droupadi murmu
-
వీణల విందుగా...
వీణ రాగాల వెన్నెలలో పులకించిపోయిన దీప్తికి– వీణ పాఠమేప్రాణమై పోయింది. వీణ విహంగ రెక్కలపై ఆమె కొత్త ప్రపంచాలను చూసింది. ‘ఈ తరం అమ్మాయిలు కూడా వీణ నేర్చుకుంటున్నారా!’ అనేది కొందరి ఆశ్చర్యం. నేర్చుకుంటే ఎంత బాగుంటుందో దీప్తిలాంటి అమ్మాయిలు తమ విజయాల ద్వారా నిరూపిస్తున్నారు...తాను ఒకటి తలిస్తే వీణ ఒకటి తల్చింది!అవును.. మచిలీపట్నానికి చెందిన మొదలి చంద్రశేఖర్ దగ్గర గాత్రం, కీబోర్డు నేర్చుకుందామని వెళ్లిన అప్పికట్ల దీప్తి అంతలోనే మనసు మార్చుకుంది. వీణపై ఆసక్తి పెంచుకుంది. పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. సాధారణంగా చాలామందికి నేర్చుకోవడంలో ఆరంభ శూరత్వం ఉంటుంది. అయితే దీప్తి విషయంలో అలా జరగలేదు. ‘ఇంకా ఏదో నేర్చుకోవాలి’ అనే తపనతో ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పాఠాలు నేర్చుకునేది. దీప్తి ప్రస్తుతం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతోంది.‘ఇంజినీరింగ్ చదివే అమ్మాయికి వీణలెందుకు.. చదువు దెబ్బతింటుంది కదా!’ అనేది కొందరి సందేహం. ‘చదువు దెబ్బతినదు. మరింత చదువుకోవాలనిపిస్తుంది’ అంటుంది దీప్తి. ఎందుకంటే వీణరాగాల సాధనలో ఒత్తిడి తగ్గి మనసు తేలిక అవుతుంది. ఏకాగ్రత అంతకంతకూ పెరుగుతుంది. ఏది చదివినా ఇట్టే గుర్తుండి పోతుంది అంటుంది దీప్తి. నాలుగు సంవత్సరాలపాటు కర్ణాటక సంగీత సంప్రదాయ వీణ కోర్సును చదివి ఫస్ట్ క్లాస్లో సర్టిఫికెట్ను సాధించిన దీప్తి ఆ తరువాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో వీణలో డిప్లమో చేసింది.నేర్చుకోవడం ఒక ఎత్తయితే, ప్రేక్షకులు మెచ్చేలా ప్రదర్శన ఇవ్వడం మరో ఎత్తు. మొదటిసారిగా సంగీత కళాకచేరిలో మంచి మార్కులు కొట్టేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ‘యువభేరి’ లో బహుమతులు సాధించింది. ఎన్నో పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది. తెలంగాణ రాజ్భవన్ లో వీణ వాద్య కచేరి చేసి గవర్నర్ జిష్ణు దేవ్వర్మ ప్రశంసలు అందుకుంది. వీణ వాద్య ప్రతిభతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో పాటు త్రివిధ దళాధిపతుల ప్రశంసలు అందుకుంది. ‘రాష్ట్రపతి భవన్ లో వీణ ప్రదర్శన ఇవ్వడం, ప్రముఖులను దగ్గరి నుంచి చూడడం, వారి ఆశీర్వాదం అందుకోవడం మరచిపోలేని అనుభూతి’ అంటుంది దీప్తి. చదువూ, సంగీతంలోనే కాదు కరాటేలోనూ రాణిస్తున్న దీప్తి మరిన్ని కళలలో విజయాలు సాధించాలని ఆశిద్దాం. ధ్యానం లాంటి వీణవీణ అనేది కేవలం కచేరీల కోసం కాదు. నా దృష్టిలో వీణ వాద్య సాధన అనేది ఒకలాంటి ధ్యానం. వీణరాగాల వెలుగులో మనసు ఉత్తేజితం అవుతుందన్నది కాదనలేని సత్యం. – అప్పికట్ల దీప్తి – అంబటి శేషుబాబు సాక్షి, మచిలీపట్నం -
నేడు రాష్ట్రపతి భవన్లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే..
న్యూఢిల్లీ: రాష్గ్రపతి భవన్.. దేశంలోని ప్రముఖ స్మారక నిర్మాణాలలో ఒకటైన ఈ భవన్లో తొలిసారిగా ఈరోజు(బుధవారం) ఒక వివాహ వేడుక జరగనుంది. 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనం నాలుగు అంతస్తులతో 340 గదులను కలిగి ఉంది. ఢిల్లీలో ఉన్న ఈ చారిత్రాత్మక భవనం కొన్నేళ్లుగా ఉన్నత స్థాయి అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా రాష్టప్రతి భవన్ ఒక వివాహానిక వేదికగా నిలవనుంది. ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్లో ఒక జంట వివాహం చేసుకోబోతోంది. వధూవరులిద్దరూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో పనిచేస్తున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలవారు మాత్రమే హాజరుకానున్నారు. వధువు పేరు పూనమ్ గుప్తా. ఈమె సీఆర్పీఎఫ్లో వ్యక్తిగత భద్రతా అధికారిణి. వరుని పేరు అవనీష్ కుమార్. ఈయన సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్.74వ గణతంత్ర దినోత్సవ కవాతులో మహిళా బృందానికి పూనమ్ గుప్తా నాయకత్వం వహించారు. ఆమెకు కాబోయే భర్త అవనీష్ కుమార్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. పూనమ్ గుప్తా విధి నిర్వహణలో చూపిన అంకితభావాన్ని గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో వారి వివాహానికి అనుమతినిచ్చారు.సీఆర్పీఎఫ్ అధికారిణి పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్ నివాసి. గణితంలో గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. బీఈడీ కూడా పూర్తి చేశారు. 2018లో ఆమె యూపీఎస్సీ సీఆర్పీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంకు సాధించారు. బీహార్లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పూనమ్ గుప్తా ప్రశంసనీయమైన సేవలు అందించారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు -
మహాకుంభ మేళాలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము
-
కుంభమేళాకు రాష్ట్రపతి ముర్ము
-
ఢిల్లీలో ఓటేసిన ప్రముఖులు.. ఫొటోలు
-
లోక్సభలో రాహుల్పై మోదీ విమర్శలు!
ఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంలో పసలేదంటేంటూ సోనియా, అందుకు వంత పాడిన రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ లోక్సభలో పరోక్షంగా స్పందించారు. లోక్సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు మోదీ ప్రసంగిస్తూ.. కొంతమంది నేతలు పేదలతో ఫొటో సెషన్ చేస్తారు. సభలో అదే పేదల గురించి మాట్లాడితే ఆ నేతలే ఫేస్ని విసుగ్గా పెడతారంటూ..కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. నాలుగోసారి దేశ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. నాలుగో సారి దేశ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. వికసిత్ భారత్ మా లక్ష్యం.10ఏళ్లలో 25కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు. వికసిత్ భారత్ సాధనే మా లక్ష్యం. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగిస్తాం. ప్రజల కష్టాలు తెలిసిన వారికే అభివృద్ధి సాధ్యమవుతుంది. నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం. 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించాం. ఐదేళ్లలో 12 కోట్ల మందికి మంచినీటి సౌకర్యం కల్పించాం. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో మేం ఏ ఒక్క తప్పుడు హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. కొందరు శీష్మహల్ కోసం అవినీతి చేస్తారు.ఇప్పుడు నగదు బదిలీద్వారా ప్రజలకు నేరుగా నగదు అందుతుంది.మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యం. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అంటూ స్లోగన్లు మాత్రమే ఇచ్చేవి. మేం 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేంశాం. రాష్ట్ర ప్రసంగం కొంతమందికి బోర్గా అనిపించింది. బీజేపీ పాలనలో ఎలాంటి స్కాం జరగలేదు. మా హయాంలో దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాం.గతంలో స్కాంలు గురించి వినేవాళ్లం. కానీ ఇప్పుడు స్కాంలు లేవు. కేవలం అభివృద్ధి గురించి మాట్లాడుకుటుంటున్నాం. ప్రపంచ గేమింగ్ రాజధానిగా భారత్ మారుతోంది. కొన్ని పార్టీలు ఎన్నికల వేళ హామీలు ఇస్తున్నాయి. తప్పుడు హామీలు ఇచ్చి యువతను మోసం చేస్తోంది. ప్రలోభాలకు గురిచేస్తోంది. అందుకే హర్యానాలో బీజేపీని మూడోసారి గెలిపించారు. ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని తప్పకుండా నెరవేర్చుంతుంది. రాజ్యంగం అంటే బీజేపీకి ప్రాణం. రాజ్యంగం విలువలకు ప్రాధాన్యం ఇస్తుంది.కొందరు నేతలు లగ్జరీగా ఉండాలని అనుకుంటారు. ఖరీదైన షవర్లు, బాత్టబ్లు కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి పేదల గరించి ఏం తెలుస్తోంది. కొంతమందికి బంగ్లాలు కొనుగోలు చేయడంపైనే ఫోకస్ చేస్తారు. మేం ఇంటింటికి నల్లాలు ఇచ్చే దానిపై ఫోకస్ పెట్టాం’’ అని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు
పట్నా: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘పేద మహిళ’(Poor Lady) అని అభివర్ణించినందుకు బీహార్లోని ముజఫర్పూర్లో ఆమెపై పోలీసు కేసు నమోదైంది. సుధీర్ ఓజా అనే న్యాయవాది సీజీఎం కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించగా, ఈ కేసు ఫిబ్రవరి 10న విచారణకు రానుంది.ఈ కేసులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా సహ నిందితులుగా పిటిషనర్ పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడానికి ప్రయత్నించారని పిటిషనర్ సుధీర్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది. రాష్ట్రపతి ఒక మహిళ అని, గిరిజన సమాజం నుండి వచ్చారని, ఆమెపై ఈ వ్యాఖ్య అభ్యంతరకరమని ఓజా పేర్కొన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ప్రసంగం తర్వాత సోనియా గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘చివరికి ఆ పేద మహిళ అలసిపోయింది’ అని అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్గా అభివర్ణించారు. కాగా సోనియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఇది దురదృష్టకర, అవమానకర వ్యాఖ్య అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. సోనియా గాంధీ వ్యాఖ్యపై ప్రధాని మోదీ(Prime Minister Modi) మాట్లాడుతూ నేడు దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబ అహంకారాన్ని చవిచూసిందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశం సాధించిన విజయాలు, దార్శనికత గురించి ఆమె దేశ ప్రజలకు తెలియజేశారు. హిందీ ఆమె మాతృభాష కాదు, అయినప్పటికీ ఆమె చాలా చక్కగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. ఇది దేశంలోని గిరిజన సోదరసోదరీమణులకు అవమానకరం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
వికసిత భారతమే ఏకైక లక్ష్యం..
-
మూడో పర్యాయం.. మూడింతల వేగం
న్యూఢిల్లీ: దేశ అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ వేగంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు, విధానాలను అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో వేగంగా మూడు రెట్లు పెరిగిందని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా అంకితభావంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్సభ చాంబర్లో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. 60 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రగతి ప్రయాణంలో అమృతకాలం నడుస్తోందని, ఇప్పటిదాకా సాధించిన అపూర్వమైన విజయాలతో ప్రభుత్వం దేశానికి నూతన శక్తిని ఇచ్చిందని తెలిపారు. మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో భక్తులు మరణించడం పట్ల రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు నివాళులరి్పంచారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. ద్రౌపదీ ముర్ము ప్రసంగం ఆమె మాటల్లోనే... అప్పుడే అభివృద్ధికి సార్థకత శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో వంద రాకెట్ ప్రయోగాలు పూర్తిచేయడం ప్రశంసనీయం. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగన్యాన్ స్పేస్క్రాఫ్ట్లో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజు ఇక ఎంతోదూరంలో లేదు. కోవిడ్–19 మహమ్మారి, ఇతర దేశాల్లో యుద్ధాలు, తద్వారా అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. మన బలాన్ని ఆర్థిక వ్యవస్థ చాటి చెబుతోంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఒకే దేశం.. ఒకే పన్ను అనే విధానంతో జీఎస్టీని తీసుకొచ్చింది. దీనితో అన్ని రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతున్నాయి. అభివృద్ధి ఫలాలు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి సైతం అందాలి. అప్పుడే ఈ అభివృద్ధికి ఓ సార్థకత ఉంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. సౌభాగ్య యోజన కింద 80 కోట్ల మందికి రేషన్ సరుకులు అందజేస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ను అమలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో తాము గౌరవంగా జీవించగలమన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తే.. పేదరికాన్ని జయించగలమన్న ధీమా వారిలో పెరుగుతుంది. ప్రభుత్వ కృషితో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వారంతా ఒక నూతన మధ్యతరగతి వర్గంగా మారారు. దేశ పురోభివృద్ధికి వారు ఒక చోదకశక్తి. డిజిటల్ విప్లవంలో ముందంజ భారతదేశ సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. భౌతికమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే సామాజిక మౌలిక సదుపాయాల విప్లవంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత పదేళ్లలో ప్రగతిలో కొత్త అధ్యాయం లిఖించింది. డిజిటల్ విప్లవంలో మనం ముందంజలో ఉన్నాం. డిజిటల్ టెక్నాలజీ రంగంలో ఇండియా అతిపెద్ద గ్లోబల్ ప్లేయర్గా అవతరించింది. మన దేశంలో ప్రజలకు 5జీ సరీ్వసులు అందుతున్నాయి. ఇక మన డిజిటల్ చెల్లింపులు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో 50 శాతానికి పైగా రియల్–టైమ్ డిజిటల్ లావాదేవీలు మనదేశంలోనే జరుగుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి డిజిటల్ టెక్నాలజీని ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకుంటోంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ‘మహిళల సారథ్యంలో ప్రగతి’ అనేది ప్రభుత్వ విధానం. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోంది. 91 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆయా సంఘాలకు రూ.9 లక్షల కోట్లు అందజేసింది. వారు ఆర్థిక స్వాతంత్య్రం గణనీయంగా పెంచుకుంటున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యంతో నారీశక్తి వందన్ అధినియంను ప్రభుత్వం తీసుకొచ్చింది. రైల్వే నెట్వర్క్ ద్వారా కన్యాకుమారితో కశీ్మర్ అనుసంధానమైంది. ఉధంపూర్–బారాముల్లా–శ్రీనగర్ రైలు ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా 71 వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాన నగరాల సమీపంలో 100కుపైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.28,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని కేంద్రం సంకల్పించింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023–14లో దేశంలో రికార్డు స్థాయిలో 322 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం రైతులకు రూ.41,000 కోట్లు అందజేసింది. పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ మన దేశంలోనే ఉంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. రూ.8,000 కోట్లతో అదనంగా 52,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నూతన పరిపాలనా విధానానికి సంస్కరణ, పనితీరు, మార్పు అనేవి పర్యాయ పదాలుగా మారాయి’’ అని రాష్ట్రపతి ముర్ము స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలపై ముందడుగు‘‘బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అహరి్నశలూ కృషి చేస్తోంది. పేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వబోతోంది. గ్రామీణులకు ప్రాపర్టీ కార్డులు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. 70 ఏళ్లు దాటినవారిలో 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం వర్తింపజేస్తోంది. కీలకమైన జమిలి ఎన్నికలతోపాటు వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రభు త్వం ముందడుగు వేసింది. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ మాత్రం ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థిరత్వంలో ఒక మూలస్తంభంగా నిలిచింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. భారతదేశ బలాలు, విధానాలు, ఉద్దేశాల పట్ల ప్రపంచ దేశాలు విశ్వాసం కనబరుస్తున్నాయి. క్వాడ్, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థతోపాటు జీ20లో ఇండియాదే కీలకపాత్ర. సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకంఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసు. తాము ఒంటరిమన్న భావనను వారిలో తొలగించడానికి కృషి చేస్తోంది. ఈశాన్యంలో శాంతి సాధన కోసం పదికిపైగా ఒప్పందాలు కుదిరాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకం. దేశమంతటా అన్ని ప్రాంతాలూ సమానంగా పురోగతి సాధించాలన్నదే కేంద్రం ఉద్దేశం. అండమాన్, నికోబార్ దీవులు, లక్షదీవుల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది. అందరికీ నాణ్యమైన వైద్య సేవలుసమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు తక్కువ రుసుముతో నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ చర్యలతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే ఐదేళ్లలో మెడికల్ కాలేజీల్లో కొత్తగా 75 వేల సీట్లు రాబోతున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత పదేళ్లలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. వాటిలో నాణ్యత కూడా మెరుగుపడింది.మధ్య తరగతికి సొంత గూడుప్రభుత్వ పథకాలతో దళితులు, గిరిజనులు, బీసీలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో వారు భాగస్వాములవుతున్నారు. సొంత గూడు కలిగి ఉండాలన్నది మధ్య తరగతి ప్రజల కల. దాన్ని నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గృహరుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు తావులేకుండా ‘రెరా’ వంటి చట్టాలు తీసుకొచ్చింది. ‘అందరికీ ఇళ్లు’ అనేది ప్రభుత్వ లక్ష్యం. -
భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శనం : రాష్ట్రపతి
-
జాతికి ముప్పు చేసే టెక్నాలజీలు
కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైబర్ సెక్యూరిటీలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెప్పారు. డిజిటల్ మోసం, సైబర్ క్రైమ్, డీప్ఫేక్ వంటి టెక్నాలజీల ద్వారా పెరుగుతున్న బెదిరింపులను ఆమె అంగీకరించారు. ఇవి సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రత పట్ల ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని అన్నారు.సైబర్ సెక్యూరిటీడిజిటల్ బెదిరింపుల నుంచి పౌరులు, సంస్థలను రక్షించడానికి సైబర్ భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముర్ము పేర్కొన్నారు. డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్ పెరగడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదాల నుంచి రక్షణకు పటిష్టమైన చర్యలు అవసరమని తెలిపారు. సైబర్ బెదిరింపులను సమర్థంగా గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి, అందుకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి అధునాతన సాంకేతికతలు, వ్యూహాలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.డీప్ఫేక్ టెక్నాలజీఅత్యంత వాస్తవికంగా కనిపించేలా నకిలీ చిత్రాలు, వీడియోలు, ఆడియోలను సృష్టించే డీప్ఫేక్ టెక్నాలజీ సమాచార సమగ్రతకు, ప్రజల నమ్మకానికి ముప్పు కలిగిస్తుంది. అధునాతన డిటెక్షన్ అండ్ మిటిగేషన్ టెక్నిక్స్ను అభివృద్ధి చేయడం ద్వారా ఈ సవాలును ఎదుర్కోవాల్సి ఉందని ముర్ము అన్నారు. డీప్ఫేక్ టెక్నాలజీ సమాచారాన్ని ముందే పసిగట్టి ఆదిలోనే దాన్ని కట్టడి చేసేందుకు వీలుగా టెక్ నిపుణులు, పరిశోధకులతో కలిసి పనిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్జాతీయ భద్రత పెంపుసైబర్ సెక్యూరిటీ అనేది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. కీలకమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థలు, సున్నితమైన డేటాను సైబర్ దాడుల నుంచి రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, డిజిటల్ యుగంలో దేశ భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర బడ్జెట్ ఆర్థిక సర్వే(Union Budget Economic Survey 2025) 2025 సందర్భంగా కీలక ప్రకటన చేశారు. భారతదేశ మెట్రో రైలు నెట్వర్క్ 1,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందని ప్రకటించారు. దాంతో చైనా, యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రపంచంలో ఈ విజయం సాధించిన మూడో అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ నిలిచింది.భారతదేశం మెట్రో రైలు నెట్వర్క్ 1,000 కిలోమీటర్లకు చేరడం వల్ల ఎంతో మేలు జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ విస్తరణ పట్టణ రవాణాను పెంచడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రద్దీని తగ్గించడానికి వీలైంది. వచ్చే ఐదేళ్లలో ప్రస్తుత నెట్వర్క్ను రెట్టింపు చేసే ప్రణాళికలతో మెట్రో, రాపిడ్ రైల్ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే గణనీయమైన బడ్జెట్ను కేటాయించింది.ఇదీ చదవండి: మిషన్ మౌసమ్తో వాతావరణ సమాచారంకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గం ఏర్పాటు చేసే ప్రయాత్నాల్లో భాగంగా చాలా సవాళ్లు ఎదురయ్యాయని రాష్ట్రపతి తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని ముర్ము ప్రస్తావించారు. 272 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు క్లిష్టమైన భూభాగం కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. అయినా దీన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఈ ప్రాంతంలో కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధి పెరుగుతుందని, వస్తువులు, ప్రయాణీకుల రవాణా మెరుగవుతుందని భావిస్తున్నారు. -
మిషన్ మౌసమ్తో వాతావరణ సమాచారం
కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు సేవలందించేందుకు ఉద్దేశించిన అనేక కీలక కార్యక్రమాలను ఆమె హైలైట్ చేశారు.రైతులపై దృష్టిరైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం ద్వారా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముర్ము తెలిపారు. వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, తద్వారా దేశ సమగ్ర ఆర్థిక వృద్ధికి దోహదపడటం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు.యు-విన్ పోర్టల్గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే దిశగా యూ-విన్ పోర్టల్ను ప్రారంభించినట్లు రాష్ట్రపతి ప్రకటించారు. యు-విన్ పోర్టల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ను కచ్చితంగా ట్రాక్ చేయడానికి, సకాలంలో పూర్తి రోగనిరోధక శక్తిని నిర్ధారించడానికి రూపొందించినట్లు తెలిపారు. యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో భాగంగా 12 నివారించదగిన వ్యాధులకు వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.ఇదీ చదవండి: ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమామిషన్ మౌసమ్భారతదేశాన్ని వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండేలా, వాటివల్ల కలిగే ప్రభావాలను మరింత స్మార్ట్గా నిర్వహించడానికి మిషన్ మౌసమ్ పథకం తోడ్పడుతుందన్నారు. ఈ రూ.2,000 కోట్ల ప్రాజెక్టు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కచ్చితమైన, సకాలంలో వాతావరణ సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. మిషన్ మౌసమ్లో తదుపరి తరం రాడార్లు, ఉపగ్రహ వ్యవస్థలు, అధిక పనితీరు కలిగిన సూపర్ కంప్యూటర్లతో సహా అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా
ఆయుష్మాన్ భారత్ పథకం కింద డెబ్బై ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సమ్మిళిత వృద్ధి, సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు.ఆయుష్మాన్ భారత్ పథకంఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆరోగ్య కవరేజీని అందించడం, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడటం దీని లక్ష్యం. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం వల్ల వృద్ధుల ఆరోగ్య అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.సీనియర్ సిటిజన్లపై ప్రభావం..ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమాను వర్తింపజేయాలన్న నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయంతో చాలా మంది వృద్ధులు వైద్య సేవలను పొందడంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో వృద్ధులైన లబ్ధిదారుల సంఖ్యను ఆరు కోట్లకు చేర్చాలనే నిర్ణయం వారికి ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుందని చెబుతున్నారు. వారికి సకాలంలో, తగిన వైద్య సంరక్షణ లభించేలా చేస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: పదేళ్లలో ఇదే తొలిసారిఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ నిబద్ధతదేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉందని ముర్ము నొక్కి చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో సీనియర్ సిటిజన్లను చేర్చడం మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో విస్తృత వ్యూహంలో భాగంగా పరిగణించవచ్చు. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేయడం, అవసరమైన మందుల లభ్యతను పెంచడం, నివారణ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ముర్ము అన్నారు. -
Watch Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా మారుస్తాం: రాష్ట్రపతి
👉 వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉంటుంది. వికసిత్ భారత్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. మూడోసారి మా ప్రభుత్వం మూడు రెట్లు అధిక వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. వ్యవసాయ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది ఇంటి కల నెరవేర్చాం. కోట్లాది మందిని ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేసింది. మూడు కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నాం.👉మహాకుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. మహాకుంభమేళా భారత సంస్కృతికి చిహ్నం. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు నివాళి అర్పిస్తున్నాను.👉 ఇటీవల 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది సొంత ఇంటి కల నెరవేరబోతుంది. అమృత్భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.👉 వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇస్రో భారత కీర్తి పతాకం ఎగురవేసింది. స్పేస్ డాకింగ్తో మరో అడుగు ముందుకేశాం. అంతరిక్షంలో భారతీయుడు అడుగుపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేకిన్ ఇండియాతో అద్భుత విజయాలు సాధిస్తున్నాం. ఇండియా ఏఐ మిషన్ను ప్రారంభించాం. సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాల నుంచి బయటపడేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ-గవర్నెన్స్కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రపంచస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.👉 ఖేలో ఇండియా మన దేశ యువతకు ఎంతో ఉపయోగకరం. మన దేశ మహిళలు ఒలంపిక్స్లో పథకాలు సాధిస్తున్నారు. మహిళా సాధికారిత కోసం డ్రోన్ దీదీ పథకం తీసుకువచ్చాం. లక్షా 15వేల మంది మహిళలు లక్పతి దీదీలుగా మారారు. మూడు లక్షల మంది మహిళలను లక్పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. డ్రోన్ దీదీ స్కీమ్ మహిళలకు ఉపయోగపడుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు హోం లోన్స్ ఇస్తున్నాం. దేశంలో 70 ఏళ్లు దాటిన ఆరు కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తాం. రైతులను ఆదుకునేందుకు, వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యువతను వారి వారి మాతృ భాషల్లో ఎడ్యుకేట్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. 👉 భారత ఆర్థిక వ్యవస్థకు చిరు వ్యాపారులే కీలకం. భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా మారుస్తాం. టెక్నాలజీ రంగంలో భారత్ అద్భుతంగా దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు సాధిస్తున్నాం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. ఎంఎస్ఎంఈ కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీం తీసుకొచ్చాం. 👉 వైద్య, ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నూతన టెక్నాలజీ తీసుకొచ్చాం. దేశవ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. టీబీ రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దుతున్నాం. తక్కువ ధరకే క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చాం.👉 ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జిని కశ్మీర్లో నిర్మించాం. దేశంలో మెట్రో వ్యవస్థలను వేగంగా విస్తరిస్తున్నాం. ఢిల్లీలో మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నాం. స్వచ్చమైన నీటి కోసం నదులను అనుసందానం చేస్తున్నాం. దేశంలో పౌరవిమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది. రైతులు, పరిశ్రమలు, సైన్స్పై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.👉చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. ఆదివాసీల్లో సికెల్సెల్ వ్యాధిని నివారించాం. మహిళలతోనే ఆర్థిక అభివృద్ధి అని మా ప్రభుత్వం నమ్ముతోంది. దళితుల కోసమే కొన్ని ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అభవృద్ధి చేశాం. 👉త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతుంది. భారత రాజ్యాంగానికి నా సెట్యూట్. వక్ఫ్ బోర్డులో సంస్కరణపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మహిళా సాధికారితకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందరికీ ఫలాలు అందాలన్నదే మా ఉద్దేశ్యం. 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాం. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.70వేల కోట్లు కేటాయించాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించాం. ఉద్యోగుల కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని నియమించాం. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. పేదలకు లబ్ధి కలిగిస్తున్నాయి. President Murmu says, "My government is committed to fulfilling the dream of the middle class of having their own house..." pic.twitter.com/Y58sa0z61Z— ANI (@ANI) January 31, 2025 👉మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యలకు ఉభయ సభలు సభ్యులు నివాళి అర్పించారు. 👉బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. President Droupadi Murmu to address the joint sitting of both Houses of Parliament, shortlySource: DD News pic.twitter.com/2RVQS79blX— ANI (@ANI) January 31, 2025👉కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. మూడోసారి దేశ ప్రజలు మాకు విజయాన్ని అందించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తాం. వికసిత్ భారత్కు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. దేశంలోని పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నాను. 👉ఈ సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్కు ప్రాధాన్యత ఇస్తాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్కు ప్రాధాన్యత ఇస్తాం. ఈ బడ్జెట్ భారతీయులకు నూతన శక్తిని ఇస్తుంది. ఈ బడ్జెట్ యువతకు ఆశాజనకంగా ఉంటుంది. చారిత్రాత్మక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతాం. వక్ఫ్, బ్యాంకింగ్, రైల్వేలు సహా 16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని కామెంట్స్ చేశారు.#WATCH | #BudgetSession | PM Modi says, "I pray that Maa Lakshmi continues to bless the poor and middle class of our country. It is a matter of great pride that India completed 75 years as a democratic nation. India has established itself well on the global pedestal...This is the… pic.twitter.com/BF2dT2oTz9— ANI (@ANI) January 31, 2025 👉ఈరోజు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి లోక్సభ హాల్లో ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెడతారు. శనివారం నిర్మల లోక్సభలో 2025–26 సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు రాజ్యసభ, లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. బడ్జెట్ సమావేశాల తొలి సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 దాకా, రెండోసెషన్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా జరుగుతుంది. నిలదీసేందుకు విపక్షాల వ్యూహరచనమోదీ సర్కార్ను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కుంభమేళాలో అపశ్రుతి సహా కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, చైనా సరిహద్దు వివాదం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం పార్టీలు, చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్లకు మాత్రం అన్ని కాంట్రాక్టులు దక్కేలా కుట్ర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధంచేశాయి. సహకరించాలన్న మోదీ సర్కార్శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్చేశాయి. మహాకుంభమేళాలో భక్తులను గాలికొదిలేసి వీఐపీ సంస్కృతికి యోగి ప్రభుత్వం జై కొట్టిందని, ఈ నిర్లక్ష్య ధోరణిపై చర్చ జరపాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పట్టుబట్టగా ఎజెండాలో ఏమేం ఉండాలో సభావ్యవహా రాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు.వక్ఫ్ సహా కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే.. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం సమర్పించింది. వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెల్సిందే. కాగా గురువారం నాటి అఖిలపక్ష భేటీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం అందజేసింది. ఈ జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఉంది. 16 బిల్లులను ఈ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయసభల ముందుకొచ్చే బిల్లుల జాబితాలో బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల(సవరణ) బిల్లు, షిప్పింగ్ బిల్లు, వైమానిక వస్తువుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకారీ యూనివర్సిటీ బిల్లు, వలసల, విదేశీయుల బిల్లు వంటివి ఉన్నాయి. -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
కర్తవ్యపథ్లో కొనసాగుతున్న గణతంత్ర వేడుకలు
ఢిల్లీ : క్తరవ్యపథ్ వేదికగా ఢిల్లీలో 76వ గణతంత్ర వేడుకలు (76th Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర వేడుకల్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు, ముఖ్య అతిథి, ఇండోనేషియా (Indonesia) అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) పాల్గొన్నారు.👉76వ గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకతలు ఢిల్లీలో కొనసాగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలు 90 నిమిషాల పాటు నిర్విరామంగా కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదవి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర వేడుకల్ని ప్రారంభించారు. #WATCH | President Droupadi Murmu unfurls the National Flag at Kartavya Path, on the occasion of 76th #RepublicDay🇮🇳National anthem and 21 Gun salute follows.(Source: DD News) pic.twitter.com/6969bmx2B4— ANI (@ANI) January 26, 2025ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రబోవోతో పాటు 352 మంది సభ్యుల ఇండోనేషియా కవాతు, బ్యాండ్ బృందం కవాతులో పాల్గొంటుంది.గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించడంతో గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ వేడుకల్ని వీక్షించేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ పేరుతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ సంస్థలకు చెందిన 15 శకటాలతో మొత్తం 31 శకటాలు కర్తవ్య పథ్ వేదికగా ప్రదర్శించనున్నాయి బ్రహ్మోస్ క్షిపణి, పినాక రాకెట్ సిస్టమ్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో సహా అత్యాధునిక రక్షణ శకటాలు ప్రదర్శించనున్నాయి. ఆర్మీకి చెందిన యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’ డీఆర్డీవో ‘ప్రళయ్’ వ్యూహాత్మక క్షిపణి తొలిసారిగా ప్రదర్శించనుంది. ప్రదర్శనలో ఇతర సైనిక శకటాలలో టీ-90 ‘భీష్మ’ ట్యాంకులు, శరత్ పదాతిదళం వాహనాలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, మౌంటెడ్ పదాతిదళ మోర్టార్ సిస్టమ్ (ఐరావత్) ఉన్నాయి.దేశంలోని సాయుధ దళాల మధ్య ఐక్యత స్ఫూర్తికి ప్రతీకగా త్రివిద దళాల సేవలు ఉమ్మడిగా ప్రదర్శించనుండగా.. డీఆర్డీవో ‘రక్షా కవచ్’ థీమ్ను ప్రదర్శించనుంది.మౌంటెడ్ కాలమ్కు నాయకత్వం వహించే మొదటి ఆర్మీ దళం ఐకానిక్ 61 అశ్వికదళం. ఇది ప్రపంచంలోని ఏకైక గుర్రపు అశ్వికదళ రెజిమెంట్. నారీ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రివిధ దళాల అనుభవజ్ఞులైన మహిళా అధికారులు ఉంటారు.కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ మోటార్సైకిల్ ప్రదర్శన 90 నిమిషాల నిడివి గల కవాతులో హైలైట్గా నిలవనుంది. కర్తవ్య పథంలో మొత్తం 5,000 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 300 మంది కళాకారులు సంగీత వాయిద్యాలపై ‘సారే జహాన్ సే అచ్ఛా’ ను వినిపించనున్నారు. ఢిల్లీలో 70 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు, 70,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీని ఆరు లేయర్ల భద్రతా కొనసాగుతుంది. ఫేస్ రికగ్నైజన్ టెక్నాలజీతో 2,500 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు, యాంటీ-డ్రోన్ సిస్టమ్లు, రూఫ్టాప్ స్నిపర్లు పహారాకాస్తున్నాయి. -
ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం: రాష్ట్రపతి
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం అని.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశం మొత్తం గర్వించదగ్గ సందర్భం ఇదని.. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందన్న రాష్ట్రపతి.. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఎల్లప్పుడూ మన నాగరిక వారసత్వంలో భాగంగా ఉన్నాయి. మన వారసత్వ గొప్పతనానికి నిదర్శనం మహా కుంభమేళా. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకొన్నాం. వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నాం. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చాం. జమిలి ఎన్నికలు పాలనలో స్థిరత్వాన్ని అందించడంతో పాటు ఆర్థికపరమైన భారాన్ని కూడా తగ్గిస్తాయి’’ అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. -
‘ఎన్నికల’ వజ్రోత్సవం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియగా నిలిచే లోక్సభ ఎన్నికలు. అందుకు ఏ మాత్రమూ తగ్గని పలు పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. సుమారు 100 కోట్ల ఓటర్లు. లక్షల్లో పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది. వేలాది మంది అభ్యర్థులు. ఇంతటి భారీ ప్రజాస్వామిక క్రతువు సజావుగా జరిగేలా చూసే గురుతర బాధ్యతను మోస్తూ వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన ఈసీ శనివారం 76 ఏట అడుగు పెడుతోంది. ఈ క్రమంలో బాలారిష్టాలను దాటి ‘ఇంతింతై’ అన్నట్టుగా ఎదిగి, నేడు అత్యాధునిక పద్ధతుల ద్వారా ఎన్నికల ప్రక్రియను దేశవ్యాప్తంగా ఆసాంతమూ డేగకళ్లతో పర్యవేక్షించగల స్థాయికి చేరుకుంది.ఆ క్రమంలో ఎన్నో మెరుపులు మెరిపించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎంతటి అద్భుతాలు సాధ్యమో ప్రధాన ఎన్నికల కమిషనర్గా టి.ఎన్.శేషన్ ఆచరణలో చూపించారు. అభ్యర్థుల ఆస్తుల వెల్లడి మొదలుకుని ప్రచార వ్యయ నియంత్రణ దాకా నిబంధనలన్నింటినీ కట్టుదిట్టంగా అమలు చేసి ఔరా అనిపించుకున్నారు. ఈసీ అధికారాలు ఎంతటివో పార్టీలు, నేతలతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలిసొచ్చేలా చేశారు. అలాంటి చరిత్ర ఉన్న ఈసీ పనితీరుపై కొన్నేళ్లుగా ఎన్నెన్నో ప్రశ్నలు! పారదర్శకత లోపిస్తున్న తీరుపై ప్రజలు మొదలుకుని ప్రతిపక్షాల దాకా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి! మొత్తంగా ఈసీ వ్యవహార శైలిపైనే ఆరోపణల మరకలు. ఈ పరిణామాలు ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనపరుస్తున్నాయి.ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు గుండెకాయ వంటి ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) విశ్వసనీయతపైనే నానాటికీ సందేహాలు పెరుగుతున్నాయి. వాటికి మద్దతుగా సహేతుక వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈవీఎంల పనితీరును మేధావులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక చివరి గంటల్లో పోలింగ్ శాతంలో అనూహ్యంగా నమోదవుతున్న భారీ పెరుగుదలను స్వయానా ఈసీ మాజీ సారథులే ప్రశ్నిస్తున్న పరిస్థితి! వీటన్నింటినీ మించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉంటున్న వైనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వందల స్థానాల్లో ఇదే పరిస్థితంటూ పలు గణాంకాలు వెల్లువెత్తాయి.ఇలాంటి సందేహాలు, ప్శ్నలు ప్రజాస్వామిక ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అరకొర వివరణలతో సరిపెట్టడం, ప్రధాన సందేహాలపై మౌనాన్ని ఆశ్రయిస్తుండటం అనుమానాలను మరింతంగా పెంచుతోంది. ప్రభుత్వ పెద్దల చేతిలో ఈసీ కీలు»ొమ్మగా మారుతోందని విపక్షాలు ఆరోపించడం పరిపాటిగా మారింది. చివరికి ఎన్నికల కమిషనర్ల నియామకం కూడా తరచూ వివాదాస్పదంగా మారుతోంది. వాటిని సవాలు చేస్తూ పలు పార్టీలు సుప్రీంకోర్టు దాకా వెళ్తున్న పరిస్థితి! ఈసీ 76వ వార్షికోత్సవ వేడుక శనివారం హస్తినలో జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎక్సలెన్స్ అవార్డులు అందజేస్తారు. ‘ఇండియా వోట్స్–2024’ పేరిట ఇటీవలి లోక్సభ ఎన్నికలపై ఈసీ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను, ఆ ఎన్నికలకు సంబంధించిన మానవాసక్తి కథనాల కూర్పు ‘బిలీఫ్ ఇన్ ద బ్యాలెట్’ను విడుదల చేస్తారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియపై ‘ఇండియా డిసైడ్స్’ పేరిట వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లలో అవగాహనను పెంచేలా పలు కార్యక్రమాలను ఈసీ ప్రకటించనుంది. ..అలా మొదలైంది ఎన్నికల సంఘం ఉనికిలోకి వచ్చిన రెండేళ్లకే 1952 తొలి సాధారణ ఎన్నికల రూపంలో అతి పెద్ద సవాలును ఎదుర్కొంది. ఉన్నది ఒక్క ఎన్నికల కమిషనర్, చాలీచాలని సిబ్బంది. వనరులు, వసతులు అంతంతమాత్రం. ఓటర్లలో మెజారిటీ అక్షరజ్ఞానం కూడా లేనివారే. వారందరినీ చేరుకోవడం, ఓటేసేలా చూడటమే అతి పెద్ద సవాలుగా మారిన పరిస్థితి! అన్ని ప్రతికూలతల మధ్య కూడా తొలి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించి ఔరా అనిపించుకుంద. రవాణా సదుపాయాలే లేని అతి మారుమూల ప్రాంతాలకు కూడా సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని చేర్చి ప్రక్రియ వీలైనంత సమగ్రంగా జరిగేలా చూసింది.అందుకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చింది. దాంతో తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ దేశ విదేశాల్లో పాపులరయ్యారు. ఎన్నో దేశాలు తమ ఎన్నికల ప్రక్రియను గాడిన పెట్టేందుకు ఆయన సేవలను వాడుకున్నాయి. తర్వాత ఈసీ క్రమక్రమంగా ఎదుగుతూ వచి్చంది. ప్రపంచంలోకెల్లా అతి బృహత్తరమైన ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆద్యంతం శాంతియుతంగా నిర్వహించడంలో తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. 1989లో ఎన్నికల కమిషనర్ల సంఖ్యను మూడుకు పెరిగింది.ఓటర్ల జాబితాతోనూ చెలగాటం ఎన్నికల ప్రక్రియకు అతి కీలకమైన ఓటర్ల జాబితాతో ప్రభుత్వాలు, పాలక పెద్దలు చెలగాటమాడుతున్న తీరు కూడా ఈసీ పనితీరుపై మచ్చగా మారుతోంది. తమకు అనువైన చోట్ల ఇష్టారాజ్యంగా ఓటర్లను చేరుస్తున్నారని, లేనిచోట్ల భారీగా పేర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరోపణలు పదేపదే వినిపించాయి. ఇక తాజాగా జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైతే ఈ రచ్చ కనీవినీ ఎరగని స్థాయికి పెరిగింది. రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన అంబేడ్కర్ ఈ విపరిణామాన్ని ముందే ఊహించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఎన్నికల జాబితాను ఒకటిగా ఆయన అభివర్ణించారు.‘‘జాతి, సంస్కృతి, భాష తదితరాలపరంగా తమవారు కారని భావించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించే అవకాశముంది. ఇలాంటి పెడపోకడలకు చెక్ పెట్టేందుకే ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటును ప్రతిపాదిస్తూ 1949 జూన్లో రాజ్యాంగ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో అంబేడ్కర్ స్పష్టం చేశారు. నేటి పరిస్థితులు చూస్తే నాటి భయాలే నిజమవుతున్నాయని ఆయన ఆవేదన చెందేవారేమో. -
రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్రత్న, అర్జున అవార్డుల ప్రదానం (ఫొటోలు)
-
రాష్ట్రపతి మెచ్చిన మిట్టీ కేఫ్..దివ్యాంగులకు చేయూత
కంటోన్మెంట్: దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మిట్టీ కేఫ్ ఆధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో నూతన కెఫే ఏర్పడింది. పూర్తిగా దివ్యాంగుల ఆధ్వర్యంలో నిర్వహణ సాగే ఈ కెఫే ఏర్పాటుకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్/ గ్రూప్ సిఎస్ఆర్ వింగ్ చేయూతను అందిస్తుంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా ఈ మిట్టీ కేఫ్ను అధికారికంగా ప్రారంభించారు. మానసిక, శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి సమస్యలను సమాజం దృష్టికి తెచి్చ, స్పందించేలా చేసేందుకు ఈ మిట్టీ కేఫ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్టు కాంప్లెక్స్తో పాటు పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 47కి పైగా ప్రదేశాల్లో మీట్టీ కేఫ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు. ఏమిటీ మిట్టీ కేఫ్? ఈ కేఫ్లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్లో దివ్యాంగులు స్వయంగా రూపొందించిన గృహాలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోటు పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న మిట్టీ కేఫ్ ఆలోచనను గుర్తించి, వాటి నిర్వహణకు సీఎస్ఆర్ కింద పలు ప్రభుత్వరంగ, ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేఫ్లను పలువురు సెలిబ్రిటీలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దివ్యాంగులకు ఉపాధి.. నగరంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ఉచితంగా కేటాయించిన స్థలంలో మిట్టీ కేఫ్ను నెలకొల్పారు. ఇందులో 15 మంది మానసిక, శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులు ఈ కేఫ్ను స్వయంగా నడుపుతున్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుండి రూ.50 వేల వరకూ వేతనంగా అందుతుంది. ఆర్థిక స్వావలంబన, ఆత్మ గౌరవంతో జీవించేందుకు మిట్టీ కేఫ్ అండగా ఉంటున్నట్లు నిర్వాహకురాలు స్వాతి తెలిపారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ.. మిట్టీ కేఫ్లలో సమోసా, చాట్, పకోడీ, మసాలా టీ, బిస్కెట్లు, కాఫీ, మ్యాగీ, శాండ్ విచ్, పలు రకాల ఐస్క్రీమ్స్, ఇతర చిరుతిండ్లు స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి అవసరమైన పెట్టుబడి, నిర్వహణా ఖర్చులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆ్రస్టేలియా–న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూపులు భరిస్తున్నాయి. దీనికి తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సిఎస్ఆర్ వింగ్ చొరవ తీసుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతోంది. రూ. 36–46 లక్షలు టర్నోవర్ దిశగా కృషి చేస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిట్టి కేఫ్ను సందర్శించారు. పలు వస్తువులు కొనుగోలు చేసి నిర్వాహకులను, ఉద్యోగులను అభినందించారు. -
బుల్డోజర్ కూల్చివేతలు.. హైడ్రాపై రాష్ట్రపతికి లేఖ
సాక్షి,ఢిల్లీ : తెలంగాణ హైడ్రా బుల్డోజర్ల కూల్చేవేత అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరింది. తెలంగాణ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి పిర్యాదు చేశాను. గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులు చనిపోయారు. హైడ్రాను ఒక మాఫియా లాగ మార్చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు చెరువు కింద ఉంది. పేదోడి ఇళ్లను కులగొడుతున్నారు. పేద ప్రజలకు భూములు,ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.👉చదవండి : 'అలా ఎలా కూల్చేస్తారు?'.. హైడ్రాపై హైకోర్టు సీరియస్కానీ ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై 88 కేసులు ఉన్నాయి. లగచర్లలో ఎస్టీల భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీని సినిమా ప్రమోషన్ అడ్డగా చేశారు. ముఖ్యమంత్రికి గురుకుల, హైడ్రా ఇతర సమస్యలు పట్టవు. అలివి కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ముంచారు. అత్యంత మనువాద పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ హక్కులను ఆలోచలను తెలంగాణ కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నారు’ అని బక్క జడ్సన్ ఆరోపించారు. -
అందరికీ ఆనందం పంచాలని ఆశిస్తున్నా ప్రజలకు ప్రధాని
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ కొత్త ఆశలు, ఆశయాలకు నెలవైన నూతన సంవత్సరానికి అందరూ ఆనందంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన సంతోషాలు, అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందాలను తీసుకు రావాలని ఆశిస్తున్నా. ఆయురారోగ్యాలతో ఉండేలా కొత్త సంవత్సరం అందర్నీ దీవించనుంది’’ అని మోదీ అన్నారు. ‘‘ సమష్టిగా ప్రయత్నించి గత సంవత్సరం మనందరం అనేక అద్భుత విజయాలు అందుకున్నాం. 2025 సంవత్సరంలోనూ మరింతగా కష్టపడి పనిచేసి వికసిత్ భారత్ దిశగా వడివడిగా అడుగులు వేద్దాం’’ అని అన్నారు. గత ఏడాది కాలంలో భారతదేశం సాధించిన పురోగతి, ఐక్యత, అభివృద్ధి ప్రస్థానం వైపు వేసిన అడుగులను వివరిస్తూ మోదీ ఈ సందర్భంగా ఓ వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేశారు. Wishing everyone a very Happy New Year! May the year 2025 bring joy, harmony and prosperity to all! On this occasion, let us renew our commitment to work together for creating a brighter, more inclusive and sustainable future for India and the world.— President of India (@rashtrapatibhvn) January 1, 2025గ్రీటింగ్స్ చెప్పిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిమరింత సమ్మిళితమైన, సుస్థిరమైన భారత్తో పాటు ప్రపంచ శాంతి కోసం దేశ ప్రజలంతా ఉమ్మడిగా కష్టపడి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం తన నూతన ఏడాది సందేశంలో పిలుపునిచ్చారు. ‘‘ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షులు. 2025 ఏడాది మీ జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని, నూతనోత్సాహం, సా మరస్యం, సంతోషం వెల్లివిరియాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ఆమె అన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సైతం ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. లోక్సభ స్వీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ సైతం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. Happy 2025! May this year bring everyone new opportunities, success and endless joy. May everybody be blessed with wonderful health and prosperity.— Narendra Modi (@narendramodi) January 1, 2025 -
రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్
సాక్షి, సిటీబ్యూరో: పర్యాటక నిలయంగా ప్రసిద్ధి చెందిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు నూతన సంవత్సర కానుకగా జనవరి 2 నుంచి 13 వరకూ ఉద్యాన్ ఉత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన ఈ కార్యక్రమం వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన పుష్పాలు, ఇతర ప్రదర్శనలకు వేదిక కానుందని, ఉద్యానవన స్పృహను పెంపొందించేందుకు రాష్ట్రపతి నిలయం పరిపాలనాధికారి రజనిప్రియా శనివారం వెల్లడించారు. మొదటి సారి నిర్వహించే ఈ ఉద్యాన్ ఉత్సవ్ పన్నెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని, ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతుందని చెప్పారు. సేంద్రియ ఎరువులు, కంపోస్టింగ్, గార్డెనింగ్ టూల్స్, గార్డెన్ డెకర్, హారీ్టకల్చర్ డోమైన్లు ఉంటాయని, ఇందులో 50 స్టాళ్ళతో గ్రాండ్ ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద, గిరిజన ప్రదర్శనలు, వంటకాలు, ఇంటరాక్షన్ సెషన్లు ఉంటాయని తెలిపారు. పలువురు ఎగ్జిబిటర్లు, ప్రభుత్వ, కమ్యూనిటీ సంస్థలు, ఎన్జీవోలు, ప్రైవేటు కంపనీలు భాగాస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఒడిశ్సా శంఖ్ వదన్ నృత్యం, మధ్యప్రదేశ్ యుద్ధ కళ నృత్యం వంటి ప్రదర్శనలు ఉన్నాయని, సందర్శకులకు ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు. -
భారత‘రత్న’ వాజ్పేయి శతజయంతి.. ప్రముఖుల నివాళి (చిత్రాలు)
-
అటల్ బిహారి వాజ్ పాయి 100వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు
-
వాజ్పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మృతివనం ‘సదైవ్ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని మోదీ(PM MODI) నివాళులర్పించారు. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కేబినెట్ మంత్రులు రాజ్నాథ్సింగ్, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.దేశం కోసం జీవితాన్ని అంకితం చేశారు: ప్రధాని మోదీసుసంపన్న, బలమైన భారత దేశ నిర్మాణం కోసం వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. వాజ్పేయి శతజయంతి సందర్భంగా ప్రధాని బుధవారం(డిసెంబర్25) ఎక్స్లో ఒక పోస్టు చేశారు. వాజ్పేయి విజన్,మిషన్ భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించేందుకు తమకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.ఇదీ చదవండి: రాజకీయ కవి సార్వభౌముడు -
రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది.. అబ్బురపరుస్తున్న బొల్లారం రాష్ట్రపతి భవన్ (ఫొటోలు)
-
నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక
సాక్షి, అమరావతి/మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్లో మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు హాజరవుతారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మాధభానందకర్ చెప్పారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేస్తారని తెలిపారు. -
హైదరాబాద్ లో రాష్ట్రపతి
-
హైదరాబాద్ టూర్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం
సాక్షి,హైదరాబాద్ : రెండురోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలు స్వాగతం పలికారు.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా..శిల్పారామం వేదికగా నవంబర్ 21 (ఈరోజు) నుంచి 24వ తేదీ వరకు లోక్మంథన్-2024 కార్యక్రమం జరగనుంది. లోక్మంథన్-2024లో 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కొద్ది సేపటి కిత్రమే బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము ఈ రోజు సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్భవన్లో ఉండనున్నారు. ఈ రోజు రాత్రి రాజ్భవన్లో బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. -
రాష్ట్రపతి ముర్ము తెలంగాణ పర్యటన
-
తెలంగాణ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటించనున్నారు. శిల్పారామం వేదికగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే లోక్మంథన్-2024 కార్యక్రమం జరగనుంది. లోక్మంథన్-2024లో 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారు.ఇందులో భాగంగా రేపు, ఎల్లుండి తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్నారు. రేపు సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్భవన్లో ఉండనున్నారు. రేపు రాత్రి రాజ్భవన్లో బస చేయనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. -
రాష్ట్రపతిని కలిసేదాకా ఇక్కడే ఉంటాం: లగచర్ల బాధితులు
న్యూఢిల్లీ, సాక్షి: లగచర్ల ఫార్మా బాధితులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ నేతలు.. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే..ఇప్పటికే లగచర్ల లో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్ లపై ఎస్సి,ఎస్టీ,మహిళ, మానవహక్కుల కమిషన్ లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై భాదితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. లగచర్ల లో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలుకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరింది. దీంతో బలవంతపు భూ సేకరణ ఘటన, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులను, లైంగిక దాడి వంటి అంశాలతో కూడిన పత్రాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేసినట్లు సమాచారం. అలాగే.. రాష్ట్రపతి ని కలసి తమ గోడు వినిపించాలని.. అప్పటిదాకా హస్తినలోనే ఉండాలని గిరిజన మహిళలు నిర్ణయించుకున్నారు. దీంతో బాధితులను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
ఘోరాతి ఘోరంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి హృదయ విదారకమన్నారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విచారం వ్యక్తం చేశారు.పీఎం మోదీ ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. పిల్లలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖాన్ని భరించే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది’ అని దానిలో పేర్కొన్నారు.రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా.. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు బాధిత తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. हृदयविदारक! उत्तर प्रदेश में झांसी के मेडिकल कॉलेज में आग लगने से हुआ हादसा मन को व्यथित करने वाला है। इसमें जिन्होंने अपने मासूम बच्चों को खो दिया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर से प्रार्थना है कि उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। राज्य सरकार की…— PMO India (@PMOIndia) November 16, 2024తక్షణ పరిహారం రూ. 5 లక్షలుఈ ఘటనపై యూసీ సీఎం యోగి విచారం వ్యక్తం చేస్తూ, మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన చిన్నారులకు రూ.50 వేలు చొప్పున సాయం అందించాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్ని ప్రమాదం జరిగిన మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం -
‘లోక్మంథన్’కు భారత రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి..ఏకత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించే ద్వైవార్షిక సాంస్కృతిక మహోత్సవమైన ‘లోక్మంథన్’కు భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హాజరవుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బేగంపేటలోని పర్యాటక భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజ్ఞాభారతి అఖిల భారత కన్వీనర్ నందకుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. నవంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శిల్పకళావేదిక, శిల్పారామంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు ‘లోక్మంథన్ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారని చెప్పారు.అంతకంటే ముందు 21వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శిల్పకళావేదికలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారన్నారు. వసుదైక కుటుంబమని ప్రపంచానికి చాటిచెప్పిన భారతీయ సాంస్కృతిక విశిష్టతను ఈ వేడుకల్లో వీక్షించొచ్చని పేర్కొన్నారు. జాతీయవాద ఆలోచనాపరులు, ఆచరణీయులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు ఈ వేడుకల్లో భాగస్వాములవుతారని కిషన్రెడ్డి చెప్పారు. నందకుమార్ మాట్లాడుతూ దేశవిదేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు తరిలిరానున్నట్టు చెప్పారు. లిథువేనియా, ఆర్మేనియా, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన విశిష్ట కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారన్నారు. లోక్మాత నాటకంతోపాటు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి రుద్రమదేవి నాటక ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ముగింపు ఉత్సవాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లు పాల్గొంటారని చెప్పారు. ⇒ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలు ఇప్పటివరకు భోపాల్, రాంచీ, గువాహటిల్లో జరిగాయి.‘లోక్–అవలోకన్, లోక్ విచార్–లోక్ వ్యవహార్’అనే ప్రధాన థీమ్తో ఈసారి లోక్మంథన్–2024 వేడుకలను నిర్వహిస్తున్నారు. ⇒ ఈ వేడుకల్లో ప్రదర్శనలు వీక్షించేందుకు ప్రతి రోజూ లక్ష మందికి పైగా సందర్శకులు తరలిరానున్నట్టు అంచనా.1,500 మందికి పైగా కళాకారులు సుమారు వెయ్యి కళారూపాలను ప్రదర్శించనున్నారు. ⇒ఫొటో జర్నలిస్ట్ అంధేకర్ సతీలాల్ వనవాసీ సంస్కృతి, జీవనశైలిపైన తీసిన ఫొటో ఎగ్జిబిషన్తోపాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలను ప్రదర్శిస్తారు. -
నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ గురువారం ఈ విషయం ‘ఎక్స్’లో వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో సంప్రదించి నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జస్టిస్ ఖన్నా నియామకం నవంబర్ 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కొత్త సీజేఐ వచ్చే నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన స్వల్పకాలమే పదవిలో ఉంటారు. 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నారు. అంటే కేవలం ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, భోపాల్లోని నేషనల్ జ్యుడీíÙయల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. కీలక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచి్చన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
ఎందరికో స్ఫూర్తిదాత రతన్ టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం
-
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
రాజఘాట్ లో నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
-
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: దేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, ప్రోత్సహించడం అందరి సమష్టి బాధ్యతని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యం, సంగీతం, కళలు, సంప్రదాయ వస్త్రధారణను దేశ వారసత్వంగా అభివరి్ణంచారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంప్రదాయాలు, జాతుల గురించి దేశ ప్రజలందరికీ తెలియజేసేందుకే ‘భారతీయ కళా మహోత్సవ్’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతీయ కళా మహోత్సవ్ తొలి ఎడిషన్ను సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల మధ్య వార ధిగా ఈ ఉత్సవం నిలుస్తుందన్నారు.కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ మాట్లాడుతూ దేశంలోని విభిన్న సంస్కృతుల ప్రదర్శన దేశ ఐక్యతను చాటుతుందన్నారు. మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కె. త్రివిక్రమ్ పటా్నయక్, మణిపూర్, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మేఘాలయ గవర్నర్ సీ.హెచ్. విజయశంకర్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయా రాష్ట్రా ల కళాకారులు, అధికారులు పాల్గొ న్నారు.ఈ ఉత్సవంలో ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 6 వరకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల మధ్య సందర్శకులను అనుమతి https://visit.rasht rapatibhavan.gov.in ద్వారా స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ముగిసిన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక రోజు రాష్ట్ర పర్యటన ముగిసింది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణు దేవ్వర్మ, సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, సీత క్క, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేంద్ర, సీపీ సీవీ ఆనంద్ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శామీర్పేటలోని నల్సార్ లా వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తరువాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘కళామహోత్సవ్’ను ప్రారంభించారు. రాత్రి తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. -
నల్సార్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి.. మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట్లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాలనికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు. అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. -
Kolkata: ప్రధాని మోదీ, రాష్ట్రపతికి వైద్యుల లేఖ
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. వెంటనే విధుల్లో చేరాలని అటు సుప్రీంకోర్టు ఆదేశించినా, ఇటు చర్యలకు బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానించినా.. వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా నిరసనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ ఘటనపై జోక్యం చేసుకొని ప్రతిష్టంభను ముగించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ఖర్, వైద్యారోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన నాలుగు పేజీల లేఖలో.. ‘‘కామాంధుడి చేతిలో బలైన మా సహోద్యోగికి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మేము(వైద్యులు), ఆరోగ్య కార్యకర్తలు బెంగాల్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి భయం లేకుండా మా విధులు నిర్వర్తించగలం. మేము నిరసనలు ప్రారంభించినప్పటి నుంచి మాపై బెదిరింపులు, హింసలు, ఆసుపత్రులు ధ్వంసం చేయడం వంటి ఘటనలు పెరిగాయి. ఈ క్లిష్ట సమయాల్లో మీ జోక్యం మా అందరికీ వెలుగుగా పనిచేస్తుంది. మేము ధైర్యంగా ముందుకు నడిచే మార్గాన్ని చూపుతుంది. మా చుట్టూ అలుముకున్న చీకటి నుంచి బయట పడేందుకు తోడ్పడుతుంది.’ అని పేర్కొన్నారు.చదవండి: కోల్కతా అభయ కేసులో కీలక మలుపు.. సీబీఐ సంచలన నిర్ణయం!కాగా ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసినప్పటి నుంచి వైద్యులు ఆందోళనకు దిగారు. ఇటీవల తాజాగా వైద్యులు మంగళశారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసనలు ఆపని వైద్యులపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని వైద్యులు బెంగాల్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. కోల్కతా పోలీస్ కమిషనర్తోపాటు.. వైద్యశాఖలో పలువురి ఉన్నతాధికారుల రాజీనామా కోరుతూ వైద్యులు అయిదు డిమాండ్లను దీదీ సర్కార్ ముందు ఉంచారు.ఈ విషయంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ముందడుగు వేసింది. మూడుసార్లు వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. కానీ చర్చల భేటీని లైవ్ టెలికాస్ట్ చేస్తేనే తాము వస్తామని నిరసన కారులు తేల్చి చెబుతున్నారు. దీంతో వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేసిన దీదీ.. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు. నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. -
అభయ ఘటన భయానకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా అభయ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్జీకార్ ఘటన తనని భయబ్రాంతులకు గురిచేసిందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదు.. చాలు’అని సూచించారు. నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. సమాజం వాటిని మర్చిపోయింది. ఇటువంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో నర్సులపై అఘాయిత్యాలు, మలయాళ చిత్ర పరిశ్రమలో వివాదాలపై రాష్ట్రపతి ముర్ము పరోక్షంగా స్పందించారు. కోల్కతా అభయ కేసులో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసనలు చేస్తున్నప్పటికీ నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. -
స్పేస్ డే వేడుకల్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: గతేడాది జులై 14న ఇస్రో చంద్రయాన్ 3 అంతరిక్ష యాత్ర చేపట్టింది. ఆగస్టు 23న ల్యాండర్ను చంద్రుడిపై దింపింది. ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం (ఆగస్ట్23న) న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు.ఈ ఏడాది థీమ్ ‘చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగా’ పేరుతో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరగనుంది Chandrayaan-3 Mission:Updates:The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom— ISRO (@isro) August 23, 2023 -
రక్షాబంధన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
నేడు (ఆగస్టు 19) దేశవ్యాప్తంగా రక్షాబంధన్ను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం విశిష్టమైనదని, దీనికి ప్రతీకగా రాఖీ జరుపుకుంటారని అన్నారు. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి రక్షాబంధన్ ఒక ప్రతీక అని, ఈ పండుగను మతపరమైన సరిహద్దులను దాటి జరుపుకోవడం విశేషమన్నారు.మహిళలకు గౌరవం అందించడంతోపాటు, వారి హక్కులను పరిరక్షించాలనే సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఈ పండుగ దోహదపడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో రక్షాబంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు (సోమవారం) అదనంగా మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఇదేవిధంగా ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ కూడా అదనంగా బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. President Droupadi Murmu extends Raksha Bandhan greetingsRead @ANI Story | https://t.co/NeXkXdRoLO#PresidentMurmu #RakshaBandhan #DroupadiMurmu pic.twitter.com/OFYFbD2UXm— ANI Digital (@ani_digital) August 18, 2024 -
తనకెంతో ఇష్టమైన టీచర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: వీడియో వైరల్
భారత రాష్ట్రపతిగా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న ద్రౌపది ముర్ము తనకెంతో ఇష్టమైన టీచర్గా అవతరించారు. కొత్తఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో కాసేపు ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. 9వ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉత్సాహంగా గడిపారు. గ్లోబల్ వార్మింగ్ , పర్యావరణం లాంటి వంటి ముఖ్యమైన సమస్యలను చర్చించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి వివిధ మార్గాలను విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగానీటి సంరక్షణ, అడవుల పెంపకం ప్రాముఖ్యతను వివరించారు. ఎక్కువ మొక్కలు నాటాలని, నీటి వృథాను అరికట్టాలని, వర్షపు నీటి సంరక్షణ ద్వారా వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి)’ ప్రతిపాదనను ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. అలాగే ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. వాయు కాలుష్యం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. మీతో సంభాషించడం నిజంగా చాలా ఆనందాన్నించ్చిందనీ, మీ అందరి నుండి చాలా నేర్చుకునే అవకాశం తనకు లభించిందంటూ సంతోషాన్ని ప్రకటించారు LIVE: President Droupadi Murmu teaches the students of Class IX of Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate, on completion of 2 year of Presidency https://t.co/FIrBrZp8qJ— President of India (@rashtrapatibhvn) July 25, 2024 -
రాష్ట్రపతితో కలిసి బ్యాడ్మింటన్ ఆడిన సైనా నెహ్వాల్ (ఫొటోలు)
-
పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం.. భారీగా తరలివచ్చిన భక్తులు
Live Updates..🙏జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్.🙏హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.🙏ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం అందరిది.. సర్వమతాలకు స్వేచ్ఛ, అవకాశాలను ఇస్తుంది. మా ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది. ఇస్కాన్ సంస్థ ప్రార్ధనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొన్నారు. 🙏 నేడు ఒడిశాలోని పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ద రథయాత్ర జరుగనుంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పూరీ చేరుకున్నారు. రథయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. #WATCH | Odisha: Two-day Lord Jagannath Rath Yatra in Puri to commence today. Along with lakhs of devotees, President Droupadi Murmu will also attend the annual festival. pic.twitter.com/7Q9WYQCJw5— ANI (@ANI) July 7, 2024 🙏ఇంత వరకు భారత రాష్ట్రపతులు ఎవరూ పూరీ రథయాత్రలో పాల్గొనలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్ రఘుబర్దాస్తో కలిసి సుభద్రమ్మ రథం లాగుతారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రెండురోజుల రథయాత్రలో 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూరీ పట్టణానికి మూడంచెల భద్రత కల్పించారు. #WATCH | Odisha: Security around Lord Jagannath temple in Puri increased ahead of the Rath Yatra which will commence today. pic.twitter.com/ExMFCNfAuu— ANI (@ANI) July 7, 2024 🙏కాగా, నేడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా వెళ్లి పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి. #WATCH | Bhubaneswar: Odisha-based miniature artist L Eswar Rao crafts an eco-friendly chariot in connection with the Jagannath Puri Rath Yatra. (06.07) pic.twitter.com/Hgpxl8Eym2— ANI (@ANI) July 7, 2024 🙏ఇక, ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకేరోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు వేడుకలు ఆదివారం ఉండడంతో జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళన్ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకొనే పరిస్థితి లేదు. #WATCH | Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah along with his wife Sonal Shah at Jagannath Temple. pic.twitter.com/FQ6FeFytyz— ANI (@ANI) July 6, 2024 🙏మరోవైపు.. పూరీ రథయాత్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని జగన్నాథుని ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని పూరీ ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
టీడీపీ నేతల అరాచకాలపై రాష్ట్రపతికి వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
-
రాష్ట్రపతి కలిసిన తరువాత ఎంపీ గుమ్మ తనూజ రాణి రియాక్షన్
-
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్పై చేరుకున్నారు. లోక్సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్పై పార్లమెంట్కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
‘పారిస్ నుంచి పతకాలతో తిరిగి రండి’
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ‘బెస్ట్ విషెస్’ చెప్పారు. పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో ఆమె మన ఆటగాళ్లు ఎక్కువ పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ‘ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో భారత యువ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు పోటీల్లో రికార్డు సంఖ్యలో పతకాలు గెలుస్తున్నారు.కొద్ది రోజుల్లో పారిస్లో ఒలింపిక్స్లో ప్రారంభం కానున్నాయి. అందులో పాల్గొనే ప్రతీ భారత అథ్లెట్లను చూసి మేం గర్విస్తున్నాం. వారికి నా అభినందనలు’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. మరోవైపు 2036 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేసే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. మన ఘనతలను మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో భారత ఒలింపిక్ సంఘం 2036 ఒలింపిక్స్ కోసం బిడ్ వేసేందుకు సిద్ధమవుతోందని ముర్ము అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ కోసం జరిగే బిడ్లో ఖతర్, సౌదీ అరేబియా, ఇండోనేసియా లాంటి దేశాలతో భారత్ పోటీ పడే అవకాశం ఉంది. -
తాడేపల్లి వైఎస్సార్ సీపీ కార్యాలయం కూల్చివేతపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్
-
పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
-
నీట్ పేపర్ లీక్ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. పార్లమెంట్లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ, సాక్షి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 18వ లోక్సభ కొలువుదీరడంతో.. ఆనవాయితీ ప్రకారం గురువారం ఉదయం ఆమె పార్లమెంట్కు విచ్చేసి ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి తన ప్రసంగం వినిపించారు. అదే సమయంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ విజయాలను, రాబోయే ఐదేళ్ల కాలపు లక్ష్యాలను.. పలు కీలకాంశాలను ఆమె తన ప్రసంగం ద్వారా చదివి వినిపించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి మీరంతా (లోక్సభ సభ్యులు) సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించింది. జమ్ముకశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈసారి కశ్మీర్ లోయలో మార్పు కన్పించింది. శత్రువుల కుట్రలకు అక్కడ ప్రజలు గట్టిగా బదులిచ్చారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొనడం విశేషం. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు రూ.3.20లక్షల కోట్లు ఇచ్చాం. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. ఈ రోజుల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా భారత్ ఉత్పత్తులు అందిస్తోంది. ఆరోగ్య రంగంలో దేశం అగ్రగామిగా ఉంది. ఆయుష్మాన్ భారత్ అనేది గేమ్ ఛేంజర్గా నిలుస్తోంది. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కింద సేవలు కల్పిస్తున్నాం. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. నారీమణుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఈ రంగంలో భారీగా పెట్టబడులు పెట్టాం. ప్రపంచ వృద్ధిలో భారత్ 15శాతం భాగస్వామ్యం అవుతోంది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గ్రీన్ ఎనర్జీ సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా రోడ్ల విస్తరణ జరుగుతోంది. పౌర విమానయాన రంగంలో పలు మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. డిజిటల్ ఇండియా సాధనకు ప్రభుత్వం సంకల్పించింది. బ్యాంకుల క్రెడిట్ బేస్ పెంచి వాటిని బలోపేతం చేశాం. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. సైనిక దళాల్లో స్థిరమైన సంస్కరణలు రావాలి. మన బలగాలు స్వయంసమృద్ధి సాధించాయి. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛను అమలు చేశాం. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి. అత్యయిక స్థితి నాటి రోజుల్లో దేశ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. కానీ అటువంటి రాజ్యాంగ విరుద్ధ శక్తులపై వ్యతిరేకంగా దేశం విజయం సాధించింది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు విభజన శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఏ చర్యనైనా మనమంతా తీవ్రంగా ఖండించాలి. పేపర్ లీకేజీ అంశంపైనా.. ఇటీవల నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్రత ఉండాలి. పారదర్శకంగా జరగాలి. పేపర్ లీక్లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్, తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్ లీకేజీ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ముర్ము తెలిపారు.అంతకు ముందు.. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతికి గజ ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి ప్రథమ పౌరురాలు ప్రసంగం చేశారు. 18వ లోక్సభకు ఎన్నికైన సభ్యులను అభినందించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం.. ప్రధాని మోదీ ఎంపీలను రాష్ట్రపతి ముర్ముకు పరిచయం చేశారు. -
Charlotte Chopin: యోగవికాసానికి పద్మ పురస్కారం!
నూటొక్క వసంతాలను చూసిన చార్లోట్ చోపిన్ ఈ ఏడాది మే నెలలో మనదేశం అందించే అత్యున్నత పద్మపురస్కారాన్ని అందుకున్నారు. ఆమె పుట్టి వందేళ్లు దాటింది. నిజమే, 1922, డిసెంబర్ 11వ తేదీన ఫ్రాన్స్లోని చేర్ పట్టణంలో పుట్టారామె. యాభై ఏళ్ల వయసులో ఆమె ఎదుర్కొన్న శారీరక, మానసిక రుగ్మతలకు సమాధానంగా యోగసాధన ప్రారంభించారు చార్లోట్. అప్పటి నుంచి ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది.తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని అంతటితో సంతృప్తి చెందలేదామె. యోగసాధన గురించి ప్రపంచానికి తెలియచేయాలని కంకణం కట్టుకున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఆనందానికి, ఆహ్లాదకరమైన జీవనానికి యోగసాధనను మించినది మరొకటి లేదని వర్క్షాప్లు పెట్టి అవగాహన కల్పించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మశ్రీ అందుకుంటున్న చార్లోట్ చోపిన్ఫ్రాన్స్లో పరిమళించిన మనప్రాచీన విద్య..చార్లోట్ 1982 లో చేర్ పట్టణం నుంచి యోగసాధన పట్ల అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. యోగసాధన వల్ల లభించే ప్రయోజనాలను వివరిస్తూ, యోగసాధన నేరి్పస్తూ ఫ్రాన్స్ మొత్తం పర్యటించారామె. ఫ్రెంచ్ టీవీలో ‘ఫ్రాన్స్ గాట్ ఇన్క్రెడిబుల్ టాలెంట్’ ్రపోగ్రామ్ ద్వారా దేశమంతటా యోగ విద్యను విస్తరింపచేశారు. ఆమె తాను నివసిస్తున్న చేర్ పట్టణంలో స్వయంగా వేలాది మందికి నేరి్పంచారు. దేశవిదేశాల్లో యోగవిద్య విస్తరించడానికి ఆమె విశేషమైన కృషి చేశారు.ప్రాచీనమైన యోగవిద్య మనికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఏకైకమార్గమని ప్రపంచానికి చాటారు చార్లోట్. యోగసాధనకు వయసుతో సంబంధం లేదని, అందుకు తానే పెద్ద నిదర్శనమని అనేక సందర్భాల్లో చె΄్పారామె. తన ఆరోగ్య రహస్యం యోగసాధన అని 2024, మే, 9వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న సందర్భంగా కూడా చె΄్పారు చార్లోట్ చోపిన్.ఇవి చదవండి: Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె -
లోక్సభ పొట్రెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్.. నియమించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: లోక్ సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95(1) ప్రకారం ఎంపీ భర్తృహరి మహతాబ్ను ప్రోటెం స్పీకర్గా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు.మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన ఎంపీలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనున్నారు. అప్పటి వరకు ప్రొటెం స్పీకర్ తాత్కాలికంగా విధులు నిర్వహిస్తారు.కాగా భర్తృహరి మహతాబ్ ఒడిశాలోని కటక్ స్థానం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. తొలుత బీజేడీ నుంచి పోటీ చేసిన ఆయన.. ఇటీవల ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. బీజేడీ అభ్యర్థి సంత్రుప్ట్ మిశ్రాపై విజయం సాధించారు. ఒడిశా మొదటి ముఖ్యమంత్రి హరేక్రుష్ణ మహతాబ్ కుమారుడే మహతాబ్, 2024లో కటక్లో మళ్లీ గెలుపొందారు. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
-
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. My warm wishes and greetings to the honourable President of India Smt Droupadi Murmu garu @rashtrapatibhvn on her birthday.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 20, 2024 -
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం: ప్రధాని మోదీ సహా ఖండించిన నేతలు.. 10కి చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్: జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. ఈ ఉగ్రదాడి వెనక ఇద్దరు పాకిస్తానీయులు ఉన్నట్లు భద్రతా దళాలు సోమవారం గుర్తించాయి. నిందితుల కోసం పోలీసులు, ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. రాజౌరి, పూంచ్, రియాసిలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొండ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లతో ఉగ్రవాదులను గాలిస్తున్నారు. జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. జమ్ములోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించుకొని తిగిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు తెగపడ్డారు. ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 53 మంది యాత్రికులు ఉన్న బస్సు శివ్ ఖోరి నుంచి కాట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం వైళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడటంతో బస్సు పదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.#WATCH | Security heightened in Jammu & Kashmir's Reasi.Morning visuals from the area where a bus carrying pilgrims was attacked by terrorists led to the loss of 10 lives. pic.twitter.com/9i93KKbhzc— ANI (@ANI) June 10, 2024 రాజౌరి, పూంచ్, రియాసి ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులపై వేట కోసం పోలీసులు, ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. యాత్రికులపై ఉగ్రవాదుల దాడిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా ఖండిచారు.‘ప్రధాని మోదీ దాడి ఘటపై స్పందించారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. బాధితులు, వారి కుటుంబాలకు సాయం అందిచాలని మోదీ ఆదేశించారు. ఈ దాడికి పాల్పడినవారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. గాయపడినవారికి మెడికల్ సాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మృతి చెందిన వారికి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని అన్నారు.దాడిపై స్పందించిన రాష్ట్రపతి‘జమ్ము కశ్మీర్లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన నన్ను కలచివేసింది. ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు, బాధితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో స్పందించారు.I am anguished by the terrorist attack on a bus carrying pilgrims in Reasi district of Jammu and Kashmir. This dastardly act is a crime against humanity, and must be condemned in the strongest words. The nation stands with the families of the victims. I pray for the speedy…— President of India (@rashtrapatibhvn) June 9, 2024 కేంద్రమంత్రి అమిత్ షా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ‘జమ్ము కశ్మీర్ ఎల్జీ, డీజీపీ ద్వారా ఉగ్రదాడి పరిస్థితిని తెలుసుకున్నా. ఈ దాడికి పాల్పడినవారిని వదిపెట్టము. వారిపై కచ్చింతంగా చర్యలు తీసుకుంటాం. మృతిచెందినవారి కుటుంబాలుకు సానుభూతి తెలుపుతున్నా’అని అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఉగ్రవాద దాడి పరికిపంద చర్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండిచారు. ‘చాలా విషాదకరమైన ఘటన. ఈ దాడితో జమ్ము కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయే తెలస్తోంది’అని ఎక్స్లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్రంగా ఖండిచారు.जम्मू-कश्मीर के रियासी ज़िले में, शिवखोड़ी मंदिर से तीर्थयात्रियों को ले जा रही बस पर हुआ कायरतापूर्ण आतंकी हमला अत्यंत दुखद है।यह शर्मनाक घटना जम्मू-कश्मीर के चिंताजनक सुरक्षा हालातों की असली तस्वीर है।मैं सभी शोक संतप्त परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और…— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2024యాత్రికుల బస్సుపై ఉగ్రవాదలు దాడి చేయటం ఇది రెండోసారి. 2017లో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 7 మంది మృతి చెందగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
వినయంగా ఉండండి.. కష్టపడి పని చేయండి
న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించకుండా వినయంగా ఉన్న నాయకులనే ప్రజలు అభిమానిస్తారని నరేంద్ర మోదీ చెప్పారు. అందుకే వినయంగా ఉండాలని నూతన మంత్రులకు సూచించారు. రుజువర్తన, పారదర్శకత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని చెప్పారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలకు మోదీ తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనపై ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని అన్నారు. మీకు అప్పగించిన పనిని నిజాయతీగా పూర్తి చేయండి అని సూచించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరికీ తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని పేర్కొన్నారు. మంత్రులు అందరితో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను గౌరవించాలని చెప్పారు. అందరిని కలుపుకొనిపోవాలని, బృంద స్ఫూర్తితో పని చేయాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. -
ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్!
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను రాష్ట్రపతి భవన్కి ఆహ్వానించారు. ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు సూచనగా.. దహీ చీనీని రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే స్వహస్తాలతో మోదీకి అందించారు. ఇలా ఎందుకు తినిపిస్తారు? ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత.లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయ దుందుభి మోగించారు. ఆ తర్వాత నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భాగస్వామ్య పక్షాలన్నీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని రాష్టపతి భవన్కి ఆహ్వానించారు. ముచ్చటగా మూడోసారి పదవిని అంకరిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుతూ.. మోదీకి దహీ-చీనీని తినిపించారు రాష్టపతి ముర్ము. ఈ ఆచారం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ స్వీట్ తీసుకోవడం అనాదిగా జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే..Dahi-Cheeni Tradition of Bharat. 🇮🇳 https://t.co/ojqpaw7LuE pic.twitter.com/BGYznrKWra— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 7, 2024 దహీ-చీనీ అంటే..పెరుగు-పంచదార లేదా బెల్లంతో కూడిన స్వీట్. దీన్ని దహీ-చీనీ అంటారు. ఈ స్వీట్ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే పెద్దలు, పిల్లలకు ఇలా పెరుగుతో కూడిన బెల్లం లేదా చక్కెరను తినిపిస్తారు. ఇలా చేస్తే వారికి మంచి అదృష్టం, విజయం లభిస్తుందని పెద్దల నమ్మకం. ఇలా దహీ చీనీని తినడం వెనుకు పెద్ద శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో దహీని కపా-వర్థక్ అని అంటారు. అంటే శరీరానికి స్వాంతన చేకూర్చి, ప్రశాంతతను ఇచ్చేది అని అర్థం. వేసవిలో దీన్ని తీసుకోవడంలో శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో కలిపే పంచదార లేదా బెల్లం శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. ఈ రెండింటి కలియిక ఒత్తిడిని తగ్గించి, అలసటను దూరం చేస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. దీనిలో కాల్షియం, రిబోఫ్లేవిన్, బీ6, బీ12 ఉంటాయి. ముఖ్యంగా పెరుగులో ఉండే బ్యాక్టీరియా శరీరానికి మంచి ప్రోబయోటిక్స్ని అందించి ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని తీపి శరీరానికి తక్షణ ఎనర్జీని ఇచ్చే ఇంధనంగా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. భారతీయ సంప్రదాయంలో ఉండే కొన్ని ఆచారాలు సైన్సుతో ముడిపడి ఉంటాయి. అవి మానవుల హితార్థం ఏర్పరిచినవే. కాగా, ఇక్కడ మోదీ ప్రధానిగా మంచి పాలను ప్రజలకు అందించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను సునాయాసంగా జయించి కీర్తి గడించాలని కోరుకుంటూ ఈ దహీ చీని రాష్ట్రపతి తినిపించడం జరుగుతుంది. అంటే నీకు మంచి జరగాలని ఆశ్వీరదిస్తూ ఓ మధురమైన స్వీట్తో పని ప్రారంభిస్తే..ఆ మధురమైన తీపి పదార్థం వలే పనులన్నీ ఆనందాయకంగా చకచక అవుతాయని అర్థం. అలాగే మనం కూడా మంచి జరిగినా, ఏదైనా విజయం సాధించిన స్వీట్లతోనేగా వేడుక చేసుకుంటాం. అయితే ఇక్కడ మన సంప్రదాయం ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఈ స్వీట్తో ప్రారంభించమని చెబుతుతోంది.(చదవండి: మృగశిర కార్తెకు ఆ పేరే ఎలా వచ్చింది? బెల్లం ఇంగువ ఎందుకు తింటారు?) -
వచ్చే ఐదేళ్లు దేశ సేవకే అంకితమవుతాం: నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి తెలిపారు. ఎన్డీయే కూటమి ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి మోదీ అందజేశారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘ 18వ లోక్సభ చాలా ప్రత్యేకం. ఎన్డీయేకు మూడో సారి దేశ సేవ చేసే భాగ్యం లభించింది. ఈ అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ధన్యవాదాలు. వచ్చే ఐదేళ్లు దేశసేవకే అంకితమవుతాం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పూర్తి చేసేందుకు శ్రమిస్తాం. ఎన్డీయే నేతలు నన్ను మరోసారి పక్ష నేతగా ఎన్నుకున్నారు. ముమ్ముందు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. ఆజాదీగా అమృత్ ఉత్సవాల తర్వాత ఇదే తొలి ఎన్నిక. మంత్రి మండలి జాబితా ఇవ్వాలని రాష్ట్రపతి కోరారు. ఎల్లుండి సాయంత్రం ప్రమాణస్వీకారం సౌకర్యంగా ఉంటుంది. మంత్రుల జాబితాను రాష్ట్రపతికి అందజేస్తాను’ అని మోదీ తెలిపారు.NDA will form a strong, stable and growth-oriented government. Speaking outside Rashtrapati Bhavan. https://t.co/qstllaPjna— Narendra Modi (@narendramodi) June 7, 2024 భాగస్వామ్య పక్షాల నేతలు వెంటరాగా.. మోదీ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారాయన. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్మును మోదీని ఆహ్వానించారు.జేపీ నడ్డా నివాసంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తుమంత్రివర్గ కూర్పుపై ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కసరత్తు జరుగుతోంది. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. బీజేపీ అగ్ర నేతలు.. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేతో చర్చలు జరిపారు.ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము -
ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. భాగస్వామ్య పక్షాల నేతలు వెంటరాగా.. మోదీ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారాయన. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్మును మోదీని ఆహ్వానించారు.#WATCH | Delhi: Narendra Modi meets President Droupadi Murmu at the Rashtrapati Bhavan and stakes claim to form the government. He was chosen as the leader of the NDA Parliamentary Party today. pic.twitter.com/PvlK44ZC2x— ANI (@ANI) June 7, 2024ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావటం ఇప్పటికే ఖరారైంది. ఆదివారం సాయంత్రం మోదీ ప్రధానిగా కర్తవ్యపథ్లో ప్రమాణం చేయనున్నారు.ఎన్డీయే కూటమిలోని పార్టీల ఎంపీలు ఇవాళ ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలువగా.. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేకపోయింది. దీంతో బీజేపీ కూటమిలోని మిత్ర పక్షాల మద్దతు మరోసారి కేంద్రంలో ప్రభుత్వం కొలుదీరనుంది.మరోవైపు.. కేంద్ర మంత్రి పదవులపై నిన్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయితే రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎన్డీయే నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగబోయే భేటీకి మిత్రపక్షాల నేతలంతా హాజరుకానున్నారు. ఇప్పటికే అమిత్ షా, అజిత్ పవార్లు నడ్డా నివాసానికి చేరుకున్నారు. మంత్రి వర్గ కూర్పుపై ఈ భేటీలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
Droupadi Murmu In Ayodhya: అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (ఫొటోలు)
-
ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని విచారం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భారీ గుంతలో బస్సు బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతిచెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు బోల్తాపడింది. కాగా, ఓ డిస్టిలర్లీ సంస్థకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక, రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 12మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. President Droupadi Murmu tweets, "The news of many people getting killed in a bus accident in Durg district of Chhattisgarh is very sad. My deepest condolences to all the bereaved families! I wish for the speedy recovery of the injured." pic.twitter.com/bkqAVvKGNR — ANI (@ANI) April 9, 2024 మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఇక, ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. छत्तीसगढ़ के दुर्ग में हुआ बस हादसा अत्यंत दुखद है। इसमें जिन्होंने अपने प्रियजनों को खोया है, उनके प्रति मेरी संवेदनाएं। इसके साथ ही मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की निगरानी में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है। — Narendra Modi (@narendramodi) April 9, 2024 ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. దుర్గ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయం అందించడంలో నిమగ్నమై ఉందన్నారు. ఛత్తీస్గఢ్ సీఎం బస్సు ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ సందర్బంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. #WATCH | Chhattisgarh: On Durg bus accident, SP Jitendra Shukla says, "Today around 8.30 pm, workers of a distillery were leaving after their shift ended... All the people were rescued and admitted to various hospitals. As per data so far, 12 people have died... * people who were… pic.twitter.com/MPPa3rrIhl — ANI (@ANI) April 9, 2024 -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!
భారత రాష్ట్రపతిగా ఆ అత్యున్నత పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కురాలు ద్రౌపది ముర్ము. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండో మహిళ ఆమె. అంతేగాదు ఈ పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళ కూడా ఆవిడే కావడం విశేషం. రాష్ట్రపతిగా అనునిత్యం బిజీగా ఉండే ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఆమె డైట్ ఎలా ఉంటుందనే కుతుహలం ఉంటుంది. అయితే ఆమె ఏం డైట్ ఫాలో అవ్వుతారో రాష్ట్రపతి భవన్ చెఫ్లు వెల్లడించడమేగాక పలు ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు. అవేంటంటే.. ద్రౌపది ముర్ము సాత్విక ఆహారాన్నే ఇష్టపడతారని, ప్రధానంగా శాకాహారమే ఇష్టంగా తింటారని రాష్ట్రపతి భవన్ చెఫ్లు పేర్కొన్నారు. ఆమె 2022లో షెడ్యూల్డ్ తెగకు చెందిన మొదటి సభ్యురాలిగా, భారత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేగాదు ఆమె తన తెగకు చెందిన ప్రజల గొంతుకగా మారి వారి సంక్షేమం కోసం కృషి చేసి ప్రజల ఆదరాభిమానలను పొందారు. అలాంటి మహోన్నత వ్యక్తి ముర్ము తను తీసుకునే ఆహారం విషయంలో సాత్వికాహారానికే పెద్దపీట వేస్తారని చెఫ్లు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు, ఉప్పు, కొత్తిమీర, పచ్చి బొప్పాయితో చేసే వంటకాన్ని కచ్చితంగా చేయాల్సిందేనని అన్నారు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా వండిన భోజనాన్నే తినడానికి ఇష్టపడతారట ఆమె. ఇక ఆమె ఓట్స్, సంప్రదాయ పూరీ ఆలు సబ్జీ కలియకతో కూడిన అల్పాహారంతో రోజుని ప్రారంభిస్తారని సీనియర్ కుక్ చెఫ్ సంజయ్ కుమార్ చెప్పారు. ఆమెకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లలో రైస్ చిల్లాస్ ఒకటని అన్నారు. తరచుగా ఆమె ఒడియా వంటకాలనే ఇష్టపడతారని తెలిపారు. 2000 నుంచి 2009 వరకు రాయ్రంగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒడిశా శాసనసభ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేయడంతో ఆ రాష్ట్రంతో ఆమెకున్న విడదీయరాని అనుబంధం అమె అభిరుచిలో ప్రతిబింబిస్తోందని అన్నారు. అందువల్లే ఆమె భోజనంలో ఒడియా వంటకాలైన దాల్మా, సంతులా వంటకాలు కచ్చితంగా ఉంటాయని చెప్పారు. దాల్మా అనే వంటకం చిక్పీస్, మునగకాయలు, బొప్పాయి వంటి కూరగాయాలతో కూడిన ఆహారం. ఇక సంతులా అంటే కాలానుగుణ కూరగాయాలతో చేసే మిశ్రమ వంటకం. ఈ రెండు సాత్వికాహారానికి చెందినవేనని చెబుతున్నారు చెఫ్లు. ఆమె కాలానుగుణ కూరగాయాలకు, పండ్లకు ప్రాముఖ్యత నిస్తారని తెలిపారు. కాగా, ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే ఈ సాత్వికాహార డైట్ వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. సాత్వికాహారంతో ఒనగురే ప్రయోజనాలు.. మెరుగైన జీర్ణక్రియ, పోషకాల శోషణ శరీరానికి అవసరమయ్యే శక్తి స్థాయిలు అందిస్తుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది బరువుని అదుపులో ఉంచుతుంది సుదీర్ఘ ఆయుర్ధాయం ఉంటుంది. (చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, ఆ మహిళే) -
అద్వానీకి భారతరత్న అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ భారతరత్న అందుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆదివారం అద్వానీకి భారతరత్నను ప్రదానం చేశారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ కలిసి ఆదివారం అద్వానీ ఇంటికి వెళ్లారు. అనంతరం, అద్వానీకి భారతరత్నను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, వెంకయ్యనాయుడు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక, నిన్న (శనివారం) పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరీ ఠాకూర్కు భారతరత్నలను అందజేసిన విషయం తెలిసిందే. #WATCH | President Droupadi Murmu confers Bharat Ratna upon veteran BJP leader LK Advani at the latter's residence in Delhi. Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, former Vice President M. Venkaiah Naidu are also present on this occasion. pic.twitter.com/eYSPoTNSPL — ANI (@ANI) March 31, 2024 -
Bharat Ratna : భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి (ఫొటోలు)
-
రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం
-
భారతరత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్బంగా ఇటీవల భారతరత్న పొందిన వారు అవార్డులను స్వీకరించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్.. అలాగే, ఎమ్ఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ను మరణానంతరం భారతరత్న అవార్డు వరించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు. చౌదరి చరణ్ సింగ్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు జయంత్ చౌదరి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమారుడు రామ్నాథ్ ఠాకూర్. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ తరపున భారతరత్న పురస్కారం అందుకున్న ఆయన కుమార్తె డాక్టర్ నిత్య. #WATCH | President Droupadi Murmu confers Bharat Ratna upon former PM Chaudhary Charan Singh (posthumously) The award was received by Chaudhary Charan Singh's grandson Jayant Singh pic.twitter.com/uaNUOAdz0N — ANI (@ANI) March 30, 2024 అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ. దీంతో, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ రేపు(ఆదివారం) ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందించనున్నారు. #WATCH | President Droupadi Murmu presents the Bharat Ratna award to former PM PV Narasimha Rao (posthumously) The award was received by his son PV Prabhakar Rao pic.twitter.com/le4Re9viLM — ANI (@ANI) March 30, 2024 అయితే, ఇటీవలే ఐదుగురికి కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగానే నేడు భారతరత్నల ప్రదానం జరిగింది. ఇక, ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు నాయకులు పాల్గొన్నారు. పీవీ కుటుంబ సభ్యుల హర్షం.. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం సంతోషంగా ఉంది -శారద, పీవీ నరసింహారావు కూతురు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరైన దిశలో నడిపించారు. ఆయన చేసిన కృషికి భారతరత్న అవార్డు నిదర్శనం. నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.- జస్టిస్ శ్రవణ్ కుమార్, పీవీ మనవడు యూపీఏ హయంలోనే పీవీకి భారతరత్న రావాలి. అవార్డు ఆలస్యం అయినా, ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించడం సంతోషం. పీవీ నరసింహారావుకు అనేక అవమానాలు జరిగాయి. ఆయన చేసిన మంచి పనులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు- సుభాష్ , పీవీ.మనవడు. -
ధ్యానంతోనే మనస్సు నియంత్రణ
సాక్షి, హైదరాబాద్/నందిగామ: ధ్యానంతోనే మనస్సు నియంత్రణలో ఉంటుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతివనంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి శుక్రవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రపంచశాంతికి మొదటగా మనలో మనం మార్పు చెందాలని, అనంతరమే ఇతరుల్లో మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. వ్యక్తులంతా నిస్వార్థంగా పనిచేస్తే మానవాళి సరైన మార్గంలో నడిచేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని సర్వమతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను ఒక చోటకు తీసుకురావడం, అందరూ శాంతికి పాటుపడటం గొప్ప విషయమన్నారు. అన్ని మతాల్లోని వారిని చైతన్యం చేయడమే ఆధ్యాత్మిక చైతన్యమని, ఎలాంటి వివక్షకు తావులేకుండా ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వశాంతికి ఈ సమ్మేళనం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. బుద్ధుడు, జగద్గురు శంకరాచార్య, కబీర్, సంత్ రవిదాస్, గురునానక్తోపాటు స్వామి వివేకానంద ప్రపంచానికి ఆధ్యాత్మిక సారం అందించారని రాష్ట్రపతి గుర్తుచేశారు. మహాత్మగాంధీ రాజకీయాల్లో ఆధ్యాత్మిక విలువలను సమగ్రపరిచారని, అందుకే అయన్ను సబర్మతీ సంత్ అని పిలుస్తామన్నారు. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన నైతిక ఆదర్శాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని íపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు ఒకే వేదికపైకి రావడం హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ దాజీ గొప్పదనం అని ఆమె కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ మాట్లాడుతూ ప్రపంచానికి 21వ శతాబ్దంలో ఆర్థికపరంగా, ఆధ్యాత్మికంగా మన దేశం మార్గదర్శకంగా నిలుస్తుందని వందేళ్లకు పూర్వమే స్వామి వివేకానంద జోస్యం చెప్పారన్నారు. రామచంద్రమిషన్ అధ్యక్షుడు కమలేశ్ డీ పటేల్ (దాజి) మాట్లాడుతూ మతాలకతీతంగా మానవజాతి దృఢంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ఈ సదస్సులో అపోలో ఆస్పత్రుల సీఎస్ఆర్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. ప్రజలు నిరంతరం జీవితంతో పోరాడే ఒత్తిడిలో ఉన్నారని, వారి జీవితం మారాలంటే సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలని సూచించారు.చినజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రతి మనసు ప్రేమమయం కావాలని, ప్రతి పువ్వు మధురమైన మకరందాన్ని నింపుకున్నట్టు ప్రతి మనిషి ప్రేమ తత్వాన్ని మనసులో నింపుకోవాలన్నారు. అంతకు ముందు ద్రౌపది ముర్ముకు కాన్హా శాంతివనం గురుజీ కమ్లేష్ పటేల్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడే ఓ మొక్క నాటారు. ఆధ్యాత్మికవేత్తలు స్వామీగౌరంగదాస్, స్వామీ చిదానందసరస్వతి, స్వామి ముకుందానంద, యోగి నిరంజన్దాస్, నమ్రముని మహరాజ్ దాస్, దాజీ, దేవి చిత్రలేఖ, తారాచంద్ కంటాలే, డాక్టర్ భవానీరావు, దిల్షాద్, టోనీలాడర్, అభ్యాసీలు పాల్గొన్నారు. ఎయిర్పోర్టులో ఘన స్వాగతం శంషాబాద్: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఆమెను కలవడం ఆనందంగా ఉంది: ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్లోనే ఉంటోంది. ఇటీవలే అయోధ్యకు వెళ్లిన ఉపాసన కుటుంబం సభ్యులతో కలిసి బాలరామున్ని దర్శించుకున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్కు ఉపాసన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాసన తన ఇన్స్టాలో రాస్తూ.. ' ఈరోజు అంతర్గత ప్రపంచశాంతి కోసం హార్ట్పుల్నెస్ గ్లోబల్ మహోత్సవ్ పాల్గొనడం గౌరవంగా ఉంది. ముఖ్యంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని నా కుమార్తె క్లీంకారతో సహా కలవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా కమలేశ్ దాజీ నిజంగా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చారు. నేను నా బిడ్డను అన్ని సానుకూలతలను స్వీకరించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. హార్ట్పుల్నెస్ గ్లోబల్ మహోత్సవ్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో జరిగింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
రెండు దశల్లో 'జమిలి' ఎన్నికలు..
-
రెండు దశల్లో జమిలి ఎన్నికలు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు నివేదిక సమర్పించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ..ఇంకా ఇతర అప్డేట్స్
-
జమిలి ఎన్నికలు: రాష్ట్రపతికి నివేదిక అందించిన కోవింద్ కమిటీ
సాక్షి, ఢిల్లీ: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నేడు నివేదకను అందించింది. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి జరగాలని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, ఈ ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కోవింద్ సహా కమిటీ సభ్యులు సమర్పించారు. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. Union Home Minister Amit Shah was also present. pic.twitter.com/zd6e5TMKng — ANI (@ANI) March 14, 2024 కాగా, దాదాపు 190 రోజుల పాటు జమిలీ ఎన్నికలపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది. లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు సమాచారం. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, has met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. The Report comprises of 18,626 pages, and is an outcome of extensive consultations with… — ANI (@ANI) March 14, 2024 ఇదిలా ఉండగా.. ఏకకాల ఎన్నికల జరగాలని కేంద్రంలోని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్షా, లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. -
Infosys Sudha Murty: రాజ్య సుధ
సాటి మనుషుల కోసం పని చేయడం సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం యువతకు స్ఫూర్తిగా నిలవడం.. రచయితగా ఎదగడం ఇన్ఫోసిస్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి. ఉమెన్స్ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు. ► తొలి పాఠాలు సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది. ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్ టీచర్. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు. 1.సింపుల్గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే. ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది. ► కుతూహలమే గురువు చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది. విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె. ► మసాలా దోసె పార్టీ లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావ్. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్ క్లాస్లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది. ‘ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావ్ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్క్లాస్ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె. ► చరిత్ర మార్చిన కార్డు ముక్క 1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్లో ఆ యాడ్ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి. పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె. ► జీవితం అంతులేని పోరాటం ‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె. ► రాజ్యసభ సభ్యురాలు ‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి. ఇల్లాలే శక్తి నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు చైర్మన్ అయ్యాను. ఆ ఫౌండేషన్తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె. -
ఢిల్లీ మెట్రోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వార్తా సంస్థ ఏఎన్ఐ విడుదల చేసిన వీడియోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చుట్టూ భద్రతా అధికారులు నిలుచుని ఉన్నారు. మెట్రో నిర్వహణ గురించి డీఎంఆర్సీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ముర్ముకు తెలియజేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. #WATCH | President Droupadi Murmu takes a metro ride in Delhi. pic.twitter.com/Elc2pdUmHJ — ANI (@ANI) February 7, 2024