్ ప్రభావం చెందుతుంది. ఒక సర్వే ప్రకారం, దాదాపు 21శాతం మంది క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం లేదు లేదా గత సంవత్సరంలో కనీస బకాయి మొత్తాన్ని మాత్రమే చెల్లించడం ద్వారా దాన్ని రోల్ ఓవర్ చేశారు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్లను ఫార్వర్డ్ చేసినా మూడుశాతం వడ్డీ భరించాలి. ఈ రోల్ఓవర్ చక్రంలో చిక్కుకున్నట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని క్లియర్ చేసుకోవాలి.భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై అప్పుభవిష్యత్తులో ఫలానా వారు డబ్బు ఇస్తారనో.. లేదా ఈ సంవత్సరం చివర్లో బోనస్ వస్తుందనో ఇప్పుడే అప్పు తీసుకుంటే ఇబ్బందుల్లో పడవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. తప్పని పరిస్థితుల్లో ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవచ్చు. కానీ రాబోయే బోనస్, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిపై కాదు.ఇంక్రిమెంట్లను నమ్మొద్దుభవిష్యత్తులో వచ్చే జీతం, ఇంక్రిమెంట్లను ఎక్కువగా అంచనా వేస్తారు. కెరీర్ ప్రారంభ దశల్లో ఇంక్రిమెంట్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఇవి రిటైర్మెంట్ వరకు కొనసాగకపోవచ్చు. కాబట్టి కనిపించని భవిషత్తుపై అంచనాలతో ప్రస్తుతం అప్పులు చేయడం తప్పు.ఫ్లోటింగ్ వడ్డీ రేట్లుఉద్యోగంలో చేరిన వెంటనే చాలామంది అడిగేప్రశ్న.. ‘ఇల్లు ఎప్పుడు కొంటారు’ అని.. దాంతో స్థోమతకు మించి అప్పు చేసైనా సరే ఇల్లు కొనాలనుకుంటారు. దీర్ఘకాల వ్యవధికిగాను హోమ్లోన్లను ఎంచుకునేప్పుడు ఫ్లోటింగ్ రేట్లును సెలక్ట్ చేసుకుంటారు. దాంతో వడ్డీ రేట్ల పెంపు వల్ల వచ్చే ఈఎంఐలలో ఆకస్మిక పెరుగుదలకు సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తులో కిస్తీలు 20శాతం వరకు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకొని లోన్ రీపేమెంట్ కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం మంచిది.లోన్ తీర్చడానికి మళ్లీ అప్పువడ్డీ ఖర్చులను తగ్గించడానికి, హోం లోన్ రీఫైనాన్స్ చేయడం వంటివాటి కోసం తప్పా..అప్పు తిరిగి చెల్లించడానికి డబ్బు తీసుకోవడం మంచిది కాదు. సాధారణంగా, సామాజిక ఒత్తిళ్ల కారణంగా హోంలోన్, కారు లోన్ ఈఎంఐలు, అద్దె, పాఠశాల ఫీజులు వంటి చెల్లింపులను వాయిదా వేయడానికి వెనుకాడతారు. బదులుగా, కొందరు క్రెడిట్ కార్డ్లను ఆశ్రయిస్తారు. అవసరమైన కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ అప్పును పెంచుకుంటూ పోతారు. -
బ్యాంకుల్లో రుణవృద్ధి తగ్గుతుందన్న ప్రముఖ సంస్థ
భారతీయ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్, లాభాల విషయంలో ఆశించిన వృద్ధి నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే అనుకున్న మేరకు డిపాజిట్లు రావని, దాంతో రుణ వృద్ధి తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది.ఆసియా-పసిఫిక్ 2క్యూ 2024 బ్యాంకింగ్ అప్డేట్ కార్యక్రమంలో ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ నికితా ఆనంద్ మాట్లాడారు. ‘గతేడాదిలో 16 శాతం వృద్ధి నమోదుచేసిన రిటైల్ డిపాజిట్లు ఈ ఏడాది 14 శాతానికి పరిమితం కానున్నాయి. ప్రతి బ్యాంకులో రుణం-డిపాజిట్ల నిష్పత్తిలో తేడా ఉండనుంది. లోన్వృద్ధి డిప్లాజిట్ల కంటే 2-3 శాతం ఎక్కువగా ఉండనుంది. ఈ ఏడాదిలో బ్యాంకులు తమ రుణ వృద్ధిని తగ్గించి, డిపాజిట్ల పెంపునకు కృషి చేయాలి. అలా చేయకపోతే బ్యాంకులు నిధులు పొందడానికి కొంత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది’ అని చెప్పారు. సాధారణంగా రుణ వృద్ధిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు 17-18 శాతం వృద్ధి నమోదుచేస్తాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సరాసరి 12-14 శాతం మేరకు రుణ వృద్ధి ఉంటుంది. -
అక్రమ రుణయాప్లు.. యమపాశాలు! ఎలా మోసం చేస్తున్నారో తెలుసా..
రుణాల కోసం బ్యాంక్లను ఆశ్రయించడం ఆనవాయితీగా మారింది. మారుతున్న టెక్నాలజీతో అప్పు కావాలనుకుంటున్నవారు బ్యాంకులకు బదులుగా రుణ యాప్లను వినియోగిస్తున్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ధ్రువపత్రాలు, గుర్తింపు వివరాలు తెలియజేయకుండా వెంటనే అప్పులిస్తామంటూ ప్రకటించడంతో వాటి వలలో పడుతున్నారు. అధిక మొత్తం వడ్డీలు లాగుతున్న రుణయాప్ల మూసుగులోని నేరముఠాలు గడువు ముగిసి వసూళ్ల పర్వం ప్రారంభించాక వేధింపులకు దిగుతున్నాయి. అక్రమ రుణయాప్లు నిరుద్యోగులు, చిరుద్యోగులు, పేద విద్యార్థులు, వ్యాపారుల ఉసురుతీస్తున్నాయి. ఆ రుణయాప్లపై చర్యలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని గడచిన సెప్టెంబరులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అక్రమ రుణయాప్లను అరికట్టడానికి ఆర్బీఐ, సెబీలతోపాటు రెగ్యులేటరీ సంస్థలు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రమంత్రి చెప్పారు. దేశంలో నేడు రుణయాప్లు వేల సంఖ్యలో విస్తరించాయి. అందులో మోసపూరితమైనవేమిటో తెలియజేయాల్సిన బాధ్యతను, వాటన్నింటినీ నియంత్రించే కార్యాన్ని కేంద్రం రాష్ట్రప్రభుత్వాలకు, పోలీసు విభాగాలకు, రిజర్వ్బ్యాంకుకు వదిలేస్తే ఎలా అనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రిత్వశాఖలు, టెలికాం సంస్థలు, సెబీ, రాష్ట్రాలు... అన్నీ కలిసికట్టుగా పని చేయాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేలల్లో రూపాయలు ఎరగా చూపి వాటిని రుణాలిచ్చి లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్న అక్రమ ఆన్లైన్ రుణదాతలు భారీ మోసాలకు తెరతీస్తున్నట్లు సమాచారం. గతంలో దాదాపు రూ.170 కోట్ల పెట్టుబడితో ఏడాదిలోనే చైనాకు చెందిన ఓ రుణయాప్ సంస్థ ఏకంగా రూ.11,700 కోట్లు దండుకున్న ఘటనలు వెలుగుచూశాయి. ఒక్క హైదరాబాద్లోనే ఆన్లైన్ రుణయాప్లతో సుమారు రూ.32 వేలకోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఆన్లైన్ రుణాల్లో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు ముందుగానే అప్పులో దాదాపు 35శాతం మేర మినహాయించుకుంటారు. గడువు తీరిన వెంటనే అధిక వడ్డీతో బాకీలు వసూళు చేస్తారు. ఇదీ చదవండి: 20 దేశాలను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..? కీలక పత్రాలు లీక్.. డిమాండ్ చేసినమేరకు చెల్లించకపోతే రుణ తీసుకున్నపుడు మొబైల్లో అన్ని అనుమతులు ఇస్తారు కాబట్టి అప్పు తీసుకున్నవారి కాంటాక్ట్ వివరాలు, గ్యాలరీ, హిస్టరీ అన్ని రికార్డవుతాయి. దాంతో మార్ఫింగ్ చేసిన కుటుంబ సభ్యుల ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ చేస్తారు. దాంతో బాధితులు తట్టుకోలేక అడిగినంత ముట్టజెపుతారు. ఆన్లైన్ రుణయాప్ల నియంత్రణకు పటిష్ఠ చట్టాలు, చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. -
ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల నిబంధనలు కఠినతరం
ముంబై: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిబంధనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సవరణలను ప్రతిపాదించింది. రూ. 25 లక్షలకు పైన బాకీ పడి, స్థోమత ఉన్నా చెల్లించడానికి నిరాకరిస్తున్న వారిని ఈ పరిధిలోకి చేర్చేలా నిర్వచనాన్ని మార్చనున్నట్లు ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ కోవకు చెందిన డిఫాల్టర్లకి రుణ సదుపాయాన్ని పునర్వ్యవస్థీకరించుకునేందుకు అర్హత ఉండదు. అలాగే ఇతరత్రా ఏ కంపెనీ బోర్డులోనూ పదవులు చేపట్టే వీలుండదు. బాకీలను వేగవంతంగా రాబట్టుకునేందుకు అవసరాన్ని బట్టి సదరు రుణగ్రహీతలు, హామీదారులపై బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మొండిబాకీగా వర్గీకరించిన పద్దుకు సంబంధించి ఆరు నెలల వ్యవధిలో ఉద్దేశపూర్వక ఎగవేత అవకాశాలను సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముసాయిదాపై సంబంధిత వర్గాలు అక్టోబర్ 31లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
40 ఖాతాల్లోకి ఉన్నట్టుండి లక్షలు.. డబ్బులు తీసుకునేందుకు క్యూ!
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని కొందరు గ్రామీణులు రాత్రికిరాత్రే లక్షాధికారులయ్యారు. వీరి బ్యాంకు ఖాతాల్లో గుర్తుతెలియని అకౌంట్ నుంచి డబ్బలు జమ అయ్యాయి. సుమారు 40 మంది గ్రామీణుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. దీనికి సంబంధించిన మెసేజ్ రాగానే ఆ ఖాతాదారుల ఆనందంతో చిందులేశారు. ఆ డబ్బు తీసుకునేందుకు బ్యాంకు ముందు క్యూ కట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన కేంద్రపారా జిల్లాలోని ఒడిశా గ్రామ్య బ్యాంకు చెందిన బాటీపాడా శాఖలో చోటుచేసుకుంది. ఖాతారులు తమ అకౌంట్లోని పెద్ద మొత్తంలో డబ్బులు జమకావడంతో వారంతా బ్యాంకుకు చేరుకున్నారు. కొందరు తమ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరించుకున్నారు. మరికొందరు డబ్బులు తీసుకోలేకపోయారు. పలువురు ఖాతాదారులకు అకౌంట్లలో వేల రూపాయలు మొదలుకొని 2 లక్షల రూపాయల వరకూ జమ అయ్యాయి. దీనిని గమనించిన బ్యాంకు అధికారులు నగదు విత్డ్రాలను నిలిపివేశారు. వినియోగదారుల ఖాతాలలోకి ఈ సొమ్ము ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: బెర్లిన్లో గణేశుని ఆయలం.. దీపావళికి ప్రారంభం -
చూడటానికి చిన్న "క్యూఆర్ కోడ్"..వ్యాపారంలో ప్రకంపమే సృష్టిస్తోంది!
రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు, చాట్ బండి, పండ్ల షాపులను గమనించారా? అక్కడ మీకో యూపీఐ క్యూఆర్ కోడ్ దర్శనమిస్తుంది. చూడ్డానికి చిన్నదే అయినా వాటి ఆధారంగా జరుగుతున్న వ్యాపారం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! దేశ వాణిజ్యంలో యూపీఐ క్యూఆర్ కోడ్స్ అత్యంత కీలకంగా మారాయంటే అతిశయోక్తి కాదు. కుగ్రామాల్లోని చిరు వ్యాపారుల వద్ద కూడా దర్శనమిస్తున్న ఈ కోడ్లను గమనిస్తే, డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారతావని ముఖచిత్రం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తుల నుంచి వర్తకులకు చేరిన డిజిటల్ పేమెంట్స్లో సంఖ్యపరంగా రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల వాటా ఏకంగా 84.27 శాతం ఉంది. చిన్న చిన్న మొత్తాలే డిజిటల్ రూపంలో చేతులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ భారత వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి కోట్లాది మందిని తీసుకొచ్చింది. రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసింది. కోట్లాదిమంది భారతీయులకు క్రెడిట్, సేవింగ్స్ వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించింది. ప్రభుత్వ కార్యక్రమాలు లబ్ధిదారులకు నేరుగా చేరాయి. పన్నుల వసూళ్లలో వృద్ధి నమోదవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం ఇంతకు ముందు చూడని స్థాయిలో ఈ సాంకేతిక ఆవిష్కరణ ప్రభావం చూపించింది. సౌకర్యాల కలబోత.. చాక్లెట్ కొన్నా షాపు యజమానికి అక్కడి క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరు సాయంతో డబ్బులు చెల్లించొచ్చు. అదీ 10 సెకన్లలోపే. కస్టమర్కి గాని, వ్యాపారస్తుడికి గాని చేతిలో చిల్లర లేదన్న బెంగ లేదు. క్యాష్ కోసం ఏటీఎమ్కి, బ్యాంకుకు పరుగెత్తే పని లేదు. షాపింగ్ కోసం చేతినిండా నగదు ఉంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా చేతిలో ఉన్న ఫోన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్ యాప్ ఉంటే చాలు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి క్షణాల్లోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. వర్తకులు ప్రతిసారీ తమ మొబైల్ను చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాయిస్ బాక్సులు వచ్చాయి. వినియోగదారుడి బ్యాంకు ఖాతా, లేదా డిజిటల్ వాలెట్ నుంచి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు డబ్బులు నేరుగా బదిలీ అవుతాయి. యూపీఐ యాప్లో ప్రతి బ్యాంకు ఖాతాకు ఒక వర్చువల్ పేమెంట్ అడ్రస్ (ఐడీ) క్రియేట్ అవుతుంది. ఈ యూపీఐ ఐడీ లేదా బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబరుతో కూడా డబ్బులు చెల్లించవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిగే చెల్లింపులకు ఎటువంటి చార్జీ ఉండదు. అంటే బ్యాంకు ఖాతా నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా జరిగే లావాదేవీలు కూడా ఉచితం అన్నమాట. మొబైల్ రీచార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్లులు, బీమా, డీటీహెచ్ చెల్లింపులు, సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు. లావాదేవీల పరిమితి రోజుకు రూ.1 లక్ష వరకు ఉంది. దేశవ్యాప్తంగా అధికారికంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో విలువ పరంగా యూపీఐ వాటా 43 శాతం ఉందంటే అతిశయోక్తి కాదు. పీవోఎస్ టెర్మినల్స్ను మించి.. క్యూఆర్ కోడ్స్కు ఆదరణ అంతా ఇంతా కాదు. విక్రేతలు ఎవరైనా డిజిటల్ రూపంలో నగదును స్వీకరించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణమేమిటంటే తెల్లకాగితం మీద కూడా క్యూఆర్ కోడ్ను ప్రింట్ తీసుకుని వినియోగించే వెసులుబాటు ఉండడం. పైగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్ ఖరీదు సుమారు రూ.12 వేల వరకు ఉంది. ఎంపీవోఎస్ ఖరీదు అయిదు వేల వరకు పలుకుతోంది. చౌకైన వ్యవహారం కాబట్టే క్యూఆర్ కోడ్స్ పాపులర్ అయ్యాయి. వినియోగదారులు సైతం డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపుతుండటమూ వీటి వినియోగం పెరిగేందుకు దోహదం చేసింది. నగదుతో పోలిస్తే చాలా సందర్భాల్లో అతి తక్కువ సమయంలో డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నాటికి వర్తకుల కోసం 26 కోట్ల పైచిలుకు క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నగదును స్వీకరించే పీవోఎస్ టెర్మినల్స్ 78 లక్షలు ఉన్నాయి. పీవోఎస్ టెర్మినల్స్ను మించి క్యూఆర్ కోడ్స్ జారీ అయ్యాయంటే యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపుల వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ సంస్థలు క్యూఆర్ కోడ్స్ను జారీ చేస్తున్నాయి. ఆధార్ ఆధారంగా.. దేశంలో 99 శాతం మంది పెద్దలు బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్యను కలిగి ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 130 కోట్లకుపైగా ఆధార్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిచే పనిని సులభతరం చేశాయి. అలాగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని పిలిచే తక్షణ చెల్లింపు వ్యవస్థకు పునాదిగా మారాయి. 2016 నవంబర్లో భారత ప్రభుత్వం రూ.500, 1,000 నోట్లను రద్దు చేసింది. నోట్ల కొరత కూడా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లడానికి కారణం అయింది. గత ఏడాది భారత్లో ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్స్ లావాదేవీల విలువ యూఎస్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ల కంటే చాలా ఎక్కువ. ఈ నాలుగు దేశాల మొత్తం లావాదేవీలే కాదు, ఈ మొత్తం విలువను నాలుగుతో గుణించినదాని కంటే భారత లావాదేవీలు అధికమని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 30 కోట్ల పైచిలుకు వ్యక్తులు, 5 కోట్లకు పైగా వర్తకులు యూపీఐ వేదికపైకి వచ్చి చేరారు. పట్టణ ప్రాంతాలను దాటి.. యూపీఐ వేదికగా 2021 ఏప్రిల్లో రూ.4,93,663 కోట్ల విలువైన 264 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాతి సంవత్సరం ఏప్రిల్లో రూ.9,83,302 కోట్ల విలువైన 558 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 వచ్చేసరికి యూపీఐ లావాదేవీల విలువ ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.14,15,504.71 కోట్లకు ఎగసింది. లావాదేవీల సంఖ్య 886.32 కోట్లకు చేరింది. అంటే రెండేళ్లలో లావాదేవీల విలువ మూడింతలకు చేరువ అవుతోంది. పరిమాణం మూడు రెట్లు దాటింది. 2021లో గరిష్ఠంగా డిసెంబర్లో రూ.8,26,848 కోట్లు, 2022 అత్యధికంగా డిసెంబర్లో రూ.12,81,970.8 కోట్లు నమోదయ్యాయి. డిజిటల్ పేమెంట్లు భారత్లో వేగంగా ఆదరణ చెందుతున్నాయని అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. కోవిడ్–19 మహమ్మారి సమయంలో యూపీఐ ప్లాట్ఫామ్ పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది. పట్టణ ప్రాంతాలను దాటి గ్రామీణ భారతదేశానికి కూడా యూపీఐ విస్తరించడం నిపుణులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్లో 2016 నుంచి.. సౌలభ్యం ఉంది కాబట్టే చెల్లింపుల వ్యవస్థలో రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విప్లవం సృష్టిస్తోంది. భారత్లో అయితే వీటి లావాదేవీల సంఖ్య, విలువ అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది. విభిన్న బ్యాంకు ఖాతాలను పేమెంట్ యాప్కు అనుసంధానం చేయడం ద్వారా నగదుకు బదులు డిజిటల్ రూపంలో చెల్లింపులను సురక్షితంగా, క్షణాల్లో పూర్తి చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) 2016 ఏప్రిల్ 11న యూపీఐ సేవలను పైలట్ ప్రాజెక్టుగా 21 బ్యాంకులతో కలసి భారత్లో ప్రారంభించింది. అదే ఏడాది ఆగస్ట్ 25 నుంచి గూగుల్ ప్లే స్టోర్లలో బ్యాంకులు తమ పేమెంట్ యాప్స్ను జోడించడం మొదలుపెట్టాయి. భారత్లో ప్రస్తుతం 414 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. పేమెంట్ యాప్స్లో ఫోన్పే విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ యాప్ 2023 ఏప్రిల్లో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్పే, పేటీఎమ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్పీసీఐ ప్రమోట్ చేస్తున్న భీమ్ యాప్ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్లో టాప్–10 పేమెంట్ యాప్స్లో ఏడవ స్థానాన్ని భీమ్ దక్కించుకుంది. 2023 ఏప్రిల్లో విలువ పరంగా తొలి 10 స్థానాల్లో నిలిచిన యాప్స్ పేమెంట్ యాప్స్లో ఫోన్పే విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ యాప్ 2023 ఏప్రిల్లో లావాదేవీల సంఖ్య, విలువ పరంగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్పే, పేటీఎమ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్పీసీఐ ప్రమోట్ చేస్తున్న భీమ్ యాప్ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్లో టాప్–10 పేమెంట్ యాప్స్లో ఏడవ స్థానాన్ని భీమ్ దక్కించుకుంది. (2023 ఏప్రిల్లో విలువ పరంగా తొలి 10 స్థానాల్లో నిలిచిన యాప్స్) కోవిడ్ కాలంలో రెండింతలు.. 2016 డిసెంబర్లో రూ.708 కోట్ల విలువైన యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు జరిగాయి. 2017లో ఒక నెలలో గరిష్ఠంగా రూ.13,174 కోట్లు నమోదయ్యాయి. 2018 డిసెంబరులో లక్ష కోట్ల మార్కును దాటింది. ఏడాదిలోనే రెట్టింపు అయ్యాయి. 2020 జూలై నుంచి యూపీఐ లావాదేవీల వేగం పుంజుకుంది. ఆ నెలలో రూ.2,90,538 కోట్ల విలువైన 149.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కాలంలో వైరస్ భయానికి నోట్లను ముట్టుకోవడానికి ప్రజలు ససేమిరా అన్నారు. దీంతో డిజిటల్ చెల్లింపులకు మళ్లారు. ఫలితంగా 2020, 2021లో డిజిటల్ లావాదేవీల విలువ రెట్టింపైంది. 2022 మే నెలలో రూ.10 లక్షల కోట్ల మైలురాయి దాటి యూపీఐ సరికొత్త రికార్డు సృష్టించింది. అంటే 40 నెలల్లోనే పదిరెట్లు అయ్యాయంటే పేమెంట్ యాప్స్ ఏ స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. యూపీఐదే 43 శాతం వాటా.. ఏటీఎమ్ల నుంచి నగదు స్వీకరణ, జమ, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు, ఇతర మార్గాల్లో దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక లావాదేవీల పరిమాణం 2022–23లో 10,620.6 కోట్లు. వీటి విలువ రూ.3,22,36,700 కోట్లు. ఇందులో యూపీఐ సింహభాగం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో యూపీఐ వేదికగా 8,375.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.1,39,20,678 కోట్లు. అధికారికంగా జరిగిన మొత్తం ఆర్థిక లావాదేవీల్లో యూపీఐ ఏకంగా 43.18 శాతం వాటా కైవసం చేసుకుందన్న మాట. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) చెక్ క్లియరింగ్ విధానం ద్వారా రూ.71,67,040 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొబైల్ ఫోన్స్ ద్వారా బ్యాంకుల మధ్య ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలైన ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) వేదికగా రూ.55,86,147 కోట్లు నమోదయ్యాయి. ఏటీఎమ్లలో నగదు జమ, స్వీకరణ లావాదేవీల విలువ రూ.16,62,419 కోట్లు ఉంది. ప్రజల వద్ద చలామణీలో ఉన్న నగదు రూ.36 లక్షల కోట్లు. ఇవీ డిజిటల్ లావాదేవీలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్టెక్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో పురోగతి ఇందుకు తోడ్పడింది. 2017–18లో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య 2,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 10,000 కోట్లు దాటింది. దీంతో డిజిటల్ లావాదేవీల విలువ 50 శాతానికిపైగా ఎగసింది. యూపీఐ ఇందుకు దోహదం చేసింది. 2022లో రూ.149.5 లక్షల కోట్ల విలువైన 8,792 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ.126 లక్షల కోట్ల విలువైన 7,405 కోట్ల లావాదేవీలు యూపీఐ కైవసం చేసుకుంది. డిజిటల్ పేమెంట్ల విలువ 2026 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఫోన్పే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఇదే జరిగితే నగదు లావాదేవీల వాటా 60 నుంచి 35 శాతానికి వచ్చి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో భవిష్యత్ అంతా 3–6 తరగతి శ్రేణి నగరాలు, పట్టణాలదే. గడిచిన రెండేళ్లుగా కొత్త మొబైల్ పేమెంట్ కస్టమర్లలో ఈ నగరాలు, పట్టణాలకు చెందినవారు 60–70 శాతం ఉన్నారట. 2023 మార్చినాటికి భారత్లో 96.12 కోట్ల డెబిట్ కార్డులు జారీ అయ్యాయి. 5.5 కోట్ల మంది వద్ద 8.53 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. డిజిటల్ వేదికల రాకతో బ్యాంకులపై భారం గణనీయంగా తగ్గింది. బ్యాంకుల్లో ఇప్పుడు క్యూలు కానరావడం లేదు. ఎక్కడ ఎక్కువంటే.. గ్రాసరీస్, సూపర్మార్కెట్లలో అత్యధికంగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆహార విక్రయ కేంద్రాలు, రెస్టారెంట్లు, టెలికం సేవలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్, గేమ్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సర్వీస్ స్టేషన్స్, ఔషధ దుకాణాలు, బేకరీస్ నిలిచాయి. విలువ పరంగా 2023 ఏప్రిల్లో నమోదైన లావాదేవీల్లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్ టు పీర్) చేరిన మొత్తం 77.18 శాతం. మిగిలినది వ్యక్తుల నుంచి వర్తకులకు (పీర్ టు మర్చంట్) చేరింది. పీర్ టు పీర్ విభాగంలో రూ.2 వేలు ఆపైన విలువ చేసే లావాదేవీలు 87.05 శాతం, రూ.500–2000 వరకు 9.73, రూ.500 లోపు 3.21 శాతం కైవసం చేసుకున్నాయి. పీర్ టు మర్చంట్ విభాగంలో రూ.2,000 పైన 67.3 శాతం, రూ.500–2000 వరకు 17.72, రూ.500 లోపు 15.24 శాతం నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య పరంగా 2023 ఏప్రిల్లో పీర్ టు మర్చంట్ అధికంగా 56.63 శాతం దక్కించుకుంది. మిగిలినది పీర్ టు పీర్ చేజిక్కించుకుంది. పీర్ టు మర్చంట్ విభాగంలో సింహభాగం అంటే 84.27 శాతం లావాదేవీలు రూ.500 లోపు విలువైనవే. రూ.500–2000 విలువ చేసేవి 11.01 శాతం, రూ.2 వేలకుపైగా విలువ కలిగిన కొనుగోళ్లు 4.71 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు బదిలీ చేసినవి 54.22 శాతం, రూ.500–2,000 వరకు 22.25 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.53 శాతం ఉన్నాయి. ఇంటర్నెట్ తోడుగా.. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), మార్కెట్ డేటా అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్త నివేదిక ప్రకారం.. భారత్లో సగానికి పైగా జనాభా ఇంటర్నెట్ను తరచుగా వినియోగిస్తోంది. 2022లో దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఈ స్థాయిలో యాక్టివ్ యూజర్లు ఉండడం భారత్లో ఇదే ప్రథమం. వీరు కనీసం నెలకు ఒకసారైనా నెట్లో విహరిస్తున్నారు. రెండేళ్లలో ఈ సంఖ్య 90 కోట్లకు చేరనుంది. మొత్తం యాక్టివ్ యూజర్లలో 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, మిగిలిన వారు పట్టణ ప్రాంతాల నుంచి ఉన్నారు. దేశీయంగా ఇంటర్నెట్ వినియోగ వృద్ధికి గ్రామీణ ప్రాంతం దన్నుగా నిలుస్తోందనడానికి ఇది నిదర్శనమని నివేదిక వివరించింది. ఏడాది వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో నెట్ వినియోగ వృద్ధి 6 శాతంగా ఉండగా, గ్రామీణ భారతంలో ఇది 14 శాతంగా నమోదైందని వివరించింది. 2025 నాటికి కొత్త ఇంటర్నెట్ యూజర్లలో 56 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండవచ్చని నివేదిక తెలిపింది. ఇక డిజిటల్ చెల్లింపులు చేసేవారి సంఖ్య 2021తో పోలిస్తే గతేడాది 13 శాతం దూసుకెళ్లి 33.8 కోట్లకు చేరింది. వీరిలో 36 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిలో 99 శాతం మంది యూపీఐ యూజర్లే ఉండడం విశేషం. క్రెడిట్ను విస్తరించడానికి.. భారతదేశం యూపీఐ రూపంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను కలిగి ఉంది. ఇప్పుడు యూపీఐ పట్టాలను క్రెడిట్ లావాదేవీలకు విస్తరించడానికి సమయం ఆసన్నమైంది. రూపే క్రెడిట్ కార్డ్లపై యూపీఐ లావాదేవీలను ప్రారంభించడం ద్వారా దీని మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే భారత్ కేవలం 5.5 కోట్ల క్రెడిట్ కార్డ్ వినియోగదారులను కలిగి ఉంది. క్రెడిట్ కార్డ్లకు ఎటువంటి లింక్ లేకుండా నిజమైన క్రెడిట్ లావాదేవీలను ప్రారంభించడానికి ఈ పట్టాలను విస్తరించడం చాలా ముఖ్యం. ఇది అధికారిక క్రెడిట్ పరిధికి దూరంగా ఉన్న 60 కోట్లకుపైగా మందికి క్రెడిట్ను విస్తరించడానికి వివిఫై, ఇతర కంపెనీలకు వీలు కల్పిస్తుంది. – అనిల్ పినపాల, ఫౌండర్, వివిఫై ఇండియా ఫైనాన్స్. -- నూగూరి మహేందర్ -
కార్బన్ క్రెడిట్స్ మార్కెట్కు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్ వచ్చే ఏడేళ్లలో భారీగా విస్తరించనున్నట్టు ఈ రంగానికి సేవలు అందించే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ సీఎండీ మనీష్ దబ్కర తెలిపారు. 2030 నాటికి ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు (రూ.20.75 లక్షల కోట్లు) చేరుకుంటుందన్నారు. పలు కారణాల వల్ల ప్రస్తుతం ఈ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, డిమాండ్ తగ్గడంతో కార్బన్ క్రెడిట్ ధరలు 80 శాతం తగ్గినట్టు చెప్పారు. ‘‘స్వచ్ఛంద కార్బన్ ఆఫ్సెట్ మార్కెట్ 2021 నాటికి 2 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి క్షీణించడం వల్ల ఇప్పుడు 500 మిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అయినప్పటికీ పలు రేటింగ్ ఏజెన్సీలు కార్బన్ మార్కెట్ పుంజుకునే విషయమై సానుకూలంగా ఉన్నాయి’’అని దబ్కర వివరించారు. బార్క్లేస్ నివేదికను ఉదహరిస్తూ.. ‘‘పలు దేశాలు అమలు చేస్తున్న కఠినమైన పర్యావరణ అనుకూల విధానాలు, ప్యారిస్ ఒప్పందం కింద కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయంలో వాటి అంకితభావం, కార్పొరేట్ సస్టెయినబులిటీ లక్ష్యాలు అనేవి కార్బన్ క్రెడిట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది’’అని దబ్కర ఓ వార్తా సంస్థతో తెలిపారు. కార్బన్ క్రెడిట్ మార్కెట్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన సమయంలో మనీష్ దబ్కర తన అభిప్రాయాలను పంచుకున్నారు. కార్బన్ మార్కెట్కు కేంద్రం మద్దతు ‘‘కార్బన్ మార్కెట్కు సంబంధించి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే కొంత వరకు కార్బన్ మార్కెట్ ఇక్కడ ఉంది. పునరుత్పాదక ఇంధనం కలిగి ఉన్నామంటే అది కార్బన్ క్రెడిట్ అవుతుంది. ఇంధన ఆదా సరి్టఫికెట్లు కూడా కార్బన్ మార్కెట్లో భాగమే. ఈ రెండింటినీ కలిపి కార్బన్ క్రెడిట్గా మార్చి విక్రయిస్తాం’’అని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లోగడ చెప్పడం గమనార్హం. ఇండోర్ కేంద్రంగా పనిచేసే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్లో ప్రముఖ కంపెనీగా ఉంది. -
మోదీజీ ఆ ఆస్కార్ క్రెడిట్ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్ పంచ్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఆస్కార వేడుకల్లో భారత్ సాధించిన కీర్తిని గురించి కొనియాడారు. విజేతలకు అభినందనలు తెలుపుతూ.. ఈ గెలుపు భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే విజేతలు దక్షిణ బారతదేశానికి చెందిన వారంటూ హెలెట్ చేస్తూ చెప్పారు. ఐతే ఆర్ఆర్ఆర్ నుంచి నాటునాటు పాట, చిన్న డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖర్గే మాట్లాడుతూ... దీనికి మేము చాలా గర్వపడుతున్నాం కానీ నాదోక అభ్యర్థన అంటూ ఒక సైటిరికల్ పంచ్ విసిరారు. మోదీజీ దయచేసి ఈ ఆస్కార్ క్రెడిట్ని తీసుకోకండి అలా చేయకూడదు అన్నారు. మోదీ తన గెలుపు కోసం.. మేమే దర్శకత్వం వహించాం, మేము రాశాం, అని చెప్పకూడదు ఇదే నా అభ్యర్థన అని ఖర్గే అన్నారు. అంతే ఒక్కసారిగా రాజ్యసభలో నవ్వులు విరబూశాయి. ఖర్గే వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యుల నుంచే కాకుండా ట్రెజరీ బెంచ్ నుంచి కూడా నవ్వులు విరిశాయి. ఈ మేరకు రాజసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, సభా నాయకుడు పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవియా, కార్మిక మంత్రి భూపేందర్ యదవ్ తదితరులందరూ నవ్వుతూ కనిపించారు. ఇదిలా ఉండగా, పియూష్ గోయల్ రాజసభ నామినేషన్ల గురించి ఆస్కార్ ఫర్ ప్రధానమంత్రి కార్యాలయం అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అదికాస్తా ప్రధాన మంత్రి ఎంపిక ద్వారా రాజ్యసభ్యకు నామినేట్ అయిన వ్యక్తులకే ఆస్కార్ అవార్డు వచ్చిందన్నట్లు ఉండటంతో ఖర్గే ఇలా సైటరికల్గా వ్యాఖ్యానించారు. గోయల్ ఆ పోస్ట్లో విభిన్న రంగాల్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులను ఎంపిక చేసి మరీ రాజ్యసభకు నామినేట్ చేయడంలో మోదీ తనదైన ముద్ర వేశారని అన్నారు. అంతేగాదు 2022లో ఎగువ సభకు నామినేట్ అయిన వారిలో ఆర్ఆర్ స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారని ఆయన్ ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు. Oscar winning 'RRR' and The Elephant Whisperes' are India's contributions to the world. We request Modi ji not to take the credit for their win. :Congress President and LoP in Rajya Sabha Shri @kharge pic.twitter.com/43loVpofCF — Congress (@INCIndia) March 14, 2023 (చదవండి: క్షమాపణ చెప్పేదే లే! మరోసారి వాయిదాపడ్డా ఉబయ సభలు) -
క్రెడిట్పై అద్దె చెల్లించవచ్చు
న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్ కంపెనీ హౌసింగ్.కామ్ కస్టమర్లకు క్రెడిట్పై అద్దె చెల్లించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు ఫిన్టెక్ సంస్థ నీరోతో చేతులు కలిపింది. వెరసి కస్టమర్లకు ప్రస్తుతం అద్దె చెల్లించు– తదుపరి దశలో తిరిగి చెల్లించు(రెంట్ నౌ పే లేటర్– ఆర్ఎన్పీఎల్) సేవలను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పలు ఫిన్టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డుల తరహాలో ప్రస్తుత కొనుగోలుకి తరువాత చెల్లింపు(బయ్ నౌ పే లేటర్– బీపీఎన్ఎల్) సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు సంస్థ నీరోతో ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియన్ కంపెనీ ఆర్ఈఏలో భాగమైన హౌసింగ్.కామ్ కస్టమర్లకు తాజాగా ఆర్ఎన్పీఎల్ సేవలను ప్రారంభించింది. దీంతో కస్టమర్లకు ఎలాంటి కన్వినెన్స్ ఫీజు లేకుండా 40 రోజుల క్రెడిట్ ద్వారా అద్దెను చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా అద్దె చెల్లింపులను అవసరమైతే కస్టమర్లు సులభ వాయిదా పద్ధతి(ఈఎంఐ)లోకి మార్పిడి చేసుకునేందుకు అవకాశమున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా 4 శాతం ప్రజలకే క్రెడిట్ కార్డులున్నందున రెంట్ నౌ పే లేటర్ సర్వీసు వినియోగదారులకు ప్రయోజనకరంగా నిలవనున్నట్లు వివరించింది. హౌసింగ్.కామ్ ఇప్పటికే క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులకు తెరతీసిన విషయం విదితమే. -
పోలీసుల అకౌంట్లోకి వచ్చిపడుతున్న కోట్ల డబ్బు...టెన్షన్లో అధికారులు
ఒక పోలీస్ అకౌంట్లో 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. దీంతో అతను ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటిశ్వరుడిగా మారిపోయాడు. ఈ ఘటన పాకిస్తాన్లోని కరాచీలో చోటు చేసుకుంది. ఒక పోలీస్ అధికారికి తన జీతంతో పాటుగా సుమారు రూ. 10 కోట్లు అకౌంట్లో జమ అయ్యాయి. అయితే బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి చెప్పేంత వరకు తనకు ఈ విషయం తెలియలేదని సదరు పోలీసు అధికారి చెబుతున్నాడు. దీంతో అతని అకౌంట్ని బ్లాక్ చేసి ఈ డబ్బు ఎలా క్రెడిట్ అయ్యిందని దానిపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అచ్చం సదరు పోలీస్లానే పాక్లోని లర్కానా ప్రాంతంలోనిమరో ముగ్గురు పోలీస్ అధికారుల అకౌంట్లోకి కూడా రూ. 5 కోట్లు చొప్పున క్రెడిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇంత మొతంలో డబ్బు ఎలా ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. (చదవండి: బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్) -
మెరుగుపడుతున్న భారత్ కార్పొరేట్ రుణ నాణ్యత
ముంబై: భారత్ కంపెనీల రుణ నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) మెరుగుపడిందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అనుబంధ సంస్థ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే మున్ముందు కాలంలో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండే వీలుందని వివరించింది. 2021–22 మొదటి ఆరు నెలల కాలంలో కార్పొరేట్ క్రెడిట్ రేషియో 5.04 వద్ద ఉంటే తాజా సమీక్షా కాలంలో ఈ నిష్పత్తి 5.52కు పెరిగిందని వివరించింది. పటిష్ట క్యాష్ ఫ్లోస్, పెట్టుబడులు దీనికి కారణమని దాదాపు 6,800 కంపెనీలకు రేటింగ్ ఇచ్చే క్రిసిల్ నివేదిక వివరించింది. అయితే కొన్ని చిన్న పరిశ్రమలకు తమ అధ్యయనం వర్తించబోదని మేనేజింగ్ డైరెక్టర్ గురుప్రీత్ చౌహాత్వాలా పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య విధానం వంటి అంశాలు ఉన్నప్పటికీ, భారత్ కార్పొరేట్ పరిశ్రమ ఈ సవాళ్లను ఎదుర్కొంటుందన్న భరోసాను క్రిసిల్ వ్యక్తం చేసింది. తాను రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 80 శాతం యథాతథ పరిస్థితిని కొనసాగించగా, 569 సంస్థలను అప్గ్రేడ్ చేయడం జరిగిందని, 103 సంస్థలను డౌన్గ్రేడ్ చేసినట్లు వివరించింది. కాగా, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తన రేటింగ్ సంస్థల్లో 159కి అప్గ్రేడ్ చేసినట్లు 40 సంస్థలను డౌన్గ్రేడ్ చేసినట్లు తెలిపింది. ఇక్రా రేటింగ్స్ విషయంలో 250 సంస్థలు అప్గ్రేడ్కాగా, 76 సంస్థలు డౌన్గ్రేడ్ అయ్యాయి. అప్గ్రేడ్ సంస్థలు అధికంగా ఉండడం ఇక్కడ గమనార్హం. -
ఆర్థికమంత్రితో ఐఎఫ్సీ ఎండీ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో సోమవారం అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మఖ్తర్ డియోప్ భేటీ అయ్యారు. భారత్లో రుణ అవకాశాల విస్తృతిపై వారు ఇరువురూ చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచబ్యాంక్కు ప్రైవేటు రంగ ఫండింగ్ అనుబంధ విభాగంగా ఐఎఫ్సీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ ప్రకారం, భారత్లో ఐఎఫ్సీ రుణాన్ని వచ్చే ఒకటి రెండేళ్లలో 2 నుంచి 2.5 బిలియన్ డాలర్ల మేర పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థికమంత్రి భావిస్తున్నారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈ పరిమాణం 3 నుంచి 3.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. భారత్లో పెట్టుబడులకు ప్రత్యేకించి సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమకు (ఎంఎస్ఎంఈ) రుణ సౌలభ్యతను పెంచాలని ఐఎఫ్సీ భావిస్తోంది. తయారీ రంగం కేంద్రంగా ఎదగాలన్న భారత్ లక్ష్యాలని చేయూతను ఇవ్వాలన్న ఆకాంక్షను ఐఎఫ్సీ ఎండీ వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర వృద్ధి కోసం గ్రామీణ రంగంలో ఫైనాన్సింగ్ను పరిశీలించడం, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలను సమీకరించడం, వారి ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరడం వంటి లక్ష్యాలను సైతం ఆయన ఉద్ఘాటించారు. -
దుమారం రేపిన మోదీ వ్యాఖ్యలు... మాటల తూటలు పేల్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ పుట్టినరోజు పురస్కరించుకుని నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.... దేశంలో చిరుతలు అంతరించిపోయాయని, తిరిగి భారత్లో ప్రవేశపెట్టేలా... దశాబ్దాలుగా ఎలాంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు జరగలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కాంగ్రెస్ను విమర్శించారు. అయితే, ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ దగాకోరు! అంటూ మాటల తుటాలు పేల్చింది. అంతేకాదు ఇది మోదీ క్రెడిట్ కాదని, ఆయన చేసిన చారిత్రక ఘట్టానికి తామే ముందు అంకురార్పణ చేశామని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించింది. ఈ మేరకు 2009లో ప్రాజెక్టు చిరుత ప్రారంభించిన లేఖను కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సీనియర్ నాయకుడు జై రామ్ రమేశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో యూపీఏ హయాంలో పర్యావరణ అటవీ శాఖలను నిర్వహించిన జై రాం రమేష్ చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టేందుకు వైల్డ్లైఫ్ ట్రస్ట్ ఇండియా అధికారులను రోడ్మ్యాప్ సిద్ధం చేయమని కోరారు. తాను భారత్ జోడో యాత్రలో ఉండటం వల్లే ఈ లేఖను వెంటనే పోస్ట్ చేయలేకపోయానని జై రామ్ రమేశ్ వివరణ ఇచ్చారు. మెరుపు దాడికి ప్రసిద్ధి చెందిన చిరుతలు 1940లలో అంతరించుకుపోయాయి. అయితే 2012 లో యూపీఏ ప్రభుత్వం చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టే ప్రణాళిక దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేగాదు కొంతమంది పరిరక్షకులు భారత్లోకి ఆఫ్రికన్ చిరుతలు దిగుమతి చేసుకోవడం అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ కమిటీ (ఐయూసీఎన్) మార్గదర్శకాలకు విరుద్ధమని వాదించారు. అయితే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2017లో కోర్టులో ఈ విషయమై దరఖాస్తులు చేసింది. చిరుతలను భారత్లోకి ప్రవేశ పెట్టే ప్రాజెక్టు చట్టబద్ధమేనని ఐయూసీఎన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని కాంగ్రెస్ వాదిస్తోంది. వాస్తవానికి ఇదంతా తమ పార్టీ హయాంలోనే జరిగిందని మోదీ ఘనతేమీ కాదని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. This was the letter that launched Project Cheetah in 2009. Our PM is a pathological liar. I couldn’t lay my hands on this letter yesterday because of my preoccupation with the #BharatJodoYatra pic.twitter.com/3AQ18a4bSh — Jairam Ramesh (@Jairam_Ramesh) September 18, 2022 (చదవండి: చిరుతల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు) -
అప్పు పథంలో ఐదు రాష్ట్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రతిష్టను రచ్చకీడుస్తూ.. శ్రీలంకతో పోలుస్తూ పదేపదే బురద చల్లుతున్న దుష్ట చతుష్టయానికి చెంపపెట్టులా ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ బ్యాంకు నివేదికను వెల్లడించింది. లాక్డౌన్ తదనంతరం దేశంలోని 20 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులను ప్రపంచ బ్యాంకు క్షుణ్నంగా పరిశోధించి సమగ్ర నివేదిక రూపొందించింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రమాదకర స్థాయిలో లేవని ప్రపంచ బ్యాంకు పరిశోధన నివేదిక నిగ్గు తేల్చింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో 2020–21 తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)పై ప్రభావం పడటమే కాకుండా అప్పులు, ద్రవ్యలోటు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. సెకండ్ వేవ్తో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నప్పటికీ అనంతరం పుంజుకోవడంతో చాలా రాష్ట్రాల ఆదాయాలు పెరగడంతో పాటు మూలధన వ్యయం మెరుగుపడిందని తెలిపింది. ఆదాయాలు క్షీణించినప్పటికీ ఆహార సబ్సిడీలు, పెన్షన్లు లాంటి సామాజిక భద్రత చర్యలు చేపట్టడంతో వ్యయం పెరిగి అన్ని రాష్ట్రాల రుణాలు 24 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు అత్యధిక అప్పుల్లో ఉన్నాయని తెలిపింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం గమనార్హం. పంజాబ్, హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, కేరళ రాష్ట్రాల అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2019, 2020, 2021 ఆగస్టు నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు, క్యాపిటల్ వ్యయం, బడ్జెట్ అంచనాలు, రెవెన్యూ రాబడులను ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2019–20లో ఆర్థిక మందగమనం కారణంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు తగ్గిపోయాయని నివేదిక పేర్కొంది. పుంజుకున్న ఆదాయాలు.. ఆంధ్రప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాలన్నింటిలో 2019 ఆగస్టుతో పోల్చితే 2020, 2021 ఆగస్టుల్లో రెవెన్యూ రాబడులు పెరిగాయని నివేదిక తెలిపింది. చాలా రాష్ట్రాల్లో క్యాపిటల్ వ్యయం పెరిగిందని, ఏపీలో 2019 ఆగస్టుతో పోల్చి చూస్తే 2020 ఆగస్టులో క్యాపిటల్ వ్యయం బాగా పెరిగిందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2019 ఆగస్టుతో పోల్చితే 2021 ఆగస్టులో బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా రాబడులు మెరుగుపడ్డాయని, బడ్జెట్ అంచనాల మేరకు వ్యయం కూడా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే యత్నాలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఆర్ధిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికలో ముఖ్యాంశాలు... ► దేశంలో అత్యధికంగా పంజాబ్ అప్పుల్లో ఉంది. జీఎస్డీపీలో ఏకంగా 49.5 శాతం అప్పులున్నాయి. ► రాజస్థాన్కు జీఎస్డీపీలో 39.5 శాతం మేర అప్పులుండగా హిమాచల్ప్రదేశ్కు 39.7 శాతం, బిహార్కు 38.6 శాతం, కేరళకు 37 శాతం మేర అప్పులున్నాయి. ► ఆంధ్రప్రదేశ్కు జీఎస్డీపీలో 32.5 శాతం మాత్రమే అప్పులున్నాయి. ► సొంత రాబడుల్లో పంజాబ్ వడ్డీ చెల్లింపులపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ► బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కేరళ, హర్యానా రాష్ట్రాలు వచ్చే ఐదేళ్లలో చెల్లించాల్సిన అప్పుల వాటా అత్యధికంగా ఉంది. చత్తీస్గడ్ వచ్చే ఐదేళ్లలో 59.2 శాతం, ఒడిశా 54.7 శాతం, హర్యానా 48.7 శాతం మేర అప్పులు చెల్లించాల్సి ఉంది. కేంద్రం అప్పులే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ అప్పులు 2020–21లో ఏకంగా జీడీపీలో 61 శాతానికి చేరుకోవడం గమనార్హం. 2013– 14లో కేంద్రం అప్పులు రూ.56,69,128.48 కోట్లు కాగా 2021–22 నాటికి రూ.1,35,88,193.16 కోట్లకు పెరిగాయి. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
ఎయిర్టెల్ ఆఫ్రికాకు సిటీ రూ.1,000 కోట్ల రుణం
ముంబై: ఎయిర్టెల్ ఆఫ్రికా 125 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,000 కోట్లు) రుణ సదుపాయం కోసం అమెరికాకు చెందిన సిటీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. 14 ఆఫ్రికా దేశాల్లో ఎయిర్టెల్ ఆఫ్రికా టెలికం, మొబైల్ మనీ సేవలు అందిస్తోంది. స్థానిక కరెన్సీతోపాటు, డాలర్ మారకంలో ఈ రుణ సదుపాయం ఉంటుందని ఎయిర్టెల్ ఆఫ్రికా ప్రకటించింది. ఈ సదుపాయం 2024 సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఎయిర్టెల్ ఆఫ్రికా కార్యకలాపాలకు మద్దతుగా, నాలుగు సబ్సిడరీ కంపెనీల్లో పెట్టుబడులకు వినియోగించనున్నట్టు తెలిపింది. ఎయిర్టెల్కు చెందిన ముంబై యూనిట్ ద్వారా ఈ డీల్ చేసుకున్నట్టు ప్రకటించింది. -
‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్ల పేరిట గేమ్లకు బానిసగా...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని యువకుల తల్లిదండ్రులకు ఇటీవల ‘సన్’ స్ట్రోక్స్ ఎక్కువగా తగులుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడుతున్న యువత వాటిలో గెలవడానికి బానిసలుగా మారిపోతున్నాయి. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్లో పడి యూసీ పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులు వారికి తెలియకుండా వాడేస్తున్నారు. అంబర్పేట ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఫ్రీఫైర్ గేమ్ కోసం తన తల్లి, తాతల బ్యాంకు ఖాతాల్లోని రూ.36 లక్షలు వాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం కంపెనీల వ్యవహారం.. కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీనిప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. పాయింట్లతో బలపడతావంటూ... ఇలా తమ గేమ్కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. దీంతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన యువతలో కలిగిస్తారు. ఆపై అసలు కథ మొదలెట్టి.. కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్కు బానిసలుగా మారుతున్న యువత తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్లో పడిపోతున్నారు. అలా తమ తల్లిదండ్రుల కార్డులు తీసుకుని వారికి తెలియకుండా పేమెంట్లు చేస్తున్నారు. యువత అనునిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చు చేసేస్తోంది. నేరగాళ్ల పనిగా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఇలా అనునిత్యం తమకు తెలియకుండా కార్డులు, ఖాతాల నుంచి చిన్న మొత్తాలు పోతుండటాన్ని తల్లిదండ్రులు తక్షణం గుర్తించలేకపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇవి పెద్ద మొత్తాలుగా మారిన తర్వాత తెలుసుకుంటున్నారు. ఆ పని చేసింది సైబర్ నేరగాళ్లుగా భావించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువకులే డబ్బు పెట్టి ఆడుతున్నారు యువకులతో పాటు యువతులూ ఇలాంటి గేమ్స్కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలు ఆన్లైన్ గేమ్స్కు బానిసలు కాకుండా చూసుకోవాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: అరువుపై ఎరువులు ఇవ్వం) -
మనదేశంలో రుణం..'కొందరికే' పరిమితం!
న్యూఢిల్లీ: సంపాదన విభాగంలో మొత్తం జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 48 కోట్ల మంది భారతీయులు 65 ఏళ్ల వయస్సు వరకు ఎటువంటి రుణ సదుపాయం పొందలేదని (క్రెడిట్ అన్ సర్వర్డ్) క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ– సిబిల్ ఒక నివేదికలో పేర్కొంది. ఇక సిబిల్ ప్రపంచ అధ్యయనంలో అదనంగా 16.4 కోట్ల మంది ’క్రెడిట్ అన్ సర్వర్డ్’’గా ఉన్నారు. 17.9 కోట్ల మంది మాత్రమే ’క్రెడిట్ సర్వ్’ కేటగిరీలో ఉన్నారు. సిబిల్ నివేదికలోని మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే... ►రుణగ్రహీతలు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉండేలా దేశంలో రుణ సంస్కృతిని మరింతగా పెంచేందుకు పాలసీ యంత్రాంగం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోంది. 45 కోట్లకుపైగా ఖాతాలను ప్రారంభించిన జన్ ధన్ యోజన క్రెడిట్ ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తోంది. ►అమెరికా విషయానికి వస్తే, పెద్దల్లో కేవలం 3 శాతం మందికి మాత్రమే క్రెడిట్ సౌలభ్యం అందలేదు. ఈ సంఖ్య కెనడాలో 7 శాతం, కొలంబియాలో 44 శాతం, దక్షిణాఫ్రికాలో 51 శాతం ఉంది. ►రుణ సదుపాయం కలిగించే విషయంలో కొన్ని కీలక అవరోధాలు ఎదురవుతున్నాయి. వినియోగదారులకు క్రెడిట్ స్కోర్, క్రెడిట్ చరిత్ర లేకపోవడం రుణ అవకాశాలను పొందడానికి ప్రతిబంధకంగా ఉంది. ఆయా వినియోగదారులకు చాలా మంది రుణదాతలు రుణాలు అందించడానికి వెనుకాడుతున్నారు. ►ఒక్కసారి రుణం తీసుకోవడం ప్రారంభమైతే, అటు తర్వాత ఈ విషయంలో ‘రెండేళ్ల పరిధిలోకి’ క్రియాశీలంగా ఉండే వారు 5 శాతం. రుణం.. మరింత విస్తృతమవ్వాలి ఇటీవలి సంవత్సరాలలో దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో రుణ లభ్యత పెంచే విషయంలో భారత్ గొప్ప పురోగతిని సాధించింది. అయినప్పటికీ, ప్రస్తుత వాస్తవికత రుణ వ్యవస్థను పరిశీలిస్తే, రుణం సౌలభ్యం మరింత విస్తృతం కావాలి. తమకు ఎటువంటి రుణ సదుపాయం అందడం లేదనే పెద్దల సంఖ్య తగ్గాలి’’– రాజేష్ కుమార్, సిబిల్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
కొంటే ఖర్సయిపోతారు..!
ఆన్లైన్ షాపింగ్. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..? అదే బై నౌ పే లేటర్. లేదా స్పెండ్ నౌ పే లేటర్. అమెజాన్ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల వరకు క్రెడిట్ ఇచ్చేందుకు బారులు తీరాయి. వినియోగం ఆధారంగా అవి అరువు ఇచ్చేస్తాయి. కాకపోతే వాడేసుకోవడమా.. లేక వేరే మార్గం చూసుకోవడమా? అన్న విచక్షణ వినియోగదారులదే. బీఎన్పీఎల్ రూపంలో లభించే క్రెడిట్ స్వల్ప మొత్తమే. కానీ, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే బ్యాలన్స్ కరిగిపోతుంది. 15–30 రోజుల వరకు వడ్డీ ఉండదు. మర్చిపోయారా..? అరువు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. అవి తమకు నచ్చిన వడ్డీ బాదుడు షురూ చేస్తాయి. పెనాల్టీ అంటాయి. చెల్లించాల్సింది రూ.200 అయినా.. రూ.50–100 వరకు పిండేస్తాయి. కొరివితో తలగోక్కున్నట్టు కోరి క్రెడిట్ స్కోరును దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ∙ బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా కొనుగోళ్లకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డు. అయితే, ఇప్పటికీ దేశంలో క్రెడిట్ కార్డు విస్తరణ చాలా పరిమితంగానే ఉంది. ఇదే చక్కటి అవకాశంగా భావించి ఫిన్టెక్ సంస్థలు బీఎన్పీఎల్ రూపంలో మార్కెట్లో చొచ్చుకుపోయే క్రమంలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుపై లభించేది రుణమే. బై నౌ పే లేటర్ రూపంలో వచ్చేదీ కూడా రుణమే. రెండింటిపైనా నిర్ణీత కాలం పాటు వడ్డీ ఉండదు. సారూప్యతలు అంతవరకే. కంటికి కనిపించని అంశాలు బీఎన్పీఎల్ సదుపాయంలో ఎన్నో ఉన్నాయి. ∙ ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు (బై నౌ.. పే లేటర్/బీఎన్పీఎల్) చాలా మందిని ఆకర్షిస్తున్న సదుపాయం. క్రెడిట్ కార్డు మాదిరి ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్లతో జతకట్టి ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇస్తున్న ముందస్తు రుణ సదుపాయం. దీనికి పాన్ నంబర్ ఉంటే సరిపోతుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఇది. చార్జీలు/ఫీజులు 15–30 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయమే బీఎన్పీఎల్. ఇచ్చిన గడువులోపు చెల్లిస్తే రూపాయి అదనంగా కట్టాల్సిన పరిస్థితి ఉండదు. రుణం కనుక అశ్రద్ధ చూపినా, సకాలంలో చెల్లింపులు చేయకపోయినా తర్వాత భారాన్ని మోయాల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలన్స్ మొత్తంపై 10–30 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్ ఫీజు కూడా కట్టాలి. కన్వినియన్స్ ఫీజు పేరుతో నెలవారీ వ్యయంపై 1–3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. బీఎన్పీఎల్ సంస్థలు ఓలా పోస్ట్పెయిడ్, జెస్ట్మనీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్ పేరుతో క్రెడిట్ను ఆఫర్ చేస్తున్నాయి. రుణ సదుపాయం ఆన్లైన్లో వస్తువులు లేదా సేవల కోసం బీఎన్పీఎల్తో ఆర్డర్ చేసేయవచ్చు. నిర్ణీత కాలంలోపు వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది అన్సెక్యూర్డ్ రుణం. దీంతో ఆన్లైన్ మార్కెట్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. క్రెడిట్ కార్డుపై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ, బీఎన్పీఎల్ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువ శాతం రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణ సదుపాయం (క్రెడిట్లైన్) ఉంటుంది. స్మాల్ టికెట్ లోన్స్గా చెబుతారు. పేమెంట్ ఆప్షన్ పేజీలో బీఎన్పీఎల్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్ ఆయా ప్లాట్ఫామ్లపై ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే అది మీ క్రెడిట్ రిపోర్ట్లో రుణ సదుపాయంగానే ప్రతిఫలిస్తుంది. రుణ గ్రహీతలు బీఎన్పీఎల్ కింద పొందిన రుణ సదుపాయాన్ని ఒకే సారి తీర్చే వెసులుబాటు లేకపోతే అప్పుడు ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణం కనుక గడువులోపు తీర్చేయడమే మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ విధించకుండా బిల్లు మొత్తాన్ని మూడు, నాలుగు నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బీఎన్పీఎల్ రూపంలో వచ్చే రుణాన్ని ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకులు అందిస్తుంటాయి. ఉదాహరణకు పేటీఎం బీఎన్పీఎల్ అన్నది ఆదిత్య బిర్లా ఫైనాన్స్తో ఒప్పందంపై అందిస్తున్న సదుపాయం. అమెజాన్ బీఎన్పీఎల్ అన్నది అమెజాన్ ఇండియా అందిస్తున్న సదుపాయం. ఇక ఫ్లిప్కార్ట్ పే లేటర్ సదుపాయాన్ని ఆ సంస్థతో ఒప్పందంపై ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు సమకూరుస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్/ఈకామర్స్ సంస్థ ఏదైనా కావచ్చు.. రుణ గ్రహీత, రుణదాతలను కలిపే వేదికలుగానే పనిచేస్తాయి. రుణ సదుపాయంతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. చెల్లింపుల్లో విఫలమైతే.. మొదట లేట్ ఫీజు పడుతుంది. ఫ్లిప్కార్ట్ అయితే తీర్చాల్సిన బ్యాలన్స్ రూ.100–500 మధ్య ఉంటే, విఫలమైన రుణగ్రహీతలకు రూ.60 చార్జీ విధిస్తోంది. రూ.5,000 అంతకుమించి మొత్తం చెల్లించడంలో విఫలమైతే అప్పుడు రూ.600 వరకు చార్జీ పడుతుంది. అమెజాన్ పే లేటర్ అయితే చెల్లించని మొత్తం రూ.200లోపు ఉంటే ఆలస్యపు రుసుం అమలు చేయడం లేదు. కానీ, పెనాల్టీ రూపంలో రూ.100–600 వరకు రాబడుతోంది. జీఎస్టీ అదనం చెల్లించాల్సి రావచ్చు. దీనికితోడు రుణం ఇచ్చిన సంస్థ వసూలుకు చర్యలు ప్రారంభించొచ్చు. రుణ గ్రహీత వివరాలను అవి క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. దీంతో భవిష్యత్తు రుణాలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్ డీలింక్వెన్సీగా క్రెడిట్ బ్యూరోలకు రుణ సంస్థలు సమాచారం ఇస్తాయి. కనీస బ్యాలన్స్ చెల్లించి మిగిలిన రుణాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అది కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న, వినియోగించుకున్న ప్రతీ బీఎన్పీఎల్ కూడా ఒక రుణం కింద వారి క్రెడిట్ రిపోర్ట్లో చేరుతుంది. కొద్ది బ్యాలన్స్ కోసం బీఎన్పీఎల్ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. దీనికంటే క్రెడిట్కార్డు మెరుగైన సాధనం అవుతుంది. 30–45 రోజుల క్రెడిట్ పీరియడ్తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలన్స్ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది. యాక్టివేట్ అయినట్టే.. శ్రీరామ్ ఏప్రిల్ నెల క్రెడిట్ స్కోరు క్షీణించడాన్ని గమనించాడు. కారణం ఏంటా అని క్రెడిట్ రిపోర్ట్ను పరిశీలించగా.. ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. ‘‘క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) నుంచి రెండు రుణాలు అతడి రిపోర్ట్లో యాక్టివ్గా కనిపించాయి. ఆయా సంస్థల నుంచి శ్రీరామ్ రుణాలు తీసుకోలేదు. దాంతో అవి ఎందుకు తన రిపోర్ట్లో వచ్చాయో మొదట అర్థం కాలేదు. క్రెడిట్ కార్డు తప్పించి అతడి పేరిట మరే రుణం లేదు. ఈ రెండూ బీఎన్పీఎల్ రుణాలని అతడికి తర్వాత తెలిసింది. అమెజాన్ పే లేటర్ సదుపాయం కోసం ఒకటి రెండు సార్లు అతడు లాగిన్ అయ్యాడు కానీ, బ్యాంకు ఖాతాను లింక్ చేయలేదు. అయినా కానీ, క్రెడిట్ సదుపాయాన్ని యాక్టివేస్ చేసేసింది సదరు సంస్థ. ఇది శ్రీరామ్ ఒక్కడి విషయంలోనే కాదు. చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలపై ప్రస్తావిస్తున్నారు. తమ తరఫున బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి రుణ సదుపాయాన్ని పలు ప్లాట్ఫామ్లు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా రుణ సదుపాయాన్ని పొందినట్టు చేస్తున్న ఆరోపణ నిజం కాదు. ‘‘వినియోగదారులు తాము క్రెడిట్లైన్ కోసం సైనప్ చేసుకున్నామే కానీ, రుణం కోసం కాదని భావిస్తుంటారు. క్రెడిట్లైన్ అన్నది ఒక రుణ పరిమితి. వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకోకపోవచ్చు. కానీ, దీన్ని బుక్స్లో రుణంగానే పేర్కొంటారు’’ అని ‘యూని’ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా తెలిపారు. అందుకే వీటిని క్రెడిట్ నివేదికల్లో పేర్కొనడం జరుగుతుందన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. -
అకడమిక్ బ్యాంకు క్రెడిట్.. విద్యార్థికి మేలే గానీ...
ఇటీవల విశ్వవిద్యాలయాల నిధుల జారీ సంస్థ అయిన యూజీసీ నూతన జాతీయ విద్యా విధానంలో అకడమిక్ బ్యాంకు క్రెడిట్ (ఏబీసీ)లను ప్రారంభించాల్సిందిగా ఆదే శాలు జారీ చేసింది. అకడమిక్ బ్యాంకు క్రెడిట్ అంటే ప్రతి విద్యార్థికీ ఒక విద్యా నిధిని ఏర్పాటు చేయడం అన్నమాట. దేశంలోని ప్రతి విద్యార్థికీ ఏబీసీ పోర్టల్ ద్వారా అతను పూర్తిచేసిన వివిధ కోర్సుల మార్కులు, గ్రేడ్, ర్యాంకులను నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఐదేళ్ళపాటు భద్రంగా దాచిన ఈ మార్కులు, గ్రేడ్లను విద్యార్థి తదనంతర కాలంలో తిరిగి చదువు కొనసాగించాలన్నా, వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ తన చదువును సాగించాలన్నా... తిరిగి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏబీసీల వల్ల ప్రపంచంలో ఎక్కడైనా... విద్యార్థి సంపాదించిన కోర్సు సర్టిఫికెట్లకు గుర్తింపు ఇవ్వడం అనివార్యం అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని విద్యా సంస్థలు లేదా యూనివర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్లకు కొన్నిచోట్ల గుర్తింపు లభించడం లేదు. ఏబీసీల్లో స్టూడెంట్ విద్యాపరమైన అన్ని విష యాలనూ నిక్షిప్తం చేసుకుంటే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. మరో ప్రయోజనం ఏమిటంటే... ఏబీసీ పోర్టల్కు దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఒక విద్యార్థి ఒక విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందినా మరొక విశ్వవిద్యాలయంలో మరొక కోర్సు చదివే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థి బొంబాయిలోని కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతుండగా అతనికి ఇష్టమైన కృత్రిమ మేధ అనే ఐచ్ఛిక కోర్సు ఆ కళాశాలలో బోధించనట్లయితే... అతను వేరొక ప్రదేశంలోని వేరొక కళాశాల నుండి ఆ కోర్సు చేసే వెసులు బాటు ఉంటుంది. భారత ప్రభుత్వం అందిస్తున్న ‘స్వయం’, ఎన్పీటీఈఎల్ అందిస్తున్న అంతర్జాతీయ గుర్తింపు పొందిన కోర్సులూ, మైక్రోసాఫ్ట్ వంటి గుర్తింపు పొందిన సంస్థలు అందించే కోర్సులను పూర్తి చేసి వాటి ద్వారా లభించిన క్రెడిట్లను విద్యా నిధిలో దాచుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలోని కళాశాలలో చేరిన విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లోని పేరున్న కళాశాలలోని కోర్సులు చదివే అవకాశం ఇక నుండి ఏర్పడుతుంది. అంతేకాక ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఐఐఎంలలోని అత్యంత ప్రతిభావంతమైన అధ్యాపకుల దగ్గర విద్యాభ్యాసం చేసే అవకాశం ఏర్పడనుంది. అయితే ఇవన్నీ కూడా చెప్పుకోడానికి చాలా అందంగా ఉన్నాయి, కానీ ఆచరణలో మాత్రం ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఏబీసీ పోర్టల్ ద్వారా కోర్సులను అందించే విద్యాసంస్థలు తప్పనిసరిగా నాక్ ఏ గ్రేడ్ పొంది ఉండాలనే నిబంధనను ఒకటి విధించడం జరిగింది. కానీ నేడు దేశంలోని అనేక విద్యా సంస్థలు నాణ్యత ప్రమాణాలను పాటించనప్పటికీ నాక్ ‘ఏ’ గ్రేడు రావడం మనమందరం చూస్తున్నాం. ఏబీసీ విధానం ప్రకారం నాక్ ‘ఏ’ గ్రేడ్ పొందిన ఒక నాసిరకం విద్యాసంస్థ నుండి కోర్సు పూర్తి చేసిన విద్యార్థి అదే కోర్సు ఐఐటీ వంటి సంస్థల్లో పూర్తి చేసిన విద్యార్ధితో సమానంగా గుర్తింపు పొందుతాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకే కోర్సును ఐఐటీ వంటి ఒక ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థ, ఒక సాధారణ ప్రాంతీయ కళాశాల విద్యార్థులకు అందుబాటులో ఉంచినప్పుడు సహజం గానే విద్యార్థులు అందరూ కూడా ప్రతిష్ఠాత్మక సంస్థలో చదవటానికి ఉత్సాహం చూపిస్తారు. ప్రాంతీయ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం వల్ల ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గి బోధనలో నాణ్యత కూడా క్షీణిస్తుంది. ఇందువల్ల చాలా విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే యూజీసీ అకడమిక్ బ్యాంక్ క్రెడిట్ల ఏర్పాటు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. - ఈదర శ్రీనివాసరెడ్డి సామాజిక, ఆర్థిక విశ్లేషకులు -
పొరపాటుగా అకౌంట్లో రూ.2 కోట్లు.. వ్యక్తి ఏం చేశాడంటే..
సాక్షి, వైరా(ఖమ్మం) : ఓ వ్యక్తి ఖాతాలో పొరపాటుగా రూ.2 కోట్ల నగదు జమ కాగా.. తిరిగి జమ చేసిన కంపెనీకి అప్పగించిన వైనమిది. వివరాలిలా ఉన్నాయి. వైరాకు చెందిన గంధం వెంకటేశ్వర్లు ఖాతాలో ఈనెల 11న రూ.2 కోట్లు జమ అయినట్లు సెల్కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన ఏటీఎం సెంటర్కు వెళ్లి చూడగా ఖాతాలో రూ.2కోట్లు జమ అయి ఉన్నాయి. కాగా, వెంకటేశ్వర్లు వైరా తహసీల్ ఎదుట నిర్మించిన భవనంలో సాబూ ఆటో జోన్ కంపెనీ(అశోక్ లేలాండ్ కంపెనీ) డీలర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశాడు. నెలనెలా సదరు డీలర్ వెంకటేశ్వర్లుకు ఇంటి అద్దెను బ్యాంకు అకౌంట్లో జమ చేసేవాడు. ఈక్రమంలోనే పొరపాటున కంపెనీకి చెల్లించాల్సిన రూ.2కోట్లను ఈయన ఖాతాలో జమ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కంపెనీ జీఎం శేషాచారి వైరాకు చేరుకోగా.. అప్పటికే వెంకటేశ్వర్లు డీలర్తో చర్చిస్తున్నాడు. దీంతో మంగళవారం ఖమ్మంలోని రోటరీనగర్ ఎస్బీఐ శాఖ ద్వారా ప్రతి నిధులకు రూ.2కోట్ల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు అభినందించారు. -
మహిళ అకౌంట్లో పొరపాటున రూ. 7.7 కోట్లు జమ.. దొంగతనం కేసు!
యూకే: ఓ మహిళ అకౌంటుకు పొరబాటున ఏకంగా 7.7 కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఐతే జమ చేసిన సంస్థ పొరపాటున ఈ తప్పు చేసినప్పటికీ సదరు మహిళ పిర్యాదు చేసేంత వరకూ దానిని గమనించలేదట. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. యూకేకు చెందిన మహిళ అకౌంటుకు ఆగస్టు 2020న హర్ మెజెస్టీస్ రెవెన్యూ అండ్ కస్టమ్స్ (హెచ్ఎమ్ఆర్సీ) నుంచి 7,74,839 పౌండ్లు (సుమారు 7.7 కోట్ల రూపాయలు) జమ అయ్యాయి. అంతేకాదు ఈ మిస్టరీ డిపాజిట్ నుంచి అప్పటికే 20 వేల పౌండ్లు ఖర్చు చేసింది కూడా. ఐతే ఖర్చుచేసిన మొత్తాన్ని చెల్లించే స్థితిలో ప్రస్తుతం ఆమె లేదు. తర్వాత అకౌంటును చెక్ చేసుకున్న సదరు మహిళ మిస్టరీ డిపాజిట్ గురించి తీవ్ర ఆందోళనకు గురైంది. నిజానికి ఈ విధమైన పొరబాట్లు యూకేలో సెక్షన్ 24ఎ దొంగతనం చట్టం 1968 ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. పొరపాటున జమ అయిన మొత్తాన్ని సంబంధిత వ్యక్తులకు చెల్లించవల్సిన బాధ్యత అకౌంటుదారులే నిర్వర్తించాలి. చదవండి: ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే.. ఐతే నవంబర్ 2020లో పన్ను చెల్లించినప్పుడు హెచ్ఎమ్ఆర్సీ సిబ్బంది తమ తప్పును గమనిస్తారని మహిళ భావించింది. కానీ అలా జరగలేదు. డబ్బు ఆమె ఖాతాకు మాత్రమే కేటాయించబడినందున, ఆమె ముందుకు రాకపోతే అది ఎప్పటికీ గుర్తించబడకపోవచ్చు. దీంతో ఆమె ఫోను ద్వారా హెచ్ఎమ్ఆర్సీని సంప్రదించి పొరపాటును గుర్తుచేసింది. పార్శిల్ కస్టమ్స్ డ్యూటీ రాయితీని చెల్లించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సిబ్బంది పొరపాటున 23.39 పౌండ్లకు బదులు అధికమొత్తాన్ని జమ చేసినట్లు హెచ్ఎమ్ఆర్సీ ఎట్టకేలకు కనుగొంది. దీని గురించి హెచ్ఎంఆర్సి ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాము. చెల్లింపును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం. ఐతే ఇంత పెద్ద మొత్తం పొరబాటున క్రెడిట్ అవ్వడం ఇంతవరకూ జరగలేద’ని మీడియాకు తెలిపారు. దాదాపుగా 15 నెలల తర్వాత ఈ విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
రుణాలు @ రూ.63,574 కోట్లు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్రీచ్’ కార్యక్రమం కింద కేవలం పక్షం రోజుల్లో దాదాపు 13.84 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.63,574 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ఒక ట్వీట్లో తెలిపారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 10,580 శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ‘ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్లో క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా, రంగాల వారీగా రుణ ఔట్రీచ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బ్యాంకులు–నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఫిన్టెక్ సెక్టార్ల మధ్య సహ–రుణ ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంచి స్పందన వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు 3.2 లక్షల మంది లబ్ధిదారులకు రూ.21,687.23 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 59,090 మంది రుణగ్రహీతలకు రూ.4,560.39 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 41,226 మంది రుణగ్రహీతలకు రూ.8,994.25 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. ఏడు లక్షలకు మందికిపైగా రైతులకు రూ.16,734.62 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరయ్యాయి. గతంలో ఇలా... 2019 అక్టోబర్ – 2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్రీచ్ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్ఏఎం సెక్టార్ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది. బ్యాంకింగ్కు ఇందుకు తగిన సూచనలు అందాయి. -
‘రెండు లక్షల మందికి రుణాలు ఇచ్చాం’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ‘క్రెడిట్ అవుట్రీచ్’ కార్యక్రమం కింద దాదాపు 2 లక్షల మంది రుణ గ్రహీతలకు రూ.11,168 కోట్ల రుణాలను అందజేసిందని ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద, బ్యాంకులు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రుణగ్రహీతలకు రుణాలను మంజూరు చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోపాటు పలు బ్యాంకులు రాయితీ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ‘ఆగస్టులో ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు మద్దతును అందించే క్రమంలో అక్టోబర్లో క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహించాలని బ్యాంకులకు సూచించారు. దీనికి అనుగుణంగా, బ్యాంకులు జిల్లాల వారీగా, రంగాల వారీగా రుణ ఔట్రీచ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి‘ అని ఆర్థిక మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. బ్యాంకులు–నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఫిన్టెక్ సెక్టార్ల మధ్య సహ–రుణ ఏర్పాట్ల ద్వారా కేంద్రం క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంచి స్పందన వివిధ కేంద్ర ప్రభుత్వ రుణ గ్యారెంటీ పథకాల కింద మంజూరు చేసిన, పంపిణీ చేసిన నిధుల పరిమాణంకంటే క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కింద జారీ అయిన రుణాలు అధికంగా ఉండడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు లక్ష మంది లబ్ధిదారులకు రూ.6,268 కోట్ల వ్యాపార రుణాలు మంజూరు చేయగా, 5,058 మంది రుణగ్రహీతలకు రూ.448 కోట్ల విలువైన వాహన రుణాలు మంజూరయ్యాయి. 2021 అక్టోబర్ 20 నాటికి 3,401 మంది రుణగ్రహీతలకు రూ.762 కోట్ల విలువైన గృహ రుణాలు మంజూరయ్యాయి. 2019 అక్టోబర్ – 2021 మార్చి మధ్య ఇలాంటి అవుట్రీచ్ కార్యక్రమాలను బ్యాంకులు నిర్వహించాయి. తద్వారా ఆర్ఏఎం సెక్టార్ (రిటైల్, వ్యవసాయం, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) అన్ని రకాల రుణ అవసరాలను నెరవేర్చాయి. అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.4.94 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ పండుగ సీజన్లో కూడా చిన్న రుణగ్రహీతలకు సరసమైన వడ్డీ రేట్లలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం కింద రుణాలను అందజేయాలని కేంద్రం నిర్దేశిస్తోంది. -
మిస్ వరల్డ్ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్
న్యూయార్క్: మిస్ వరల్డ్ అమెరికా 2021ని గెలుచుకున్న తొలి భారత సంతతి అమెరికన్గా శ్రీ సైనీ నిలిచింది. వాషింగ్టన్కి చెందిన శ్రీసైని ప్రపంచ స్థాయిలోనిర్వహించిన ఈ పోటీలో అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి అమెరికన్ కావడం విశేషం. అయితే ఆమెకు 12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో ఎడమవైపు భాగం ముఖంతో సహా అంతా కాలిపోయింది. పైగా ఆమె జీవితాంత పేస్మేకర్ (కృత్రిమ గుండె) సాయంతోనే బతకాలి అయినప్పటికీ వీటిన్నంటిని అధిగమించి మరీ మిస్ వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. (చదవండి: తక్షణమే చర్యలు తీసుకుంటాం!) ఈ మేరకు లాస్ ఏంజెల్స్లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో డయానా హెడెన్ శ్రీ సైనికి ఈ కిరీటాన్ని బహుకరించింది. ఈ సందర్భంగా శ్రీ సైని మాట్లాడుతూ......." నేను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నాభావాలను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా అమ్మనాన్నలకే దక్కుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్ వరల్డ్ అమెరికాకు ధన్యావాదులు" అంటూ తన సంతోషాన్ని వ్యక్త చేసింది. శ్రీ ఫోర్డ్స్ సిటీ ఆఫ్ న్యూజెర్సీలో జరిగిన పోటీలో శ్రీ 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018' కిరీటాన్ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిస్ వరల్డ్ అమెరికా ఇన్స్టాగ్రామ్లో "మిస్ వరల్డ్ అమెరికా వాషింగ్టన్ అయిన శ్రీ 'ఎండబ్ల్యూఏ నేషనల్ బ్యూటీ అంబాసిడర్' అనే ప్రతిష్టాత్మక స్థానంలోఉంది, ఆమె నిరంతరం చేసిన సేవా కార్యక్రమాల కారణంగా ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెలుచుకుంది. అంతేకాదు డాక్టర్లు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆమె కనబర్చిన సేవ దృక్పథాన్ని యూనిసెఫ్, సుసాన జి కొమెన్(యూఎస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్) వంటి ఇతర సంస్థలు గుర్తించాయి. అందం గురించి మంచి నిర్వచనాన్ని ఇవ్వడమే కాక, మిస్ వరల్డ్ అమెరికా మిషన్ పట్ల అవగాహన కలిగిస్తుంది" అని ప్రశంసించింది. View this post on Instagram A post shared by Shree Saini👑Miss World America (@shreesaini) (చదవండి: పుట్టుకతోనే చేతుల్లేవు.. కానీ చాలానే సాధించింది!) -
కిరాణా వర్తకులకు ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కిరాణా వర్తకుల మూలధన నిధుల అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఫ్లిప్కార్ట్ హోల్సేల్ నూతనంగా ఒక ‘క్రెడిట్ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు భాగస్వామ్యంతో సులభ రుణాలను సమకూర్చనుంది. కిరాణా వర్తకుల ఇబ్బందులను పరిష్కరించేందుకు, వ్యాపార వృద్ధికి నిధుల అవసరాలను తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా కిరాణా వర్తకులు ఎటు వంటి వ్యయాలు లేకుండానే రుణ సాయాన్ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, ఇతర ఫిన్టెక్ సంస్థల నుంచి పొందొచ్చని తెలిపింది. ఈ రుణాలు రూ.5,000 నుంచి రూ.2 లక్షల వరకు.. 14 రోజుల కాలానికి ఎటువంటి వడ్డీ లేకుండా లభిస్తాయని పేర్కొంది. చదవండి : ఆ పేరు మార్చండి, అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు -
బంగారం రుణాల్లోకి షావోమీ !
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా భారత్లో మరిన్ని విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. బంగారంపై రుణాలు, బీమా పాలసీలు, క్రెడిట్ లైన్ కార్డులు మొదలైన ఆర్థిక సేవలను పూర్తి స్థాయిలో అందించడంపై దృష్టి పెడుతోంది. యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, స్టాష్ఫిన్, మనీ వ్యూ, ఎర్లీ శాలరీ, క్రెడిట్ విద్య వంటి దేశీ సంస్థలతో కలిసి ఈ సర్వీసులు అందించనున్నట్లు షావోమీ భారత విభాగం హెడ్ మను జైన్ వెల్లడించారు. వచ్చే కొన్ని వారాల్లో బంగారంపై రుణాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. రుణాలకు సంబంధించిన ’మి క్రెడిట్’ విభాగం ఇకపై 60 నెలల దాకా కాలావధితో రూ. 25 లక్షల దాకా (ఇప్పటిదాకా ఇది రూ. 1 లక్షకే పరిమితం) రుణాలను జారీ చేయనున్నట్లు జైన్ చెప్పారు. చదవండి: ఎస్బీఐ లైఫ్ నుంచి ఈషీల్డ్ నెక్ట్స్ పాలసీ -
‘సీతమ్మ’కు రూ.3,426 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన నిర్మించనున్న సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,426.25 కోట్ల రుణం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాలు తీసుకునేలా ఆమోదించింది. గతంలోనే ఈ ప్రాజెక్టు రుణాలకు ఓకే చెప్పిన ప్రభుత్వం.. తాజాగా సవరణ ఉత్తర్వులు జారీచేసింది. 37 టీఎంసీల నిల్వ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.3,481 కోట్లతో గతేడాది పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ ప్రాజెక్టు టెండర్లను ఎల్అండ్టీ సంస్థ దక్కించుకోగా పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం నుంచి ఎలాంటి అనుమతులు అవసరమున్నా.. తీసుకోవాలని.. ఒకవేళ అనుమతిలేని కారణంగా పనులు నిలిపివేస్తే.. రుణాన్ని బేషరతుగా వెన క్కి తీసుకుంటామని పీఎఫ్సీ తన పేర్కొంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్లో సీతమ్మసాగర్ను అనుమతి లేని ప్రాజెక్టుగా తెలిపింది. ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని అందులో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీఎఫ్సీ ఈ నిబంధనలను పెట్టింది. -
జీడీపీలో 56 శాతానికి బ్యాంకింగ్ రుణాలు
ముంబై: బ్యాంకుల రుణ వృద్ధి 59 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 5.56 శాతానికి 2020–21 సంవత్సరంలో పడిపోగా.. నాణేనికి మరోవైపు అన్నట్టు దేశ జీడీపీలో బ్యాంకుల రుణ నిష్పత్తి 56 శాతానికి చేరుకుంది. 2015లో నమోదైన 64.8 శాతం తర్వాత ఇదే గరిష్ట స్థాయి. అయినప్పటికీ పోటీ దేశాల కంటే, జీ20 దేశాల సగటు కంటే తక్కువగానే ఉండడాన్ని గమనించాలి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ క్రెడిట్స్ (బీఐఎస్) గణాంకాలను పరిశీలిస్తే ఇది తెలుస్తోంది. మొత్తం మీద బ్యాంకుల రుణాలు 2020 నాటికి 1.52 లక్షల కోట్ల డాలర్లు (రూ.112 లక్షల కోట్లు) గా ఉన్నాయి. మన దేశ బ్యాంకుల రుణాలు–జీడీపీ నిష్పత్తి ఆసియా దేశాల్లో రెండో కనిష్ట స్థాయి కాగా.. వర్ధమాన దేశాలతో పోలిస్తే 135.5 శాతంగాను, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 88.7 శాతంగాను ఉన్నట్టు బీఐఎస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన వ్యాపారాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో హామీలేని రుణ పథకాలు సైతం ఉన్నాయి. అయినాకానీ బ్యాంకుల రుణ వృద్ధి 59 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి అన్నది ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని సూచిస్తుందని.. బ్యాంకుల రుణాలు జీడీపీలో 100 శాతంగా ఉండడం ఆదర్శనీయమైనదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్రిక్స్ దేశాలను గమనిస్తే.. బ్యాంకుల రుణాలు–జీడీపీ రేషియో చైనాలో 161.75 శాతం, రష్యాలో 88.12 శాతం, బ్రెజిల్లో 50.8 శాతం, దక్షిణాఫ్రికాలో 40.1 శాతం చొప్పున ఉంది. -
అప్పు కట్టలేక 2 లక్షలకు కూతురి అమ్మకం
లక్నో: చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి తన కూతురిని రూ.2 లెక్షలకు విక్రయించాడు. ఆమెను కొన్న వ్యక్తి వేధింపులకు గురి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కూతురిని విక్రయించడంతో ప్రశ్నించిన భార్యపై ఇస్త్రీ పెట్టెతో కాల్చి తీవ్రంగా వేధించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం పర్తాపూర్లోని శతాబ్దినగర్లో నివసిస్తున్నారు. ట్రక్ డైవర్గా పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.2 లక్షలు వివిధ అవసరాల కోసం చేశాడు. అయితే అవి తీర్చలేకపోతున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారంతా అతడిని బాకీ తీర్చాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో ఆయన అప్పు తీర్చలేక తన కూతురిని ఓ వ్యక్తికి అప్పగించాడు. అయితే ఆమెను తీసుకెళ్లిన వ్యక్తి ఆ యువతిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో అతడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు తన తండ్రి తనను విక్రయించాడని తెలిపింది. అతడిపై తల్లీకూతురు ఇద్దరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేగంగా స్పందించారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కూతురిని విక్రయించడంతో ప్రశ్నించగా తనను ఇస్త్రీ పెట్టెతో కాల్చాడని అతడి భార్య, నిందితురాలి తల్లి పోలీసులకు వివరించింది. ‘తల్లీకూతురు ఇద్దరూ ఫిర్యాదు చేశారు.. దీనిపై దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం’ అని మీరట్ ఎస్పీ రామ్రాజ్ మీడియాతో చెప్పారు. ట్రక్ డ్రైవర్పై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. తిహార్, దస్నా జైలులో పలుసార్లు శిక్ష అనుభవించాడు. చదవండి: దారుణం: గుట్కా కోసం తుపాకీతో కాల్చివేత -
దారుణం: గుట్కా కోసం తుపాకీతో కాల్చివేత
పాట్నా: పాన్ షాప్కు వచ్చిన ఓ వ్యక్తి పాన్ మసాలా (గుట్కా) అప్పుగా ఇవ్వాలని కోరగా దుకాణ యజమాని నిరాకరించాడు. దీంతో దుకాణ యజమానితో అతడు గొడవ పడ్డాడు. అప్పుగా పాన్ మసాలా ఇవ్వకపోవడంతో అతడిపై కోపం పెంచుకున్నాడు. ఈ సందర్భంగా అదే కోపంతో తెల్లారి వచ్చి ఆ దుకాణంపై దాడి చేశాడు. ఆ సమయంలో దుకాణంలో ఉన్న యజమాని కుమారుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బీహార్లోని సుపాల్ జిల్లాలో త్రివేణిగంజ్కు చెందిన అజిత్కుమార్ రౌడీ. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ పాన్ షాప్కు వచ్చాడు. బెదిరింపులకు పాల్పడుతూ రూ.20 విలువ చేసే పాన్ మసాలా అప్పుగా ఇవ్వాలని అడిగాడు. అయితే దుకాణంలో ఉన్న యజమాని ఇవ్వను అని తేల్చిచెప్పాడు. కొద్దిసేపు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడితో వాగ్వాదం చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు సర్ది చెప్పడంతో అజిత్ వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు సోమవారం తన అనుచరులతో దుకాణం వచ్చాడు. దుకాణంలో ఉన్న యజమాని చిన్న కుమారుడు మిథిలేశ్తో మళ్లీ పాన్ మసాలా కోసం గొడవ పడ్డాడు. ఈ సమయంలో క్షణికావేశానికి గురైన అజిత్ కుమార్ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన మిథిలేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలిసి సమీపంలో ఉన్న మిథిలేశ్ అన్న పరుగెత్తుకుంటూ రావడంతో త్రివేణి సింగ్, అతడి అనుచరులు పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను తాము గుర్తించినట్లు.. త్వరలోనే వారిని పట్టుకుంటామని సుపాల్ జిల్లా పోలీస్ అధికారి షేక్ హసన్ తెలిపారు. -
ఎకరాలోపు 16.04లక్షల మందికి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: యాసంగి రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కావడం మొదలైంది. ఎకరాలోపు భూములున్న రైతులకు రైతుబంధు సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందజేసింది. తొలిరోజు 16,03,938 మంది రైతులకు రైతుబంధు అందింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున 9,88,208 ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఎకరంలోపు భూములున్న రైతుల ఖాతాల్లో రూ. 494,10,86,470 బదిలీ అయింది. వాస్తవానికి ఎకరంలోపున్న భూములకు రూ. 559.99 కోట్లు సిద్ధం చేయగా 2.65 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలు లేకపోవడంతో రూ. 65.88 కోట్లు మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు రైతుబంధు అర్హత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యాసంగిలో ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం రూ. 7,515 కోట్లు పంట సాయంగా అందించనుంది. చదవండి: (బ్రహ్మోత్సవాలలోపే యాదాద్రి ప్రారంభం?) తొలిరోజు ఎకరంలోపు భూములున్న వారికి ఇచ్చామని, ఇలా వరుసగా రెండెకరాలు, మూడు ఎకరాల చొప్పున రైతులందరికీ విడతలవారీగా రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి వెల్లడించారు. తొలిరోజు ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9,239 మంది రైతులకు రైతుబంధు అందగా అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,05,545 మందికి రైతుబంధు అందింది. మొదటి రోజున నిధులు తక్కువ అందిన జిల్లాగా అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిలిచింది. ఇక్కడ 12,884 మంది ఎకరంలోపున్న రైతులు ఉండగా రూ. 3.37 కోట్ల నిధులు మాత్రమే అందాయి. -
ఈ నెల్లోనే ఈపీఎఫ్ వడ్డీ జమ!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఆరు కోట్ల మంది సభ్యుల భవిష్యనిధి నిల్వలపై 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ 8.5 శాతాన్ని డిసెంబర్ నెలాఖరులోపు జమ చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కార్మికమంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్వో ట్రస్టీల సమావేశంలో 8.5 శాతాన్ని రెండు భాగాలుగా చేసి.. తొలుత 8.15 శాతం, తర్వాత డిసెంబర్ చివరిలోపు 0.35 శాతం చొప్పున జమ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు ఏదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ నెలలోనే 8.5 శాతం వడ్డీని జమ చేసేందుకు ఆర్థిక శాఖా సమ్మతి కోరుతూ కార్మిక శాఖ ప్రతిపాదన పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల్లోనే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రావచ్చని, దాంతో ఈ నెల చివర్లోగా వడ్డీ జమ చేయడం పూర్తవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
నిండా ముంచేస్తారు.. ‘యాప్గాళ్లు’
కొన్నాళ్ల క్రితం అత్యవసరమై ఓ యాప్ ద్వారా రూ.5 వేల రుణం తీసుకున్నా.. సకాలంలో వడ్డీ, వాయిదాలు చెల్లిస్తున్నా. రకరకాల కారణాలు చెప్పి పెనాల్టీలు వేశారు. మొత్తం రూ.9 వేలు కట్టా.. అయినప్పటికీ ఇంకా బాకీ ఉందంటూ ఫోన్లు, సందేశాలు పంపిస్తున్నారు. నా ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్ ఆధారంగా స్నేహితులు, బంధువులకు విషయం చెప్పి పరువు తీస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా.. – ఓ బాధితుడి ఆవేదన కోవిడ్ బారిన పడి క్వారంటైన్లో ఉండగా డబ్బు అవసరమైంది. దీంతో ఓ యాప్ నుంచి రూ.30 వేలు తీసుకున్నా.. వారం తర్వాత ఆ అప్పు తీర్చడానికి మరో దాని నుంచి ఇలా.. ఇప్పటికీ నా యాప్ల అప్పు రూ.2.7 లక్షలకు చేరింది. నా కాంటాక్ట్స్లో ఉన్న వారందరితో కలిపి వాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లు క్రియేట్ చేశారు. అందులో నా ఫొటోను ఫ్రాడ్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఒక యాప్ నుంచి అప్పు తీసుకుంటే.. వరుస పెట్టి మిగిలిన యాప్ల నుంచి ఆఫర్లు వచ్చి ఉచ్చులోకి దింపుతున్నాయి.. – నగరానికిచెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించని కాబూలీ వాలాలు వాళ్లు.. యాప్ల ఆధారంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్పులిస్తారు.. వడ్డీతో సహా అప్పు చెల్లించడంలో ఏమాత్రం ఆలస్యమైనా రకరకాలుగా వేధిస్తారు.. గూగుల్ ప్లేస్టోర్స్ ద్వారా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అప్పులిచ్చే యాప్స్ వ్యవహారమిది.. ఈ ‘యాప్గాళ్ల’వేధింపులు పెరిగిపోయాయంటూ 4రోజుల్లో 50మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ప్లేస్టోర్స్లో లెక్కకు మిక్కిలిగా.. కంటికి కూడా కనిపించకుండా అప్పులిచ్చే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్స్లో 250 ఉన్నాయి. ఇందులో హోస్ట్ కాకుండా లింకుల రూపంలో పనిచేసే వాటికి కొదవే లేదు. ఎం–పాకెట్, లెండ్ కరో, క్రేజీబీ, స్లైస్, ఉదార్ కార్డ్, రెడ్ కార్పెట్..వంటివి కొన్ని మచ్చుకు మాత్ర మే. ప్రధానంగా యువత, విద్యార్థులనే టార్గెట్గా చేసుకుని ఆన్లైన్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అప్పు తీసుకునే వ్యక్తి తన ఆధార్ కార్డు, పాన్కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు అప్లోడ్ చేస్తే సరిపోతోంది. కొన్ని గంటల్లోనే ఆ మొత్తం సదరు వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతా లేదా..ఈ–వాలెట్స్లోకి వచ్చి పడుతుంది. ఈ యాప్స్ రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం ఇస్తున్నాయి. వడ్డీ, పెనాల్టీలు తదితరాలను కలుపుకుంటే నెలకు 35 నుంచి 45 శాతం వరకు వడ్డీ ఉంటోంది. వీటి నుంచి అప్పు తీసుకున్న వాళ్లు వారం నుంచి 10 రోజుల్లో రీ–పేమెంట్ చెయ్యాల్సి ఉంటోంది. ఈ చెల్లింపులకు సంబంధించి నిర్ణీత గడువుకు కొన్ని గంటల ముందు ఎస్సెమ్మెస్ వస్తుంది. అందులోని లింకు క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్లోనే చెల్లింపులు జరుగుతాయి. (చక్రవడ్డీ మాఫీ : వారికి సుప్రీం షాక్) అవన్నీ తమ వద్దకు చేరటంతో.. లోన్ యాప్స్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకునేప్పుడు మిగిలిన యాప్స్ మాదిరిగానే కాంటాక్ట్స్, ఫొటోస్, లొకేషన్ తదితరాలు యాక్సెస్ చేయడానికి అనుమతి కోరుతుంది. దీన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా అప్పు తీసుకునే వ్యక్తికి సంబంధించిన సమస్త వివరాలనూ లోన్ యాప్స్ తమ అధీనంలోకి తీసుకుంటున్నాయి. రుణం చెల్లింపులో విఫలమైతే చాలు.. బెదిరింపులకు దిగుతున్నాయి. తమ వద్ద ఫలానా వ్యక్తి అప్పు తీసుకున్నాడని, అతడో ఫ్రాడ్ అనీ కాంటాక్ట్స్ లిస్ట్లోని వారికి వాట్సాప్ ద్వారా సందేశాలు, ఫొటోలు పంపిస్తున్నారు. రుణగ్రస్తులకు ఫోన్లు చేసి అభ్యంతరకంగా, అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే పది మంది సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడం తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది అసభ్యత ఉంటే సైబర్ కేసు.. ‘అప్పులిచ్చిన యాప్లను షార్క్ యాప్స్ అంటున్నారు. ఇవి సొర చేప మాదిరిగా ఓ వ్యక్తి ఆర్థికస్థితిని తినేస్తాయని అర్థం. వీటి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు. ఇవన్నీ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల కిందకు వస్తాయి. యాప్స్ నిర్వాహకులు మహిళల్ని దూషించినా, అసభ్య పదజాలంతో సందేశాలు పంపినా అది ఐటీ యాక్ట్లోని సెక్షన్ 67 కిందకు వస్తుంది. ఇలాంటి కేసుల్ని నమోదు చేస్తున్నాం.. మిగిలిన ఫిర్యాదుల్లో ఐపీసీలోని 506 సెక్షన్ లేదా తెలంగాణ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా రుణం అవసరమైనప్పుడు ఆర్బీఐ అధీనంలో ఉండే సంస్థల నుంచి మాత్రమే తీసుకోవాలి’. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ, -
క్రెడిట్ ఇవ్వండి ప్లీజ్
‘‘పాటకు పదాలు ముఖ్యం. ఆ పదాలు రాసేవాడికి క్రెడిట్ ఇవ్వడానికి ఎందుకంత అశ్రద్ధ? మేం రాసిన పాటకు మా పేరు వేయండి. క్రెడిట్ ఇవ్వండి ప్లీజ్’’ అంటూ ఓ పాటను విడుదల చేశారు బాలీవుడ్కు చెందిన పలువురు పాటల రచయితలు. మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ రచయితలకు క్రెడిట్ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ 15 మంది పాటల రచయితలు ‘క్రెడిట్స్ దేదో యార్’ అనే పాటను రిలీజ్ చేశారు. రచయితలు వరుణ్ గ్రోవర్, కౌశర్ మునిర్, సమీర్ అంజాన్, స్వానంద్ కిరికిరే, అమితాబ్ భట్టాచార్య, నీలేష్ మిశ్రా, మనోజ్ ముంతాషిర్, మయూర్ పూరి, షిల్లే, పునీత్ శర్మ, అభిరుచి చంద్, హుసేన్ హేడ్రీ, రాజ్ శేఖర్, అన్విత దత్, కుమార్ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రెండున్నర నిమిషాలున్న ఈ ‘క్రెడిట్ దేదో యార్’ పాటను ఈ 15మంది ఆలపించారు. ఈ ఉద్యమంలో శ్రోతలు కూడా భాగమవ్వాలన్నారు. గీత రచయిత పేరు (క్రెడిట్) లేకుండా ఏ మ్యూజిక్ కంపెనీ అయినా, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా పాట కనిపిస్తే ప్రశ్నించండి అని వీళ్లంతా ట్వీటర్ ద్వారా కోరారు. -
క్రెడిట్ రిస్క్ ఫండ్స్కు తగ్గిన ఉపసంహరణల ఒత్తిడి
న్యూఢిల్లీ: క్రెడిట్ రిస్క్ ఫండ్స్కు ఎట్టకేలకు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిడి తగ్గింది. ఏప్రిల్ 27తో పోలిస్తే ఏప్రిల్ 30వ తేదీ నాటికి నికర పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం 81 శాతం తగ్గిపోయినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. యాంఫి వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 24న క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న మొత్తం రూ.2,949 కోట్లుగా ఉంటే, ఏప్రిల్ 27 నాటికి రూ.4,294 కోట్లకు పెరిగిపోయింది. డెట్ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఏప్రిల్ 27న రూ.50,000 కోట్లతో మ్యూచువల్ ఫండ్స్కు ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించిన విషయం గమనార్హం. దీనివల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏర్పడిందో ఏమో కానీ... ఏప్రిల్ 28న రూ.1,847 కోట్లు, ఏప్రిల్ 29న రూ.1,251 కోట్లు, ఏప్రిల్ 30న రూ.794 కోట్లకు నికర పెట్టుబడుల ఉపసంహరణ తగ్గిపోయింది. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి ఒక విభాగం. రిస్క్ అధికంగా ఉండే డెట్ పేపర్లలో అవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే, తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీలు జారీ చేసే డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిల్లో డిఫాల్ట్ రిస్క్ అధికంగా ఉంటుంది. కనుకనే ఆయా కంపెనీలు అధిక రాబడులను ఆఫర్ చేస్తుంటాయి. -
రైతులకు నేడు పంట నష్టపరిహారం జమ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతేడాది సెప్టెం బర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన 67,874 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 54.52 కోట్ల పంట నష్టపరిహారాన్ని శుక్రవారం చెల్లించనున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదును జమ అవుతుంది. ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పద్ధతిన నగదు జమ అవుతుంది. నగదు జమ అయిన తర్వాత రైతుల పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. -
ఈక్విటీ ఫండ్స్లోకి తగ్గిన పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక ఈ ఏడాది నవంబర్ మాసంలో గణనీయంగా తగ్గిపోయింది. నికరంగా రూ.933 కోట్లు మాత్రమే ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ‘యాంఫి’ తెలియజేసింది. నెలవారీగా చూసుకుంటే ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక 85 శాతం మేర తగ్గిపోయింది. 2016 జూన్ తర్వాత ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం వరుసగా మూడో నెలలోనూ తగ్గినట్టయింది. ఏవో కొన్ని ఎంపిక చేసిన స్టాక్స్ మినహా మిగిలిన స్టాక్స్ పనితీరు గత ఏడాది కాలంలో ఆశాజనకంగా లేకపోవడం ఫండ్స్ రాబడులపై ప్రభావం చూపించింది. ఇది పెట్టుబడులపైనా ప్రతిఫలించింది. మరోవైపు క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు గణనీయంగా బయటకు వెళ్లిపోతున్నాయి. గత నెల చివరి నాటికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.27.04 లక్షల కోట్లకు పెరిగాయి. అక్టోబర్ చివరికి ఉన్న రూ.26.33 లక్షల కోట్లతో పోల్చుకుంటే 3 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మీద ఫండ్స్ పథకాల్లోకి అక్టోబర్లో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, అది నవంబర్లో రూ.54,419 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా డెట్ ఫండ్స్లోకి రూ.51,000 కోట్ల పెట్టుబడులు రావడం వృద్ధికి దోహదపడింది. ‘క్రెడిట్ రిస్క్’ సంక్షోభం! దేశీయ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మొత్తం 44 సంస్థలు (ఏఎంసీలు) కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలోని క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి నవంబర్లో నికరంగా రూ.1,899 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. అంతక్రితం మాసం నాటి గణాంకాలతో పోలిస్తే పెట్టుబడుల ఉపసంహరణ 37.4 శాతం పెరిగింది. గతేడాది జూలై నుంచి క్రెడిట్ రిస్క్ ఫండ్స్కు అమ్మకాల ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం, ఆ తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ తదితర సంస్థలు రుణ పత్రాలపై చెల్లింపుల్లో విఫలం కావడం, వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన క్రెడిట్ రిస్క్ ఫండ్స్ రాబడులు దెబ్బతినడం ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నాటికి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నిర్వహణలో రూ.79,643 కోట్ల పెట్టుబడులు ఉండగా, నవంబర్ చివరికి అవి రూ.63,754 కోట్లకు తగ్గాయి. ఇది 20% క్షీణత. లిక్విడ్ ఫండ్స్కూ నిరాదరణ... డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్కూ నిరాదరణ ఎదురైంది. అక్టోబర్లో లిక్విడ్ ఫండ్స్ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.93,203 కోట్లుగా ఉంటే, నవంబర్లో రూ.6,938 కోట్లకు తగ్గిపోయాయి. ఎగ్జిట్ లోడ్ విధించడం వల్ల కొందరు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఓవర్నైట్ ఫండ్స్కు మళ్లించి ఉంటారని యాంఫి సీఈవో వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఇతర ఫండ్స్లోకి... ► ఈక్విటీ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) పథకాల్లోకి నవంబర్లో నికరంగా రూ.2,954 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం అక్టోబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.5,906 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గాయి. ► ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాల్లోకి రూ.1,312 కోట్ల పెట్టుబడులు రాగా, రూ.379 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. దీంతో నికర పెట్టుబడులు రూ.933 కోట్లుగా నమోదయ్యాయి. ► డెట్ విభాగంలో ఓవర్నైట్ ఫండ్స్ (ఒక్క రోజు కాల వ్యవధి సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసేవి)లోకి రూ.20,650 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లిక్విడ్ ఫండ్స్కు ఎగ్జిట్ లోడ్ విధించడం వీటికి కలిసొచ్చింది. ► బ్యాంకింగ్–పీఎస్యూ ఫండ్స్లోకి 7,230 కోట్లు వచ్చాయి. ► గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి నికరంగా రూ.7 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ.31.45 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. లాభాల స్వీకరణే.. ఈక్విటీ పథకాల్లో నికర పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గడానికి ఒకింత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే కారణం. అయితే, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు మాత్రం మొత్తం మీద రూ.27 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన సిప్ పెట్టుబడులు క్రమంగా వృద్ధి చెందుతూ నూతన గరిష్ట స్థాయి రూ.3.12 లక్షల కోట్లకు చేరాయి. – ఎన్ఎస్ వెంకటేశ్, యాంఫి సీఈవో -
షాకింగ్: వేలాది పీఎన్బీ కార్డుల డేటా లీక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిని పంజాబ్నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరిన్ని షాకింగ్ విషయాలు తాజాగా వెలుగు చూశాయి. పీఎన్బీకి చెందిన వేలాదిమంది వినియోగదారుల కార్డుల సమాచారం హ్యాకింగ్కు గురైనట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. కస్టమర్లకు చెందిన గోప్యమైన విషయాలు వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయనీ, కనీసం మూడు నెలలుగా ఈ పక్రియ కొనసాగుతున్నట్టు నివేదించింది. బెంగళూరులోని సింగపూర్-రిజిస్టర్డ్ కంపెనీ ఈ డేటీ చోరికి పాల్పడినట్టు హాంకాంగ్ ఆధారిత పత్రికనుటంకిస్తూ ఆసియా నెట్వర్క్ రిపోర్ట్ చేసింది దాదాపు పీఎన్బీకి చెందిన 10వేల వినియోగదారుల సమాచారం లీక్ అయినట్టు తెలిపింది. ఇది గూగుల్ లాంటి ఇతర సెర్చ్ సైట్లలో ఇది కనిపించదనీ, కానీ చట్టవిరుద్ధంగా సున్నితమైన సమాచారం, కొనుగోలు, విక్రయాలు చేస్తాయని క్లౌడ్ సెక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టెక్ అధికారి రాహుల్ శశి తెలిపారు. సీవీవీ సహా పేర్లు, గడువు తేదీలు, వ్యక్తిగత గుర్తింపు సంఖ్యలు , కార్డ్ ధృవీకరణ ఇతర డేటా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలా రెండు సెట్ల డేటా అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. సీవీవీ నెంబర్తో సహా కొందరివి, లేకుండా కొంత డేటా బహిర్గమైందన్నారు. డేటాలో చివరి స్టాంపు తేదీ జనవరి 29, 2018 ఉందనీ, అంటే ఇప్పటికీ వేలసంఖ్యలో పీఎన్బీ డేటా వారికి అందుబాటులో ఉన్నట్టుగా భావించాలన్నారు. మరోవైపు దీన్ని ధృవీకరించిన పీఎన్బీ అధికారి విర్వానీ..దీనిపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. దీంతో పీఎన్బీ కార్డుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. -
24 గంటల కరెంటు బీజేపీ ఘనతే
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఘనతేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. విలేకరులో మాట్లాడుతూ.. 2018 వరకు తెలంగాణలో నిరంతర విద్యుత్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. ఉదయ్ పథకంలో రాష్ట్రాన్ని చేర్చడం, నార్త్ సౌత్ గ్రిడ్ అనుసంధానం, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లకు కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు. ఒక్క మెగావాట్ ఉత్పత్తి పెరగకుండా రాష్ట్రం విద్యుత్ను ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. 2014 ముందు దేశంలో విద్యుత్ లోటు ఉందని, మోదీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగిందన్నారు. మోదీ సర్కారు వచ్చాక 19 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఏర్పడిందన్నారు. టీఆర్ఎస్ ఇది కేవలం రాష్ట్ర ఘనత అనడం విడ్డూరమన్నారు. 2019 లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని, అందులో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ 3 జిల్లాల్లో పర్యటించారని చెప్పారు. -
కార్డు లావాదేవీల్లో పెరుగుదల 7 శాతమే
న్యూఢిల్లీ: గతేడాది పెద్ద నోట్ల రద్దు అనంతరం మొత్తం మీద డిజిటల్ లావాదేవీలు 23% పెరగ్గా, అందులో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీల పెరుగుదల 7%గానే ఉంది. ఈ మేరకు పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఆర్థిక శాఖకు చెందిన పార్లమెంటరీ ప్యానల్కు వివరాలు తెలిపారు. దీని ప్రకారం గతేడాది నవంబర్లో అన్నిరకాల డిజిటల్ లావాదేవీలు 22.4 మిలియన్లుగా ఉండగా, 23% వృద్ధితో ఈ ఏడాది మే నెల నాటికి 27.5 మిలియన్లకు చేరాయి. యూపీఐ ఆధారిత లావాదేవీల్లో ఎక్కువ పెరుగుదల నమోదైంది. ఐఎంపీఎస్ లావాదేవీలు 1.2 మిలియన్ల నుంచి 2.2 మిలియన్లకు చేరాయి. అతి తక్కువ వృద్ధి మాత్రం కార్డులదే. 6.8 మిలియన్ల నుంచి 7.3 మిలియన్లకు పెరిగాయి. -
‘క్లోన్’ చేసి రూ.కోటి కొట్టేశారు!
► క్రెడిట్, డెబిట్ కార్డుల్నిక్లోనింగ్ చేసిన ముఠా ► స్వైపింగ్ మెషీన్ల ద్వారా రూ.కోటి స్వాహా ► నలుగురి అరెస్టు సాక్షి, హైదరాబాద్: కరెంట్ ఖాతాల ఆధారంగా బ్యాంక్ నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ మెషీన్లు తీసుకు ని క్లోనింగ్ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోట్ల స్వాహా చేసిన అంతర్రాష్ట్ర ముఠాను నగర సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. కరెంట్ ఖాతాల ద్వారా.. నగరానికి చెందిన మామిడి మహేశ్ జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్లో 4 కరెంట్ ఖాతాలు తెరిచి.. వ్యాపార లావాదేవీలకు ఫిబ్రవరిలో నాలుగు స్వైపింగ్ మెషీన్లు తీసుకున్నాడు. ఓ కేసులో నిందితునిగా ఉన్న మహేశ్కు ఇటీవలే కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో జైలుకు వెళ్తూ తన స్వైపింగ్ మెషీన్లను స్నేహితుడైన కిరణ్కుమార్కు అప్పగించాడు. వనస్థలిపురం లో చిన్న దుకాణం నడుపుతున్న కిరణ్కు కొన్నాళ్ల క్రితం చాంద్పాషాతో పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్ చేసిన క్రెడిట్, డెబిడ్ కార్డులతో పాటు పిన్ నంబర్, డేటా వస్తుందని అతను కిరణ్తో చెప్పాడు. స్వైపింగ్ మెషీన్లు తనకిస్తే లావాదేవీలపై 10 శాతం కమీషన్ ఇస్తానంటూ ఎర వేశాడు. కమీషన్ కోసం పక్కదారి.. కమీషన్ కోసం కిరణ్ స్వైపింగ్ మెషీన్లను పాషాకు అప్పగించాడు. పాషా వాటిని కేరళకు చెందిన అబుబాకర్కు అందించాడు. కేరళలోని యూసుఫ్ నుంచి క్లోన్డ్ కార్డుల్ని తీసుకుంటున్న ఇతను వాటిని స్వైపింగ్ మెషీన్లలో స్వైప్ చేస్తూ నిర్ణీత మొత్తం మహేశ్ కరెంట్ ఖాతాల్లో పడేలా చేస్తున్నాడు. కిరణ్ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్గా తీసుకుని మిగిలినది అబుబాకర్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అబుబాకర్ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్గా తీసుకుని మిగిలింది యూసుఫ్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. ఈ వ్యవహారాల్లో కిరణ్కు రామ్ప్రసాద్.. అబుబాకర్కు కేరళకే చెందిన హనీఫ్ హంజా సహకరించారు. రెండు నెలల్లో రూ.కోటి స్వైప్ ఈ గ్యాంగ్ రెండు నెలల్లో అనేక మంది క్లోన్డ్ కార్డులను వినియోగించి రూ.1.1 కోట్లు స్వాహా చేసింది. జేఅండ్కే బ్యాంక్ జారీ చేసిన స్వైపింగ్ మెషీన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలి యకుండానే వారి కార్డుల్ని క్లోన్ చేసి, నగదు కాజేస్తున్నారని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. దీంతో జేఅండ్కే బ్యాంక్ అధికారి మహ్మద్ అల్తాఫ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీ సులు కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్కుమార్ను అరెస్టు చేశారు. జైల్లో ఉన్న మహేశ్ను పీటీ వారెంట్పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్తో పాటు చాంద్పాషా కోసం గాలిస్తున్నారు. -
క్రెడిట్ రిపోర్ట్ కావాలంటే..
► ఉచితంగానే అందిస్తున్న ఫిన్టెక్ కంపెనీలు ► క్రెడిట్ బ్యూరోలిచ్చే రిపోర్టులకు ఇవి అదనం ప్రస్తుతం ఏ రుణం తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోరు కీలకపాత్ర పోషిస్తోంది. ఈ స్కోరు ఏమాత్రం తగ్గినా.. ఆ మేరకు రుణం మంజూరీ, వడ్డీ రేటు మొదలైన వాటన్నింటిపైనా ప్రభావం ఉంటోంది. అయితే, ఇప్పటిదాకా మన క్రెడిట్ స్కోరు వివరాలు అంత సులభంగా తెలిసేవి కావు. క్రెడిట్ బ్యూరోలకు డబ్బులు కడితేనో లేదా ఏదైనా రుణం కోసం అప్లై చేసుకున్నప్పుడు సదరు ఆర్థిక సంస్థ ద్వారానో స్కోరు తెలిసేది. కానీ ఆర్బీఐ ఆదేశాలతో కొన్నాళ్ల క్రితం నుంచి సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలు ఏటా ఒక్క రిపోర్టు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టాయి. అయితే, నేరుగా వీటి దగ్గరకే వెళ్ల కుండా ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) సంస్థలు కూడా సందర్భాన్ని బట్టి క్రెడిట్ స్కోరు లేదా రిపోర్టు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టాయి. క్రెడిట్ బ్యూరోల నుంచి తీసుకునే రిపోర్టుకు ఇది అదనం కావడం గమనార్హం. సులభతరం... బ్యూరోల వెబ్సైట్లతో పోలిస్తే ఫిన్టెక్ పోర్టల్స్ నుంచి రిపోర్టు పొందటం కొంత వరకూ సులభంగా ఉంటోంది. కొన్ని పోర్టల్స్ స్క్రీన్ మీదే స్కోరు లేదా రిపోర్టునిస్తుంటే.. మరికొన్ని ఈమెయిల్కి పంపిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని వివరాలు ఇస్తే బ్యాంక్బజార్ డాట్కామ్ .. క్రెడిట్ రిపోర్టును వెబ్సైట్లో చూపడంతో పాటు ఈమెయిల్ కూడా పంపిస్తోంది. ఇక పైసాబజార్.. నివేదికను వెబ్సైట్లోనే డిస్ప్లే చేస్తోంది. రెండు సైట్లు కూడా ఎక్స్పీరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనే క్రెడిట్ బ్యూరో వివరాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. పైసాబజార్.. మీ నివేదికకు సంబంధించి ఇచితంగా నెలవారీ అప్డేట్ కూడా అందిస్తోంది. ఇక క్రెడిట్మంత్రి పోర్టల్.. స్కోరు ను వెబ్సైట్లో చూపిస్తుంది. కానీ పూర్తి నివేదిక కావా లంటే రూ. 199తో పాటు నిర్దేశిత పన్నులూ చెల్లిం చాలి. ఈ పోర్టల్ సంబంధిత వివరాలను ఈక్విఫ్యాక్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నుంచి తీసుకుంటోంది. ఇండియాలెండ్స్ సంస్థ స్కోరును, సీఆర్ఐఎఫ్ హైమార్క్ను తమ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తుంది. క్రెడిట్ బ్యూరోల్లో మన ఉచిత కోటాకు అదనంగానే ఫిన్టెక్ సంస్థలు ఇచ్చే ఉచిత రిపోర్టులు ఉంటాయి. ఇంతకీ ఎందుకు ఉచితం... సాధారణంగా క్రెడిట్ బ్యూరోలు తమ ఖాతాదారుల పరిమాణాన్ని పెంచుకునే క్రమంలో భాగంగా ఈ తరహా ఉచిత రిపోర్టులు ఇస్తున్నాయి. ఇలా ఫిన్టెక్ సంస్థలతో జట్టు కట్టడం వల్ల క్రెడిట్ రిపోర్టులపై అవగాహన పెంచడంతో పాటు మరింత మంది ఖాతాదారులకు చేరువ కావొచ్చన్నది వాటి వ్యూహం. ఇక వినియోగదారుల దృష్టికోణం నుంచి కన్జూమర్స్కి తమ క్రెడిట్ నివేదికలు అందుబాటులోకి రావడంతో పాటు.. రుణం పొందడానికి మెరుగైన అవకాశాలను దక్కించుకునేందుకు ఏం చేయొచ్చన్నది తెలుసుకునేందుకు కూడా ఇది తోడ్పడగలదు. దరఖాస్తుదారు ఆర్థిక వివరాలు తెలియడం వల్ల వారికి అనువైన లోన్ అందేలా చూడటం ఫిన్టెక్ సంస్థలకు వీలవుతుంది. కస్టమర్కి లోన్ వస్తేనే వాటికీ ఆదాయం వస్తుంది కాబట్టి.. అవి ఆ దిశగా కసరత్తు చేస్తాయి. క్రెడిట్ బ్యూరోలు నేరుగా కస్టమర్లతో కన్నా ఎక్కువగా వ్యాపార సంస్థలతోనే డీల్ చేస్తుంటాయి. వాటి క్లయింట్స్ బ్యాంకులు మొదలైన ఆర్థిక సంస్థలే ఉంటాయి. అందుకే వాటి నుంచి సాధారణ కస్టమర్ నివేదిక తీసుకోవాలంటే ప్రక్రియ కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. అదే ఫిన్టెక్ సంస్థలైతే నిత్యం నేరుగా కస్టమర్లతోనే డీల్ చేస్తుంటాయి. కాబట్టి వారికి సర్వీసులను సులభతరంగా ఎలా అందించవచ్చన్న దానిపైనే దృష్టి పెడతాయి కనుక ఫిన్టెక్ సంస్థల నుంచి నివేదికలు పొందడం కొంత సులువుగా ఉంటుంది. ఉచితంలో ఫ్రీ ఎంత... ఉచితం అనేది పేరుకే కానీ.. ఏదీ పూర్తిగా ఉచితంగా ఉండదని తెలుసుకోవాలి. ఫిన్టెక్ ప్లాట్ఫాం విషయమే తీసుకుంటే.. మీకు సంబంధించిన కొన్ని వివరాలు ఇస్తేనే వాటì నుంచి రిపోర్ట్ ఉచితంగా లభిస్తుంది. మీ పేరు, చిరునామా, పాన్ నంబరు వంటి సమాచారం అంతా ఇవ్వాలి. ఇక క్రెడిట్ బ్యూరోల ద్వారా అవి మీ క్రెడిట్ హిస్టరీని కూడా తెలుసుకుని.. మీకు అనువైన ఉత్పత్తులు.. పథకాలను విక్రయిం చేందుకు ఉపయోగించుకుంటూ ఉంటాయి. తద్వారా మీ వివరాలను అవి వ్యాపారప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కొంత అప్రమత్తత అవసరం... ఆన్లైన్ సర్వీసులు కావొచ్చు.. ఇతరత్రా అప్లికేషన్స్ కావొచ్చు చాలా మంది షరతులు, నిబంధనలను పూర్తిగా చదవకుండానే వదిలేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఏదో ఒకటి ఉచితంగా పొందేందుకు మీ ఆదాయాలు, పాన్ నంబరు మొదలైన కీలక వివరాలను థర్డ్ పార్టీలకు ఇచ్చేసి, మోసగాళ్ల బారిన పడకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే డేటా దుర్వినియోగం కాకుండా సురక్షితంగానే ఉంటుందనే భరోసా కలిగితే తప్ప థర్డ్ పార్టీలకు వివరాలు ఇచ్చేయొద్దని చెబుతున్నారు. -
నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలు ఎత్తివేత!
-
ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరవ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లకు ఎలాంటి సర్ ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది.. ఫిబ్రవరి 8 బుధవారం ఆర్బీఐ నిర్వహించిన క్రెడిట్ పాలసీ రివ్యూలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు తెలిపింది. రెపో(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను 6.25శాతంగా, రివర్స్ రెపో రేటు(ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు)ను 5.75 శాతంగా ఉంచుతున్నట్టు పేర్కొంది. బ్యాంకు రేటు 6.75 శాతంగా అమలుకానుంది. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో జరుగుతున్న మూడవ సమీక్ష ఇది. మెజారిటీ ప్రాతిపదికన రేట్ల నిర్ణయం తీసుకోడానికి ఆరుగురు సభ్యులతో పరపతి విధాన కమిటీ (ఎంసీపీ) ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న 3వ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కాగా వడ్డీ రేట్ల తగ్గింపుపై అనేక సెక్టార్లు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వారి ఆశలు అడియాసలు చేస్తూ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని మానిటరీ కమిటీ ఈ నిర్ణయం వెలువరచగానే, మార్కెట్లో నష్టాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 114 పాయింట్ల నష్టంలో 28,220 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 8,739వద్ద కొనసాగుతున్నాయి. -
త్వరలో రేషన్ నగదు రహితం!
కార్డు, ఆధార్ ద్వారా చెల్లింపులు న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఆధార్ ద్వారా చెల్లింపులకు అన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లు, ఎరువుల దుకాణాల్లో త్వరలో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 1.7 లక్షల పీఓఎస్లు పీడీఎస్ల్లో అమర్చామని, కొద్ది నెలల్లో మిగిలిన అన్ని దుకాణాల్లో అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లవసా తెలిపారు. ‘ఆహార– ప్రజా పంపిణీ, ఎరువుల విభాగాల వద్ద పీఓఎస్లను ఇన్ స్టాల్ చేయడానికి అవసరమైన ప్రోగ్రామ్ ఉంది. వాటిల్లో ఆధార్ ద్వారా కూడా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకొంటాం. లక్ష గ్రామాల్లో రెండేసి మిషన్ల చొప్పున ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది’ అని అశోక్ చెప్పారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా లాభమెంతన్నది అంచనాకు రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. -
మనీ టాప్ యాప్ ద్వారా పర్సనల్ లోన్
-
జమ 12.44 లక్షల కోట్లు జారీ 4.61 లక్షల కోట్లు
-
జమ 12.44 లక్షల కోట్లు..జారీ 4.61 లక్షల కోట్లు
ముంబై: రద్దయిన నోట్ల రూపంలో డిసెంబర్ 10 వరకూ బ్యాంకులకు రూ. 12.44 లక్షల కోట్ల మొత్తం చేరిందని ఆర్బీఐ తెలిపింది. ఇంతవరకూ రూ. 4.61 లక్షల కోట్ల మేర కొత్త నోట్లను జారీ చేశామంది. ‘రిజర్వ్ బ్యాంక్, కరెన్సీ చెస్ట్లకు రూ. 500, రూ. వెయ్యి నోట్ల రూపంలో రూ. 12.44 లక్షల కోట్లు చేరాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకూ 4.61 లక్షల కోట్లను బ్యాంక్ కౌంటర్లు, ఏటీఎంల ద్వారా చెలామణి చేశాం. ఇంతవరకూ 2,180 కోట్ల మేర వివిధ కరెన్సీ నోట్లు ముద్రించాం. అందులో రూ10, రూ. 20, రూ. 50, రూ. 100 నోట్లు 2,010 కోట్లు కాగా, రూ. 500, రూ. 2 వేల నోట్లు 170 కోట్ల వరకూ ఉన్నాయి’ అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ చెప్పారు. డిసెంబర్ 7 నుంచి రద్దయిన నోట్ల రూపంలో బ్యాంకులకు రూ. లక్ష కోట్లు చేరగా... కొత్త నోట్ల జారీ మాత్రం తక్కువగా ఉందన్నారు. బ్యాంకులు తరచూ నగదు వివరాల్ని తనిఖీ చేస్తూ ఉండాలని, ఏమైనా తేడాలు ఉన్నట్లు కనుగొంటే అంతర్గత ఆడిటింగ్ జరపాలని బ్యాంకులకు చెప్పినట్లు ఆర్బీఐ తెలిపింది. సీసీటీవీ ఫుటేజీని భద్రపరచండి కొత్త నోట్లు అక్రమార్కులకు చేరుతుండడంతో ఆర్బీఐ అప్రమత్తమైంది. బ్యాంకు బ్రాంచీలు, కరెన్సీ చెస్టుల వద్ద సీసీటీవీ రికార్డింగ్ల్ని భద్రపరచాలని బ్యాంకుల్ని ఆదేశిం చింది. భారీగా కొత్త నోట్లను సమకూర్చుకున్న వారిని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ విచారణకు సహకరిస్తుందని పేర్కొంది. ‘నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకూ బ్యాంకులు, కరెన్సీ చెస్టుల కార్యకలాపాల రికార్డింగ్ల్ని భద్రపరచాలి’ అని పేర్కొంది. కర్ణాటకలో ఆర్బీఐ అధికారి అరెస్టు సాక్షి, బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత రూ.1.51 కోట్ల విలువైన పాత నోట్లను అక్రమంగా మార్చడానికి సాయపడ్డాడనే ఆరోపణలపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అధికారి అరెస్టయ్యాడు. కర్ణాటకలోని కొళ్లెగాళ పట్టణంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు(ఎస్బీఎం) శాఖలో ఆర్బీఐ తరఫున విధులు నిర్వర్తిస్తున్న కె.మైకేల్ అనే అధికారిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. ఇతనితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రూ.17 లక్షల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకుంది. -
నేటి నుంచి కార్డుదారులకు అప్పుపై సరుకులు
–జేసీ హరికిరణ్ కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబరు నెల సరుకులను శనివారం నుంచి కార్డుదారులకు అప్పు ప్రాతిపదిక పంపిణీ చేయనున్నట్లుగా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులతోను శుక్రవారం.. జేసీ సమీక్ష నిర్వహించారు. నగదు కొరత ఉన్నందును కార్డుదారులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. అప్పుపై అన్ని రకాల సరుకుల పంపిణీ తక్షణం అమలులోకి వస్తుందన్నారు. ఇంతవరకు సరుకలు తీసుకోని కార్డుదారులందరూ నేటి నుంచి నగదు చెల్లించకుండానే సరుకులు పొందవచ్చని తెలిపారు. డీలర్లు కూడ ఎట్టి పరిస్థితుల్లోను కార్డుదారులను నగదు అడుగరాదని ఆదేశించారు. జిల్లాలో 10.75లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉండగా శుక్రవారం నాటికి దాదాపు 40శాతం పంపిణీ పూర్తి అయింది. మిగిలిన 60శాతం కార్డుదారులు అప్పుపై సరుకులు పొందాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, నందికోట్కూరు స్టాక్ పాయింట్ల పరిధిలో ఈ నెలలోనే త్వరలో అదనపు సరుకులు కందిపప్పు పెసరపప్పు, వేరుశనగ విత్తనాలు కిలో ప్యాకెట్లు మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు ఇస్తున్నామన్నారు. వీటిని కూడ అప్పుపై తీసుకోవచ్చని సూచించారు. అయితే జనవరి నెల సరకులు తీసుకునే సమయంలో ఈ బకాయిని చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. కార్డుదారుల నుంచి డబ్బులు తీసుకోకపోతే వచ్చే నెల డీడీలు కట్టడం కష్టం అవుతుందని డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలపగా.. ఇందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని జేసీ చెప్పారు.కార్యక్రమంలో డీఎస్ఓ తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ మోదిదే
-
పరిశ్రమల స్థాపనకు క్రెడిట్ ఫెసిలిటేషన్ సమావేశం
కాకినాడ కలెక్టరేట్ (కాకినాడ రూరల్) : కొత్తగా పరిశ్రమలు స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకు రుణాలు మంజూరుకు క్రెడిట్ ఫెసిలిటేషన్ సమావేశం ఈ నెల 21, 22 తేదీల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో బుధవారం సాయంత్రం జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో సింగిల్విండో ఆమోదంలో పెండింగ్ సమస్యలు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను ఆయన సమీక్షించారు. ఆరు ఎస్సీ, ఎస్టీ కేసులకు వాహనాల రుణాల రాయితీలను ఆమోదించారు. మూడు సాధారణ పరిశ్రమలకు సబ్సిడీలు మంజూరు చేశారు. పరిశ్రమల శాఖ డీడీ డేవిడ్ సుందర్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన పరిశ్రమల్లో 243 యూనిట్లు గ్రౌండ్ చేశామన్నారు. ఏడు పరిశ్రమలు భూ కేటాయింపులు దరఖాస్తు చేయగా వాటిని పరిశీలించి త్వరగా మంజూరు ఇవ్వాలని కలెక్టర్ అరుణ్కుమార్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎస్వీ పటేల్, డీడీ సిహెచ్ గణపతి, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్బోర్డు, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
క్రెడిట్, డెబిట్ కార్డు సర్చార్జీలపై వైఖరేంటి?
న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై విధిస్తున్న సర్చార్జీలపై వస్తున్న ఫిర్యాదులపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. సక్రమంగాలేని సర్చార్జీల విషయంలో నిర్ణీత గడువులోగా తమ వైఖరేంటో చెప్పాలని కేంద్ర ఆర్థిక శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)లను ఆదేశించింది. నగదు చెల్లింపుల్లో ఎలాంటి పన్ను లేదని, కార్డుల ద్వారా లావాదేవీలపై మాత్రం 2.5 శాతం, అంతకుమించి సర్చార్జీలు విధిస్తున్నారని పిటిషన్ వేసిన న్యాయవాది అమిత్ సాహ్ని తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
టేకులపల్లి : అప్పుల బాధ తాళలేక ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోయగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకన్న(55) హమాలీ పనులు చేసుకుంటూ.. తనకున్న రెండెకరాల పొలం, ఎకరం చేనులో పంటలు సాగు చేస్తున్నాడు. పంటలపై పెట్టుబడి కోసం రూ.3లక్షల వరకు అప్పు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడి పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే చెట్టుకు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా.. చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఎస్సై తాటిపాముల సురేష్, ఏఎస్సై అజీజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సర్పంచ్ పూనెం సురేందర్, సొసైటీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్రాజు సందర్శించారు. -
కేఎల్ఐ ప్రాజెక్టు వైఎస్ పుణ్యమే
కొల్లాపూర్రూరల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి అన్నారు. బుధవారం ఎల్లూరు శివారులోని పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్త డిజైన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఎతిపోతల కొత్త రీడిజైన్ ద్వారా కేఎల్ఐ ప్రాజెక్టు కింద 90వేల ఎకరాల ఆయకట్టును రైతులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేఎల్ఐ ప్రాజెక్టు సమీపంలో పాలమూరు రీడిజైన్ ప్రాజెక్టు పనులు చేపట్టడం విడ్డూరమన్నారు. దీనివల్ల కేఎల్ఐకి పూర్తిగా ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ సందర్భంగా పాలమూరు ప్రాజెక్టు రీడిజైన్ వివరాలను డీఈ ప్రవీణ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే అగ్రిమెంట్ పనులు జరుగుతున్నాయని, కొత్తగా ఎలాంటి పనులు చేయడం లేదని డీఈ వివరించారు. కొల్లాపూర్ రైతులను ముంచేందుకే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కేఎల్ఐ ఆయకట్టుకు ఎలాంటి ముప్పువాటిల్లినా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రంగినేని జగదీశ్వరుడు, నాగరాజు, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు జంబులయ్య, సురేందర్సింగ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పస్పుల కష్ణ, ప్రధాన కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
పది శాతం పని.. 90 శాతం గొప్పలు :జీవన్ రెడ్డి
సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి జగిత్యాల అగ్రికల్చర్: కేసీఆర్ ప్రభుత్వం పది శాతం పనులు చేసి.. 90 శాతం గొప్పలు చెప్పుకుంటోందని సీఎల్పీ ఉపనేత టి. జీవన్రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ రైతులు, రైతుకూలీలను విస్మరిస్తోందని ఆరోపించారు. రుణమాఫీకి ఇంకా నిధులు విడుదల చేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ అందించలేదని, కరువు మండలాల గుర్తింపులో అలసత్వం ప్రదర్శించి రైతులకేదో మేలు చేసినట్లు మాట్లాడుతోందన్నారు. వారంలో మూడు రోజులు తన వ్యవసాయక్షేత్రాన్నే చూసుకుంటున్న ముఖ్యమంత్రి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల గురించి ఒక్కసారైనా ఆలోచిస్తే బావుంటుందని హితవుపలికారు. పంటల బీమా పథకం గడువు ఈనెల 14 వరకే ఉన్నా.. బ్యాంకర్లు ఇప్పటివరకు రుణ పంపిణీ ప్రారంభించలేదని తెలిపారు. గడువు లోపు ప్రీమియం చెల్లిస్తేనే పంట నష్టపోయిన రైతుకు మేలు జరుగుతుందన్నారు. రెండేళ్లుగా విత్తనోత్పత్తి అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం.. ఇంకా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి విత్తనాలను దిగుమతి చేసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జిల్లాలోని కరువు మండలాల్లో 53,965 హెక్టార్లలో పంటనష్టం జరిగితే రూ.36.92 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా ఇతర పనులకు ఖర్చు పెట్టడం శోచనీయమన్నారు. -
విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త!
విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త! ఇకపై తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లను విదేశాల నుంచే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కొత్తగా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) కల్పిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నారైలు, విదేశీయులు భారత్ పర్యటనకు వచ్చేముందు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం కోసం ఇండియాలోని తమ బంధువులు, టూర్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఐఆర్ సీటీసీ ఈ పరిస్థితిలో మార్పులు చేర్సులు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం వెబ్ సైట్ లో అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం కల్పించింది. విదేశీ ప్రయాణీకులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా చూడటమే లక్ష్యంగా కొత్త టికెట్ బుకింగ్ వ్యవస్థను భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ కొత్త పద్ధతిలో విదేశీయులు, ఎన్నారైలు తమకు ఫారిన్ బ్యాంకులు అందించిన క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. 'ప్యాలెస్ ఆన్ వీల్స్' , 'మహరాజా' వంటి లగ్జరీ ట్రైన్లు, విదేశీయుల పర్యటనలకు అనువుగా ఉండే ఇతర టూరిస్ట్ స్పెషల్ ట్రైన్లతోపాటు, సాధారణ సర్వీసుల్లో కూడ ఈ కొత్త అవకాశం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటువంటి అంతర్జాతీయ లావాదేవీలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ప్రత్యేక అవకాశం కల్పించడం ఇది రెండోసారి. క్రెడిట్ కార్డుల దుర్వినియోగాన్ని గమనించిన ఐఆర్ సీటీసీ మొదటిసారి ఇచ్చిన అవకాశాన్ని అప్పట్లో రద్దు చేసింది. ప్రస్తుతం హ్యాకింగ్ వంటి సమస్యలు ఎదురు కాకుండా వెబ్ సైట్ లో భద్రతను మరింత పటిష్ఠ పరచి ముందుగానే అన్నిరకాల పరిశీలనలు పూర్తయిన తర్వాతే టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. నిమిషానికి 15,000 బుకింగ్స్ ను చేసే ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ... సెకనుకు 250 టికెట్లను వినియోగదారులకు అందిస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు 58 శాతం టికెట్లు ఆన్ లైన్ లోనే అమ్మకాలు జరుగుతుండటం విశేషం. కాగా ప్రస్తుతం ఐఆర్ సీటీసీ అందిస్తున్న కొత్త సదుపాయం ఏప్రిల్ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. -
నగదు వద్దు... కార్డే ముద్దు
ఏటీఎంలు మొదలుకొని విక్రయ కేంద్రాల వరకు ఎక్కడ చూసినా దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డుల హవా నడుస్తోంది. 2014లో కార్డుల వినియోగం 25శాతం పెరిగిందని వరల్డ్లైన్ నిర్వహించిన ‘ఇండియా కార్డ్ పేమెంట్ రిపోర్ట్’లో తేలింది. క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం రూ.1,90,000 కోట్లు డెబిట్ కార్డుల ద్వారా వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం రూ.1,21,300 కోట్లు గత ఏడాది క్రెడిట్ కార్డుల్లో వృద్ధి 9.8 శాతం డెబిట్ కార్డుల్లో వృద్ధి 40 శాతం మొబైల్ వాలెట్, ప్రీపెయిట్ క్యాష్ కార్డుల్లో వృద్ధి 3 శాతం క్రెడిట్ కార్డు మీద సగటున ఖర్చు రూ.3,089 డెబిట్ కార్డు మీద సగటున ఖర్చు రూ.1,502 -
సీసీఎస్కు రూ.85 కోట్లను జమ చేసిన ఆర్టీసీ
ఆర్టీసీ కార్మికుల క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ నుంచి సొంత అవసరాలకు వాడుకున్న రూ.85 కోట్లను యాజమాన్యం తిరిగి సొసైటీకి జమ చేసింది. ఈ మొత్తం అందుబాటులో లేకపోవడంతో రుణాలందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనాన్ని ‘సాక్షి’ ఇటీవల వెలుగులోకి తేవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.85 కోట్లను యాజమాన్యం మంగళవారం సీసీఎస్కు జమ చేసింది. -
పెరిగిన డీసీసీబీ రుణ పరపతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసి రైతులకు అండగా ఉండేందుకు ఏర్పాటైన డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) లాభాల బాటలో పయనిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం వివిధ రకాల సేవలను అమల్లోకి తెచ్చి రైతులకు అన్ని విధాల సహకరిస్తోంది. నాబార్డు నిధులతో, ఆప్కాబ్ సలహాలతో ఆర్థిక లావాదేవీలను రూ.420 కోట్లకు పెంచడంలో ప్రస్తుత పాలక సభ్యులు విజయం సాధించారు. భవిష్యత్తులో డీసీసీబీని మరింత లాభాల బాటలోకి నడిపిస్తామని, రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని ఆ బ్యాంకు చైర్మన్ డోల జగన్ అన్నారు. ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. లాభాల్లో పీఏసీఎస్లు రైతులకు లాభాలు చేకూర్చడమే థ్యేయంగా పనిచేస్తున్నాం. గత బోర్డు రూ.270 కోట్ల లావాదేవీలకే పరిమితమైపోతే మేం దాన్ని రూ.420 కోట్లకు పెంచాం. ఇంకా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. 49 సహకార సంఘాల్లో 34 సంఘాలు ఇప్పటికే లాభాల బాట పట్టాయి. రూ.110 కోట్ల స్వల్పకాలిక రుణాలిచ్చాం. వీటి ద్వారా ప్రతి సంఘానికి ఒక శాతం లాభం వస్తుంది. నాబార్డు సూచనలతో పీఏసీఎస్లను బలోపేతం చేసేందుకు బోర్డు సభ్యులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. సభ్యులు రూ.15 చెల్లిస్తే ఏడాదికి రూ. ఒక లక్ష వరకూ బీమా పొందే ందుకు అవకాశం కల్పించాం. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్ల ద్వారా ఆ సొమ్ముకు బాధ్యత విహ ంచేలా చూస్తున్నాం. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మల్టీ సర్వీస్ సెంటర్లతో ఫలితాలు డీసీసీబీ ద్వారా ప్రవేశపెట్టిన మల్టీ సర్వీస్ సెంటర్లు సత్ఫలితాలనిస్తున్నాయి. తొలుత కొత్తూరు ప్రాంతంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో దీన్ని ప్రారంభించాం. అక్కడ పది దుకాణాలు ఏర్పాటు చేశాం. దీనివల్ల ఆయా సొసైటీలకు నెలకు రూ. లక్ష ఆదాయం వచ్చే అవకాశం కలిగింది. త్వరలో సంతకవిటి, బుడితి, భామిని, లోలుగు, కొత్తూరు, ఇచ్చాపురం ప్రాంతాల్లో మల్టీ సర్వీస్ సెంటర్లు తెరుస్తాం. పంట రుణాలు విరివిగా అందజేయడం సంస్థకు భారమే అయినప్పటికీ రైతుల కోసం ఆ మాత్రం చేయక తప్పదు. దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ పనిముట్లు అందజేయడం వల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తులో రుణమేళాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తాం. గతంలో అలా..ఇప్పుడిలా.. డీసీసీబీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రూ.120 కోట్ల స్వల్పకాలిక రుణాలు, రూ.7 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రూ.9 కోట్ల రుణాలు, ఇతర రుణాలు రూ.1.5 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో రూ.32కోట్ల డిపాజిట్లు సేకరించాం. ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకులు 9.35 శాతం వరకే వడ్డీ ఇస్తుంటే మేం 9.75 శాతం ఇస్తున్నాం. మా వద్ద 1.30 లక్షల మంది రైతులకు ఖాతాలున్నాయి. నరసన్నపేటలో ఏప్రిల్ మొదటి వారంలో మరో బ్రాంచి తెరుస్తున్నాం. మొత్తం 49 సొసైటీల్లో 26 సొసైటీలకు సొంత భవనాలున్నాయి. మిగతా వాటికి సమకూర్చే ప్రయత్నాల్లో ఉన్నాం. రుణమాఫీకి సంబంధించి తొలివిడతలో రూ.79.55 లక్షలకు అప్లోడ్ చేశాం. రెండోదశకు సంబంధించి రూ.101 కోట్లకు ప్రభుత్వానికి నివేదించాం. గత బోర్డు ఆధ్వర్యంలో 9వేల మెట్రిక్ టన్నుల ఎరువుల వ్యాపారం చేస్తే ఇప్పుడు 19,045 టన్నుల వ్యాపారం చే శాం. గతంలో 2710 టన్నుల విత్తనాలు విక్రయిస్తే ఇప్పుడు 3795 టన్నులు విక్రయించాం. గతంలో 16,100 టన్నుల ధాన్యం సేకరించగా ఇప్పుడు 1,83,390 టన్నులు సేకరించాం. పెరుగుతున్న లాభాలు 2013లో సంస్థ రూ. 2.35 కోట్ల లాభాలు ఆర్జించగా 2014లో రూ.2.43 కోట్లకు చేరింది. ప్రస్తుతం అవి రూ.2.5 కోట్లకు పెరిగాయి. గతంలో మూడు సొసైటీలే లాభాల్లో ఉండగా ఇప్పుడు 34 సంఘాలు లాభాల్లో ఉన్నాయి. అప్పట్లో డీసీసీబీకి జిల్లాలో 13 బ్రాంచీలుంటే ఇప్పుడు 15కు పెరిగాయి. సంస్థకు చెందిన రూ.30 కోట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రైతులిచ్చిన ఆ సొమ్ముకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేకపోయినా మేం వడ్డీ కడుతున్నాం. ఆ సొమ్ము కోసం ఆప్కాబ్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. -
కార్డులన్నీ స్వైప్లో!
ఒకట్రెండు బ్యాంకుల క్రెడిట్, డెబిట్కార్డులు, ప్యాన్, ఆధార్ కార్డులు.. ఇంకొన్ని ఇతర కార్డులు - చాలామంది జేబుల్లో, పర్సుల్లో సాధారణంగా కనిపించేవే. ఇన్ని కార్డులు మోతబరువు అనుకున్నారో ఏమో... ఓ కంపెనీ స్వైప్ పేరుతో ఓ వినూత్నమైన కార్డును అందుబాటులోకి తెచ్చింది. అన్నికార్డుల సమాచారం ఈ ఒక్కదాంట్లోనే నిక్షిప్తం చేసుకోవడంతోపాటు ఎప్పుడు ఏ కార్డు వాడాలో మీరే నిర్ణయించుకునే సౌకర్యం ఉండటం ఈ హైటెక్ కార్డు ప్రత్యేకత. వివిధ కార్డుల సమాచారాన్ని అప్లోడ్ చేసేందుకు ఒక్కోదాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్వైప్తోపాటు ప్రత్యేకమైన రీడర్ను కూడా ఇస్తారు. స్కాన్ చేసిన ప్రతి కార్డు వివరం స్వైప్లో నిక్షిప్తమైన తరువాత పైన ఉన్న స్క్రాల్ బటన్ ద్వారా మీరు ఏ కార్డు వాడాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కో స్వైప్ కార్డులో దాదాపు 25 కార్డుల సమాచారం నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ తరహాకార్డుల్లో ఇదే అత్యధికం. -
ఇంటి రుణం.. ఇలా సులభం
ఇల్లు కొనుక్కోవడమనేది చాలా కీలకమైన నిర్ణయం. ఇందులో బోలెడన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ఎలాంటిది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి మొదలుకుని డౌన్పేమెంట్లు, రుణం సమకూర్చుకోవడం దాకా అనేక విషయాల గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది గృహ రుణం పొందడం. ఇతరత్రా అన్నీ సిద్ధం చేసుకుని.. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాక.. చివరికి చేతికొచ్చే దాకా సస్పెన్సే. ఎక్కడ కొర్రీ పడుతుందోనని వర్రీనే. ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదంటే ఇంటి గురించి అనుకున్నాక.. ఒక అయిదారు నెలల ముందు నుంచే గృహ రుణం సమకూర్చుకోవడం కోసం సన్నాహాలు చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని సూత్రాలు పాటించాలి.. క్రెడిట్ నివేదిక... ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేసే ముందు క్రెడిట్ హిస్టరీ.. అంటే గతంలో తీసుకున్న రుణాలు, వాటిని తిరిగి చెల్లించిన తీరు గురించి చూస్తున్నాయి. గతంలో దేనికైనా బకాయిపడినా, ఎగ్గొట్టినా, లేటుగా చెల్లించినా అందుకు సంబంధించిన వివరాలన్నీ సిబిల్ వంటి సంస్థల దగ్గర ఉంటాయి. అవి ఇచ్చిన నివేదికలు, స్కోరును బట్టి లోన్ ఇవ్వొచ్చా లేదా అన్నది బ్యాంకులు నిర్ణయం తీసుకుంటున్నాయి. కాబట్టి, బాకీలు లాంటివేమైనా ఉంటే తీర్చి.. క్రెడిట్ రిపోర్టు, స్కోరు సరిగ్గా ఉండేలా చూసుకోవడం మంచిది. క్రెడిట్ హిస్టరీ స్వయంగా తెలుసుకోవాలంటే ఆన్లైన్లో కూడా సిబిల్ నివేదికను తీసుకోవచ్చు. ఇందుకు రూ. 470 కట్టాల్సి ఉంటుంది. అలాగే, ఇతరత్రా ఈఎంఐలు ఏమైనా ఇప్పటికే కడుతున్న పక్షంలో ముందుగా వాటిని పూర్తి చేసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే.. మనకి ఎంత రుణం ఇవ్వాలనేది మనం ఎంత ఈఎంఐల భారం మోస్తున్నామన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర ఈఎంఐలు ఎక్కువైన కొద్దీ మంజూరయ్యే రుణం పరిమాణం తగ్గిపోతుంది. సాధారణంగా జీతంలో ఈఎంఐల భారం 40 శాతం మించకూడదు. బ్యాంకులు ఈ అంశాన్ని కూడా పరిగణించి రుణ మొత్తంపై నిర్ణయం తీసుకుంటాయి. బ్యాంకింగ్ అలవాట్లు మెరుగుపర్చుకోవాలి.. లోన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇతర పత్రాలతో పాటు మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా గడిచిన ఆరు నెలలు లేదా ఏడాది కాలానికి సంబంధించిన స్టేట్మెంట్ను బ్యాంకులు అడుగుతుంటాయి.మన బ్యాంకింగ్ అలవాట్లు, ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉంచుతున్నారు మొదలైన వాటి గురించి ఈ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఉద్యోగ స్థిరత్వం.. ఉద్యోగంలో స్థిరంగా కొనసాగుతుండటం కూడా రుణ మంజూరీలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థిరం గా ఉద్యోగం చేస్తున్నారా లేక తరచూ మారిపోతున్నారా.. అలాగే కొన్నాళ్లపాటైనా ఒకే ఇంటిలో ఉంటున్నారా లేక అది కూడా మారిపోతున్నారా.. ఇలాంటివి సైతం బ్యాంకర్లు పరిశీ లిస్తారు. ఒకవేళ అలాంటేదేమైనా ఉంటే.. లోన్ విషయంలో పునరాలోచించే అవకాశం ఉంటుంది. ఇక, బ్యాంకుకు ఇవ్వాల్సిన పత్రాల విషయానికొస్తే.. సాధారణంగా వేతన జీవులైతే దరఖాస్తుతో పాటు గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, తాజా పే స్లిప్, ఫారం 16, ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అధ్యయనం చేయండి .. సాధారణంగా ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ రేటు వసూలు చేస్తుంటుంది. కనుక ఏ బ్యాంకు ఎంత వడ్డీపై ఇస్తోంది, ప్రత్యేక ఆఫర్లేమైనా ఉన్నాయా వంటి వాటిపై కాస్త అధ్యయనం చేయాలి. అప్పుడే మెరుగైన డీల్ దక్కించుకోవచ్చు. అలాగే, రుణం మంజూరు ప్రక్రియ ఎలా ఉంటుందో బ్యాంకులో తెలుసుకోవాలి. ప్రీ-అప్రూవ్డ్కి ప్రయత్నించండి.. ఇంకా ఏ ప్రాపర్టీ కొనాలన్నదీ ఇదమిత్థంగా నిర్ణయం తీసుకోకపోయినా... ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇచ్చే వివరాలను బట్టి మీకు మంజూరు చేయబోయే రుణ మొత్తానికి బ్యాంకులు ముందస్తుగానే ఆమోదముద్ర వేస్తుంటాయి. దీంతో ఎంత మొత్తం లభిస్తుందనేది ఐడియా వస్తుంది కనుక మరికాస్త ధీమాగా ఇళ్ల వేట చేయొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ను చూపించి రేటు విషయంలో బిల్డరుతో బేరమాడవచ్చు. అయితే, ప్రీ-అప్రూవ్ చేసినంత మాత్రాన అంత మొత్తాన్నీ బ్యాంకులు ఇచ్చేసే అవకాశాలూ లేవు. ఎందుకంటే.. మీరు ఎంచుకున్న ప్రాపర్టీ లేదా అది ఉన్న ప్రాంతం విషయంలో ఏవైనా సందేహాలుంటే బ్యాంకు తుది నిర్ణయం మారవచ్చు. ఇందుకే హెచ్డీఎఫ్సీ వంటి కొన్ని బ్యాంకులు తాము రుణం ఇచ్చే హౌసింగ్ ప్రాజెక్టుల వివరాలను తమ వెబ్సైట్లలో ఉంచుతున్నాయి. వాటిల్లో నుంచి నచ్చినది ఎంపిక చేసుకుంటే .. బ్యాంక్ ఎలాగూ ఆమోదించినదే కాబట్టి.. లోన్ ప్రక్రియ మరింత సులువుగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. -
క్షమించుకుందాం రా!
నేడు ప్రపంచ క్షమా దినం సరిగ్గా 2014 యేళ్ల క్రితం... రాతి కట్టడాల నడుమ రోమ్ నగరంలోని దారుల మీద అక్కడక్కడా రక్తపు చారల ఆనవాళ్లు. తమకు అతి దగ్గరగా ఉన్న ‘వ్యక్తి’ని అరాచకంగా చంపేశారని కొందరు ఏడుస్తున్నారు. ‘‘తప్పు చేశామా?’’... ఇనుప కవచాల వెనుక ఉన్న కరకు గుండెల్లో అపరాధభావం మొలకెత్తసాగింది. మూడు రోజులుగా నగరంలో ఈ పెనుగులాట జరుగుతుండగా... ఊహకందని విధంగా చావుని చీల్చుకుని వారి మధ్యకు వచ్చాడు ఆ వ్యక్తి ‘క్షమించడానికి’! ఆ ఒక్క క్షమాపణ... ఆ వ్యక్తిని దేవుణ్ని చేసింది. ఆ ఒక్క క్షమాపణ... ఒక కొత్త శకానికి నాంది పలికింది. మనం చేసిన పనిని తనదని చెప్పి క్రెడిట్ కొట్టేసే పై ఆఫీసర్ ఇంకా పెకైదుగుతాడు. అర్ధ రూపాయికే ఆకాశాన్ని నేలకు దింపి, అక్కడ నీకు ఇల్లిప్పిస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిన నాయకుడు... తీరా ఎన్నికలయ్యాక వెండికంచంలో బంగారాన్ని భోంచేస్తూ మొండి చేయి చూపిస్తాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, నువ్విచ్చిన కాస్ట్లీ గిఫ్టును చక్కగా తీసుకుని, మర్నాడు సెంటీమీటరు మందమున్న పెళ్లికార్డును చేతిలో పెట్టి... ‘మా ఇంట్లో నాకు తెలీకుండా పెళ్లి కుదిర్చేశారు, చేసుకోకపోతే చచ్చిపోతామంటున్నారు, అందుకే చేసుకోక తప్పడం లేదు’ అని చెప్పేసి చేతులు దులుపుకుంటారు. వీరందరి మీద పగ.. కోపం.. ఉద్రేకం. దాచుకోవడమెందు? పగ తీర్చేసుకోండి. మనసు అనే గన్ తీసుకుని, క్షమాపణ అనే బుల్లెట్ని వారి గుండెల్లోకి దింపండి. బిక్కచచ్చిపోతారు దెబ్బకి. మీరు చూపించే దయకి, ఒక్కసారిగా వణుకు పుడుతుంది వారికి. ‘వాడిని క్షమించు. అంతకు మించిన శిక్ష ప్రపంచంలో మరేదీ లేదు’ అంటాడు ఆస్కార్ వైల్డ్. నిజమే. క్షణికావేశంలో నీ కోపం బయటపడితే, క్షమాపణ నీ క్యారెక్టర్ని బయటకు తెస్తుంది. క్షమాపణ ఓ మందులాంటిది. అది అవతలివాడిలోని అపరాధభావంతో కలిసి ఒక కెమికల్ రియాక్షన్ జరిగినట్టు వాడిలోని క్రూరత్వాన్ని నశింపజేసి, మంచితనాన్ని బయటకు తెస్తుంది. ఉదాహరణల కోసం వెతక్కండి. మీరే ఉదాహరణగా నిలవండి. మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, అష్టకష్టాలు పెట్టినా క్షమించి చూడండి. కృష్ణుణ్ని కర్ణుడు క్షమించినట్టు, బిడ్డని తండ్రి క్షమించినట్టు, ప్రకృతి మనుషుల్ని క్షమించినట్టు, మీకు చేయిచ్చిన వారందరినీ చెయ్యెత్తి క్షమించండి... చెంపదెబ్బ కన్నా గట్టిగా తగులుతుంది. మిమ్మల్ని వద్దనుకున్నవారిని కూడా మీకు మరింత దగ్గర చేస్తుంది! - జాయ్ -
మీ క్రెడిట్ స్కోరెంత?
ఈ రోజుల్లో అప్పు చేయనిదెవరు చెప్పండి? గృహ రుణం, వ్యక్తిగత రుణం, విద్యా రుణం, వాహన రుణం... ఇలా ఏ లోన్ తీసుకోవాలన్నా ప్రస్తుతం క్రెడిట్ స్కోరే కీలకం. ఈ స్కోరు బాగుంటేనే బ్యాంకులు రుణాలిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోరు ప్రాధాన్యమేంటి? దాన్ని మెరుగుపర్చుకునే మార్గమేంటి? అనే అంశాలపై రేటింగ్ సంస్థ ‘క్రెడిట్ సుధార్’ సహ వ్యవస్థాపకుడు గౌరవ్ వాధ్వానీ ఏమంటున్నారో చూద్దాం... మెట్రోలు కావొచ్చు.. ఇతర నగరాలు కావొచ్చు.. సొంతిల్లు కావాలని కోరుకునే మధ్యతరగతి వర్గాల సంఖ్య పెరుగుతోంది. దీంతో గృహ రుణాలు తీసుకోవడం తప్పనిసరిగా మారుతోంది. సాధారణంగానే ఇందుకు సంబంధించి చాలా లెక్కలేస్తాం. వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? రుణమెంత వస్తుంది? ఎంత దాకా కట్టాలి? ఇవన్నీ ఆలోచిస్తాం. ఇంత కసరత్తు చేసి వెళితే.. కొన్నిసార్లు బ్యాంకులు రుణం దరఖాస్తును తిరస్కరిస్తుం టాయి. అప్పుడేం చేయాలి? ప్రణాళికలు తలకిందులు కావాల్సిందేనా? అసలింతకీ దరఖాస్తునెందుకు తిరస్కరిస్తారని చూస్తే... ప్రధాన కారణం క్రెడిట్ స్కోరే. లోన్ తీసుకోవాలనుకునేవారు.. గతంలో రుణాలు తీసుకునే విషయంలోను, చెల్లించే విషయంలోనూ ఎలా వ్యవహరించారన్న చరిత్రను చెప్పేదే క్రెడిట్ స్కోరు. సిబిల్, ఈక్విఫ్యాక్స్ వంటి క్రెడిట్ బ్యూరోల వద్ద ఈ వివరాలుంటాయి. మనకు గతంలో రుణాలు, క్రెడిట్ కార్డులు లాంటివి ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెట్ కలెక్షన్ ఏజన్సీలు ఆ వివరాలన్నీ కూడా ఈ బ్యూరోలకు చేరవేస్తాయి. ఈ సమాచారాన్ని మదించి సదరు బ్యూరోలు మన క్రెడిట్ స్కోరును నిర్ధారిస్తాయి. మనం తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవాలనుకుంటే.. ఆయా బ్యాంకులు సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోల నుంచి మన క్రెడిట్ స్కోరు తీసుకుంటాయి. మనకు రుణం ఇవ్వడం సురక్షితమేనా కాదా అన్నది అంచనా వేసుకుంటాయి. కాబట్టి ప్రస్తుతం రుణం పొందాలంటే మన క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంచుకోక తప్పదు. అలా చేయాలంటే బకాయిదారుల జాబితాలో మీ పేరు లేకుండా చూసుకోవడం ముఖ్యం. అలాగే, అవసరానికి మించి.. ఒకేమారు బోలెడ న్ని రుణాలు, బోలెడన్ని క్రెడిట్ కార్డులు తీసుకోవడం కూడా మంచిది కాదు. మీరెప్పుడూ రుణాల్లోనే ఉంటారన్న భావన కలిగినా మీ క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒకవేళ ఇప్పటికే ఈ పొరపాటు జరిగి ఉంటే ... సరిదిద్దుకునే అవకాశాలూ, స్కోరును మెరుగుపర్చుకునేందుకు కూడా అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన సర్వీసులు అందించేందుకు ప్రస్తుతం ప్రత్యేకంగా సంస్థలున్నాయి. సాధారణంగా 700-900 పాయింట్ల దాకా స్కోరు తెచ్చుకోగలిగిన పక్షంలో రుణాలు పొందడానికి సులువవుతుంది. స్కోరు మెరుగ్గా ఉంటే.. బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలిస్తాయి కూడా. - గౌరవ్ వాధ్వానీ -
వర్గాల ప్రభ
అవకాశమేదైనా అందులో తమ ‘పట్టు’ ఎంతో చూపాలన్నది జిల్లా కాంగ్రెస్ పెద్దల తపన. ఇందుకు వర్గాల కుంపట్లను ఆనవాయితీగా రాజేస్తూ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటుంటారు. తాజాగా ‘తెలంగాణ’ క్రెడిట్ ముసుగులో ‘కృతజ్ఞతా సభల’కు ఉపక్రమిస్తున్నారు. ఈ వేదికగా ఎవరి బలం ఎంతో ప్రదర్శించాలన్నది ఎత్తుగడ. ఇందుకు అనుగుణంగా తమవారిని కదిలిస్తూ పావులు జరుపుతున్నారు. ఎన్నికల వేళ ఎవరి సత్తా ఏమిటో అధిష్టానానికి తెలిపేందుకు సిద్దపడుతున్నారు. మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్ర సాధన క్రెడిట్ దక్కించుకోవడంతో పాటు, సొంత పార్టీలోని ఎదుటి వర్గంపై పైచేయి సాధించడం లక్ష్యంగా కాంగ్రెస్ జిల్లా నేతలు పావులు కదుపుతున్నారు. పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ఓ వర్గం జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి హడావుడి చేసింది. ఎదుటి వర్గం ఎత్తులను పసిగట్టిన మరోవర్గం ‘కృతజ్ఞత సభ’ల పేరిట పై ఎత్తులు వేస్తుండటంతో కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. -
'తెలంగాణ ఏర్పాటులో మైనార్టీల పాత్ర కూడా ఉంది'
-
చిన్నమ్మ కోరిక
-
విజయోత్సాహం..
సాక్షిప్రతినిధి, నల్లగొండ: అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ర్ట్ర ఏర్పాటుకు కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధమై, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో నిజంగానే జిల్లాలో ఉద్యమంతో మమేకమైన నాయకులు ఎవరన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కేబినెట్ సమావేశానంతరం హోంమంత్రి షిండే ప్రకటన చేశాక జిల్లా వ్యా ప్తంగా సంబరాలు జరిగాయి. ఎవరికి వారు తాము చేసిన రాజీనామాల వల్లే ఏర్పడిందని ప్రకటనలు కూడా ఇచ్చారు. వాస్తవానికి జిల్లా కాంగ్రెస్లో పలువురు ఎమ్మెల్యేలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. మరికొం దరు సీఎం కిరణ్కుమార్ రెడ్డితో అంటకాగారు. సీఎం కిరణ్ పూర్తిస్థాయిలో సమైక్యవాదాన్ని బాహాటంగా వినిపిస్తున్నారని తెలిసీ ఆయనతో తమ నియోజకవర్గాల్లో పర్యటనలు ఏర్పాటు చేశారన్న అంశాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇక, అధికారిక పదవుల్లేని నేతలు సైతం కొందరు సీఎం వర్గంగా పిలిపించుకునేందుకు తెగ తాపత్రయపడ్డారు. జిల్లా కాంగ్రెస్లో జరిగిన పరి ణామాలతో తెలంగాణ ఉద్యమ సమయంలో విభిన్న దృశ్యమే ఆవిష్కతమైంది. అటు జేఏసీ, ఇటు తెలంగాణవాద పార్టీలు చేపట్టిన ఆందోళనల్లో పూర్తిస్థాయిలో పాల్గొన్న నేతలు, అంటీముట్టనట్టు వ్యవహరించిన నేతల తీరును విశ్లేషిస్తే.. అసలు కాంగ్రెస్లో క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనే అంశం ఇట్టే అర్థమవుతుందంటున్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతల్లో.. పూర్తిస్థాయిలో మమేకమైన నేతగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డికే ఎక్కువ క్రెడిట్ దక్కుతోందంటున్నారు. 2009 డిసెంబరు 9 ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకున్నాక తెలంగాణ వ్యాప్తంగా మొన్న మొన్నటి దాకా ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో సాగిన ఉద్యమంలో జిల్లాకు ముఖ్యమైన స్థానమే ఉంది. మలి ఉద్యమంలో తొలి అమరుడిగా గుర్తింపు ఉన్న శ్రీకాంతాచారి ఆత్మబలిదానం తర్వాత మరి కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని అధిష్టానానికి గడువు పెట్టి, ఆతర్వాత తన మంత్రి పదవికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాజీనామా చేశారు. అయితే, సొంత పార్టీలో కొనసాగుతూనే తెలంగాణవాదాన్ని బలంగా వినిపించి తెలంగాణ వ్యాప్తం గా గుర్తింపు పొందారు. చివరకు జిల్లా కేంద్రం లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ తర్వాత కూడా తెలంగాణ కోసం జరిగిన ప్రతీ ఉద్యమంలో ముందుండి నడిచారు. ఎంపీలు.. జిల్లాకు చెందిన ఎంపీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ముందు నుంచీ తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు. తమ అధినేత్రి సోనియాగాంధీపై విశ్వాసం ఉందని చెబుతూనే అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేశారు. ‘దేశ పార్లమెంటు చరిత్రలో అధికార పార్టీకి చెందిన ఎంపీలమై ఉండి సస్పెండ్ అయ్యాం. కేవలం తెలంగాణ సాధన కోసమే అధిష్టానంపై కొట్లాడాం. చివరకు కల నెరవేరుతోంది. తెలంగాణ ప్రజల ఆంకాక్షను నెరవేస్తున్న సోనియా గాంధీకి ధన్యవాదాలు..’ అని ఎంపీ రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మరో ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి సైతం తెలంగాణవాదాన్ని వినిపిస్తూనే, సీఎం కార్యక్రమాల్లోనూ వేదికలను పంచుకున్నారు. జిల్లాలో జరిగిన సీఎం పర్యటనలను కోమటిరెడ్డి సోదరులు బహిష్కరించగా, సుఖేందర్రెడ్డి మా త్రం ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. పాల్వాయి గోవర్దన్రెడ్డి సీఎంకు వ్యతిరేకంగా, సమైక్యవాదులకు వ్యతిరేకంగా మీడియా ఎదుట ప్రకటనలకే పరిమితం కాగా, క్షేత్రస్థాయి ఆందోళనల్లో పాల్గొన్నది లేదు. మంత్రులు.. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రపై భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. మంత్రి జానారెడ్డి తెలంగాణ జేఏసీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆచితూచి అడుగేసే జానా ఎన్నడూ అధినాయకత్వాన్ని కాదనే రీతిలో వ్యవహరించలేదు. మరో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి 610 జీఓ అమలు కమిటీ చైర్మన్గా, కేంద్రం నిర్వహించిన అఖిలపక్షం సమావేశాల్లో ప్రతినిధిగా పాల్గొన్నా మూడు నాలుగు నెలల కిందటి దాకా తెలంగాణ గురించి బలంగా, బహిరంగంగా వాదించింది లేదు. నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ తెలంగాణ సాధన సభ తర్వాతి నుంచే తెలంగాణ సభా వేదికలపై కనిపిస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు, సీఎంతో తన నియోజకవర్గంలో పర్యటనలు పెట్టించారన్న అసంతృప్తి తెలంగాణవాదుల్లో ఉంది. ఎమ్మెల్యేలు.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి సోదరులనే అనుసరించారు. వెంకట్రెడ్డితో పాటు రాజీనామా చేశారు. వెంకట్రెడ్డితో పాటు కలిసి వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బాలూనాయక్, భిక్షమయ్యగౌడ్లు తెలంగాణవాదాన్ని వినిపిం చినా, అధిష్టానానికి వ్యతిరేకంగా ఏ పనులూ చేయలేదు. ఇక, సీనియర్ ఎమ్మెల్యే ఆర్.దామోదర్రెడ్డి మొదట్లో వినిపించినంత బలంగా తెలంగాణవాదాన్ని వినిపించలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన తనయుడి రాజకీయ అరంగేట్రాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం దృష్టిలో పడేందుకు కావాల్సినంత సంయమనాన్ని పాటించారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి పర్యటన పెట్టించి, ఆ సభా వేదికపై కనీసం జై తెలంగాణ నినాదం కూడా చేయకుండా ఉండిపోయారంటున్నారు. -
అనుకున్నవన్నీ జరగకపోవటమూ అదృష్టమే!
మన పురాణాల్లో ఉన్న సువర్ణష్ఠీవి కథ పాశ్చాత్యదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న మిడాస్ కథ అందరికీ తెలిసిందే కదా! వారికి లభించిన అపురూపమైన సిద్ధి వారికే దుఃఖకరంగా పరిణమించింది. భస్మాసురుడి వృత్తాంతం కూడా అంతే! మనం అనుకున్నది జరిగితే సంతోషిస్తాం. అదంతా మన ఘనత అని విర్రవీగుతాం. జరగకపోతే బాధపడుతూ ఉంటాం. అదేదో దేవుడి తప్పు, ద్రోహం చేశాడని నెపం దేవుడి మీద వేస్తూ ఉంటాం. కాని ఎన్నో సందర్భాలలో ‘అలా జరగకపోవటం వలన మంచే జరిగింది’ అని కొంతకాలం పోయిన తరువాత అర్థం అవుతుంది. ఎన్నోసార్లు కోపంతోనో, అనాలోచితంగానో ఏవేవో అనుకుంటూ ఉంటాం. అవన్నీ నిజమైతే..? ఉదాహరణకి తమకి నచ్చనిది చూడవలసి వచ్చినా, వినవలసి వచ్చినా చూడలేక లేదా వినలేక చచ్చిపోతున్నాం అనటం చాలామందికి అలవాటు, అది నిజమైతే..? ప్రతివారు ఏదో ఒక సందర్భంలో ఈ బతుకు బతికే కన్నా చావటం నయం అనుకుంటారు. అటువంటప్పుడు అనుకున్నది సిద్ధిస్తే..? ‘ఎందుకు రాలేదు?’ అని అడిగితే, చాలామంది ఒంట్లో బాగుండలేదు, తలనొప్పిగా ఉంది. జ్వరం కూడా ఉన్నట్లు అనిపిస్తోంది.... ఇటువంటి వెయ్యి కారణాలుంటాయి చెప్పటానికి. వీటిలో ఏ ఒక్కటి నిజమైనా మనిషి తట్టుకోగలడా? మనిషిలో ఉన్న మనో చాంచల్యం నాలుకని అదుపులో పెట్టుకోలేకపోవటం, తెలివితక్కువతనం, దూరాలోచన లేకపోవటం, ఉద్రేకపూరిత స్వభావం మొదలైన గుణాలు తెలిసిన భగవంతుడు... మానవులు ఏది అనుకుంటే అది నిజం కాకుండా వరం ఇచ్చాడు. ఎండవేడిమికి తట్టుకోలేక అలసిపోయిన బాటసారి ఒకడు, దారిపక్కన ఉన్న చెట్టుకింద నిలబడ్డాడు. అది కల్పవృక్షమని అతడికి తెలియదు. ఆవేదనపడుతూ దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. ఇక్కడ కాసిన్ని మంచినీళ్లు దొరికితే బాగుండును... అనుకున్నాడు. దాహం తీరటంతో ఆకలి గుర్తుకు వచ్చింది. వెంటనే కావలసిన ఆహారం ప్రత్యక్షమయ్యింది. కడుపునిండి కళ్లు మూత లు పడుతున్నాయి. కాసేపు విశ్రాంతిగా పడుకుంటే బలం పుంజుకుని తరువాత ప్రయాణం తేలికగా చేయవచ్చుననుకున్నాడు. హంసతూలికా తల్పం కంటి ముందు కనపడింది. ఈ అడవిలో ఒక్కణ్ణీ ఉండే కన్నా ఎవరైనా తోడుగా ఉంటే బాగుండుననుకున్నాడు. వెంటనే అప్సరసలాగ ఉన్న సుందరి పక్కన కూర్చుని మధురంగా నవ్వుతూ పలకరించింది. అవసరాలు తీరటంతో ఆలోచన వచ్చింది. ‘నా మనసులో అనుకున్నవన్నీ ఈ అడవిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఏ దెయ్యమో నన్ను తినేయటానికి ఇదంతా చేయటం లేదు కదా’ అనుకున్నాడు. ఆలోచన రావటమేమిటి? అనుకున్నంతా క్షణాల్లో జరిగిపోయింది. అంటే సదాలోచనలు, సద్భావాలు లేనప్పుడు విచక్షణాశక్తి, మనోనిగ్రహం లోపించినప్పుడు ఇటువంటి శక్తి ఉంటే ప్రమాదకారకమే అవుతుంది. కనుక అనుకున్నవన్నీ జరగకపోవటమే మంచిది. ఈ సందర్భంలో అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి కారణం బాహ్యమైనది. అటువంటిది ఆ శక్తి మనిషికి ఉంటే..? ప్రతిక్షణం తన మనస్సులో మంచి ఆలోచనలు మాత్రమే వచ్చేటట్టు మనస్సుకి శిక్షణ ఇవ్వాలి. లేకపోతే అది అతడికే ప్రమాదకారి అవుతుంది. సద్వినియోగం చెయ్యగలిగినవారి వద్ద మాత్రమే ఏ శక్తి అయినా, ఏ సిద్ధి అయినా ఉంటే ప్రయోజనం. దాని విలువ, వినియోగం రెండూ తెలియని వారి దగ్గర ఉంటే, ప్రమాదం- ఇతరులకే కాదు తమకు కూడా. మన పురాణాల్లో ఉన్న సువర్ణష్ఠీవి కథ పాశ్చాత్యదేశాల్లో ప్రాచుర్యం ఉన్న మిడాస్ కథ అందరికీ తెలిసిందే కదా! వారికి లభించిన అపురూపమైన సిద్ధి వారికే దుఃఖకరంగా పరిణమించింది. భస్మాసురుడి వృత్తాంతం కూడా అంతే. అందుకే మనం అనుకున్నవన్నీ జరగవు. జరగకూడదు. నిజానికి అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే జీవితంలో థ్రిల్ ఉండదు. అయినా మనిషి తెలివి, సామర్థ్యం ఏ పాటివి? అందుకే అనుకున్నవన్నీ జరగకపోవటం అదృష్టం కదూ! - డా.ఎన్. అనంతలక్ష్మి -
ఆహార భద్రతతో ఆర్థిక వ్యవస్థకు చిల్లు!
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆహార భద్రత పథకం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ హెచ్చరించింది. తాజాగా ఆహార భద్రత బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పథకం భారత్ సార్వభౌమ(సావరీన్) క్రెడిట్ రేటింగ్కు ముప్పుగా పరిణమించనుందని కూడా మూడీస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఖజానాకు భారీ చిల్లుతోపాటు స్థూల ఆర్థిక పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. ఈ పథకం వల్ల ఆహార సబ్సిడీల భారం స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.2 శాతానికి ఎగబాకనున్నట్లు(ప్రస్తుతం 0.8%) లెక్కగట్టింది. భారత్కు మూడీస్ ప్రస్తుతం ‘బీఏఏ3(స్థిర అవుట్లుక్)’ రేటింగ్ కొనసాగిస్తోంది. ఆహార భద్రత చట్టం అమలుకు ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్లను వెచ్చించాల్సి వస్తుందని అంచనా. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా దూసుకెళ్లే ప్రమాదం ఉందని మూడీస్ అభిప్రాయపడింది. ద్రవ్యలోటును కట్టడి చేయడంలో విఫలమైతే రేటింగ్ కోత ఖాయమంటూ మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించడం విదితమే.