IAF
-
గణతంత్ర పరేడ్లో తొలిసారిగా సంజయ్, ప్రళయ్!
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన కర్తవ్యపథ్లో జరిగే పరేడ్లో బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలతోపాటు తొలిసారిగా యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’, వ్యూహాత్మక క్షిపణి ‘ప్రళయ్’ కనిపించనున్నాయి. ఐఏఎఫ్కు చెందిన 40 యుద్ధ విమానాలు, తీరరక్షక దళంలోని 3 డోర్నియర్ విమానాలు ఆకాశంలో విన్యాసాలతో వైమానిక దళ పాటవాన్ని ప్రదర్శించనున్నాయి. పరేడ్ కమాండర్గా ఢిల్లీలోని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ భవ్నీశ్, పరేడ్ సెకండ్ –ఇన్–కమాండ్గా ఢిల్లీ ప్రాంత చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ సుమిత్ మెహతా వ్యవహరిస్తారు. టి–90 భీష్మ ట్యాంకులు, బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, నాగ్ క్షిపణి వ్యవస్థ ఇందులో పాలుపంచుకుంటాయి. పరేడ్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు చెందిన 15 శకటాలు పాల్గొంటాయి. ఇందులో డీఆర్డీవోకు చెందిన పలు అంచల రక్షణ వ్యవస్థ ‘రక్షా కవచ్’కూడా ఉంటుందని రక్షణ శాఖ గురువారం వివరించింది. మొట్టమొదటిసారిగా త్రివిధ దళాల శకటం కూడా ఇందులో ఉంటుందన్నారు. ఈ వేడుకల ప్రధాన అతిథి ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంతో కాగా, ఆదేశం నుంచి కూడా ఒక బ్యాండ్ జట్టు పరేడ్లో కలిసి నడుస్తుందన్నారు. కార్గిల్ యుద్ధ వీరులైన ఇద్దరు పరమ వీర చక్ర గ్రహీతలు, ఒక అశోక చక్ర గ్రహీత కూడా పరేడ్లో భాగస్వాములవనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాలు కొనసాగి, దేశ వారసత్వం, అభివృద్ధి పయనాన్ని కళ్లకు కడుతుందని అధికారులు తెలిపారు. -
NRI: జాకీర్ హుస్సేన్ మృతిపై ఐఎఎఫ్ సంతాపం
డాలస్, టెక్సస్: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్సి) ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐఎఎఫ్సి అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాల్గు పర్యాయాలు అందుకున్నవారు, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని అన్నారు. పసి ప్రాయంలో ఏడు సంవత్సరాల వయస్సునుండే ఎంతో దీక్షతో తన తండ్రి, సంగీత విద్వాంసుడు అయిన అల్లా రఖా వద్ద తబలా వాయించడంలో మెళుకువలు నేర్చుకుని, విశ్వ వ్యాప్తంగా మేటి సంగీత విద్వాంసులైన రవిశంకర్, ఆలీ అఖ్బర్ ఖాన్, శివశంకర శర్మ, జాన్ మేక్లెగ్లిన్, ఎల్. శంకర్ లాంటి వారెందరితోనో 6 దశాబ్దలాగా పలు మార్లు, ఎన్నో విశ్వ వేదికలమీద సంగీతకచేరీలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్న జాకీర్ మృతిపట్ల వారి కుటుంబ సభ్యులుకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, జాకీర్ తో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని, తాను జరిపిన ముఖా-ముఖీ కార్యక్రమ లంకెను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఐఎఎఫ్సి ఉపాధ్యక్షులు తాయబ్ కుండా వాలా, రావు కల్వ ల, కార్యదర్శి మురళి వెన్నం, కోశాధికారి రన్నా జానీ, బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు హాజరయ్యారు. -
సీడీఎంఏగా శ్రీదేవి.. హరీశ్కు ఐఅండ్పీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రస్థాయి కమిషనర్లు, డైరె క్టర్లు, జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ జాబి తాలో ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికా రులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ టి.కె. శ్రీదేవిని మళ్లీ పుర పాలక శాఖకు పంపారు. ఆమెను కమిషనర్ అండ్ డైరె క్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)గా బదిలీ చేస్తు న్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్పీఆర్) స్పెషల్ కమిషనర్గా ఉన్న ఎం. హనుమంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా బదిలీ చేయగా, ఐఅండ్పీఆర్ బాధ్యతలను రెవెన్యూ జాయింట్ సెక్ర టరీ ఎస్.హరీశ్కు అప్పగించారు. ఆయనను ఐఅండ్పీఆర్ స్పెషల్ కమిషనర్గా బది లీ చేసినప్పటికీ రెవెన్యూ శాఖ జాయింట్ సెక్రటరీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సి.నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ చేయగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న శశాంకకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. కాగా సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్గా నియమితులైన ఎస్.హరీశ్ సోమవారం ఆన్లైన్లో బాధ్యతలు స్వీకరించారు. (వీరితో పాటు టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తికి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్గా, హాకా ఎండీ కె. చంద్రశేఖర్రెడ్డికి పాడి అభివృద్ధి సమాఖ్య ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారిణి సోని బాలాదేవిని డైరెక్టర్, స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీగా పునర్నియమించారు. మేడ్చల్–మల్కాజ్గిరి జెడ్పీ సీఈవోగా ఉన్న ఎస్.దిలీప్కుమార్ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు. రాజన్న సర్కిల్లో అసిస్టెంట్ కన్జర్వేటర్గా ఉన్న అటవీశాఖ అధికారి జి.జ్ఞానేశ్వర్ను వికారాబాద్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్వో)గా నియమించారు.) -
కేదార్నాథ్లో సాగుతున్న సహాయక చర్యలు
రుద్రప్రయాగ్/సిమ్లా: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో చిక్కుకుపోయిన తీర్థయాత్రికుల కోసం మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్నాథ్, భింబలి, గౌరీకుండ్ల్లో చిక్కుకుపోయిన మరో 1,500 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారంతా సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది. యాత్రికులను తరలించేందుకు వైమానిక దళం చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను శుక్రవారం రంగంలోకి దించింది. పర్వత మార్గంలో కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా పలువురు గల్లంతైనట్లు వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. శుక్రవారం లించోలిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని యూపీలోని సహరాన్పూర్కు చెందిన శుభమ్ కశ్యప్గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా గౌరీకుండ్–కేదార్నాధ్ ట్రెక్కింగ్ మార్గంలో 25 మీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. అడ్డంకులను తొలగించి, రహదారిని పునరుద్ధరించే వరకు వేచి ఉండాలని రుద్రప్రయాగ్ యంత్రాంగం యాత్రికులను కోరింది.హిమాచల్లో ఆ 45 మంది కోసం గాలింపుహిమాచల్ ప్రదేశ్లోని కులు, సిమ్లా, మండి జిల్లాల్లో వరద బీభత్సంలో గల్లంతైన 45 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మండి జిల్లా రాజ్బన్ గ్రామంలో రాతి కింద చిక్కుకున్న వ్యక్తిని గుర్తించారు. కులు జిల్లా సమెజ్ గ్రామంలో గల్లంతైన పోయిన 30 మంది కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారన్నారు. శ్రీఖండ్ మహాదేవ్ ఆలయంలో చిక్కిన 300 మంది, మలానాలో చిక్కుకున్న 25 మంది పర్యాటకులు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు. -
అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లా
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టబోతున్నాడు. ఇందుకోసం భారతవాయుసేన గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లాను ఎంపికచేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మానవసహిత అంతరిక్ష వ్యోమనౌక కేంద్రం (హెచ్ఎస్ఎఫ్సీ), నాసా, అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా గగనయాత్రికులను నాసా ఐఎస్ఎస్కు తీసుకెళ్లనుంది. మిషన్ పైలట్గా గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా వ్యవహరిస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన వెళ్లలేకపోతే బ్యాకప్ మిషన్ పైలట్గా మరో గ్రూప్ కెపె్టన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను ఐఎస్ఎస్కు పంపిస్తారు. వీరికి ఈ వారంలోనే శిక్షణ మొదలవుతుంది. యాక్సియమ్–4 మిషన్ ద్వారా అక్కడకు వెళ్లే శుక్లా ఐఎస్ఎస్లో తోటి వ్యోమగాములతో కలిసి శాస్త్ర పరిశోధనలుచేయడంతోపాటు పలు సాంకేతికతలను పరీక్షించనున్నారు. తర్వాత ఐఎస్ఎస్ ఆవల అంతరిక్షంలోనూ గడిపే అవకాశముంది. శుక్లాతోపాటు ఐఎస్ఎస్కు అమెరికా, పోలండ్, హంగేరీల నుంచి ఒకరు చొప్పున వ్యోమగామి రానున్నారు. భారత తన సొంత మానవసహిత అంతరిక్ష ప్రయోగాల కోసం నలుగురిని గత ఏడాదే ఎంపికచేసిన విషయం తెల్సిందే. గగన్యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో వ్యోమగామి శిక్షణా కేంద్రంలో వీరి శిక్షణ కూడా గతంలో మొదలైంది. ఇటీవల రష్యాలోనూ ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకున్నారు. గగన్యాన్లో భాగంగా నలుగురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా సముద్రజలాల్లో దింపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ప్రకాశం జిల్లా: కోరిశపాడు జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ (ఫొటోలు)
-
Begumpet: గంటసేపు ఉత్కంఠ.. ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండ్
సాక్షి, హైదరాబాద్: బేగంపేట ఎయిర్పోర్ట్లో ఐఏఎఫ్ విమానం సేఫ్గా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. గంటకుపైగా ఎయిర్ఫోర్స్ విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కావడంతో గంటకు పైగా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఈ విమానంలో సిబ్బందితో సహా 12 మంది ఉన్నారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ఏవియేషన్ సిబ్బంది ప్రయత్నించగా, ఉత్కంఠత కొనసాగింది. గంట సేపు ఉత్కంఠత తర్వాత చివరకు బేగంపేట ఎయిర్ పోర్టులో ఐఏఎఫ్ విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. సేఫ్గా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
IAF: కార్గిల్లో నైట్ ల్యాండింగ్
భారత వాయుసేన (ఐఏఎఫ్) అరుదైన ఘనత సాధించింది. సముద్ర మట్టానికి ఏకంగా 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్పై సి–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రి పూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీనికి సంబంధించి వాయుసేన ‘ఎక్స్’లో పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది. ఐఏఎఫ్ బాహుబలిగా చెప్పే ఈ విమానం పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని ఈ ఎయిర్ స్ట్రిప్పై రాత్రి సమయంలో దిగడం ఇదే తొలిసారి! గరుడ్ కమాండోలకు శిక్షణలో భాగంగా ఇటీవలే ఈ విన్యాసం నిర్వహించినట్లు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. అంతేగాక ఐఏఎఫ్ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు వివరించాయి. నిజానికి రక్షణ శాఖలో రవాణా విమానాన్ని ఇలా రాత్రి పూట ల్యాండింగ్ చేయడం అత్యంత అరుదు. కొండలపై ఉన్న రన్వేపై భారీ విమానాన్ని క్షేమంగా దించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. హిమాలయ పర్వతాల్లో వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ర్స్టిప్లు సేవలందిస్తున్నాయి. ఎల్ఏసీ సమీపంలో దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఏఎల్జీ) సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్ఫీల్డ్ కావడం గమనార్హం. వాయుసేన వద్ద 12 సి–130జే విమానాలున్నాయి. ఇవి సైనికుల తరలింపు, సహాయక సామగ్రి రవాణాలో ఉపయోగపడుతున్నాయి. – న్యూఢిల్లీ -
వరల్డ్ కప్ ఫైనల్ పోరు: ఆనంద్ మహీంద్ర వీడియో గూస్ బంప్స్ ఖాయం!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ (ICC World Cup Final) పోరు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) భారత్ - ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. ప్రపంచ కప్ ఫైనల్ కోసం IAF తమ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్న ఈ దృశ్యం తనకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే 123 వేలకు పైగా వ్యూస్ని సాధించేసింది. అటు ఫ్యాన్స్తో పాటు, ఇటు దేశ వ్యాప్తంగా ఈ ఫైనల్ దంగల్ క్రేజ్ అలా ఉంది మరి. ఈమ్యాచ్కు సంబంధించి శుక్ర, శనివారాల్లో ఎయిర్షో రిహార్సల్స్ ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.మోటెరాలోని టెక్ మహీంద్రా ఇన్నోవేషన్ సెంటర్ను పర్యవేక్షిస్తున్న తమ ఉద్యోగి ఈ క్లిప్ తీశారని ట్వీట్ చేశారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు రంగాలకు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్కు స్వయంగా హాజరై వీక్షించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు గోల్బల్ పాప్ సింగర్ దువా లిపా (Dua Lipa) ఫైనల్ క్లాష్కు ముందు ప్రదర్శన ఇవ్వనుందట. టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకుంది. ప్రపంచకప్ టైటిల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడ నుండటం ఇది రెండోసారి. ఈ సిరీస్లో ఓటమి అనేదే లేకుండా రికార్డుల మీద రికార్డులతో దూసుకుపోతోంది. టీమిండియా రికార్డ్ గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. Spoiler alert! My colleague @manishups08 who’s overseeing the Tech Mahindra Innovation Centre at Motera took this clip of the IAF practising their drill for the World Cup final… Goosebumps inducing….🇮🇳 pic.twitter.com/HQvQIzZVpf — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
ఐఏఎఫ్లోకి సీ–295 విమానం
ఘజియాబాద్: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లోకి మొదటి సీ–295 రకం రవాణా విమానం చేరింది. ఈ విమానాలు ఐఏఎఫ్ వ్యూహాత్మక రవాణా సామర్థ్యం పెంపులో కీలకంగా మారనున్నాయి. ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీ–295 విమానాన్ని ఐఏఎఫ్లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్నాథ్ సర్వ ధర్మపూజ నిర్వహించారు. వైమానిక దళ చీఫ్ వీఆర్ చౌధరితోపాటు సీనియర్ అధికారులు, విమాన తయారీ సంస్థ ఎయిర్బస్ ప్రతినిధులు పాల్గొన్నారు. వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి పనిచేసే స్క్వాడ్రన్ నంబర్ 11కు సీ–295ను అందజేయనున్నారు. కేంద్రం 56 సీ–295 రవాణా విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో రూ.21,935 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి సీ–295 విమానాన్ని ఈ నెల 13న ఐఏఎఫ్ చీఫ్ అందుకున్నారు. ఈ విమానాలను ప్రస్తుతమున్న పాతకాలం ఆవ్రో– 748ల బదులు వినియోగించుకుంటారు. ఒప్పందంలో భాగంగా 16 విమానాల్ని ఎయిర్బస్ సంస్థ అందజేస్తుంది. మిగతా 40 విమానాల్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కలిసి భారత్లోనే ఉత్పత్తి చేస్తుంది. వి డి భాగాల తయారీ పనులు హైదరాబాద్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. -
భారతీయ వాయుసేన డేరింగ్ ఆపరేషన్
-
ఫైటర్ జెట్ నుంచి దూసుకెళ్లిన ‘బ్రహ్మోస్’ మిసైల్
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలు పెరుగుతున్న వేళ రక్షణ రంగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్ను సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించింది భారత వాయుసేన. గగనతలం నుంచి దూసుకెళ్లిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ‘సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బంగాళకాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భూతల, సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్ధ్యాన్ని వైమానిక దళం సాధించింది. సుఖోయ్-30ఎంకేఐతో ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ మిసైల్ను జత చేయడం ద్వారా భారత వైమానిక దళానికి వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది. భవిష్యత్తులో ఎదురయ్యే యుద్ధాల్లో పైచేయి సాధించే అవకాశాన్ని కల్పించింది.’ - భారత రక్షణ శాఖ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత వాయుసేన ట్విట్టర్లో షేర్ చేసింది. ఎయిర్ఫోర్స్, నేవీ, డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు భారత వాయుసేన తెలిపింది. మరోవైపు.. యుద్ధ విమానం నుంచి క్షిపణులను పరీక్షించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. 290 కిలోమీటర్ల రేంజ్ నుంచి 350 కిలోమీటర్లుకు పెంచిన మిసైల్ను సుఖోయ్ ఫైటర్ నుంచి ప్రయోగించి విజయం సాధించింది వాయుసేన. The IAF successfully fired the Extended Range Version of the Brahmos Air Launched missile. Carrying out a precision strike against a Ship target from a Su-30 MKI aircraft in the Bay of Bengal region, the missile achieved the desired mission objectives. pic.twitter.com/fiLX48ilhv — Indian Air Force (@IAF_MCC) December 29, 2022 ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
భారత తొలి ముస్లిం ఫైటర్ పైలట్గా సానియా మీర్జా
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ చెందిన ఓ టీవీ మెకానిక్ కుమార్తె సానియా మీర్జా నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వార్తల్లో నిలిచింది. దీంతో ఆమె భారత్లోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్గా కానున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పేర్కొంది. ఆమె ఫైటర్ పైలట్గా ఎంపికవ్వడానికి ముందుగా నాలుగేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉందని ఐఏఎఫ్ తెలిపింది. ఈ మేరకు ఆమె ఎన్డీఏలో చేరి అకాడమీ కోర్సుగా ఫైటర్ పైలట్ స్ట్రీమ్ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలో వైమానిక దళం ఆమె కల నిజమవ్వాలంటూ.. సానియాకు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె ఎన్డీఏ ఎగ్జామ్లో 149వ ర్యాంకును సాధించింది. హిందీ మీడియంలో చదివినా విజయం సాధించవచ్చని నిరూపించింది సానియా. తాను తొలి మహిళా పైలట్ అవనీ చతుర్వేదిని చూసి ప్రేరణ పొంది రెండో ప్రయత్నంలో ఎన్డీఏలో విజయం సాధించినట్లు సానియా పేర్కొంది. (చదవండి: సోనియా వ్యాఖ్యలకు స్పందించకపోతే.. బాధ్యత పరంగా విఫలమైనట్లే: ధన్ఖర్) -
భారత గగనతలంలో ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు
-
విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్గా ప్రయాణించిన విమానం
ఇరాన్ విమానం భారత్ గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఈ ఘటన ఇరాన్లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళుతున్న మహాన్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భారత వైమానికదళం అధికారులు ఢిల్లీ విమానాశ్రయాన్ని అలర్ట్ చేసింది. అంతేగాదు ఆ విమానంలోని ఫైలెట్కి జైపూర్ లేదా చండీగఢ్లలో ల్యాండ్ అయ్యేలా రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే పైలెట్ ఆ రెండు విమానాశ్రయాల్లోకి విమానాన్ని మళ్లించడానికి ఇష్టపడ లేదని భారత వైమానికి దళం పేర్కొంది. అంతేగాదు ఆ పైలెట్ బాంబు బెదిరింపులతో విమానాన్ని ఎక్కడ ల్యాండ్ చేసేందుకు ఇష్టపడలేదని చెప్పారు. దీంతో టెహ్రాన్ ఎయిర్పోర్ట్ రంగంలోకి దిగి పైలెట్ని బాంబు భయాన్ని వీడమని కోరడంతో సదరు ఫైలెట్ చైనాలోని తన గమ్యస్థానం వైపుకు ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇదిలా ఉండగా ఆ విమానాన్ని రెండు యుద్ధ విమానాలు సురక్షిత దూరం నుంచి అనుసరించినట్లు భారత వైమానిక దళం పేర్కొంది. ఆ విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ప్లైట్ ట్రాకింగ్ వైబ్సైట్ ఫ్లైట్ రాడార్ చూపించినట్లు వైమానిక దళం తెలిపింది. సదరు ఇరాన్ విమానానికి ఉదయం 9.20 గం.ల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత గగనతలంలో ఉండగా ఈ బెదిరింపులు రావడంతో భారత వైమానిక దళం అప్రమత్తమై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీల సంయుక్తంగా తగిన చర్యలు చేపట్టింది. అంతేగా భారత గగనతలం అంతటా భారతవైమానిక దళం ఈ విమానంపై గట్టి నిఘా పెట్టిందని కూడా అధికారులు తెలిపారు. ఐతే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఈ బాంబు బెదిరింపుల గురించి లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలియజేసినట్లు సమాచారం. (చదవండి: ప్రచండ్ హెలికాఫ్టర్.. ప్రపంచంలోనే పవర్ఫుల్.. ‘మేడ్ ఇన్ ఇండియా’) -
రాజస్థాన్లో కుప్పకూలిన మిగ్–21 ఫైటర్ జెట్
బార్మర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన మిగ్–21 యుద్ధ విమానం గురువారం రాత్రి 9.10 గంటలకు రాజస్తాన్లోని బార్మర్లో నేలకూలింది. ఈ ఘటనలో ఇద్దరు విమానంలోని ఇద్దరు పైలట్లు మృతిచెందారు. రెండు సీట్లున్న ఈ విమానాన్ని శిక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. ఉత్తర్లాయ్ ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన విమానం భీమ్డా గ్రామం వద్ద నేలకూలి మంటల్లో చిక్కుకుంది. ఘటనా స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల అసలైన కారణాలు తెలుసుకొనేందుకు వైమానిక దళం కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరితో మాట్లాడారు. మిగ్–21 ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. దేశంలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఆరు మిగ్–21 విమానాలు కుప్పకూలాయి. ఐదుగురు పైలట్లు బలయ్యారు. -
భారతీయుల కోసం ఫ్లైట్లు సిద్ధం చేయండి
న్యూఢిల్లీ: రష్యా సైనిక చర్య కారణంగా ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తక్షణమే అక్కడి నుంచి స్వదేశానికి తీసుకురావాలని ప్రధాని మోదీ మంగళవారం భారత వైమానిక దళం(ఐఏఎఫ్)ను ఆదేశించారు. ప్రధాని ఆదేశాలతో ఆపరేషన్ గంగ మరింత వేగవంతం కానుందని అధికార వర్గాలు తెలిపాయి. భారతీయుల కోసం అతిపెద్ద సీ–17 రకం రవాణా విమానాలను సిద్ధం చేస్తున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఒక్కో విమానంలో 300 మంది ప్రయాణించవచ్చని వెల్లడించింది. పక్కా వ్యూహం రూపొందించాలి: రాహుల్ ఉక్రెయిన్లోని ఖర్కీవ్లో రష్యా దాడుల్లో కర్ణాటక విద్యార్థి మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ‘ఆ దేశంలో ఉన్న భారతీయులందరికీ సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు పక్కా వూహం రూపొందించాలి. ప్రతి నిమిషమూ విలువైందే’అని మంగళవారం రాహుల్ ట్వీట్ చేశారు. -
మహిళా ఐఏఎఫ్పై లైంగిక దాడి
న్యూఢిల్లీ/చెన్నై: తనపై లైంగిక దాడి జరిగిందని ఐఏఎఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదంటూ ఓ మహిళా ఐఏఎఫ్ అధికారి కోయంబత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని 26న మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఫ్లైట్ లెఫ్టినెంట్ అమితేశ్ హార్ముఖ్ తన వద్ద శిక్షణ తీసుకుంటున్న ఐఏఎఫ్ మహిళా అధికారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐఏఎఫ్ అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, వారు ఆమె చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టారు. సుప్రీంకోర్టు కొన్నేళ్ల క్రితం నిషేధం విధించిన ‘టూ ఫింగర్ టెస్ట్’నూ ఆమెపై నిర్వహించారు. అయితే, తాజాగా స్థానిక కోర్టు ఆదేశాల తర్వాత ఆ కేసు తమకు బదిలీ అయ్యిందని, కోర్ట్ మార్షల్ నిర్వహిస్తామని ఐఏఎఫ్ తెలిపింది. -
యుద్ధ విమానాల కోసం సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
శత్రు రాడర్ల నుంచి భారత వైమానిక దళం(ఐఎఎఫ్) యుద్ధ విమానాలను రక్షించడం కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ(హెచ్ఈఎంఆర్ఎల్) సహకారంతో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని డీఆర్డీఓ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. భారత యుద్ధ విమానాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు శత్రువుల మిసైల్స్ ను తప్పుదోవ పట్టించడానికి ఈ టెక్నాలజీ ఒక డెకాయ్ గా పనిచేస్తుంది. ఇప్పటికే విజయవంతంగా యూజర్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ టెక్నాలజీ వినియోగించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. (చదవండి: టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు) ప్రస్తుత ఆధునిక రాడార్ టెక్నాలజీ కాలంలో మన యుద్ద విమానాలను రక్షించడానికి ఇలాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. ఈ క్రిటికల్ టెక్నాలజీని స్వదేశీ అభివృద్ధి కోసం తయారు చేసిన డీఆర్డీఓ, ఐఎఎఫ్ & విమానయాన పరిశ్రమను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది ఆత్మనీర్భర్ భారత్ దిశగా మరో ముందు అడుగు అని అన్నారు. ఐఎఎఫ్ ను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు రక్షణ శాఖ కార్యదర్శి ఆర్ అండ్ డీ, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ.సతీష్ రెడ్డి బృందాలను అభినందించారు. ఆధునిక రాడార్ టెక్నాలజీ పురోగతి చెందటంతో యుద్ధ విమానాల మనుగడ ప్రధాన ఆందోళన కలిగిస్తోందని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ మనుగడ కోసం ఇన్ ఫ్రారెడ్ & రాడార్ టెక్నాలజీ నుంచి తప్పించుకోవడానికి కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సీస్టమ్ (సీఎమ్ డీఎస్) ఉపయోగపడుతుంది అని అన్నారు. -
ఆటో డ్రైవర్ కుమారుడు.. ఐఏఎఫ్లో ఫ్లైయింగ్ ఆఫీసర్గా
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆరిలోవ ప్రాంతం రవీంద్రనగర్ దరి ఎస్ఐజీ నగర్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమారుడు ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) లో ఫ్లైయింగ్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. ఎస్ఐజీ నగర్కు చెందిన గుడ్ల సూరిబాబు కొన్నేళ్లుగా ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమారుడు గుడ్ల గోపినాథ్ రెడ్డి ఎంఎస్సీ, ఎంబీఏ, కుమార్తె గౌరీప్రియ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. గోపినాథ్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ (వీడీఏ)లో ఇంటర్, వీఎస్ కృష్ణా కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదువుకున్నారు. 2009లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు ఆయనను ఫ్లైయింగ్ ఆఫీసర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. ఆ ఉద్యోగంలో గోపినా«థ్ త్వరలో చేరనున్నట్లు అతని తల్లిదండ్రులు సూరిబాబు, చిన్నతల్లి తెలిపారు. కాగా, తమ కుమారుడు దేశ రక్షణ విభాగంలో భాగస్వామ్యం అవడం గర్వకారణంగా ఉందని గోపినాథ్ తల్లిదండ్రులు ‘సాక్షి’ కి తెలిపారు. చదవండి: కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పేంటి? -
భారత్కు రానున్న మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు
కొచ్చి: భారత వాయుసేనకు సేవలందించేందుకుగాను ఫ్రాన్స్ నుంచి కొత్తగా మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు బుధవారం రోజు రానున్నాయి. ఈ యుద్ధవిమానాలు రాత్రి 7 గంటలకు గుజరాత్లో ల్యాండ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవి అంబాలాలోని గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ శిబిరంలో చేరనున్నాయి. రఫెల్ యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి నేరుగా భారత్కు రానున్నాయి. యూఏఈ మధ్యలో గాల్లోనే మిడ్-ఎయిర్ రీ ఫ్యూలింగ్ చేసుకుంటాయి. వీటి చేరికతో స్క్వాడ్రన్లోని యుద్ధ విమానాల సంఖ్య 14 కు చేరనుంది. కాగా, తొమ్మిది రాఫెల్ ఫైటర్ జెట్ల తదుపరి బ్యాచ్ ఏప్రిల్లో రానుంది. వీటిలో ఐదింటిని పశ్చిమ బెంగాల్లోని హషిమారా ఎయిర్బేస్లో చేర్చుతారు.ఏప్రిల్ చివరి నాటికి ఐదు అదనపు రాఫెల్ జెట్లను భారత్కు వస్తాయని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మంగళవారం పేర్కొన్నారు. కొచ్చిలో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. కోవిడ్-19 మహామ్మారి ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో యుద్ధ విమానాలను సరఫరా చేశామని తెలిపారు. రాఫెల్ ఫైటర్ జెట్ రెండు ఎమ్88-3 సఫ్రాన్ ఇంజన్లను కలిగి ఉంది. ఈ ఇంజన్లు సుమారు 73 కిలో న్యూటన్ల థ్రస్ట్ను ఇవ్వగలవు. అంతేకాకుండా స్మార్ట్ ఆయుధ వ్యవస్థను కలిగి ఉంది. ఈ యుద్ధ విమానం గత ఏడాది జూలై, ఆగస్టులలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాయి. అతి తక్కువ సమయంలో వైమానిక దళం వీటి ఆపరేషన్కు అనుమతులు లభించాయి.తూర్పు లడఖ్, ఇతర ప్రాంతాలలో, పెట్రోలింగ్ కోసం మోహరించారు. 2016 సెప్టెంబరులో ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాలను భారత్ ఆర్డర్చేసిన విషయం తెలిసిందే. Total in 2022, the 36 aircraft will have been delivered as per contract: French Envoy to India Emmanuel Lenain https://t.co/yS2sKtxBDQ — ANI (@ANI) March 30, 2021 చదవండి: ‘గోల్డెన్ గర్ల్’ శివాంగి సింగ్ -
బాలాకోట్ ఆపరేషన్: లాంగ్ రేంజ్ స్టైక్
ఢిల్లీ: ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైన్యం నిర్వహించిన బాలాకోట్ ఆపరేషన్కు రెండేళ్లు పూర్తయ్యాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన ఫైటర్ జెట్లు నియంత్రణ రేఖను(ఎల్ఓసీ) దాటి, పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్లో ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది. బాలాకోట్ ఆపరేషన్ రెండో వార్షికోత్సవం సందర్భంగా భారత వైమానిక దళం తాజాగా ప్రయోగాత్మకంగా లాంగ్ రేంజ్ స్ట్రైక్ నిర్వహించింది. ప్రాక్టీస్ టార్గెట్ను విజయవంతంగా ఛేదించినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. బాలాకోట్ ఆపరేషన్ చేపట్టిన స్క్వాడ్రన్ బృందమే ఈ లాంగ్ రేంజ్ స్ట్రైక్లో పాల్గొనడం విశేషం. చదవండి: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్: ‘కోతి ఖతమైంది’ -
మొదటి కార్గిల్ గర్ల్ నేనే: శ్రీవిద్య రాజన్
కార్గిల్ గర్ల్గా పేరు సంపాదించుకున్న గుంజన్ సక్సెనా బయోపిక్పై విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. సినిమాలోని కొన్ని సన్నివేశాల పట్ల ఐఏఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజగా గుంజన్ సక్సెనా సహోద్యోగి శ్రీవిద్య రాజన్ కూడా చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె కూడా 1999 కార్గిల్ యుద్ధ సమయంలో గుంజన్తో కలిసి ఐఏఎఫ్లో హెలికాప్టర్ పైలట్గా పని చేశారు. తాజాగా శ్రీవిద్య ఫేస్బుక్ వేదికగా గుంజన్ సక్సెనా చిత్రంపై తన అభ్యంతరాలను తెలిపారు. అప్పటివరకు కేవలం పురుషులే ఉన్న రంగంలో తొలిసారి తాము చేరినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అన్నారు. సహచర మగ ఉద్యోగులు కొందరు తాము అసలు ఈ రంగంలో ఎలా ఉంటామా అని అనుమానంగా చూశారని.. కానీ చాలా కొద్ది సమయంలోనే వారు తమను అంగీకరించారని శ్రీవిద్య తెలిపారు. అంతేకాక ప్రారంభంలో తమకు ప్రత్యేకంగా టాయిలెట్స్ కానీ, డ్రెస్ మార్చుకునే రూములు కానీ లేవని వెల్లడించారు. అలానే శిక్షణలో తాము చేసే కొన్ని తప్పులను ప్రత్యేకంగా ఎత్తి చూపేవారని.. సరిదిద్దుకునే వరకూ ఊరుకోకపోయేవారన్నారు శ్రీవిద్య. ఇవే తప్పులు మగ ఉద్యోగులు చేస్తే పెద్దగా పట్టించుకునే వారు కాదన్నారు. అలానే 1996లో తనకు, గుంజన్కు ఇద్దరికి ఉధంపూర్లో పొస్టింగ్ ఇచ్చారని.. కానీ సినిమాలో మాత్రం గుంజన్ను మాత్రమే ఉధంపూర్ పంపించినట్లు తప్పుగా చూపించారని తెలిపారు. అంతేకాక సినిమాలో చూపించినట్లు చిన్న చిన్న సిల్లీ రీజన్ల వల్ల తమ బాధ్యతలు ఎప్పుడు పోస్ట్పోన్ కాలేదన్నారు. ఎంతో అనుభవం, నైపుణ్యం కల స్క్వాడ్రన్ కమాండర్లు తమకు శిక్షణ ఇచ్చేవారని తెలిపారు. ఆడ, మగ ఎవరూ తప్పు చేసినా ఒకేలాంటి శిక్ష విధించేవారన్నారు. అంతేకానీ సినిమాలో చూపించినట్లు అవమానించడం.. సామార్థ్యాన్ని కించపర్చడం లాంటివి చేసేవారు కాదన్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా పైలెట్ తానే అన్నారు శ్రీ విద్య. కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు తొలుత తాను ఉధంపూర్ వెళ్లానని.. తరువాత గుంజన్ తన టీంతో కలిసి శ్రీనగర్ వెళ్లిందన్నారు శ్రీవిద్య. అప్పుడు తాము అన్ని విభాగాల్లో విధులు నిర్వహించామని తెలిపారు శ్రీ విద్య. (ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ) సినిమా క్లైమాక్స్లో వచ్చిన సీన్లు పూర్తిగా అబద్దం అన్నారు శ్రీవిద్య. అలాంటి సినిమాటిక్ సీన్లు కేవలం మూవీస్లో మాత్రమే ఉంటాయని.. వాస్తవంగా ఎన్నటికి జరగవన్నారు. గుంజన్ సక్సెనా తన కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తే.. యువతకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. కానీ సినిమాలో కొన్ని చోట్ల మహిళలని కించపర్చడం.. ఐఏఎఫ్ను తక్కువ చేసి చూపడం తనకు నచ్చలేదన్నారు. మహిళా పైలెట్లుగా తమను ఎంతో గౌరవ మర్యాదలతో చూశారని తెలిపారు. గుంజన్ ఒకసారి వీటన్నింటి పరిశీలించి.. మార్పులు చేసిన తర్వాత సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుండేదన్నారు శ్రీవిద్య. కార్గిల్ యుద్ధంలో మగ ఆఫీసర్లు తమకంటే ఎక్కువే కష్టపడ్డారని.. కానీ వారు ఎలాంటి గుర్తింపు కోరుకోవడం లేదన్నారు శ్రీవిద్య. తమకు లభించిన ఈ గుర్తింపు కూడా కేవలం జండర్ ఆధారంగానే లభించిందన్నారు. అయితే భద్రతాదళాల్లో సేవ చేసినప్పుడు ఆడ, మగ అనే తేడా ఉండదన్నారు. యూనిఫామ్ వేసుకుంటే ప్రతి ఒక్కరూ ఆఫీసర్ మాత్రమే అని తెలిపారు శ్రీవిద్య. (స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?) శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, గుంజన్ సక్సెనా పాత్రలో నటించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహంచారు. థియేటర్లో విడుదల చేయాల్సి ఉన్నప్పటికి లాక్డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయిన సంగతి తెలిసిందే. -
ఆగమించిన ‘బాహుబలి’
రణరంగంలో శత్రువుతో హోరాహోరీ తలపడే వేళ మన వైమానిక దళానికి సమర్థవంతంగా తోడ్పడగలదని భావిస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం మన గడ్డపై వాలాయి. అయిదేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్లో పర్యటించినప్పుడు రూ. 59,000 కోట్లు వ్యయం కాగల 36 రఫేల్ యుద్ధ విమానాలు అందించడానికి ఆ ప్రభుత్వంతో అవగాహన కుదిరింది. అనంతరం 2016 సెప్టెంబర్లో ఒప్పందంపై సంతకాలయ్యాయి. అధినేతలమధ్య అవగాహన కుది రినప్పుడు రెండేళ్లలో... అంటే 2017లో ఈ యుద్ధ విమానాలను మన దేశానికి అందిస్తామని ఫ్రాన్స్ హామీ ఇచ్చింది. అయితే ఒప్పందం ఖరారులో జరిగిన జాప్యం వల్ల మరో మూడేళ్ల సమయం తీసుకుని తొలి విడతగా అయిదు విమానాలను మనకు అందజేశారు. ఈ యుద్ధ విమానాలు హరి యాణాలోని అంబాలా వైమానిక దళ స్థావరానికి చేరుకుంటున్న తరుణంలో బుధవారం దేశం హర్షాతిరేకాలతో హోరెత్తింది. దాదాపు అన్ని వార్తా చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో రఫేల్ యుద్ధ విమానాలదే హడావుడంతా. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనాతో మనకున్న వివాదం నేపథ్యం ఇందుకు కారణం కావొచ్చు. ఈ విమానాలను ఎల్ఏసీకి సమీపాన వున్న లదాఖ్కు తరలించ బోతున్నట్టు చెబుతున్నారు. రక్షణ బలగాలకు సమర్థవంతంగా సేవలందించగల మెరికల్లాంటి యుద్ధ విమానాల కోసం మన దేశం జరుపుతున్న అన్వేషణ ఈనాటిది కాదు. చుట్టూ చైనా కుంపట్లు రాజేస్తున్నదని, పాకిస్తాన్ ఎప్పటిమాదిరే కయ్యానికి కాలుదువ్వుతున్నదని... ఈ పరిణామాలన్నీ మన రక్షణ సంసిద్ధత పెరగ వలసిన అవసరాన్ని సూచిస్తున్నాయని వైమానిక దళం 2000 సంవత్సరం నుంచే చెబుతూ వస్తోంది. చివరకు 4.5 జనరేషన్ బహుళ విధ యుద్ధ విమానాలు అత్యవసరమని 2004లో తుది నిర్ణయాని కొచ్చారు. ఒకప్పుడు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో రక్షణ దళాలకు విజయాలు సాధించిపెట్టిన మిగ్–21 బైసన్, జాగ్వార్ విమానాల వయసు మీరిందని, అవి తరచు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నా యని వైమానిక దళం తెలిపింది. ఉన్నపాటుగా యుద్ధం వస్తే రణరంగంలోకి ఉరకడానికి అనువైన సాధనా సంపత్తి మన దగ్గరలేదన్న సంగతిని గుర్తు చేసింది. అయితే అదేం ప్రారబ్ధమోగానీ ఒకసారి యుద్ధ విమానాలో, మరొకటో కొనాలని నిర్ణయం జరిగాక టెండర్లు పిలవడం మొదలుకొని ఎంపిక చేయడం వరకూ అన్నీ నత్తనడక నడుస్తాయి. ఎంపిక పూర్తయ్యాక వరస ఆరోపణలు వెల్లువెత్తు తాయి. వేరే రకం ఇంతకన్నా మెరుగైనవే అయినా నాసిరకంతో సరిపెడుతున్నారని, ముడుపులు చేతులు మారడమే ఇందుకు కారణమని కథనాలు వస్తాయి. రఫేల్ యుద్ధ విమానాల ఎంపిక సమయంలోనూ అలాంటి సమస్యలు తప్పలేదు. దీన్ని ఎంపిక చేయడానికి ముందు అమెరికా తయారీ ఎఫ్/ఏ–18, ఎఫ్–16, రష్యా మిగ్–35, స్వీడన్ తయారీ గ్రిపెన్ తదితర విమానాల సామర్థ్యాన్ని పరీక్షించారు. మన అవసరాలకు అనుగుణంగా లేవన్న కారణంతో తిరస్కరించారు. చివరకు రఫేల్ తోపాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల కన్షార్షియం ఉత్పత్తి చేసే టైఫూన్లు మిగిలాయి. ఈ రెండింటిలో రఫేల్ అన్నివిధాలా మెరుగైనదని తేల్చారు. ఇంతలోనే బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, సౌదీ అరేబియా వంటి దేశాలు తిరస్కరించిన రఫేల్ ఎలా నచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇదంతా 2012నాటి మాట. అప్పట్లో ఈ విమానాలను డసాల్ట్ కంపెనీ ఉత్పత్తి చేసేది. మన దేశానికి ఒప్పందం కుదిరింది కూడా దానితోనే. కానీ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ విషయంలో పేచీ పెట్ట డంతో అది కాస్తా మూలనబడింది. రూ. 54,000 కోట్ల వ్యయం కాగల ఆ ఒప్పందం ప్రకారం డసాల్ట్ సంస్థ 126 రఫేల్ యుద్ధ విమానాలను సమకూర్చాలి. మూడేళ్లలో 18 విమానాలు అందజేయడంతో పాటు మిగిలిన 108 యుద్ధ విమానాలనూ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తానని చెప్పింది. ఏమైతేనేం పాత ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం ఖరారయింది. మొత్తానికి మన బలగాలు కోరుకుంటున్న రఫేల్ విమానాలు ముంగిట్లోకి వచ్చాయి. అయితే వీటిని ఖరారు చేసేనాటికి చైనాతో మనకు ఈ స్థాయి వివాదం లేదు. మన చుట్టూ వున్న దేశాల్లో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న వైనంపై మన రక్షణ రంగ నిపుణులకు అవగాహన వున్నా, ప్రధానంగా పాకిస్తాన్ను దృష్టిలో వుంచుకునే 36 యుద్ధ విమానాలు సరిపోతాయని అంచనా వేశారు. కానీ మారిన పరిస్థితుల్లో పాక్తో వున్న అధీన రేఖ(ఎల్ఓసీ)తోపాటు చైనాను ఢీకొనడానికి ఎల్ఏసీ వద్ద కూడా మోహరించడం తప్పనిసరన్నది నిపుణుల భావన. మన వైమానిక దళానికి మంజూరైన స్క్వాడ్రన్లు 42 కాగా వాటిని 50కి పెంచాలన్న డిమాండు వుంది. కానీ మనకున్నవి ప్రస్తుతం 30 మాత్రమే. ఒక్కో స్వాడ్రన్ పరిధిలో 18 యుద్ధ విమానాలు ఉంటాయి. అంటే 2022 నాటికి రాఫెల్ యుద్ధ విమానాలన్నీ మన దగ్గరకొస్తే రెండు స్క్వాడ్రన్లు సంసిద్ధంగా వున్నట్టవుతుంది. ప్రభుత్వం చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటే తప్ప మంజూరైన 42 స్క్వాడ్రన్ లకూ అవసరమైన యుద్ధ విమానాలు సమకూరవు. ఇప్పటికే సుఖోయ్–30 ఎంకేఐ, మిగ్–29 యుద్ధ విమానాలు 33 కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. అలాగే హెచ్ఏఎల్ రూపొందించిన తేజస్ మార్క్1 తేలికపాటి యుద్ధ విమానాలు, తేజస్ మార్క్2 యుద్ధ విమానాలు, అధునాతన మధ్యశ్రేణి యుద్ధ విమానాలు(ఏఎంఏసీ) వరసగా అందబోతున్నాయి. ఇవన్నీ పూర్తిగా అందేలోగానే ఇప్పటికేవున్న సుఖోయ్–30, మిరేజ్–2000, మిగ్–29లను ఆధునీకరించడం అత్యవసరం. యుద్ధం అవసరం లేని, ఘర్షణలకు తావులేని ప్రపంచం కోసం కృషి చేయడం ముఖ్యమే. అయితే మనం బలమైన స్థితిలో వుంటేనే ఆ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. ఆ కోణంలో రఫేల్ రాకను స్వాగతించాలి. -
రఫేల్ రాక.. ఆ రెండు దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) దీర్ఘకాలంగా వేచిచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం అంబాలా వైమానికి స్ధావరానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాయాది దేశం పాక్, డ్రాగన్ దేశాలకు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పక్షులు అంబాలాలో సురక్షితంగా దిగాయి. రఫేల్ ఫైటర్ జెట్స్ రాకతో మన సైనిక చరిత్రలో కొత్త శకానికి తెర లేచింది. ఈ మల్టీరోల్ విమానాలు ఐఏఎఫ్ సామర్థ్యాలను విప్లవాత్మకంగా మారుస్తాయి. మనం ఈ రఫేల్ యుద్ధ విమానాలు సొంతం చేసుకోవడం చూసి ఎవరి వెన్నులోనైనా వణుకు పడుతుంది అంటే.. అది కేవలం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నుతున్న వారికేన’ని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్లోకి చొచ్చుకు రావాలనే కాంక్షతో రగిలిపోతోంది పాకిస్తాన్, చైనా దేశాలే. ఆ రెండు దేశాలను ఉద్దేశించే రక్షణ శాఖ మంత్రి ఈ హెచ్చరికలు చేశారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. (‘ఏ దేశంపై దాడి చేసే ఉద్దేశం లేదు’) I would like to add, if it is anyone who should be worried about or critical about this new capability of the Indian Air Force, it should be those who want to threaten our territorial integrity. — Rajnath Singh (@rajnathsingh) July 29, 2020 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపై విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి సైతం రాజ్నాథ్ సింగ్ ట్విటర్ ద్వారా బదులిచ్చారు. రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఫ్రాన్స్ నుంచి వాటిని కొనుగోలు చేయడం జరిగిందని.. ఇప్పటికే ఈ విషయంలో ఉన్న అన్ని సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగిందని రాజ్నాథ్ సింగ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
హ్యాపీ ల్యాండింగ్ : రఫేల్ జెట్స్ వచ్చేశాయ్!
-
హ్యాపీ ల్యాండింగ్ : రఫేల్ జెట్స్ వచ్చేశాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం(ఐఏఎఫ్) దీర్ఘకాలంగా వేచిచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం అంబాలా వైమానికి స్ధావరానికి మరికాసేపట్లో చేరుకుంటాయి. భారత గగనతలంలోకి బుధవారం మధ్యాహ్నం తొలి బ్యాచ్లో భాగంగా ఐదు రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోగానే భారత నౌకా యుద్ధవిమానం నుంచి భారీ స్వాగతం లభించింది. ‘హిందూ మహా సముద్రానికి స్వాగతం మీరు సగర్వంగా ఆకాశాన్ని తాకవచ్చు..హ్యాపీ ల్యాండింగ్స్’ అంటూ ఐఎన్ఎస్ కోల్కతా రఫేల్ జెట్స్కు రేడియో సందేశం పంపింది. ఇందుకు రఫేల్ పైలట్ ధన్యవాదాలు తెలిపారు. రఫేల్ యుద్ధవిమానాలు అంబాలకు చేరగానే వాటిని వైమానిక దళంలో చేర్చే కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహిస్తారు. ఇక చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోవడంతో ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. కాగా, నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.మొదటి బ్యాచ్లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్లోని అంబాలా వైమానిక స్థావరానికి మరికొద్దిసేపట్లో చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్ధఫ్రా ఎయిర్బేస్లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్లో మొదటి రఫేల్ జెట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. చదవండి : రా.. రా.. రఫేల్! -
‘ఏ దేశంపై దాడి చేసే ఉద్దేశం లేదు’
పారిస్: అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది దేశ భద్రత కోసమే కానీ.. ఇతర దేశాలపై దాడి చేసే ఉద్దేశం భారత్కు లేదన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఫ్రాన్స్లో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని మంగళవారం అధికారికంగా స్వీకరించిన సంగతి తెలిసిందే. రఫేల్ యుద్ధ విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు రాజ్నాథ్ సింగ్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఇది చాలా చారిత్రత్మక రోజు. రఫేల్ అప్పగింతతో భారత్-ఫ్రాన్స్ల మధ్య బంధం మరింత బలపడింది. రఫేల్ చేరికత భారత వైమానిక రంగం మరింత శక్తివంతంగా మారింది. భారత్ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసమే ఆయుధాలను సమకూర్చుకుంటుంది. ఏ దేశం మీద దాడి చేసే ఉద్దేశం మాకు లేదని’ రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఆయుధ పూజ అనంతరం రాజ్నాథ్ రఫేల్ జెట్లో పర్యటించారు. ఈ క్రమంలో తన అనుభూతిని తెలుపుతూ.. రఫేల్లో విహరించడం సౌకర్యంగా, హాయిగా ఉందన్నారు. సూపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తానని జీవితంలో ఎప్పుడు అనుకోలేదని తెలిపారు రాజ్నాథ్ సింగ్. రఫేల్ జెట్ల చేరిక ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కాలన్నారు. దేశ భద్రత కోసం మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజ్నాథ్ తెలిపారు. ఫిబ్రవరి 2021నాటికి ఫ్రాన్స్ మరో 18 రఫేల్ యుద్ధ విమానాలను భారతకు అందజేస్తుంది. మే 2022 నాటికి దేశం మొత్తం మీద 36 రఫేల్ జెట్లు ఉండబోతున్నాయి. -
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
-
వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: భారత వాయుసేన ఆధునీకరణ దిశగా పెద్ద ముందడుగు పడింది. వాయుసేన అమ్ములపొదిలోకి తాజాగా ఎనిమిది అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరాయి. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్-64ఈ (ఐ) హెలికాప్టర్లు మంగళవారం భారత్ చేరాయి. పఠాన్కోట్ ఎయిర్బేస్లో వీటిని వాయుసేన స్వాధీనం చేసుకుంది. వాయుసేనకు చెందిన125 హెలికాప్టర్ యూనిట్ ’గ్లాడియేటర్స్’ ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వినియోగించనున్నారు. వాయుసేన అమ్ములపొదిలోకి ఈ హెలికాప్టర్లు చేరిన సందర్భంగా వాటిని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ పరిశీలించారు. అమెరికా నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లను భారత్ దిగుమతి చేసుకొంది. వీటిని కొనుగోలు చేసేందుకు 2015లోనే భారత్ అమెరికా రక్షణ సంస్థ బోయింగ్తో 1.1 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2022నాటికి భారత వాయుసేనలోకి మొత్తం 22 అపాచీయుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో వీటిని బోయింగ్ భారత్కు అప్పగించనుంది. ప్రస్తుతం భారత వాయుసేన సోవియట్ నాటి ఎంఐ-25, ఎంఐ 35 హెలికాప్టర్లను వినియోగిస్తోంది. వీటి స్థానంలో అపాచీ హెలికాప్టర్లను వాయుసేన ఇకనుంచి వినియోగించనుంది. పాకిస్థాన్ సరిహద్దులకు కొద్ది దూరంలోనే ఉన్న పఠాన్ కోట్ ఎయిర్బేస్లో ఈ యుద్ధ హెలికాప్టర్లలోని నాలుగింటిని వాయుసేన మోహరించనుంది. -
ఉత్తరాదిన ఉప్పొంగుతున్న నదులు
సిమ్లా/డెహ్రాడూన్/చండీగఢ్:/న్యూఢిల్లీ: ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. గంగా, యమున, సట్లెజ్ నదులు పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో వర్షాల కారణంగా జరిగిన వివిధ ఘటనల్లో 37 మంది చనిపోయారు. అత్యధికంగా హిమాచల్లో 25 మంది మృతి చెందారు. మరో 24 గంటలపాటు వానలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఎన్నడూలేని విధంగా భాక్రా జలాశయం ఈ ఏడాది ముందుగానే నిండింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా, కంగ్రా, కుల్లు జిల్లాల్లో సోమవారం మరో ముగ్గురు చనిపోవడంతో భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరుకుంది. శనివారం నుంచి కురుస్తున్న వానలతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలడంతోపాటు, కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 500 మందిని ఎన్డీఆర్ఎఫ్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.. పంజాబ్ ప్రభుత్వం హైఅలర్ట్ విడవని వానల కారణంగా యమునా నది ఉప్పొంగడంతో పంజాబ్, హరియాణాల్లోనూ వరద ప్రమాదం పొంచి ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమయింది. కర్నాల్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన స్త్రీలు, చిన్నారులు సహా 9 మందిని ఐఏఎఫ్ బృందాలు కాపాడాయి. రోపార్ ప్రాజెక్టు నుంచి వరదను విడుదల చేయడంతో దిగువన ఉన్న షాకోట్, నకోదర్, ఫిల్లౌర్ జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. అలాగే, సట్లెజ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలంధర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 48 నుంచి 72 గంటల వరకు భారీ వర్ష సూచన ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తరాఖండ్లో ఆగిన వాన హిమాచల్ప్రదేశ్– ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 9 మృతదేహాలు బయటపడటంతో రాష్ట్రంలో వానల కారణంగా జరిగిన సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 12కు చేరుకుంది. హరిద్వార్ వద్ద ప్రమాదస్థాయిని మించి, రిషికేశ్ వద్ద ప్రమాదస్థాయికి చేరువలో గంగ ప్రవహిస్తోంది. వరదల్లో పదుల సంఖ్యలో గ్రామాలు చిక్కుకుపోగా వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నదీ తీరం వెంట ఉన్న 30 గ్రామాల వారిని అప్రమత్తం చేశామని, వరద తీవ్రత పెరిగితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని యంత్రాంగం తెలిపింది. ఢిల్లీకి వరద ముప్పు యమునా నది హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీ యంత్రాంగం అప్రమత్తమయింది. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు, ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం కేజ్రీవాల్ అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. సోమవారం యమునా నీటి మట్టం 204.7 మీటర్లకు చేరుకుంది. హరియాణాలోని హతినికుండ్ జలాశయం నుంచి 8.28 క్యూసెక్కుల నీటిని సోమవారం విడుదల చేయనుండటంతో మంగళవారం ఉదయానికి నీటిమట్టం 207 మీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలను పోలీసులు, పౌర రక్షక దళాల సాయంతో ఖాళీ చేయించాలని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. యమున ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను కోరింది. -
ఐఏఎఫ్ డేర్డెవిల్ ఆపరేషన్
జమ్మూ: భారత వైమానిక దళం సిబ్బంది ధైర్య సాహసాలు ప్రదర్శించి వరదల్లో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కాపాడారు. జమ్మూకు చెందిన నలుగురు మత్స్యకారులు జమ్మూలోని భగవతి నగర్ వద్ద తావీ నదిలోకి దిగారు. ఒక్కసారిగా నదిలో వరద ఉధృతి పెరగడంతో వారు అక్కడే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్పైకి ఎక్కారు. అంతకంతకు నీటి మట్టం పెరుగుతుండటంతో స్థానికుల సాయంతో అధికారులకు సమాచారం అందించారు. ఐఏఎఫ్ వెంటనే రంగంలోకి దిగింది. ఐఏఎఫ్ హెలికాప్టర్ పిల్లర్కు అతి సమీపానికి రాగా గరుడ్ కమాండో కింది దిగారు. అక్కడున్న ఇద్దరినీ సురక్షితంగా హెలికాప్టర్లోకి ఎక్కేలా చేసి, మరో ఇద్దరి కోసం తాడు నిచ్చెనను వదిలారు. అయితే, వారిద్దరూ పైకి ఎక్కలేక తిరిగి నీళ్లలో పడిపోయారు. దీంతో గరుడ్ కమాండోలు తిరిగి పిల్లర్ ఉన్న ప్రాంతానికి చేరుకుని, వారిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చేయగలిగారు. దాదాపు రెండుగంటలపాటు సాగిన ఈ సాహసోపేత చర్యను స్థానికులు ఉత్కంఠగా తిలకించారు. నలుగురినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఐఏఎఫ్ సిబ్బంది సాహసాన్ని వారు కొనియాడారు. ఇది డేర్డెవిల్ ఆపరేషన్ అని ఐఏఎఫ్ అధికారులు అభివర్ణించారు. ఇదంతా హెలికాప్టర్ పైలెట్, గరుడ్ కమాండో మధ్య సమన్వయం వల్లే సాధ్యమైందన్నారు. నగరంలోని హర్కిపౌడి ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో.. ఉధంపూర్కు చెందిన తాలిబ్ హుస్సేన్ తావి నది వరదలో చిక్కుకుపోగా పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. -
అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు చెందిన శత్రు విమానాన్ని కూల్చేసిన అనంతరం మూడు రోజులపాటు పాక్లో బందీగా ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర శౌర్య పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనిక పురస్కారాలను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్కు ఆయన మరణానంతరం రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను కేంద్రం ఇచ్చింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్తో భారత్ ఆకాశంలో తలపడినప్పుడు స్క్వాడ్రన్ లీడర్గా ఉండి విమానాలను నియంత్రించిన మింటీ అగర్వాల్కు యుద్ధ సేవా పతకం దక్కనుంది. వాయుసేనకు 5 యుద్ధ సేవ, 7 వాయుసేన పతకాలు సహా మొత్తం 13 పురస్కారాలు దక్కనున్నాయి. ఫిబ్రవరి 26న పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఐదుగురు యుద్ధ పైలట్లకు పురస్కారాలు లభించాయి. ఆర్మీకి 8 శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేనా పతకాలు దక్కాయి. నౌకాదళానికి ఒక శౌర్య చక్ర పురస్కారం లభించింది. పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ శిక్షణా శిబిరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేయడంతో మరుసటి రోజే పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో పాక్కు చెందిన ఎఫ్–16 విమానాన్ని వర్ధమాన్ కూల్చేశారు. తాను నడుపుతున్న మిగ్–21 విమానం దాడికి గురవ్వడంతో ఆయన కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడినప్పటికీ పాకిస్తాన్లో దిగారు. దీంతో ఆయనను పాకిస్తాన్ మూడురోజులపాటు బందీగా ఉంచుకున్న అనంతరం భారత్కు అప్పగించింది. ముంబైలో జాతీయ జెండాతో సినీ నటి నిత్యా మీనన్ -
అభినందన్కు వీర్చక్ర.. లేడీ స్క్వాడ్రన్కు మెడల్
న్యూఢిల్లీ: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వర్ధమాన్కు కేంద్ర ప్రభుత్వం వీర్చక్ర పురస్కారం ప్రదానం చేయనుంది. బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ తర్వాత భారత గగనతలంలోకి చొరబడిన పాక్ F16 యుద్ధవిమానాన్ని మిగ్-21 ఫైటర్జెట్తో అభినందన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన పాక్ విమానాలను తరిమికొట్టే క్రమంలో అతని మిగ్ 21 ఫైటర్ జెట్ కూలిపోయింది. దీంతో తమ భూభాగంలో ల్యాండ్ అయిన వర్థమాన్ని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే, భారత్ తీసుకొచ్చిన దౌత్య ఒత్తిడితో మార్చి 1వ ఆయనను తేదీన విడుదలచేసింది. శత్రుచెరలో 60 గంటలు గడిపి.. దాయాది సైన్యం ఎంత ఒత్తిడిచేసినా సైనిక రహస్యాల గుట్టువిప్పకుండా... సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చిన వర్థమాన్పై ప్రశంసల జల్లుకురిసింది. అతడి వీరత్వానికి గుర్తింపుగా కేంద్రప్రభుత్వం వీరచక్రతో సత్కరించింది. జవాన్లకిచ్చే పరమవీరచక్ర, మహావీరచక్ర తర్వాత మూడో అత్యున్నత పురస్కారం ఇది. ఇక, భారత ఆర్మీకి చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారం దక్కింది. ఇక భారత సైన్యానికి ఎనిమిది శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేన మెడళ్లు (గాలంట్రీ), నాలుగు మెన్షన్ ఇన్ డిస్పాచెస్ దక్కాయి. ఇక, భారత వాయుసేనకు ఐదు యోధ సేవ మెడళ్లు, ఏడు వాయుసేన మెడళ్లు వచ్చాయి. ఈ మెడళ్లు సాధించిన వారిలో బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన మిరాజ్ ఫైటర్ పైలట్లు కూడా ఉన్నారు. మొత్తం 13మందికి ఈ మెడళ్లు దక్కగా.. అందులో 12మంది ఫైటర్ ఫైలట్లు కాగా, ఒకరు లేడీ స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్. భూతలంలో ఫ్లయిట్ కంట్రోలర్గా ఉన్న ఆమె.. బాలాకోట్ దాడుల అనంతరం గగనతలంలో పాక్ ఫైటర్ జెట్ దాడులను భారత పైలట్లు తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇందుకుగాను ఆమెను యోధ సేవ మెడల్ వరించింది. -
వాయుసేనకు అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్ మరింత శక్తిమంతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఏహెచ్ 64ఈ త్వరలో వాయుసేన అమ్ములపొదిలో చేరనుంది. అమెరికా విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ నాలుగేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు హెలికాప్టర్లను భారత్కు అందజేసింది. మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లకు డీల్ కుదరగా తొలి విడతగా నాలుగు హెలికాప్టర్లు ఐఏఎఫ్కి అందాయి. వచ్చేవారం మరో నాలుగు వస్తాయి. మొత్తం ఎనిమిది అపాచీ హెలికాప్టర్లు పఠాన్కోట్ వైమానిక కేంద్రం నుంచి త్వరలో భారత వైమానిక దళంలో లాంఛనంగా చేరనున్నాయి. అపాచీ చేరికతో తమ పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని ఐఏఎఫ్ ఆశాభావం వ్యక్తంచేసింది. -
కూలిన ఏఎన్- 32.. 13 మృతదేహాలు వెలికితీత
ఈటానగర్ : అరుణాచల్ప్రదేశ్లో కూలిపోయిన ఏఎన్-32 విమాన ప్రమాద స్థలం నుంచి 13 మృతదేహాలను వెలికితీశారు. అలాగే కూలిపోయిన విమానం బ్లాక్బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. అరుణాచల్ప్రదేశ్లోని లిపోకి 16 కిలోమీటర్ల దూరంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయిన విషయాన్ని ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ విమానం శకలాలను ఎంఐ-17 విమానాలు చేపట్టిన గాలింపు చర్యల్లో గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రమాద స్థలంలో మృతదేహాలను గుర్తించి మృతుల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. జూన్ 3న 13 మందితో బయలుదేరిన ఏఎన్32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమాషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే. అస్సాంలోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్ప్రదేశ్లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండాపోయింది. విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. ఎయిర్ఫోర్స్కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు గల్లంతైన విమానం కోసం అటవీ ప్రాంతంల్లో జల్లెడపట్టాయి. గల్లంతైన ఏఎన్32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. -
‘అక్కడ దట్టమైన పొగ రావడం చూశాం’
ఈటానగర్ : భారత వాయుసేనకు సంబంధించిన ఏఎన్ - 32 విమానం రెండు రోజుల క్రితం గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి కూడా విమానం ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో టంబిన్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విమానం గల్లంతుకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించారు. ఏఎన్ - 32 విమానం గల్లైంతన రోజు మధ్యాహ్నం ఓ కొండ ప్రాంతంలో దట్టమైన పొగ రావడాన్ని గమనించినట్లు చెప్పారు. సియాంగ్ జిల్లా మోలో గ్రామానికి సమీపంలోని ఓ కొండ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగ రావడం తాము చూసినట్లు గ్రామస్థులు వెల్లడించారు. దాంతో అధికారులు ఆ గ్రామస్థులు చెప్పిన మార్గంలో అన్వేషించేందుకు నిర్ణయించుకున్నారు. అయితే గల్లంతైన విమానం ఆచూకీ కనిపెట్టడం కోసం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ వెస్ట్ సియాంగ్, లోయర్ సియాంగ్, షివోమి జిల్లా డిప్యూటి కమిషనర్ల అధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూడు టీమ్లు విమానం తప్పిన పోయిన మార్గంలోని కొండ ప్రాంతాల్లో అణువణువు గాలిస్తున్నాయి. 13 మందితో బయలుదేరిన భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్32 రకం విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమిషాల అనంతరం గల్లంతైంది. అస్సాంలోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్ప్రదేశ్లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విమానం ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. -
వాయుసేన చేతికి కొత్త అస్త్రం
న్యూఢిల్లీ: భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ను భారత వాయుసేన (ఐఏఎఫ్)కు అప్పగించింది. 2015 సెప్టెంబర్లో అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థతో భారత వాయుసేన 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే మొదటి హెలికాప్టర్ను అరిజోనాలోని మెసాలో భారతవాయుసేనకి అమెరికా అప్పగించిందని వాయుసేన అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ తెలిపారు. జూలైలో మొదటి హెలికాప్టర్ ఇండియాకు రానుంది. 2017లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్ సంస్థతో రూ.4,168 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అపాచీ హెలికాప్టర్ రాకతో భారత వాయుసేన ఆధునీకరణ వైపు మరో ముందడుగు పడిందన్నారు. ఐఏఎఫ్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ హెలికాప్టర్ తయారైందని, పర్వత ప్రాంతాల్లో దీని సామర్థ్యం గణనీయమైన స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. శత్రువులపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగల సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉందని, భూమిపై, గగనతలంలో కూడా దాడులు చేయగలదని భారత వాయుసేన అధికారి ఒకరు తెలిపారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టం సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నాయి. -
ఆ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలుంటే..
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే, అవి పాకిస్తాన్కు చెందిన యుద్ధ విమానాల్లో సగం కూల్చివేసి ఉండేవని భారత మాజీ ఐఏఎఫ్ చీఫ్, ఎయిర్ మార్షల్ ఏవై టిప్నిస్ అభిప్రాయపడ్డారు. ఏవై టిప్నిస్ మంగళవారం ఆజ్తక్ ఛానల్ నిర్వహించిన భద్రతా సదస్సులో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లోని శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్లపై దాడిచేయడమే పాకిస్తాన్కు చెందిన 24 యుద్ధ విమానాల లక్ష్యమన్నారు. మొన్న టెర్రరిస్టు స్థావరాలపై దాడి జరిగినపుడు ఇండియా దగ్గర రాఫెల్ యుద్ధవిమానాలుంటే, కనీసం 12 పాకిస్తాన్ యుద్ధవిమానాలు నేలకూలేవని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటపుడు ఇండియా నిశ్శబ్దంగా కూర్చోకూడదని, ప్రభుత్వం మారినప్పుడల్లా దాడుల ప్రణాళిక మారకూడదని హితబోధ చేశారు. దాడులు సరైన దిశలో జరగాలని సూచించారు. అలాగే పాకిస్తాన్తో దౌత్య, సాంస్కృతిక, క్రీడా సంబంధాలను తెంచుకుని వారిపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని కోరారు. ఇదే సదస్సులో పాల్గొన్న మాజీ ఆర్మీ జనరల్ బిక్రం సింగ్ మాట్లాడుతూ.. ఇండియా, పాకిస్తాన్ ప్రధాన స్థావరంపై దెబ్బకొట్టాలని, అప్పుడే పాకిస్తాన్ మాటపై నిలబడుతుందని వ్యాక్యానించారు. పాకిస్తాన్లో టెర్రరిజం అనేది ఉద్యోగం లాంటిదని, అక్కడి ప్రభుత్వం సరైన విధంగా చర్యలు తీసుకుంటేనే టెర్రరిజం అంతమవుతుందని అన్నారు. -
ఉగ్ర నీడలను పసిగడుతూ పంజా..
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగిన నేపథ్యంలో పాకిస్తాన్లోని బాలకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో 263 మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. మృతుల్లో దాదాపు 18 నుంచి 20 మంది ఉగ్రవాదులకు సాయం అందించేందుకు వచ్చిన క్షురకులున్నారని సమాచారం. ఉగ్రవాదుల కదలికలను ఐదు రోజుల పాటు గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టిన తర్వాత ఫిబ్రవరి 26న తెల్లవారుజామున మెరుపు దాడులతో విరుచుకుపడినట్టు వైమానిక దళ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్ర కదలికలపై ఆరా.. బాలకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిబిరంలో నాలుగు భవనాల్లో సమావేశమైన టెర్రరిస్టుల సంఖ్యపై ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు వెల్లడించాయి. దౌరా ఈ మౌలాత్ అనే భవనంలో 30 మంది టెర్రరిస్టులు సమావేశమయ్యారని, ఫిబ్రవరి 25న బాలకోట్లో ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక దౌరా ఈ ఖాస్ అనే భవనంలో ఫిబ్రవరి 26న 91 మంది ఉగ్రవాదుల భేటీలో భారత్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు 25 మంది ఉగ్రవాదులకు ఈ శిబిరంలో శిక్షణ కోసం ఎంపిక చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇక ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఐదు రోజుల్లో ఫిబ్రవరి 19న తిరిగి బాలకోట్లోని ఉగ్ర స్ధావరానికి టెర్రరిస్టులు చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇదే స్ధావరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లను ఈ శిబిరానికి జైషే చీఫ్ పంపినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల పసిగట్టాయి. ఉగ్ర కదలికలపై అనుక్షణం నిఘా వేసి ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగించేలా మెరుపు దాడులతో వైమానిక దళం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున విరుచుకుపడింది. -
‘అభినందన్ విమానాన్ని కూల్చింది వీరే’
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. భారత్ చర్యలతో రెచ్చిపోయిన పాక్ మన సైనిక స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు యత్నించింది. ఈ దాడిలో మిగ్ 21 యుద్ధం విమానం కూలిపోగా.. అభినందన్ వర్థమాన్ పాక్ భూభాగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కానీ పాక్ మాత్రం రెండు భారత యుద్ధ విమానాలకు కూల్చినట్లు చెప్పుకుంటుంది. తాజాగా భారత యుద్ధ విమానాలను కూల్చిన ఫైటర్ పైలెట్లను గుర్తించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పాక్ పార్లమెంట్లో వెల్లడించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ వైమానిక దళం రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేసింది. దానిలో ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చిన వ్యక్తి స్వ్కాడ్రన్ లీడర్ హసన్ సిద్దిఖీ కాగా మరొకరు.. నమౌన అలీ ఖాన్గా గుర్తించమ’న్నారు. అయితే ఈ దాడిలో పాక్ పైలెట్ హసన్ సిద్దిఖీ మరణించాడని ఖురేషి తెలిపాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన సిద్దిఖీకి పాక్ పార్లమెంట్ నివాళులర్పించింది. అంతేకాక తాము కూల్చిన రెండు భారత యుద్ధ విమానల్లో ఒకటి జమ్మూకశ్మీర్లో కూలగా మరోటి పాక్ ఆక్రమిత్ కశ్మీర్ భూభాగంలో కూలిట్లు గతంలో పాక్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్) -
80 శాతం బాంబులు లక్ష్యాన్ని తాకాయి: ఐఏఎఫ్
-
‘బాలాకోట్’ సాక్ష్యాలివిగో!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో వాటిల్లిన నష్టంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఐఏఎఫ్ అందుకు సంబంధించిన ఆధారాల్ని కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 26న తాము జారవిడిచిన బాంబుల్లో 80 శాతం అనుకున్న లక్ష్యాల్ని తాకినట్లు వైమానిక దళం పేర్కొంది. సంబంధించిన ఉపగ్రహ, రాడార్ చిత్రాలను సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాడులకు వైమానిక దళం వార్హెడ్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఈ వివరాల్ని బుధవారం కొన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. బాంబులు ఉగ్రవాదుల ఆవాసాల పైకప్పులను చీల్చుకుంటూ వెళ్లి అంతర్గతంగా అపార నష్టం మిగిల్చినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా జరిపిన వైమానిక దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ నష్టం అంత తీవ్రస్థాయిలో లేదని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అటవీ ప్రాంతంలో చెట్లు దెబ్బ తినడం తప్ప పెద్దగా నష్టమేమీ కలగలేదని పాకిస్తాన్ ప్రకటించుకుంది. కాగా, భారత వైమానిక దళం దాడి తరువాత జైషే మహ్మద్ భవనాలకు అనుకున్నంత భారీ నష్టం జరగలేదని ప్లానెట్ ల్యాబ్స్ అనే అమెరికన్ ప్రైవేటు సంస్థ ఓ ఉపగ్రహ చిత్రం విడుదలచేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. బాలాకోట్ ఆపరేషన్పై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎందరు ఉగ్రవాదులు హతయ్యారో అధికారిక సమాచారం వెల్లడించాలని ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నాయి. వైమానిక దళ చర్యను రాజకీయం చేస్తున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ నేపథ్యంలో వైమానిక దాడులతో నెరవేరిన లక్ష్యాలపై ఆధారాలతో వైమానిక దళం ప్రభుత్వానికి నివేదిక అందించడం గమనార్హం. 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు.. బాలాకోట్లో జారవిడిచిన బాంబులు లక్ష్యానికి దూరంగా పడ్డాయన్న ఆరోపణల్ని తప్పని నిరూపిస్తూ వైమానిక దళం సమగ్ర వివరాల్ని క్రోడీకరించింది. దాడి తర్వాత జైషే శిబిరానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. భారత గగనతలంలో ఎగురుతున్న విమానం తీసిన 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు, రాడార్ ఇమేజ్లను కేంద్రానికి అందజేసినట్లు విశ్వసనీయవర్గాల తెలిపాయి. దాడిలో మిరాజ్ విమానాలు ఇజ్రాయెల్ స్పైస్ బాంబుల్ని అత్యంత కచ్చితత్వంతో జారవిడవగా, అందులో 80% అనుకున్న లక్ష్యాల్ని తాకాయని తెలిపాయి. మిగిలిన 20% బాంబుల విజయ శాతం కచ్చితంగా ఎంతని అంచనా వేయలేకపోయామని చెప్పాయి. -
‘మా చిన్నారి అభినందన్ ఎలా ఉన్నాడు’
న్యూఢిల్లీ : గడిచిన మూడు రోజులు దేశవ్యాప్తంగా అభినందన్ నామస్మరణే. అతనికి సంబంధించిన వార్తలతోనే ఈ మూడు రోజులు తెల్లవారింది.. చీకటి పడింది. శత్రు సైనికులకు చిక్కినప్పడు అతడు చూపిన తెగువ వల్ల ఒక్కసారిగా నేషనల్ హీరో అయ్యారు అభినందన్. ‘ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరవలేదని.. రియల్ హీరో’ అంటూ అభినందిస్తున్నారు జనాలు. తమ భూభాగంలో దిగిన అభినందన్ను పాకిస్తాన్ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద భారత్కు అప్పగించింది. అయితే ఈ మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో అభినందన్ గురించి వచ్చే మెసేజ్ల ప్రవాహానికి అంతే లేకుండా పోయింది. అభినందన్ ధైర్య సాహసాలకు గౌరవంగా.. పుట్టిన బిడ్డలకు అతని పేరు పెడుతున్నారు. ప్రస్తుతం ట్విటర్ నిండా ఇలాంటి మెసేజ్లే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వింగ్ కమాండర్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. ‘‘అభినందన్’ అనే ఈ సంస్కృత పదానికి నేడు కొత్త అర్థం రూపొందింది’ అంటూ ప్రశంసించారు. శత్రు దేశానికి చిక్కిన అభినందన్ను తిరిగి తీసుకురావడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ అభినందన్ను శుక్రవారం వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. -
‘పాక్ జవాన్లే నన్ను రక్షించారు’
ఢిల్లీ: తాను కిందపడ్డ సమయంలో అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారని, ఆ గందరళగోళంలో తన పిస్టల్ కింద పడిపోయినట్లు పాక్ చేతికి చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ తెలిపారు. ఈ మేరకు కొత్తగా విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. నన్ను నేను రక్షించుకోవడానికి పరుగులు తీశానని, అల్లరి మూక తన వెంట పడినట్లు పేర్కొన్నారు. వాళ్లు చాలా ఆవేశంలో ఉన్నారని, అదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు వచ్చారని, వాళ్లే నన్ను మూక నుంచి రక్షించినట్లు అభినందన్ తెలిపారు. తర్వాత వారు తనను వాళ్ల యూనిట్కు తీసుకెళ్లారు.. అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్నారు. అక్కడే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారని చెప్పారు. నా విషయంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రొఫెషనల్గా వ్యవహరించిందని అభినందన్ వెల్లడించారు. -
వాఘాకు బయలుదేరిన అభినందన్
-
వాఘా వద్ద భద్రత కట్టుదిట్టం
-
యోథుడు వస్తున్నాడు
-
భారత్ ఒత్తిళ్లకు తలొగ్గిన పాకిస్థాన్
-
అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా
-
పైలట్ను హింసించడం అమానుషం : భారత్
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్కు పట్టుబడ్డ భారత పైలట్ అభినందన్ను సురక్షితంగా అప్పగించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. తమ పైలట్కు ఎలాంటి హాని తలపెట్టకుండా అప్పగించే బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. పైలట్ అభినందన్ను హింసించడం అమానుషమని పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ పైలట్ను చూపడం జెనీవా ఒప్పందానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్త చేసింది. ఇప్పటికే పలుమార్లు ఉగ్ర క్యాంపుల గురించి పాకిస్తాన్కు సమాచారమిచ్చామని, పాక్ చర్యలు తీసుకోనందునే దాడి చేశామని పేర్కొంది. తాము ఉగ్రవాదులపై దాడి చేశామే తప్ప పాక్ ప్రజలపై కాదని స్పష్టం చేసింది. (భారత పైలట్కు పాక్ చిత్రహింసలు!) బుధవారం ఉదయం పాక్ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. వాటిని తిప్పి కొట్టే క్రమంలో భారత పైలట్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్ ఓ విడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో స్థానికులు అభినందన్పై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. భారత పైలట్ పట్ల పాకిస్తాన్ వ్యవహరించిన తీరును భారత ప్రభుత్వం తప్పుపట్టింది. యుద్దంలో చిక్కిన సైనికునిపై దాడి చేసి పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లఘించిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా బుధవారం సాయంత్రం అభినందన్కు సంబంధించి మరో వీడియోను పాక్ విడుదల చేసింది. వీడియోలో అభినందన్ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుందని అభినందన్ తెలిపారు. తనపై స్థానికులు దాడి చేస్తే పాకిస్తాన్ సైన్యమే కాపాడిందని చేప్పారు. (ఎవరీ విక్రమ్ అభినందన్?) ఇది చదవండి : భారత పైలెట్ అభినందన్ క్షేమం! -
భారత పైలెట్ అభినందన్ క్షేమం!
ఇస్లామాబాద్ : భారత పైలట్ విక్రమ్ అభినందన్కు సంబంధించి మరో వీడియోను పాక్ విడుదల చేసింది. భారత యుద్ధ విమానం మిగ్-21 తమ భూభాగంలో కూలినప్పుడు పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకిన ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పాక్ వెల్లడించింన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అభినందన్ను ప్రశ్నలు అడుగుతూ తీసిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అభినందన్ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుందని అభినందన్ తెలిపారు. మీ లక్ష్యం ఏంటని పాక్ అధికారులు అడిగిన ప్రశ్నకు.. జవాబు చెప్పదలచుకోలేదని పేర్కొన్నారు. విమాన వివరాల కూపీ లాగడాని పాక్ ఆర్మీ అధికారులు ప్రయత్నించగా, అందుకు తానేమీ చెప్పదలచుకోలేదని అభినందన్ చెప్పారు. అభినందన్ గల్లంతైన విషయాన్ని భారత విదేశాంగ ధ్రువీకరించింది. అయితే ఆయన పేరును వెల్లడించలేదు. పాక్ ముందు విడుదల చేసిన వీడియోలో అభినందన్పై దాడి దృశ్యాలు ఉండటంతో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుందన్న నేపథ్యంలో మరో వీడియోను విడుదల చేసినట్టు భావిస్తున్నారు. -
పాకిస్థాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుంది
-
పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్
న్యూఢిల్లీ : భారత వైమానిక దాడులకు ప్రతిదాడిగా పాకిస్తాన్ ప్రయత్నించిందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. ' 3 పాక్ జెట్ విమానాలు భారత గగనతలంలోకి వచ్చాయి. సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు యత్నించింది. అప్రమత్తమైన భారతవైమానిక దళం వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం. ఈ ఘటనలో భారత్కు చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. ఒక పైలట్ జాడ తెలియడం లేదు' అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు. మరోవైపు భారత పైలట్ తమ అధీనంలోనే ఉన్నారంటూ పాక్ ఓ వీడియోను విడుదల చేసింది. ‘నేను వింగ్ కమాండర్ అభినందన్ను. ఐఏఎఫ్ అధికారిని. నా సర్వీసు నెంబర్ 27981’ అని పైలట్ చెప్తున్న అంశాలు ఆ వీడియోలో ఉన్నాయి. వింగ్ కమాండర్ అభినందన్ మిగ్ 21 బైసన్ జెట్లో వెళ్లాడని, ఇప్పటికీ తిరిగి రాలేదని ఐఏఎఫ్ పేర్కొంది. వీడియో ఉన్నది అభినందనా కాదా అనేది తెలియాల్సి ఉంది. -
ఒక పైలట్ జాడ తెలియడం లేదు
-
పాక్ విడుదల చేసిన వీడియో..!
-
వ్యూహాన్ని తిరగరాసిన దాడులు
దాదాపు యాభై ఏళ్ల తర్వాత పొరుగుదేశమైన పాక్ భూభాగంలో వైమానిక దాడులకు తొలిసారిగా పాల్పడిన భారత్ తన వ్యూహాత్మక సంయమనానికి వీడ్కోలు చెప్పింది. దేశ ప్రజానీకం, ప్రపంచ దేశాలు కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారతీయ వాయుసేన తలపెట్టిన సైనికేతర దాడులను సమర్థించాయి. ఉగ్రవాద ముసుగు సంస్థల సాయంతో భారత్ను వెయ్యి ముక్కలు చేసి ఆటాడించవచ్చని ఇన్నాళ్లుగా భావించిన పాక్ సైనిక యంత్రాగానికి గట్టి దెబ్బ తగిలింది కానీ తనను తాను బాధితురాలిగా పేర్కొంటూ అంతర్జాతీయంగా భారత్ను దోషిగా నిలబెట్టేందుకు పాక్ చేసే భవిష్యత్ ప్రయత్నాలను భారత్ సమర్థవతంగా నిలువరించడం చాలా ముఖ్యం. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ ప్రాంతంలో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ నడుపుతున్న అతి పెద్ద ఉగ్రవాద శిక్షణశిబిరాలను భారత వైమానిక బలగానికి చెందిన యుద్ధవిమానాలు ధ్వంసంచేసి క్షేమంగా తిరిగొచ్చాయి. దీంతో మోదీ ప్రభుత్వం ఒక కొత్త వ్యూహా త్మక భద్రతా సూత్రాన్ని ఆవిష్కరించినట్లయింది. వ్యూహాత్మక సంయమనం అని ఇన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన సూత్రాన్ని 5 దశాబ్దాల అనంతరం తొలిసారిగా తోసిపుచ్చిన భారత ప్రభుత్వం, మన భద్రతా వ్యవస్థ మన హద్దుల్ని తిరగరాశాయి. ఈ దాడుల నేపథ్యంలో పుట్టుకొచ్చిన సరికొత్త భావన ఇదే: ‘ప్రభుత్వేతర శక్తులు’ పేరుతో సాగుతున్న పాకిస్తాన్ మిథ్యానాటకం బట్టబయలైపోయింది. సరిగ్గా 12 రోజుల క్రితం పుల్వామాలో సైనికుల కాన్వాయ్పై తలపెట్టిన భీకరమైన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి తామే బాధ్యులమని ప్రకటించిన మసూద్ అజర్ నేతృత్వంలోని జైషేకు భారత్ తగిన బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో 1971 తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు తొలిసారిగా ప్రవేశించాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత వైమానిక బలగాలు నియంత్రణ రేఖను దాటరాదని నాటి ప్రధాని వాజ్పేయి స్పష్టంగా ఆదేశాలిచ్చారు. సాంప్రదాయిక యుద్ధ వ్యూహంలో తొలినుంచీ ముందంజలో ఉన్న భారత్ దాన్ని ఉల్లంఘించి మరింత దూకుడు విధానాలను ఎంతమాత్రం చేపట్టదని పాకిస్తాన్ ఇన్నాళ్లుగా గట్టి నమ్మకంతో ఉండేది. కానీ కశ్మీరులో సైన్యంపై సరికొత్త ఆత్మాహుతి దాడులకు పథక రచన చేస్తున్న ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి భారత వాయుసేన సైనికేతర దాడులకు పూనుకుందని భారత్ నొక్కి చెప్పింది. జైషే మహమ్మద్ వంటి ముసుగు సంస్థలను ఉపయోగించి భార త్ను వెయ్యి ముక్కలు చేసి రక్తమోడించవచ్చని ఇన్నాళ్లుగా పాకిస్తాన్ సైనిక యంత్రాంగం పెట్టుకున్న ప్రధాన విశ్వాసం కూడా మెరుపుదాడుల దెబ్బతో పటాపంచలైపోయింది. పాక్ భూభాగంపై భారత వాయుసేన దాడుల తర్వాత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే పత్రికా ప్రకటన చేశారు. ఏ రకంగా చూసినా అది ఒక ప్రామాణికమైన, అత్యంత స్పష్టమైన, అతి క్లుప్తమైన ప్రకటన. భారత్ తన భూభాగాన్ని సంరక్షించుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్న బాధ్యతాయుతమైన, పరిణతి చెందిన దేశమని ఈ ప్రకటన చాటుకుంది. పౌరులకు, సైనికులకు ఎలాంటి గాయాలు తగలకుండా చూడాలని భారత్ ముందుగానే నిర్ణయించుకుందని అందుకే భారీ స్థాయి నష్టం కలిగించడానికి బదులు ఉగ్రవాదుల శిబిరాలపై మాత్రమే సైనికేతర దాడులు సాగించామని తేల్చి చెప్పింది. తమ దాడుల లక్ష్యం పాకిస్తాన్ కాదని, ఉగ్రవాదులే తమ లక్ష్యమని భారత్ చాలా జాగ్రత్తగా ఈ ప్రకటనలో తెలియపర్చింది. ఇది పాకిస్తాన్కు దౌత్యపరంగా తనను తాను కాపాడుకోవలసిన క్షణం. ఎందుకంటే ఈ దాడులు ఇరుదేశాల మధ్య యుద్ధానికి ప్రేరేపించేవి కానే కావు. నేను జర్నలి స్టుగా మన జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై 20 ఏళ్లుగా దృష్టిపెడుతున్నాను. శాంతి యుత అణు విస్ఫోటన అనే మన విధానానికి ప్రస్తుత దాడులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని కచ్చితంగా చెప్పగలను. ఉగ్రవాదులపై చర్యలను భారత్ ముందునుంచీ కొనసాగిస్తూ వచ్చిందని, పాకిస్తాన్ ప్రభుత్వం 2004 నుంచి మాత్రమే తన భూభాగంలో ఉంటున్న ఉగ్రవాదులపై చర్యలకు కట్టుబడతానని ముందుకొచ్చిందని గోఖలే తన ప్రకటనలో నొక్కి చెప్పారు. మరోవైపున ఈ సరికొత్త భద్రతా వ్యూహాన్ని, మునుపెన్నడూ చూడనివిధంగా భారత్ సంకల్పించిన ప్రతీకార చర్యలను దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ నాయకులు ముక్తకంఠంతో స్వాగతించారు. మరోవైపున భారత్ తన భూభాగంలో చెప్పాపెట్టకుండానే దురాక్రమణ దాడికి పాల్పడిందని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. దీనికి బదులుగా సరైన సమయంలో, సరైన ప్రాంతంలో స్పందిస్తానని పాక్ ప్రకటించింది. కానీ పాక్ సన్నిహిత దేశంగా ఉంటున్న చైనా కూడా భారత్కు ఎత్తుగడలపరమైన మద్దతును ప్రకటిస్తూనే ఇరుదేశాలూ సంయమనం పాటించాల్సిందిగా పిలుపునిచ్చింది. కాగా, పాక్ భూభాగంలోకి భారత్ ప్రవేశించడంపై చైనా ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడం గమనార్హం. పాక్ భూభాగంలో భారత వాయుసేన దాడులను చాలా దేశాలు సమర్థించిన నేపథ్యంలో పాక్కి ఉన్నదల్లా ఒకే అవకాశం మాత్రమే. భారత్తో శాంతి ఒప్పందాలకు ప్రయత్నించడం లేక మరింత రెచ్చగొట్టే దాడులకు పూనుకోవడం. జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్ నిర్వహిస్తున్న తరహా జిహాదీ సమరాలని అది ఇంకెంత కాలమో కొనసాగించలేదు. గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మసూద్ అజర్ బావమరిది ఉస్తాద్ గౌరీ భారత వాయుసేన దాడిలో మరణించినట్లు తెలుస్తోంది. చివరగా.. పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసిన భారత్ మిరేజ్ యుద్ధ విమానాలు నిమిషాల్లోపే తిరిగి వచ్చాయి కానీ అవి భారత భద్రతకు సంబంధించిన ఆలోచనాతీరును, దాని వ్యూహాన్ని శాశ్వతంగా మార్చివేశాయనే చెప్పాలి. వ్యాసకర్త: స్వాతి చతుర్వేది, రచయిత, జర్నలిస్టు (ఎన్డీటీవీ సౌజన్యంతో) -
‘కోట్ల మంది ఆగ్రహం, కసి ఆ దాడుల్లో కనిపించాయ్’
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన చేపట్టిన వైమానిక దాడులపై ఆరెస్సెస్ స్పందించింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల వీరమరణం భారత్లో తీవ్ర ఆగ్రహం, ఆందోళన పెల్లుబికిందని కోట్లాది భారతీయుల ఆగ్రహాన్ని నేటి వైమానిక దాడులు ప్రతిబింబించాయని భారత వాయుసేనను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో ప్రశంసించింది. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రదాడులతో యావత్ దేశం తీవ్ర ఆగ్రహం, ఆందోళనలో మునిగిపోయిందని, వైమానిక దాడులతో పాక్లోని జైషే ఉగ్రశిబిరాలను మట్టుబెట్టడం ద్వారా కోట్లాది భారతీయుల ఆగ్రహం, ఆందోళనలను సైన్యం శత్రువుపై విరుచుకుపడుతూ నేరుగా ప్రతిబింబించిందని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, పుల్వామా ఉగ్ర దాడి అనంతరం ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆరెస్సెస్ చీఫ్ సురేష్ భయ్యాజీ జోషీ డిమాండ్ చేశారు. -
సర్జికల్ స్ట్రైక్ - 2 జరిగిందిలా..!
సాక్షి, న్యూఢిల్లీ : 40 మంది పైగా భారత సైనికులను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై భారత్ తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకుంది. అత్యాధునిక మిరాజ్ 2000 యుద్ధ విమానాల ద్వారా 1000 కిలోలబాంబులను ఉగ్ర స్థావరాలపై జార విడిచారు. దీంతో వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ చెబుతోంది. దీనిని సర్జికల్ స్ట్రైక్ 2గా వర్ణిస్తూ యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారతవాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకులు, సీనీ ప్రముఖులు, క్రీడాకారులు.. ప్రతి ఒక్కరు ఈ దాడిపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పక్కా ప్లాన్తోనే భారత్ ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. 2016 సెప్టెంబరులో కశ్మీర్లోని ఉడి సైనిక శిబిరంపై ఉగ్రదాడికి ప్రతీకారకంగాభారత్ తొలిసారిగా సర్జికల్ స్ట్రైక్ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపి ముష్కరులను మట్టుబెట్టింది. అయినా ఉగ్రవాదు ఆడగాలు ఆగలేదు. దీంతో ఈ సారి పాక్కు గట్టిగా బదులిచ్చింది. తమ దేశంపై భారత్ దాడి చేయాలని చూస్తే ప్రతిదాడికి తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ..భారత్ వ్యూహాత్మకంగా మెరుపుదాడులకు దిగి జైషే ఏ మహ్మద్ ఉగ్రవాదులకు బుద్ధిచెప్పింది.(బాంబుల వర్షం కురిసేటప్పుడు మోదీ అక్కడే ఉన్నారా..!) పక్కా ప్లాన్తో.. పుల్వామా ఉగ్రదాడిని భారత్ సిరియస్గా తీసుకుంది. భారత జవాన్ల మరణం వృధా కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. పుల్వామ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే ప్రధాన మంత్రి నేతృత్వంతో కేంద్ర పెద్దలు భేటీ అయ్యారు. 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న పాక్కు ఎలా బుద్ది చెప్పాలన్న విషయంపై చర్చించారు. ముష్కర మూకల కోరలు పీకేందుకు భారత్ పక్కా ప్రణాళిక రచించింది. ఈ దాడి బాధ్యతలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు అప్పగించారు. ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలోనే దాడులు చేయలాని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాల సమాచారాన్ని సేకరించారు. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఒక్కో స్థావరంలో ఎంత మంది ఉన్నారో అంచనా వేశారు. వివిధ దేశాల గూఢచర్య సంస్థలలో సమన్వయం చేసుకున్న భారత్.. జైష్ ఏ మహ్మద్కు సంబంధించిన టాప్ కమాండర్ల ఉనికిని గుర్తించింది. వ్యూహం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో పాక్ భూభాగంలోని బాలాకోట్లో గల జైష్ ఏ మహ్మద్ ఉగ్ర స్థావరంపై భారత వాయుసేన విరుచుకుపడింది. (12 రోజుల ముందే సర్జికల్ దాడులు జరిగి ఉంటే..) జైషేకు ఇది గట్టి ఎదురుదెబ్బే ఇక భారత్ లక్ష్యంగా చేసుకున్న బాలాకోట్ ఉగ్ర స్థావరం జైష్ ఏ మహ్మద్కు చెందిన అతిపెద్దది. జైషే అధినేత మసూద్ అజార్ బావమరిది మౌలానా యూసఫ్ అజార్ ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ శిబిరంలో ఉగ్రవాదులకు ఆత్మాహుతి దాడిలో శిక్షణ ఇస్తుంటారు. భారత్ జరిపిన దాడులలో కశ్మీర్ ఆపరేషన్ అధినేత ముఫ్తి అజార్ ఖాన్ కశ్మీరీ, జైషే అధినేత మసూద్ అజార్ సోదరుడు ఇబ్రహీం అజార్, మౌలానా తల్హా సైఫ్, మౌలానా అమ్మార్తో సహా వందల సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇది జైషేకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఆరు బాంబులతో మెరుపు దాడి! భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలపై12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నేలమట్టం చేసింది. ఈ దాడిలో వైమానిక దళం ఆరు బాంబులను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న అతిముఖ్యమైన యుద్ధవిమానాల్లో మిరాజ్ 2000 ఒకటి. 1985లో ఇవి భారత వైమానిక దళంలో చేరాయి. వీటిని దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది. అప్పుడు వీటికి ‘వజ్ర’ అని నామకరణం చేశారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటిని ఉపయోగించింది. ఈ యుద్ధంలో భారత దేశం విజయం సాధించడానికి కారణం మిరాజ్ 2000 విమానాలే అని చెప్పవచ్చు. (ఇప్పుడు నా భర్త ఆత్మకు శాంతి దొరికింది) -
నా భర్త ఆత్మకు ఇప్పుడు శాంతి దొరికింది
సాక్షి, చెన్నై : పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. భారత వైమానికి దాడులపై యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలు ఈ దాడి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశం గర్వించేలా భారత వైమానిక దళాలు మెరుపుదాడులు చేశాయని ఉగ్రదాడిలో మృతి చెందిన తమిళ సైనికుడు సుబ్రహ్మాణ్యం భార్య కృష్ణవేణి హర్షం వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడులతో తన భర్త ఆత్మకు శాంతి కలిగిందన్నారు. దేశం గర్వించేలా చేసిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. (బాంబుల వర్షం కురిసేటప్పుడు మోదీ అక్కడే ఉన్నారా..!) -
ఐఏఎఫ్ను చూసి గర్వపడుతున్నాం: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రమూక శిబిరాలపై మెరుపు దాడులు జరిపిన భారత వైమానిక దళాన్ని(ఐఏఎఫ్) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఉగ్రవాదులను తుదముట్టిస్తూ వీరోచితంగా దాడులు జరిపిన ఐఏఎఫ్ పైలట్లకు అభినందనలు తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్-2ను విజయవంతంగా నిర్వహించిన భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నట్టు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. Congratulations to @IAF_MCC and its fearless pilots for their commendable action against the terrorists. We are proud of you. #Surgicalstrike2 — YS Jagan Mohan Reddy (@ysjagan) 26 February 2019 చదవండి: పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్ -
‘మోదీ వాయు దళాన్ని అమ్మేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. భారతీయ వాయు దళాన్ని (ఐఏఎఫ్) ఆయన అమ్మేశారని, తన స్నేహితుడు, వ్యాపారవేత్త అనిల్ అంబానీకి రూ. 30 కోట్లను చౌర్యం చేసి కట్టబెట్టడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువక్రాంతి మేళా యాత్ర పేరిట తల్కతోర స్టేడియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రభుత్వంలోనే అసమ్మతి ఉందని, దీంతో ప్రధాని మోదీకి నిద్ర పట్టడం లేదని ఆరోపించారు. తాను ప్రధాని మోదీని మూడు, నాలుగు ప్రశ్నలు అడిగానని, ఆయన అటు, ఇటు, క్రింద, పైన చూశారని, అయితే తనవైపు, తన కళ్లలోకి కళ్లు పెట్టి మాత్రం చూడలేకపోయారని అన్నారు. ‘‘కాపలాదారు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయారు’’ అని విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా జరిగిన సంఘటనను రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై రాహుల్ గాంధీ ప్రసంగించినపుడు చెప్పిన మాటలను ప్రస్తావించారు. దొంగతనం చేసినవాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరన్నారు. దేశాన్ని విభజించడమే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈశాన్యంతోపాటు కశ్మీర్ను రావణకాష్టం చేసేశారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు కనీస ఆదాయ హక్కు కల్పిస్తామంటూ రాహుల్ హామీ ఇచ్చారు. ఆ ఆదాయాన్ని నేరుగా పేదల ఖాతాల్లో వేస్తామని, ఇందులో మధ్యవర్తులెవరూ ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. -
ఏ ముప్పునైనా ఎదుర్కొంటాం
న్యూఢిల్లీ: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తలెత్తగల సవాళ్లపై భారత్ అప్రమత్తంగా ఉందని వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా తెలిపారు. అత్యవసర సమయాల్లో మిత్రదేశాలకు సాయం చేసేందుకు భారత్ ఎల్లప్పుడు ముందుంటుందని వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనోవా మాట్లాడుతూ.. ‘దేశానికి సరిహద్దుల నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్కు అపరిష్కృత సరిహద్దు సమస్యలు, ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల కారణంగా ప్రధాన ముప్పు ఎదురవుతోంది. సరిహద్దు అవతల నుంచి ఎదురయ్యే ఉగ్రముప్పును సైతం ఐఏఎఫ్ సమర్థవంతంగా ఎదుర్కొనగలదు. పొరుగున ఉన్న దేశాలు(చైనా, పాక్) ఆయుధ వ్యవస్థల్ని శరవేగంగా ఆధునీకరించడం, మౌలిక వసతులను మెరుగుపర్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు దీటుగా మిగ్–29, జాగ్వార్, మిరేజ్–2000లను ఆధునీకరిస్తున్నాం. అలాగే 83 తేజస్, 36 రఫేల్ ఫైటర్జెట్లను కొనుగోలుచేస్తున్నాం’ అని తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ చురుకైన పాత్ర పోషించడంపై స్పందిస్తూ..‘ఈ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాలపై భారత్ పూర్తి అప్రమత్తంగా ఉంది. అత్యధిక సీ–17 గ్లోబల్ మాస్టర్ యుద్ధ విమానాలు వినియోగిస్తున్న జాబితాలో ఐఏఎఫ్ రెండోస్థానంలో ఉంది. వాయుసేనకు 42 స్క్వాడ్రన్ల యుద్ధవిమానాలు కావాల్సి ఉండగా 32 స్క్వాడ్రన్లు ఉన్నాయన్నారు. -
అస్త్ర క్షిపణి ప్రయోగం సక్సెస్
బాలాసోర్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన, గగనతలం నుంచి గగనతలంలోని సుదూర లక్ష్యాలను ఛేదించగల ‘అస్త్ర’ క్షిపణిని శాస్త్రవేత్తలు బుధవారం విజయవంతంగా పరీక్షించారు. పశ్చిమబెంగాల్లోని కలైకుండా ఐఏఎఫ్ స్థావరం నుంచి సుఖోయ్–30యుద్ధవిమానం నుంచి దీన్ని ప్రయోగించగా నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)తో పాటు మరో 50 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఈ క్షిపణి రూపకల్పనలో పాల్గొన్నాయి. ఈ ఆయుధాన్ని ప్రయోగించేందుకు వీలుగా సుఖోయ్–30 విమానాన్ని హాల్ ఆధునీకరించింది. 154 కిలోల బరువు, 3.57 మీటర్ల పొడవున్న అస్త్ర క్షిపణి 20 కి.మీ నుంచి 110 కి.మీ దూరంలో ఉన్న గాల్లోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 15 కేజీల వార్హెడ్ను మోసుకుని 4.5 మ్యాక్(గంటకు 5556.6 కి.మీ) వేగంతో వెళ్తుంది. -
2021 డిసెంబర్లో గగన్యాన్
సాక్షి బెంగళూరు: భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపే ‘గగన్యాన్’ ప్రయోగాన్ని 2021, డిసెంబర్లో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని చేపట్టేముందు పలు పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా 2020లో ఓసారి, 2021లో మరోసారి మానవరహిత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే క్రూ సపోర్ట్ సిస్టమ్స్, సర్వీస్ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్ వంటి పలు సాంకేతికతలను ఇంకా అభివృద్ధి చేయాల్సిఉందని శివన్ పేర్కొన్నారు. 2022 నాటికి భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని ప్రధాని మోదీ ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివన్ మాట్లాడుతూ.. అంతరిక్ష యాత్రకు ఎంతమందిని పంపాలి? అక్కడ ఎన్నిరోజులు ఉండాలి? అన్న విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గగన్యాన్లో పాల్గొనేందుకు వ్యోమగాములను ఇంకా ఎంపిక చేయలేదని వెల్లడించారు. వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ భారత వాయుసేన(ఐఏఎఫ్)స్వీకరించిందనీ, ఓసారి ఎంపిక పూర్తయితే 2 నుంచి 3 సంవత్సరాల పాటు వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు వ్యోమగాములను ఏడు రోజులపాటు అంతరిక్షంలోకి పంపే సామర్ధ్యం తమకుందని శివన్ చెప్పారు. ఈ ప్రయోగం చేపట్టేందుకు మిషన్ కంట్రోల్, ట్రాకింగ్, లాంచ్ప్యాడ్ నిర్మాణం వంటి పనుల్లో ప్రైవేటు రంగ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. మానవసహిత యాత్రలో పాల్గొనే వ్యోమగాములకు శిక్షణ కోసం ఇతర దేశాల సాయం కూడా తీసుకుంటామని మరో ప్రశ్నకు శివన్ సమాధానమిచ్చారు. -
నాసిక్ వద్ద కుప్పకూలిన సుఖోయ్ యుద్ధవిమానం
-
సౌత్ ఇండియా నుండి తొలి మహిళా యుద్ధ విమాన పైలట్
-
చైనీస్ జెట్ ఫైటర్లకు చెక్..
సాక్షి, న్యూఢిల్లీ : సుఖోయ్ 30ఎమ్కేఐను ఈశాన్య భారత్లో కేంద్రీకరించడం ద్వారా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఎత్తుగడలను నిలువరించవచ్చని భారత రక్షణ పరిశోధన విభాగం తెలిపింది. ఇందుకోసం భారత వాయుసేన సుఖోయ్ సూ- 30ఎమ్కేఐ రాడార్ను వినియోగించనుంది. తద్వారా చైనాకు చెందిన చెంగ్డూ జే- 20 ఫైటర్ల కదలికలను గమనించడం ద్వారా ప్రమాదాలను ముందే అరికట్టవచ్చని భావిస్తోంది. రష్యా సాంకేతిక సాయంతో సుఖోయ్ 30ఎమ్కేఐను నవీనీకరించడం ద్వారా ఒకేసారి 30 లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా సుఖోయ్ సూ- 30ఎమ్కేఐను తీర్చిదిద్దనుంది. భారత వాయుసేనాధిపతి బీరేందర్ సింగ్ ధనోవా మాట్లాడుతూ.. సుఖోయ్ సూ- 30ఎమ్కేఐ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదని పేర్కొన్నారు. తద్వారా జే 20 ఫైటర్ల కదలికలను గమనించవచ్చని తెలిపారు. ఎమ్కేఐని నవీనీకరించడం ద్వారా భారత వాయు వ్యవస్థ మరింత బలోపేతం అయిందని తెలిపారు. గతంలో చైనాకు చెందిన ఎయిర్క్రాఫ్ట్లు అత్యధిక ఎత్తులో ప్రయాణించడం వల్ల లక్ష్యాలను ఛేదించడం కష్టతరమయ్యేదని.. కానీ ప్రస్తుతం ఆ సమస్యని అధిగమించామని వ్యాఖ్యానించారు. గగన్ శక్తి 2018 ఎవరికీ వ్యతిరేకం కాదు.. 13 రోజుల పాటు నిర్వహించిన గగన్ శక్తి- 2018 ప్రత్యేకంగా ఏ దేశాన్ని ఉద్దేశించింది కాదని ధనోవా స్పష్టం చేశారు. ఈ ఏడాది అనుకున్న దాని కన్నా ఎక్కువ లక్ష్యాలను సాధించామని ఆయన తెలిపారు. గగన్ శక్తి వార్గేమ్లో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెట్ స్వదేశీ పరిఙ్ఞానంతో కొత్తగా రూపొందించిన తేజస్ సూపర్సోనిక్ ఫైటర్ జెట్ను కూడా పరీక్షించినట్లు తెలిపారు. -
కుప్పకూలిన వాయుసేన హెలికాప్టర్
కేదార్నాథ్, ఉత్తరాఖండ్ : భారతీయ వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ ఉత్తరాఖండ్లో కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ఉన్న నలుగురు గాయాలపాలయ్యారు. ల్యాండింగ్ సమయంలో ఐరన్ గిర్డర్ను హెలికాప్టర్ను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. రవాణా అవసరాలకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్ను కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ చేస్తుండంగా ఐరన్ గిర్డర్కు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
కూలిన వాయుసేన హెలికాప్టర్
సాక్షి, భువనేశ్వర్ : ఒడిశా-జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణ ణష్టం జరగలేదు. పైలట్తో పాటు మరొకరు గాయపడ్డగా...వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్లోని కలైకుందా వైమానిక స్థావరం నుంచి రోజు మాదిరిగానే శిక్షణ కోసం బయలుదేరిన విమానం వెనుక భాగం నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు సమాచారం. కాగాప్రమాదానికి కారణం ఏమిటన్నదానిపై స్పష్టత రాలేదని, విచారణ చేపడుతన్నామని అధికారులు తెలిపారు. -
వాయుసేనలోకి 324 తేజస్ ఫైటర్లు
సాక్షి, న్యూఢిల్లీ : 324 తేజస్ ఫైటర్ జెట్లను వాయుసేనలోకి ప్రవేశపెట్టేందుకు భారతీయ వాయుసేన(ఐఏఎఫ్) అంగీకారం తెలిపింది. దీంతో ఎంతోకాలంగా యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల కొరతతో ఇబ్బందిపడుతున్న వాయుసేనకు ఊరట లభించనుంది. దాదాపు మూడు దశాబ్దాల పాటుగా అభివృద్ధి దశలో ఉన్న తేజస్ ఫైటర్ జెట్లు అనుకున్న స్థాయి సాంకేతికతతో సిద్ధం కాలేదు. దాదాపు రూ. 75 వేల కోట్లతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి 123 తేజస్ మార్క్ 1ఏ జెట్లను కొనుగోలు చేసేందుకు ఐఏఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన 201 జెట్లను తేజస్ మార్క్-2 సిద్ధమైన తర్వాత తీసుకుంటామని తెలిపింది. తేజస్ మార్క్ 2ను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దాలని ఐఏఎఫ్ డిమాండ్ చేస్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో), ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లు సంయుక్తంగా తేజస్ మార్క్ 2 అభివృద్ధిపై దృష్టి సారించాయి. ప్రపంచస్థాయి ఫైటర్గా తేజస్ మార్క్ 2ను రూపొందిస్తే 18 స్క్వాడ్రన్ల తేజస్లను తయారు చేసుకోవాలని ఐఏఎఫ్ భావిస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. తేజస్ గంటకు 350-400 కిలోమీటర్ల రేడియస్లో మాత్రమే ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో తనతో పాటు కేవలం 3 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్తోంది. మిగిలిన ప్రపంచ దేశాల వద్ద ఉన్న సింగిల్ జెట్ ఫైటర్లు అన్ని తేజస్ కంటే మెరుగ్గా ఉన్నాయి. స్వీడన్ సింగిల్ ఇంజన్ జెట్ ఫైటర్ గ్రైపెన్-ఈ తేజస్కు మూడు రెట్ల సామర్ధ్యాన్ని కలిగివుంది. గతేడాది జులైలో రెండు తేజస్ ఫైటర్లు ఐఏఎఫ్లో చేరిన విషయం తెలిసిందే. వీటి స్వ్కాడ్రన్కు ‘ఫ్లయింగ్ డాగర్స్ 45’ అని పేరు పెట్టారు. 2018-2020ల మధ్య ఈ స్క్వాడ్రన్లో పూర్తి స్థాయిలో తేజస్ ఫైటర్లు చేరుతాయి. -
చైనాకు కౌంటర్.. రంగంలోకి సుఖోయ్!
డెహ్రాడూన్: సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేదిశగా భారత్ కదులుతోంది. డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ ఎయిర్పోర్టులోని సివిల్ ఎయిర్ఫీల్డ్ను భారత వైమానిక దళం సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు (ఎస్యూ-30ఎంకేఐ) రంగంలోకి దించబోతోంది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఎయిర్ఫీల్డ్ను యాక్టివేట్ చేస్తున్నామని, ఇక్కడినుంచి సుఖోయ్ యుద్ధవిమానాలను రెండు రోజులపాటు (ఫిబ్రవరి 19, 20 తేదీల్లో) నడుపనున్నామని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల్లో ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న అనంతరం రెండు యుద్ధ విమానాలు తిరిగి వైమానిక స్థావరం చేరుకుంటాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఇటీవల గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యంలో పొరుగుదేశానికి దీటైన బదులు ఇచ్చేందుకు భారత్ ఈ చర్య చేపడుతున్నట్టు భావిస్తున్నారు. ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్తో ఉన్న దాదాపు 4వేల కిలోమీటర్ల సరిహద్దులో చైనా సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించింది. చైనా సైన్యం మోహరించిన సరిహద్దుల్లో ఉత్తరాఖండ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశానికి బలమైన సంకేతాలు ఇచ్చేందుకు భారత వైమానిక దళం తన యుద్ధవిమానాలను రంగంలోకి దింపుతుందని భావిస్తున్నారు. -
జెట్ ఇంధన ట్యాంకులను వదిలిన పైలట్లు
జైపూర్ : ఆకాశం నుంచి జెట్ విమాన ఇంధన ట్యాంకులు పడటంతో జైపూర్ నగరానికి సమీపంలోని ఓ గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇంధన ట్యాంకులను భారతీయ వాయుసేనకు అందజేశారు. దీనిపై మాట్లాడిన పోలీసులు.. జెట్ను పరీక్షిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో ముందుజాగ్రత్తగా పైలట్లు ఇంధన ట్యాంకులను జార విడిచారని చెప్పారు. అనంతరం జెట్ను సన్గనేర్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు వివరించారు. గ్రామ సరిహద్దులోని కొండ ప్రాంతంలో ఇంధన ట్యాంకులు పడ్డాయని వివరించారు. కాగా, ఇంధన ట్యాంకులు కింద పడిన సమయంలో పేలుడు సంభవించడంతో.. ఏదో జరిగిపోతోందని భయాందోళనలకు గురైన ప్రజలు పరుగులు తీసినట్లు వెల్లడించారు. కాగా, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన మిగ్ -21కు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఎయిర్పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. -
చైనా బోర్డర్లో ఐఏఎఫ్ చాపర్ క్రాష్ : వీడియో
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్)కు చెందిన హెలికాప్టర్ కుప్పకూలి, ఏడుగురు సిబ్బంది చనిపోయిన ఘటన తాలూకు వీడియో సంచలనంగా మారింది. చైనా సరిహద్దుకు అతి సమీపంలోని యాంగ్చీ(అరుణాచల్ ప్రదేశ్) ప్రాంతంలో అక్టోబర్ 6న ఐఏఎఫ్ ఎమ్ఐ17వీ5 చాపర్ కూలిపోయింది. నాటి ప్రమాదానికి కారణం సాంకేతికలోపమే అని మొదట భావించినా, తాజాగా లభించిన వీడియోనుబట్టి నిర్లక్ష్యమే అసలు కారణంగా వెల్లడైంది. కిరోసిన్ క్యాన్లను విసిరేస్తుండగా.. : ఎక్కువ ఎత్తులోనూ ప్రయాణిస్తూ, ఎక్కువ బరువును మోయగల సామర్థ్యం ఎమ్ఐ17వీ5 చాపర్ సొంతం. అక్టోబర్ 6 ఉదయం పైలట్, కోపైలట్ సహా ఏడుగురు సిబ్బంది బేస్క్యాంపు నుంచి కిరోసిన్ క్యాన్లతో బయలుదేరారు. ఆ కిరోసిన్ డబ్బాలను దగ్గర్లోని మరో స్థావరానికి చేర్చడం వారి ప్రధాన లక్ష్యం. హెలికాప్టర్ గాలిలో ఉండగానే ఒక్కో కిరోసిన్ డబ్బాను పారాచూట్ సాయంతో కిందికి జారవిడిచే ప్రయత్నం చేశారు. అందులో ఒక పారాచుట్ అనూహ్యంగా హెలికాప్టర్ టెయిల్ రోటార్(వెనుక ఫ్యాన్)కు చిక్కుకుపోయింది. దీంతో చాపర్పై పైటల్ నియంత్రణ కోల్పోవడం, క్షణాల్లోనే అది కుప్పకూలడం జరిగింది. ఘటన జరిగిన 23 రోజుల తర్వాత వీడియో వెలుగులోకి రావడం గమనార్హం. దీనిపై ఎయిర్ఫోర్స్, ఆర్మీ అధికారులు స్పందించాల్సిఉంది. కుప్పకూలిన హెలికాప్టర్ : వీడియో (ఎన్డీటీవీ సౌజన్యంతో) -
చైనా బోర్డర్లో ఐఏఎఫ్ చాపర్ క్రాష్
-
మా పనితీరుకు అది నిదర్శనం
సాక్షి, లక్నో: లక్నో-ఆగ్రా హైవేపై మంగళవారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ట్విటర్లో స్పందించారు. హైవేపై భారతీయ వాయు సేన చేసిన విన్యాసాలను ఆయన ప్రశంసించారు. రాజకీయాలకతీతంగా అదంరూ ఇండియన్ ఎయిర్ఫోర్స్ను అభింనందించాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో లక్నో-ఆగ్రా నేషనల్ హైవే.. జాతీయ ఆస్తిగా ఆయన పేర్కొన్నారు. నేడు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్న ఆగ్రా-లక్నో జాతీయ రహదారిని తన హయాంలో అత్యంత పటిష్టంగా నిర్మాణం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ జాతీయ రహదారే నా పనితనానికి నిదర్శనం అని అన్నారు. ఉత్తర్ప్రదేశ్ మౌలిక వసతులు నేడు దేశానికి శ్రేయస్సులు, రక్షణను కలిగించే స్థాయికి చేరినందుకు గర్వంగా ఉందని అఖిలేష్ చెప్పారు. Infrastructure is vital to UP’s prosperity and India’s security. Proud that Agra-Lucknow Expressway is now a National strategic asset. pic.twitter.com/yE2oTz6rm0 — Akhilesh Yadav (@yadavakhilesh) 24 October 2017 तरक़्क़ी के रास्ते, देश की हिफ़ाज़त के वास्ते. वायुसेना को सलाम, जिनसे सुरक्षित है, अपना आसमान. जय हिंद. जय भारत. pic.twitter.com/e66VMMxpH0 — Akhilesh Yadav (@yadavakhilesh) 24 October 2017 -
ఎన్కౌంటర్లో ఇద్దరు ఐఏఎఫ్ కమాండోల మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని బందీపురా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఐఏఎఫ్ కమాండోలు అమరులయ్యారు. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో బుధవారం హజీనా ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. తొలుత ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. తమ శిక్షణలో భాగంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఇద్దరు ఐఏఎఫ్ గరుడ కమాండోలు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. అమరులైన కమాండోలను సార్జెంట్ మిలింద్ కిశోర్, కార్పొరల్ నీలేశ్ కుమార్గా గుర్తించారు. ఈ ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదులు లష్కరేకి చెందిన అలీ అలియాస్ అబు మాజ్, నస్రుల్లా మీర్ అని పోలీసులు తెలిపారు. అలీది పాకిస్తాన్ కాగా మీర్ స్థానికుడేనని చెప్పారు. సంఘటనా స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు, ఒక పిస్టోల్, 12 మేగజైన్లు, 75 రౌండ్ల మందుగుండు సామగ్రి లభ్యమయ్యాయి. కానిస్టేబుళ్ల నుంచి ‘హిజ్బుల్’కు మందుగుండు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు మందుగుండు సామగ్రిని సరఫరా చేశారన్న ఆరోపణలపై కశ్మీర్లో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టయ్యారు. కానిస్టేబుళ్లు అహ్మద్ మాలిక్, నజీర్ అహ్మద్ రహస్యంగా 40 రౌండ్ల మందుగుండు సామగ్రిని అందజేసినట్లు పోలీసులు తెలిపారు. వీరితో పాటు హిజ్బుల్కు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
సర్జికల్ స్ట్రయిక్స్ మేం రెడీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం అనుమతిస్తే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ దనోవ్ గురువారం ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 85వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించారు. మరోదఫా సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే ఐఏఎఫ్ పూర్తిస్థాయిలో భాగం పంచుకుంటుందని ఆయన తెలిపారు. ఎటువంటి పోరాటంలో పాల్గొనేందుకైనా ఇండియన్ ఎయిర్ఫోర్స్ విభాగం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని.. ఆయన ప్రకటించారు. -
కాన్బెర్రా జెట్కు 60 ఏళ్లు
IAFలో మొదటి తరం బాంబర్ ఫ్లైట్ దశాబ్దం కిందట రిటైర్ వార్ ఫీల్డ్లో 50 ఏళ్ల అనుభవం న్యూఢిల్లీ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి కాన్బెర్రా యుద్ధ విమానం ప్రవేశించి నేటికి సరిగ్గా 60 ఏళ్లు. 2007లో రిటైర్మెంట్ తీసుకున్నా.. ఇప్పటికీ కాన్బెర్రా అంటే ఎయిర్ఫోర్స్ సిబ్బందికి ఎంతో అభిమానం. భారతీయ వాయుసేనలో ఇంగ్లీష్ ఎలక్ట్రిక్ కాన్బెర్రా బాంబర్ ఫ్లైట్ది మొదటి తరం అని చెప్పాలి. వాయుసేనలోకి కాన్బెర్రా 1957లో ప్రవేశించింది. మొదటగా 5 స్క్వాడ్రన్ బాంబర్ ఫ్లైట్లుగా చేరాయి. చైనా, పాకిస్తాన్లతో భారత్ చేసిన యుద్ధాల్లో వీటి సేవలు మరువలేనివి. పాకిస్తాన్ యుద్ధ విమానాలకు చిక్కకుండా ఆ దేశంపై కాన్బెర్రా జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. కాంగో అంతర్యుద్ధ సమయంలోనూ ఇవి సేవలు అందించాయి. 1961 గోవా విముక్తి పోరాటంలోనూ, 1965, 1971 జరిగిన పాక్ యుద్ధంలోనూ, 1987లో శ్రీలంక ఆపరేషన్లోనూ, 1988 మాల్దీవుల పోరాటంలోనూ, చివరగా 1999 కార్గిల్ యుద్ధంలోనూ కాన్బెర్రా బాంబర్ ఫ్లైట్లు సేవలు అందించాయి. కాన్బెర్రా ఫ్లైట్లు 2007మే 11న వాయుసేన నుంచి రిటైర్ అయ్యాయి. -
టెన్షనొద్దు.. 210 టన్నుల నోట్లు సిద్ధం!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఒకటో తారీఖు టెన్షన్ దేశాన్ని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న అన్ని సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వనుండటంతో.. వీటిని బ్యాంకు నుంచి తీసుకోవడం ఎలా అనేది సమస్యగా మారింది. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల ముందు భారీగా కనిపించిన క్యూలు ఆ తర్వాత క్రమంగా కొంత తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు, వేతనాలు బ్యాంకు ద్వారా అందుతుండటంతో వాటి పంపిణీ ఎలా అన్నది అతి పెద్ద సవాలుగా మారింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మోదీ సర్కార్కు ఇదే అతిపెద్ద సవాలు అని భావిస్తున్న నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. ఒకటో తారీఖు టెన్షన్ అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. నిన్నటి (మంగళవారం) వరకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విమానాల ద్వారా 210 టన్నుల కరెన్సీ నోట్లను బట్వాడా చేశామని, సీ-130, సీ-170, ఏఎన్-32 వంటి యుద్ధ విమానాలలో నోట్లను వివిధ ఆర్బీఐ కేంద్రాలకు తరలించామని ఆర్బీఐ తెలిపింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా స్పందిస్తూ డిసెంబర్ 1న ఖాతాదారులు ఎలాంటి కష్టాలు పడకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఎస్బీఐ ఏటీఎంలు 90శాతం వరకు పనిచేస్తున్నాయని, ఎస్బీఐ ద్వారా రోజుకు రూ. 6వేల కోట్లు పంపిణీ చేస్తున్నామని ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్ చెప్పారు. రూ. 500 నోట్లు మార్కెట్లోకి రాగానే పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు.