Gorakhpur
-
నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర
నేడు(డిసెంబరు 11) గీతా జయంతి. ఇది హిందువులకు అత్యంత పవిత్రదినం. గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున వస్తుంది. ఈ దినాన్నే అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు గీతను బోధించాడని చెబుతారు. గీతా జయంతితో పాటు మోక్షద ఏకాదశి వ్రత్రాన్ని కూడా ఈ రోజునే ఆచరిస్తారు. ఈ సందర్భంగా కేవలం ఒక్క రూపాయికే భగవద్గీతను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన గీతా ప్రెస్ 100 ఏళ్ల ఘన చరిత్ర గురించి తెలుసుకుందాం.42 కోట్ల పుస్తకాల ముద్రణఉత్తరప్రదేశ్లోని గోరక్పూర్లో గల ప్రముఖ గీతాప్రెస్ గత ఏడాది గాంధీ శాంతి బహుమతిని అందుకుంది. గీతా ప్రెస్ను 1923లో జయదయాల్ గోయంద్కా, హనుమాన్ ప్రసాద్ పొద్దార్ సంయుక్తంగా స్థాపించారు. హిందూ మత గ్రంథాలను సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడమే గీతాప్రెస్ లక్ష్యం. గీతా ప్రెస్ ప్రచురించిన భగవద్గీత, తులసీదాస్ రచనలు, పురాణాలు, ఉపనిషత్తులకు చెందిన లక్షలాది కాపీలు విక్రయమయ్యాయి. గీతా ప్రెస్ తన 100 ఏళ్ల ప్రయాణంలో 42 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. వీటిలో భగవద్గీత పుస్తక కాపీలు 18 కోట్లు ఉన్నాయి. ఈ ప్రెస్లో రోజుకు 70 వేల పుస్తకాలు ముద్రింతమవుతుంటాయి. గీతాప్రెస్ ప్రచురించిన హనుమాన్ చాలీసా రెండు రూపాయలకే లభ్యమవుతుంది.తొలి ముద్రణ భగవద్గీతగీతా ప్రెస్ తన కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి హిందూ సమాజానికి సంబంధించిన అతిపెద్ద ప్రచురణకర్తగా కొనసాగుతోంది. గీతాప్రెస్లో 16 భాషలకు చెందిన 1,800 పుస్తకాల కాపీలు హైటెక్ యంత్రాల సాయంతో ప్రతిరోజూ ముద్రితమవుతుంటాయి. గీతాప్రెస్ 1923లో ఒక అద్దె దుకాణంలో ప్రారంభమైంది. రాజస్థాన్లోని చురు నివాసి జయదయాల్ గోయంద్కా 1923 ఏప్రిల్ 29న గోరఖ్పూర్లోని హిందీ బజార్లో 10 రూపాయల అద్దె ఇంట్లో గోయంద్కా ప్రెస్ను ప్రారంభించారు. దానికి ఆయన గీతా ప్రెస్ అని పేరు పెట్టారు. తొలుత జయదయాల్ గోయంద్కా భగవద్గీత పుస్తకాన్ని ముద్రింపజేశారు.ఎలాంటి తప్పులు దొర్లకూడదని..ఎలాంటి తప్పులు దొర్లని భగవద్గీతను ప్రజలకు అందించాలని గోయంద్కా భావించారు. ఇందుకోసం ఆయన 1922లో కలకత్తా వాణిక్ ప్రెస్ను సంప్రదించారు. అయితే అందులో చాలా తప్పులు దొర్లాయి. దీనిపై గోయంద్కా ప్రెస్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీనికి యాజమాన్యం సరైన సమధానం ఇవ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గోయంద్కా తన సొంత ప్రెస్ను ఏర్పాటు చేసుకున్నారు. గోరఖ్పూర్కు చెందిన ఘనశ్యామ్దాస్ జలాన్ ఇందుకు తన సహాయాన్ని అందించారు. ఈ విధంగా గోరఖ్పూర్లో గీతా ప్రెస్ స్థాపితమయ్యింది. 1926లో ప్రింటింగ్ మెషీన్ను అమెరికాలోని బోస్టన్ నుంచి దిగుమతి చేసుకున్నారు.జాతిపిత మహాత్మా గాంధీ సూచనతో..గీతా ప్రెస్ ఒక ట్రస్ట్గా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. దీని లక్ష్యం లాభాలు ఆర్జించడం కాదు. ప్రజలకు తక్కువ ధరకే హిందూ ఆధ్యాత్మిక చింతనతో కూడిన పుస్తకాలను అందించడం. గీతా ప్రెస్లో ముద్రించిన మొదటి పుస్తకం ధర ఒక రూపాయి. 1926లో గీతా ప్రెస్ ‘కల్యాణ్’ పేరుతో ఒక మాసపత్రికను అందుబాటులోకి తీసుకువచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఆ పత్రికలో వ్యాసాలను రాసేవారు. గాంధీజీ 1927లో గీతా ప్రెస్కు రెండు సలహాలు ఇచ్చారు. ఈ పత్రికల్లో ఎలాంటి ప్రకటనలు రాకూడదని, ఏ పుస్తకాన్ని సమీక్షించకూడదని సూచించారు. గాంధీజీ నాడు ఇచ్చిన సూచనలను ఏనాడూ ఉల్లంఘించలేదని గీతా ప్రెస్ మేనేజర్ లల్మణి తివారీ తెలిపారు.13 భాషలలో పుస్తకాల ప్రచురణహిందీ, సంస్కృతంతో పాటు గీతా ప్రెస్ 13 ఇతర భాషలలో హిందూ ధర్మచింతనకు సంబంధించిన గ్రంథాలను, సాహిత్యాన్ని ప్రచురిస్తుంది. భగవద్గీత, రామచరిత మానస పుస్తకాలకు సంబంధించిన 90 కోట్లకు పైగా కాపీలను గీతాప్రెస్ ముద్రించింది. గీతా ప్రెస్ పలుమార్లు అనేక ఎత్తుపల్లాలను చూసింది. చాలాసార్లు మూతపడే స్థితికి వచ్చింది. అత్యంత తక్కువ ధరలకు పుస్తకాలను అందిస్తున్న కారణంగా సంస్థ నష్టాలలోనే కొనసాగుతోంది.గీతాప్రెస్ను చూసేందుకు విదేశీ అతిథులుగీతా ప్రెస్ ట్రస్ట్ తమ సంస్థ నుంచి వెలువడే పుస్తకాల ముద్రణకు వివిధ పరిశ్రమల నుండి నేరుగా ముడి సరుకులను కొనుగోలు చేస్తుంటుంది. తద్వారా ముద్రణ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంది. గీతాప్రెస్ను చూసేందుకు దేశవిదేశాల నుంచి గోరఖ్పూర్నకు తరలివస్తుంటారు. గీతా ప్రెస్లోని జపనీస్, ఇటాలియన్, జర్మన్ ప్రింటింగ్ మెషీన్ల ధర రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. గీతాప్రెస్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రతినెలా దాదాపు రూ.80 లక్షల మొత్తాన్ని జీతాల రూపంలో అందిస్తుంటుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఈ దేశాల్లో పర్యాటకుల తాకిడి.. హనీమూన్ స్పాట్లో జంటల సందడి -
వీధి కుక్క స్వైర విహారం.. గంటలో 17 మందిపై దాడి
ఉత్తరప్రదేశ్లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారిని కనిపించినట్లే మీద పడి గాయపరిచింది. చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా కేవలం గంట వ్యవధిలోనే కంట పడిన 17 మందిపై దాడి చేసింది. కుక్క దాడిలో గాయపడిన వారిలో మహిళతోపాటు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన గోరఖ్పూర్లోని షాపూర్లో ఆగష్టు 14న జరగ్గా.. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.ఇందులో 22 ఏళ్ల విద్యార్ధి ఆశిష్ యాదవ్.. ఆవాస్ వికాస్ కాలనీలోని తన ఇంటి ముందు నిలబడి ఫోన్లో మాట్లాడుతుండగా వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది. ఇంటి ముందు వెళ్తున్న కుక్క.. అకస్మాత్తుగా యువకుడి వైపుకు పరుగెత్తుకొచ్చి కరిచింది. అయితే దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఆ కుక్క ఎంతకు తగ్గలేదు.అతడిపైకి ఎగురుతూ, మరింత వేగంగా కరిచేందుకు యత్నించింది. ఆశిష్ కిందపడిపోవడంతో అతని కాలుపై, ముఖంపై గాయపరిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడిలో అతని ముఖం, నోరు, కళ్లు, పెదవులు దెబ్బతిన్నాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రేబిస్ వ్యాక్సిన్ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పారని ఆశిష్ తండ్రి విజయ్ యాదవ్ తెలిపారు. కుక్కల దాడిపై నగరపాలక సంస్థకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు.ఈ ఘటన తరువాత కుక్కు ఇంటి గేటు వద్ద నిలబడిన మరో మహిళపై దాడి చేసింది. ఆమె మోకాలి, కాలుపై కరిచి వెళ్లిపోయింది. దీంతో మహిళ మోకాలిపై లోతైన గాయమవ్వగా కుట్లు పడ్డాయి. దీని తర్వాత ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు బాలికలపై కుక్క దాడి చేసింది. ఇలా ఆ పిచ్చి కుక్క దాదాపు 17 మందిని గాయపరిచింది.దీనిపై గోరఖ్పూర్ అదనపు మున్సిపల్ కమీషనర్ దుర్గేష్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తనకు తెలియదని, ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్ కోసం నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నామని, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజ్ చేయడంతోపాటు పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
వరల్డ్ క్లాస్ లుక్లో గోరఖ్పూర్ రైల్వే స్టేషన్
గోరఖ్పూర్: యూపీలోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ త్వరలో వరల్డ్ క్లాస్ లుక్లో కనిపించనుంది. ఈ రైల్వే స్టేషన్ను రూ.498 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్లో పలు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నామని నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, వికలాంగులు, రోగులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. బడ్జెట్ హోటల్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులతో పాటు ఇతరులు కూడా ఇక్కడకు వచ్చి సినిమాలు చూసేందుకు, షాపింగ్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో ట్రావెలేటర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇది ప్రత్యేక తరహా ఎస్కలేటర్. దానిపై నిలబడి నడవకుండానే ఒక చోట నుంచి మరో చోటికి చేరుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులతో సహా ప్రయాణికులంతా ట్రావెలేటర్ను వినియోగించుకోవచ్చు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దుతున్నారు. 2023 జూలై 7న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
Lok Sabha Election 2024: గోరఖ్పూర్లో స్టార్ వార్!
ఉత్తరప్రదేశ్లో శనివారం పోలింగ్ జరగనున్న స్థానాల్లో గోరఖ్పూర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ రవికిషన్ శుక్లా, ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్ ఇద్దరూ భోజ్పురి స్టార్లే కావడం అందుకు కారణం... రవికిషన్కు పీఠం మద్దతు... భోజ్పురి సినిమాల్లో సూపర్స్టార్గా వెలుగొందుతున్న రవి కిషన్ అసలు పేరు రవీంద్ర శుక్లా. కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జౌన్పూర్ నుంచి పోటీ చేసి ఓడారు. 2017లో బీజేపీలో చేరారు. 2019లో 3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కానీ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కనిపించనే లేదనే విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు ఆయనను ‘బయటి వ్యక్తి’గా అభివర్ణిస్తున్నాయి. దాంతో పీఎం మోదీ, సీఎం యోగి చరిష్మానే నమ్ముకున్నారు. గోరఖ్పూర్లో తనకు ఇల్లుందని, ఇక్కడే ఉంటున్నానని చెప్పుకొస్తున్నారు. యువకులతో కుస్తీ పడుతూ, స్థానికులతో సెల్ఫీలు దిగుతూ ప్రచారం జోరుగా చేశారు. రవి కిషన్కు గోరక్షనాథ్ పీఠం మద్దతు కూడా ఉంది. నిషాద్ ఓట్లను నమ్ముకున్న కాజల్ భోజ్పురి నటి, ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్కు ఇది నాలుగో ఎన్నిక. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ రూరల్ నుంచి కాంగ్రెస్ టికెట్పై, కాంపియర్గంజ్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి ఓడారు. మేయర్ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే ఆమెకు ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. తన సామాజికవర్గమైన నిషాద్ ఓట్లనే నమ్ముకున్నారు. అయితే 2019 మాదిరిగా ఈసారి కూడా ఎస్పీ ఓట్లను బీఎస్పీ గట్టిగానే చీల్చేలా కని్పస్తోంది. 1990ల నుంచి బీజేపీ హవా.. గోరఖ్పూర్ స్థానంలో 1984 దాకా కాంగ్రెస్దే హవా. రామమందిర ఉద్యమ నేపథ్యంలో 1989 నుంచీ గోరక్షనాథ్ పీఠం ఆధిపత్యం మొదలైంది. అప్పటినుంచి 1996 దాకా వరుసగా మూడుసార్లు గోరక్షనాథ్ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ ఇక్కడినుంచి గెలిచారు. 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు ప్రస్తుత పీఠాధిపతి యోగి గెలిచారు. సీఎం అయ్యాక ఆయన రాజీనామాతో 2018లో జరిగిన ఉప ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా ఎస్పీ నేత ప్రవీణ్ నిషాద్ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర శుక్లాను ఓడించారు. కానీ ఈ ఆధిపత్యాన్ని ఎస్పీ నిలబెట్టుకోలేకపోయింది. కుల సమీకరణాలదే కీలకపాత్ర..గోరఖ్పూర్లో అగ్రవర్ణ ఓట్లు 6 లక్షలున్నాయి. 9 లక్షల ఓబీసీ, 4 లక్షల నిషాద్, 2 లక్షలకు పైగా యాదవ ఓట్లున్నాయి. 2.5 లక్షల దళిత ఓట్లు, 2 లక్షల ముస్లిం ఓట్లూ తనకేనని కాజల్ చెబుతున్నారు. నిషాద్లూ తన వెంటే ఉన్నారంటున్నారు. బీజేపీ కూడా నిషాద్ల ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం స్వస్థలంలో హీరో- హీరోయిన్ పోరు
లోక్సభకు చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో వారణాసి, గోరఖ్పూర్ స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. గోరఖ్పూర్ అంటే గీతా ప్రెస్ ఉన్న నగరం. ఈ ప్రాంతం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనూ కీలకంగా నిలిచింది. ఇది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం. ఇక్కడ ఈసారి బీజేపీ వర్సెస్ సమాజ్వాదీ పార్టీల మధ్యప్రత్యక్ష పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.గోరఖ్పూర్ లోక్సభ స్థానంలో హీరో వర్సెస్ హీరోయిన్ పోరు నెలకొంది. ఇక్కడి నుండి ప్రస్తుత ఎంపీ, నటుడు రవి కిషన్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. సమాజ్వాదీ పార్టీ భోజ్పురి నటి కాజల్ నిషాద్కు ఇక్కడి టిక్కెట్ కేటాయించింది. రవి కిషన్ 2019లో ఇక్కడి నుంచి బీజేపీ టిక్కెట్పై విజయం సాధించారు. కాజల్ నిషాద్ 2012లో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత ఎస్పీ టికెట్పై అసెంబ్లీ, మేయర్ ఎన్నికల్లో పోటీ చేసినా ఆమెను విజయం వరించలేదు.1990లో యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే తన పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించి, వరుసగా ఐదు సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. 2017లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రవి కిషన్ విజయం సాధించారు. యోగి ఆదిత్యనాథ్ను ఐదుసార్లు ఎంపీని చేసిన ఇక్కడి ఓటర్లు సీఎంపై మరింత నమ్మకం ఉంచారు. అందుకే బీజేపీకి మద్దతుగా నిలుస్తారనే అంచనాలున్నాయి.గోరఖ్పూర్లో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 20 లక్షల 74 వేలు. ఈ సీటులో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా, అవన్నీ బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. 2018 లోక్సభ ఉప ఎన్నిక మినహా ప్రతిసారీ సమాజ్వాదీ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. -
Lok Sabha Election 2024: యూపీలో ఆఖరి పోరాటం!
ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఆఖరి అంకానికి చేరుకుంది. 6 విడతల్లో 67 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగతా 13 సీట్లలో జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో వీటిలో 11 స్థానాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం కాగా బీఎస్పీకి 2 దక్కాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, సీఎం యోగి కంచుకోట గోరఖ్పూర్ సహా కీలక నియోజవర్గాలపై ఫోకస్... గోరఖ్పూర్... భోజ్పురీ వార్ సుప్రసిద్ధ గోరఖ్నాథ్ ఆలయానికి నెలవు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట. ఆయన గురువు మహంత్ అవైద్యనాథ్ 1989 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. తర్వాత యోగి 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు నెగ్గారు. ఆయన సీఎం కావడంతో జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా ఎస్పీ గెలిచినా 2019లో బీజేపీ ప్రముఖ భోజ్పురి నటుడు రవికిషన్ను బరిలోకి దించి 3 లక్షల మెజారిటీతో కాషాయ జెండా ఎగరేసింది. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. ఎస్పీ నుంచి భోజ్పురి నటి కాజల్ నిషాద్, బీఎస్పీ నుంచి జావెద్ సిమ్నాని బరిలో ఉన్నారు. కాంగ్రెస్ దన్నుతో బీజేపీకి ఎస్పీ గట్టి పోటీ ఇస్తోంది.గాజీపూర్.. త్రిముఖ పోరు ఇక్కడ 2014లో బీజేపీ, 2019లో ఎస్పీ గెలిచాయి. ఎస్సీ నుంచి అఫ్జల్ అన్సారీ, బీఎస్పీ నుంచి ఉమేశ్ సింగ్, బీజేపీ నుంచి పరాస్ నాథ్ రాయ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 20 శాతం ఎస్సీలు, 11 శాతం ముస్లింలు ఉంటారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పారీ్టకి పట్టం కడుతున్న నేపథ్యంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. గాజీపూర్ పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఎస్పీ చేతిలోనే ఉన్నాయి!వారణాసి... మోదీ హ్యాట్రిక్ గురికాశీ విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ లోక్సభ స్థానంలో 1991 నుంచి కమలనాథులు పాతుకుపోయారు. 2004లో కాంగ్రెస్ నెగ్గినా 2009లో బీజేపీ దిగ్గజం మురళీ మనోహర్ జోషి గెలుపొందారు. 2014లో ప్రధాని అభ్యరి్థగా నరేంద్ర మోదీ ఇక్కడ తొలిసారి బరిలో దిగారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై 3.7 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 2019లో మెజారిటీని 4.8 లక్షలకు పెంచుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ రేసులో ఉన్నారు. ఈసారి మోదీ మెజారిటీ పెరుగుతుందా, లేదా అన్నదే ప్రశ్నగా కనిపిస్తోంది.చందౌలీ... టఫ్ ఫైట్ దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. 2014, 2019ల్లో మోదీ వేవ్లో బీజేపీ ఖాతాలో పడింది. సిట్టింగ్ ఎంపీ మహేంద్రనాథ్ పాండే ఈసారి హ్యాట్రిక్పై గురి పెట్టారు. ఎస్పీ నుంచి వీరేంద్ర సింగ్, బీఎస్పీ నుంచి సత్యేంద్రకుమార్ మౌర్య పోటీలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.మీర్జాపూర్... ప్రాంతీయ పారీ్టల హవాఒకప్పుడు బందిపోటు రాణి పూలన్ దేవి అడ్డా. 1996, 1999లో ఆమె ఎస్పీ తరఫున విజయం సాధించారు! 2001లో ఆమె హత్యానంతరం బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2014లో అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్ ఘనవిజయం సాధించారు. 2016లో పార్టీ బహిష్కరణతో అప్నాదళ్(ఎస్) పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్డీఏ దన్నుతో 2019లో మళ్లీ నెగ్గారు. ఈసారి కూడా ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి రమేశ్ చంద్ర బిండ్, ఎస్పీ తరఫున మనీశ్ తివారీ రేసులో ఉన్నారు. మీర్జాపూర్లో వెనకబడిన వర్గాలు 49 శాతం, ఎస్సీ, ఎస్టీలు 25 శాతం ఉంటారు.కుషీనగర్... హోరాహోరీగౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం (శరీర త్యాగం) చేసిన చోటు కావడంతో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, పర్యాటకులు ఏటా భారీగా వస్తుంటారు. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ బోణీ కొట్టగా 2014, 2019ల్లో బీజేపీ పాగా వేసింది. సిట్టింగ్ ఎంపీ విజయ్ కుమర్ దూబే ఈసారీ బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి అజయ్ ప్రతాప్ సింగ్ (పింటూ). బీఎస్పీ నుంచి శుభ్ నారాయణ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి.పోలింగ్ జరిగే మొత్తం స్థానాలు...మహారాజ్గంజ్, గోరఖ్పూర్, కుషీనగర్, దేవరియా, బన్స్గావ్ (ఎస్సీ), ఘోసి, సలేంపూర్, బలియా, ఘాజిపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్గంజ్ (ఎస్సీ)– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
ఎన్నికల వేళ నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థులు చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరి దృష్టినీ ఆకర్షించడం పరిపాటే. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మంగళవారం ఏకంగా పాడె మీద ఊరేగుతూ వచ్చి నామినేషన్ వేశారు! ఆయన పేరు రాజన్ యాదవ్. ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన బౌద్ధ సన్యాసిగా మారారు. భిక్షపైనే జీవిక గడుపుకుంటారు. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడిందని చెప్పేందుకే తానిలా పాడెపై వచ్చానని చెప్పారాయన. ‘పాడె బాబా’గా ఆయన స్థానికంగా బాగా ప్రసిద్ధుడు. ఈసారి తన ఎన్నికల కార్యాలయాన్ని కూడా ఏకంగా శ్మశానవాటికలోనే తెరిచారు! స్థానిక రాప్తీ నది ఒడ్డున ఉన్న ఆ శ్మశానవాటిక నుంచే ఎన్నికల సంబంధిత కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం తనను చూసేందుకు వచి్చన ఒక్కొక్కరి నుంచి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. గమ్మత్తైన హామీలు రాజన్ యాదవ్ ఎన్నికల హామీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తనను గెలిపిస్తే ఎలాగైనా లైఫ్టైం ఉచిత ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని తిరిగి తీసుకొస్తానంటున్నారాయన. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ద్విచక్ర వాహనాలకు వేస్తున్న జరిమానాలు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రయతి్నస్తానని హామీ ఇస్తున్నారు. గతంలోనూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర ఈ ‘పాడె బాబా’ది. ఆయన తర్వాతి లక్ష్యం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలట! ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసి ఆప్ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను గద్దె దింపడమే తన లక్ష్యమని చెబుతున్నారు! – గోరఖ్పూర్ -
త్వరలో తొలి స్లీపర్ వందేభారత్.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
దేశంలోని తొలి స్లీపర్ వందేభారత్ త్వరలో పట్టాలపై పరుగులు తీయనుంది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్- న్యూఢిల్లీ మధ్య స్లీపర్ వందే భారత్ను నడపడానికి ఈశాన్య రైల్వే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇండియన్ రైల్వే టైమ్ టేబుల్ కమిటీ (ఐఆర్టీటీసీ) ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జైపూర్లో సమావేశం కానుంది. దీనిలో ఈ రైలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని రైల్వే జోన్ల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. కొత్త రైళ్లను నడపడం, ట్రిప్పులను పెంచడం, రూట్లను మార్చడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈశాన్య రైల్వే రూపొందించిన ప్రతిపాదన ప్రకారం నూతన స్లీపర్ వందేభారత్ రైలు వారానికి మూడు రోజులు నడవనుంది. గోరఖ్పూర్ నుంచి రాత్రి వేళల్లో ఈ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈ రైలు గోరఖ్పూర్ నుండి న్యూఢిల్లీకి 12 గంటల్లో చేరుకుంటుంది. ఈ సమావేశంలో ఈ రైలుకు ఆమోదం లభిస్తే 2024, జూలై నుంచి ఈ రైలు రాకపోకలు సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోరఖ్పూర్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా రైలు నడపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం గోరఖ్పూర్ నుండి ప్రయాగ్రాజ్ వరకు వందే భారత్ రైలు నడుస్తోంది. నూతన ప్రతిపాదనల ప్రకారం స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ గోరఖ్పూర్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. అంటే గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవచ్చు. -
గీతా ప్రెస్కు జపాన్ యంత్రం.. ముద్రణ మరింత వేగవంతం!
యూపీలోని గోరఖ్పూర్లో గల గీతా ప్రెస్ గురించి అందరికీ తెలిసిందే. పలు భాషల్లో ఇక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 70 వేల పుస్తకాలు ముద్రతమవుతాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. గీతా ప్రెస్లో పుస్తకాలను వేగంగా ముద్రించేందుకు యంత్రాలను వినియోగిస్తుంటారు. ఇందుకోసం తాజాగా జపాన్ నుంచి కొమోరి యంత్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ యంత్రం ఏర్పాటుతో గీతా ప్రెస్లో మరింత వేగంగా అత్యధిసంఖ్యలో పుస్తకాలను ముద్రించవచ్చు. మరో 10 రోజుల్లో ఈ యంత్రాన్ని పూర్తిస్థాయిలో అమర్చనున్నారు. జపాన్ నుంచి తెచ్చిన ఈ యంత్రంలో పాటు బెంగళూరు నుంచి తీసుకువచ్చిన వెల్వూండ్ మెషీన్ను కూడా ఇక్కడ వినియోగించనున్నారు. ఈ యంత్రం ద్వారా బైండింగ్ పనులు మరింత వేగవంతం కానున్నాయి. జపాన్ నుంచి తెచ్చిన కొమోరీ మెషిన్ సాయంతో కలర్ ప్రింటింగ్ పనులు వేగంగా చేసే అవకాశం లభిస్తుంది. అలాగే పుస్తకాల కవర్ పేజీలను రంగుల్లో ముద్రించవచ్చు. ఈ యంత్రం ద్వారా ఒక గంటలో 15 వేల కలర్ పేజీలను ముద్రించవచ్చు. -
‘ఎంపీ రవి కిషన్ భూమిని కబ్జా చేశారు’ : సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ నవ్వులు పూయించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యూపీ పార్లమెంట్ స్థానం గోరఖ్పూర్లోని రామ్ఘర్ తాల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం యోగి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి తన ప్రసంగంతో సభికులతో పాటు ప్రజల్ని నవ్వులు పూయించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు సభపై ప్రముఖ నటుడు, బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ ఉన్నారు. రవికిషన్ను ఉద్దేశిస్తూ సీఎం మాట్లాడారు. బంగ్లా కబ్జా చేశారంటూ.. భళ్లున నవ్విన ‘ఇంతకుముందు ఓ వీఐపీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భోజ్పురి స్టార్ రవికిషన్ ఆ ప్రాంతానికి సమీపంలోని ఓ బంగ్లాను కబ్జా చేశార'ని భళ్లున నవ్వారు. వెంటనే లేదు.. లేదు.. రవికిషన్ ఆ ఇంటి లాక్కోలేదు. డబ్బుతో కొన్నారు’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ ఏడేళ్ల క్రితం రామ్గఢ్ తాల్ దగ్గరకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. కానీ ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఇప్పుడు అక్కడ సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. సెల్ఫీలు దిగుతున్నారు. రవికిషన్ (ఎంపీ సీటును) మళ్లీ తన స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు నగరం మొత్తం కెమెరా నిఘాలో ఉంది. రవికిషన్ సినిమా షూటింగ్ కోసం హడావుడిగా వెళ్లి సిగ్నల్ బ్రేక్ చేస్తే వెంటనే అతని మొబైల్కి చలాన్ వెళ్తుందని, అంతలా అభివృద్ది జరిగిందని స్పష్టం చేశారు. #WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN — ANI (@ANI) March 2, 2024 గోరఖ్పూర్ సీటు గెలుస్తా.. చరిత్ర సృష్టిస్తా ఈ నెల ప్రారంభంలో బీజేపీ రికార్డ్ స్థాయిలో 195 మందితో తొలి విడత పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కమలం ప్రకటించిన జాబితాలో గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ రెండోసారి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్పూర్. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి–2021ను ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతి శాఖ తెలిపింది. అహింస, ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్కు ఈ బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలియజేసింది. గాంధీ శాంతి బహుమతి విజేతకు రూ.కోటి నగదు, జ్ఞాపిక, సంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు. ఈ బహుమతిని 2020లో బంగ్లాదేశ్కు చెందిన బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మన్కు ప్రకటించారు. గోరఖ్పూర్లో గీతా ప్రెస్ను 1923లో స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. 14 భాషల్లో 41.7 కోట్లకుపైగా పుస్తకాలను ప్రచురించింది. వీటిలో 16.21 కోట్ల భగవద్గీత గ్రంథాలు ఉన్నాయి. గీతా ప్రెస్కు అవార్డు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తంచేశారు. -
Sangita Success Story: విజయాన్ని పెట్టెలో పెట్టింది
పిండి కొద్ది రొట్టె ఏమోకాని స్వీటు కొద్ది పెట్టె ఉండాలంటుంది సంగీతా పాండే. స్వీట్ బాక్సులను అందంగా తయారు చేయడం మొదలుపెట్టిన ఈ గోరఖ్పూర్ సాధారణ గృహిణి 500 రూపాయల పెట్టుబడితో బయల్దేరి ఆరేళ్లలో 3 కోట్ల టర్నోవర్కు చేరింది. అత్తామామలు, భర్త సహకరించకపోయినా గృహిణికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని పట్టుదలగా విజయం సాధించింది. తనలాంటి 100 మంది స్త్రీలకు ఉపాధి కల్పించడంతో ఆమె పొందుతున్న సంతృప్తి వెల లేనిది. ఆరేడేళ్ల క్రితం. ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్. మూడవ సంతానంగా కుమార్తె పుట్టాక 9 నెలలు నిండేసరికి ఇక ఇంట్లో ఉంటూ కేవలం అత్తామామల సేవ, వంట వంటి పనులు మాత్రమే చేయకూడదు అనుకుంది సంగీతా పాండే. భర్తకు పోలీసు ఉద్యోగం. బదిలీల మీద తిరుగుతుండేవాడు. ఆర్థికస్థితి అంతంత మాత్రం. తనూ ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది. భర్త ఒప్పుకోలేదు. అత్తామామలు ఒప్పుకోలేదు. కాని ఎదిరించి తను చదివిన డిగ్రీ అర్హత మీద ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం తెచ్చుకుంది. మొదటిరోజు కూతురితోపాటు హాజరైంది. ఆఫీసువాళ్లు అభ్యంతరం చెప్పడంతో మరుసటి రోజు పాపను ఇంట్లో వదిలి ఆఫీసుకు వెళ్లింది. మనసు ఒప్పలేదు. పిల్లలను దూరం పెట్టి పని చేసే ఉద్యోగం వద్దు అనుకుని మరుసటి రోజే మానేసింది. కాని ఏదో చేయాలి. ఏం చేయాలి? స్వీట్షాపులో డబ్బాలు ఆమె ఒకసారి స్వీట్షాపులో స్వీట్స్ కొంటున్నప్పుడు ఎవరో వచ్చి ఖాళీ బాక్సులు స్టాకు పడేసి వెళ్లడం చూసింది. తనక్కూడా అలాంటివి తయారు చేసి అమ్మాలని అనిపించింది. అందుకోసం గోరఖ్పూర్లో వాటిని తయారు చేస్తున్న ఒకరిద్దరు స్త్రీలను కలిసింది. అయితే వారు ఆమెకు పని గురించి అంతంత మాత్రమే చెప్పారు– పోటీకి వస్తుందని. సంగీతా పాండేకి సృజన ఉంది. కొత్తగా చేసే ఆలోచన ఉంది. అందుకే తానే రంగంలో దిగింది. అప్పటికి తన దగ్గర 1500 ఉన్నాయి. ఓ పాత సైకిలుంది. ఆ సైకిల్ మీద తిరుగుతూ రా మెటీరియల్ కొని తెచ్చింది. 8 గంటల్లో 100 డబ్బాలు తయారు చేసింది. తనే వాటిని సైకిల్ వెనుక కట్టుకుని స్వీట్ షాపులకు అమ్మేందుకు బయలుదేరింది. అవి బాగుండటంతో అమ్ముడుపోయాయి కాని ఇంతకంటే తక్కువకు సరుకు వేస్తున్నారని తెలిసింది. గోరఖ్పూర్ రత్న ఇటీవలే ఉత్తరప్రదేశ్ సి.ఎం ఆదిత్యానాథ్ మహిళా అంట్రప్రెన్యూర్గా ఎంతో స్ఫూర్తినిస్తున్న సంగీతా పాండేని ‘గోరఖ్పూర్ రత్న’ బిరుదుతో సత్కరించాడు. ఇప్పుడు సంగీతా పాండే తయారు చేస్తున్న స్వీట్ బాక్సులు ఢిల్లీ వరకూ వెళుతున్నాయి. స్వీట్లను ఒకదాని మీద ఒకటి కుక్కే విధంగా కాకుండా సంగీతా స్వీట్బాక్సులు ఒకదాని పక్కన ఒకటి అంటకుండా అమర్చేలా ఉండటంతో ఆదరణ పొందుతున్నాయి. సంప్రదాయం కోసం కొద్ది స్వీట్లతో ఒక బుట్టను ప్రెజెంట్ చేసేలా కూడా పెట్టెలు తయారు చేస్తోంది. స్వీట్లలోని రకాలను బట్టి ఈ ప్యాకింగ్ బాక్సులు మారిపోతుంటాయి. సృజన, శ్రమ కలిస్తే సక్సెస్ అదే వస్తుందనడానికి మరో ఉదాహరణ సంగీతా పాండే. అసలు కిటుకు రా మెటీరియల్ లక్నో, ఢిల్లీలలో తక్కువకు దొరుకుతుందని, వాటితో కళాత్మకంగా డబ్బాలు తయారు చేసి తక్కువకు ఇవ్వగలిగితే చాలా గిరాకీ ఉంటుందని తెలుసుకుంది సంగీతా పాండే. వెంటనే చురుగ్గా ఉండే నలుగురైదుగురు స్త్రీలను పనిలోకి తీసుకుంది. డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి 2 లక్షలు లోన్ సాధించింది. పనిలోకి దిగింది. కిలో, అరకిలో, పావుకిలో డబ్బాలు మంచి రంగులతో లోపల జలతారు వస్త్రంతో తయారు చేసి గోరఖ్పూర్, లక్నోలలో స్టాకు వేయడం మొదలెట్టింది. ‘నాణ్యత విషయంలో ఒక పైసా నష్టం వచ్చినా రాజీ పడకూడదు అనే నియమం పెట్టుకున్నాను’ అంటుంది సంగీతా పాండే. ఆ నాణ్యత, ముస్తాబు వల్ల ఆమె ఖాళీ బాక్సులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు ఆమె నగలు కుదువ పెట్టి మరో 3 లక్షలు తీసుకుని వ్యాపారాన్ని విస్తరించింది. ఆ తర్వాత బ్యాంకులే వెతుక్కుంటూ వచ్చి 30 లక్షలు లోను మంజూరు చేశాయి. ఒక ఫ్యాక్టరీ ఆవరణ, పని చేసే స్త్రీలు, వీరు కాకుండా ఇళ్ల దగ్గర ఉంటూ పనిచేసే స్త్రీలు వీరంతా ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు. సంగీతా పాండే దూసుకుపోయింది. -
బిడ్డల చెంతకు చేరిన తల్లి
కాకినాడ క్రైం: ప్రాణప్రదంగా చూసుకునే ఇద్దరు బిడ్డల్నీ వదిలేసి రోడ్డు పాలైన ఓ తల్లి తిరిగి వారి చెంతకు చేరింది. భర్త వదిలేశాడనే వేదన తాళలేక మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళను దిశ వన్స్టాప్ సెంటర్ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాలు దాటి వచ్చి అనాథలా రోడ్లు పట్టిన ఆ తల్లిని తిరిగి బిడ్డల చెంతకు చేర్చింది. వివరాలివీ.. సుమారు నెల రోజులక్రితం ఓ రోజు అర్ధరాత్రి కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఓ అనాథ మహిళ వెంట ఇద్దరు వ్యక్తులు పడ్డారు. వారినుంచి తప్పించుకున్న ఆమె సహాయం కోసం రైల్వే సిబ్బంది క్యాబిన్ తలుపులు కొట్టింది. సిబ్బంది బయటకు రావడంతో ఆ దుండగులిద్దరూ పరారయ్యారు. రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఏవీకే సంతోష్ ఆ మహిళ దుస్థితిని గమనించి, మతిస్థిమితం కోల్పోయిందని నిర్ధారించారు. ఆమె పరిస్థితిని జిల్లా మహిళా, శిశు సాధికార అధికారి ప్రవీణకు వివరించి సహాయం కోరారు. తక్షణమే స్పందించిన ఆమె దిశ వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ కె.శైలజకు తగిన ఆదేశాలిచ్చారు. శైలజ బాధిత మహిళను కాకినాడ జీజీహెచ్లోని దిశ వన్స్టాప్ సెంటర్కు తరలించారు. నెల రోజులపాటు సపర్యలు చేసి ఆమె వివరాలు రాబట్టారు. ఆమె పేరు ప్రియాంక షైనీ అని, ఊరు గోరఖ్పూర్ అని గుర్తించారు. దీంతో ఆమె ఫొటో సర్క్యులేట్ చేసి... ఆ మహిళ బంధువుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 2021 నవంబర్ 2వ తేదీన ఆ మహిళ అదృశ్యమైనట్టు గోరఖ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని నిర్ధారణ కాగా.. అక్కడి పోలీసుల ద్వారా ప్రియాంక షైనీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వీడియో కాల్లో ఆమెను చూసి నిర్ధారించుకుని కాకినాడ వచ్చారు. దిశ వన్స్టాప్ బృందం ఏఎస్ఐ చంద్ర, కౌన్సిలర్ జమీమా, ఐటీ స్టాఫ్ దుర్గాదేవి సమక్షంలో ప్రియాంకను అధికారులు గురువారం ఆమె సోదరికి అప్పగించారు. ప్రియాంక సోదరి మాట్లాడుతూ తన అక్కకు 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, ఏడాదికాలంగా అమ్మ ఏదని వారు అడుగుతుంటే ఊరెళ్లిందని, త్వరలోనే వచ్చేస్తుందని అబద్ధం చెబుతూ కాలం గడిపామని భావోద్వేగానికి గురైంది. -
తల్లి మృతదేహాన్ని నాలుగు రోజులు బెడ్ కింద దాచిన కుమారుడు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పుర్లో ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే బెడ్ కింద దాచాడు. నాలుగు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన ఎక్కువగా రావడంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు ఆ వ్యక్తి ఇంట్లో బెడ్ కింద అతని తల్లి శవాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమె నాలుగు రోజుల క్రితమే చనిపోయిందని కుమారుడు పోలీసులకు చెప్పాడు. దుర్వాసన రాకుండా రోజూ అగరొత్తులు వెలిగించినట్లు పేర్కొన్నాడు. మృతురాలిని శాంతి దేవి(82)గా గుర్తించారు. ఆమె విశ్రాంత ఉపాధ్యాయురాలు. భర్త 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. కుమారుడు నిఖిల్తో పాటు శివ్పుర్ సహబాజ్గంజ్లో నివసిస్తోంది. అయితే నిఖిల్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అతను డ్రగ్స్కు బానిస కావడంతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. శాంతి దేవి అనారోగ్య కారణాలతోనే మరణించి ఉంటుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక నిజా నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
Video: మహిళ చేతివాటం.. అందరి ముందే రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది
లక్నో: ఒక మహిళ బ్లాక్ కళ్లజోడు, మాస్కో ధరించి ఒక జ్యూవెలరీ షాపుకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఆ షాపు కూడా కస్టమర్లతో చాలా బిజీగా ఉంది. దీంతో ఆ మహిళ ఇదే అవకాశం అనుకుందో ఏమో గానీ ఆ షాపు అతనితో నెక్లెస్ మోడళ్లను చూపించమంది. దీంతో అతను రకరకాల మోడల్స్ను చూపించాడు. ఆమె తెలివిగా ఒక మోడల్ నెక్లెస్ని చూస్తున్నట్లుగా పక్కనే ఉన్న మరో నెక్లెస్ బాక్స్ని క్లోజ్ చేసి ఆ బాక్స్పై తాను చూస్తున్న నగ బాక్స్ని పెట్టింది. ఆ తర్వాత షాపు వాడు గమనించడం లేదనుకుని డిసైడ్ అయ్యాక నెమ్మదిగా తన వొడిలో పెట్టుకున్నట్లుగా పెట్టుకుని ఆ క్లోజ్ చేసి ఉన్న నగల బాక్స్ని చీర మడతల్లో తెలివిగా దాచింది. ఆ తర్వాత తనకు ఏం నగలు నచ్చలేదున్నట్లుగా కామ్గా పైకి లేచి వెళ్లిపోయింది. అక్కడ ఉన్న షాపు అతను ఆమె ఏం కొనక్కుండా ఎందుకలా వెళ్లిపోతుంది అని కూడా అనుమానించ లేదు. ఆమె మాత్రం భలే గమ్మత్తుగా రూ. 10 లక్షలు ఖరీదు చేసే చెవి పోగోలు తోపాటుగా ఉన్న నెక్లెస్ బాక్స్తో జంప్ అయిపోయింది. ఈ ఘటన నవంబర్ 17న గోరఖ్పూర్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేమండి. (చదవండి: చిన్నారిని గాల్లోకి విసిరే స్టంట్: మండిపడుతున్న నెటిజన్లు) -
కి‘లేడీ’.. చూస్తుండగానే రూ.6.7 లక్షల నెక్లెస్ మాయం
-
చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు: వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ జూని సందర్శించి చిరుత పిల్లకు పాలు పట్టించారు. యోగి స్థానిక ఎంపీ రవి కిషన్తో కలిసి జూ సందర్శనకి వెళ్లారు. అక్కడ ఉన్న జూ అధికారులు, వెటర్నరీ డాక్టర్లు యోగిని చుట్టుముట్టి ఎన్క్లోజర్లో ఉన్న చిరుతలను చూపించారు. ఇంతలో ఆయన ఒక చిరుత పిల్లకు పాలబాటిల్తో పాలు పట్టించేందుకు దాని ఎన్క్లోజర్ వద్దకు వచ్చారు. వెటర్నరీ డాక్టర్ ఆ చిరుత పిల్లను బోన్ లోంచి తీసి యోగికి ఇచ్చారు. ఐతే అది మొదట తాగేందుకు అస్సలు ఇష్టపడలేదు. దీంతో ఆయన వెటర్నరీ డాక్టర్ సాయంతో ఎట్టకేలకు ఆ చిరుత పిల్లకు పాలు పట్టించగలిగారు. అంతేగాదు ఆ జూలో ఉన్న మిగతా పెద్ద పెద్ద చిరుతలను కూడా సందర్శించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని జూ అధికారులు నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఈ జూని 'షాహిద్ ఆష్పాక్ ఉల్లాల్ ఖాన్ పార్క్' అని కూడా పిలుస్తారు. దీన్ని గతేడాది మార్చిలో యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఇది పుర్వాంచల్ ప్రాంతంలోని మొట్టమొదటి జూలాజికల్ పార్క్, అలాగే ఉత్తరప్రదేశ్లో మూడవది అని జూ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: కొడుకులు వారసులు కాలేరు! ఏక్నాథ్ షిండే సెటైర్లు) -
ఏకంగా 61 సార్లు ఎన్నికల్లో గెలిచి 106 ఏళ్ల వృద్ధుడిగా గిన్నిస్ రికార్డు
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో కన్హయ్య లాల్ గుప్తా అనే 106 ఏళ్ల వృద్ధుడు ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్యే యూనియన్ నాయకుడిగా రికార్డు సృష్టిచాడు. అతడు యూనియన్ ఎన్నికల్లో ఏకంగా 61 సార్లు గెలిచిన అత్యంత పెద్ద యాక్టివ్ ట్రేడ్ యూనియన్ లీడర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులోకి ఎక్కబోతున్నాడు. గోరఖ్పూర్కి చెందిన కన్హయ్య లాల్ గుప్తా 1946లో రైల్వేలో చేరిన తర్వాత ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. స్వాతంత్యం వచ్చేంత వరకు 10 ఏళ్లు సైన్యంలో పనిచేశారు. ఆ కొద్దికాలంలోనే ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్(ఎన్ఈఆర్ఎంయూ)తో అనుబంధం కలిగి ఉన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనరల్ సెక్రటరీ ఎన్నికల్లో పోటీ చేస్తుండేవాడు. ఆయన 1981లో పదవి విరమణ చేశాడు. అయినప్పటికీ తన సహ రైల్వే యూనియన్ సభ్యులకు ప్రాతినిధ్యం వహించడం ఆపలేదు. అతను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తాను 1974లో స్వాతంత్య్ర ఉద్యమకారుడు జయప్రకాశ్ నారాయణతో కలిసి పనిచేయడం వల్ల స్ఫూర్తి, నైతిక బలాన్ని పొదినట్లు చెప్పారు. అతను రైల్వేలో అత్యంత పెద్ద వయసు కలిగిన ఫించనుదారుడు. అంతేకాదు అతని కెరీయర్లో కొన్ని ఎత్తుపల్లాలు కూడా ఉన్నాయి. అతను నాలుగుసార్లు పదవి నుంచి తొలగింపబడ్డాడు, ఒక నెల జైలు శిక్ష అనుభవించాడు. కన్హయ్య లాల్కి ఈశాన్య రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయమే నివాసం, అందులోని సభ్యులే తన కుటుంబం అని చెబుతుంటాడు. మీడియా నివేదికల ప్రకారం అతని కార్యాలయం ఏడాది పొడువునా తెరిచే ఉంటుంది. (చదవండి: తల నరికేసే ఊరిలో... రెండు దేశాల బార్డర్) -
భారీ ఆధిక్యంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్
-
యోగి ఆదిత్యనాథ్పై మహిళ పోటీ.. ఆమే ఎందుకు?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటిసారిగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటుగా మహిళా నేత శుభావతి శుక్లాను సమాజ్వాదీ పార్టీ రంగంలోకి దించింది. కాంగ్రెస్ నుంచి చేతనా పాండే, బీఎస్పీ అభ్యర్థిగా ఖ్వాజా శంషుద్దీన్ బరిలో ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ తరపున యువ దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. ఎవరీ శుభావతి? దివంగత బీజేపీ నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా సతీమణి శుభావతి. ఉపేంద్ర దత్ గుండెపోటుతో 2020లో మరణించారు. గోరఖ్పూర్లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన దాదాపు 40 ఏళ్ల పాటు పనిచేశారు. నాలుగు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసినా విజయాన్ని అందుకోలేకపోయారు. రెండు అసెంబ్లీ ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఒక లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. యోగి ఆదిత్యనాథ్ యూపీ బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి గోరఖ్పూర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన 2018 లోక్సభ ఉప ఎన్నికల్లో ఉపేంద్ర దత్ పోటీ చేశారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. యోగి ఆదిత్యనాథ్తో విభేదాల కారణంగానే ఆయన ఓడిపోయారన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. తన భర్త జీవించి ఉన్న సమయంలో శుభావతి రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజా ఎన్నికల్లో తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్పూర్లోని మరో స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కుమారుడితో కలిసి గత నెలలో సమాజ్వాదీ పార్టీలో చేరారు. బీజేపీ తమ పట్ల వ్యవహరించిన తీరుపై శుక్లా కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఉపేంద్ర శుక్లా మరణం తర్వాత యోగి ఆదిత్యనాథ్ కనీసం తమ కుటుంబాన్ని పరామర్శించలేదని వారు వెల్లడించారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన ఉపేంద్ర కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా అవమానించిందని బాధ పడుతున్నారు. (హాట్టాఫిక్: యూపీ ఎన్నికల బరిలో సదాఫ్, పూజ) సానుభూతి పనిచేస్తుందా? సీఎం యోగిపై శుభావతిని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీకి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ బలమైన అభ్యర్థిని ఎదుర్కొనేందుకు ఆమెను ఎంపిక చేయడం విశేషం. ఠాకూర్-బ్రాహ్మణుల ఓటు బ్యాంకును చీల్చి బీజేపీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే శుభావతిని పోటీకి పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె భర్త ఉపేంద్ర శుక్లా గోరఖ్పూర్లోనే కాకుండా పూర్వాంచల్లోనూ పేరున్న బ్రాహ్మణ నాయకుడు. శుక్లా కుటుంబంపై ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవాలని సమాజ్వాదీ పార్టీ భావిస్తోంది. బీజేపీ తమ కుటుంబానికి చేసిన అన్యాయం గురించే ఎన్నికల ప్రచారంలో శుభావతి, ఆమె కుమారుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆసక్తికర పోటీ చాలా కాలంగా యోగి ఆదిత్యనాథ్కు ప్రత్యర్థిగా ఉన్న బీఎస్పీ మాజీ నేత హరిశంకర్ తివారీ కుమారుడు గతేడాది డిసెంబర్లో సమాజ్వాదీ పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే మరో అంశం. అయితే గోరఖ్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎన్నడూ ఓడిపోని యోగి ఆదిత్యనాథ్కు గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం అత్యంత సురక్షితమైందిగా పరిగణించబడుతోంది. బీజేపీ, సమాజ్వాదీ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఇక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మార్చి 3న ఇక్కడ పోలింగ్ జరగనుంది. (క్లిక్: ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు) -
సీఎం యోగిపై పోటీకి రెడీ.. టిక్కెట్ ఇవ్వండి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై పోటీకి తాను సిద్ధమని డాక్టర్ కఫీల్ ఖాన్ ప్రకటించారు. ‘గోరఖ్పూర్లో యోగి ఆదిత్యనాథ్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. ఏ పార్టీ అయినా నాకు టిక్కెట్ ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నాను' అని పీటీఐతో డాక్టర్ ఖాన్ చెప్పారు. (చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు; ఆసక్తికర పరిణామాలు) చర్చలు జరుగుతున్నాయి మీరు ఏదైనా పార్టీతో టచ్లో ఉన్నారా, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అని అడిగినప్పుడు.. ‘అవును, సంప్రదింపులు జరుగుతున్నాయి, అన్నీ కుదిరితే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాన’ని సమాధానం ఇచ్చారు. గోరఖ్పూర్లో 2017, ఆగస్టులో జరిగిన దుర్ఘటనలో తనను బలిపశువు చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. ఇప్పటికీ ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోరఖ్పూర్ పోలీసులు పదే పదే తమ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రెండు సస్పెన్షన్లు.. రెండుసార్లు జైలు గోరఖ్పూర్లో 2017, ఆగస్టులో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో చోటుచేసుకున్న దుర్ఘటనతో కఫీల్ ఖాన్ జీవితం తలక్రిందులైంది. ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో డాక్టర్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు జైలు పాలయ్యారు. రెండు పర్యాయాలు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల ఆధారంగా ‘ది గోరఖ్పూర్ హాస్పిటల్ ట్రాజెడీ- ఏ డాక్టర్స్ మెమోయిర్ ఆఫ్ ఎ డెడ్లీ మెడికల్ క్రైసిస్' పేరుతో పుస్తకం రాశారు. 5000 కాపీలకు పైగా అమ్ముడవడంతో ఈ బుక్ బెస్ట్ సెల్లర్గా నిలిచిందని డాక్టర్ ఖాన్ తెలిపారు. ఇప్పటికీ పోలీసుల వేధింపులు ఆగలేదన్నారు. (చదవండి: ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్..) రౌడీ షీటర్ అంటున్నారు ‘డిసెంబర్ 17, 2021న నా పుస్తకాన్ని లాంచ్ చేసిన తర్వాత డిసెంబర్ 20న పోలీసులు మా ఇంటికి వచ్చారు. తర్వాత డిసెంబర్ 28న ఒకసారి, మళ్లీ జనవరిలో వచ్చారు. నేను గోరఖ్పూర్లోని రాజ్ఘాట్ పోలీస్ స్టేషన్లో హిస్టరీ షీటర్ని అని పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హిస్టరీ షీటర్లపై కన్నేసి ఉంచామని అంటున్నార’ని డాక్టర్ ఖాన్ వెల్లడించారు. (చదవండి: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..) నా జీవితం నాశనం చేశారు పాలకులు నిర్లక్ష్యం కారణంగానే గోరఖ్పూర్ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఫలితంగా 54 గంటల వ్యవధిలో 80 మంది పసివాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పారు. నిజాలకు పాతర వేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ అయితే ప్రకృతి విపత్తుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆస్పత్రి అథారిటీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు తనను జైలుకు పంపారని, తన సోదరుడిపై దాడికి పాల్పడ్డారని.. కుటుంబ వ్యాపారాన్ని నాశనం చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. తనను జైలు నుంచి విడిపించేందుకు తన తల్లి, భార్య ఎంతో కష్టపడ్డారని తెలిపారు. తాను రాసిన పుస్తకం చదివితే ప్రస్తుతం మనం ఎలాంటి పాలకుల ఏలుబడిలో ఉన్నామన్న విషయం తెలుస్తుందన్నారు. (చదవండి: సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?) -
తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో గడిచిన ఎన్నికల్లో అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు అనాసక్తి చూపితే.. తొలిసారి ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం కదనరంగంలో తేల్చుకునేందకు సిధ్దమయ్యారు. హిందూ, ధార్మిక భావజాలం ఉండే అయోధ్య లేక మథుర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయనను పోటీ చేయిస్తారని ప్రచారం జరిగినా బీజేపీ అధిష్టానం అనూహ్యంగా ఆయన్ను తూర్పు యూపీలోని స్వస్థలమైన గోరఖ్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిపింది. గోరఖ్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఉండటంతో అక్కడే నుంచే ఆయన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నష్ట నివారణచర్యల్లో భాగంగానే.. అయితే యోగిని గోరఖ్పూర్ నుంచి పోటీ చేయించడానికి అనేక కారణాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతు న్నాయి. గోరఖ్పూర్ తూర్పు యూపీలో ఉంది. తూర్పు యూపీకి చెందిన ఇద్దరు కేబినెట్ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్లు ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. మౌర్య 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఖుషీనగర్ జిల్లా కేంద్రమైన పద్రౌనా నుంచి గెలుపొందగా, మవూ జిల్లాలో ఉన్న మధుబన్ నుండి దారాసింగ్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిద్దరూ స్థానికంగా బలవంతులు. సామాజికవర్గంపై బాగా ప్రభావం చూపుతారు.వీరి రాజీనామాతో పార్టీకి నష్టం కగిలే అవకాశాలున్నాయి. చదవండి: రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి.. గోరఖ్పూర్ నుంచి యోగి అభ్యర్థిగా బరిలోకి దిగితే ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఇక్కడ యోగిని నిలపడం ద్వారా సీట్లు తగ్గకుండా చూసుకోవడంతో పాటు, గోరఖ్పూర్ పొరుగు జిల్లాలైన బస్తీ, సిద్ధార్థనగర్, ఖుషీనగర్, మహరాజ్గంజ్, బలరాంపూర్, సంత్ కబీర్నగర్, డియోరియాలలో మద్దతును పెంచుకోవాలన్నది. బీజేపీ వ్యూహంగా ఉంది. అదీగాక యోగి 1998, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికలలో వరుస విజయాలను నమోదు చేసి, గోరఖ్పూర్ నుండి ఐదుసార్లు లోక్సభ ఎంపీగా గెలిచారు. అంతేకాకుండా అ త్యంత ప్రజాదరణ పొందిన గోరఖ్నాథ్ మఠానికి అధిపతిగా ఉన్నారు. గోరఖ్పూర్ నుండి పోటీ చేయడం ద్వారా, యోగికి యూపీలోని ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టడా నికి ఎక్కువ సమయం ఉంటుందని బీజేపీ అంచనా. సీఎం అభ్యర్థులంతా పోటీకి దూరమే యూపీలో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారపగ్గాలు చేపట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు దిగలేదు. శానమండలి సభ్యురాలిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ ఆమె అసెంబ్లీకి పోటీ చేయలేదు. ఇక సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్యాదవ్ సైతం పార్లమెంట్కు గెలిచినా, 2012లో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే బరిలో దిగలేదు. మండలి నుంచి ఎన్నికై సీఎంగా కొనసాగారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చదవండి: Punjab Assembly Election 2022: ఆప్కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా ఆయన్ను అసెంబ్లీ బరిలో నిలిపే విషయమై అనేక తర్జనభర్జనలు జరిగాయి. ఒకవేళ పోటీలో నిలిపితే శ్రీకృష్ణ జన్మభూమి అయిన మథుర, రామ జన్మభూమి అయిన అయోధ్యల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ నిలుపుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ మూడ్రోజుల కింద ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో యోగికి గోరఖ్పూర్ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఒటమి భయంతోనే యోగీని తిరిగి సొంతింటికి పంపారని ఎస్పీ అప్పుడే ప్రచారాలు సైతం మొదలుపెట్టింది. మథుర, అయోధ్యకు దూరానికి భిన్న కారణాలు.. ఇక మథుర, అయోధ్యలో యోగిని పోటీ దిగకపోవడానికి పార్టీ వర్గాలు అనేక కారణాలను విశ్లేషిస్తున్నాయి. మథురలో ఇప్పటికే బీజేపీ నుంచి బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీకాంత్ శర్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ అగ్రనాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన శర్మ విద్యుత్ శాఖ మంత్రిగానూ కొనసాగుతున్నారు. ఆయన్ను పక్కనపెట్టి యోగికి టిక్కెట్ ఇవ్వడం అంటే బ్రాహ్మణ వర్గానికి కోపం తెప్పిచ్చినట్లే అవుతుంది. అదీగాక విద్యుత్ సంస్కరణలు తెచ్చామని చెబుతున్న ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రికే టిక్కెట్ నిరాకరించడం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వెనక్కి తగ్గారు. ఇక అయోధ్యలో బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే వేద్ప్రకాశ్ గుప్తా ఎస్పీ ప్రభుత్వంలోని మాజీ మంత్రి తేజ్ నారాయణ్ పాండేను 50 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. దీంతో ఆయనకు టిక్కెట్ నిరాకరించడం సాథ్యం కాదు. ఈ దృష్ట్యానే అయోధ్యలో పోటీపై వెనక్కి తగ్గారు. -
కాక రేపుతున్న యూపీ ఎన్నికలు.. బీజేపీ ఎమ్మెల్యేకు అఖిలేష్ బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో బీజేపీ వర్సెస్ సమాజ్వాదీపార్టీ అన్నట్టుగా నడుస్తోంది ఎన్నికల రాజకీయం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో ఆ స్థానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదేక్రమంలో గోరఖ్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాధా మోహన్దాస్ అగర్వాల్కు బీజేపీ హైకమాండ్ ఏ సీటు కేటాయిస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గోరఖ్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాధా మోహన్దాస్ అగర్వాల్కు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సమాజ్వాదీ పార్టీలో చేరి సీఎం యోగి ఆదిత్యనాథ్పై పోటీచేయాలని ప్రతిపాదించారు. ఆయన రావడానికి ఆసక్తిగా ఉంటే,.. గోరఖ్పూర్ అర్బన్ సీటును కేటాయించడానికి సిద్ధమని అన్నారు. 2002 నుంచి రాధా మోహన్దాస్ గోరఖ్పూర్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవలే ముగ్గురు మంత్రులు, ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఫిబ్రవరి 10న మొదలయ్యే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మార్చి 10 వరకు కొనసాగనుంది. మొత్తం 7 దశల్లో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ ప్రకటించింది. (చదవండి: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్) -
మరో వ్యక్తితో ప్రేయసి పెళ్లి.. సడెన్గా మాజీ ప్రేమికుడి ఎంట్రీ.. చివరికి
లక్నో: నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు సినిమా స్టోరీలకు ఏమాత్రం తీసిపోవు. తాజాగా ఉత్తర ప్రదేశ్లోని ఓ పెళ్లిలో సినిమాను మించి పోయే ఘటన చోటుచేసుకుంది. గోరఖ్పూర్లోని హర్పూర్లో బంధు మిత్రుల సమక్షంలో వివాహా వేడుక జరుగుతోంది. ఇంతలో పెళ్లి మండపంలోకి కండువా కప్పుకున్న ఓ యువకుడు సడెన్కు ఎంటర్ అయ్యాడు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటుండగా వెంటనే వారి మధ్యలోకి దూరి వధువు నుదుటిపై కుంకుమ దిద్దడానికి ప్రయత్నించాడు. చదవండి: రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!! ఇది గమనించిన వధువు తన ముఖంపై పరదా కప్పుకునేందుకు ప్రయత్నించగా, బలవంతం ఆమె నుదుటిపై సింధూరాన్ని దిద్దాడు. పెళ్లి వేడుకను ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే వధువుకి కుంకుమ దిద్దిన వ్యక్తి ఆమె మాజీ ప్రేమికుడని తెలిసింది. అతను కొన్ని నెలల క్రితం పని నిమిత్తం వేరే ఊరుకువెళ్లాడు. ఇంతలో తన ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్న యువకుడు హుటాహుటినా మండపానికి చేరుకున్నాడు. తన ప్రేయసి పెళ్లి పెళ్లి ఆపేందుకు ఇలా ప్లాన్ చేయగా.. చివరికి యువకుడిని పట్టుకొని బంధువులు చితకబాదారు. అయితే ఈ రచ్చ అక్కడితో ముగియలేదు. ఇదంతా జరిగిన మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన వరుడితోనే యువతి పెళ్లి జరిగింది. మరోవైపు చేసేందేం లేక మాజీ ప్రియుడు సైతం తన ఇంటికి వెళ్లి పోయాడు. చదవండి: గూగుల్లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా? -
ప్రోనింగ్ టెక్నిక్తో కరోనాను జయించిన 82 ఏళ్ల బామ్మ
లక్నో: కరోనా సోకడం కంటే ముందే ఎక్కడ మహమ్మారి బారిన పడతామోనన్న ఆందోళనతోనే ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. భయం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి కూడా మనుషుల ప్రాణాలు పోతున్నాయని.. ధైర్యంగా ఉన్నప్పుడు శరీరంలో ఇమ్యూన్ సిస్టం కూడా అదే స్థాయిలో పనిచేస్తుందని నిరూపించింది 82 ఏళ్ల బామ్మ. కోవిడ్-19 సెకండ్ వేవ్తో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న వేళ కాస్త ఊరట కలిగించే వార్త ఇది. డాక్టర్ల సలహాలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహానికి తోడు మనోధైర్యంతో 82 ఏళ్ల బామ్మ కరోనాను జయించి వార్తల్లో నిలిచారు. ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్ పూర్కు చెందిన 82 ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె కుమారుడు శ్యామ్ శ్రీవాస్తవ డాక్టర్లను సంపద్రించాడు. డాక్టర్ల సలహాలతో కేవలం 12 రోజుల్లోనే హోం ఐసోలేషన్ లో ఉండి కరోనా నుంచి ఉపశమనం పొందింది. ఈ సందర్భంగా శ్యామ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ' ఏప్రిల్ నెలలో మా అమ్మకు కరోనా సోకింది. ఆ సమయంలో ఆమె ఆక్సిజన్ లెవల్స్ 79కి పడిపోయాయి. దీంతో మేం అందరం ఆందోళనకు గురయ్యం. ఆస్పత్రిలో చేర్పించాలని అనుకున్నాం. కానీ ఆస్పత్రుల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అందుకే డాక్టర్ల సలహాతో ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాం. ఆక్సిజన్ లెవల్స్ పెరిగేందుకు ప్రోనింగ్ ప్రొజిషన్ ప్రాక్టీస్ చేయిస్తూ లవంగం, కర్పూరం కరోమ్ సీడ్స్తో మిశ్రమం తయారు చేసి ఆవిరి పీల్చడంతో ఆరోగ్యం కుదుట పడింది. అలా చేయడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ కేవలం నాలుగు రోజుల్లో 94కి పెరిగాయి. డయాబెటిస్ , అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగుంది’’ అని చెప్పారు. ప్రోనింగ్ అంటే ఏమిటి ? కరోనా వైరస్ సోకిన బాధితులకు ఊపిరి సరిగా అందనప్పుడు పాత కాలం పద్దతిలో బోర్లా పడుకోవాలి. చాలా ఆస్పత్రులలో ఊపరి ఆడని కరోనా పేషెంట్ల ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. వైద్య భాషలో దీన్ని ప్రోనింగ్ అంటారు. ఇలా రోజుకి ఒక సారి 30 నిమిషాల పాటు ప్రోనింగ్ చేయడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ప్రోనింగ్ పొజిషన్ తో బ్రీతింగ్ లెవల్స్ ఎలా కంట్రోల్ అవుతాయి? వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోనింగ్ వ్యాయామం రోజుకు మూడుసార్లు చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ మెరుగ్గా కొనసాగుతాయి. అదే సమయంలో ఈ ప్రోనింగ్ పోజిషన్ వేసిన తరువాత ఎప్పటికప్పుడు పల్స్ మీటర్ సాయంతో ఆక్సిజన్ లెవల్స్ను నిరంతరం పర్యవేక్షించాలి. చదవండి: ఆక్సిజన్ కొరత: ప్రోనింగ్ చేయమంటున్న కేంద్రం -
ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా!
ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ పోలీసులు ప్రస్తుతం ట్విటర్లో తీవ్ర ట్రోలింగ్కు గురవుతున్నారు. ఇందుకు ఓ నిందితుడితోపాటు అతన్ని పట్టుకున్న పోలీసు ఉన్న ఫోటోకు ఫోటోషాప్ ద్వారా ముఖానికి మాస్కు ధరించినట్లు మార్పింగ్ చేయటమే కారణం. వివరాల్లోకి వెళితే.. భూ వివాద గొడవలో సొంత సోదరుడిని హతమార్చినందుకు గోరఖ్పూర్ జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ నిందితుడిని పట్టుకున్న ఓ ఫోటోను తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరికి కూడా మాస్క్ లేదు. ఇది గుర్తించిన నెటిజన్లు కరోనా ప్రోటోకాల్ను పోలీసులు పాటించడం లేదని విమర్శలు గుప్పించారు. దీంతో ఈ పోస్టును పోలీసులు వెంటనే తొలగించారు. చదవండి: ‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు’ తరువాత ఇదే ఫోటోను ఫోటోషాప్లో ఎడిట్ చేసి రీ పోస్టు చేశారు. ఇందులో అరెస్టు అయిన నిందితునితో పాటు పోలీసు ముఖానికి మాస్కు ధరించినట్లు ఫోటోను మార్ఫింగ్ చేశారు. దీనిని మళ్లీ ట్విటర్లో పోస్టు చేశారు. అయితే అంతకుముందు షేర్ చేసిన ఫొటోను, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు పోలీసులను పదే పదే ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘డిజిటల్ మాస్క్@ గోరఖ్పూర్ పోలీసులు, మీలాగా డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’ అంటూ చురకలంటించారు. ఇట్లాంటి జిమ్మిక్కులు ఎప్పుడూ చూడలేని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తప్పిదాన్ని గ్రహించిన పోలీసులు ఆ ఫొటోను వెంటనే తొలగించారు. అయితే అప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. Before After pic.twitter.com/p26Z2hIbfn — Piyush Rai (@Benarasiyaa) January 10, 2021 Nobody promotes Digital India like @gorakhpurpolice pic.twitter.com/7ExsHTb3J0 — Joy (@Joydas) January 10, 2021 -
మా అమ్మకు పెళ్లి... నాక్కూడా..
ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో మొన్నటి ఆదివారం (డిసెంబర్ 13) ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్’ కార్యక్రమం జరిగింది. 63 జంటలు ఈ సందర్భంగా వివాహం చేసుకున్నాయి. అయితే వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ జంటల్లో ఒక 27 ఏళ్ల కుమార్తె పెళ్లి చేసుకుంది. అలాగే ఆమె 53 ఏళ్ల తల్లి కూడా పెళ్లి చేసుకుంది. గతంలో ఏదో సినిమాలో తల్లి పెళ్లి కూతురు చేస్తుంది. అయితే ఇక్కడ కూతురు తాను చేసుకుంటూ తల్లికి కూడా చేసింది. అందుకే ఇది వైరల్ వార్త అయ్యింది. గోరఖ్పూర్ పీప్రోలికి చెందిన బేలి దేవి భర్త పాతికేళ్ల క్రితమే మరణించాడు. ఆమె ఒక్కతే తన ఇద్దరు కొడుకులను, కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. కొడుకుల పెళ్లిళ్లు అయ్యాయి. ఒక కూతురు పెళ్లి కూడా అయ్యింది. చివరి కూతురు ఇందు పెళ్లి సందర్భంగా తల్లి భవిష్యత్తు గురించి చర్చ జరిగింది. ‘పిల్లలందరూ నేను పెళ్లి చేసుకోవడమే మంచిదన్నారు’ అంది బేలి దేవి. భర్త తమ్ముడు జగదీశ్ అన్న కుటుంబాన్ని చూసుకోవడానికి అవివాహితుడిగా మిగిలిపోయాడు. అతడే ఇన్నాళ్లు ఆ కుటుంబానికి అండా దండా. ‘అతణ్ణే పెళ్లి చేసుకోవడం మంచిది’ అని నేనూ, పిల్లలూ భావించాం అంది బేలి దేవి. ఇంకేముంది ఒకే వేదికలో కూతురి పెళ్లి, తల్లి పెళ్లి జరిగిపోయాయి. -
ఈ పిల్లిని పట్టిస్తే రూ.15 వేలు మీ సొంతం
గోరఖ్పూర్: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువు మాయమైతే కలిగే బాధ వర్ణనాతీతం. ఏం చేసైనా సరే దాని జాడ కనుక్కోవాలని దగ్గరలోని సందుల్లో దూరి, పక్కింట్లోకి తొంగి చూసి వీలైనన్ని చోట్లా వెతుకుతాం. అయినా ఆ జంతువు కనిపించకపోతే గుండె బరువెక్కి అన్నం కూడా సహించదు. ఇలాంటి బాధలోనే కూరుకుపోయారు ఓ మహిళ. భారత్లోని మాజీ ఎన్నికల అధికారి ఎస్వై ఖురేషీ భార్య, నేపాల్లోని మాజీ ఎన్నికల అధికారిణి ఇల శర్మ పిల్లిని పెంచుకుంటున్నారు. అది క్షణం కనిపించకపోయినా అల్లాడిపోయేవారు. ఎక్కడికెళ్లినా దాన్ని వెంటబెట్టుకు వెళ్లేవారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఆమె తన కూతురు సాచి, డ్రైవర్ సురేందర్తో పాటు, తన పెంపుడు పిల్లితో సహా ఢిల్లీ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. (చదవండి: ఈ నెలలో ఇదే పెద్ద జోక్!) ఇంతలో రైలు పెద్ద శబ్ధంలో కూత పెట్టుకుంటూ రావడంతో బెంబేలెత్తిన పిల్లి అక్కడనుంచి పరిగెత్తింది. అలా భయంతో తప్పిపోయిన మార్జాలం కోసం ఎంత వెతికినా దాని జాడ కానరాలేదు. దీంతో ఆకుపచ్చని కళ్లు, ముక్కు మీద గోధుమ రంగు మచ్చ ఉండి రెండున్నరేళ్ల వయసున్న పిల్లి తప్పిపోయిందని, కనిపిస్తే తిరిగి ఇవ్వాలంటూ ఆమె రైల్వే స్టేషన్లోనే కాకుండా నగరంలోనూ పోస్టర్లు అతికించారు. తన పిల్లిని తెచ్చిచ్చిన వారికి 11 వేల రూపాయల రివార్డు ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని రూ.15 వేలకు పెంచారు. రోజులు గడుస్తున్నా పిల్లి తిరిగి తన చెంతకు రాకపోవడంతో ఆమె తన ఢిల్లీ ప్రయాణాన్ని మానుకుని గోరఖ్పూర్లోనే ఉండి దాన్ని వెతికే పనిలో పడ్డారు. (చదవండి: వైరల్ వీడియో: ఏంటీ ‘పులి’తోనే ఆటలా?!) -
ఇంటికెళ్లేందుకు రూ.1.5 లక్షలు ఖర్చు పెట్టాడు!
ఘజియాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ఓ వ్యక్తి తన స్వస్థలానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి అందుకు భిన్నంగా స్వస్థలానికి చేరుకునేందుకు మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో కుటుంబంతో సహా చిక్కుకుపోయిన లల్లాన్ అనే వ్యక్తి స్వస్థలమైన గోరఖ్పూర్లోని కైతోలియా గ్రామానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం శ్రామిక్ రైలులో సీట్లు బుక్ చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సీటు దొరకలేదు. అటు బస్సులో వెళ్దామనుకుంటే కిక్కిరిసి ఉండే జనాభా వల్ల కరోనా సోకే అవకాశాలుంటాయని కాస్త భయాందోళనకు గురయ్యాడు. దీంతో లల్లాన్ మరో ప్రత్యామ్నాయం ఆలోచించాడు. (శ్రామిక్ రైలులో విషాదం.. 5 రోజుల తర్వాత..) ఇప్పటివరకు దాచుకున్న డబ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. దీని కోసం రూ.1.5 లక్షలు వెచ్చించాడు. ఆ కారులో మే 29న ఘజియాబాద్ నుంచి బయలు దేరగా 14 గంటల తర్వాత ఆ కుటుంబం ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ విషయం గురించి లల్లాన్ మాట్లాడుతూ.. 'లాక్డౌన్ తర్వాత అన్ని పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. ప్రస్తుత సమయంలో నేను, నా కుటుంబం స్వగ్రామానికి తిరిగి వెళ్లడమే మంచిదని భావించాను. దీంతో బస్సులో కానీ రైలులో కానీ సీట్లు పొందేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. అందుకే పైసా పైసా కూడబెట్టిన డబ్బుతో కారు తీసుకుని ఇంటికి చేరుకున్నాం. ఇక్కడే ఏదైనా పని దొరికితే ఘజియాబాద్కు తిరిగి వెళ్ల'నని పేర్కొన్నాడు. ('నా చావుకు లాక్డౌన్ పొడిగింపే కారణం') -
చచ్చిపడిన గబ్బిలాలు.. స్థానికుల్లో ఆందోళన!
లక్నో: మహమ్మారి కరోనా పుట్టుకకు గబ్బిలాలకు సంబంధం ఉందని భావిస్తున్న నేపథ్యంలో... గోరఖ్పూర్లో వెలుగుచూసిన ఓ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గోరఖ్పూర్లోని బేల్గాట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చచ్చిపడిన ఘటన మంగళవారం ఉదయం బయటపడింది. కరోనా వైరస్ కారణంగా అవి చనిపోయి ఉండొచ్చని స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెటర్నరీ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందించారు. ఎండ తీవ్రతతోనే గబ్బిలాలు చనిపోయానని వెటర్నరీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉత్తర భారతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దాంతో చెరువు కుంటలు ఎండిపోయానని తెలిపారు. నీటికి కటకట రావడంతోనే అవి ప్రాణాలు విడిచాయని చెప్పారు. స్థానికంగా ఉండే ప్రజలు పాత్రల్లో వాటికి నీరు ఏర్పాటు చేయాలని కోరారు. మృత గబ్బిలాలను ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్ పంపించామని, వాటి మృతికి గల కచ్చితమైన వివరాలు వెల్లడవుతాయని డివిజనల్ ఫారెస్ట్ హెడ్ అవినాష్ కుమార్ అన్నారు. -
లాక్డౌన్ : పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు
ఢిల్లీ : కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ కొన్ని కుటుంబాలకు తీరని వ్యధను మిగిలిస్తోంది. తమవారు చనిపోతే కడసారి చూసుకునే అవకాశం కూడా లేకపోవడం కలిచివేస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుండడంతో అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోతున్నారు. తన భర్త చనిపోతే అంత్యక్రియలు కూడా నిర్వహించడానికి వీలు లేకపోవడంతో పోలీసులతోనే ఆ కార్యక్రమాన్ని జరిపించాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. (కరోనా : వారి అనుమానం అతని ప్రాణం తీసింది) వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్లోని గోరక్పూర్కు చెందిన వ్యక్తి ఏప్రిల్ 13న చికెన్పాక్స్తో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే లాక్డౌన్ కారణంగా గోరఖ్పూర్లోని అతని కుటుంబసభ్యులు ఢిల్లీకి వచ్చే అవకాశం లేదు. దీంతో మృతదేహం 10 రోజులుగా మార్చురీలోనే ఉండిపోయింది. అయితే మృతుడి భార్య తన భర్త మృతదేహాన్ని గోరక్పూర్కు పంపించడం వీలు కాకపోతే అంత్యక్రియలు అక్కడే చేయండి అంటూ ఢిల్లీ పోలీసులకు లేఖ ద్వారా తెలిపారు. అయితే తన భర్త మరణ దృవీకరణ పత్రంతో పటు పోస్టుమార్టం రిపోర్టును పంపించాలంటూ లేఖలో పేర్కొంది. ఒక కుటుంబం పడుతున్న ఆవేదనను చూసిన ఢిల్లీ పోలీసులు గురువారం ఆ వ్యక్తికి హిందూ సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించారు. (ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా?) ఇదే విషయమై డీసీపీ విజయంత ఆర్య మాట్లాడుతూ..' ఇది చాలా బాధాకరమైన విషయం. తన భర్త అంత్యక్రియలు నిర్వహించాలని ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖ నేను చూశాను. లాక్డౌన్ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులే అంత్యక్రియలు జరిపించారు. అయితే ఆమె లేఖలో పేర్కొన్న విధంగా మృతుడి మరణ దృవీకరణ పత్రంతో పాటు పోస్టుమార్టం రిపోర్టును పోస్ట్ ద్వారా ఆమెకు అందజేస్తామని' పేర్కొన్నారు. -
డాక్టర్ కఫీల్ ఖాన్ మామను కాల్చి చంపారు
గోరఖ్పూర్: 60 మంది నవజాత శిశువుల మరణానికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్ కఫీల్ఖాన్ మామను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన శనివారం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగింది. కఫీల్ ఖాన్ మామ నుస్రుతుల్లా వార్సి శనివారం పొరుగింట్లో కాసేపు చెస్ ఆడి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అదును కోసం ఎదురు చూసిన దుండగులు అతనిపై కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్ నేరుగా తలలోకి దూసుకుపోవడంతో అతను ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. అనంతరం దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. (గోరఖ్పూర్ ఘటన.. ఓ పనైపోయింది) కాగా అతనిపై అక్రమ భూదందా నడుపుతున్నాడనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితునికి బాగా తెలిసిన వ్యక్తులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కఫీల్ సోదరుడు కషీఫ్ జమీల్ను కూడా ఆస్తి తగాదా నేపథ్యంలో హత్య చేసిన విషయం తెలిసిందే. 2017లో ఆక్సిజన్ కొరత కారణంగా యూపీలోని గోరఖ్పూర్ ఆస్పత్రిలో 62 మంది చిన్నారులు మరణించారు. దీనికి ఆసుపత్రి వైద్యుడు కఫీల్ ఖాన్ నిర్లక్ష్యమే కారణమని భావించి అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు ఏడు నెలలకు పైగా జైలు శిక్ష విధించారు. అనంతరం 2018 ఏప్రిల్లో అతను జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక పౌరసత్వ సవరణ చట్టంపైనా వ్యతిరేక నినాదాలు కొద్దిరోజుల పాటు జైలు శిక్ష అనుభవించాడు. (చిన్నారుల మారణహోమానికి అతను కారణం కాదు) -
కన్నకొడుకుని కాల్చిచంపాడు..
లక్నో : ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్లో దారుణం చోటుచేసుకుంది. గురువారం చౌరీ-చౌరా పోలీస్ స్టేషన్లో చిన్నపాటి వాగ్వాదంతో హెడ్కానిస్టేబుల్ అరవింద్ యాదవ్ ఏకంగా కన్న కుమారుడినే కాల్చిచంపిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో నిందితుడు అరవింద్ యాదవ్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన లైసెన్స్డ్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. తండ్రీకొడుకుల మధ్య చిన్నపాటి వివాదంతో ఆగ్రహంతో ఊగిపోయిన అరవింద్ యాదవ్ కుమారుడిపై కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే బాధితుడు మరణించాడని సీఐ సుమిత్ శుక్లా తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి లైసెన్స్డ్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుడిని నిందితుడి మొదటి భార్య కుమారుడు, ఘజీపూర్లో నివసించే వికాస్ యాదవ్గా గుర్తించామని తెలిపారు. -
ఆ చిన్నారుల మృతికి అతను కారణం కాదు
లక్నో: విధుల్లో నిర్లక్ష్యం వహించి 60 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యారనే నెపంతో జైలు శిక్ష అనుభవించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యునికి భారీ ఊరట లభించింది. రెండేళ్ల అనంతరం అందులో ఆ వైద్యుని తప్పేమీ లేదని విచారణ కమిటీ తేల్చింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని బీఆర్డీ కాలేజ్లో 2017 ఆగస్టులో ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో 60 మందికి పైగా చిన్నారులు మరణించారు. అయితే ఇందుకు చిల్ట్రన్స్ డాక్టర్ కఫీల్ ఖాన్ నిర్లక్ష్యమే కారణమని భావించి అతన్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తొమ్మిది నెలల పాటు జైలులో గడిపిన అనంతరం కఫీల్ ఖాన్కు ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. తాజాగా ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. కఫీల్కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఘటనలో అతని నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని తెలిపింది. అతనిపై ఉన్న ఆరోపణలు నిరాధరమైనవని పేర్కొంది. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్ హిమాన్ష్ కుమార్ నేతృత్వంలోని కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై కఫీల్ స్పందిస్తూ.. తను హంతకుడనే ముద్ర తొలగిపోయిందని అన్నారు. ఆక్సిజన్ అందక మరణించిన చిన్నారుల తల్లిదండ్రులు ఇంకా న్యాయం కోసం వేచిచూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. Those parents who lost their infants are still waiting for the justice.I demand that government should apologize and give compensation to the victim families.@PTI_News @TimesNow @myogiadityanath @narendramodi @ndtv @ravishndtv @abhisar_sharma @yadavakhilesh @RahulGandhi @UN pic.twitter.com/WaTwQSCUuZ — Dr kafeel khan (@drkafeelkhan) September 27, 2019 -
ఫోన్ మాట్లాడుతూ.. పాములపై కూర్చుంది
లక్నో: ఓ మహిళ ఫోన్లో మాట్లాడుతూ.. చూసుకోకుండా పాముల మీద కూర్చుని మృతి చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ గోరక్పూర్లో చోటు చేసుకుంది. రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్ల్యాండ్లో ఉంటాడు. అక్కడి నుంచి ఆయన తన భార్య గీతకు ఫోన్ చేశాడు. భర్తతో ఫోనులో మాట్లాడుతూ పక్కనే ఉన్న మంచంపై కూర్చుంది గీత. అయితే అప్పటికే ఆ మంచంపై రెండు పాములున్నాయి. ఆమె చూసుకోకుండా వాటిపైననే కూర్చుంది. దీంతో ఒక పాము ఆమెను కాటువేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. -
మాట వినని భార్య.. చివరికి 71 గొర్రెలు తీసుకుని..
లక్నో: మూఢ విశ్వాసాలు, ఆచారాలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్లో తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి పారిపోయిన భార్యను వదులుకోవడానికి ఓ భర్తకు 71 గొర్రెలు నష్టపరిహారంగా ఇవ్వాలని అక్కడి పంచాయతీ ఒకటి విచిత్రమైన తీర్పునిచ్చింది. యువతి భర్తకు 71 గొర్రెలు ఇవ్వాలంటూ పంచాయతీ పెద్దలు ప్రియుడిని ఆదేశించారు. ఈ ఘటన గోరక్పూర్ జిల్లాలో జూలై 22న జరిగింది. అయితే, ఈ తీర్పు నచ్చని ప్రియుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గోరఖ్పూర్ జిల్లాలోని చార్ఫాణి గ్రామంలో రాజేష్ పాల్ , సీమా పాల్ (25) భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన ఉమేష్ (27)తో సీమా వివాహేతర సంబంధం బయటపడటంతో గ్రామ పెద్దల సమక్షంలో గత నెలలో పంచాయతీ జరిగింది. భర్తతో కలిసి జీవించేందుకు సీమా ససేమిరా అంది. ఉమేష్తోనే ఉంటానని స్పష్టం చేసింది. దీంతో భర్త రాజేష్ పాల్కు నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా ఆమె ప్రియుడు ఉమేష్ని పంచాయితీ ఆదేశించింది. అతనికి ఉన్న 142 గొర్రెల్లో సగం ఇవ్వాలని పెద్ద మనుషులు తీర్పునిచ్చారు. దీనికి సీమా భర్త కూడా అంగీకరించడంతో వివాదం అంతటితో ముగిసింది. ఇది జరిగి మూడు వారాలు కావొస్తోంది. అయితే, ఉమేష్ తండ్రి గ్రామ పెద్దల తీర్పుపై అసహనం వ్యక్తం చేశాడు. తన గొర్రెలు తిరిగి ఇప్పించాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గొర్రెలు ఉమేష్ స్వార్జితమే అయితే కేసులో తాము చేసేదేం ఉండదని గోరఖ్పూర్ ఎస్ఎస్పీ సునీల్ కుమార్ గుప్తా చెప్పారు. ఇక భార్యభర్తల పంచాయతీలో సీమా భర్త ఎలాంటి ఫిర్యాదు చేయనందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. -
ప్రియురాలి గదిలో ప్రియుడు.. కొట్టి చంపిన..
గోరఖ్పూర్ : తన చెల్లెలు.. గదిలో ప్రియుడితో అభ్యంతరకర పరిస్థితిలో ఉండటాన్ని చూసిన ఓ అన్న ఆమె ప్రియున్ని తుపాకితో కాల్చాడు. అంతేకాకుండా యువతి కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి అతన్ని దారుణంగా కొట్టిచంపారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోరఖ్పూర్లోని షేర్పూర్కు చెందిన సురాజ్ అనే 24ఏళ్ల యువకుడు తన ప్రియురాలితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె అన్న గౌతమ్.. సంజయ్, అతని చెల్లెలు అభ్యంతరకర పరిస్థితిలో ఉండటం చూసి ఆగ్రహించాడు. వెంటనే లైసెన్స్లేని తుపాకిని తెచ్చి సంజయ్ని కాల్చాడు. తుపాకి పేలిన శబ్ధం గట్టిగా రావటంతో కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలిసుకుని, వారు కూడా యువతి కుటుంబంతో కలిసి సంజయ్ని బయటకు లాగి చితకబాదారు. అంతటితో ఆగకుండా చెక్క కర్రలతో, పదునైన వస్తువులతో అతడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సంజయ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా చేరుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ నిమిత్తం సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ
-
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఆదివారం పీఎం-కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడనుంచి అర్ధకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్కు వెళ్లారు. అలహాబాద్ (ప్రయాగ్రాజ్)లో జరుగుతున్న కుంభమేళాలో ఆయన ఆదివారం త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానమాచరించారు. అనంతరం మోదీ సంగం ఘాట్ వద్ద పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వాళ్లే నిజమైన కర్మ యోగులంటూ వారి సేవలను మోదీ కొనియాడారు. గంగా హారతి ఇచ్చి పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను కూడా మోదీ కడిగారు. వారికి అంగవస్త్రాలను బహూకరించారు. వారి సేవల వల్లే కుంభమేళా ప్రదేశం శుభ్రంగా ఉందన్నారు. 130 కోట్ల మంది భారతీయులు బాగుండాలని త్రివేణి సంగమం వద్ద తాను కోరుకున్నట్లు మోదీ ట్విట్టర్లో చెప్పారు. కుంభమేళాను విజయవంతం చేసేందుకు అవసరమైనదంతా తాము చేశామని మోదీ చెప్పారు. -
రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు..
గోరఖ్పూర్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఆదివారం ఆయన ఈ పథకాన్ని ఆరంభించారు. పలువురు రైతులకు చెక్కులు అందించిన ప్రధాని... అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. కాగా ఐదు ఎకరాల లోపు భూమి, ఒక కుటుంబంలో ఒక పాస్బుక్ ఉన్న రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ద్వారా కోటిమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు జమ కానున్నాయి. ఏడాదికి ఒక్కో రైతు ఖాతాలో రూ.6వేలు జమ అవుతాయి. మిగతా నగదు రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ...రైతుల ఖాతాల్లో వేయనుంది. ఈ పథకం తొలివిడతగా ఉత్తరప్రదేశ్, కర్ణాటకతో సహా 21 రాష్ట్రాల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులు రూ.6 వేల సాయం పొందాలంటే ఆధార్ నంబరు తప్పనిసరి. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తొలి విడతలో వ్యవసాయ పెట్టుబడి సాయం పొందడానికి మొత్తం 17 లక్షలకుపైగా రైతులు అర్హత సాధించారు. ఇందులో కొందరు రైతులకు ఆదివారం పెట్టుబడి సాయం జమ కానుంది. ఇప్పటికే 5 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధుల విడుదలకు సంబంధించి టోకెన్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. విడతల వారీగా రైతులందరికీ పెట్టుబడి జమ అవుతుందని అధికారులు తెలిపారు. -
యూనిఫాంతో మోకరిల్లిన సీఐ.. ట్రోలింగ్
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లో ఓ సీనియర్ అధికారి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ముందు యూనిఫాంలో మోకరిల్లిన సదరు అధికారి.. పైగా ఆ ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీంతో పలువురు ఆన్లైన్లో సీఐను ట్రోల్ చేయటం ప్రారంభించారు. గురుపూర్ణిమ సందర్భంగా గోరఖ్నాథ్ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆలయ పెద్ద ఆదిత్యానాథ్ హాజరయ్యారు. దీంతో భద్రత కోసం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సింగ్ అక్కడికొచ్చారు. ఈ సందర్భంగా యోగి నుంచి ఆశీర్వాదం తీసుకున్న ప్రవీణ్.. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచి ‘ఫీలింగ్ బ్లెస్స్డ్’ అంటూ పోస్ట్ చేశారు. వెంటనే విమర్శలు రావటంతో ప్రవీణ్ స్పందించలేదు. ‘నేను సీఎం హోదాలో ఆయనకా గౌరవం ఇవ్వలేదు. కేవలం ఆలయానికి పెద్దగా మాత్రమే పూజ చేశా’ అంటూ బదులిచ్చారు. అయితే చాలా మంది మట్టుకు మాత్రం ప్రవీణ్ చేసిన పనిని తప్పుబడుతున్నారు. యూనిఫాంలో ఆ పని చేయాల్సిన అవసరం ఏంటి? సిగ్గుందా? పోలీసుల పరువు తీసేశావ్.. ప్రభుత్వ ఉద్యోగివేనా? ఇలా పలువురు విరుచుకుపడుతున్నారు. మరోవైపు ట్రోలింగ్ కూడా ఓ రేంజ్లోనే జరుగుతోంది. -
పగతో భోజనంలో విషం కలిపిన విద్యార్థిని
గోరఖ్పూర్: తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు స్కూల్లోని మధ్యాహ్న భోజనంలో విషం కలిపిందో విద్యార్థిని. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు లాగే మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. ఇదే స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆ భోజనంలో విషం కలిపింది. భోజనంలో ఏదో కలిసిందని అనుమానం వచ్చిన వంట మనుషులు విషయాన్ని స్కూల్ టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు పాఠశాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యకు పాల్పడిన ఆ బాలికతో పాటు ఆమె తల్లిని ప్రశ్నించారు. అయితే సదరు విద్యార్థిని మాత్రం తాను విషం కలపలేదని చెబుతోంది. భోజనం శాంపుల్స్ను ల్యాబ్కు పంపిన పోలీసులు.. రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, బాలిక విషం ఎందుకు కలిపిందని ఆరా తీయగా ఆశ్యర్యకర విషయాలు తెలిశాయి. మూడు నెలల క్రితం అదే స్కూల్లో చదువుతున్న బాలిక తమ్ముడ్ని మరో విద్యార్థి ఇటుక రాయితో దాడి చేశాడు. దీంతో అతను మృతిచెందాడు. ఇక అప్పటి నుంచి బాలిక పగ పెంచుకుందని కొంతమంది విద్యార్థుల అంటున్నారు. తమ్ముడి మృతికి ప్రతీకారంగానే భోజనంలో విషం కలిపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కఫీల్ సోదరుడిపై హత్యాయత్నం.. కలకలం
లక్నో: డాక్టర్ కఫీల్ ఖాన్.. యూపీలో గోరఖ్పూర్ చిన్నారుల మారణహోమానికి బాధ్యుడ్ని చేస్తూ అధికారులు కటకటాలపాలు జేశారు. సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు అందించాడని అతన్ని సోషల్ మీడియా పొగిడిన కొన్ని రోజులకే.. అసలు ఆ మరణాలకు బాధ్యుడే ఆయన అంటూ అధికారులు నివేదిక ఇవ్వటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల తర్వాత ఈ మధ్యే బెయిల్పై బయటకు వచ్చిన ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పోరాటానికి దిగారు. ఇదిలా ఉంటే ఆయన సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కఫీల్ సోదరుడు, వ్యాపారవేత్త అయిన కసీఫ్ జమీల్(34)పై ఆదివారం రాత్రి బైక్పై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో ఘటన చోటు చేసుకోగా, ఆయన్ని వెంటనే స్థానికంగా ఓ నర్సింగ్ హోమ్కు తరలించారు. శస్త్ర చికిత్స చేసి మెడలో దిగిన బుల్లెట్ను వైద్యులు తొలగించారని డాక్టర్ కఫీల్ తెలిపారు. ఆ తర్వాత కసీఫ్ను బీఆర్డీ ఆస్పత్రికి తరలించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు కఫీల్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. జిగ్నేశ్ ట్వీట్లు... ఇదిలా ఉంటే గుజరాత్ యువ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మెవానీ ఈ ఘటనపై ట్విటర్లో స్పందించారు. ‘ఆక్సిజన్ సిలిండర్ల కోసం డబ్బులు చెల్లించకుండా యోగి ప్రభుత్వం చిన్నారులను బలి తీసుకుంది. కానీ, డాక్టర్ కఫీల్ మాత్రం తన సొంత డబ్బుతో కొందరినైనా కాపాడేందుకు ప్రయత్నించారు. అలాంటి వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడేమో ఆయన సోదరుడ్నిపై హత్యా యత్నం జరిగింది. ఇలాంటి మంచి రోజుల(అచ్చెదిన్)ను మాకు అందిస్తున్న మోదీగారికి ధన్యావాదాలు’ అంటూ మెవానీ ఓ ట్వీట్ చేశారు. గోరఖ్పూర్ ఉదంతం... ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గత ఏడాది ఆగస్ట్లో బాబా రాఘవ దాస్ మెడికల్ కళాశాల ఆస్పత్రి (బీఆర్డీ) మెడికల్ కాలేజిలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. సిలిండర్ల తాలుకూ బకాయిలు చెల్లించకపోవటంతో.. సరఫరాను సదరు సంస్థ నిలిపేయగా, నిర్లక్ష్యంగా వ్యవహిరంచి పిల్లలు మృతి చెందాడానికి కారణమయ్యాడంటూ మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగ హెడ్ కఫీల్ఖాన్ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్ 19న కఫీల్ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కఫీల్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని హైకోర్టు అతనికి ఈ ఏప్రిల్లో బెయిల్ మంజూరు చేసింది. -
బెయిల్పై విదేశీ మోడల్ విడుదల
గోరఖ్పూర్: ఒరిజినల్ వీసా లేకుండా భారత్లో తిరుగుతూ అరెస్టయిన ఉక్రెయిన్కు చెందిన మోడల్ డారియా మోల్చా(20) బెయిల్పై జైలు నుంచి విడుదల అయ్యారు. గత నెల ఏప్రిల్ 3న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్లోని సిటీస్ పార్క్ రోడ్డులోని ఓ హోటల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో ఆమె అక్రమంగా, నకిలీ డాక్యుమెంట్లతో దేశంలో ఉంటున్నట్లు బయటపడింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి..అనంతరం కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. ఏప్రిల్ 12న ఆమె పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును జిల్లా కోర్టు తిరస్కరించింది. వారం తర్వాత మరోసారి డారియా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు వారం రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఆమె ఉంటున్న జైలు నుంచి రిలీజ్ ఆర్డర్ వచ్చింది. ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, ఫారినర్స్ యాక్ట్ కింద డారియా మాల్చాపై కేసు నమోదైనట్లు, శుక్రవారం మధ్యాహ్నాం ఒంటి గంటకు జైలు నుంచి విడుదలైనట్లు జైలు సూపరింటెండెంట్ రామధాని విలేకరులకు తెలిపారు. డారియాను ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీకి తరలించినట్లు గోరఖ్పూర్ సీనియర్ ఎస్పీ శలభ్ మాతూర్ తెలిపారు. కోల్కత్తా నుంచి వచ్చిన చందారి రావత్, ఆదర్శ్ అనే ఇద్దరు ఆమె బెయిల్ కోసం సహకరించారని పోలీసు అధికారి తెలిపారు. నేపాల్ నుంచి భారత్లోకి అక్రమంగా విదేశీయులు చొరబడుతున్నారన్న సమాచారం స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అధికారులకు చేరడంతో వారు అప్రమత్తుమై సోదాలు నిర్వహించడం మొదలు పెట్టారు. ఆ సోదాల్లో భాగంగానే పార్క్ రెసిడెన్సీ హోటల్లో డారియా మోల్చా అరెస్ట్ అయింది. మోల్చా రెండు సంవత్సరాల నుంచి తరచూ భారత్ను సందర్శిస్తూ వస్తోంది. చివరి సారి డారియా 2017 డిసెంబర్లో ఢిల్లీని సందర్శించింది. డారియా స్నేహితుడు ఇంషాన్ సలహా మేరకు నేపాల్ నుంచి సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించినట్లు నిందితురాలు డారియా విచారణలో టాస్క్ఫోర్స్ అధికారులకు తెలిపారు. ఆమె నుంచి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, రెండు పాస్పోర్టులు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక టాబ్లెట్, ఒక ఐపాడ్, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. -
సొంత నియోజకవర్గంపై సీఎం దృష్టి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంత నియోజకవర్గం గోరఖ్పూర్పై దృష్టి సారించారు. గత మార్చిలో గోరఖ్పూర్ లోక్సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి అధికార బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే. గోరఖ్పూర్ నుంచి ఆదిత్యనాథ్ ఐదుసార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. యూపీ సీఎంగా యోగి ఎన్నిక కావడంతో ఖాళీ అయిన గోరఖ్పూర్లో ఎస్పీ-బీఎస్సీ కూటమి విజయం సాధించి బీజేపీకి షాక్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గోరఖ్పూర్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని యోగి పట్టుదలతో ఉన్నారు. గడిచిన రెండు నెలల్లో పదిసార్లు గోరఖ్పూర్లో పర్యటించారు. పర్యటన సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దానిలో భాగంగా ఎయిమ్స్, వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్సు లాంటి ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. పర్యటన అనంతరం గోరఖ్పూర్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యేలు, నేతలతో యోగి చర్చించారు. బీజేపీకి కంచుకోటగా పేరున్న గోరఖ్పూర్లో అధికార పార్టీ ఓడిపోవడం కమలనాథులకు మింగుడుపడటం లేదు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సొంత స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక గోరఖ్పూర్, పుల్పూర్ ఉప ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఎస్పీ-బీఎస్పీ కూటమి రానున్న ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అమలుచేసి, అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది. -
గోరఖ్పూర్ ఘటన : కఫీల్ఖాన్కు బెయిల్
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ కఫీల్ఖాన్కు అలాహాబాద్ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గత ఏడాది ఆగస్ట్లో బీఆర్డీ మెడికల్ కాలేజిలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత కారణంగానే పిల్లలు మృతి చెందారన్న ఆరోపణలతో మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగానికి అధిపతిగా ఉన్న కఫీల్ఖాన్ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్ 19న కఫీల్ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. కఫీల్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా తన భర్తకు బెయిల్ మంజూరైన సందర్భంగా కఫీల్ఖాన్ భార్య డాక్టర్ షబీస్తాన్ఖాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం తగిన సమయంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్లనే ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుందని, ప్రభుత్వ తప్పిదాన్ని తనపై మోపారని డాక్టర్ కఫీల్ఖాన్ కూడా ఆరోపించారు. గోరఖ్పూర్లో ఘటనను ప్రధాన ఆయుధంగా చేసుకున్న ప్రతిపక్షాలు సీఎం యోగిపై తీవ్ర విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. -
ఎస్పీ, బీఎస్పీ కూటమిపై అఖిలేశ్ స్పష్టత
లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరఖ్పూర్లో తన సొంత సీటును కూడా కాపాడుకోలేకపోయారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఓటమిపై బీజేపీ చేస్తున్న కామెంట్స్పై అఖిలేశ్ ఆదివారం స్పందించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి ఎక్కువకాలం ఉండదని, కేవలం బీజేపీని ఓడించడం కోసమే వారు పొత్తు పెట్టకున్నారన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను అఖిలేష్ తిప్పికొట్టారు. బీజేపీ ధనబలంతో, అధికార బలంతో తమ ఎమ్యెల్యేలను ప్రలోభపెట్టి ఒక దళిత అభ్యర్థి గెలుపును అడ్డుకుందని విమర్శించారు. ఈ ఓటమి తమ కూటమిపై ఎలాంటి ప్రభావం చూపదని, రానున్న ఎన్నికలలోపు తమ కూటమి మరింత బలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తక్కువ ఓటింగ్ నమోదుకావడమే బీజేపీ ఓటమికి కారణం అన్న వ్యాఖ్యలను తిప్పికొడుతూ, ఓటింగ్ శాతం పెరిగితే మా గెలుపు మరింత సులువయ్యేదన్నారు. గోరఖ్పూర్, పూల్పుర్ ఉప ఎన్నికల ఫలితాలు తమ కూటమికి, పార్టీ కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయని, రాబోయే ఎన్నికల్లో కూడా తమ కూటమి కొనసాగుతుందని అఖిలేశ్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ నియోజకవర్గాల్లో స్వయంగా ప్రచారంలో పాల్గొన్నా ఓటమి పాలవ్వక తప్పలేదన్నారు. వారి ఓటమి 2019 ఎన్నికల్లో బీజేపీ దేశావ్యాప్తంగా ఓటమి పాలవుతుందనే సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కానోజ్ ఎంపీగా ఉన్న తన భార్య డింపుల్ యాదవ్ 2019 ఎన్నికల్లో తిరిగి పోటి చేయదని అఖిలేశ్ వెల్లడించారు. రాజ్నాథ్సింగ్, కళ్యాణ్ సింగ్, శివరాజ్సింగ్లు కుటుంబసభ్యులు రాజకీయలకు దూరంగా ఉన్నారని, తాను కూడా అదే విధానం పాటిస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అని, ప్రస్తుతానికి కాంగ్రెస్తో మంచి సంబంధాలే ఉన్నాయని, పొత్తు భవిష్యత్తు నిర్ణయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ చేస్తున్నది రాజకీయ ఎన్కౌంటర్లని, ప్రజల మధ్య మతఘర్షణలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. -
‘గోరఖ్పూర్ ట్రైలర్ మాత్రమే..’
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన గోరఖ్పూర్, ఫుల్పూర్ లోక్సభ ఉప ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. బీజేపీకి అసలు సినిమా ముందుందని జేడీయూ మాజీ ఎంపీ శరద్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఒక మునిగిపోయే నావ అని అభివర్ణించారు. ఎన్డీయేలోని మిత్రపక్షాలన్నీ త్వరలోనే ఆ కూటమిని గుడ్బై చెప్తాయని ఆయన జోస్యం చెప్పారు. సిట్టింగ్ స్థానాలైన గోరఖ్పూర్, ఫూల్పుర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ‘ఎన్డీయే ఎజెండా విభజన రాజకీయాలతో సాగుతోంది. శివసేనతోపాటు టీడీపీ కూడా ఎన్డీయేను వీడింది. త్వరలో ఏ పార్టీ కూడా ఎన్డీయేలో ఉండదు’ అని శరద్ యాదవ్ లక్నోలో విలేకరులతో అన్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్తో మంగళవారం భేటీ అయిన శరద్ యాదవ్ త్వరలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా సమావేశమవుతానని తెలిపారు. యూపీలో యోగి సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అసలు వాస్తవమేమిటో ప్రజలు చూపిస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు మహా కూటమి ఏర్పాటు కోసం తాను ప్రయత్నిస్తున్నాని, ఇందులో భాగంగానే దేశమంతట పర్యటిస్తున్నట్టు తెలిపారు. అఖిలేశ్తో దాదాపు గంటసేపు భేటీ అయిన శరద్ యాదవ్ జాతీయ రాజకీయాలు, బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఐక్యత అంశంపై చర్చించారు. -
29 ఏళ్ల యువకుడు 29 ఏళ్ల బీజేపీని కూల్చాడు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఉప ఎన్నికల్లో 29వ నెంబర్ గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. 29 ఏళ్ల వయసున్న యువకుడు 29 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న బీజేపీకి ఎవరూ ఊహించని విధంగా బ్రేక్ వేశాడే అని. అవును.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒకప్పుడు గోరఖ్పూర్ లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన సీఎం కావడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడి ఉప ఎన్నిక జరిగింది. అందులో బీజేపీ ఊహించని విధంగా ఓటమి పాలయింది. వాస్తవానికి అక్కడ గత 29 ఏళ్లుగా బీజేపీ పాలనకు అడ్డే లేకుండా పోయింది. మరే పార్టీ వ్యక్తి కూడా అక్కడ విజయం దక్కించుకోలేదు. పైగా ఇక్కడి గోరఖ్నాథ్ మఠంలోని పూజారులే ఎంపీలుగా గెలుస్తున్నారు. దీంతో సమాజ్వాది పార్టీ ప్రవీణ్కుమార్ నిషాద్ అనే యువకుడిని రంగంలోకి దింపింది. బీఎస్పీ మద్దతు కూడగట్టింది. ఆశ్చర్యం ఏమిటంటే అతడి వయసు కూడా 29 ఏళ్లు. నిషాద్ను ఎన్నికల్లో దింపే వరకు కూడా అతడు పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో 29 ఏళ్ల యువకుడు 29 ఏళ్ల గోరఖ్పూర్లోని బీజేపీ సామ్రాజ్యాన్ని కూలదోశాడంటూ చర్చ సాగుతోంది. 1998 నుంచి ఇక్కడ యోగి విజయం సాధిస్తున్నారు. దాంతో ఎవరికీ తెలియని నిషాద్తో పెద్దగా వచ్చే నష్టం ఏమి ఉండదని బీజేపీ వర్గాలు ఊహించగా అనుకోని విధంగా అతడు విజయభావుటా ఎగరేశాడు. ఈ విజయం యోగికి, బీజేపీకి ఊహించన షాక్ కాగా సమాజ్ వాది పార్టీ కూడా తీవ్ర ఆశ్చర్యంలో మునిగిపోయిందట. అసలు వారు ఊహించకుండానే విజయం వచ్చి వాలిందని సమాజ్వాది పార్టీ నేతలు అంటున్నారు. ఇక నిషాద్ గురించి పరిశీలిస్తే అతడు లక్నోలోని గౌతం బుద్ద యూనివర్సిటలో ఇంజినీరింగ్లో డిగ్రీ చేశాడు. 2011లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. అతడిపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. అఫిడవిట్ ప్రకారం అతడి ఆస్తులు రూ.11లక్షల లోపే. అందులోను రూ.99,000 లోన్ కూడా ఉంది. అతడి భార్య ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సీఎం యోగి కంచుకోట బద్దలు
-
యూపీలో బీజేపీకి షాక్
గోరఖ్పూర్/ఫుల్పూర్/పట్నా: ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీకి ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు యూపీలో రిహార్సల్గా భావించిన ఎన్నికల్లో కమలదళానికి కోలుకోలేని దెబ్బతగిలింది. 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్పూర్ పార్లమెంటు స్థానంతోపాటు, ఫుల్పూర్ ఎంపీ సీటుకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ కూటమి అఖండ విజయం సాధించింది. 20 ఏళ్లుగా ఉప్పు–నిప్పుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు చివరి నిమిషంలో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం బీజేపీని దారుణంగా ఓడించింది. గోరఖ్పూర్.. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట కావటం గమనార్హం. కాగా, ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. దీంతో లక్నోలో ‘భువా (అత్త), భతీజా (అల్లుడు) జిందాబాద్’ నినాదాలు మార్మోగాయి. అటు బిహార్లో ఒక లోక్సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. గోరఖ్పూర్లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాను ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ 21వేల ఓట్లతో ఓడించారు. అటు ఫుల్పూర్లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ తొలి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థి కుశలేంద్రసింగ్పై ఆధిక్యాన్ని ప్రదర్శించారు. 59,613 ఓట్ల తేడాతో నాగేంద్ర ప్రతాప్ విజయం సాధించారు. మఠానికి ఎదురుదెబ్బ! లోక్సభ ఎన్నికల అనంతరం.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి యూపీ ప్రజలు పట్టంగట్టారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పార్టీ విజయం నల్లేరుపై నడకే అవుతుందని భావించినా.. అది బెడిసి కొట్టింది. 1989 నుంచి గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠం ప్రధాన పూజారులే ఈ ఎంపీ స్థానాన్ని గెలుస్తూ వస్తున్నారు. అలాంటిది.. ఈ మఠం ప్రధాన పూజారిగా ఉన్న యోగి.. ప్రస్తుతం సీఎంగా ఉండగానే రికార్డు బద్దలై ఓటమిపాలవటం వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి ఇబ్బందికరమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారాన్ని యోగి అంతా తానై నడిపించారు. కేంద్రం నుంచి స్టార్ క్యాంపేనర్లు రాకుండానే బీజేపీ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులెవరూ ఈ రెండు స్థానాల్లో ప్రచారానికి వెళ్లలేదు. అటు, ఫుల్పూర్ స్థానం మొదటినుంచీ బీజేపీకి పెద్దగా పట్టులేని నియోజకవర్గమే. గతేడాది కేశవ్ ప్రసాద్ మౌర్య గెలిచినప్పటికీ.. మొదట్నుంచీ ఇక్కడ ఎస్పీ, బీఎస్పీలే గెలుస్తూ వస్తున్నాయి. కౌంటింగ్పై ఆందోళన కౌంటింగ్ ప్రారంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠతోపాటు గందరగోళం నెలకొంది. కౌంటింగ్ ప్రాంతానికి 15 అడుగుల దూరంలోనే మీడియాను ఆపేశారు. అంతటితో ఆగకుండా పరదాలు వేసి కౌంటింగ్ మీడియాకు కనబడకుండా చేశారు. అయితే ఈ విషయంపై పార్లమెంటుతోపాటు యూపీ అసెంబ్లీలో విపక్షాలు నిరసన చేపట్టడంతో ప్రభుత్వం, అధికారులు దిగొచ్చి మీడియాను లోపలకు అనుమతించారు. షాక్కు గురయ్యాం: బీజేపీ నేతలు తాజా ఫలితాలపై యూపీ బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గోరఖ్పూర్ మొదట్నుంచీ మా కంచుకోట. యోగి ఆదిత్యనాథ్ వరుసగా నాలుగుసార్లు ఇక్కడినుంచి విజయం సాధించారు. ఎస్పీ ఓడిపోయేదే.. కానీ బీఎస్పీతో దోస్తీ వారికి కలిసొచ్చింది. మేం ఎక్కడ విఫలమయ్యామో సమీక్షించుకుంటాం. మేం సంతృప్తి చెందాల్సిన ఫలితాలు కావివి. మేం కొత్త వ్యూహాలను అనుసరించాల్సిన అవసరముంది’ అని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. బిహార్లో ఆర్జేడీ, బీజేపీ విజయం: బిహార్లోని జెహనాబాద్, భబువా అసెంబ్లీ స్థానాలకు, అరారియా లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. జెహనాబాద్లో ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ యాదవ్.. జేడీయూ అభ్యర్థిపై 35వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. భబువాలో బీజేపీ అభ్యర్థి రింకీరాణి పాండే గెలిచారు. ఇటీవలే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సర్ఫరాజ్ ఆలం.. బీజేపీ అభ్యర్థిపై 61,988 ఓట్ల తేడాతో గెలిచారు. తప్పుగా అంచనావేశాం: యోగి ఎస్పీ–బీఎస్పీ కూటమిని తక్కువగా అంచనా వేయటం వల్లే ఓటమిపాలయ్యామని యూపీ సీఎం యోగి పేర్కొన్నారు. ఈ ఓటమి బీజేపీకి ఓ గుణపాఠమన్నారు. ‘గోరఖ్పూర్, ఫుల్పూర్ల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. మితిమీరిన విశ్వాసం, ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రభావాన్ని అంచనావేయలేకపోవటమే మా ఓటమికి కారణం. విజేతలకు శుభాకాంక్షలు. బీఎస్పీ ఓటు.. ఎస్పీకి బదిలీ అవుతుందని అసలు ఊహించలేకపోయాం. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ–కాంగ్రెస్ కూటములు కలిసి పోటీచేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్నీ సమీక్షించుకుంటాం.2019లో మళ్లీ మెజారిటీ సీట్లు గెలిచేందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటాం’ అని యోగి వెల్లడించారు. బీజేపీ అహంకార ఫలితమిది: అఖిలేశ్ యూపీలోని రెండు పెద్ద లోక్సభ సీట్లను గెలుచుకోవటంపై ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ అహంకారపూరిత ప్రవర్తన, పరిపాలనపై అలక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ‘సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లోనే ప్రజాగ్రహం ఇలా ఉందంటే.. రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా పరిస్థితి ఏంటనేది ఊహించుకోవచ్చు’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. సంపూర్ణంగా మద్దతిచ్చిన మాయావతి ఆంటీకి కృతజ్ఞతలు అని చెప్పారు. ఎస్పీ–బీఎస్పీ అనూహ్య నిర్ణయంతో.. గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఎస్పీ, బీఎస్పీలకు ఈ ఉప ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. వీటిలో గెలవని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ ప్రభావం పెద్దగా ఉండబోదనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టేందుకు ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. బీఎస్పీ పార్టీ తరపున అభ్యర్థులెవరూ బరిలో దిగకుండా.. ఎస్పీ అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించాయి. దీనికి ప్రతిగా వచ్చేనెల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు ఎస్పీ మద్దతివ్వాలనే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఇరుపార్టీలో క్షేత్రస్థాయిలో కలిసి ముందుకెళ్లి ఘన విజయం సాధించాయి. ఎన్నికల ప్రచారంలో ఆదిత్యనాథ్ ఎస్పీ, బీఎస్పీల దోస్తీని పాము, ముంగీస బంధంతో పోల్చారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని.. అయినా కలసి పోటీ చేయటం విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లోనూ ‘పొత్తు’ పొడుస్తుందా? యూపీ ఉప ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కొత్త పొత్తులకు తెరలేవనుంది. బీజేపీని ఓడించేందుకు.. 20 ఏళ్లుగా బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీలు ఏకమవటం 2019 ఎన్నికల్లో జాతీయ రాజకీయ ఎన్నికల ముఖచిత్రంలో మార్పులను సూచిస్తోంది. మొదట ఈ ఎన్నికల వరకే సహకరించుకోవాలని అఖిలేశ్, మాయావతిలు నిర్ణయించుకున్నారు. అయితే తాజా ఫలితాలు, ఇలాంటి కూటమి అవసరంపై దేశవ్యాప్త చర్చ నేపథ్యంలో ఇరువురు నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే.. రెండు బలమైన ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీలు ఎంతకాలం ఒకే ఒరలో కొనసాగగలవనేదే ప్రశ్నార్థకం. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ పొత్తులు కొనసాగటం సాధ్యం కాకపోవచ్చు.. కానీ బీజేపీ జోరును అడ్డుకునేందుకు లోక్సభ ఎన్నికల వరకైనా కలిసే ముందుకెళ్లే అవకాశాలున్నాయి. బుధవారం రాత్రి మాయావతిని ఆమె నివాసంలో కలిసి అభినందించిన అఖిలేశ్.. దాదాపు 20 నిమిషాలసేపు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. కూటమి కొనసాగింపుపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో సోనియాగాంధీ ఇచ్చిన విందుకూ ఇరుపార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. ఇది కూడా కాంగ్రెస్ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటును బలపరిచే దిశగా ముందడుగేనని భావన వ్యక్తమవుతోంది. ‘వెయిట్ అండ్ సీ’ అయితే, కూటమిపై బయట చర్చ జరుగుతుండగానే అఖిలేశ్ సన్నిహితుడు, ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ‘పొత్తుపై వేచి చూడండి’ అని చెప్పటం 2019లో కలిసి పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. ఈ ఫలితాలు విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి చిక్కులు తప్పవనే సంకేతాలను ఇస్తున్నాయి. కమలంలో అంతర్మథనం సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యూపీ ఉప ఎన్నికల్లో ఓటమిని బీజేపీ అధిష్టానం జీర్ణించుకోలేపోతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోనే ఎక్కువ స్థానాలను గెలుపొంది కేంద్రంలో సొంతంగా మెజారిటీని సాధించిన బీజేపీ.. ఇప్పుడు ఆ యూపీలోనే ఓడిపోవటంతో ఆత్మరక్షణలో పడింది. యూపీలో ఎంపీ స్థానాలు, తర్వాత అసెంబ్లీకి, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఏకపక్షంగా దూసుకుపోయింది. అలాంటిది.. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో ఇప్పుడు ఓడిపోవటం ఆ పార్టీని కలవరానికి గురిచేసింది. ఈ ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ప్రభావం చూపించవచ్చని, దీంతోపాటుగా మోదీ, అమిత్షాల నాయకత్వానికి సవాల్ విసిరే అవకాశముందన్న రాజకీయ విశ్లేషణలూ బీజేపీలో అంతర్మథనానికి కారణమయ్యాయి. ‘ఫలితాలను ఊహించలేదు. ఆత్మపరిశీలన చేసుకుంటాం’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. జిల్లా నేతల్లో విభేదాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్నికల ఫలితాలు రాగానే అమిత్ షా హుటాహుటిన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు ఓపీ మాథుర్ను యూపీ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిసింది. యూపీలోని చాలా జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది. వారంతా ఈ ఫలితాలపై సంతృప్తితో ఉన్నట్లు ఢిల్లీకి సమాచారం వచ్చింది. ఇది బీజేపీ అధిష్టానానికి, యూపీ సీఎం ఆదిత్యనాథ్కు పెద్ద సవాల్గా మారనుంది. వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణ వ్యూహాన్ని మార్చి.. జాటవేతరులు, యాదవేతర ఓబీసీలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్పీ, బీఎస్పీ జతకట్టడం.. కాంగ్రెస్ కూడా లోపాయికారిగా వీరికి సహకరించటం ద్వారా బీజేపీ ఓడిందనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రాంతీయ పార్టీలతో నేరుగా తలపడిన ప్రతిసారీ బీజేపీ ఓడిపోయిన విషయాన్ని మరవొద్దని.. విపక్షాలు చీలినప్పుడే బీజేపీ గెలిచిందని ఎస్పీ ఎంపీ ఒకరు తెలిపారు. అసలేం జరిగుంటుందనే దానిపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మేధోమథనం జరుగుతోంది. యూపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా కుల సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది.. ఈ ఎన్నికల్లో బీజేపీ కుల సమీకరణాలను సరిగ్గా పట్టించుకోకపోవటమూ ఓటమికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు, రాష్ట్ర నాయకత్వం మితిమీరిన విశ్వాసం కారణంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి సహకారం లోపించిందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఫలితాలు పునరావృతమైతే.. ఒకవేళ యూపీలో గతంలోలాగా ఎక్కువసీట్లు గెలవలేని పక్షంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావటం కష్టమే. అలాంటప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలూ లేకపోలేదు. తెరపైకి మూడోఫ్రంట్ రావొచ్చనే చర్చా జరుగుతోంది. ఇదంతా ప్రస్తుత పరిస్థితిపై విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చు. గుజరాత్ ఎన్నికల తర్వాత విపక్షాలను ఒక్కటొక్కటిగా కూడగడుతున్న కాంగ్రెస్.. తాజా ఫలితాలతో మరింత దూసుకుపోయే అవకాశాలున్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో కలసి కాంగ్రెస్ కూటమిగా ముందుకెళ్లాలని భావిస్తోంది. గోరఖ్పూర్లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్, ఫుల్పూర్లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ -
ఓటమిపై యోగి.. గెలుపుపై అఖిలేశ్ ఏమన్నారంటే!
సాక్షి, లక్నో: బీజేపీ ఈ ఫలితాలు ఊహించలేదని యూపీ లోక్సభ ఉప ఎన్నికల్లో ఓటమిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఓటమి అనంతరం యోగి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. ఎన్నికలు ప్రకటించిన సమయంలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ వేరువేరుగా ఉన్నాయి. కానీ అనూహ్యంగా ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపాయి. ఎస్పీ-బీఎస్పీపొత్తును చాలా తక్కువగా అంచనా వేశాం. ఈ ఫలితాలపై ఆత్మ విమర్శ చేసుకుని ముందుకెళ్తాం. ఈ ఓటమిని గుణపాఠంగా తీసుకుంటామని యోగి వివరించారు. బీజేపీపై తమ ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పార్టీల కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు రాజీనామా చేసిన గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాల్లోనే బీజేపీ నెగ్గలేదంటేనే ఆ పార్టీ పాలన ఏవిధంగా ఉందో అర్థమవుతుందని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. సమాజ్వాదీ పార్టీని గెలిపించినందుకు గోరఖ్పూర్, ఫూల్పూర్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యువకులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు మాకు అండగా నిలవడంతోనే మా విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఎన్నికల హామీల అమలులో బీజేపీ విఫలమైందని విమర్శించారు. తమకు ఈ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపిన ఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి అఖిలేశ్ ధన్యవాదాలు తెలిపారు. -
బీహర్లో బీజేపీ-జేడీయూ కూటమికి షాక్
-
సీఎం యోగి కంచుకోట బద్దలు
సాక్షి, లక్నో: లోక్సభ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ కంచుకోట గోరఖ్పూర్ ఎస్పీ-బీఎస్పీ కూటమి బద్ధలు కొట్టింది. రెండు సిట్టింగ్ స్థానాల్లోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్పూర్లో బీజేపీ ఓటమి పాలైంది. భాజపా అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ పై 20వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కాగా, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామాతో ఖాళీ అయిన ఫుల్పూర్ నియోజకవర్గంలోనూ బీజేపీకి ప్రతికూల ఫలితం వచ్చింది. ఫూల్పుర్ లోక్సభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ 59, 613 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య రాజీనామాలతో ఖాళీ అయిన లోక్సభ రెండు స్థానాల్లో బీజేపీ ఓడినట్లయింది. కాగా, ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. మరోవైపు గోరఖ్పూర్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 1991 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటమి చెందలేదు. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆదిత్యనాధ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, పూల్పూర్ నుంచి గెలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎంగా ఎన్నికవ్వడంతో ఈ నెల 4వ తేదీన ఈ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచి 1998, 1999, 2004, 2009, 2014 వరుస ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కానీ తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఇక్కడ తొలిసారి ఓటమిపాలైంది. -
బీజేపీలోని దోస్తులకు ఒమర్ థ్యాంక్స్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫూల్పుర ఉప ఎన్నికలు బీజేపీకి గట్టిషాక్ను ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అనూహ్యంగా పుంజుకొని ఘనవిజయం దిశగా సాగుతోంది. ఎస్పీకి బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) మద్దతుగా నిలువడంతో.. బీజేపీకి తన కంచుకోటల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం యోగిఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం, కాషాయ కంచుకోటగా భావించిన గోరఖ్పూర్లోనూ బీజేపీకి ఎదురుగాలి వీచింది. 2019 లోక్సభ ఎన్నికలకు రాజకీయ సమీకరణాలను నిర్దేశించేవిగా భావించిన ఈ ఎన్నికలు.. కమలం శ్రేణులకు గట్టి గుణపాఠమే నేర్పాయి. అధికార పార్టీగా ఉన్నప్పటికీ, తను రాజీనామా చేసిన సీట్లను ఆ పార్టీ నిలబెట్టుకోకపోవడం మారిన రాజకీయ సమీకరణలను చాటుతోంది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ, మాయావతి అధినేత్రిగా ఉన్న బీఎస్పీ చేతులు కలిపి.. రాజకీయంగా కీలకమైన యూపీలో బీజేపీకి ఎదురుగాలి తప్పదని ఈ ఉప ఎన్నికలు సంకేతం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో అఖిలేశ్కు, మాయావతికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. బిహార్లోని అరారియా, జెహానాబాద్ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం దిశగా సాగుతుండటంతో ఆ పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్కు కూడా మమత కంగ్రాట్స్ చెప్పారు. మరోవైపు ఈ ఫలితాల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీలోని నా స్నేహితులకు ధన్యవాదాలు. మీ కటోరమైన శ్రమ, నిరంతర కృషితో నా అంచనా తప్పు అని నిరూపించారు. ఇందుకు నేను కృతజ్ఞుడిని. మీ ఫ్రెండ్లీ ప్రతిపక్ష నేత’ అంటూ ఒమర్ ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి.. గత ఏడాది మార్చిలో చేసిన ట్వీట్ను ఉటంకిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో.. ఇక ప్రతిపక్షాలు 2019 లోక్సభ ఎన్నికల సంగతిని మరిచిపోయి.. 2024 ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభిస్తే మేలు అని ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ తప్పు అని బీజేపీలోని తన స్నేహితులు నిరూపించారని ఆయన తాజాగా చమత్కరించారు. -
బీజేపీకి షాకింగ్ ఫలితాలు
పూల్పూర్లో 22,842 ఓట్ల ఆధిక్యంలో ఎస్పీ గోరఖ్పూర్లో బీజేపీ వెనుకంజ. 1523 ఓట్ల ఆధిక్యంలో ఎస్పీ బబువా అసెంబ్లీలో 40,510 ఓట్లతో బీజేపీ లీడింగ్ జహనాబాద్లో 50,609 ఓట్లతో ఆర్జేడీ ముందంజ అరారియా లోక్సభ స్థానంలో 23,187 ఓట్ల ఆధిక్యంలో ఆర్జేడీ గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, పూల్పూర్ ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ సొంత నియోజకవర్గం కావడంతో దేశం మొత్తం ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. విజయం మీద అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలు ధీమాతో ఉన్నాయి. గోర్ఖ్పూర్ బీజేపీకి కంచుకోట కాగా, పూల్పూర్లో కూడా తమ అభ్యర్ధి విజయం సాధిస్తారని యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. గోరఖ్పూర్లో బీజేపీ అభ్యర్ధిగా ఉపేంద్ర దత్ శుక్లా పోటీ చేయగా, ఆయనపై ఎస్పీ, బీఎస్పీ కూటమి నుంచి ప్రవీణ్ నిషాద్ బరిలో ఉన్నారు. కాగా గోరఖ్పూర్లో బీజేపీ 1991 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటమి చెందకపోవడం విశేషం. 2014లో ఇక్కడి నుంచి గెలిచిన ఆదిత్యానాధ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, పూల్పూర్లో నుంచి గెలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడంతో ఈ నెల 4వ తేదీన ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఇక్కడి నుంచి 1998,1999,2004,2009,2014 వరుస ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వచ్చని ప్రతిపక్షాలు ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక బిహార్లోని అరారియా లోక్ సభ స్థానంతోపాటు రెండు అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరిగింది. మహాకూటమి నుంచి నితీశ్ బయటికి వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావటంతో ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావటంతో ఈ రెండు రాష్ట్రాల ఉప ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. -
బీజేపీని ఓడించడమే మా లక్ష్యం
గోరఖ్పూర్: రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఎదుర్కోవడమే తమ తర్వాత లక్ష్యమని సమాజ్వాదీ పార్టీ అధినేత నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయవతి స్సష్టం చేశారు. అందులో భాగంగానే గోరఖ్పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్కి తమ పార్టీ మద్దతు ఇచ్చిందని మాయవతి తెలిపారు. 25 ఏళ్ల తరువాత ఇద్దరి మధ్య పొత్తు చిగురించడంతో ఉప ఎన్నికల విజయంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలో తామే బలమైన శక్తిగా ఉంటామని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని పార్టీ అభ్యర్థి నిషాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దళితుల ఓటు బ్యాంక్ను తమ వైపు మలుపుకునేందుకు ఏడాది ముందుగానే మాయవతితో చేతులు కలిపారు. గోర్ఖ్పూర్ ఉప ఎన్నికలను రెండు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గోరఖ్పూర్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కాగా..గతంలోఅక్కడి నుంచి యోగీ ఆదిత్యానాథ్ ఐదు సార్లు విజయం సాధించిన సాధించారు. బీజేపీ తన అభ్యర్ధిగా బ్రాహ్మణ వర్గానికి చెందిన ఉపేంద్ర శుక్లాను నిలిపింది. కాగా ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్ తమ అభ్యర్ధుల నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకున్న అఖిలేష్.. బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. -
మాయావతి ముందుచూపు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో సమాజ్వాది పార్టీ అభ్యర్థులను బలపర్చాలని బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి నిర్ణయం తీసుకోవడం చాలా చిన్న విషయంగానే కనిపిస్తుందిగానీ అది చాలా పెద్ద విషయం. ఇది భవిష్యత్ కొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అంశం. పైగా ఇది మాయావతి సహజ వైఖరికి పూర్తి భిన్నంగా తీసుకున్న నిర్ణయం. ఆమె రాజకీయ గురువు కాన్షీరావు 1993లో సమాజ్వాది పార్టీ, బీఎస్పీకి మధ్యన పొత్తు కుదిర్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆమె ఏనాడు ఎస్పీతో పొత్తుకు మొగ్గు చూపలేదు. నాడు ఆ పొత్తు వల్ల రామ మందిరం ఉద్యమంతో మంచి ఊపు మీదున్న బీజేపీని ఓడించగలిగారు. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఇరు పార్టీల మధ్య అవగాహన కుదురడం విశేషం. 1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాన్షీరామ్ మరోసారి పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఆ సారీ కాంగ్రెస్ పార్టీతో. మాయావతి ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాన్షీరామ్ వినిపించుకోలేదు. ఆ పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీ లాభ పడిందిగానీ బీఎస్పీ కాదు. అప్పటి నుంచి కాన్షీరామ్ పార్టీ విధాన నిర్ణయాలను మాయావతికే వదిలేశారు. అప్పటి నుంచి ఆమె ఎన్నికల అనంతరం పొత్తుల ద్వారా ముఖ్యమంత్రి అవుతూ వచ్చారు. 2007లో మాయావతి ఎవరి మీద ఆధాపడకుండా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంపూర్ణ మెజారిటీ సాధించారు. ఆ తర్వాత బలహీన పడుతూ వచ్చిన ఆమె పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మరీ ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎస్పీతో పొత్తుకు మొగ్గుచూపారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆమె ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని ఆమె పార్టీ వర్గాలే చెబుతున్నాయి. రాజ్యసభ సభ్యురాలుగా కేంద్ర రాజకీయల్లో రాణించిన మయావతి ఏప్రిల్లో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసి రాజ్యసభకు వెళతారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా పార్లమెంట్లో బలం పెంచుకోవాలని చూస్తున్నారని ఆ వర్గాలు అంటున్నారు. రెండు లోక్సభ ఉప ఎన్నికల్లో సమాజ్ వాది అభ్యర్థులకు మద్దతిస్తున్నందుకు బదులుగా రాజ్యసభ ఎన్నికల్లో మాయావతి లేదా ఆమె సూచించిన పార్టీ అభ్యర్థికి సమాజ్వాది పార్టీ మద్దతు ఇవ్వాలని అవగాహన కుదుర్చుకున్న విషయం తెల్సిందే. -
‘బీజేపీ ఓటమి రుచిని చూడబోతోంది’
లక్నో : బీజేపీకి ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపిస్తామని సమాజ్ వాదీ పార్టీ చెబుతోంది. ఉత్తర ప్రదేశ్ లో త్వరలో రెండు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని మట్టి కరిపిస్తామని ఎస్పీ ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామాలతో గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. బీజేపీని చిత్తు చేసే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికల కోసం ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలపటం విశేషం. ఎస్పీ అధికార ప్రతినిధి గోవింద్ చౌదరి నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. కమలం పార్టీ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతుందని ఆయన జోస్యం పలికారు. ఇక 2019 ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ఆ నిర్ణయం పార్టీ చీఫ్లు అఖిలేశ్, మాయావతి చేతుల్లోనే ఉంటుందని బదులిచ్చారు. మరోవైపు గోరఖ్పూర్ యోగి కంచుకోట కావటంతో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో బీజేపీ కనిపిస్తోంది. -
దేవుళ్లు చూస్తుండటంతో...
లక్నో : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వస్థలం గోరఖ్పూర్. జిల్లా న్యాయస్థానం, ఐజీ కార్యాలయాలు ఉన్న రోడ్లు ఎప్పుడూ జనసందోహంతో బిజీగా ఉంటాయి. కాస్త దూరంలో టాయ్లెట్లు ఉన్నా.. దారినపోయే కొందరు మాత్రం అదే పనిగా ఆ గోడలకే మూత్ర విసర్జన చేస్తుండేవారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, చివరకు పోలీస్ కాపలాను ఉంచిన నివారించలేకపోయారు. తరచూ ఈ గోడల వద్ద కొందరు చెత్త చెదారం వేయటం.. మూత్ర విసర్జన చేసేవారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు లేడీకానిస్టేబుళ్లను మోహరించినా ప్రయత్నం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆలోచన చేశారు. వెంటనే ముంబైకి చెందిన బత్వల్ అనే చిత్రకారుడికి కబురు పెట్టారు. మూత్ర విసర్జన నివారణకు కోసం ఆ గోడలపై దేవుడి బొమ్మలను చిత్రీకరించాలని అతన్ని కోరారు. దేవుళ్లు, ఇతర మతాలకు సంబంధించిన చిత్రాలు, రామాయంలోని ఘట్టాలు, ప్రముఖుల ఫోటోలతో బత్వల్ గోడలపై అందమైన పెయింటింగ్లు వేశాడు. ‘‘దేవుళ్లు చూస్తున్నారు.. మీ చెండాలం ఆపండి’’... అంటూ కొటేషన్లు రాసేశారు. ఈ ఆలోచన బాగా పని చేసింది. ప్రస్తుతం వాటి చుట్టు పక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటంతోపాటు ఆయా గోడల వద్ద సెల్ఫీల కోసం జనాలు ఎగబడిపోతున్నారని గోరఖ్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెబుతున్నారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నివారించటం కోసం చేసే యత్నం సాధారణమైన అంశమే. కానీ, యూపీ సీఎం స్వస్థలంలోనే స్వచ్ఛ భారత్ విఫలం అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తగా.. స్వయంగా యోగి ఆదిత్యానాథ్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. గత ఆరు నెలలుగా మున్సిపల్ అధికారులకు ఆయన అదే పనిగా ఆదేశాలు జారీ చేస్తుండటంతో.. ఏం చేయాలో తెలీక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఓ సామాజిక వేత్త సాయంతో ఐజీ మోహిత్ ఈ సమస్యకు పుల్స్టాప్ పెట్టారు. -
నాథ్ యోగి.. నాదే!
లక్నో : బాలీవుడ్ ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గోరఖ్పూర్ మహోత్సవ్ కోసం నిర్వాహకులు ఓ ప్రత్యేక ఆల్బమ్ను రూపకల్పన చేశారు. అయితే వారు తన పాటను కాపీ కొట్టారంటూ కైలాష్ ఆరోపిస్తున్నారు. గత ఫిబ్రవరిలో ఇసా యోగా సెంటర్లో నిర్వహించిన మహాశివ రాత్రి ఉత్సవాల కోసం గేయ రచయిత ప్రసూన్ జోషి ఓ పాటను రాశారు. దానిని కైలాష్ ఆలపించారు. ఇక ఇప్పుడు గోరఖ్పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించే మహోత్సవం కోసం విమల్ బర్వా ఓ పాట రాయగా.. ప్రణయ్ సింగ్ దానిని పాడాడు. నాథ్ యోగి పేరిట ఆ పాట జనాల్లోకి బాగా దూసుకుపోతోంది. పాటను విన్న కైలాష్ అనుచరులు అది కాపీ అన్న విషయాన్ని అతని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కైలాష్ ఇది కాపీ రైట్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెబుతున్నారు. ‘‘ విదేశాల్లో కాపీ హక్కుల ఉల్లంఘన తీవ్ర నేరం. కానీ, మన దగ్గర మాత్రం ప్రజలు ఆ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అందుకు కారణం చట్టంపై అవగాహలేమినే. ఈ విషయంలో గోరఖ్పూర్ మహోత్సవ నిర్వాహకులతో న్యాయపోరాటానికి నేను సిద్ధం’’ అని కైలాష్ ప్రకటించారు. బహుశా ఈ విషయం ముఖ్యమంత్రికి తెలీకపోయి ఉండొచ్చని.. మంచి పరిపాలకుడిగా పేరున్న యోగి ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని.. అవసరమైతే తానే స్వయంగా సీఎంను కలిసి ఘటనపై వివరిస్తానని కైలాష్ అంటున్నారు. -
జీన్స్ తొడిగిన అమ్మాయిని ఎవరైనా పెళ్లాడతారా?
గోరఖ్పూర్ : బీజేపీకి చెందిన మరో కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్.. మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇరుకునపడ్డారు. ‘జీన్స్ తొడుక్కొని పెళ్లిమండపంలోకి వచ్చే ఏ అమ్మాయినైనా అబ్బాయిలు పెళ్లాడతారా?’ అని విద్యార్థులను ప్రశ్నించారు. గోరఖ్పూర్ మఠానికి అనుబంధంగా నూతనంగా ఏర్పాటుచేసిన విద్యా సంస్థ శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాంటు తొడిగినోడు మతగురువు అవుతాడా? కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి హోదాలో విద్యాసంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యపాల్.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జీన్స్ ప్యాంటు వేసుకునే ఒకడొచ్చి ‘నేను మతగురువుగా ఉంటాను’ అంటే మనం అంగీకరిస్తామా? ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం. అదేవిధంగా వధువు జీన్స్ ధరించి పెళ్లి మండపంలోకి వస్తే ఏ అబ్బాయైనా చచ్చినా ఆమెను పెండ్లి చేసుకోడు’ అని సింగ్ వ్యాఖ్యానించారు. అదే వేదికపై సీఎం యోగి.. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ ప్రసంగించిన వేదికపైనే యూపీ సీఎం యోగి ఆదిత్యానథ్ ఆసీనులై ఉండటం గమనార్హం. యోగి.. ప్రధాన అర్చకుడిగా ఉన్న గోరఖ్పూర్ మఠానికి అనుబంధంగా నడిచే మహారాణా ప్రతాప్ శిక్షా పరిషత్(ఎంపీఎస్పీ) విద్యాలయం శంకుస్థాపన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
గోరఖ్పూర్ విషాదం : ఏడుమందిపై చార్జిషీట్
సాక్షి, గోరఖ్పూర్ : గోరఖ్పూర్లోని బాబా రాఘవ్దాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఘటనలో చిన్నారుల మృతికి సంబంధించి 7 మందిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఆగస్టు 10, 11 తేదీల్లో బీఆర్డీ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా భార్య డాక్టర్ పూర్ణిమా మిశ్రా (సీనియర్ హోమియో మెడికల్ ఆఫీసర్), డాక్టర్ సతీష్ (అనస్తీషియా స్పెషలిస్ట్), గజేంద్ర జైశ్వాల్ (చీఫ్ ఫర్మాసిస్ట్), సుధీర్ పాండే, సంజయ్ త్రిపాఠి, ఉదయ్ ప్రతాప్ (ఆసుపత్రి ఉద్యోగులు), మనీష్ భంగడారి (పుష్పా సేల్స్ ప్రొప్రయిటర్, ఆక్సిజన్ సరఫరదారు)లపై పోలీసలు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో డాక్టర్ పూర్ణిమా మిశ్రా, గజేంద్ర జైశ్వాల్, ఇతర ఉద్యోగులను ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి తొలింగించింది. డాక్డర్ పూర్ణియా, ఇతర ఉద్యోగలను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 25న అనుమలు జారీ చేసింది. మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్ర, డాక్టర్ ఖఫీల్ ఖాన్లను విచారణ అనుమతులు కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్వెస్టిగేటింగ్ అధికారులు తెలిపారు. -
గోరఖ్పూర్: 16మంది చిన్నారులు మృతి
-
పేదవాడి ఇంట చావు డప్పు
లక్నో : గోరఖ్పూర్ బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. ప్రైవేటు వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక ప్రభుత్వాసుపత్రికి వచ్చే నిరుపేద కుటుంబాలు కడుపు కోతతో తల్లడిల్లిపోతున్నాయి. ఆదివారం బీఆర్డీ ఆసుపత్రిలో 16 మంది చిన్నారులు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పది మంది పసిపిల్లలు ఉన్నారు. ఎన్సిఫలైటిస్ వ్యాధితో బాధపడుతున్న వీరందరూ ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించాయి. ఇదే వ్యాధితో ఆసుపత్రిలో ఇంకా 36 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. వీరిలో ఐదుగురు బిహార్ నుంచి వచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి నుంచి మొత్తం 1,470 మంది రోగులు బీఆర్డీ ఆసుపత్రిలో చేరగా.. 310 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది ఆగష్టులో ఆసుపత్రిలో అత్యధికంగా 63 మంది చిన్నారులు ఆక్సిజన్ కొరతతో చనిపోయారు. తాజా మరణాలు ఆక్సిజన్ కొరత వల్ల కాదని వైద్యులు తెలిపారు. క్రిటికల్ కండీషన్లో వారిని ఆసుపత్రి తీసుకురావడం వల్లే కాపాడలేకపోయామని చెప్పారు. -
గోరఖ్పూర్ : 40 ఏళ్లుగా చనిపోతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : బాబా రాఘవ్దాస్ ఆసుపత్రి ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. మెదడు వాపు వ్యాధితో చిన్నారులు ఇక్కడ 40 ఏళ్ల నుంచి మృతి చెందుతూనే ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి మాటమాత్రంగా కూడా స్పందించిన వ్యక్తులు, పార్టీలు నేడు అతిగా ప్రతిస్పందిస్తున్నాయని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. చిన్నారుల మృతి చెందడడం బాధాకరం.. భవిష్యత్లో ఇలా జరక్కుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వాన్ని విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది.. గోరఖ్పూర్లో మెదడువాపు వ్యాధితో బాధపడే చిన్నారులు.. ఆక్సిజన్ కొరతతో 40 ఏళ్లుగా చిపోతూనే ఉన్నారు.. ఇప్పుడే కొందరు కొత్తగా అరుస్తున్నారు అని యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు. 40 ఏళ్లు తప్పులను సరిదిద్దడానికి మాకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్లో మేం అధికారంలోకి వచ్చాక మెదడువాపు వ్యాధి రాకుండా గత మే నెల్లో 92 లక్షల మంది చిన్నారులకు టీకాలు వేయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి అధికంగా సోకే 20 జిల్లాలో ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పతనముతోందన్న విమర్శలకు యోగి ఆదిత్యనాథ్ సమాధానమిస్తూ.. మోదీ నేతృత్వంలో దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలించిదని యూపీ సీఎం ఆదిత్యనాథ్ చెప్పారు. -
అక్కడ సీఎం.. ఇక్కడ..?!
సాక్షి, గోరఖ్పూర్ : ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అన్నట్లు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.. గోరఖ్పూర్ ఆలయానికి మాత్రం ప్రధానార్చకుడే అన్నట్లుంది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యవహారశైలి. తాజాగా దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గోరఖ్పూర్ మఠ్లో ప్రధానార్చకుడిగా ఆయన విధులు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గోరఖ్పూర్ మఠానికి మంగళవారం వచ్చిన ఆదిత్యనాథ్.. అక్కడే ఐదురోజుల పాటు ఉండనున్నారు. దసరా సందర్భంగా మఠం ఏర్పడ్డప్పటినుంచి ఆచరిస్తున్న పద్దతులను కొనసాగించేందుకు ఆదిత్యనాథ్ మఠాధిపతిగా గోరఖ్పూర్ వచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దుర్గా ఆరాధనలో భాగంగా నిర్వహించే శోభాయాత్ర, ఆయుధ పూజల్లో ఆదిత్యనాథ్ పాల్గొంటారని మఠాధికారులు ప్రకటించారు. గోరఖ్పూర్ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కు ప్రొటోకాల్ ప్రకారం భద్రత కల్పించినట్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ (ఐజీ) హరిరామ్ ప్రకటించారు. అల్లర్లకు అవకాశముందని నిఘా వర్గాలు తెలపడంతో ఆదిత్యనాథ్కు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ప్రొవెన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్స్, స్థానిక పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన ఐజీ హరిరామ్ తెలిపారు. -
ప్లీజ్... అలా చేయొద్దని టీచర్కి చెప్పండి
సాక్షి, యూపీ : వరుసగా స్కూళ్లలో జరుగుతున్న ఉదంతాలు పిల్లల తల్లిదండ్రులను కలవర పెడుతున్న వేళ ఉత్తర ప్రదేశ్లో ఓ బాలుడి ఆత్మహత్య సంచలనంగా మారింది. శిక్షల పేరిట టీచర్లు కఠినంగా హింసిస్తున్నారంటూ ఐదో తరగతి చదువుతున్న ఆ బాలుడు లేఖ రాసి తనువు చాలించాడు. గోరఖ్పూర్ సెయింట్ ఆంటోనీ కాన్వెంట్ స్కూల్ లో చదువుతున్న 11 ఏళ్ల నవనీత్ ప్రకాశ్ను ఈ నెల 15న టీచర్ క్లాస్ రూంలో దండించింది. దీంతో మనస్థాపం చెందిన ఆ బాలుడి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన నవనీత్ నోటి నుంచి నురగలు రావటం గమనించిన తల్లిదండ్రులు హుటాహుటినా బీఆర్డీ ఆస్పత్రికి తరలించగా, ఆ లోపే బాలుడు మృతి చెందాడు. అతని స్కూల్ బ్యాగ్లో సూసైడ్ నోట్ లభ్యం కాగా.. అందులో... ‘నాన్న, ఇవాళ మొదటి ఎగ్జామ్. టీచర్ నన్ను మూడు పీరియడ్లపాటు నిలిచోపెట్టారు. నేను చెప్పేది ఆమె అస్సలు పట్టించుకోలేదు. ఆమెకు అనుకూలంగా ఉండేవారి మాటే ఆమె వింటారు. అమ్మా. నాన్న.. నన్ను క్షమించండి. నేను చనిపోతున్నా. మరే విద్యార్థిని కూడా ఇలా దండించవద్దని మా టీచర్కి దయచేసి చెప్పండి’ అంటూ రాసి ఉంది. తన కొడుకు మరణానికి స్కూల్ యాజమాన్యానిదే బాధ్యతని నవనీత్ తండ్రి ఆరోపిస్తున్నాడు. ఆత్మహత్య ప్రేరపణ నేరం కింద కేసు నమోదు చేసిన షాపూర్ పోలీసులు టీచర్ భావనను అరెస్ట్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. -
ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, గోరఖ్పూర్ : తరగతి గదుల్లో విద్యార్థులను పాఠశాల యాజమాన్యాలు, అధ్యాపకులు ఎంత ఒత్తిడిలోకి నెడుతున్నాయో.. చెప్పే ఘటన తాజాగా ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది. అసంబంద్దంగా, అనవసరంగా టీచర్లు చిన్నారులను శిక్షించే విధానానికి ఇది పరాకాష్ట అని చెప్పుకోవాలి. తరగతి గదిలో తప్పు చేయకపోయినా..టీచర్ తీవ్రంగా మందలించడంతో.. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక సెయింట్ ఆంథోని స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న నవనీత్ (11)ను సెప్టెంబర్ 15న స్కూల్లో టీచర్ తీవ్రంగా దండించారు. టీచర్ అందరిముందు తప్పులేకపోయినా మందలించడంతో ఆవేదన చెందిన విద్యార్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. నవనీత్ బాగా చదువుతాడని.. పరీక్షల్లో ఎప్పుడూ మంచి మార్కులే వచ్చేవని విద్యార్థి తండ్రి రవిప్రకాష్ వెల్లడించారు. నవనీత్ మృతికి స్కూల్ టీచర్ ప్రవర్తనే కారణం అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకు నవనీత్ రాసిన సూసైడ్ నోట్ను ఆధారంగా వారు చూబుతున్నారు. నవనీత్ రాసిన సూసైడ్ నోట్లో... ’నాలాగా మరో విద్యార్థిని మీరు.. మీ మాటలతో హింసించకండి.. మమ్మల్ని నమ్మండి.. మేం బాగా చదువుతాం‘ అని నవనీత్ రాశాడు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు స్కూల్ స్కూల్ టీచర్ జోసెఫ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గోరఖ్పూర్ ఘటన.. ఓ పనైపోయింది
సాక్షి, గోరఖ్పూర్: సుమారు 60 మంది చిన్నారులను బలి తీసుకున్న బాబా రాందేవ్ ఆస్పత్రి ఘటనలో ఓ పని పూర్తయిపోయింది. ఈ కేసులో నిందితుడు, ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాదారుడు మనీశ్ బండారిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న మనీశ్ను డొరియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గోరఖ్పూర్ ఘోరం.. ఎవరి నేరం? కాగా, 9 మంది నిందితులతో కూడిన ఎఫ్ఐఆర్లో పుష్ఫలీల కంపెనీ యాజమాని మనీశ్ బండారి పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్డీ ఆస్పత్రి యాజమాన్యం బకాయిలు చెల్లించకపోవటంతో సిలిండర్ల సరఫరాను నిలిపివేయటం.. తద్వారానే చిన్నారులు మృతి చెందారని ఆరోపణలు వినిపించాయి. నిందితులందరినీ అరెస్ట్ చేయటంతో ఇక విచారణను వేగవంతం చేయటమే మిగిలి ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీలో చిన్నారులు ఆక్సిజన్ సరఫరా అందక మృతి చెందారు. దేశ చరిత్ర లోనే కనీవినీ ఎరుగని రీతిలో చోటుచేసుకున్న ఈ ఘోర కలిపై పెద్ద ఎత్తున్న విమర్శలు రావటంతో సీఎం ఆదిత్యానాథ్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. ఎఫ్ఐఆర్లో మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమ శుక్లా, పిల్లల వైద్య విభాగం మాజీ చీఫ్ డాక్టర్ కఫీల్ ఖాన్, వైద్యులు, క్లర్కులు ఇలా 9 మంది పేర్లను పోలీసులు చేర్చారు. ముందే హెచ్చరించినా... -
గోరఖ్పూర్ విషాదం: కీలక నిందితుడి అరెస్ట్
సాక్షి, లక్నో: యూపీలోని గోరఖ్పూర్ బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాల ఉదంతం కేసులో నాలుగో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆగస్టు నెలలో ఆక్సిజన్కొరత కారణంగా దాదాపు 70 మంది చిన్నారులు మృతిచెందగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో మరో కీలక నిందితుడు, బీఆర్డీ కాలేజీ సీఎంఎస్ ఆఫీస క్లర్క్ సుధీర్ పాండేను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు పోటీసులు శనివారం వెల్లడించారు. బీఆర్డీ కాలేజీకి చెందిన కొందరు వైద్యసిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా అందులో సుధీర్ పాండే నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా తప్పించుకు తిరుగుతున్న సుధీర్ను ఖాజంచి చౌక్లో గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అప్పటి ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా సహకారంతో ఆక్సిజన్కు సంబంధించిన నగదును కమిషన్ల కోసం వాడుకుని, సరఫరాదారులకు చెల్లించడంలో జాప్యం చేయడం వల్లేచిన్నారుల మరణాలు సంభవించాయని ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇదివరకే వైద్య విద్య అడిషనల్ చీఫ్ సెక్రటరీ అనితా భట్నాగర్ జైన్ను బదిలీ చేస్తూ యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితులైన రాజీవ్మిశ్రా, పూర్ణిమా మిశ్రా, మెదడువాపు వ్యాధి విభాగం నోడల్ అధికారి కఫీల్ ఖాన్ లను యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం వీరు జ్యూడీషయల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా సెప్టెంబర్ 1న కూడా ఈ ఆసుపత్రిలో 35మంది చిన్నారులు చనిపోయారు. -
ముందే హెచ్చరించినా...
న్యూఢిల్లీః గోరఖ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నట్టు ఏడాది కిందటే తాను ప్రభుత్వాన్ని హెచ్చరించానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. గతంలో తాను పర్యటించిన సందర్భంగా అక్కడి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచార పర్వానికి రాహుల్ అహ్మదాబాద్లో శ్రీకారం చుట్టారు. ఆక్సిజన్ కొరతతో బీజేపీ పాలిత యూపీలోని గోరఖ్పూర్ ఆస్పత్రిలో 62 మంది చిన్నారులు మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం పేదల వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని, అందుకే విద్యా, వైద్యం వంటి మౌలిక సేవలనూ ప్రయివేటీకరించేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. -
ఆ ఆస్పత్రి మృత్యు కుహరం..
♦ 40 ఏళ్లలో 25వేల మంది చిన్నారుల మృతి ♦ నేటికి కొనసాగుతున్న వైనం ♦ పాలకులు మారినా మారని తీరు ♦ వైద్యుల నిర్లక్ష్యం తల్లిదండ్రులకు శాపం గోరఖ్పూర్ అంటే మృతి చెందుతున్న పసిబిడ్డలు గుర్తుకు వస్తారు. ఒకరు..ఇద్దరు.. వందలు కాదు.. వేల సంఖ్యలో ఇక్కడ చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకూ మృతుల సంఖ్య 1400 వరకూ ఉంది. అదే గత 40 ఏళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఎంతో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది. గోరఖ్పూర్లోని బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఆగస్టు నెల్లో 60 మంది చిన్నారులు ఒక్కసారిగా మృతిచెందారు. ఈ ఘటనపై దేశమంతా స్పందించింది. జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అప్పటినుంచే బీఆర్డీ ఆసుపత్రి పేరు అందరి నోళ్లలో నానుతోంది. కానీ బీఆర్డీలో చిన్నారుల మృతి అనేది 40 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. సెప్టెంబర్ 1న కూడా..! పిల్లల మృతుల పరంపర బీఆర్డీలో నేటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా సెప్టెంబర్ 1న కూడా ఈ ఆసుపత్రిలో 35మంది చిన్నారులు చనిపోయారు. మొత్తం మృతులు బీఆర్డీ ఆసుపత్రిలో గడచిన 40 ఏళ్లలో 25 వేల మంది చిన్నారులు మృతి చెందారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చనిపోయిన వారిలో అత్యధికులు మెదడు వాపుకు గురైనవారే. చర్యలేవీ? మెదడువాపు వ్యాధితో చిన్నారులు ఆసుపత్రిలో చేరడం సర్వసాధారణం. ఏళ్లుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాధి ప్రబలకుండా ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రమే. అదే సమయంలో ఈ వ్యాధికి సంబంధించిన వైద్య సౌకర్యాలు కూడా ఇక్కడ పెద్దగా లేవు. తాజా పరిస్థితి ప్రస్తుతం బీఆర్డీ ఆసుపత్రిలో 344మంది చిన్నారులు మెదడు వాపు, న్యుమోనియా వంటి వ్యాధులతో చేరారు. వీరికి వీలైనంత మంచి వైద్యాన్ని అందిస్తున్నామని, గతంతో పోలిస్తే మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఆసుపత్రి డైరెక్టర్ రాజేష్ మణి చెబుతున్నారు. ధనార్జనలో డాక్టర్లు గోరఖ్పూర్లో మెదడువాపు వ్యాధి అధికంగా ఉండడంతో గతంలో ఇక్కడ 100 వైద్య కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే డాక్టర్లలో ధనార్జన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ వైద్యులు.. సర్కార్ దవాఖానాల్లో కాకుండా సొంత క్లినిక్లలో అధికంగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ వైద్య కేంద్రాలకు పంపే మందులు, ఇతర సామగ్రిని ఆ వైద్యులు తమ సొంత క్లినిక్స్కు తరలించడం ప్రధాన సమస్య. -
గోరఖ్పూర్లో మరణమృదంగం
-
గోరఖ్పూర్లో మరణమృదంగం
ఒక్క నెలలోనే 296 మంది చిన్నారుల దుర్మరణం గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లోని బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) వైద్య కళాశాలలో ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపు 296 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరిలో 213 నవజాత శిశువులు ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 83 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో చనిపోయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పీకే సింగ్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆస్పత్రిలోని మెదడువాపు, చిన్నారుల వార్డుల్లో దాదాపు 1,256 మంది మృతి చెందినట్లు సింగ్ పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 17 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో 37 మంది పిల్లలు (వీరిలో 11 మంది మెదడువాపు వ్యాధితో) ఆస్పత్రిలో మృత్యువాత పడ్డారని సింగ్ వెల్లడించారు. నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువు ఉండడం, కామెర్లు, న్యుమోనియా, ఇన్ఫెక్షన్, మెదడువాపు తదితర కారణాలతో, విషమ పరిస్థితుల్లోనే చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్నారని సింగ్ తెలిపారు. చిన్నారులను కొంచెం ముందుగా ఆస్పత్రికి తీసుకురాగలిగితే చాలామంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు చిన్నారుల మరణాలకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్డీ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రాతో పాటు ఆయన భార్యను ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ అరెస్టు చేసింది. -
సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలు
-
గోరఖ్పూర్: బీఆర్డీ ఆసుపత్రిలో ఆగస్టు మృతులు 290
గోరఖ్పూర్ ఆసుపత్రిలో ఆగని మృత్యుహేల వందల్లో చనిపోతున్న చిన్నారులు ఈ ఏడాది ఇప్పటి వరకూ చినిపోయిన చిన్నారుల సంఖ్య 1250 గోరఖ్పూర్: ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్ బాబా రాఘవ్ దాస్ ఆసుపత్రిలో చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా అందక కొందరు, మౌలిక వసతులు లేక చనిపోతున్నారు. కేవలం ఈ ఆగస్టు నెల్లో ఇప్పటివరకూ 290 మంది చిన్నారులు మృతి చెందారు. ఇదే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ మృతుల సంఖ్య 1250. ఇదే విషయాన్ని డీఆర్డీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పీకే సింగ్ ధృవీకరించారు. మొదడు వాపు, ఇతర వ్యాధుల కారణంగా చిన్నారులు అధికంగా చనిపోతున్నారని ఆయన చెప్పారు. చిన్నారుల మృతికి సంబంధించి ప్రిన్సిపాల్ పీకే సింగ్ తొలిసారి నోరు విప్పారు. ఆగస్టు 27, 28 తేదీల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో 37 మంది చిన్నారులు చనిపోయారని చెప్పారు. భారీగా మృతులు ఈ ఏడాది జనవరి నుంచి బీఆర్డీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారులు మృత్యుహేళ కొనసాగుతోంది. జనవరిల నెల్లో 152 మంది, ఫిబ్రవరిలో 122, మార్చిలో 159, ఏప్రిల్లో 123, మేలో 139, జూన్లో 137, జూలైలో 128 మంది చిన్నారులు చనిపోయినట్లు ప్రిన్సిపాల్ సింగ్ తెలిపారు. చాలా కారణాలు బీఆర్డీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలకు చాలా కారణాలున్నాయని ప్రిన్సిపాల్ సింగ్ అన్నారు. ప్రధానంగా ఇక్కడకు చికిత్స వచ్చే చిన్నారుల్లో అత్యధికులు జాండీస్ (పచ్చకామెర్లు), న్యుమోనియా, అంటువ్యాధులు, ఇన్ ఫెక్షన్స్తో బాధపడేవారని చెప్పారు. అంతేకాక ప్రీ మెచ్యూర్డ్ బేబీలు చాలా మందే ఉంటారని.. మృతుల్లో వీరి శాతం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చికిత్సకు వచ్చే వారిలో చాలా మందిని ప్రాణాపాయం నుంచి రక్షించామని ఆయన నొక్కి చెప్పారు. -
గోరఖ్పూర్ పిక్నిక్ స్పాట్ కాదు: యోగి
-
గోరఖ్పూర్ పిక్నిక్ స్పాట్ కాదు: యోగి
గోరఖ్పూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గోరఖ్పూర్లో రాహుల్గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్వచ్ఛ్ భారత్ ప్రాముఖ్యత ఢిల్లీలో కూర్చునే యువరాజుకు ఎలా తెలుస్తుంది. గోరఖ్పూర్ను ఆయన తన పిక్నిక్ స్పాట్గా మార్చుకునేందుకు అనుమతిచ్చేదిలేదని’ అన్నారు. స్వచ్ఛ్భారత్ కింద యూపీ సీఎం యోగి ఈ రోజు ‘స్వచ్ఛ్ ఉత్తర్ప్రదేశ్- స్వస్థ్ ఉత్తరప్రదేశ్’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
గోరఖ్పూర్: 105కి చేరిన పిల్లల మరణాలు
గోరఖ్పూర్: ఉత్తరప్రదేశ్ బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పిల్లల మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 9 మంది చిన్నారులు చనిపోవటంతో ఆ సంఖ్య 105కి చేరుకుంది. ఈ విషయాన్ని డాక్టర్ పీకే సింగ్ ధృవీకరించారు. నియోనాటల్ వార్డులో ఐదుగురు, ఏన్కెఫలైటిస్ వార్డులో ఇద్దరు, సాధారణ వార్డులో ఇద్దరు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. చనిపోయిన వారిలో చాలా మంది నవజాత శిశులు ఉన్నారని, అత్యవసర స్థితిలోనే వారిని తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చారని సింగ్ తెలిపారు. ఆగస్టు 10 నుంచి ఆగష్టు 11వ వరకు ఆ 48 గంటల్లో 30 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయారంటూ జిల్లా మెజిస్ట్రేట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉంది. ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం యూపీకి వెళ్లనున్నారు. బీఆర్డీ ఆస్పత్రిని కూడా ఆయన సందర్శించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోపక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరఖ్పూర్ లో స్వచ్ఛ్భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన కూడా ఆస్పత్రిని సందర్శించే పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని సీఎంవో అధికారులు చెబుతున్నారు.