Ganga River
-
హరిద్వార్ గంగాజలం తాగడానికి పనికిరాదు
డెహ్రాడూన్: దేశంలో నదులు కాలుష్యం బారినపడుతున్నాయి. మురికి కూపాలుగా మారుతు న్నాయి. ఆయా నదుల్లో ప్రవహించే నీరు తాగడానికి వీల్లేకుండా పోతోంది. హిందువులు చాలా పవిత్రంగా భావించే గంగా నది జలాలకు సైతం ఇదే పరిస్థితి దాపురించింది. ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక ఇదే విషయం బహిర్గతం చేసింది. హరిద్వార్లో గంగా నదిలో ప్రవహించే నీటిపై అధ్యయనం చేశారు. 8 ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి, క్షుణ్నంగా పరిశీలించారు. ఈ నీరు బీ కేటగిరిలోకి వస్తుందని.. స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదని పీసీబీ తేల్చిచెప్పింది. గంగా జలం కాలుష్యమయం అవుతుండడం పట్ల స్థానిక పూజారులు ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వ్యర్థాల కారణంగానే గంగానది స్వచ్ఛతను కోల్పోతోందని చెప్పారు. -
Video: గంగా నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన ఇళ్లు
బిహార్ భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వర్షాల కారణంగా బిహార్లో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాధారణ నీటిమట్టాన్ని దాటి అధికంగా పారుతున్నాయి. చాలా చోట్ల గంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుంది.మమ్లాఖా జిల్లాలో గంగా నదీ ఉగ్రరూపానికి దాదాపు 10 ఇళ్లు కొట్టుకుపోయాయి. రెండు, మూడు అంతస్థుల నిర్మాణాలు సైతం నదిలోకి జారుకొని కొన్ని సెకన్లలో అవి అదృశ్యమయ్యాయి. భాగల్పూర్ జిల్లాలోని అనేక ఇళ్లు కేవలం 10 నిమిషాల్లో గంగానదిలో మునిగిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లు నీళ్లలో కొట్టుకుపోతుండగా పలువురు వీడియోలు తీయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి.#WATCH : These Videos from Bhagalpur, district of Bihar.. where a terrible flood was seen not in the Ganga, but in just 10 minutes many houses got washed away in the Ganga, thousands of families became homeless.#bhagalpur #BiharNews #Flood #flooding #Ganga pic.twitter.com/tNkBNbv1WL— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 24, 2024 -
Bihar: గంగా నదిలో పడవ మునక.. నలుగురు గల్లంతు
పాట్నా: బిహార్ రాష్ట్రం పట్నా జిల్లాలో గంగా నదిలో పడవ మునిగిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. బర్హ్ సబ్ డివిజన్లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పడవలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నది మధ్యలో ఉండగా పడవ బోల్తా పడి మునిగిందని, 13 మందిని రక్షించి, ఒడ్డుకు చేర్చామని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ శుభమ్ కుమార్ చెప్పారు. కనిపించకుండాపోయిన ముగ్గురు పురుషులు, ఒక మహిళ జాడ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. -
గంగా నదికి మోడీ ప్రత్యేక పూజలు
-
గంగాస్నానం ఎంత గొప్పదంటే...
గంగేమాం పాహి... అంటూ ముత్తుస్వామి దీక్షితార్ వారు చేసిన కీర్తన చివరి చరణాల్లో. ‘‘..సకల తీర్థమూలే సద్గురు గుహలీలే/వరజహ్నుబాలే వ్యాసాది కృపాలే’’ అంటారు. దీక్షితార్ వారి కీర్తికి ప్రధాన కారణం గంగమ్మ ప్రసాదంగా లభించిన వీణకాగా మరొకటి తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం. సద్గురువు అయిన గుహుడు.. సుబ్రహ్మణ్యుడు గంగానది ఒడ్డున ఆడుకునేవాడని అన్నారు. అక్కడ ఆడుకునేవాడని చెప్పడం వెనుక సుబ్రహ్మణ్య జననం గురించి గుర్తు చేస్తున్నాడు. శివవీర్యం తేజస్సు భరించలేని దేవతలు దానిని అగ్నిహోత్రునివద్ద ఉంచారు. ఆయన ఒకనాడు గంగమ్మ దగ్గరకు వెళ్ళి...‘‘ఇది దేవతాకార్యం. దీనిని నీవు ఉంచుకుని గర్భం ధరించు’’ అన్నాడు. గంగ అంగీకరించింది. అయితే శివ తేజస్సు శరీరం అంతటా ప్రవహించేసరికి తట్టుకోలేక..‘నేను వదిలిపెట్టేస్తాను.. ఎక్కడ వదిలిపెట్టేయను’ అనడిగింది. ‘‘రెల్లుగడ్డి పొదలో వదిలి పెట్టు’’ అని అగ్నిహోత్రుడు సలహా ఇచ్చాడు. అదే శరవణ భవ.. మంత్రం. అక్కడ సుబ్రహ్మణ్య జననం జరిగింది. అందువల్ల బాల సుబ్రహ్మణ్యుడు గంగానదీ ప్రవాహ తీరంలో ఆడుకునేవాడు. అదే సద్గురు గుహలీలే... అన్న చరణం. బ్రహ్మ, విష్ణు స్పర్శ పొందిన గంగ... సగరుల భస్మరాశిమీదుగా ప్రవహించడానికి పాతాళానికి భాగీరథుడి రథం వెంట పరుగెడుతూన్నది. మార్గమధ్యంలో జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచెత్తడంతో ఆయన ఆగ్రహించి మొత్తం గంగను తపశ్శక్తితో లోపలకు పుచ్చేసుకున్నాడు. భగీరథుడి అభ్యర్థన మేరకు మళ్ళీ విడిచిపెట్టాడు. అలా గంగ రుషి పుత్రిక జాహ్నవి అయింది. వ్యాసాది కృపాలే... అని కూడా అన్నాడు.. వ్యాసమహర్షికి గంగానది అంటే ఎంత వ్యామోహమో! పరమశివుడు శపిస్తే... గంగను, కాశీని వదిలిపెట్టి పోవడానికి వ్యాసుడు క్షోభిల్లాడు. గంగకు ఒకగొప్పదనం ఉంది. గంగావతరణమ్ గురించిగానీ, గంగను గురించిగానీ వింటే చాలు... అంటారు భీష్ముడు అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకుని ధర్మరాజుతో మాట్లాడుతూ –‘‘గంగానది పేరు తలచుకోవడం గానీ, గంగలో స్నానం చేయడం గానీ, ఒక చుక్క గంగనీటిని నాలుకమీద వేసుకోవడం గానీ చేయాలి. ఆచరించవలసినవే అయినప్పటికీ యజ్ఞయాగాదులకన్నా, బ్రహ్మచర్యం కన్నా, తపస్సుకన్నా, దానం కన్నా, గంగాస్నానం గొప్పది’’ అంటాడు. కాశీఖండంలో శ్రీనాథుడు...‘‘గౌరియొక్కతె యాకాశగంగ యొకతె/కాశియొక్కతె దక్షిణకాశి యొకతె/నలుగురును శంభునకు లోకనాయకునకు/రాణ్ వాసంబులనురాగ రసమ పేర్మి?’’ అని అంటాడు భీమేశ్వర పురాణంలో. అంటే గౌరిని ఎంతగా ప్రేమిస్తాడో శంకరుడికి గంగ, కాశి, దక్షిణ కాశి అన్నా కూడా అంతే అనురాగమట. ఎవరయితే భక్తితో గంగానది పేరు తలచుకుని ఒక్క గంగనీటి చుక్కను నాలుకమీద వేసుకుంటారో వారికి యమధర్మరాజుతో సంవాదం లేదన్నారు. అంటే వారికి యమదూతల దర్శనం ఉండే అవకాశం లేదు. అంతగొప్పగా గంగానదీ వైభవాన్ని కీర్తించిన ముత్తుస్వామి దీక్షితార్ వారి నోట కీర్తనల రూపంలో ప్రవహించిన శాబ్దికగంగను కూడా మనం నిత్యం వింటూ ఉండాలి. (చదవండి: అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!) -
ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు. అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో! మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు. తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా. అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట. ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గంగే మాం పాహి
విష్ణుమూర్తి స్పర్శచేత పరమపావనియైన గంగలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయన్నది సనాతన ధర్మ విశ్వాసం. అంటే... పాపాలు చేసి గంగలో మునిగి వాటిని పోగొట్టుకోవచ్చని అర్థం చేసుకోకూడదు. తెలిసో తెలియకో ఇప్పటివరకు చేసిన పాపాలు గంగాస్నానంతో పోగొట్టుకుని, ఇక మీదట ఎటువంటి పాపపు పనులు చేయకుండా నన్ను నేను నియంత్రించుకునే శక్తినీయవలసిందిగా భగవంతుని వేడుకోవాలి. అదే ధర్మాచరణం. వద్దన్న పని వదిలిపెట్టడమే ధర్మాచరణ. అది విష్ణువుకు ప్రీతిపాత్రం. ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగపై కీర్తన చేస్తూ... ‘‘గంగే మాం పాహి గిరీశ శిర స్థితే/గంభీర కాయే గీత వాద్య ప్రియే/అంగజ తాత ముదే అసి వరుణా మధ్యే/అక్రూర పూజితే అఖిల జనానందే...’’ అన్నారు. గంగమ్మ గొప్పదనాన్ని చెబుతూ... అక్రూరపూజితే అని కూడా అన్నారు. గంగను కీర్తిస్తూ అక్రూరుడి ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు ..? మిగిలిన పురాణాలన్నింటినీ వ్యాస భగవానుడు రాస్తే... విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి ఇచ్చాడు. శమంతకోపాఖ్యానం దీనిలోనిదే. అయితే ఇక్కడ గమ్మత్తయిన ఒక విషయం చెప్పుకోవాలి. వినాయక చవితినాడు వ్రత మహాత్మ్యంలో మనం ఒక కథ చదువుకుంటూంటాం. ఒక పసిపిల్ల ఉయ్యాల్లో ఉందనీ, ఆ పిల్లను కృష్ణుడు పెళ్ళి చేసుకున్నాడనీ, ఆమే జాంబవతి అనీ... ఇలా సాగుతుంది.. కానీ నిజానికి విష్ణు పురాణంలో చెప్పింది వేరు. ఉయ్యాల్లో ఉన్నది పసిపిల్లవాడు. దానిని ఊపుతున్న యవ్వని జాంబవతిని కృష్ణపరమాత్మ పెళ్లి చేసుకున్నాడు. వినాయక చవితి రోజున మిగిలిన కథను పూర్తిగా చదివినా చదవకపోయినా...‘‘...తవ హియేషా శమంతకః’’ అంటూ ముగిస్తారు. నిజానిక శ్రీకృష్ణుడు శమంతక మణివల్ల ఎన్ని కష్టాలుపడాలో అన్ని కష్టాలు పడ్డాడు. అటు సత్యభామకు దూరమయిపోయాడు, ఇటు జాంబవతికీ దూరమయ్యాడు. శమంతక మణిని కృష్ణుడే కాజేసాడని వారిద్దరే కాదు, బలరాముడు, ఇతర బంధువులు, ద్వారకానగరవాసులూ అందరూ అనుమానించారు. ఇంతకూ అసలు శమంతకమణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర. అక్రూరుడు ఎక్కడున్నాడు? అంటే... ఆ మణికి ఒక నియమం ఉంది. బాహ్యాభ్యంతర శౌచం ఎవరికుంటుందో వారిదగ్గర అది బంగారం పెడుతుంది, దాన్ని దాచుకోకుండా లోకసంక్షేమం కోసం వెచ్చించే పరమ భాగవతోత్తముడి దగ్గర ఉంటుంది. లేకపోతే చంపేస్తుంది. ప్రసేనుడు, సత్రాజిత్తు అలాగే చచ్చిపోయారు. కాబట్టి అది ఉన్నచోట నిత్యాన్నదానాలతో నవ వసంతశోభ ఉంటుంది. అలా కాశీ వెలిగిపోతున్నది కాబట్టి అక్కడ అక్రూరుడు ఉంటాడని భావించి ‘అక్కడికి వెళ్ళి అక్రూరుడిని పిలుచుకురండి’ అని కృష్ణుడు ఆదేశించాడు. గంగను పూజిస్తూ గంగలో స్నానం చేస్తున్న అక్రూరుడికి కృష్ణుడి సందేశం వినిపించగానే.. అక్రూరుడు వెళ్ళి ఆ శమంతకమణిని ఇవ్వబోతే...‘‘అంతః శౌచం, బాహ్య శౌచం’ నీలో ఉన్నాయి కనుక అది నీవద్దే ఉంచుకో’ అని కృష్ణుడు చె΄్పాడు. అక్రూరుడు ద్వారకానగరం వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు కాశీ వెళ్ళి అక్కడే ఉండిపోయాడు గంగకోసం. పరమ భక్తితో రోజూ పూజిస్తూ నిత్యం గంగలో స్నానం చేసేవాడు. శాస్త్రాలు చదవకపోయినా గంగానది ఒడ్డున గురువుగారి శుశ్రూషలో ఇన్ని విషయాలు తెలుసుకున్న దీక్షితార్ వారి కీర్తనల్లో అనేక శాస్త్ర రహస్యాలను ప్రస్తావిస్తారు. వాటిలో గంగను స్తుతిస్తూ చేసిన ఈ కీర్తన ఒకటి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Muthuswami Dikshitar: ఒక్కసారయినా అక్కడ పాడాలి
ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగే మాం పాహి... అంటూ కీర్తన చేస్తూ... గంగ వైభవాన్ని చాలా అద్భుతంగా కీర్తించారు. నీళ్ళబిందె తలమీద పెట్టుకుని ఆడుతుంటే ఎలా ఉంటుందో శివుడు తన జటాజూటంలో గంగను బంధించి తాండవం చేస్తుంటే ఆ దృశ్యం అలా ఉంటుందంటుంది రావణ కృత స్తోత్రం. భగీరథుడు ప్రార్థన చేస్తే వదిలిపెట్టాడు శివుడు గంగను. శంకరుడి శిరస్సు నుండి పాదాల వరకు తగిలి కిందకు ప్రవహించింది. ఆ గంగను ...ఆ నీళ్ళను తలమీద చల్లుకుంటే.. దేవతాస్థానాలనుంచి పడిపోతున్న వాళ్లుకూడా మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని పొందుతారట.. అటువంటి శక్తి ఆ గంగమ్మది. గంగే మాం పాహి గిరీశ శిరస్థితే/గంభీరకాయే గీత వాద్య ప్రియే/అంగజతాత ముదే అసి వరుణా మధ్యే....’’. అంటారు దీక్షితార్ వారు తమ కీర్తనలో. ఆమె ప్రవాహ తీరును గంభీర కాయే.. అన్నారు.. ఆమె శరీరం అలా ఉంటుందట.‘...శేషాహే రనుకారిణీ ...’ అంటారు శంకరులు. ఆది శేషుడు భూమి మీద పాకి వెడుతుంటే ఎలా ఉంటుందో గంగా ప్రవాహం అలా ఉంటుందంటారు ఆయన. శేషుడు ఉత్తర దిక్కున ఉంటాడు. ఆయనను స్మరిస్తే మనకున్న ఆపద లు తొలగుతాయని ఒక నమ్మకం. కాశీలో గంగకున్న విశేష లక్షణం ఏమిటంటే... అప్పటివరకు దక్షిణానికి ప్రవహించిన గంగానది అక్కడ ఉత్తర దిక్కుకు మళ్ళుతుంది. దానిని కాశీగంగ అంటారు. అక్కడ గంభీర శబ్దంతో ప్రవహించే గంగను సంగీత వాద్య ప్రియే ... అని కూడా అన్నారు. ఎందుకలా!!! గంగమ్మకు గీతమన్నా, సంగీతమన్నా ఇష్టమట. గంగ ఒడ్డున కూర్చుని పాట పాడినా, వాద్యం మోగించినా, ఆలాపన చేసినా, నృత్యం చేసినా ఆమె సంతోష పడి పోతుందట. అంటే రాజోపచారాలన్నింటినీ అంత ప్రీతితో స్వీకరించగలిగిన భగవత్ స్వరూపం ఆమెది. అంటే నిజమయిన కళాకారుడు నిజజీవితంలో కోరుకోవలసింది ఏమిటంటే – ఒక్కసారయినా గంగ ఒడ్డున కూర్చుని తన ప్రదర్శన ఇచ్చి ఆమెను సంతోష పరచాలి, అని. కాశీలో ఇప్పటికీ ఒక ఏర్పాటు ఉంది. అక్కడ కొన్ని పడవలు అద్దెకిస్తారు. వాటితోపాటూ సంగీత విద్వాంసులు వస్తారు మనతో. వాద్యగోష్ఠి చేస్తారు. కొంతమంది తబలా, వయోలిన్, వీణ వాయిస్తే మరికొంతమంది పాడతారు. సూర్యోదయానికి ముందు తెల్లవారు ఝామున ... అసి, వరుణ – ఈ రెండింటి మధ్యలో అలా సంగీతం వింటూ పడవమీద వెడుతూ ఉంటే గంగమ్మ ప్రసన్నరాలవుతుందని అక్కడి వారి నమ్మకం. గీత వాద్య ప్రియే... అంగజ తాత ముదే... అసి వరుణా మధ్యే...దీక్షితార్ వారి కీర్తనలో కూడా ఇదే వ్యక్తమవుతుంది. అంగజ తాత ముదే... గంగమ్మ ఎవరు? అంగజుడు అంటే మన్మథుని తండ్రి.. మహావిష్ణువు. గంగమ్మ ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుందట. తన స్పర్శను పొంది గంగ పునీతమయింది. తిరిగి గంగ ఆ ప్రభావంతో సర్వ జనుల పాపాలను నశింప చేసి ధర్మరక్షణకు కారణమవుతున్నందువల్ల విష్ణువుకు ప్రీతిపాత్రమవుతున్నది అన్నారు ముత్తుస్వామి దీక్షితార్. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శంకరులు చెప్పిన చరమకాంక్ష
గంగాదేవి ఎంత గొప్పదంటే... ‘మాతా జాహ్నవీ దేవీ !’ అని సంబోధించారు ఆది శంకరులు. గంగాష్టకం చేస్తూ..‘‘మాతర్జాహ్నవి శంభూసంగమిలితే మౌషౌ నిధాయాఞ్జలిం/ త్వత్తిరే వపుషో వాసనసమయే నారాయణాం ఘ్రిద్వయమ్ / సనన్దమ్ స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే / భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ’’ అన్నారు. అమ్మా! అని పిలిచారు. నా శరీరం నుంచి ప్రాణాలు ఊర్థ్వముఖమై పోతుంటాయి. ఏదో ఒక సమయంలో శరీరం విడిచి పెట్టాలి కదా! ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ /తస్మాదపరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి’’పుట్టినవాడు శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. అమ్మా! నా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు నీ ఒడ్డున నిలబడి నా రెండు చేతులు తలమీద పెట్టి అంజలి ఘటించి నీవంక చూస్తూ.... నా ప్రాణాలు పైకి వెళ్ళిపోతుంటే... మిగిలిన వాళ్ళందరూ ఏడ్వ వచ్చుగాక! కానీ నాకు అది ఉత్సవం కావాలి’’ అన్నారు. భగవంతుడు లోపలినుంచి బయటికి ఉత్సవమూర్తిగా వస్తుంటే పరమానందంతో రెండు చేతులెత్తి నమస్కరించి ఎగిరెగిరి చూసినట్లు – నా ప్రాణాలు పైకి లేచిపోతుంటే – అమ్మా నేను ఆనందపడిపోవాలి. ఇంతకాలం ఎవరి పాదాలు పట్టి స్మరించానో ఎవరి గురించి చెప్పుకున్నానో వారి పాదపంజరం లోకి వెళ్ళిపోతున్నా.. ఈ శరీరం వదిలి పెట్టేస్తున్నా..... అని .. చెమటపట్టిన బట్టను ఎంత తేలిగ్గా వదిలేస్తామో, అంత తేలిగ్గా నా శరీరాన్ని వదిలిపెట్టేస్తూ, నా తల మీద నారాయణ మూర్తి పాద ద్వయాన్ని స్మరిస్తూ శివకేశవుల మధ్య భేదం లేకుండా బతికిన నేను చిట్టచివరన శరీరం విడిచిపెట్టేటప్పుడు ‘అమ్మా! నిన్ను చూడాలి’ అని అంటారు. గంగమ్మ వైభవాన్ని గురించి చెబుతూ ఆయన... ‘‘ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం/ పశ్చాత్పన్నగ శాయినో భగవతః పాదోదకం పావనమ్ / భూయః శంభుజటావిభూషణ మణిర్జహ్నోర్మహర్షే రియం / కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే’’ అన్నారు. ఆమె మొట్టమొదట శ్రీమహావిష్ణువు పాదాలను కడగడానికి పనికొచ్చింది. బ్రహ్మ సృష్టికర్త. ఆయన తన కమండలంలోని నీటితో విష్ణువు పాదాన్ని కడిగారు. అంటే ఆ కమండలంలో ఉన్నది గంగే. తరువాత శంభుని తలమీద పడింది. తరువాత జహ్ను మహర్షి తాగి తాను మళ్ళీ విడిచి పెట్టాడు. అలా ఋషి స్పర్శ పొందింది. అటువంటి గంగమ్మా! నా పాపాలన్నీ తొలగించు.. అని వేడుకున్నారు. దీక్షితార్ వారు దీనినంతటినీ దృష్టిలో పెట్టుకుని గంగే మాం పాహి.. గిరీశ శిరస్థితే... అన్నారు తన కీర్తనలో. గంగ శివుని తలను తాకింది.. ఎలా? వినయంతో తాకిందా !!! నిజానికి పైనుంచి పడిపోయేటప్పుడు చాలా అహంకారంతో పడింది. ‘ఈడ్చి అవతల పారేస్తాను పాతాళానికి..’’ అంటూ పడింది. అలా పడుతుంటే పరమ శివుడు..‘‘ఇంత అహంకరిస్తోంది గంగ. ఎలా వెళ్ళిపోతుందో, నన్నెంత లాగేస్తుందో చూస్తా..’ అనుకుంటూ.. పాండురంగడు నిలుచున్నట్లు నడుం మీద రెండు చేతులు పెట్టుకుని పైకి చూస్తూ నిలుచున్నాడు. పైనుంచి గంగ పడంగానే జుట్టుతో కట్టేసాడు.. జటాజూటంలో. అలా దానిలోకి ఏళ్లతరబడి అలా పడుతూనే ఉంది. శాస్త్రాలుగానీ మరేదయినా గానీ చదువుకోని దీక్షితార్ వారు చిన్న చిన్న పదాలతో చాలా గంభీరమైన భావాల్ని తన కీర్తనల్లో అద్భుతంగా పలికించారు. అదంతా గురువుల శుశ్రూష ఫలితంగా అబ్బిన విద్యాగంధం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
డేంజర్లో గంగా నది..!
-
బిహార్లో కూలిన తీగల వంతెన
పట్నా: రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భారీ తీగల వంతెన కూలిపోయింది. బిహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నిర్మాణంలో ఈ వారధి తొలుత రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గంగా నదిపై ఖగారియా.. అగువానీ, సుల్తాన్గంజ్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొంత భాగం కూలిపోవడంతో పునర్నిర్మించారు. రెండు నెలల క్రితం బలమైన ఈదురు గాలుల ధాటికి పగుళ్లు వచ్చాయి. ఆదివారం నేలకూలింది. దాదాపు ఐదు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేత విజయ్కుమార్ సిన్హా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పనిలోనూ కమిషన్లు తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయిందని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన ఆగిపోయిందని, ఆరాచకం, అవినీతి పెచ్చరిల్లిపోతున్నాయని ఆరోపించారు. ఇక్కడ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతుంటే సీఎం నితీశ్ విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
అదీ.. వాళ్ల వైఖరి: బ్రిజ్ భూషణ్
ఢిల్లీ: ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేస్తామని, ఆఫ్ట్రాల్ మెడల్స్ ఎంతని చెబుతూ.. తమ ఘనతలను గంగలో నిమజ్జనం చేసేందుకు భారత రెజ్లర్లు సిద్ధపడ్డారు. అయితే హరిద్వార్ వద్ద చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఆగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రెజ్లర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు కదా! అని రెజ్లర్లకు గుర్తు చేశారాయన. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు చేసిన ఆరోపణల్లో ఏమైనా నిజం ఉందని తేలితే.. అప్పుడు అరెస్ట్ జరుగుతుంది కదా పేర్కొన్నారాయన. ఇక గంగలో మెడల్స్ను విసిరేస్తామని రెజ్లర్లు హెచ్చరించడంపైనా ఆయన స్పందిస్తూ.. ‘‘హరిద్వార్కు వెళ్లారు. గంగలో పతకాలను నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. కానీ, తర్వాత వాటిని తికాయత్కు(రైతు సంఘాల నేత) అప్పగించారు. ఇదేనా వాళ్ల వైఖరి.. ఇంతకన్నా మనం ఏం చేయగలం అంటూ పెదవి విరిచారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో ఆవైపుగా ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజ్లర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాము సాధించిన మెడల్స్ ను మంగళవారం సాయంత్రం హరిద్వార్లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బ్రిజ్ భూషణ్ పై చర్చలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తమను ‘మా బిడ్డలు’ అని అంటూ ఉంటారని, కానీ ఆయన కూడా తమ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్ భూషణ్ను నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామని చెప్పారు. ఈ క్రమంలో గంగలో మెడల్స్ను నిమజ్జనం చేసేందుకు మంగళవారం సాయంత్రం హరిద్వార్ వద్దకు రెజ్లర్లు చేరుకోగా.. అక్కడ హైడ్రామా నెలకొంది. అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు సైతం ప్రయత్నించాయి. అయితే రైతు సంఘం నేత నరేష్ తికాయత్ జోక్యంతో రెజ్లర్లు శాంతించి.. బ్రిజ్పై చర్యలకు కేంద్రానికి ఐదురోజుల గడువు విధించారు. -
మెడల్స్ ను గంగ లో విసరనున్న రేస్లర్స్ ..
-
గంగానదీ పుష్కరాలు.. కాశీకి పోలేము రామా హరీ..!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి వారణాసి మీదుగా వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్లో వెయిటింగ్ లిస్టు 400ను దాటింది. మే మొదటివారం వరకు ఇదే పరిస్థితి. గత రెండు నెలల నుంచి వచ్చేనెల వరకు వెయింటింగ్ చూపుతున్నా ఈ మార్గంలో మరో అదనపు రైలును అధికారులు నడపటం లేదు. వారణాసి పుణ్యక్షేత్రానికి నిత్యం తెలంగాణ నుంచి దాదాపు రెండు వేలమంది భక్తులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించే గంగానదీ పుష్కరాలు ఈ నెల 22 నుంచి మే మూడో తేదీ వరకు కొనసాగనున్నాయి. పుష్కరాలు జరిగే తేదీలతోపాటు వాటికి అటూ ఇటూగా దాదాపు 2లక్షల మందికిపైగా భక్తులు కాశీ యాత్రకు వెళ్తారన్నది ఓ అంచనా. సాధారణ రోజుల్లోనే ఈ ఒక్క రైలు సరిపోక, రోడ్డు మార్గాన అంత దూరం వెళ్లలేక భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అలాంటిది పుష్కరాల వేళ, రద్దీ అంతకు పదిరెట్లు పెరుగుతున్నా అదనపు రైలు ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించలేకపోవటం గమనార్హం. భారీగా పెరిగిన విమాన చార్జీలు సాధారణ రోజుల్లో కాశీకి విమాన టికెట్ ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలుగా ఉండేది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ ధర పెంచుకునే డైనమిక్ ఫేర్ విధానాన్ని ఇప్పుడు విమానయాన సంస్థలు బాగా వినియోగించుకుంటున్నాయి. గంగా పుష్కరాలకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుండటంతో ఒక్కో టికెట్ ధరను రెట్టింపు చేసి విక్రయిస్తున్నాయి. కీలక రోజుల్లో అది మరింత ఎక్కువగా ఉంటోంది. అంత ధరను భరించే పరిస్థితి లేనివారు దానాపూర్ ఎక్స్ప్రెస్ వైపే చేస్తున్నారు. ఆ క్లోన్ రైలును పునరుద్ధరించాలి కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగువారే ఎక్కువ. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్ప్రెస్ ఒక్కటే దిక్కు. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో పనిచేస్తున్న బీహార్ వలస కూలీలు కూడా ఈ రైలు మీదే ఆధారపడుతుంటారు. దీంతో గతంలో ఈ రైలుకు అనుబంధంగా ఓ క్లోన్ రైలు నడిపేవారు. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో నడిచే మరో రైలు అన్నమాట. ముందు రైలుకుఉన్న ఫ్రీ సిగ్నల్ క్లియ రెన్స్ సమయంలోనే ఈ క్లోన్ రైలు నడుస్తుంది. కోవి డ్ ఆంక్షల సమయంలో రద్దయిన ఈ రైలును తిరిగి పునరుద్ధరించలేదు. అది రద్దీ మార్గం కావటం, దా నికి తగ్గ అదనపు లైన్లు లేకపోవటం, ఉన్న అవకాశాలను ఇతర జోన్లు వినియోగించుకుంటుండటమే దీనికి కారణమని స్థానిక రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రద్దయిన మన క్లోన్ రైలును వేరే రాష్ట్రం ఒత్తిడి తెచ్చి వినియోగించుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులతోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా రైల్వే బోర్డుపై ఒత్తిడితెచ్చి ఆ క్లోన్ రైలును పునరుద్ధరిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. -
గంగమ్మకే పెద్దమ్మ.. మన కృష్ణమ్మ!.. దేశంలోనే అగ్రగామిగా..
సాక్షి, అమరావతి: దేశంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా ఉన్న జలాశయాలతో కృష్ణా నది అగ్రగామిగా అవతరించింది. అతి పెద్ద నది అయిన గంగా, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ‘కృష్ణా నది చేరింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతో పాటు అన్ని నదీ పరివాహక ప్రాంతాల(బేసిన్)లో నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణా నది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యంలో 19.65 శాతమన్నమాట. అత్యంత దిగువన బ్రహ్మపుత్ర హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగా నది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగా, గోదావరి కంటే కృష్ణా నదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో గంగా, గోదావరి రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదా నది నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నా బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలే కావడం గమనార్హం. -
వారణాసిలో సీఎన్జీ బోట్లు
వారణాసి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నదిలో తిరిగే అన్ని బోట్లకు పర్యావరణ హిత సీఎన్జీ ఇంజిన్లను అమరుస్తామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. 500 బోట్లను డీజిల్కు బదులు సీఎన్జీ ఇంజిన్లను అమర్చడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 583 బోట్లను మార్చామన్నారు. మరో 2వేల బోట్లను సీఎన్జీకి మార్చే పనిలో ఉన్నామని చెప్పారు. ఇకపై పెద్ద శబ్దాలతో కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ బోట్లకు బదులుగా గంగానదిలో శబ్దంలేని, తక్కువ కలుషితాలను మాత్రమే వదిలే సీఎన్జీ బోట్లు పూర్తి స్థాయిలో రానున్నాయని చెప్పారు. సీఎన్జీ వల్ల పడవల నిర్వాహకులకు ఏటా రూ.30 వేల దాకా ఆదా అవుతుందన్నారు. -
భారత పర్యాటకంలో కొత్త యుగం ఆరంభం: ప్రధాన మోదీ
వారణాసి: అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ప్రాంతాల మధ్య బలమైన అనుసంధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం సాగించే నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్’కు ఆయన శుక్రవారం వర్చువల్గా జెండా ఊపారు. ఉత్తరప్రదేశ్లోని చారిత్రక నగరం వారణాసి నుంచి నౌక ప్రయాణం ఆరంభమైంది. అలాగే వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన టెంట్ సిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాంలో రూ.1,000 కోట్లకుపైగా విలువైన పలు ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కాశీ–దిబ్రూగఢ్ నదీ పర్యాటక నౌకతో ఉత్తర భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఇక ప్రపంచ టూరిజం పటంపై ప్రత్యేక స్థానం లభిస్తుందని ఉద్ఘాటించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. నమామి గంగా, అర్థ్ గంగా.. ‘‘భారతీయుల జీవితాల్లో పవిత్ర గంగా నదికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గంగానది పరిసర ప్రాంతాలు అభివృద్దిలో వెనుకబడ్డాయి. అభివృద్ధి లేక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి. సమస్య పరిష్కారానికి రెండంచెల వ్యూహం అమలు చేస్తున్నాం. అందులో ఒకటి గంగా నది ప్రక్షాళన కోసం ఉద్దేశించిన ‘నమామి గంగా’ పథకం. మరొకటి ‘అర్థ్ గంగా’. నదీ తీర రాష్ట్రాల్లో ఆర్థిక ప్రగతిని పెంపొందించే వాతావరణం సృష్టిస్తున్నాం. గంగా విలాస్ నౌకలో విహరించేందుకు 32 మంది స్విట్జర్లాండ్ వాసులు ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరం. అన్ని దేశాల నుంచి పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పర్యాటకంలో కొత్త యుగానికి ఆరంభం గంగా నదిలో పర్యాటక నౌక ప్రయాణం ప్రారంభం కావడం ఒక మైలురాయి లాంటి సందర్భం. భారతదేశ పర్యాటక రంగంలో కొత్త యుగానికి ఇదొక ఆరంభం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలోని నదులు జల శక్తికి, వాణిజ్యానికి, పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురానున్నాయి. 2014 కంటే ముందు జలమార్గాలపై పాలకులు దృష్టి పెట్టలేదు. 2014 తర్వాత జల మార్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. జాతీయ జలమార్గాలను ఐదు నుంచి 111కు పెంచాం. జల మార్గాల్లో సరుకు రవాణా 30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మూడింతలు పెరిగింది’’ అని మోదీ అన్నారు. -
ప్రపంచంలోనే సుదూర నదీ పర్యాటకం
సాక్షి, న్యూఢిల్లీ: నదీజలాల్లో పర్యాటకులు సుదూరాలకు విలాసవంత ప్రయాణం సాగించేలా రివర్ క్రూయిజ్ (షిప్) పర్యాటకానికి భారతీయ నదులు సిద్ధమయ్యాయి. 52 రోజులపాటు గంగావిలాస్ పేరుతో కొనసాగే ఈ పర్యాటక నౌక సేవలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నాను. గంగా నది, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కొనసాగే ఈ ప్రయాణం జనవరి 13న వారణాసిలో ప్రారంభం అవుతుంది. దాదాపు 3,200 కిలోమీటర్ల పాటు 5 రాష్ట్రాల్లో మొత్తం 27 నదుల్లో ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా మార్చి ఒకటిన అస్సాంలోని దిబ్రూగఢ్కు గంగా విలాస్ చేరుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలో ఇంతవరకు ఇలా రెండు పొడవైన నదులపై క్రూయిజ్ (షిప్)లో పర్యటన సందర్భాలు లేవని తెలిపారు. అందుకే తొలిసారిగా అత్యంత ఎక్కువ దూరాలకు గంగ, బ్రహ్మపుత్ర నదులపై కొనసాగే ఈ యాత్రపై ఆసక్తి నెలకొందని వివరించారు. ‘గంగా విలాస్ రివర్ క్రూయిజ్ ప్రాజెక్టు ద్వారా భారత్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక బంధాన్ని ప్రపంచానికి చాటిచెప్తాం. భారతీయ పర్యాటకరంగ రూపురేఖలు మార్చడంలో ఈ ప్రాజెక్ట్ కీలక భూమిక పోషించనుంది’ అని ఉద్ఘాటించారు. -
'బీజేపీ గంగానది లెక్క.. మా పార్టీలో చేరితే పాపాలన్నీ తొలగిపోతాయ్..'
అగర్తల: బీజేపీ గంగా నది లాంటిదని వ్యాఖ్యానించారు త్రిపుర సీఎం మాణిక్ సాహా. తమ పార్టీలో చేరితే పుణ్యస్నానం చేసినట్లేనని, పాపాలన్నీ తొలగిపోతాయని అన్నారు. దక్షిణ త్రిపుర కక్రాబన్లో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇంకా స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను నమ్ముతున్న వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. మీరంతా బీజేపీలో చేరండి. మా పార్టీ గంగానది లెక్క. ఇందులో చేరితే గంగానదిలో పవిత్ర స్నానం చేసినట్లే. పాపాలు తొలగిపోతాయ్' అని అన్నారు. అలాగే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా మరోమారు అధికారంలోకి వస్తామని మాణిక్ సాహా ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల పాలనలో ప్రజల హక్కులను అణచివేశారని ఆరోపించారు. చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్ -
పోయి రా దుర్గమ్మ.. ఘనంగా నిమజ్జనం (ఫొటోలు)
-
కన్వర్ యాత్ర భక్తులకు కలెక్టర్, పోలీసుల సేవలు.. కాళ్లు నొక్కి..
ఈ ఏడాది కన్వర్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. అయితే, శ్రావణ మాసంలో శివ భక్తులు (కన్వరిలు) భక్తి శ్రద్ధలతో గంగా నది ఒడ్డుకు వెళ్లి ప్రవిత గంగా జలాలను తమ ఇళ్లలో, దేవాలయాల్లోకి నీటిని తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో గంగా నది నీటి కోసం ఉత్తరాఖండ్, యూపీ, హరిద్వార్, రిషికేశ్, గౌముఖ్, తదితర ప్రాంతాలకు కాలినడకన బయలుదేరుతారు. ఇదిలా ఉండగా.. కన్వర్ యాత్రికుల కోసం ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. భక్తులు కాలినడకన వస్తుండటంతో తీవ్రంగా అలిసిపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలు వారికి సాయం అందిస్తున్నారు. తాజాగా యూపీలో కొందరు పోలీసు అధికారులు వారికి తమ వంతు సాయం అందించారు. యూపీలోని అమ్రోహాలో ఎస్ఐ రాజేంద్ర పుందిర్.. కన్వరిల కాళ్లకు పేయిన్ రిలీఫ్ స్ప్రే కొట్టి.. మసాజ్ చేశారు. హపూర్ క్యాంపులో సైతం సీఐ సోమ్వీర్ సింగ్.. కన్వరియాల కాళ్లు నొక్కారు. దీంతో కన్వరియాలకు కొంత ఉపశమనం కలిగింది. అంతకు ముందు.. అమ్రోహ కలెక్టర్, ఎస్పీ.. ఓ భక్తురాలి కాళ్లు కడిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Haridwar: Helicopter showers flower petals on thousands of Kanwariyas at Har Ki Pauri I Watch pic.twitter.com/sn0ZiJ6qgA — Hindustan Times (@htTweets) July 24, 2022 ఇక, హరిద్వార్ కన్వర్ యాత్రికులపై ప్రభుత్వం.. హెలికాప్టర్ల సాయంతో పూల వర్షం కురిపించింది. కొన్ని చోట్ల మతాలకు అతీతంగా ముస్లింలు కూడా కన్వరియాలకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా, జూలై 14న ప్రారంభమైన కన్వర్ యాత్ర.. జూలై 26తో ముగియనుంది. Visuals from Amroha, UP. A sub-inspector Rajendra Pundir seen applying ointment on the leg of Kanwariyas resting in a makeshift camp. pic.twitter.com/YaFkd6lCoQ — Piyush Rai (@Benarasiyaa) July 24, 2022 मुजफ्फरनगर : कमिश्नर और DIG ने कावड़ियों पर की पुष्पवर्षा ◆मौसम की खराबी के चलते पुष्पवर्षा के लिए नहीं आ सका Helicopter pic.twitter.com/TTxRn6M308 — News24 (@news24tvchannel) July 24, 2022 Amroha Collector And SP Washed Feet Of Kanwariyas Returning From Haridwar ANN https://t.co/gsdrMAtFzh — TIMES18 (@TIMES18News) July 24, 2022 -
బాహుబలి ఏనుగు అంటే ఇలా ఉంటది.. వరద నీటిలో వీరోచిత పోరాటం
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల ప్రజలు చిక్కుకుని గల్లంతైన ఘటనలు చూశాము. తాజాగా మరో ఘటన బీహార్లో చోటుచేసుకుంది. బీహార్లోని వైశాలి జిల్లా రాఘవ్పూర్లో భారీ వర్షాల కారణంగా గంగా నది ఉప్పొంగింది. కాగా, వరద నీటి ప్రవాహంలో ఓ ఏనుగు మూడు కిలోమీటర్లు ఈదిన ఘటన సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. ఇక్కడే ట్విస్టు ఏంటంటే.. పీకల్లోతు మునిగిన ఆ ఏనుగుపై మావటివాడు కూడా ఉండటమే. అయితే, ఏనుగుతో సహా మావటివాడు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద కారణంగా గంగా నదిలో కొంత దూరం కొట్టుకుపోయారు. ఈ క్రమంలో తల వరకు మునిగిన ఆ ఏనుగు నదిలో ఎన్నో కష్టాలకు ఓడ్చి.. సుమారు మూడు కిలోమీటర్లు ఈదింది. చివరకు ఒక చోట నది మలుపులో కొందరు వ్యక్తులు ఉండటాన్ని మావటివాడు చూసి.. ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో ఏనుగు, మావటివాడు నది ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. స్పందించిన నెటిజన్లు ఏనుగు ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. #Watch - पटना से लगे राघोपुर में गंगा नदी में हाथी के साथ महावत VIDEO VIRAL, हाथी ने पानी में तैरकर 3 किलोमीटर की दूरी तय करके बचाई खुद की और महावत की जान।#Patna #Elephant #GangaRiver #Raghopur #ViralVideo pic.twitter.com/ubOHASv1r5 — Nedrick News (@nedricknews) July 13, 2022 ఇది కూడా చదవండి: ప్రాణాలు కాపాడుకునే యత్నం.. కాపాడమని కేకలు -
మామూలు డేరింగ్ కాదుగా.. వంతెన పైనుంచి గంగా నదిలో దూకి..
సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. కొన్ని వినూత్న వీడియోలు, ఫన్నీలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. మరికొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఓ బామ్మ(73) చేసిన ఫీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. వివరాల ప్రకారం.. హర్యానాలోని సోంపేట్కు చెందిన ఓంవతి(73) హరిద్వార్లోని హర్ కీ పౌరి వద్ద 40 అడుగుల ఎత్తైన వంతెన పై నుంచి గంగా నదిలో దూకింది. ఆ తర్వాత నది అవతల ఒడ్డునకు ఈదుకుంటూ వెళ్లింది. ఆమె గంగా నదిలో దూకే సమయంలో కొందరు యువకులు ఆమెకు సహాయం అందించారు. అంత ఎత్తు నుంచి ఆమె నదిలో దూకడం అక్కడున్న వారందరినీ షాక్కు గురిచేసింది. हर हर गंगे...🙏 70 years old dadi jumping into the Ganges river from the bridge of Har Ki Pauri, Haridwar and she swimming comfortably. Really this is unexpected.@ActorMadhavan @ShefVaidya @amritabhinder @bhumipednekar @VidyutJammwal @divyadutta25 @ImRaina @harbhajan_singh pic.twitter.com/kaCpXH8hy1 — Rajan Rai (@RajanRa05092776) June 28, 2022 కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. అనంతరం, ఓంవతి మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి నదుల్లో ఈత కొడుతున్నానని తెలిపింది. ఎత్తైనా వంతెనల నుంచి దూకి ఈత కొట్టడం అలవాటేనని పేర్కొంది. ఓంవతికి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టమని చెప్పింది. ఆమె డ్యాన్స్కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్గా మారాయి. Joie de vivre! The 73-year-old who went viral for her dive into Ganga is also fond of dancing... pic.twitter.com/dtlOokNndp — Boris A.K.A Bread & Circuses (@BorisPradhan) June 30, 2022 ఇది కూడా చదవండి: కప్పు ఛాయ్ రూ. 70 వసూలు! రైల్వే ప్యాసింజర్ షాక్.. రైల్వేస్ వివరణ -
భారత్లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్లోనే అత్యధికమని తెలిపింది. కాలుష్య మరణాల్లో అత్యధికం (16.7 లక్షలు) వాయుకాలుష్యం వల్ల జరిగాయని, వాయుకాలుష్య మరణాల్లో అత్యధిక మరణాలు(9.8 లక్షలు) పీఎం2.5 కాలుష్యకాల వల్ల సంభవించాయని వివరించింది. గాలిలో 2.5 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ సైజుండే కణాలను పీఎం 2.5 కాలుష్యకాలంటారు. మిగిలిన వాయు కాలుష్య మరణాలు గృహసంబంధిత వాయు కాలుష్యకాల వల్ల సంభవించినట్లు తెలిపింది. భారత్లో 2019లో నీటి కాలుష్యంతో 5 లక్షలు, పారిశ్రామిక కాలుష్యంతో 1.6 లక్షల మంది మరణించారని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద 2019లో అన్ని రకాల కాలుష్యాలతో 90 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. వీటిలో అత్యధికంగా (66.7 లక్షలు) వాయుకాలుష్యం వల్లనే సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని నివేదిక రూపకర్త రిచర్డ్ చెప్పారు. 2015 నుంచి మాత్రమే దేశాలు కాలుష్య నివారణ బడ్జెట్ను స్వల్పంగా పెంచుతున్నాయన్నారు. గంగా మైదానంలో అధికం భారత్లో వాయు కాలుష్యం గంగా– సింధు మైదాన ప్రాంతం (ఉత్తర భారతం)లో అధికమని నివేదిక తెలిపింది. ఇళ్లలో బయోమాస్ తగలబెట్టడం వల్ల వాయుకాలుష్య మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. దేశ వాతావరణంలో కాలుష్య కారకాలు 2014లో గరిష్ఠంగా ఉన్నాయని, ఆ తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినా తిరిగి వీటి సరాసరి పెరుగుతోందని తెలిపింది. భారత్లో జాతీయ వాయు శుభ్రతా కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను ప్రభుత్వం కాలుష్య నివారణకు చేపట్టిందని, కానీ భారత్లో వాయుకాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ లేదని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల కన్నా భారత వాతావరణంలో కాలుష్యకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే సాంప్రదాయక కాలుష్యకాల వల్ల మరణాలు 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో కాలుష్యం వల్ల ఆర్థిక నష్టం జీడీపీలో ఒక్క శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వల్ల జరిగిన ఆర్థిక నష్టం 46లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. అంతర్జాతీయంగా కాలుష్యాల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2015లో చైనాలో 18 లక్షల మంది కాలుష్యంతో మరణించగా, ఈ సంఖ్య 2019లో 21.7 లక్షలకు పెరిగిందని నివేదిక తెలిపింది. -
గాలొచ్చి బ్రిడ్జి కూలిందట
న్యూఢిల్లీ: ‘గాలి మరీ గట్టిగా వచ్చింది. అందుకే బ్రిడ్జి కడుతుండగానే కూలిపోయింది’ – కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీకి ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన వివరణ ఇది. దాంతో విస్తుపోవడం ఆయన వంతైంది. ఈ విషయాన్ని సోమవారం ఓ సమావేశంలో మంత్రే స్వయంగా చెప్పుకొచ్చారు. బిహార్లోని సుల్తాన్గంజ్లో గంగా నదిపై కడుతున్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఏప్రిల్ 29న కూలిపోయింది. దీనిపై సంబంధిత ఐఏఎస్ అధికారిని వివరణ కోరితే పెనుగాలే కారణమని తేలిగ్గా చెప్పేశారన్నారు మంత్రి. ‘‘ఎంత గట్టిగా వీచినా గాలికి బ్రిడ్జి ఎలా కూలుతుందో నాకింత వరకూ అర్థం కాలేదు. ఏకంగా రూ.1,710 కోట్లతో కడుతున్న బ్రిడ్జి కూలిందంటే నిర్మాణంలోనే లోపముందన్నమాటే’’ అని అభిప్రాయపడ్డారు. 3.12 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతి పొడవైందిగా నిలవనుంది. -
నల్లగా మారిన గంగా జలాలు.. దర్యాప్తుకు ఆదేశం
లక్నో: పవిత్ర గంగానది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి వద్ద నదీ జలాలు నల్లగా మారిపోయాయి. మురుగునీరు నదిలోకి చేరడం, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.గత కొద్ది రోజుల నుంచి నదీ జలాలు నల్లగా కనిపిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. కాశీలోని మణికర్ణిక ఘాట్, గంగా మహాల్ ఘాట్, మీర్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్లలో నదీ జలాలు.. స్నానానికి అనుకూలంగా లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వాటర్ కార్పొరేషన్ స్పందించింది. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. మురుగు నీటి పంపులు దెబ్బ తిని...విశ్వనాథ్ ధామ్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరిగిన సమయంలో.. మురుగునీటి పంపులు దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా మురుగునీరు గంగానదిలో కలిసిపోతున్నాయని చెప్పారు. పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోందని పేర్కొన్నారు. చదవండి: కేజ్రీవాల్ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ.. మురికిగా గంగ నీరు అయితే, కాలుష్య నియంత్రణ విభాగ అధికారి ఎస్కే రాజన్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. మురుగునీటి పంపునకు, నది కాలుష్యానికి సంబంధం లేదని చెప్పారు. సాంకేతిక కమిటీ నీటి నమూనాలు సేకరించి పరిశీలన చేపట్టిందని వెల్లడించారు. 'ఏవైనా సాంకేతిక కారణాల వల్ల నీరు నల్లగా మారిపోయి ఉండొచ్చు. పరిశీలన జరిపిన తర్వాత ఏం జరిగిందనేది తెలుస్తుంది' అని అన్నారు.గంగా నదిలో నీరు నల్లగా మారిపోవడం వల్ల అక్కడికి వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. నదీస్నానాలు చేయడానికి నీరు అనుకూలంగా లేవని స్థానిక పూజారి చెప్పారు. చదవండి: ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం.. జింబాబ్వే మహిళ వద్ద రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ -
హిందూయేతరులు ఘాట్కు రావద్దు
వారణాసి: హిందువులు కాని వారు గంగా నది ఘాట్లకు, నది ఒడ్డున ఉండే గుడులకు దూరంగా ఉండాలని హెచ్చరించే పోస్టర్లు కాశీ పుర వీధుల్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని తొలగించిన పోలీసులు ఇవి ఎలా వచ్చాయన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. జాతీయవాద సంస్థలు వీటి వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘గంగా ఘాట్లు, కాశీ దేవాలయాలు సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి, విశ్వాసానికి, నమ్మకానికి చిహ్నాలు, వీటిపై నమ్మకమున్నవారికి స్వాగతం, లేదన్న వారు ఇది పిక్నిక్ స్పాట్ కాదని గుర్తుపెట్టుకోండి’ అని ఈ పోస్టర్లలో రాశారు. వీటిపై హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం అనే శీర్షికనుంచారు. ఇది విజ్ఞప్తి కాదు, హెచ్చరిక అనే బెదిరింపులు కూడా వీటిపై ఉన్నాయి. ఈ పోస్టర్ల ఫొటోలు, వీడియోలను వీహెచ్పీ, బజరంగ్దళ్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై దర్శనమిచ్చాయి. భేల్పూర్ పోలీసులు వీటిపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియోల్లో, ఫొటోల్లోని కొందరిని గుర్తించామన్నారు. హిందూయేతరులు ఘాట్ల పవిత్రతను దెబ్బతీస్తారని, అందుకే వీరికి ఈ వార్నింగ్ ఇచ్చారని బజరంగ్దళ్ నేత నిఖిల్ త్రిపాఠీ అభిప్రాయపడ్డారు. వీరంతా ఘాట్లలో మద్యం తాగడం, మాంసం తినటం చేస్తారని ఆరోపించారు. ఇటీవలే కొందరు బాలికలు ఘాట్లలో బీర్లు తాగుతున్న ఫొటోలు బయటపడ్డాయని, ఇలాంటి వారు తమకు పట్టుబడితే పోలీసులకు అప్పజెబుతామని హెచ్చరించారు. -
వీథి బాలల్ని బడిపిల్లలుగా మార్చింది...మమ్మీజీ
పిల్లల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో టీచర్లదే ప్రముఖ పాత్ర. అయితే, తరగతిలో ఉన్న విద్యార్థుల్నే కాదు.. వీధుల్లో చిల్లర డబ్బులు అడుగుతూ (యాచిస్తూ) తిరుగుతున్న వీధి బాలలను కూడా బడిలో చేర్పించి, తానే స్వయంగా పాఠాలు బోధిస్తూ... వారి జీవితాలనే మార్చేస్తున్నారు మనోరమ టీచర్. ఆసరాలేని పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తూ వారిని చేరదీసి, ఆశ్రయమివ్వడమే కాకుండా విద్యాబుద్ధులు సైతం నేర్పించి భవిష్యత్ను బంగారు మయం చేస్తుండడంతో మనోరమను అంతా మమ్మీజీ అని పిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని గంగానదీ పరివాహక జిల్లా బల్లియాలో పుట్టింది మనోరమ. చిన్నప్పటినుంచి ఆడుతూ పాడుతూ రోజూ గుడికి వెళ్తుండేది. గుళ్లో వచ్చే సాంబ్రాణీ, పూల పరిమళాలను ఆస్వాదిస్తోన్న మనోరమకు.. గుడినుండి బయటకు వచ్చేటప్పుడు మాసిన, చిరిగిపోయిన దుస్తులు ధరించి దీనంగా యాచించే పిల్లలు కనిపించేవారు. వాళ్లు కొన్నిసార్లు మనోరమ దగ్గరకు వచ్చి ప్రసాదం పెట్టమని అడిగేవారు. చిన్న లడ్డు ముక్క ఇస్తే వాళ్ల సమస్య తీరిపోతుందా? అనిపించేది తనకు. కానీ ఏం చేయాలో అప్పట్లో అర్థం కాలేదు. వాళ్లకెలా సాయం చేయాలి? అన్న ఆలోచనలతోనే ఇంటర్ కాగానే బీఎస్సీ, ఎమ్మెస్సీ చేసి, తర్వాత పూర్వాంచల్ యూనివర్శిటీలో బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సంపాదించింది. పాఠాలతోపాటు.. పోస్టింగ్ డెహ్రాడూన్లో రావడంతో అక్కడ టీచర్గా పనిచేస్తూనే, ఆల్ ఇండియా రేడియోలో అంధ విద్యార్థులకు కథల పుస్తకాలను చదివి వినిపించేది. కథల విన్న విద్యార్థుల వ్యక్తం చేసే సంతోషం ఆమెకు చాలా సంతృప్తినిచ్చేది. ఇంతలోనే మనోరమకు పెళ్లి అవడం, భర్త లక్నోలో ఉండడంతో తను కూడా లక్నో వెళ్లింది. లక్నోలో కూడా గుడికి వెళ్లినప్పుడు యాచించే పిల్లలు కనిపించేవారు. చిన్నప్పటినుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్న మనోరమ... యాచించే పిల్లల వద్దకు వెళ్లి ఇలా ‘అడుక్కోవడం తప్పు, మీరు ఈ వయసులో ఇటువంటి పనులు చేయకూడదు. చదువుకోవాలి’ అని హితవు చెప్పేది. ఆమె మాటలు వినడానికి పిల్లలు గుంపుగా పోగయ్యేవారు. అప్పుడు ఆ పిల్లలకు స్నానాలు చేయించి, కొత్తబట్టలు తొడిగి, తలకు నూనె రాసి, దువ్వి వాళ్లను అద్దంలో చూపిస్తూ ‘చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారో’... అడుక్కోవడం అంటే దేవుడిని కించపరచడంతో సమానమని చెప్పి, అడుక్కోవద్దని వారించేవారు. ఈ మాటలు విన్న పిల్లలు, కొంతమంది తల్దిండ్రులు నిజమే కదా! అని అర్థం చేసుకుని తమ పిల్లలను స్కూళ్లలో చేర్చి చదువుకోవడానికి ప్రోత్సహించేవారు. మనోరమ పనిచేసే స్కూలు, ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్పించి, వారి పిల్లల యాచకత్వాన్ని మాన్పించారు. దత్తత సెంటర్.. మనోరమ ప్రారంభంలో డెభ్బై మంది దాకా పిల్లలను స్కూళ్లలో చేర్పించింది. రోజురోజుకి నిరాశ్రయ యాచక పిల్లల సంఖ్య పెరగడం, వాళ్లను ఆదరించే వారు లేకపోవడం వంటి కన్నీటి గాథలకు చలించి పోయిన మనోరమ వారికోసం దత్తత కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంది. 2004లో ‘జమి అప్ని ఆస్మా మేరా’ పేరుతో దత్తత కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సెంటర్లో ఇల్లువాకిలి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, నా అనేవారు లేని వారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తుంది. ఎవరైనా ఈ సెంటర్లో ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే వారికి దత్తత ఇస్తుంది. అలా ఇప్పటిదాకా పదకొండు వందలమంది పిల్లలను యాచన నుంచి మాన్పించగలిగింది. వీరిలో చాలా మంది ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది క్యాటరింగ్, డ్రైవర్స్, హౌస్కీపింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు బీఏ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయిలైతే బ్యూటీపార్లర్, కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ వర్క్ లు నేర్చుకుని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మనోరమ భర్త కూడా తనకి అన్ని పను ల్లో చేదోడు వాదోడుగా ఉంటూ సాయం చేయడం వల్ల ఆమె ఇంతమందిని ప్రయోజకుల్ని చేయగలిగారు. లక్నోలో యాచకత్వం చేసే పిల్లల సంఖ్య కూడా తగ్గింది. నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లల్ని చేరదీసి బడికి పంపిస్తూ, భవిష్యత్ను మారుస్తున్న మనోరమను అంతా ‘మమ్మీజీ’ అని పిలుస్తున్నారు. అవార్డులు.. టీచర్గా పాఠాలు చెప్పి సరిపెట్టుకోకుండా స్కూలు బయట ఉన్న పిల్లల్ని స్కూలుకు వచ్చేలా చేసి వారి జీవితాలనే తీర్చిదిద్దిన మనోరమను గుర్తించిన హిందుస్థాన్ టైమ్స్ ‘ఉమెన్ ఎచీవర్స్ అవార్డుతో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘గోమతి గౌరవ్ సమ్మాన్’ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది టీచర్గా రిటైర్ అయిన మనోరమ తన సమాజసేవను కొనసాగిస్తున్నారు. భర్తతో మనోరమ -
గంగా జలాల్లో హానికర బ్యాక్టీరియా
సాక్షి, న్యూఢిల్లీ: జీవితంలో చేసుకున్న పాపాలు పోవాలంటే గంగా స్నానం చేయాల్సిందేనని పూర్వీకుల నుంచి నానుడిలో ఉన్న మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గంగా స్నానం చేయడం వల్ల మనం చేసుకున్న పాపాలు పోవడం సరికదా, ఇప్పటివరకు లేని కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చి నదిలో కలుస్తున్న రసాయనాలకు తోడు, పుణ్యం కోసం స్నానాలు చేసే యాత్రికులు పడేసే చెత్తతో ఇప్పటికే కలుషితమైంది. ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు గంగా ప్రక్షాళనకు ఖర్చు చేస్తున్నప్పటికీ, పరిస్థితిలో మార్పు ఏమాత్రం కనిపించ ట్లేదు. గతేడాది కరోనా కారణంగా లాక్డౌన్ సమయంలో కాలుష్యం జాడలేని గంగానదిలో మళ్ల పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన కాలుష్యం పరిస్థితిని దయనీయంగా మార్చేసింది. కాలుష్య కాసారంగా మారిన గంగానదిలో స్నానం చేయడం హానికరమని తాజాగా ఐఐటీఆర్ చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో గంగానదిలో పెద్ద ఎత్తున శవాలు కొట్టుకురావడం, నదీ పరివాహక ప్రాంతాల్లో శవాలు కనిపించడంతో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్ళు, ఐఐటిఆర్ లక్నో సంస్థలకు గంగా నీటిపై దర్యాప్తు చేసే బాధ్యతను నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అప్పగించింది. మొదటి దశలో మే 24 నుంచి జూన్ 6 వరకు నమూనాలను తీసుకున్నారు. రెండో దశ జూన్ 10 నుంచి జూన్ 21 మధ్య పూర్తయింది. ఆ తరువాత పూర్తిస్థాయిగా పరిశీలించిన అనంతరం తుది నివేదికను సిద్ధం చేశారు. గంగా స్నానం హానికరం..! ఈ పరిశోధనలో, గంగానది నీటిలో బీఓడీ అనగా జీవరసాయన ఆక్సిజన్ డిమాండ్ ప్రమాణం కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒక లీటరు శుభ్రమైన నది నీటిలో బీఓడీ స్థాయి 3 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. కానీ గంగానది ప్రవాహంలోని చాలా చోట్ల లీటరు నీటిలో బీఓడీ 20–25 మి.గ్రా. వరకు ఉందని పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం దీనివల్ల జలచరాలకు ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. జీవ రసాయన ఆక్సిజన్ డిమాండ్ ప్రమా ణాల కంటే ఎక్కువగా ఉన్ననీటిలో స్నానం చేయ డం హానికరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన బ్యాక్టీరియా గుర్తింపు ఈ అధ్యయనంలో ఉత్తరప్రదేశ్ నుంచి బిహార్ వరకు గంగానది నీటిలో కరోనా లేదని తేలింది. ఈ రెండు రాష్ట్రాల్లోని 13 నగరాల నుంచి తీసుకున్న మొత్తం 67 నమూనాల ఆర్టీ–పీసీఆర్ రిపోర్ట్లు నెగెటివ్గా వచ్చాయి. గంగానది నీటిలో మాత్రం హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ప్రతి నమూనా లో ఈ–కోలి బ్యాక్టీరియాను కనుగొన్నారు. అంతేగాక నీటిలో ఆక్సిజన్ కొరత ఉందని నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గంగానది నుంచి 12 ప్రదేశాలలో, యమునా నది నుంచి ఒక ప్రదేశంలో నమూనాలను తీసుకు న్నట్లు లక్నో ఐఐటీఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్కే బారిక్ తెలిపారు. ఐఐటీఆర్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎ.బి. పంత్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రీతి చతుర్వేది నాయకత్వంలోని బృందం గంగా నీటిపై అధ్యయనం చేసింది. కరోనా ఆనవాళ్ల కోసం చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన తర్వాత కూడా గంగా నీటిలో కాలుష్య జాడను కనుక్కొన్నేందుకు వివిధ పారామితులను విశ్లేషించారు. అందులో కొన్ని భౌతిక రసాయన పారామితులు నిర్ధారిత ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. భౌతిక రసాయన పారామితులలో పీహెచ్, కలర్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ (డీఓ), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), నైట్రేట్, క్లోరైడ్, అమ్మోనియం నైట్రోజన్, భాస్వరంల పారామితులను ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించారు. ప్రతి నమూనాలోనూ ఈ–కోలి బ్యాక్టీరియా ఉనికి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తీసుకున్న 67 నమూనాలు అన్నింటింలోనూ ఈ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బాక్టీరియా సాధారంగాణ మానవులు,జంతువుల కడుపులో ఎల్లప్పుడూ ఉంటుంది. దాని వేరియంట్స్ చాలావరకు హాని కలిగించవు. కానీ కొన్నిసార్లు కడుపులో మెలిపెట్టినట్లు కావడం, విరేచనాలు వంటి లక్షణాలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా కొన్నిసార్లు ఈ–కోలి బ్యాక్టీరియా కారణంగా కొందరిలో మూత్రపిండాలు పనిచేయడం మానేసి రోగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. గంగా నీటిలో ‘ఫీకల్ స్ట్రెప్టోకోకి’ ఆనవాళ్లు ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావో, వారణాసి, ప్రయాగ్రాజ్, ఘాజిపూర్, కాన్పూర్ నగరాల్లో గంగానది నుంచి తీసుకున్న నమూనాలలో ఫీకల్ స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియాను కనుగొన్నారు. అదే సమయంలో బిహార్లోని సారన్లో ఒకటి, భోజ్పూర్లో తీసుకున్న మూడు నమూనా ల్లోనూ ప్రమాదకరమైన రకం బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకి ఉనికిని గుర్తించారు. ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ రావడానికి ఇది ప్రధాన కారణమని పరిశోధకులు తెలిపారు. ఇదిమాత్రమేగాక బ్యాక్టీరియా కడుపు, ప్రేగులకు సంబంధించిన అనేక ఇతర రుగ్మతలకు కూడా కారణమవుతుంది. -
గంగా నదిలో కరోనా ఆనవాళ్లున్నాయా?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, బిహార్లో గంగా నదిలో కొన్ని రోజుల క్రితం మృతదేహాలు తేలడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అవి కరోనా బాధితుల మృతదేహాలేనన్న వాదన వినిపించింది. దీంతో గంగా నది పరిసరాల్లో నివసించే వారిలో ఆందోళన మొదలయ్యింది. ఈ నేపథ్యంలో నదిలో నిజంగా కరోనా (సార్స్–కోవ్–20) ఆనవాళ్లు ఉన్నా యా? అనేది తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం దశలవారీగా వైరలాజికల్ సర్వే నిర్వహిన్నట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. మొదటి దశలో ఇప్పటికే కన్నౌజ్, పాట్నాలో 13 ప్రాంతాల్లో కొన్ని నమూనాలను సేకరించినట్లు లక్నోలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రిసెర్చ్ డైరెక్టర్ సరోజ్ బాతిక్ చెప్పారు. నీటిలోని వైరస్లలో ఉండే ఆర్ఎన్ఏను వేరుచేసి, ఆర్టీ–పీసీఆర్ టెస్టు నిర్వహిస్తామని తెలిపారు. గంగా నదిలోని నీటిలో కరోనా వైరస్ ఉనికి ఉందా లేదా అనేది ఈ టెస్టు ద్వారా తెలిసిపోతుందన్నారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ) నిర్ణయం మేరకు వైరలాజికల్ సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. -
Kumbh Mela IG: ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనడం సరికాదు
డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో మహా కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై శనివారం కుంభమేళా నిర్వహణ అధికారి సంజయ్ గుంజ్వాల్ వివరణ ఇచ్చారు. గంగానదిలో స్నానాలు చేసిన వారిని కోవిడ్-19 "సూపర్-స్ప్రెడర్" అని పిలవడం సరికాదన్నారు. హరిద్వార్లో జనవరి 1 నుంచి నిర్వహించిన 8.91 లక్షల ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో కేవలం 1,954 (0.2 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కుంభమేళా డ్యూటీలో పాల్గొన్న 16,000 మంది పోలీసు సిబ్బందిలో కేవలం 88 (0.5శాతం) మంది కరోనా బారిన పడినట్టు ఆయన తెలిపారు. కుంభమేళా ప్రారంభం నుంచి ముగిసే వరకు హరిద్వార్ వ్యాప్తంగా కోవిడ్ డేటాను శాస్త్రీయంగా విశ్లేషిస్తే ఈ విషయాలు తెలిసినట్టు పేర్కొన్నారు. ‘సూపర్ స్ప్రెడర్’’ కుట్ర కుంభమేళాపై ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనే అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం జరిగినట్టు గుంజ్వాల్ మీడియాకు తెలిపారు. ఇక ఏప్రిల్ 1 నాటికి హరిద్వార్లో 144 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. కుంభమేళా నిర్వహణ కాలం ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 55.55 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా..అందులో 17,333 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి మార్చి నుంచే భక్తుల తాకిడి మొదలైందని, మహాశివరాత్రికి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని మేళా ఐజీ సంజయ్ గుంజ్యాల్ అన్నారు. ఈ సంవత్సరం కుంభంమేళా నిర్వహణ కాలంలో భక్తులు మూడు సార్లు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సమయంలో 34.76 లక్షల మంది భక్తులు గంగానదిలో స్నానాలు చేశారు. ఏప్రిల్ 12 (సోమావతి అమావాస్య)రోజున 21 లక్షల మంది, ఏప్రిల్ 14 (మేష్ సంక్రాంతి)నాడు 13.51 లక్షల మంది, ఏప్రిల్ 27( చైత్ర పూర్ణిమ) రోజున 25,104 మంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేసినట్టు ఆయన తెలిపారు. (చదవండి: సెకండ్ వేవ్: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు) -
ఆకుపచ్చగా మారుతున్న గంగానది.. కారణం ఏంటి?
లక్నో: భారతీయులకు వేదకాలం నుంచి గంగానదితో అనుబంధం పెనువేసుకుపోయింది. హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. గంగాజలాన్ని చల్లుకుంటే పునీతులవుతారనేది ప్రధాన నమ్మకం.. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధానంలో ఉంచి పూజిస్తారు. ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటుంది. అతంటి పరమ పావనమైన గంగానది గత కొన్నేళ్లుగా మురికికూపంగా తయారవుతోంది. గత ఏడాది కోవిడ్-19 వల్ల ఏప్రిల్, మే నెలల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాలుష్యం తగ్గడంతో గంగా నది తనను తాను శుభ్రం చేసుకుంది. కానీ కరోనా సెకండ్ వేవ్ సమయంలో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. గంగా పరివాహక ప్రాంతంలోని అనేక నదీ తీరాలు ఆకుపచ్చగా మారుతున్నట్లు తెలుస్తోంది. నీరు విషపూరితంగా మారి, ఆకుపచ్చ రంగులోకి మారుతుందని.. దీనికి గల కారణాన్ని పరిశోధించాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. "చెరువులు, సరస్సుల నుంచి నాచు అధికంగా రావడం వల్ల వర్షాకాలంలో గంగానది లేత ఆకుపచ్చగా మారుతుంది. అయితే, ఈసారి ఆ రంగు అధికంగా ఉంది. ఇంతకుముందు ఆకుపచ్చగా మారడం కొన్ని ఘాట్లలో మాత్రమే కనిపించేది. ఇప్పుడు ప్రతిచోటా ఈ విధంగా నీరు రంగు మారి కనిపిస్తోంది. అంతేకాకుండా దీని నుంచి వచ్చే దుర్వాసనకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు" అని వారణాసికి చెందిన లావ్కుష్ సాహ్ని అన్నారు. దీనిపై బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని మాల్వియా గంగా పరిశోధనా కేంద్రం ఛైర్మన్ త్రిపాఠి మాట్లాడుతూ.. మైక్రోసిస్టిస్ ఆల్గే (నాచు) వల్ల నది పచ్చగా కనిపించవచ్చు అన్నారు. మైక్రోసిస్టిస్ ప్రవహించే నీటిలో కనిపించదు. కానీ ఎక్కడ నీరు ఆగి పోషకాలకు వృద్ధి జరిగితే మైక్రోసిస్టిస్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది చెరువుల నీటిలో మాత్రమే పెరుగుతుందని ఆయన తెలిపారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది సాధారణంగా మార్చి, మే నెలల మధ్య జరుగుతుంది. కానీ ఈ విధంగా రంగు మారడం వల్ల నీరు విషపూరితంగా మారుతుంది. దీంతో ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తాయని, ఈ నీటిని తాగితే కాలేయానికి హాని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. (చదవండి: రూ. 20లక్షల బిల్లు: మిగతా సొమ్ము కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లండి!) -
పెట్రోలు, టైర్లతో కరోనా మృతుల అంత్యక్రియలు
లక్నో : గంగానదిలో వందకుపైగా కోవిడ్ మృతదేహాలు తేలుతూ కనిపించటంతో దేశవ్యాప్తంగా కల్లోలం చెలరేగింది. ఆ ఘటన మరువక ముందే కోవిడ్ మృతదేహాలకు సంబంధించిన మరో ఘటన ప్రస్తుతం దుమారం రేపుతోంది. వివరాలు.. ఉత్తర ప్రదేశ్, భల్లియ జిల్లాలోని మల్దెపూర్ ఘాట్లో రెండు కోవిడ్ శవాలు కనిపించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అక్కడకు చేరుకున్న పోలీసులు శవాలను బయటకు తీయించారు. వాటిని దహనం చేయించే ఏర్పాటు చేశారు. అయితే వాటిని కాల్చడానికి పెట్రోలు, టైర్లను ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఉన్నతాధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు. సంఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. దర్యాప్తుకు ఆదేశించారు. కాగా, గంగానదిలో కోవిడ్ మృతదేహాల ఘటనపై సీఎం యోగీ ఆధిత్యనాథ్ కొద్దిరోజుల క్రితం స్పందిస్తూ.. గంగానదిలో కోవిడ్ మృతదేహాలను వేయకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. నదిలో కనిపించిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలన్నారు. -
మాజీ ఐఏఎస్పై యూపీలో కేసు
లక్నో: గంగా నదిలో తేలియాడుతున్న మృతదేహాలతో కూడిన పాత ఫొటోను ట్వీట్ చేయడం ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారంటూ మాజీ ఐఏఎస్ అధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నావ్లో 2014లో తీసిన ఆ ఫొటోను తాజాగా బల్లియా జిల్లాలో తీసినట్లుగా పేర్కొన్నారంటూ యూపీ కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్పై ఉన్నావ్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఉన్నావ్ వద్ద గంగానదిలో తేలియాడుతున్న 67 మృతదేహాలను గంగానది ఒడ్డున జేసీబీతో గుంత తవ్వి ఖననం చేశారని కూడా ఈనెల 13వ తేదీన తన ట్వీట్లో ఈ మాజీ అధికారి పేర్కొన్నారని పోలీసులు ఆరోపించారు. మంగళవారం బల్లియా జిల్లా పరిధిలో గంగా నదిలో కనిపించిన 52 మృతదేహాలను వెలికితీసి, అంత్య క్రియలు జరిపామని పోలీసులు వెల్లడించారు. (చదవండి: వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!) -
గంగానదిలో మృతదేహాలు : యూపీ, బిహార్ మధ్య చిచ్చు
లక్నో: పవిత్ర గంగా నదిలో తేలుతున్న మృతదేహాలు కలవరం పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందినవిగా భావిస్తున్న మృతేదేహాలు ఈ రోజు మరిన్ని బయట పడటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. గంగానదిలో ఒడ్డుకు కొట్టుకొస్తున్న శవాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒకవైపు భయంకరంగా విస్తురిస్తున్న కరోనా, మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమీపంలో గంగా నదిలో శవాలు తేలుతూ కనిపించడంతో ప్రజలు మరింత వణికిపోతున్నారు. సోమవారం బిహార్ జిల్లా బక్సర్ వద్ద గంగానదిలో డజన్లకొద్దీ మృతదేహాలు తెలియాడగా, బక్సర్ నుండి 55 కి.మీ. దూరంలో మంగళవారం ఉత్తరప్రదేశ్, ఘాజీపూర్ సమీపంలో నదిలో మృతదేహాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇవన్నీ ఉత్తరప్రదేశ్కు చెందినవేనని బిహార్ అధికారులు వాదిస్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్లు వీటిని విసిరిపారేసినట్టు ఆరోపిస్తున్నారు. దీనిపై శేఖర్ సుమన్, బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో కోవిడ్ బాధితులు, కుటుంబాలకు లభిస్తున్న గౌరవంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. యూపీ సరిహద్దు సమీపంలో బిహార్లోని సరన్లో ఉన్న జైప్రభా సేతు అనే వంతెనపైనుంచి అంబులెన్స్ల నుంచి కోవిడ్ బాధితుల మృతదేహాలను డ్రైవర్లు నదిలోకి విసిరివేస్తున్నారని బిహార్ బిజెపి ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ ఆరోపించారు. దీనిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా సరన్ జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు తెలిపారు. అయితే ఇరు రాష్ట్రాలు వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. యూపీ, బిహార్ రెండు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తీసుకొచ్చి గంగానదిలో వేస్తున్నారని స్థానికుడు అరవింద్ సింగ్ ఆరోపించారు. కోవిడ్ బాధితులవిగా చెబుతున్న కుళ్ళిపోయిన కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్న బిహార్ పోలీసులు పోస్ట్మార్టం నిర్వహించారు. పూర్తిగా కుళ్ళిపోయినందున, మరణానికి కారణాలను ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. శవాలను గుర్తించేందుకు వీలుగా డీఎన్ఏలను భద్రపరిచామని చెప్పారు. అయితే మృతదేహాలను దహనం చేయడానికి కట్టెలకు అధిక ధరలు వసూలు చేస్తున్నందు వల్లే మృతదేహాలను స్థానిక ప్రజలు నదిలోకి విసిరేస్తున్నారన్న వాదనలను బక్సర్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ తోసిపుచ్చారు. శశ్మానాల్లో తగినంత కట్టెలు ఉన్నాయనీ, ప్రతి రోజు సగటున ఆరు నుండి ఎనిమిది మృతదేహాలు దహనం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని అటూ యూపీ అధికారులను, తమ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని, మృతదేహాలను నదిలోకి విసిరేయకుండా స్థానికులకు అవగాహన కల్పించాలని కోరామని కూడా తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి సంజయ్ కుమార్ ఝా అన్నారు. మృతదేహాలు యూపీ నుంచి బిహార్లో తేలుతున్నాయన్నారు. అటు కరోనాతో చనిపోయిన వారికి, ఇటు పవిత్ర గంగానదికి కూడా తగిన గౌరవం లభించాలని సీఎం భావిస్తున్నారన్నారు. అలాగే ఈ డెడ్బాడీస్ దాదాపు నాలుగైదు రోజులనాటివని పోస్టుమార్టం నివేదికలో తమ వైద్యులు ధృవీకరించారని తెలిపారు. చదవండి: బీ, ఏబీ బ్లడ్ గ్రూపుల వారికే కరోనా ముప్పు ఎక్కువ 150 half burnt bodies of suspected Corona victims found floating in Ganga river in Bihar.If this is not Apoclaypse"Pralay"then wat is it?We don't deserve this.We don't. Frightening ,horrifying to say the least.God plz save us from this cataclysm. 🙏🙏🙏 — Shekhar Suman (@shekharsuman7) May 11, 2021 -
కలకలం: గంగానదిలో తేలిన కరోనా మృతదేహాలు
లక్నో/ పాట్నా: పవిత్రమైన గంగానదిలో కరోనా మృతదేహాలు పడి ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మూడు, నాలుగు కిలో మీటర్ దూరం వరకు దాదాపు వందకు పైగా కరోనా మృతదేహాలు పడి ఉన్నాయి. తెల్లటి వస్త్రాల్లో కప్పి ఉంచిన కరోనా మృతదేహాలను నది ఒడ్డున పడవేశారు. మరికొన్ని మృతదేహాలు నది మధ్యలో నీటిలో తేలియాడుతూ కనిపించాయి. సోమవారం మధ్యాహ్నం సమయంలో వాటిని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్, బిహార్లోని బక్సార్ జిల్లాలో పారుతున్న గంగానది చెంత ఈ దుస్థితి ఏర్పడింది. యూపీలో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. మృతదేహాలకు అంత్యక్రియలు చేసే శ్మశానం కూడా నిండి ఉండడం.. కుటుంబసభ్యులు నిరాకరించడం వంటి వాటితో ఇక విధిలేక కొందరు ఆస్పత్రుల నిర్వాహకులతో పాటు స్థానిక అధికారులు గంగానది ఒడ్డున కరోనా మృతదేహాలను పడేశారని తెలుస్తోంది. దీంతోపాటు బిహార్లోని బక్సర్ జిల్లా నగర్ పరిషద్ పట్టణంలో పారుతున్న గంగానదిలోనూ మృతదేహాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టారు. గంగానదిలో మృతదేహాలు తేలడంపై యూపీలోని హమీర్పూర్ ఏఎస్పీ అనూప్కుమార్ స్పందించారు. హమీర్పూర్, కాన్పూర్ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం.. పూడ్చడం వంటివి చేయరని.. అలా నదిలో పారవేస్తారని ఏఎస్పీ తెలిపారు. అప్పుడప్పుడు నదిలో మృతదేహాలు కనిపిస్తుంటాయని చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా భయంతో కూడా చాలా మంది అంత్యక్రియలు చేసేందుకు భయపడుతూ మృతదేహాలను నది నీటిలో వదిలేస్తున్నారని ఆయన వివరించారు. మొత్తం గంగానది ఒడ్డున 150కి పైగా మృతదేహాలు లభించాయని తెలుస్తోంది. చదవండి: ‘నా వయసు 97 ఏళ్లు.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా’ చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ -
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
పాట్నా: పాట్నాలోని దానపూర్ ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అతివేగంతో అదుపు తప్పిన ఒక వ్యాన్ దానపూర్ ప్రాంతంలోని పాంటూన్ వంతెనపై నుంచి గంగా నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు. అఖీపూర్లో ప్రాంతంలోని పీపా పుల్ను దాటుతుండగా 13 మంది వ్యక్తులతో ఉన్న వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో గంగా నదిలోకి దూసుకెళ్లింది. నలుగురుకి ఈత రావడంతో వారు ప్రాణాలు దక్కించుకోగా, మిగతా తొమ్మిది మంది అక్కడే మరణించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. అఖీపూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 07.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దనాపూర్లోని చిత్రకూట్నగర్కు చెందిన ఓ ఫ్యామిలీ అఖీపూర్లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యి తిరిగి సొంతూరి పయనమయ్యారు. నదిలో పడిపోయిన వ్యాన్లో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 13 మంది ఉన్నారు. ఐతే పీపాపుల్ బ్రిడ్జిపైకి చేరుకోనే వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అనంతరం ఆ వ్యాన్ నేరుగా నదిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ బృందాలు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నదిలోకి దిగి గాలించగా 9 మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేల్ చంద్రశేఖర్ సింగ్ ప్రకటించారు. బిజెపీ లోక్సభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి రామ్క్రీపాల్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి! -
గంగా నీళ్లు శుభ్రంగా తాగొచ్చు..
డెహ్రాడూన్: కరోనా వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్డౌన్తో పలు నదుల్లోని నీటి కాలుష్యం తగ్గి నాణ్యత పెరుగుతోంది. దేశంలోనే పెద్ద నదిగా గుర్తింపు పొందిన గంగానదిలోని నీరు తేటగా మారుతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు స్థానికంగా ఉన్న గంగా నదిలోకి వెళ్లి కలవటం వల్ల తీవ్ర కాలుష్యానికి గురైన విషయం తెలిసిందే. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంగా నదిలోని కాలుష్యాన్ని తగ్గించడానికి పలు కార్యక్రమాలు చేపట్టాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాలేదు. ఇక లాక్డౌన్తో హరిద్వార్, రిషికేశ్లో ప్రవహించే గంగనది నీరు మునుపెన్నడు లేని విధంగా శుభ్రపడి తాగడానికి కూడా ఉపయోగపడతాయని ఉత్తరాఖాండ్ కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఇలా గంగానది నీరు తాగే విధంగా కాలుష్యం తగ్గటం 2000వ సంవత్సరంలో ఉత్తారఖాండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అని పేర్కొంది. (లాక్డౌన్తో మెరుగైన గంగా నది నీటి నాణ్యత) నాణ్యతను బట్టి గంగానది నీరు రెండు వర్గాలుగా విభజించబడింది. మొదటిది నీటిని వడపోసిన తర్వాత తాగడానికి ఉపయోగించడం. మరోకటి తాగకుండా కేవలం స్నానానికి వినియోగించటం. కాగా హరిద్వార్లోని హర్ కి పౌరి ప్రాంతంలో ప్రవహించే గంగానది మొదటి వర్గంగా మార్పు చెందింది. ప్రస్తుతం ఈ నీటిని వడపోసిన తర్వాత తాగడానికి వీలుంటుందని శాస్తవేత్తలు తెలిపారు. ఇక గంగానదిలోని ఆక్సిజన్ స్థాయి కూడా పెరిగిందని బయోలాజిక్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) పేర్కొంది. సాధారణంగా గంగానదిలో 80 శాతం ధూళి, మురుగు నీరు, కాలుష్యం ఉండగా.. లాక్డౌన్తో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గంగా నదితోపాటు యమునా నదిలోని నీటి నాణ్యత కూడా మెరుగుపడిందన్నారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్.. క్లీన్ గంగా
వారణాసి : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు భారత్లో 21 రోజులపాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా దేశంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాలు అన్ని మూతపడ్డాయి. పరిశ్రమల బంద్ కారణంగా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు నిలిచిపోయాయి. సాధారణంగా పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాలు స్థానికంగా ఉన్న నదిలోకి వెళ్లి కలుస్తుంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలన్నీ మూసివేయడంతో వారణాసి, హరిద్వార్ ప్రాంతాల్లో ప్రవహించే గంగా నదిలోకి వ్యర్థాలు చేరకపోవడంతో నదిలోని నీరు రోజు రోజుకి శుద్ధి అవుతోంది. అనేక పరిశోధనల అనంతరం ప్రస్తుతం నీటి నాణ్యతలో గొప్ప మార్పు కనిపిస్తోందని, అలాగే తాగడానికి కూడా సరిపోతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. (బ్రిటన్ కమెడియన్ కన్నుమూత) లాక్డౌన్ నేపథ్యంలో హరిద్వార్ ఘాట్లు మూసివేయడంతో ప్రజలు నీటిలో దిగడం, వ్యర్థాలను నీటిలో వేయడం వంటివి లేకపోవడంతో చూడటానికి నీళ్లు తేటగా కనిపిస్తున్నాయి. చేపలు ఇతర సముద్ర జీవులు కూడా నీటిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గంగా నదిలోకి పదోవంతు కాలుష్యం పరిశ్రమలు, సమీప హోటళ్ల నుంచి వచ్చ చేరుతుందని బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పీకే మిశ్రా వెల్లడించారు. లాక్డౌన్తో ప్రస్తుతం నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండటం, పరిశ్రమలు పనిచేయకపోవడం కారణంగా దాదాపు 40 నుంచి 50 శాతం వరకు గంగా నది నీరు నాణ్యత పెరిగిందని ఆయన చెప్పారు. అలాగే గత కొన్ని వారాలుగా ఆ ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదవ్వడంతో నీటి మట్టాలు పెరిగాయి. (కరోనా: వీధుల్లో తిరుగుతున్న దెయ్యాలు! ) కాగా కేవలం గంగా నది మాత్రమే కాకుండా యమునా నది నీటి నాణ్యత, నీటి పరిమాణంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కాలుష్యంతో నిండిన నది ప్రస్తుతం క్లీన్గా కనిపిస్తోంది. ఇక రోడ్లపై వాహానాలు తక్కువ ప్రయాణిస్తుండటంతో వాయు కాలుష్యం సైతం కనుమరుగయ్యింది. అలాగే ఇప్పటి వరకు కనిపించని అనేక వలస పక్షులు కూడా తిరిగి వచ్చాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో కొన్ని ప్రదేశాల్లో అడవిలో ఉండే జంతువులు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. (సెహ్వాగ్కు ‘రామాయణం’ గుర్తొచ్చింది..! -
ఐదుగురు పిల్లల్ని గంగానదిలోకి విసిరేసిన తల్లి
భోపాల్ : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. భర్తతో గొడవపడి ఓ మహిళ తన ఐదుగురు పిల్లల్ని నదిలో తోసేసింది. ఈ ఘటన భాదోహి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భాదోహి జిల్లా జహంగీరాబాద్ గ్రామానికి చెందిన మంజు యాదవ్, మృదుల్ యాదవ్లు భార్యాభర్తలు. గత ఏడాదిగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన మంజు యాదవ్ పిల్లల్ని నదిలోకి విసిరి చంపేయాలని నిర్ణయించుకుంది. శనివారం భార్యాభర్తల మధ్య మరోమారు ఘర్షణ జరిగింది. దీంతో మంజు తన పిల్లలను గంగానది ఒడ్డుకు తీసుకెళ్లి నదిలోకి విసిరేసింది. వారిలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీశారు. నదిలో గల్లంతైన మరో ముగ్గురి కోసం వెతుకుతున్నారని జిల్లా ఎస్పీ రాం బదన్ సింగ్ తెలిపారు. ఏడాది కాలంగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారని చెప్పారు. పిల్లలను గంగలో తోసేసిన తర్వాత కూడా ఆమె అక్కడ నుంచి వెళ్లలేదని స్థానికులు తెలిపారు. -
గంగా నదిలో మోదీ పడవ ప్రయాణం
-
గంగా నదిలో మోదీ పడవ ప్రయాణం
కాన్పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో శనివారం పవవ ప్రయాణం చేశారు. కాన్పూర్లోని అటల్ ఘాట్ నుంచి మొదలైన ఈ ప్రయాణంలో ప్రధానితోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ (సీఎం నితీష్కుమార్ స్థానంలో) ఉన్నారు. ప్రతిష్టాత్మక నమామి గంగా కార్యక్రమంలో భాగంగా గంగా ప్రక్షాళనకు జరుగుతున్న పనులను ప్రధాని పర్యవేక్షించారు. తొలిసారిగా జరుగుతున్న నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. గంగా ప్రక్షాళన తీరుతెన్నులను తెలుసుకునేందుకు ప్రధాని మోదీ కాన్పూర్లో పర్యటిస్తున్నారని పీఎంఓ కార్యాలయం ట్విటర్లో పేర్కొంది. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి కాన్పూర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కాగా, నమామి గంగా ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేసి గంగా నదిని శుద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. -
పవిత్ర జలం
మహారాష్ట్రలో ఏక్నాథ్ అనే భక్తుడుండేవాడు. ఓసారి గొప్ప పుణ్యక్షేత్రమైన కాశీ వెళ్లాడు. గంగానదిలో స్నానం చేసి అన్నపూర్ణ, విశ్వేశ్వరులను సందర్శించాడు. పవిత్ర గంగాజలాన్ని తీసుకుని రామేశ్వరం వెళ్లి అక్కడి సముద్రలో కలపడం నాటి ఆచారం. అంచేత రెండు బిందెలను గంగాజలంతో నింపి కావడిలో పెట్టుకుని తన శిష్యగణంతో రామేశ్వరం బయలుదేరాడు. అప్పటిలో ప్రయాణ సాధనాలు లేనందున కాలినడకనే వెళ్లేవారు. అలా వెళ్తుండగా ఓ గాడిద కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యం కంటపడి అక్కడ ఆగిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గాడిదకు తీరని దాహం వేసి ఉంటుందని గ్రహించిన ఏక్నాథ్ మనస్సు చలించిపోయింది. వెంటనే కావడిలో ఉన్న బిందెడు నీటిని దాని నోటిలో పోసి, దాని మీద కాసిని నీళ్లు చిలకరించాడు. కాసేపటికి లె ప్పరిల్లిన ఆ గాడిద కళ్లు తెరిచి కృతజ్ఞతాపూర్వకమైన చూపు చూస్తూ లేచి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఉదంతాన్ని తేరిపార చూసిన అతని శిష్యులు ‘‘స్వామీ! రామేశ్వరం తీసుకుని వెళ్తున్న పవిత్రమైన గంగాజలాన్ని గాడిద నోటిలో పోసి వృథా చేశారే! కాశీ వెళ్లిన ఫలితం కాస్తా బూడిదలో పోసిన పన్నీరైనట్లే కదా. ఇప్పుడు రామేశ్వరం వెళ్లి ఏంటి ప్రయోజనం?’’ అని అడిగారు. అందుకు ఏకనాథుడు స్పందిస్తూ ‘‘దేవుడు సమస్త జీవులలో ఉన్నాడు. ఏ జీవిని నిర్లక్ష్యం చేసినా దేవుణ్ణి బాధించినట్లే. అంచేత మనం ఏ జీవి ప్రాణ సంకట స్థితిలో ఉన్నా నిర్లిప్తత కూడదు. గంగాజలంతో ఓ జీవిని రక్షించగలిగానన్న సంతోషం నాకు రామేశ్వరం వెళ్లినంత సంతృప్తినిచ్చింది. ఆత్మసంతృప్తి కన్నా ఆనందం ఇంకేముంటుంది?’’ అన్నాడు. శిష్యులు ఏక్నాథుడికి తడికళ్లతో నమస్కరించారు.– వాండ్రంగి కొండలరావు -
ఉద్వేగానికి లోనైన బన్సూరి స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ : గుండెపోటుతో హఠాన్మరణానికి గురైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అస్థికలను ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్ గురువారం యూపీలోని హపూర్ వద్ద గంగా జలాల్లో నిమజ్జనం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి స్వరాజ్ కౌశల్ వెంట రాగా బన్సూరి స్వరాజ్ ఈ క్రతువును నిర్వహించారు. 67 సంవత్సరాల సుష్మా స్వరాజ్ ఎయిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అధికార లాంఛనాల నడుమ బుధవారం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
ముక్తేశ్వర ఘాట్లో మద్యపానం
-
ముక్తేశ్వర ఘాట్లో మద్యపానం : వీడియో వైరల్
లక్నో: గంగానది ఒడ్డున దేవాలయ పరిసరాల్లో కొందరు యాత్రికులు అర్థనగ్నంగా మద్యం సేవిస్తున్న వీడియో వైరలవుతోంది. వీరు కన్వర్ యాత్రికులుగా భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గంగా నది ప్రవహిస్తున్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నదీముఖంగా ఉన్న శివాలయాలను దర్శించడానికి ఈ రోజుల్లో యాత్రికులు దేశం నలుమూలల నుంచి వస్తారు. దీనినే కన్వర్ యాత్ర అంటారు. ఈ నేపథ్యంలో కొందరు యాత్రికులు యూపీలోని హాపూర్లో గల ముక్తేశ్వర్ ఘాట్లో మద్యం సేవిస్తున్న వీడియో బయటపడింది. హిందువులు పవిత్రంగా భావించే ఇలాంటి ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషిద్ధం. అంతేకాక నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంపై హాపూర్ ఎసిపి సర్వేశ్ మిశ్రా ఎఎన్ఐతో మాట్లాడుతూ.. ప్రజలు పవిత్రంగా భావించే ప్రదేశాల్లో ఇలా చేయడం చట్టరీత్యా నేరం. వీడియోలో ఉన్న వ్యక్తులను ఇప్పటికే గుర్తించాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
బయటపడితే మ్యాజిక్.. లేదంటే ట్రాజిక్
కోల్కతా : ఇంద్రజాల ప్రదర్శనతో జనాలను ఆశ్చర్యపరచాలని భావించిన ఓ మేజిషియన్ చివరకు తానే కానరాకుండా పోవడంతో విషాదం అలుముకుంది. మ్యాజిక్ అంటేనే రకారకాల ట్రిక్కులు ప్రయోగించి క్షణాల్లో మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఒక వేళ అవి ఫెయిలయితే ఫలితం దారుణంగా ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి కోల్కతాలో చోటు చేసుకుంది. ట్రిక్కు పని చేయకపోవడంతో ఏకంగా మేజిషయనే గల్లంతయ్యాడు. వివారాలు.. జాదుగర్ మంద్రాకేగా ప్రసిద్ధి పొందిన చంచల్ లాహిరి (40) ఆదివారం పోలీసులు, మీడియా, కుటుంబసభ్యులు చూస్తుండగా విన్యాసం ప్రదర్శించేందుకు గంగా నదిలోకి దిగారు. ఉక్కు సంకెళ్లు, తాడుతో తనను తాను ఓ బాక్స్లో బంధించుకుని గంగా నదిలోకి దిగి సురక్షితంగా బయటకు వచ్చే విన్యాసాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో కోల్కతాలోని హౌరా బ్రిడ్జి మీదుగా గంగా నదిలోకి దిగారు చంచల్ లాహిరి. కానీ దురదృష్టవశాత్తు కనిపించకుండా పోవడంతో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 21 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఇదే విన్యాసం విజయవంతంగా చేసినట్లు విన్యాసం ప్రారంభానికి ముందు లాహిరి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బుల్లెట్ప్రూఫ్ గ్లాస్ బాక్సులో కూర్చుని సంకెళ్లతో బంధించుకున్నాను. తాళం వేసేశారు. 29సెకన్లలో బయటికి వచ్చేశాను. ఈసారి బయటకు రావడం కష్టమే. బయటకు రాగలిగితే మ్యాజిక్ అవుతుంది. లేదంటే ట్రాజిక్ అవుతుంది’ అని లాహిరి వ్యాఖ్యానించారు. ఆయన ఊహించినట్లే మ్యాజిక్ కాస్తా ట్రాజిక్ అవడం విచారకరం. -
‘ప్రియాంక’ గంగాయాత్ర
అలహాబాద్: లోక్సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రాభవాన్ని తిరిగి తెచ్చేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నడుం బిగించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సోమవారం ‘గంగా యాత్ర’ ప్రారంభించారు. ‘మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి’అంటూ ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘మా సోదరుడు ఏం చెబుతాడో.. అదే చేసి చూపిస్తాడు’ అని ప్రజలకు స్పష్టం చేశారు. ప్రయాగరాజ్ జిల్లాలోని కఛ్నర్ తెహ్సీల్లో ఉన్న మనయ్య ఘాట్ నుంచి గంగానదిలో మోటారు బోటులో ప్రయాణం ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు ఉత్తరప్రదేశ్లో మూడు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. అలహాబాద్ నుంచి వారణాసి వరకు గంగా నదిలో బోటు ద్వారా 100 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణిస్తారు. బోటు ప్రయాణం ప్రారంభించడానికి ముందు సంగం వద్ద ఉన్న బడే హనుమాన్ మందిర్లో పూజలు నిర్వహించారు. ప్రసంగాలు ఇవ్వడం కంటే ప్రజల కష్టాలు, సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఎన్నికలు గాంధీ కుటుంబానికి పిక్నిక్ లాంటిదని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘వారు వస్తారు. బస చేస్తారు. పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. ఎన్నికలు అయిపోగానే ఏ స్విట్జర్లాండ్కో, ఇటలీకో వెళ్తారు’అని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ విమర్శించారు. ‘పప్పు కీ పప్పీ వచ్చారు’ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ను ‘పప్పు’అని, ఆయన సోదరి ప్రియాంకను ‘పప్పీ’ అని కేంద్రమంత్రి మహేశ్ శర్మ ఎద్దేవా చేశారు. ‘‘ప్రధాని కావాలని పప్పు అంటుంటారు. ఇప్పుడు కొత్తగా ‘పప్పు కీ పప్పీ’ వచ్చారు’’అని శర్మ అన్నారు. శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ‘ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో.. మాటలూ అలాగే ఉన్నాయి. కేంద్రమంత్రి స్థానంలో ఉండి ఓ మహిళ పట్ల అలా ఎలా మాట్లాడతారు’ అని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ధీరజ్ గుర్జర్ మండిపడ్డారు. -
రూ. 5 లక్షలు పలికిన చెక్క బైక్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పొందిన 1,800పైగా మెమొంటోల వేలం ద్వారా నిధులను ఆర్జించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వ పథకమైన నమామి గంగే కింద గంగానది ప్రక్షాళనకు వినియోగించనున్నట్లు పేర్కొంది. గత నెలలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడ్రన్ ఆర్ట్ ఆధ్వర్యంలో రెండు వారాల పాటు మోదీ పొందిన మెమొంటోలను వేలం వేసిన సంగతి తెలిసిందే. ఇందులో చెక్కతో చేసిన వినూత్న బైక్కు వేలంపాటలో రూ.5 లక్షలు రాగా, రైల్వే ప్లాట్ఫామ్లో ఉంచిన నరేంద్ర మోదీ చిత్రలేఖనానికి కూడా ఇంతే మొత్తం లభించింది. ఇంకా..రూ.5వేలు విలువ చేసే శివుడి విగ్రహాన్ని వేలం వేయగా, రూ.10 లక్షలు పొందినట్లు పీఎమ్వో తెలిపింది. రూ.4వేల విలువ చేసే చెక్కతో చేసిన అశోక స్తంభం ప్రతిరూపం రూ.13 లక్షలకు అమ్ముడుపోయినట్లు పేర్కొంది. అలాగే రూ.2 వేలు విలువ చేసే అస్సాంలోని మజూలి సంప్రదాయ ‘హొరాయి’ ద్వారా రూ.12 లక్షలు, రూ.4 వేలు విలువ చేసే గౌతమ్ బుద్ధ విగ్రహానికి వేలంలో రూ.7 లక్షలు వచ్చినట్లు వెల్లడించింది. -
పథకాల పేరు మార్పే.. జరిగిందేమీ లేదు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకే కొత్త పేర్లు పెట్టడంలో పేరుపొందిన నరేంద్ర మోదీ ప్రభుత్వం గంగా ప్రక్షాళన పథకానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం అనేక కొత్త పేర్లను తీసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం రాకముందున్న ‘వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ (జలవనరుల మంత్రిత్వ శాఖ)’ని ‘మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్వునేషన్ (జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుద్ధరణ మంత్రిత్వ శాఖ)’గా మార్చింది. ‘ది నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ’ని ‘నేషనల్ గంగా కౌన్సిల్’గా మార్చింది. 2015లో నమామి గంగా ప్రాజెక్ట్ను ప్రారంభించి 20 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి గంగా ప్రక్షాళన పథకాన్ని 2018, జూలై నెలలోగా పూర్తి చేస్తామని శపథం చేయగా, 2019లో పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. ‘గంగా రిజ్వునేషన్ బేసిన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్’ అంటూ కేంద్ర ప్రభుత్వం ఓ నివేదికను కూడా తీసుకొచ్చింది. సలహాలు, సూచనల కోసం ఈ నివేదికను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు పంపించాల్సి ఉండగా, ఇంతవరకు ఏ మంత్రిత్వ శాఖకు పంపించిన దాఖలాలు లేవు. నేషనల్ రివర్ గంగా (రిజువినేషన్, ప్రొటెక్షన్, మేనేజ్మెంట్) బిల్ను 2017లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. గంగా ప్రొటెక్షన్ కోర్ పేరిట ఓ సాయుధ దళం ఏర్పాటుకు, గంగా కాలుష్యానికి కారకులవుతున్న వారికి భారీ నష్ట పరిహారం, జైలు విధించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. గంగా ప్రక్షాళనకు స్వయం ప్రతిపత్తి గల సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయకుండా బిల్లును తీసుకరావడం ఏమిటని గంగా ప్రక్షాళన కోసం గురువారం నాడు ప్రాణాలర్పించిన అగర్వాల్ నాడు ప్రశ్నించారు. కాలుష్యానికి కారకులవుతున్న వారికి రెండు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉన్న ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదు. ఈలోగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ గంగా ప్రక్షాళన పనులను పక్కన పెట్టి గంగా, బ్రహ్మ పుత్ర నదుల అనుసంధానంపై దృష్టిని కేంద్రీకరించింది. 2002లో అప్పటి అటల్ బిహారి వాజపేయి ప్రతిపాదించిన ఈ పథకానికి 8,700 కోట్ల డాలర్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. నదుల అనుసంధానం వల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు జల వనరులు అందుబాటులో ఉంటాయని, వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందిగానీ, నదుల అనుసంధానం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు కెన్–బెట్వా నదుల అనుసంధానం వల్ల పన్నా టైగర్ రిసర్వ్లో ఎక్కువ భాగం నీట మునిగి పోతుంది. ఉత్తరాఖండ్కు 2013లో భారీ వరదలు రావడంతో ఏకంగా ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న 24 జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులను సుప్రీం కోర్టు నిలిపివేసింది. వాటిని పునర్ సమీక్షించాల్సిందిగా కోరుతూ జల వనరులు, పర్యావరణ మంత్రిత్వ శాఖలు సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. గంగా ప్రక్షాళన కార్యక్రమాలపై గత నాలుగేళ్లుగా నేతల ఊక దంపుడు ఉపన్యాసాలేగానీ, చెప్పుకోతగ్గ పురోగతి మాత్రం సాధించలేదు. అదే గనుక జరిగి ఉంటే నేడు అగర్వాల్ ప్రాణాలు పోయేవి కావు. చదవండి: నా మరణంతోనే దీక్ష ముగింపు: అగర్వాల్ గంగా ప్రక్షాళన గంగపాలు! -
నా మరణంతోనే దీక్ష ముగింపు: అగర్వాల్
సాక్షి, న్యూఢిల్లీ : కొంత మంది ప్రాణాలకు ఎప్పటికీ విలువ కట్టలేం. అలాంటి కోవకు చెందిన అతి కొద్ది మందిలో గంగా ప్రక్షాళన కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రముఖ పర్యావరణ వేత్త జీడీ అగర్వాల్ (86) ఒకరు. సాధ్యమైనంత త్వరగా గంగా నదిని ప్రక్షాళించాలని, అది నిరంతరం ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం గంగా ఉప నదులపై చేపట్టిన జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలని, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ 111 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అగర్వాల్ గురువారం నాడు రూర్కెలాలోని ఏయిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. అంతకుముందు తేనె మంచి నీళ్లను మాత్రమే తీసుకున్న అగర్వాల్ తన ఉద్యమాన్ని తీవ్రం చేయడంలో భాగంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి తేనె మంచి నీళ్లను కూడా మానేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయన్ని బలవంతంగా బుధవారం నాడు రూర్కెలా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని ఢిల్లీలోని ఏయిమ్స్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుకు అంగీకరించలేదు. చివరకు గురువారం నాడు కన్నుమూశారు. స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్గా కూడా సుపరిచితుడైన అగర్వాల్, మామూలు నిరసనకారుడో, మొండి పర్యావరణ వేత్తనో కాదు. ఉన్నత విద్యావంతుడు. కాన్పూర్ ఐఐటీలో సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా పనిచేశారు. నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ బోర్డు సభ్యుడిగా, కేంద్ర కాలుష్య నియంత్రణా బోర్డు మొట్టమొదటి సభ్య కార్యదర్శిగా పనిచేశారు. దేశంలోని నదుల పరిరక్షణ కోసం వివిధ స్థాయిల్లో, వివిధ రీతుల్లో ప్రభుత్వంతో కలసి పనిచేశారు. నదుల పరిరక్షణ కోసమే ఆయన 2008 నుంచి 2012 మధ్య నాలుగు సార్లు ఆమరణ దీక్షలు చేశారు. గంగా నదీ జలాల ప్రక్షాళన గురించి కేంద్రం పట్టించుకోవడం లేదన్న కారణంగా ఆయన ‘నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ’ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. మిగతా సభ్యులను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. ఈసారి తప్ప ఆయన ఎప్పుడు నిరాహార దీక్ష చేసినా దాన్ని ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. గంగానదిలో కలిసే ప్రధాన నదుల్లో ఒకటైన భగీరథిపై డ్యామ్ల నిర్మించరాదంటూ అగర్వాల్ 2010, జూలైలో నిరాహార దీక్ష చేపట్టారు. అప్పటి పర్యావరణ, అటవి, వాతావరణ మార్పుల శాఖ మంత్రి జైరామ్ రమేశ్ స్వయంగా వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. డిమాండ్లను అంగీకరించి దీక్షను విరమింప చేశారు. పోలీసుల ప్రవర్తనపై కేసు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో అగర్వాల్ జూన్ 22వ తేదీన తన డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరాహార దీక్షకు కూర్చున్నారు. జూలై 10వ తేదీన పోలీసులు రంగప్రవేశం చేసి బలవంతంగా ఆయన్ని గుర్తుతెలియని చోటుకు తరలించారు. ఆ మరుసటి రోజు వారి చెర నుంచి విడుదలైన అగర్వాల్ పోలీసు చర్యను సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టులో కేసు పెట్టారు. తాను శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగించకుండా శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అనవసరంగా పోలీసులు జోక్యం చేసుకున్నారని, తన అనుచరుల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రాణాలకు ముప్పన్నా పట్టించుకోలేదు! అగర్వాల్తో సంప్రతింపులు జరిపి వచ్చే 12 గంటల్లోగా సమస్యను పరిష్కరించాలని కోరతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు జూలై 12వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గంగా నదిలో కలిసే భగీరథి, పల్మనారి, లోహరి నాగ్పాల్, భెరోఘాటి నదులపై విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని అగర్వాల్ డిమాండ్ చేశారు. ఈ అంశం తన పరిధిలో లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతులు దులిపేసుకున్నారు. రామన్ మెగసెసె అవార్డు, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ గ్రహీత, ప్రముఖ జల వనరుల కార్యకర్త రాజేంద్ర సింగ్ జోక్యం చేసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వయంగా ఓ లేఖ రాశారు. అగర్వాల్ ప్రధాన డిమాండైన నదులపై డ్యామ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం 2017లోనే ప్రతిపాదించిన ‘గంగా ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్’ బిల్లును ఆమోదానికి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో రాజేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. అప్పటికీ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న అగర్వాల్ ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆయన ఆ లేఖలో హెచ్చిరించినట్లు తెలుస్తోంది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. నా మరణంతో దీక్ష ముగింపు: అగర్వాల్ హరిద్వార్లో 109 రోజుల పాటు కేవలం కొంచెం తేనే, మంచినీరు తీసుకుంటూ నిరాహార దీక్ష కొనసాగించిన అగర్వాల్ సెప్టెంబర్ 9వ తేదీన తాను ఇక నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని శపథం చేశారు. ‘నా చావుతోనే నా దీక్ష ముగుస్తుంది’ అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని సెప్టెంబర్ పదవ తేదీన ఆయన్ని హరిద్వార్ నుంచి రూర్కెలాలోని ఏయిమ్స్కు తరలించారు. అప్పటికే 9 కిలోల బరువు తగ్గిన అగర్వాల్ ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. గంగా ప్రక్షాళన పనుల్లో జాప్యం జరిగితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, 2018. జూలైలోగా గంగా ప్రక్షాళన జరక్కపోతే అదే గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని (2017, ఫిబ్రవరి 22న) శపథం చేసిన కేంద్ర మంత్రి ఉమా భారతి ఇప్పటికీ నిక్షేపంగా ఉండడమే కాకుండా బరువు తగ్గిన దాఖలాలు కూడా లేవు. చదవండి: గంగా ప్రక్షాళన గంగపాలు! -
గంగా ఉద్యమ యోధుడు కన్నుమూత
గంగా నది పరిరక్షణ కోసం నిరశన దీక్ష చేపట్టిన ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్(86) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ అయిన అగర్వాల్.. గంగానది ప్రక్షాళనకు తన జీవితాన్ని అంకితం చేశారు. గంగా నదిని కాలుష్యరహితం చేయాలని, దాని ప్రవాహాన్ని నిరోధించరాదని కోరుతూ అగర్వాల్ గత జూన్ 22 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. 109 రోజుల పాటు కేవలం తేనె కలిపిన నీరు మాత్రమే తీసుకున్నారు. కేంద్రం స్పందించకపోవడంతో ఇకపై నీరు కూడా తాగనంటూ ఈనెల 9న ప్రకటించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బుధవారం రాత్రి రిషీకేశ్లోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్లో 1932లో జన్మించిన అగర్వాల్.. రూర్కీ వర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డిగ్రీ పొందారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్లో డాక్టరేట్ పొందారు. అనంతరం కాన్పూర్ ఐఐటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. 1979లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు మొదటి మెంబర్ సెక్రెటరీగా పని చేశారు. అదే సమయంలో ఐఐటీ రూర్కీలో విజిటింగ్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత 2012లో సన్యాసం స్వీకరించి తన పేరును స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్గా మార్చుకున్నారు. -
గంగా ప్రక్షాళన గంగపాలు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నా అంతట నేను ఇక్కడికి రాలేదు. నన్ను ఎవరూ ఇక్కడికి పంపించ లేదు. తల్లి గంగనే నన్ను ఇక్కడికి రప్పించిందని భావిస్తున్నాను’ అని 2014, ఏప్రిల్ 24వ తేదీన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అదే రోజు ఆయన వారణాసి నుంచి లోక్సభకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను బాబా బోలేనాథ్ ఆశీర్వాదంతో శబర్మతి ఆశ్రమాన్ని ఎలా తీర్చిదిద్దానో అలాగే వారణాసిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను అని కూడా మోదీ అదే రోజు సాయంత్రం తన బ్లాగ్లో రాసుకున్నారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే వారణాసికి వచ్చి గంగకు హారతి ఇచ్చారు. గంగానది ప్రక్షాళన కోసం 20,000 కోట్ల రూపాయలతో ‘నమామి గంగా’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గంగా నదిలో కాలుష్యం శాతం 2014లో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గంగా నది ప్రక్షాళనకు మొత్తం 20 వేల కోట్ల రూపాయలను కేటాయించగా, వాటిని 2020 అంటే, మరో రెండేళ్లలో ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన ప్రాజెక్టుల పూర్తి ఎంత వరకు వచ్చాయో తెలుసుకునేందుకు మీడియా ఆర్టీఐ కింద పలు దరఖాస్తులు దాఖలు చేయగా, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మురుగు కాల్వల ప్రక్షాళన, పారిశ్రామిక వ్యర్థాల ట్రీట్మెంట్, గంగా నది ఉపరితలం క్లీనింగ్ కోసం నమామి గంగా పథకంలో భాగంగా కేంద్రం 221 ప్రాజెక్టులను ప్రకటించింది. వాటికి 2,238.73 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. 221 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 58 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టుల్లో 26 శాతం ప్రాజెక్టులు మాత్రమే పూర్తయినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. 105 సీవరేజ్, ఎస్టీపీ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రాజెక్టులన్నింటినీ 2019, మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మూడేళ్ల కాలంలో 26 శాతానికి మించి పూర్తికాని ప్రాజెక్టులను వచ్చే ఆరేడు నెలల్లో ఎలా పూర్తి చేస్తారో ఆయనకే తెలియాలి. ఆయనకంటే ముందు జల వనరుల శాఖ మంత్రిగా గంగా నది ప్రక్షాళన ప్రాజెక్ట్ను పర్యవేక్షించిన ఉమా భారతి 2017, ఫిబ్రవరి 21వ తేదీన మీడియాతో మాట్లాడుతూ 2018, జూలై నెల నాటికి ప్రాజెక్ట్ పూర్తికాకపోతే గంగానదిలోనే దూకి ఆత్మార్పణం చేసుకుంటానని శపథం చేశారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాకపోతే గంగా నది ఒడ్డున ఆమరణ దీక్ష చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆమె శపథాలు, ప్రతిజ్ఞల సంగతి పక్కన పెడితే ఆమె ఆధ్వర్యంలో పనులు మందగమనంతో కూడా నడవడం లేదని గ్రహించిన మోదీ ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలో ఆమెను జలవనరుల శాఖ నుంచి తప్పించి, ఆ శాఖను నితిన్ గడ్కరీకి అప్పగించింది. మునుపటికన్నా ఇప్పుడు గంగా జలాల కాలుష్యం శాతం పెరిగిందంటే ప్రాజెక్టుల పేరిట ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన సొమ్మంతా గంగ పాలేనా? అని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. -
గంగానదిలో వాజ్పేయి అస్థికల నిమజ్జనం
-
గంగానదిలో వాజ్పేయి అస్థికల నిమజ్జనం
హరిద్వార్ / లక్నో: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అస్థికలను ఆదివారం హరిద్వార్లోని హర్కీ పౌడీ ప్రాంతంలోని గంగానదిలో నిమజ్జనం చేశారు. వాజ్పేయి దత్త పుత్రిక నమితా భట్టాచార్య, అల్లుడు రంజన్ భట్టాచార్యలు వేదమంత్రోచ్ఛారణల నడుమ ఈ క్రతువును పూర్తిచేశారు. తొలుత బీజేపీ చీఫ్ అమిత్ షా వాజ్పేయి అస్థికలతో ప్రత్యేక విమానంలో ఉత్తరాఖండ్లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకున్నారు అనంతరం భల్లా కళాశాల మైదానం నుంచి హర్ కీ పౌడీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన వేదిక వరకూ ‘అస్థి కలశ్ యాత్ర’ను నిర్వహించారు. ఈ సందర్భంగా హరిద్వార్ వీధుల్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. కొందరు స్థానికులు వాజ్పేయి అస్థికలున్న కలశంపై పూలవర్షం కురిపించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తదితరులు 2 కి.మీ దూరం సాగిన ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, బీజేపీ కార్యకర్తలు వాజ్పేయి అమర్ రహే, వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. చివరికి హర్ కీ పౌడీలో వాజ్పేయి అస్థికలను రంజన్, నమిత తీసుకురాగా.. తీర్థ్ పురోహిత్ అఖిలేశ్ శాస్త్రి నిమజ్జన క్రతువును పూర్తిచేశారు. ఈ కార్యక్రమం 25 నిమిషాల పాటు కొనసాగింది. అస్థి కలశ్ యాత్ర సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం హరిద్వార్లో కట్టుది ట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్ర మార్గంలో 1,000 మంది పోలీసులు, సాయుధ బలగాలను మోహరించారు. మరోవైపు రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్లాల్ సైనీ మాట్లాడుతూ.. వాజ్పేయి అస్థికలను దుంగర్పూర్లోని బనేశ్వర్ ధామ్, కోటలోని ఛంబల్ నది, అజ్మీర్లోని పుష్కర్ సరోవర్లో కూడా నిమజ్జనం చేస్తామని వెల్లడించారు. ఈసారి బక్రీద్ను ఆడంబరంగా జరుపుకోం వాజ్పేయి మరణం నేపథ్యంలో ఈ నెల 22న బక్రీద్ పండుగను ఆడంబరంగా జరుపుకోబోమని ఉత్తరప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ అసిఫా జమానీ(75) తెలిపారు. మాజీ ప్రధానితో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధముందని ఆమె మీడియాకు వెల్లడించారు. బీజేపీని ఏర్పాటుచేసిన రోజుల్లోనే తన భర్త ఐజాజ్ రజ్వీ, వాజ్పేయిల మధ్య పరిచయముందని అసిఫా అన్నారు. ‘బక్రీద్ పండుగ వేళ వాజ్పేయి లక్నోలో ఉన్నారంటే మా ఇంటికి కచ్చితంగా వచ్చేసేవారు. ఆయన లక్నోలో అడుగుపెట్టిన ప్రతిసారి ఆయన్ను తీసుకొచ్చేందుకు నా భర్త చార్బాగ్ రైల్వేస్టేషన్కు వెళ్లేవారు. వాజ్పేయి లక్నోలో ఎంపీగా పోటీచేసినప్పుడు ఆయన నామినేషన్ పత్రాలను నా భర్తే తయారుచేశారు. కేవలం వాజ్పేయి కారణంగానే నా భర్త రజ్వీ యూపీ ఎమ్మెల్సీగా మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన్ను వాజ్పేయి ఎంతగా నమ్మేవారంటే.. పేపర్లు రెడీగా పెడితే వచ్చి సంతకం పెట్టేసి నామినేషన్ వేసేద్దామని అటల్జీ ఫోన్ చేసి చెప్పేవారు. బక్రీద్ వేళ లక్నోలో ఉంటే వాజ్పేయి మా ఇంటికి వచ్చేసేవారు. రాగానే ‘నా కిమామి సేమియా ఎక్కడుంది? వెంటనే తీసుకురండి’అని చెప్పేవారు. కానీ ఆయన ఆరోగ్యం దృష్ట్యా తక్కువ చక్కెరతో వాజ్పేయి కోసం కిమామి సేమియా చేసేదాన్ని. దాన్ని నోట్లో పెట్టుకోగానే చక్కెర తక్కువగా ఉందని అటల్జీ ఫిర్యాదు చేసేవారు. అనంతరం నవ్వుతూ దాన్నంతా తినేసేవారు.’అంటూ అప్పటి రోజుల్ని అసిఫా గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబంతో గడిపిన తర్వాత తిరిగివెళుతూ.. ఇద్దరు పిల్లలకు రెండు వెండి కాయిన్లను బక్రీద్ బహుమతిగా వాజ్పేయి ఇచ్చేవారన్నారు. తన భర్త 1998లో అకస్మాత్తుగా చనిపోగా.. తమ కుటుంబానికి వాజ్పేయి అండగా నిలిచారని ఆమె తెలిపారు. అంతటి అనుబంధం ఉన్న వాజ్పేయి చనిపోవడం తామందరినీ తీవ్రంగా బాధించిందనీ, అందువల్లే ఈసారి బక్రీద్ను నిరాడంబరంగా జరుపుకుంటామని అసిఫా జమానీ స్పష్టం చేశారు. -
నేడు హరిద్వార్లో వాజ్పేయి అస్థికల నిమజ్జనం
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అస్థికలను దేశంలోని అన్ని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తామని బీజేపీ తెలిపింది. ఆదివారం హరిద్వార్లోని గంగానది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. హరిద్వార్లో జరిగే వాజ్పేయి అస్థికల నిమజ్జన కార్యక్రమానికి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. వాజ్పేయి ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించింది. కాగా, ఈ నెల 20న ఢిల్లీలో వాజ్పేయి సంస్మరణ సభను నిర్వహిస్తామని యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీతో పాటు వేర్వేరు పార్టీల నేతలు, ప్రముఖులు హాజరవుతారన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆగస్టు 23న నిర్వహించే మరో సంస్మరణ సభకు వాజ్పేయి కుటుంబ సభ్యులతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటా రన్నారు. వాజ్పేయి అస్థికలను లక్నోలో ని గోమతి నదిలోనూ కలుపుతామన్నారు. వాజ్పేయి అస్థికలను దేశంలోని అన్ని నదుల్లోనూ కలపడంతో పాటు ఆయన అస్థి కలశాన్ని అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా కేంద్రాలకు తీసుకెళ్తామన్నారు. అన్ని పంచాయతీ, జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో సంతాప సమావేశాలు నిర్వహిస్తామన్నారు. భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమవుతున్న కేరళకు ఆయన సంఘీభావం తెలిపారు. కేరళ వాసులకు సాయం చేసేందుకు దేశవ్యాప్తంగా నిత్యావసరాలు, ఆహారం, ఇతర వస్తువులను సేకరిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి పి.మురళీధర్ రావు అన్నారు. -
బీజేపీకి దేశం బంగారు బాతు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గంగానది అంత పవిత్రంగా చూస్తుంటే బీజేపీ మాత్రం దేశాన్ని బంగారు బాతులా చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. దేశంలోని సంపదను తన స్నేహితులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన సంజీ విరాసత్ బచావో సమ్మేళన్ కార్యక్రమానికి రాహుల్ హాజరై మాట్లాడారు. జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్ ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, జేడీఎస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఆర్ఎల్డీ, ఎన్సీపీ సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు, రైతులను అస్సలు పట్టించుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు. ఈ బంగారు బాతును బంధించేందుకు బీజేపీ పంజరాన్ని తయారుచేస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు తాము సర్వశక్తులా పోరాడతామని స్పష్టం చేశారు. తాము బీజేపీ ముక్త్ భారత్ను కోరుకోవడం లేదని, బీజేపీని నాశనం చేయాలనుకోవడం లేదని రాహుల్ అన్నారు. తమ సిద్ధాంతాలు, భావజాలం బీజేపీ కంటే బలమైనవని మాత్రమే నిరూపించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతిపక్షాలన్నీ కలసి రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశమంతా బీజేపీని ఓడిస్తాయని రాహుల్ జోస్యం చెప్పారు. అలాగే రూ.524 కోట్ల విలువైన ఒక్కో రాఫెల్ యుద్ధ విమానానికి కేంద్రం రూ.1,600 కోట్లు చెల్లిస్తోందని దుయ్యబట్టారు. ఎర్రకోటపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఒక్కో వాక్యం పూర్తిచేశాక మోదీ అక్కడ ఉన్న టీచర్లవైపు చూస్తారనీ, దీంతో వాళ్లు పిల్లల చేత చప్పట్లు కొట్టిస్తున్నారని రాహుల్ అన్నారు. ఇదంతా పక్కా డ్రామాలా సాగిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీఎస్ అధికార ప్రతినిధి డానిష్ అలీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ నేత తారీఖ్ అన్వర్, డీఎంకే నేత తిరుచ్చి శివ, టీఎంసీ నాయకుడు చన్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. -
నందాదేవి.. ఓ మిస్టరీ.. పొంచి ఉన్న అణు ముప్పు!!
ఐదు దశాబ్దాల క్రితం జరిగిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు మన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనాపై నిఘా పెట్టడానికి హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణులకు తరలించిన అణు పరికరం.. భవిష్యత్తులో ఏం ప్రకంపనలు రేపుతుందోనని గుబులు రేపుతోంది. మంచులో కూరుకుపోయిన దాని జాడ పసిగట్టేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. మరోవైపు ఆ సీక్రెట్ ఆపరేషన్ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. అసలు అప్పుడేం జరిగింది ? మనకు పొంచి ఉన్న ముప్పేంటి ? 53 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే... అది 1964 సంవత్సరం. చైనా తొలిసారిగా అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు ముఖ్యంగా పెద్దన్న అమెరికాకు దడ పుట్టించింది. దీంతో చైనా అణుపాటవం తెలుసుకోవడానికి హిమాలయాల్లో సెన్సార్లు ఏర్పాటు చేయాలని అమెరికా భావించింది. దీనికి భారత్ సహకారం కోరింది. అనాలోచితంగా భారత్ దీనికి అంగీకరించింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంయుక్తంగా చైనా అణుకార్యకలాపాలపై హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణుల నుంచి నిఘా పెట్టడానికి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలకు చెందిన సిబ్బంది అణు ఇంధనంతో నడిచే జనరేటర్, ప్లుటోనియం క్యాప్సూల్స్, ఏంటెనాలు ఏర్పాటు చేయడానికి 1965 జూన్ 23న అలాస్కాలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత అక్టోబర్లో నందాదేవి శ్రేణులకు వెళ్లారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జనరేటర్, క్యాప్సూల్స్ను అక్కడే విడిచి వచ్చేశారు. వాతావరణం చక్కబడ్డాక తిరిగి వెళ్లి చూస్తే అవి అక్కడ కనిపించలేదు. ఎక్కడో మంచులో కూరుకుపోయా యి. వాటిని అలాగే వదిలేస్తే ప్రమాదం ఉంటుందని భావించిన ఈ బృందం తిరిగి 1966, 67లలో కూడా హిమాలయాలకు వెళ్లి వాటి కోసం విస్తృతంగా గాలించాయి. కానీ లాభం లేకుండా పోయింది. అవెక్కడున్నాయో కనిపెట్టలేకపోయారు. అది రహస్య ఆపరేషన్ కావడంతో చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయారు. అయితే అప్పట్లో భారత్ బృందానికి నేతృత్వం వహించిన కెప్టెన్ మన్మోహన్సింగ్ కోహ్లి మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడాయనకు 88 ఏళ్లు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున పరికరాల జాడ కనిపెట్టాలంటున్నారు. క్యాప్సూల్స్తో ప్రమాదం ఎలా ? ప్లుటోనియం క్యాప్సూల్స్ జీవితకాలం వందేళ్లు. ఆ తర్వాత అవి కరిగిపోతాయి. ఇప్పటికే 53 ఏళ్లు గడిచిపోగా మరో 47 ఏళ్లే మిగిలి ఉంది. గంగానదికి అణు ముప్పు ప్లుటోనియం క్యాప్సూల్స్ ఒకవేళ కరిగిపోయి రిషి గంగలో కలిస్తే పవిత్ర జలాలన్నీ కలుషితమైపోతాయి. ఆ నీటిని వినియోగిస్తే ఎందరో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉన్న ప్రజలు రేడియేషన్ బారినపడే అవకాశం ఉంది. ఇప్పుడేం చేస్తారు? ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పల్ మహరాజ్ ఇటీవల ప్రధాని మోదీని కలిసి గంగానదికి ఉన్న అణుముప్పు గురించి వివరించారు. ప్లుటోనియం క్యాప్సూల్స్ను వెలికితీయకపోతే 40ఏళ్ల తర్వాత పెను ప్రమాదం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాడార్లు, సెన్సార్ల ద్వారా 10–15 అడుగుల లోతైన మంచు పొరలను తొలిచి ఆ పరికరాల జాడ కనుగొనాలని కోరారు. ఇందుకు కేంద్రం ఓకే చెప్పింది. తెరకెక్కనున్న హాలీవుడ్ సినిమా... స్మోక్ సిగ్నల్స్, హోమ్ ఎలోన్ వంటి చిత్రాలను నిర్మించిన హాలీవుడ్ నిర్మాత స్కాట్ రోజెన్ఫెల్ట్ని ఈ సీక్రెట్ మిషన్ విపరీతంగా ఆకర్షించింది. కెప్టెన్ కోహ్లి ఈ ఆపరేషన్పై స్పైస్ ఇన్ హిమాలయాస్ పేరుతో చాలా ఏళ్ల కిందటే ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం హక్కుల్ని రోజెన్ఫెల్ట్ పదేళ్ల క్రితమే కొనుగోలు చేశారు. కానీ బడ్జెట్ సరిపోక ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మలబెర్రి ఫిలిమ్స్, రోజెన్ఫెల్ట్ సంయుక్తంగా 2 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీక్రెట్ ఆపరేషన్లో పాల్గొన్న పలువురిని రోజెన్ఫెల్ట్ కలసి వారు చెప్పిన అనుభవాలతో ఆపరేషన్ నందాదేవిని తెరకెక్కిం చనున్నారు. భారత్ సిబ్బంది పాత్రల్లో భారతీయులనే తీసుకోనున్నారు. కెప్టెన్ కోహ్లి పాత్రకు రణబీర్ను సంప్రదించినట్టు సమాచారం. -
‘సిగరెట్’ తరహాలో గంగ హెచ్చరికలు
న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న హెచ్చరిక తరహాలో గంగా నది కాలుష్యంపై పరీవాహక ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా(ఎన్ఎంసీజీ)ను ఆదేశించింది. గంగా నది తీవ్రస్థాయిలో కలుషితం కావడంపై ఎన్జీటీ ఆవేదన వ్యక్తం చేసింది. హరిద్వార్ నుంచి ఉన్నావ్ మధ్య గంగా నది నీరు కనీసం స్నానానికి పనికిరావని వ్యాఖ్యానించింది. ‘ ప్రజలు గంగా నీటిని భక్తి భావంతో సేవిస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు. కేవలం సిగరెట్ ప్యాకెట్ల మీదే ‘పొగతాగడం మీ ఆరోగ్యానికి హానికరం’ అని రాస్తున్నప్పుడు ఈ నీటిని తాగడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు ఎందుకు చెప్పకూడదు?’’ అని ఎన్జీటీ బెంచ్ ప్రశ్నించింది. గంగా నదీ తీరంలో ప్రతి 100 కి.మీ ఓ చోట నీటి స్వచ్ఛతపై బోర్డులను ఏర్పాటు చేయాలని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ(ఎన్ఎంసీజీ)ను ఎన్జీటీ ఆదేశించింది. అక్కడి నీటిని తాగటానికి, స్నానం చేయటానికి వాడొచ్చా? లేదా? అన్న విషయాన్ని బోర్డుల్లో స్పష్టంగా పేర్కొనాలంది. -
గంగా నదిలో ఆరుగురు చిన్నారుల గల్లంతు
కాన్పూర్ : గంగా నదిలో ఆరుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం కాన్పూర్లోని గంగా నదిలో స్నానానికి వెళ్లిన చిన్నారులు, నీటిలో మునిగిపోయారు. వారంత కూడా 10 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల వారని తెలుస్తోంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు, ఈతగాళ్లకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. ఆరుగురు చిన్నారులు నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశాం. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మృతదేహాలను కాన్పూర్లోని హాలెత్ హాస్పిటల్కు తరలించామన్నారు. -
హిట్లరే కూలాడు.. బీజేపీ ఎంత ?
సాక్షి, కర్ణాటక(యశవంతపుర) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశప్రజలకు తప్పుడు హామీలిచ్చి మభ్య పెడుతోందని బాహుభాష నటుడు ప్రకాశ్రాజ్ అరోపించారు. దక్షిణ కన్నడ జిల్లా మంజేశ్వరలో శాంతి సేనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘సర్వధికార ధోరణి కొద్ది రోజులకు మాత్రమే పరిమితం. హిట్లర్ లాంటివారి అధిపత్యమే కూలిపోయింది. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత’ అని అరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత గంగానదిని స్వచ్ఛంగా మారుస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. కొంతమేర పనులు చేపట్టి ఆ తర్వాత చేతులు దులిపేసుకుందన్నారు. బీజేపీ మతత్తత్వంను పెంచి పోషిస్తూ ప్రజలను భయపెడుతుందని అరోపించారు. -
గంగా నదిలో మునిగిన పడవ
సాక్షి, అలహాబాద్ : ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మేజా మండలం వద్ద గంగా నదిలో పడవ మునగిపోయింది. ఈ ఘటనలో ఆరుగురిని స్థానికులు రక్షించగా.. పలువురు గల్లంతయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పడవ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడం వల్లే మునిగిపోయినట్లు భావిస్తున్నారు. -
నదీ ప్రమాదాలు.. 21 మంది మృతి
సాక్షి, యూపీ: గురువారం ఉదయం ఉత్తర భారతదేశంలో సంభవించిన రెండు వేర్వేరు నదీ ప్రమాదాల్లో 21 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ బఘ్ పట్ వద్ద యమునా నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మొత్తం 15 మృతి చెందగా, సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సహాయ చర్యలను ప్రారంభించారు. 12 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇక బిహార్లోని మరంచి వద్ద గంగానదిలో కొట్టుకుపోయి ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
నిస్సహాయ ‘గంగ’
గంగా నదిపై సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) తరచు ఇస్తున్న ఆదేశాలు మన ప్రభుత్వాల తీరుతెన్నుల్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా నదుల విషయంలో ఇంకా చెప్పించుకునే స్థితిలోనే తప్ప... ప్రశంసించదగ్గ రీతిలో ప్రభుత్వాలు చేసింది ఒక్కటి కూడా లేదని ఈ ఆదేశాల పరంపర చూస్తే అర్ధ మవుతుంది. అయిదు రాష్ట్రాల్లో 2,525 కిలోమీటర్ల నిడివిలో ప్రవహించే గంగా నది కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం బారిన పడుతోంది. ఆ నీరు తాగడం మనుషులకు, జంతువులకు హానికరమయ్యే దుస్థితి ఏర్పడింది. హరిద్వార్, కనౌజ్లాంటి ఘాట్ లలో నీటిని పరీక్షించి చూస్తే స్నానానికి అది పనికిరాదని తేలిందని ఇటీవలే కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతక్రితం యూపీఏ ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక గంగ ప్రక్షాళన కోసం భారీ యెత్తున నిధులు కేటాయించారు. ఆ నిధుల్లో సింహభాగం ఖర్చు కాకపోవడం ఒకటైతే... వ్యయం చేసిన నిధుల వరకైనా పనికొచ్చిన వైనం కనబడకపోవడం మరో విషాదం. గత మూడేళ్ల లెక్కలు తీసుకున్నా ఈ సంగతే వెల్లడవుతుంది. 2014–15లో రూ. 2,053 కోట్లు కేటాయిస్తే కేవలం 170 కోట్లు ఖర్చుచేశారు. 2015–16లో రూ. 1,650 కోట్లు కేటాయిస్తే రూ. 602.60 కోట్లు వినియోగించారు. నిరుడు కేటాయించిన రూ. 1675 కోట్ల నిధుల్లో రూ. 756.01 కోట్లు ఖర్చయ్యాయి. యూపీఏ హయాంతో మొదలుపెడితే మొన్న మార్చి వరకూ మొత్తంగా గంగా నది ప్రక్షాళన కోసం రూ. 7,304.64 కోట్లు వ్యయం చేశారని గణాంకాలు చెబుతు న్నాయి. కానీ జరిగిందేమిటి? మూడేళ్లక్రితం గంగాహారతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ 2019లో జరగబోయే మహాత్మాగాంధీ 150వ జయంతినాటికల్లా గంగానదిని ప్రక్షాళన చేసి ఆ మహనీయుడి స్మృతికి ఘనంగా నివాళి అర్పిద్దామని పిలు పునిచ్చారు. అందుకోసం రూ. 20,000 కోట్లు వ్యయం కాగల ‘నమామి గంగ’ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. కానీ నిధుల కేటాయింపు, వ్యయం చేస్తున్న తీరు గమనిస్తే ఆ లక్ష్యం నెరవేరుతుందన్న ఆశ ఎవరికీ కలగదు. వచ్చే రెండేళ్లలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ వరకూ గల 543 కిలోమీటర్ల మేర పురపాలక సంస్థల నుంచి మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు, చర్మశుద్ధి కేంద్రాల వ్యర్థాలు నదిలో చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఎన్జీటీ తాజాగా ఆదేశాలిచ్చింది. వ్యర్థాలు నదిలో విడిచిపెట్టేవారికి రూ. 50,000 మేర జరిమానా విధించాలని సూచించింది. ఈ ఆదేశాలు ఈ ప్రాంతంలోని గంగానదికి మాత్రమే కాదు... దాని ఉప నదులకు కూడా వర్తిస్తాయి. తమ ఆదేశాలను సక్రమంగా అమలు చేస్తే 27 శాతం మేర కాలుష్యం తగ్గుతుందని ఎన్జీటీ లెక్కేసింది. హరిద్వార్–ఉన్నావ్ల మధ్య జనా వాసాల నుంచి 86 మురుగు కాల్వలు ఈ నదిలో కలుస్తున్నాయి. వందవరకూ పరిశ్రమలున్నాయి. ఈ నది ప్రవహించే అయిదు రాష్ట్రాల్లో 1,000 పరిశ్రమలుంటే అవి రోజుకు 50 కోట్ల లీటర్ల వ్యర్థాలను నదిలో విడుస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ వాటి కట్టడిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నదీ జలాల్లో క్రోమియం, కాడ్మియం, సీసం, కోబాల్ట్ వంటివి వచ్చి చేరుతున్నాయి. సమస్య గంగానదికి మాత్రమే పరిమితమై లేదు. భూగర్భ జలాలకు సైతం ఈ కాలుష్యం అంటుతోంది. చివరకు తినే తిండి కూడా కలుషితమవుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 285 పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టినప్పుడు అందులో 85 సంస్థలు వ్యర్థాల శుద్ధికి సంబంధించిన ఏ ప్రమాణాలనూ పాటించడం లేదని తేలింది. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించినప్పుడే అందులోని వ్యర్థాలను ఏం చేస్తారన్న అంచనాలు అధికారులకు ఉంటాయి. అయినా అనుమతులు మంజూరవుతాయి. తమను అడిగేదెవరన్న అహంభావమే దీనంతకూ మూలం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే గంగానది ప్రక్షాళన, పునరుజ్జీవం కోసమని ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. దాన్ని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉంచింది. కానీ ఏం లాభం? ఇంతవరకూ జరిగిందేమీ లేదని ఎన్జీటీ ఆదేశాలే చెబుతున్నాయి. గంగా నది కాలుష్యాన్ని అరికట్టడానికి కేవలం దానిపై భక్తివిశ్వాసాలుంటే సరిపోదు. అందుకు దృఢమైన రాజకీయ సంకల్పం అవసరం. గంగా జలాల కాలుష్యం కారణంగా పౌరులు ప్రమాదకరమైన వ్యాధుల బారినపడుతున్నారు. తాగే నీరు, పీల్చేగాలి విషతుల్యమై వారి ఆయుఃప్రమాణం తగ్గుతోంది. నదిలో ఉండే చేపలు, ఆ నది పరిసరాల్లో ఉండే పశుపక్ష్యాదులు కూడా అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయి. యమునా నదీ జలాలు పరీక్షిస్తే అవి దాదాపు మురుగునీరు మాదిరిగా ఉన్నట్టు తేలిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమధ్య ప్రకటించింది. నాలుగు నెలలక్రితం ఉత్తరాఖండ్ హైకోర్టు గంగ, యమున నదుల్ని సజీవ వ్యక్తులుగా గుర్తిస్తూ ఆదేశాలివ్వడం, ఈమధ్యే సుప్రీం కోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించడం అందరికీ తెలుసు. నదిని అమ్మగా, దేవతగా ఆరాధించే సంప్రదాయం మన దేశంలో ఉంది. కానీ దాన్ని కలుషితం చేయడానికి ఇలాంటి విశ్వాసాలు, సంప్రదాయాలు అడ్డురావడం లేదు. ఇవి సాధించలేని ప్రయోజనాన్ని వ్యక్తి హోదా సాధిస్తుందని ఎవరనుకోగలరు? కేవలం వందల కోట్లు ఖర్చు పెడితే సరిపోదు. ఆ నదీ పరీవాహ ప్రాంత ప్రజలందరినీ అందులో భాగ స్వాములుగా మార్చాలి. తమ మనుగడ ఆ నదితో ముడిపడి ఉందన్న అవగాహన కల్పించాలి. వారి నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే అనుకున్న ఫలితం వస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. ప్రచారార్భాటం లేకుండా గ్రామ, పట్టణ ప్రాంత పౌరులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్తుల్ని చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ రెండేళ్లక్రితం రాజస్థాన్లో ఆ సంగతి రుజువు చేశారు. -
పండుగనాడు పెను విషాదం
బిహార్లో గంగా నదిలో పడవ మునిగి 24 మంది మృతి పతంగుల ఉత్సవం తిలకించి పట్నాకు వస్తుండగా దుర్ఘటన సామర్థ్యానికి మించి ప్రయాణికుల వల్లే ప్రమాదం పట్నా: సంక్రాంతి పర్వదినం రోజున శనివారం బిహార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంగా నదీ తీరంలో పతంగుల ఉత్సవం తిలకించి పట్నాకు తిరిగి వస్తుండగా పడవ మునిగి 24 మంది మంది జలసమాధి అయ్యారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే పడవ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. ఉత్సవ నిర్వాహకులు, పడవ నడుపుతున్న వారిపై కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ రూ. 2 లక్షలు, రూ. 4 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. అలాగే ప్రమాదంపై నితీశ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. మకర సంక్రాంతి సందర్భంగా పట్నాకు ఆవల గంగా నదీ తీరం వెంట ఉన్న పర్యాటక ప్రాంతం సబల్పుర్ డయారాలో పతంగుల ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. శనివారం ఈ పోటీల్ని తిలకించాక 40 మంది ప్రయాణికులతో పడవ పట్నాలోని రాణిఘాట్కు బయలుదేరింది. పరిమితికి మించి జనం ఎక్కడంతో పడవ అదుపు తప్పి మునిగిపోయింది. తీరం చేరకుండానే 24 మంది ప్రయాణం మధ్యలోనే ముగిసిపోవడం అందరినీ కలిచివేసింది. ప్రమాదం జరిగిన వెంటనే శనివారమే 20 మృతదేహాల్ని వెలికితీశామని, ఆదివారం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయని బిహార్ ముఖ్య కార్యదర్శి(విపత్తు నిర్వహణ) ప్రత్యాయ అమ్రిత్ తెలిపారు. ఈ విషాదం నేపథ్యంలో ఆదివారం పట్నాలోని మహాత్మా గాంధీ సేతు పునరాభివృద్ధి పనుల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడాల్సి ఉండగా వాయిదా వేశారు. మరో 3 రోజుల పాటు జరగాల్సిన పతంగుల పండుగను కూడా రద్దు చేశారు. సబల్పుర్ డయారాలో వినోదపు పార్కు నిర్వాహకులు, శరణ్, పట్నా జిల్లాల మధ్య అక్రమంగా పడవలు నడుపుతున్న వారిపై సోనేపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రభుత్వానిదే బాధ్యత పతంగుల పండుగ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపమే ప్రమాదానికి కారణాలంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ తప్పుపట్టారు. పతంగుల ఉత్సవానికి వెళ్లేందుకు సరిపడా పడవల్ని ఏర్పాటు చేయలేదన్నారు. -
24కి చేరిన పడవ బోల్తా మృతుల సంఖ్య
బిహార్ : బిహార్ రాజధాని పట్నాలో గంగానదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది. మరోవైపు గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు జరుపుతున్నాయి. ఇప్పటివరకూ 21 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు పడవలో 40మంది ప్రయాణికులు ఉన్నారు. పడవలో పరిమితికి మిచ్చి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శనివారం వీరంతా కైట్ ఫెస్టివల్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు, పీఎంఎన్ఆర్ఎఫ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.వేలు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. పడవ బోల్తా ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా సంతాపం తెలిపారు. -
పట్నాలో పడవ బోల్తా : 20 మంది మృతి
బిహార్ : బిహార్ రాజధాని పాట్నాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. గంగానదిలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందగా మిగతా ప్రయాణికులు గాయపడ్డారు. కైట్ ఫెస్టివల్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పడవలో పరిమితికి మిచ్చి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బిహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. -
ఆ అమ్మ 40 ఏళ్లకు మళ్లీ వచ్చింది..
చనిపోయిందనుకుని గంగా నదిలో వదిలేసిన తమ తల్లి తిరిగి 40 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యేసరికి ఇద్దరు మహిళలు అవాక్కయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. 1976లో 42ఏళ్ల విలాసా అనే మహిళ పొలంలో నల్లత్రాచు పాము కాటుకు గురై స్పృహతప్పి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు నాటు వైద్యుని వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించారు. కానీ ఆ వైద్యం పనిచేయలేదు. విలాసా కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో తమ తల్లి మరణించిందని భావించిన సదరు మహిళలు తమ ఆచారం ప్రకారం పొత్తి గుడ్డలో చుట్టి తెరిచిఉన్న పెట్టెలో విలాసాను ఉంచి గంగానదిలో విడిచిపెట్టారు. అలా చేయడం వల్ల మనిషి దేహంలో ఏదైనా విషం ఉంటే గంగానది వద్దకు తీసుకుని తమ వారిని తిరిగి తమ వద్దకు చేరుస్తుందని అప్పట్లో ప్రజలు నమ్మేవారు. నదిలో కొట్టుకు పోతున్న ఆమెను రామసరన్ అనే వ్యక్తి కాపాడి వైద్యం అందించాడు. అయితే ఆమె స్పృహలోకి వచ్చినప్పటికీ గతం మాత్రం మరచిపోయింది. దీంతో కొన్నేళ్లుగా అక్కడే వారితో పాటే ఉండిపోయింది. కాగా ఇటీవల ఆమెకు ఆశ్చర్యకరంగా గతం గుర్తుకు వచ్చింది. ఆమె చెప్పిన విషయాలను విశ్వసించి, వివరాలు సేకరించారు. అనంతరం సొంత గ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిపారు. పుట్టుమచ్చల ఆధారంగా విలాస కుమార్తెలు రామకుమారి, మున్నీ గుర్తించారు. దాదాపుగా 40 ఏళ్ల అనంతరం తల్లి దగ్గరకి రావడంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. -
గంగా నదిని కలుషితం చేస్తే జరిమానా!
న్యూఢిల్లీ: గంగా నదిని కలుషితం చేసే వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. గంగా నదిని శుభ్రంగా ఉంచడానికి, నదిలో ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడకుండా చూడటానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురానుంది. ఇందుకోసం జస్టిస్ గిరిధర్ మాలవ్య నేతృత్వంలో బిల్లు రూపొందుతోంది. బిల్లు రూపు రేఖలు ఖరారయ్యాక మంత్రివర్గం ముందుకు వస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి చెప్పారు. ‘గంగా నది జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు శుభ్రంగా, ప్రవహిస్తూనే ఉండేలా చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ నదిని కలుషితం చేసే వారికి, ప్రవాహాన్ని అడ్డుకునే వారికి జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు ఉంటాయ’ని ఆమె అన్నారు. -
నదిలో నోట్లు కొట్టుకువచ్చాయి..
-
నదిలో నోట్లు కొట్టుకువచ్చాయి..
లక్నో: 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్లధనం దాచుకున్న కుబేరులు హడలిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నోట్ల కట్టలు చెత్తకుండీల్లో కనిపించినట్టు వార్తలు రాగా, ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాలో కొందరు 500, 1000 రూపాయల నోట్లను కాల్చి గంగానదిలోకి విసిరేశారు. మీర్జాపూర్ వద్ద నదిలో కొట్టుకు వస్తున్న నోట్లను స్థానికులు గుర్తించారు. వందలాది నోట్లు తేలియాడుతూ కనిపించాయి. ఈ విషయం తెలియగానే స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు పడవలపై వెళ్లి, మరికొందరు నదిలో ఈతకొడుతూ నోట్లను సేకరించారు. కొన్ని నోట్లు కొద్దిగా కాలిపోయి ఉండగా, మరికొన్ని చిరిగిపోయాయి. కొన్ని మాత్రం బాగానే ఉన్నాయి. స్థానికులు ఈ నోట్లను ఎండలో ఆరబెట్టి తీసుకెళ్లారు. పోలీసులకు సమాచారం రావడంతో అక్కడి వెళ్లి నదిలోకి జనం వెళ్లకుండా అడ్డుకున్నారు. నదిలో చాలా నోట్లు కొట్టుకు వచ్చాయని, అయితే కచ్చితంగా ఎన్ని నోట్లు అన్న విషయం తెలియదని పోలీసులు చెప్పారు. -
గంగా కాలుష్యంపై కొరడా
న్యూఢిల్లీ: గంగానదీ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ కసరత్తులు చేస్తోంది. మంగళవారం ఆ శాఖ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ.. నదీజలాల కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలపై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, సెక్షన్ 5 కింద కూడా చర్యలు తీసుకునేలా పీసీబీకి సూచించామన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అథారిటీ స్వయం ప్రతిపత్తితోపాటు పరిశ్రమలపై చర్యలు తీసుకునే అధికారాల్ని కలిగివుంటుందన్నారు. కొత్త అథారిటీ చర్యలు తీసుకోవడంలో విఫలమైన పక్షంలో జరిమానా విధించేందుకు కోర్టును కూడా ఆశ్రయించవచ్చని తెలిపారు. నూతనంగా ఏర్పాటు కానున్న అథారిటీకి ఇంకా ఏ పేరు పెట్టలేదని.‘జాతీయ గంగాజల శుద్ధీకరణ కార్యక్రమం’ పేరు అయితే బాగుంటుందన్నారు. -
గంగానది ద్వారా మారుతీ కార్ల షిప్పింగ్
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’కి చెందిన కార్లు గంగానదిపై ప్రయాణించనున్నాయి. కార్లు నదిపై వెళ్లడమేంటని అనుకుంటున్నారా? మీ ప్రశ్న కరెక్టే. కాకపోతే ఇక్కడ ట్విస్టేమిటంటే కార్లను ఓడలు మోస్తాయి. మారుతీ కార్లను ఆగస్ట్ 12 నుంచి నేషనల్ వాటర్వే-1 మార్గం ద్వారా వారణాసి నుంచి కోల్కతాకు రవాణా చేస్తామని షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారి తెలి పారు. ఇందుకుగానూ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మారుతీ సుజుకీ మధ్య ఎంఓయూ కుదిరిందని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. వారణాసి నుంచి రెండు ఓడలను ఏర్పాటు చేస్తామని, ఒకదానిలో మారుతీ కార్లు, మరొకదానిలో తయారీ పదార్థాలు వెళతాయని వివరించారు. ‘దేశంలో జల మార్గంలో జరిగే రవాణా 3.6%గా (చైనాలో 47%) ఉంది. ఇది చాలా తక్కువ. దీన్ని 2018 నాటికి 7%కి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని వివరించారు. -
గంగపై స్పష్టత ఏది?
గంగాహారతి సందర్భంగా నరేంద్ర మోదీ రెండేళ్లనాడు ఈ దేశ ప్రజానీకానికి ఒక నికరమైన వాగ్దానాన్ని చేశారు. అప్పటికాయన ఇంకా ప్రధాని కాలేదు. 2019లో జరగబోయే మహాత్మాగాంధీ 150వ జయంతి లోపు గంగానదిని ప్రక్షాళన చేసి బాపూజీ స్మృతికి ఘన నివాళి అర్పిద్దామన్నది ఆ వాగ్దానం సారాంశం. అధికారంలో కొచ్చిన వెంటనే దానికి కొనసాగింపుగా గంగా పునరుజ్జీవనం కోసమని ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి దాన్ని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా చేర్చారు. ఎంతో చురుగ్గా, చిత్తశుద్ధితో పనిచేస్తారని పేరున్న ఉమాభారతికి ఆ శాఖల్ని కేటాయించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జరిగిన తొలి స్వాతంత్య్ర దినోత్సవంనాడు సైతం మోదీ గంగా నదీ ప్రక్షాళన గురించి ప్రస్తావించారు. దీర్ఘకాలంగా అది సాగుతూనే ఉన్నా వైఫల్యాలే మిగలడానికి గల కారణాలను కూడా ఆయన సరిగానే గుర్తించారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వ విభాగాలమధ్య ఏకాభిప్రాయం కొరవడిన తీరునూ... ఒకరిపై ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్న వైనాన్నీ వివరించారు. ప్రభుత్వ విభాగాలమధ్య ఉన్న ఈ అడ్డుగోడల్ని కూల్చే పనులు మొదలయ్యాయని కూడా చెప్పారు. కానీ ఈ 18 నెలల్లో సాధించిన ప్రగతిని గమనిస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. గంగా నదిపై జల విద్యుత్ ప్రాజెక్టుల అనుమతికి సంబంధించి కేంద్రంలోని రెండు కీలక మంత్రిత్వ శాఖలు ఏకాభిప్రాయానికి రాలేక వివాదంలో కూరుకుపోయాయి. మొత్తం ఆరు జల విద్యుత్ ప్రాజెక్టుల్లో వెనువెంటనే మూడింటికి అనుమతులనీయవచ్చునని, మరో రెండు ప్రాజెక్టులకు సంబంధించి వాటి డిజైన్లను మార్చాక పరిశీలించవచ్చునని ప్రకాశ్ జవ్డేకర్ నేతృత్వంలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నెల 7న సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొంది. జలవనరుల శాఖ అందుకు విరుద్ధమైన అభిప్రాయంతో ఉంది. ప్రాజెక్టులను అనుమతించరాదని అంటున్నది. రెండేళ్లక్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పోటెత్తిన వరదలు ఎంతటి విలయాన్ని సృష్టించాయో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. దాదాపు పదివేలమంది మరణించా రని జాతీయ విపత్తుల నియంత్రణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) అంచనా వేసింది. వరదలవల్ల బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి తదితర పుణ్యక్షేత్రాలు పెను విధ్వంసాన్ని చవిచూశాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ బీభత్సంపై ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. గంగానది, దాని ఉపనదులపై నిర్మించిన అనేకానేక జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం కారణంగానే ఈ ప్రకృతి విపత్తు సంభవించిందా అనే అంశాన్ని తేల్చమని ఈ కమిటీకి సూచించింది. ప్రాజెక్టుల కోసం నిర్మించే సొరంగాలు, జలాశయాలు నదుల సహజ గమనాన్ని అడ్డుకుంటు న్నాయని ఆ కమిటీ పేర్కొంది. ఆఖరికి నిరుడు ఫిబ్రవరిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన కమిటీ సైతం ప్రాజెక్టులవల్లే సమస్యలు ఉత్పన్నమ వుతున్నాయని కోర్టుకు తెలిపింది. కానీ నిరుడు అక్టోబర్లో ఏర్పడిన మరో కమిటీ మాత్రం అందుకు విరుద్ధమైన వాదనలు చేసింది. డిసెంబర్లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై మరో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అనుమతించరాదంటూ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ గొడవంతా ఇలా ఉండగానే అయిదు జల విద్యుత్ ప్రాజెక్టులను అనుమ తించవచ్చునని సుప్రీంకోర్టు ముందు పర్యావరణ మంత్రిత్వ శాఖ అఫిడవిట్లు దాఖలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదైనా అంశంపై ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అభిప్రాయమంటూ ఉండాలని అందరూ ఆశిస్తారు. ఒకవేళ వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఏ అంశం విషయంలోనైనా విభేదాలుంటే నాలుగు గోడల మధ్య చర్చించుకోవాలి. ఆలస్యమైనా అంగీకారానికొచ్చిన తర్వాతే ఒక విధానాన్ని ప్రకటించాలి. కానీ వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఏకాభిప్రాయం మాట అటుంచి... ఒక శాఖలోనే వేర్వేరు అభిప్రాయాలుంటున్నాయని జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అనుమతించే విషయంలో రుజువైంది. పర్యావరణ మంత్రిత్వ శాఖకూ, జల వనరుల మంత్రిత్వ శాఖకూ విభేదాలొస్తే ఆ శాఖల మంత్రులిద్దరూ రెండు శాఖల అధికారులనూ సమావేశపరిచి ఎవరి వాదనలేమిటో తెలుసుకోవాలి. చివరకు ఒక తుది నిర్ణయానికి రావాలి. అయితే రెండు శాఖల మధ్యా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నా, ఏకాభిప్రాయ సాధన దిశగా కృషి జరగడంలేదు. సుప్రీంకోర్టులో దాఖలు చేయబోయే అఫిడవిట్ ముసాయిదాను పర్యావరణ మంత్రిత్వ శాఖ పద్ధతిగా ఈ నెల 5న జల వనరుల శాఖకు పంపింది. దాన్ని చూసిన ఉమాభారతి ఈ అఫిడవిట్ను దాఖలు చేయొద్దని పర్యావరణ శాఖకు సూచించారు. రెండు శాఖలూ కలిసి కూర్చుని చర్చించాకే ప్రభుత్వ విధా నాన్ని సుప్రీంకోర్టు ముందు పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. అందుకోసం సుప్రీంకోర్టును మరింత గడువు కోరాలని సలహా ఇచ్చారు. తీరా ఈ నెల 7న పర్యావరణ శాఖ సుప్రీంకోర్టులో ఆ అఫిడవిట్ను దాఖలు చేసింది. సరిగ్గా ఇలాంటి వైఖరులే మూడు దశాబ్దాలుగా గంగానది ప్రక్షాళనకు పెను శాపంగా మారాయి. దేశంలోని 11 రాష్ట్రాల్లోని 181 నగరాలు, పట్టణాల మీదుగా పయనించే గంగానదిలో నానావిధ వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. మురుగు నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంవల్లా, తీరం పొడవునా ఉన్న దాదాపు 750 పరిశ్రమల వల్లా అది కాలుష్య కాసారంగా మారుతున్నది. మరోపక్క ఆ నదిపై ఇప్పటికే ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు దాని ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. కొత్త ప్రాజెక్టుల్ని ఆ నది ఎంతమాత్రమూ భరించే స్థితిలో లేదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కనీసం ఈ దశలోనైనా మేల్కొని మెరుగ్గా వ్యవహరించకపోతే ఆ నది మరింతగా నాశనమవుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్క రించి, గంగానది పునరుజ్జీవానికి చేపట్టిన కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలూ సాగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషిచేయాలి. -
అంబులెన్స్లో తీసుకెళ్లి నది పక్కన పడేశారు
కాన్పూర్: వైద్యం కోసం వచ్చిన ఓ మహిళా రోగికి చికిత్స అందించపోగా ఆమె పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఇద్దరు వైద్యులపై వేటు పడింది. ఆమెను గంగా నది వంతెనపై పడేసి వచ్చినందుకు ఆ వైద్యులను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. కృష్ణ దేవీ అనే మహిళ గతవారం రైలు ప్రమాదానికి గురై గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజ్లో చికిత్స కోసం చేరింది. అయితే, అందులోని వివేక్ నాయర్, ఇఫ్తికార్ అన్సారీ అనే జూనియర్ డాక్టర్లు ఆమెను ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో తీసుకెళ్లి గంగా నది బ్యారేజ్ వద్ద పడేసి వచ్చారు. ఆమెను తెల్లవారాక పోలీసులు గుర్తించి వివరాలు తెలుసుకోగా జరిగిన ఘటన మొత్తం చెప్పింది. దీంతో ఆమెను తిరిగి అదే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సీనియర్ వైద్యులు జూనియర్ డాక్టర్లను తీవ్రంగా మందలించారు. ఘటనపై ముగ్గురు వైద్యులతో విచారణ ప్రారంభించి వారిపై మూడు నెలల సస్పెన్షన్ వేటు వేశారు. -
ఫైవ్ స్టార్ హోటల్ సీజ్
హరిద్వార్: గంగా నదిని అపవిత్రం చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. పవిత్ర గంగా నదిని కాలుష్య కసారం చేస్తున్నందుకు హరిద్వార్ లోని రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్ ను ఉత్తరాండ్ కాలుష్య నియంత్రణ బోర్డ్(ఎస్పీసీబీ) అధికారులు సీజ్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిబంధనలకు విరుద్ధంగా కాల్యుష్యాన్ని గంగా నదిలోకి వదులుతున్నందుకు ఈ చర్య తీసుకున్నామని ఎస్పీసీబీ రూర్కీ ప్రాంతీయ అధికారి అంకుర్ కాన్సాల్ తెలిపారు. ఎన్జీటీ నివేదిక ఆధారంగా పది రోజుల క్రితం నోటీసు ఇచ్చినా హోటల్ యాజమాన్యం పద్ధతి మార్చుకోలేదని ఎస్పీసీబీ కార్యదర్శి వినోద్ సింఘాల్ వెల్లడించారు. కాలుష్య కారకాల ఆధారంగా హోటళ్లను మూడు విభాగాలుగా ఎస్పీసీబీ వర్గీకరించింది. గంగా నదిని కాలుష్య రహితంగా, స్వచ్ఛంగా మార్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. -
గంగా ప్రక్షాళనపై మాటలు తప్ప... చేతలేవీ?
వారణాసి: గంగా ప్రక్షాళన అంశంలో ప్రధాని నరేంద్రమోదీ వాగ్దానం చేశారు తప్ప.. ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ ఏడాది పాలన ముగిసింది కానీ.. పవిత్ర 'గంగా' నది ప్రస్తుత పరిస్థితిని పర్యావరణ వేత్తలు, నదులకు సంబంధించిన నిపుణుల చేత అంచనా వేసే ప్రయత్నం కూడా చేయలేదని వారు పేర్కొంటున్నారు. కేంద్రం గత బడ్జెట్ లో రూ.2,037 కోట్లు కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు గంగా నది ప్రక్షాళనకు ఎటువంటి కార్యచరణ చేపట్టలేదని అంటున్నారు. వారణాసి నగరం ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైనా.. గంగా శుద్ధి పనులు ప్రారంభమవకపోవడం గమనించదగ్గ అంశమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత సెప్టెంబర్ లో వారణాసి, అలహాబాద్ ప్రాంతాలలో ఈ నది నీరు కనీసం స్నానాది కార్యక్రమాలకు పనికిరాదని నిర్ధారించారు. గతేడాది మే 17 న గంగా నదిని కాలుష్య రహితంగా, స్వచ్ఛంగా మారుస్తానిని ప్రధాని మోదీ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. -
ఆ ‘పురా వైభవం’ ఇతర నదులకు వద్దా?
ఒక్క ‘పవిత్ర’ నదిని ప్రక్షాళన చేసినంతమాత్రాన యావద్దేశం శుద్ధి అయిపోతుందా? అది అసాధ్యం. మన దేశంలోని 90 శాతం రాష్ట్రాలలో గంగానది అస్సలు ప్రవహించడం లేదు. అలాంటప్పుడు పురాణ ప్రాధాన్యత మిషతో ఈ నది ప్రక్షాళన కోసం ఇన్ని వనరులను ఎందుకు ఖర్చు పెడుతున్నారు? గంగానది శుద్ధి కార్య క్రమం గడచిన 30 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి నేటి వరకు దాదాపు రూ. 2 వేల కోట్లను ఖర్చు పెట్టారు. భారత సర్వో న్నత న్యాయస్థానం కొన్ని వారాల క్రితం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మంద లించింది. గంగానది శుద్ధి కార్యక్రమాన్ని మీరు ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయదల్చుకున్నారా లేక వచ్చే అయిదేళ్లకు కూడా దీన్ని కొనసాగించాల నుకుం టున్నారా తేల్చి చెప్పమంటూ సుప్రీంకోర్టు నిగ్గ దీసింది. మీ కార్యాచరణ పథకం చూశాక గంగా నది వచ్చే 200 సంవత్సరాల్లో కూడా పరిశుద్ధం కాదనిపిస్తోందన్నది కోర్టు వ్యాఖ్య. గంగానది తన పురాతన వైభవాన్ని తిరిగి పొందేలా, భవిష్యత్ తరాలు దాన్ని దర్శించగలిగేలా మీరు తగిన చర్యలు చేపట్టాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. కోర్టు వ్యాఖ్యకు స్పందించిన కేంద్రం గంగా నది ప్రక్షాళన కార్యక్రమం 2018 నాటికి పూర్తవుతుందని తెలిపింది. అంటే నరేంద్ర మోదీ ప్రస్తుత పదవీ కాలం లోనే ఇది పూర్తవుతుందని దీనర్థం. గంగానది పొడవునా ఉన్న 118 కాలుష్య పట్టణాలను ఇప్పటికే గుర్తించామని, వాటి పురపాలక సంస్థలను మేలుకో వలసిందిగా ఆదేశించామని కేంద్రం వివరించింది. గంగ ప్రక్షాళనకు మరొక శ్రీధరన్ కోసం సుప్రీం కోర్టు అన్వేషిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పతాక శీర్షికలో పేర్కొంది. దేశంలో వివిధ క్లిష్టతరమైన రైల్వే ప్రాజెక్టులను నిర్మించిన శ్రీధరన్ విశ్రాంత ఉన్నతాధికారి. గంగ ప్రక్షాళన పథకంలో వ్యవస్థా గత లోపాలున్నాయని, ఈ పథకాన్ని అమలు చేస్తు న్న ఉన్నత స్థాయి వ్యక్తులను మార్చాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడుతున్నట్లు ఆ వార్త పేర్కొంది. గంగానది ప్రక్షాళన పథకాన్ని సుప్రీంకోర్టు చాలా కాలంగా ముందుకు నెడుతూ వస్తోంది. ఈ ప్రక్షాళన కోసం పనిచేస్తున్న అన్ని ప్లాంట్ల స్థితిపై, అవి ఎప్పుడు పని మొదలెడతాయన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదే శించింది. ఈ అంశంపై ఉన్నతాధికారుల పరిభా షలో కాకుండా, దాన్ని నిరూపించదగిన పదజా లంతో నిర్దిష్టకాల కార్యాచరణను సమర్పించాలని కోరింది. ‘గంగానది ప్రక్షాళన పట్ల మీరు ఎంతో నిబద్ధ తను ప్రకటించారు. ఈ విషయంపై మాకంటే మీరే మరింత బాధ్యతతో ఉండాల’ని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. నా ప్రశ్న ఒక్కటే: అలా ఎందు కుండాలి? ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ ఒక్క నది ప్రక్షాళనపై మాత్రమే ఎందుకు నొక్కి చెబుతున్నారు? గంగాన దిని ప్రక్షాళన చేస్తే భారతదేశం మొత్తంగా శుద్ధి అయిపోతుందా? లేదు. అది సాధ్యం కాదు. మన దేశంలోని 90 శాతం రాష్ట్రాలలో గంగానది అస్సలు ప్రవహించడం లేదు. అలాంటప్పుడు కేవలం ఒక్క నది ప్రక్షాళన కోసం ఇన్ని వనరులను ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇంత ప్రభుత్వ యంత్రాంగ సమయాన్ని ఎందుకు వెచ్చిస్తున్నారు? పలువురు హిందువులు ఈ నదిని పవిత్రమై నదిగా భావిస్తున్నారన్న వాస్తవంతో సుప్రీంకోర్టు ప్రభావితం కాలేదా? ఇలాంటి వాగ్దానాలతో మోదీ ప్రభుత్వం హిందువుల ఓట్ల కోసం ప్రయత్నిస్తుం డవచ్చు కానీ, అది రాజకీయం. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లను తిరస్కరించడం వంటి చర్యల్లోనూ ప్రభుత్వ వైఖరి ప్రతిఫలిస్తోంది. (వెను కబడిన ముస్లింలు వెనుకబడిన హిందువుల మాదిరే నిరుపేదలు. కాని వారి పూర్వీకులు మరొక దేవుడిని ప్రార్థించడాన్ని ఎంచుకున్నందున ప్రత్యేకించి ఈ తరగతి ముస్లింలను శిక్షిస్తున్నారు. ఎద్దులను చంప డంపై నిషేధం విధించడంలో కూడా ప్రభుత్వం వైఖరిలో సత్వర స్పందన కనిపిస్తుంది. భారతీయ జనతాపార్టీ నుంచి ఎవరైనా ఇలాంటి చర్యలనే ఊహిస్తారు. వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో నాకు ఎలాంటి సమస్య ఎదురుకాదు కూడా. నా సమస్య ఏమిటంటే.. సుప్రీంకోర్టు గంగా నది ప్రక్షాళనలో ఎందుకిలా జోక్యం చేసుకుంటోం ది? మతపరమైన మనోభావాలు, కల్పనలు కోర్టు ప్రాధాన్యతలను ఎందుకు నిర్దేశిస్తున్నాయి? పైగా, ఒక గుజరాతీయుడిగా మరో విషయం కూడా నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అదేంటంటే, ‘తపి’ నది ప్రక్షాళనపై ఎందుకు దృష్టి సారించడం లేదు? చాలా మంది సూరత్ వాసులను ఈ నది భయపెడు తుంటుంది. మా అమ్మ నర్మదానదికి విశేష ప్రాధా న్యతను ఇస్తుంది. హిందువులను బుజ్జగించడానికి నర్మదానది ప్రక్షాళనను ఎందుకు చేపట్టరు? దక్షిణభారత్లో నివసిస్తున్న వాడిగా కృష్ణా, కావేరీ నదులపై భారీగా ఖర్చుపెట్టి, మానవ శక్తిని వెచ్చించడానికి నేనిష్టపడతాను. ఈ రెండు నదుల ప్రక్షాళనను ఎందుకు చేపట్టలేదు? బ్రహ్మపుత్రానది లేదా బహుశా గంగానది కంటే ఎక్కువగా మురికి మయమైపోయిన యమునా నదిని ఎందుకు ప్రక్షా ళన చేయరు? భవిష్యత్ తరాల ప్రజలు వీటిని తమ పురాతన వైభవంలో (దానర్థం ఏదైనా కావచ్చు) భాగంగా ఎందుకు చూడకూడదు? గంగానదీ పరీవాహక ప్రాంతం పొడవునా నెల కొన్న 113 పట్టణాలలో పేరుకుపోతున్న చెత్తలో మూడింట రెండొంతులకు పైగా, దేశంలోని జాతీ య నదుల్లోకి చేరిపోతోంది. ఈ కోణంలో గంగానది ప్రక్షాళనకు సుదీర్ఘ ప్రక్రియ అవసరం తప్పకపోవ చ్చని ఒక నివేదిక తెలిపింది. పలు ప్రభుత్వ సంస్థల నుంచి నిపుణుల బృందం సిద్ధం చేసిన మరొక నివేదిక మరింత దారుణమైన వివరాలను బయట పెట్టింది. ఈ అన్ని పట్టణాలు 363.6 కోట్ల లీటర్ల మురికినీటిని ప్రతిరోజూ సృష్టిస్తున్నాయని, అయితే ఐదు రాష్ట్రాల పరిధిలో నెలకొన్న ఈ పట్టణాల్లోని మురికినీటి శుద్ధి కర్మాగారాలు కేవలం 102.7 కోట్ల లీటర్ల నీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. అంటే గంగానదిని ప్రక్షాళన చేయడమంటే ఈ నగరాలన్నింటినీ ప్రక్షాళన చేయడమని అర్థం. ఈ పట్టణాల్లో నివసిస్తున్న పౌరులకు సమర్థవంతమైన మురికినీటి నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులను కల్పించాలి. ఇలా చేస్తే నిజంగా బాగుంటుంది. అదే సమయంలో దేశంలోని ఇతర పట్టణాల మాటేంటి? పవిత్రమైన నదిని కాలుష్యం చేయగలగిన స్థితిలో అవి లేవు కాబట్టి వాటిని సవతి పుత్రుల్లాగే కేంద్రం తీసిపారేయవలసిందేనా? పురాణాల్లో దానికున్న ప్రాధాన్యత రీత్యా గం గానదిని ప్రత్యేక దృష్టితో చూడాలన్న సుప్రీంకోర్టు భావనను, హిందూయేతర, హిందూమతేతర భార తీయులు ఎలా అర్థం చేసుకుంటారన్నది హిందు వుగా నాకు అందోళన కలిగిస్తోంది. అంతకుమించి, దాని ప్రత్యేకత దృష్ట్యా గంగానదిపైనే దృష్టి సారిం చాలన్న భావనను మన మీడియా కూడా పెద్దగా ప్రశ్నించడం, ప్రతిఘటించడం లేదన్న వాస్తవం నన్ను మరింతగా కలవరపెడుతుంటుంది. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్: aakar.patel@icloud.com - ఆకార్ పటేల్ -
ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనబడింది. సొంత నియోజక వర్గం వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన రెండోరోజు కొనసాగుతుండగా కంట్రోల్ రూమ్ మానిటర్లు పనిచేయకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని భద్రత వైఫల్యం చెందడంపై దర్యాప్తు జరపాలని ఐబీ డైరెక్టర్ కు హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఉదయం మోదీ అస్సీ ఘాట్లో గంగా పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన అస్సీ ఘాట్లో 'నిర్మల్ గంగ' కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ప్రక్షాళనకు నడుం బిగించారు. నిర్మల్ గంగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని తన పర్యటను కొనసాగిస్తుండగా కంట్రోల్ రూమ్ మానిటర్లు పనిచేయకపోవడంతో కలకలం రేగింది. -
గంగానది ప్రక్షాళనకు నడుం బిగించిన మోదీ