-
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమిపై కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తానని ప్రకటించారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్తో విభేదాలు తలెత్తడం వల్లే ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. బుధవారం(మే15) కోల్కతాలో మమత మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇండియా కూటమికి బయటినుంచి మద్దతిస్తాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని తెలిపారు. కాగా, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ మద్దతిచ్చి తృణమూల్ను ఓడించాలని చూస్తున్నాయని మమత ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం. -
అది ఎదురుదెబ్బ ఎలా అవుతుంది?: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఉండడం వల్ల విరాళాలను ఎవరు, ఎవరికి ఇస్తున్నారో తెలిసే అవకాశం ఉందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారు. ఆదివారం ఒక తమిళ టీవీ ఛానల్కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఎన్నికల బాండ్ల రద్దు అంశంపై స్పందించారు. పంచెకట్టులో ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూకి హాజరు కావడం విశేషం. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయంపై ప్రధాని స్పందిస్తూ... ‘‘లోపం లేకుండా ఏ వ్యవస్థా ఉండదు. బాండ్ల విషయంలో ఎదురుదెబ్బ తిన్నామని చెప్పేలా మేం ఏం చేశామో చెప్పండి. వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది బాండ్ల వల్లే తెలుస్తోంది. 2014కి ముందు ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చాయో ఏ దర్యాప్తు సంస్థలు కూడా చెప్పలేవు.. .. అలాంటిది ఎన్నికల బాండ్ల పథకం ద్వారా విప్లవాత్మక మార్పు కోసం మేం ముందడుగు వేశాం. ఈ వ్యవహారంలో ఇప్పుడు గంతులేస్తూ గర్వపడుతున్నవారు(ఇండియా కూటమిని ఉద్దేశించి..) తర్వాత పశ్చాత్తాపపడతారు. నేను చేసే ప్రతి పనిలో రాజకీయాలను చూడకూడదు. నేను దేశం కోసం పనిచేస్తాను. ఓట్లే ప్రామాణికమైతే ఈశాన్య రాష్ట్రాలకు అన్ని పనులు చేసి ఉండకూడదు కదా. ఇతర ప్రధానులంతా కలిసి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లారో నేనొక్కడినే అంతకంటే ఎక్కువసార్లు వెళ్లాను.. .. నేను రాజకీయ నాయకుడినైనంత మాత్రాన ఎన్నికల్లో గెలుపుకోసమే పనిచేయాలనేం లేదు. తమిళనాడులో మాకు లభించే ఓట్లు డీఎంకేకు వ్యతిరేకమైనవి కాదు.. అవి బీజేపీకి అనుకూలమైనవి. తమిళ ఓటర్లు ఈసారి మాకు పట్టం కడతారు’’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. .. తమిళనాడులో అపారమైన సామర్థ్యం ఉంది, దానిని వృధా చేయకూడదు. వికసిత్ భారత్ అంటే దేశంలోని ప్రతి మూల అభివృద్ధి చెందాలి. తమిళనాడు కూడా ఇందుకు ఓ కేంద్రంగా మారుతుందని నేను భావిస్తున్నా. ఇక్కడి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అద్భుతంగా పని చేస్తున్నారు’’ అని ప్రధాని మోదీ కితాబిచ్చారు. అలాగే.. తమిళ భాషపై జరిగిన రాజకీయాలపై స్పందిస్తూ.. దాని వల్ల తమిళనాడుకే కాకుండా దేశానికి కూడా నష్టం వాటిల్లిందన్నారు. -
అవినీతిపరుల కూటమి: ప్రధాని మోదీ
మీరట్/ లక్నో: సార్వత్రిక సమరానికి షెడ్యూల్ మొదలయ్యాక ఉత్తరప్రదేశ్ వేదికగా ప్రధాని మోదీ తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని విపక్షాల ‘ఇండియా’కూటమిపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఆదివారం మీరట్లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈడీ అరెస్ట్తో కేజ్రీవాల్, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కటకటాల వెనక్కి వెళ్లిన వేళ ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం విపక్ష ‘ఇండియా’ కూటమి ‘లోక్తంత్ర బచావో’ ర్యాలీ చేపట్టిన కొద్దిసేపటికే మోదీ విపక్షాల కూటమిపై విమర్శల జడివాన కురిపించారు. ‘‘అవినీతిపై నేను పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించగానే విపక్ష నేతలంతా కలిసి ఇండియా కూటమిగా పోగయ్యారు. నన్ను భయపెట్టొచ్చని భావించారు. కానీ నా భారతదేశమే నా సొంత కుటుంబం. అవినీతి నుంచి దేశాన్ని రక్షించేందుకు యుద్ధం మొదలుపెట్టా. అందుకే వాళ్లంతా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. వాళ్లకు సుప్రీంకోర్టు నుంచి కూడా కనీసం బెయిల్ దొరకడం లేదు. ఈసారి రెండు శిబిరాల మధ్యనే సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగబోతోంది. నా మంత్రం ‘భ్రష్టాచార్ హటావో’ (అవినీతి అంతం). వాళ్ల తంత్రం ‘భ్రష్టాచార్ బచావో’ (అవినీతిని కాపాడుకోవడం). పేదల కోసం ఉద్దేశించిన డబ్బు అవినీతిపరులకు దక్కకుండా పదేళ్లుగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తున్న ఎన్డీఏ ఒకవైపు ఉంటే, అదే అవినీతి నేతలను కాపాడేందుకు అలుపెరగక కష్టపడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలు మరోవైపు ఉన్నారు. అవినీతికి అంతం పలకాలో వద్దో మీరే నిర్ణయించుకోండి’ అన్నారు. ‘‘అవినీతిపరులకు చెప్పేదొక్కటే. కుటుంబం లేదంటూ నన్నెంతగా అవమానించినా, ఎన్ని ఆరోపణలు గుప్పించినా, బీజేపీ నేతలపై దాడులు చేసినా అవినీతిపై నేను పోరాటం ఆపబోను. అవినీతికి పాల్పడింది ఎంత పెద్ద నేతలైనా సరే కఠిన చర్యలు ఖాయం. దేశాన్ని లూటీ చేసిన వారు తిరిగి ఆ సొమ్ము కక్కాల్సిందే. ఇదే మోదీ గ్యారెంటీ’’ అని అన్నారు. ప్రజల కోసం ఆశల పల్లకీని మోసుకొచ్చామంటూ సభకు ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘పదేళ్లలో దేశవ్యాప్తంగా నా కుటుంబసభ్యులందరి ఆకాంక్షలూ తీర్చాం. కొంగొత్త కోరికలను తీర్చేందుకు మళ్లీ మీ ముందుకొచ్చాం. ఆశలు నెరవేర్చిన ఎన్డీఏఏ కూటమికే ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’’ అన్నారు. పదేళ్ల అభివృద్ధి ట్రైలరే ‘‘ఈసారి లోక్సభ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోవు. ఈ ఎన్నికలు వికసిత భారత్కు పునాది వేయనున్నాయి. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మేం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. మా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకు మార్గసూచీని రూపొందిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100 రోజుల్లో అమలుజరపాల్సిన పనులపై ఆలోచిస్తున్నాం. గత పదేళ్లకాలంలో మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు దేశాన్ని మరింత శరవేగంతో అభివృద్ధి పథంలో ఉరకలెత్తిస్తాం. నేను పేదరికంలో జీవించా కాబట్టే పేదల గురించి తెల్సు నాకు. ప్రతి ఒక్క పేదవాడి బాధలు, కష్టాలను అర్ధంచేసుకోగలను. అందుకే పేదలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేశాం. ఈ పథకాలు పేదల సాధికారతకు మాత్రమే బాటలు వేయవు. అవి పేదలకు ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చి ఇచ్చాయి’’ అని మోదీ అన్నారు. ‘‘అయోధ్యలో రామాలయం అసాధ్యమ ని చాలామంది అ న్నారు. నేడు రోజూ లక్షలాది మంది అయోధ్య రామాలయాన్ని దర్శించుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్పై కఠిన చట్టం, ఆరి్టల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం అసాధ్యమన్నారు. మేం చేసి చూపాం’ అని మోదీ అన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను, నేతలను వేధిస్తున్నారని మండిపడింది. ఢిల్లీ సీఎం, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. వారికి అండగా నిలుస్తామని ప్రకటించింది. నియంతృత్వ పాలనను తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ కూటమి మహా ర్యాలీ నిర్వహించింది. ‘తానాషాహీ హటావో, లోక్తంత్ర్ బచావో (నియంతృత్వాన్ని రూపుమాపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి)’ పేరుతో జరిగిన ఈ ర్యాలీ విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారింది. ఇండియా కూటమిలోని 28 పారీ్టల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలను మోదీ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివరి్ణంచారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఎన్నికల్లో విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీ, పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్ (సమాజ్వాదీ), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), శరద్ పవార్ (ఎన్సీపీ–పవార్), ఉద్దవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ) తదితరులు వీరిలో ఉన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీత, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ రాజకీయాల్లోకి రావచ్చనే చర్చ ఊపందుకుంది. వారితో సోనియా వేదికపై చేతిలో చేయి కలిపి మాట్లాడారు. తన పక్కనే కూచోబెట్టుకున్నారు. విపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని ఓడించాలని స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. స్టాలిన్ తరఫున ఆయన సందేశాన్ని డీఎంకే నేత తిరుచ్చి శివ చదివి విని్పంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పోరాడదామని శరద్ పవార్ అన్నారు. దేశం పెను సంక్షోభంలో ఉందని డి.రాజా అన్నారు. ఈ ర్యాలీతో రాజకీయాల్లో కొత్త శక్తి పుట్టిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. తృణమూల్ విపక్ష ఇండియా కూటమిలోనే ఉందని ఓబ్రియాన్ చెప్పారు. కూటమి డిమాండ్లు... కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, విపక్ష నేతల అరెస్టులు, ఎన్నికల బాండ్ల పేరుతో బలవంతపు వసూళ్లు, విపక్షాలే లక్ష్యంగా ఆదాయ పన్ను నోటీసులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరోద్యగం, రైతులకు అన్యాయం వంటి ఏడు అంశాలపై కూటమి డిమాండ్లను ప్రియాంక చదివి ప్రస్తావించారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థల చర్యలను నిలిపేయాలని కోరారు. బీజేపీ ఎన్నికల బాండ్ల క్విడ్ ప్రో కో వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఆరెస్సెస్, బీజేపీ విషతుల్యం ‘‘ఆరెస్సెస్, బీజేపీ విషం వంటివి. పొరపాటున కూడా వాటిని రుచి చూడొద్దు. ఇప్పటికే దేశాన్ని ఎంతో నాశనం చేసిన విచి్ఛన్న శక్తులవి. మరింత సర్వనాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలదే. పరస్పరం కుమ్ములాడుకోకుండా ఏకమైతేనే బీజేపీని ఓడించడం సాధ్యం. ప్రజాస్వామ్యం, నియంతృత్వాల్లో ఏది కొనసాగాలో నిర్ణయించే కీలక ఎన్నికలివి. ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకం లేదు. అధికార వ్యవస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పి బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను పడదోస్తున్నారు. హేమంత్ సోరెన్ను బీజేపీలో చేరనందుకే అరెస్టు చేయించారు. తనకు లొంగడం లేదనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్నూ జైలుపాలు చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇలా ప్రతిపక్షాలకు బీజేపీతో సమానంగా ఎన్నికల్లో తలపడే అవకాశం లేకుండా చేస్తున్నారు. రూ.14 లక్షల నగదు డిపాజిట్లకు సంబంధించి కాంగ్రెస్కు ఏకంగా రూ.135 కోట్ల జరిమానా విధించారు. రూ.42 కోట్ల నగదు డిపాజిట్లు అందుకున్న బీజేపీకి అదే సూత్రం ప్రకారం రూ.4,600 కోట్ల జరిమానా విధించాలి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేజ్రీవాల్ సింహం: సునీత ‘‘కేజ్రీవాల్ సింహం. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు’’ అని ఆయన భార్య సునీత అన్నారు. మోదీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. లోక్సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. మా రక్తంలోనే పోరాటం: కల్పన రాజ్యాంగ హక్కులన్నింటినీ మోదీ సర్కారు కాలరాస్తోందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన మండిపడ్డారు. ‘‘అధికారాన్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నామని కొన్ని పార్టీలు అపోహ పడుతున్నాయి. కానీ నిజమైన అధికారం ప్రజలదే. మేం గిరిజనులం. త్యాగం, పోరాటం మా రక్తంలోనే ఉన్నాయి. మా సుదీర్ఘ చరిత్రను తలచుకుని గర్వపడతాం’’ అన్నారు. నిర్ణాయక ఎన్నికలివి... ‘‘అంపైర్లపై ఒత్తిడి పెట్టి, కెపె్టన్ను, ఆటగాళ్లను కొనేస్తే మ్యాచ్ గెలిచినట్టే. క్రికెట్లో దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. లోక్సభ ఎన్నికల వేళ అంపైర్లను (కేంద్ర ఎన్నికల కమిషనర్లను) ఎంపిక చేసిందెవరు? మ్యాచ్ మొదలైనా కాకముందే ఇద్దరు ఆటగాళ్లను (సీఎంలను) అరెస్టు చేయించిందెవరు? ఇవ్నీ చేసింది ఒక్కే ఒక్క శక్తి. ప్రధాని మోదీ! ముగ్గురు నలుగురు బిలియనీర్ల సాయంతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా లోక్సభ ఎన్నికలను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను దేశమంతా గమనిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్, ఈవీఎంల సాయంతోనే 400 సీట్లు నెగ్గుతామని బీజేపీ ధీమాగా అంటోంది. అదే జరిగితే దేశమే సర్వనాశనమవుతుంది. దేశ గుండె చప్పుడైన రాజ్యాంగం కనుమరుగవుతుంది. తద్వారా దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ లక్ష్యం. మ్యాచ్ఫిక్సింగ్, ఈవీఎంలు, మీడియాను బెదిరించడం, కొనేయడం జరగకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావు. కానీ ఇవేం ఎన్నికలు? విపక్షాలను నిరీ్వర్యం చేసి నెగ్గజూస్తున్నారు. ప్రచార వేళ అతి పెద్ద విపక్షమైన కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ బెదిరింపులు, బల ప్రయోగాలతో దేశాన్ని పాలించలేరు. కానీ దేశం గొంతును అణచలేరు. ప్రజల గళాన్ని అణచే శక్తి ప్రపంచంలోనే లేదు. మోదీ అసమర్థ పాలనలో దేశంలో నిరుద్యోగం 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. దేశ సంపదంతా ఒక్క శాతం సంపన్నుల చేతిలో పోగుపడింది. ఈ నిరంకుశత్వాన్ని పారదోలేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలివి’’ – కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అహంకారానికి అంతం తప్పదు ‘‘సత్యం కోసం చేసిన యుద్ధంలో రామునికి అధికారం లేదు, వన రుల్లేవు. అయినా అవన్నీ ఉన్న రావణుడిపై గెలిచాడు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం వీడాలని రాముని జీవి తం నేర్పుతోంది. రాముని భక్తులమని ప్రకటించుకునే వారికి ఇది చెప్పాలనుకుంటు న్నా. అహంకారం అణగక తప్పదు’’ – కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా -
ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 5 డిమాండ్లు
న్యూఢిల్లీ: ఇటీవల అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్లను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. కేజ్రీవాల్కు మద్దతుగా ఢిల్లీలో ఆదివారం(మార్చ్ 31) భారీ సభ నిర్వహించిన ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేసింది. ఈ డిమాండ్లను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ చదివి వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కూటమి డిమాండ్ చేసింది. ఎన్నికల్లో సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలి. సీఎం కేజ్రీవాల్, మాజీ సీఎం హేమంత్ సొరేన్లను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి. బీజేపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అక్రమ వసూళ్లు, ఎన్నికల బాండ్ల ద్వారా చేస్తున్న మనీలాండరింగ్పై విచారించడానికి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలి’ అని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, హేమంత్సోరేన్ భార్య కల్పన సోరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి -
‘ఇండియా’ ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉందని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ఆదివారం(మార్చ్ 31) ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఒబ్రెయిన్ పాల్గొని మాట్లాడారు.‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(ఏఐటీసీ) ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంది. ఇది బీజేపీకి ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరుగుతున్న పోరాటం’అని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ర్యాలీలో ఒబ్రెయిన్ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేయడం విశేషం. కాగా, కాంగ్రెస్తో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో వెస్ట్బెంగాల్లో సొంతగా పోటీ చేస్తున్నట్లు టీఎంసీ మార్చ్ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్య నేత, ఆ పార్టీ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పై క్రికెటర్ యూసఫ్ పటాన్ను రంగంలోకి దింపింది. ఏక పక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై అధిర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. మమతాబెనర్జీని ఇక ముందు ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు నమ్మడని మండిపడ్డారు. తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రధాని కార్యాలయానికి కూడా టీఎంసీ పంపిందని, తాము ఇండియా కూటమిలో లేము అని చెప్పేందుకే ప్రధానికి కూడా అభ్యర్థుల జాబితా పంపారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్, టీఎంసీలు ఒక పార్టీపై మరొకటి సాఫ్ట్ కార్నర్ చూపిస్తుండటం చర్చనీయాంశమైంది. Modi's guarantee has zero warranty! Zero warranty when it comes to price rise, jobs and protecting India's institutions. After the Pulwama tragedy, former Governor Satya Pal Malik ji publicly said that Narendra Modi ji did not even want the truth to come out. What did Narendra… pic.twitter.com/qeb0fgA5xS — Congress (@INCIndia) March 31, 2024 ఇదీ చదవండి.. దేశ ఆర్థిక మంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా -
మోదీ చేసింది సరైన పనేనా?: సునీతా కేజ్రీవాల్
Live Updates.. ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కామెంట్లు... ప్రజాస్వామ్యం కావాలో,నియంతృత్వవం కావాలో మీరే(ప్రజలు) నిర్ణయించుకోవాలి నియంతృత్వానికి మద్దతు ఇచ్చేవారిని దేశం నుంచి తరిమిగొట్టాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం లాంటివి వాటి విషం రుచి చూసినా మరణిస్తాం ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కామెంట్లు బీజేపీ భ్రమల్లో ముగినిపోయింది. వారికి నేను వెయ్యేళ్లనాటి కథ, నీతిని తెలియజేస్తున్నా. రాముడు సత్యం కోసం యుద్ధం చేశారు. రాముడికి అధికారం, వనరులు లేవు. రాముడికి కానీసం రథం కూడా లేదు. రావణాసురుడికి రథం, వనరులు, యుద్ధ సైన్యం ఉంది. రాముడి వద్ద సత్యం, నమ్మకం, విశ్వాసం, ఓర్పు, తెగువ ఉందని గుర్తు చేశారు. ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేస్తోంది #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "I think that they (BJP) are trapped in illusion. I want to remind them of a thousand-year-old tale and its message. When Lord Ram was fighting for the truth, He did… pic.twitter.com/43vpN9Y107 — ANI (@ANI) March 31, 2024 ఐదు డిమాండ్లు ఇవే... ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో అందరినీ సమానంగా చూడాలి బలవంతంగా ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ , ఐటీ అరెస్ట్లు, దాడులు ఆపేయాలి వెంటనే సీఎం అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ను విడిచిపట్టాలి0 ప్రతిపక్షాల ఆర్థిం వనరులను దెబ్బతీయటం ఆపేయాలి బీజేపీ పొందిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సిట్ ఏర్పాటు చేసి వెంటనే దర్యాప్తు జరపాలి #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "INDIA Alliance has 5 demands. The Election Commission should ensure equal opportunity in the Lok Sabha elections. Second, the ECI should stop the forceful action… pic.twitter.com/pSUBSFwhvm — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్లు బీజేపీ 400 సీట్లు గెలుపు నినాదం సెటైర్లు ఈవీఎంలు లేకుండా, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపకై ఒత్తిడి పెంచకుండా బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలవలేదు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కామెంట్లు ఈడీ, సీబీఐ అండ్ ఐటీ బీజేపీకి చెందిన విభాగాలు. లాలూ ప్రసాద్ యావద్ను చాలా సార్లు వేధించాయి. మాపై వ్యతిరేకంగా కేసులు పెట్టారు. మా కుటుంబంలోని అందరిపై కేసులు మోపారు ఆర్జేడీ నేతలపై తరచూ సోదాలు జరుగుతున్నాయి ఈడీ, ఐడీ సోదాలు జరుగుతునే ఉన్నాయి. మేము ఎప్పడూ భయపడలేదు.. పోరాడుతూనే ఉన్నాం. టీఎంసీ ఇండయా కూటమిలో భాగమే.. ‘టీఎంసీ ఇండియా కూటమిలో భాగమే. ప్రజాస్వామ్యాకి బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోంది’టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. #WATCH | INDIA alliance rally: TMC MP Derek O'Brien says, "...All India Trinamool Congress (TMC) is very much was, is and will be part of the INDIA alliance. This is a fight of BJP versus democracy..." pic.twitter.com/5q2YuoHRCO — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమికి ఆప్ తరఫున మద్దతు తెలుపుతున్నా: సునీతా కేజ్రీవాల్ ఇండియా కూటమి కాదు.. ఇండియా అనేది మనందరి హృదయం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉండవు. దేశవ్యాప్తంగా పేదలకు విద్యుత్ ఉచితం. ప్రతి గ్రామంలో పిల్లలు నాణ్యమైన విద్యను పొందే మంచి పాఠశాల ఏర్పాటు గ్రామంలో మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు స్వామినాథన్ నివేదిక ప్రకారం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటం. ఢిల్లీ ప్రజలు చాలా ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. మేము అంతం చేస్తాము. ఢిల్లీ ప్రజలకు రాష్ట్ర హోదా పొందుతారు. ఐదేళ్లలో ఈ గ్యారంటీలు అమలుచేస్తాం #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal at the INDIA alliance rally in Ramlila Maidan, Delhi. pic.twitter.com/ah1WM7RhsH — ANI (@ANI) March 31, 2024 ప్రధాని మోదీ కేజ్రీవాల్ను జైలులో పెట్టారు: సునీతా కేజ్రీవాల్ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ లోక్తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) ర్యాలీ ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కేజ్రీవాల్ పంపిన లేఖలను చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ ప్రధాని మోదీ కేజ్రీవాల్ను జైలులో పెట్టారు మోదీ చేసింది సరైన పనేనా? సీఎం కేజ్రీవాల్ నిజాయితిపరుడని మీరు నమ్మటం లేదా? కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్ సింహం లాంటి వ్యక్తి కోట్ల మంది హృదయాల్లో కేజ్రీవాల్ ఉన్నారు #WATCH | INDIA alliance rally: Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Your own Kejriwal has sent a message for you from jail. Before reading this message, I would like to ask you something. Our Prime Minister Narendra Modi put my husband in jail, did the Prime… pic.twitter.com/aZsdXXvJOO — ANI (@ANI) March 31, 2024 రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ పంపిన లేఖ చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ దేశం బాధలో ఉందని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. ‘ఇండియా కూటమి’మహా ర్యాలీ.. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కామెంట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజకీయ పార్టీలకు కనీస గౌరవం ఇవ్వడాన్ని పూర్తిగా నిరాకరిస్తోంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల విషయంలో మరీ దారుణం ఇలాంటి తరుణంలో లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయని ఎలా నమ్ముతాం? దేశంలో ఎన్నికలను బీజేపీ హైజాక్ చేయాలనుకుంటోంది ప్రతిపక్షపార్టీలు, నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోంది అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీని నిర్వహిస్తోంది #WATCH | On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress MP KC Venugopal says, "Now the Government of India under the leadership of PM Modi is completely refusing to provide a level playing field to political parties, especially the opposition parties. How can you ensure… pic.twitter.com/cw5ZUZoBsl — ANI (@ANI) March 31, 2024 ‘ఇండియా కూటమి’ మెగా ర్యాలీలో పాల్గొనేందుకు అరవింద్ కేజీవాల్ సతీమణి సునితా కేజ్రీవాల్ రాంలీలా మైదానానికి బయల్దేరారు. #WATCH | Delhi: Punjab CM Bhagwant Mann along with Delhi CM and AAP national convener Arvind Kejriwal's wife Sunita Kejriwal leave for Ramlila Maidan to attend the INDIA alliance rally pic.twitter.com/uCYhUes7MN — ANI (@ANI) March 31, 2024 రాజ్యాంగం దాడికి గురవుతోందని కాంగెస్ నేత సుప్రియా శ్రీనతే అన్నారు. రాంలీలా మైదనంలోని మెగా ర్యాలీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజ్యాంగం దాడికి గురవుతోంది. దేశం మొత్తం రాజ్యాంగ రక్షణకు కలిసికట్టుగా ముందుకువెళ్తోంది. ఇదే విషయాన్ని విషయాన్ని తెలియజేయటానికి ర్యాలీకి హాజరవుతున్నా’ అని అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress leader Supriya Shrinate says, "The democracy is being attacked. The whole country is standing in the favour of democracy. And we have come here to give the same message..." pic.twitter.com/WfgEQ8uRtK — ANI (@ANI) March 31, 2024 నియంత, మతతత్వ బీజేపీ పార్టీ విధానాలను ఎండకట్టేందుకు, అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ అరెస్ట్కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో మహా ర్యాలీలో ప్రజలు. నేతలు పాల్గొంటున్నారని సీఐఎం(ఎం) నేత బృందా కారత్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపా చట్టాన్ని ఈడీ, సీబీ దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సమర్థమంతమైనది కాదనడానికి ఇదే నిదర్శనం అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, CPI-M leader Brinda Karat says, "The message is that people from all over the country have gathered against this dictator and communal government. This Maha rally in Delhi is against Arvind Kejriwal and Hemant… pic.twitter.com/ZmSSr2FjLQ — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ చేపట్టిన మెగా ర్యాలీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రవాల్ మాట్లాడనున్నారు. రాంలీలా మైదానానికి కూటమి నేతలు చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో ఢిల్లీ ప్రజలు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. ఢిల్లీ ప్రజల కోసమే కేజ్రీవాల్ ఆందోళన.. రాంలీలా మైదనం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని ఢిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. ఆమె మీడియా మాట్లాడారు. ‘ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన పడుతున్నారు’అని మంత్రి అతిశీ అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, AAP Minister Atishi says, "It is 10 am and people have already gathered in huge numbers. People from all over the country have come against the arrest of Arvind Kejriwal. The people of Delhi are aware that Arvind… pic.twitter.com/6XF8mN5WnU — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమి మెగా ర్యాలీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా రాంలీలా మైదానంలో మహా ధర్నా కేజీవాల్ జైల్లో ఉన్న ఫొటోలు ఏర్పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా 13 పార్టీల నేతల హాజరు ఎండ వేడిమి తట్టుకోవడానికి ఏర్పాట్లు మెగా ర్యాలీ వద్ద భారీ భద్రత ఏర్పాటు ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు నకిలీ దర్యాప్తు పేరుతో, మన్నల్ని, మా పార్టీని గత రెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ జాతీయ అధికప్రతినిధి ప్రియాంకా కక్కర్ అన్నారు. రామ్లీలా మైదానంలో విపక్షాల ఇండియా కూటమి ర్యాలీ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎటువంటి అధారాలు లేకుండా కొందరి నకిలీ ప్రకటనలతో సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేశారు. ఇది మా పార్టీ గొంతు నొక్కాలనే కుట్రలో భాగం. ఎవరైలే బీజేపీ ప్రశ్నిస్తారే వాళ్లను జైల్లో తోయటమే వారి పని’అని ప్రియాంకా మండిపడ్డారు. #WATCH | Delhi: On INDIA alliance rally at Ramlila Maidan, AAP leader AAP national spokesperson Priyanka Kakkar says, " It can be clearly seen how we are being targeted in the for last 2 years in the name of a fake investigation. Without any proof, just based on a few statements,… pic.twitter.com/7Ne4Kfuxcg — ANI (@ANI) March 31, 2024 ►ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి ఇండియా కూటమి రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ►రామ్లీల మైదానంలో కళ్లకు గంతులు కట్టుకుని కాంగ్రెస్ నేతల నిరసన #WATCH | Delhi: Congress workers organised a blindfold protest at the Ramlila Maidan. pic.twitter.com/5p0C5mwpRn — ANI (@ANI) March 31, 2024 ►ఇండియా కూటమి ర్యాలీకి బయలుదేరిన జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వానికి స్వస్థి పలికి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అన్నారు. #WATCH | Ranchi: Before leaving for Delhi to attend the INDIA Alliance Maha Rally at the Ramlila Maidan today, Jharkhand CM Champai Soren says, "We have to abolish the dictatorship and save the democracy..." pic.twitter.com/kOHI9A0EiV — ANI (@ANI) March 31, 2024 ►ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడంపై ఇండియా కూటమి భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో రూ.1800 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. #WATCH | Delhi: INDIA alliance to hold rally against the arrest of Delhi CM and AAP convener Arvind Kejriwal, at Ramlila Maidan from 10 am today (Visuals from the Ramlila Maidan) pic.twitter.com/cahR183k7g — ANI (@ANI) March 31, 2024 కీలక నేతలు హాజరు.. ►ఢిల్లీలో జరిగే ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోసియా గాంధీ, రాహుల్గాంధీ సహా కీలకనేతల పాల్గొనబోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఇవాళ్టి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నారు నేతలు. ఇవాళ్టి కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జనసమీకరణ చేసి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. సునీత కేజ్రీవాల్కు కల్పన సొరేన్ సంఘీభావం ►ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్కు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సతీమణి కల్పన సొరేన్ శనివారం సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలో వీరి భే టీ జరిగింది.శక్తిమంతులైన మహిళలు కలవడంతో బీజేపీ భయపడి ఉం టుందని.. వీరిద్దరి సమావేశంపై ఢిల్లీ మంత్రి ఆతీశి ట్వీట్ చేశా రు. కల్పన విలేకర్లతో మాట్లాడుతూ, సునీత కేజ్రీవాల్కు యావత్తు జార్ఖం డ్ ప్రజలు అండగా ఉంటారని, తాము ఒకరి ఆవేదనను మరొకరం పంచుకున్నామని చెప్పారు.తాము కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామన్నారు. -
India Alliance: బిహార్లో కాంగ్రెస్ పోటీ చేసే సీట్లు ఎన్నంటే..
పాట్నా: లోక్సభ ఎన్నికల్లో బిహార్లో ఇండియా కూటమి సీట్ షేరింగ్ ఫైనల్ అయింది. పొత్తులో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ పార్టీ 26 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో వామపక్షాలు 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని కూటమి పార్టీలు శుక్రవారం(మార్చ్ 29) వెల్లడించాయి. బీహార్లో మొత్తం 40 సీట్లకు గాను ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 1న ఏడవ విడత పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16, జితన్ రామ్ మాంజీ పార్టీ హెచ్ఏఎమ్ ఒక సీటు, ఆర్ఎల్ఎస్పీ ఒక సీటు, చిరాగ్ పాశ్వాన్ లోక్జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్లో బీజేపీకి 24.1 శాతం ఓట్లు రాగా జేడీయూకు 22.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 7.9 శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. అయినా ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ఆర్జేడీ 9 సీట్లు ఇవ్వడం విశేషం. ఇదీ చదవండి.. కాంగ్రెస్కు మరో బిగ్ షాక్ -
ఇండియా కూటమితో టచ్లో పశుపతి పరాస్!
రాష్ట్రీయ లోక్జనశక్తి (ఆర్ఎల్జేపీ) పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్.. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తనకు అన్యాయం జరగటంతో ఎన్డీయే కూటమితో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపక్షాల ఇండియా కూటమికి టచ్లో ఉన్నారని తెలుస్తోంది. పశుపతి పరాస్ ఎన్డీయేకు గుడ్బై చెప్పిన వెంటనే ఆర్జేడీ నేత తేజ్ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. బిహార్లోని ప్రతిపక్ష కూటమికి ఆహ్వానించారు. ‘ఒకవేళ పశుపతి పరాస్ బీహార్ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. రాజీనామా చేసిన పరాస్ను బీజేపీ ఏం చేయలేదు’ అని అన్నారు. అయితే పరాస్.. పలు లోక్సభ స్థానాలతో పాటు హాజీపూర్ సెగ్మెంట్ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో కీలకమైన హాజీపూర్ స్థానంలో కచ్చితంగా పోటీ చేస్తానని.. అవసరమైతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్దమేని ఇటీవల పరాస్ ప్రకటించారు. అయితే సోమవారం బీజేపీ.. పరాస్ను పక్కనబెట్టి జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)తో సీట్ల పంపకం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పశుపతి పరాస్ ఎన్డీయే నుంచి తప్పుకున్నారు. మరోవైపు పరాస్కు కంచుకోట అయిన హాజీపూర్లో బీజేపీ.. లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) పార్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించటం గమనార్హం. ఒకవేళ పరాస్ ఇండియా కూటమిలో చేరితే ఆయనకు హాజీపూర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి. -
Lok Sabha Elections 2024: నువ్వా నేనా...!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల్లో హోరాహోరీ తలపడేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) సిద్ధమయ్యాయి. వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, ఆ పార్టీని ఈసారి ఎలాగైనా మట్టికరిపించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నాయి. పేదలు, మహిళలు, రైతులు, యువతను లక్ష్యంగా చేసుకుని హామీల వర్షం కురిపిస్తున్నాయి. సొంతంగా 370కి పైగా స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న అధికార బీజేపీ ఇప్పటికే ఏకంగా 267 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది. ఇంకా కూటమి లెక్కలు తేలక కాంగ్రెస్ సతమతమవుతోంది. హోరాహోరీ పోరులో ఏ కూటమి నెగ్గేదీ తెలియాలంటే జూన్ 4న వరకు వేచి చూడాల్సిందే... అయోధ్యలో రామమందిర నిర్మాణం అనంతరం కదనోత్సాహంతో ఉన్న కమలదళం ఈ ఎన్నికల్లో భారీ లక్ష్యాలే నిర్ణయించుకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో 282 సీట్లు సాధించి 2019లో 303కు ఎగబాకిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 370కి పైగా సీట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఏ పక్షాలతో కలిపి 400లకు పైగా సీట్లు సాధించాలని భావిస్తోంది. ఎన్డీఏకు ప్రస్తుతం 335 మంది ఎంపీలుండగా వీరిలో బీజేపీ సొంత బలమే 290 (మిగతా ఎంపీలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగి రాజీనామా చేశారు). ఇక కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో కేవలం 52 సీట్లకు పరిమితమైంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ కలిపి 2019లో 144 సీట్లు మాత్రమే సాధించాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీఏకి 40 శాతం, ఇండియా కూటమికి 35 శాతం ఓట్లొచ్చాయి. ఎన్డీఏకు ఈసారి ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాలను చుట్టేశారు. దక్షిణాదిన కూడా దాదాపు అన్నిచోట్ల పర్యటించారు. అసెంబ్లీలవారీగా కూటముల బలాబలాలు... ► దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్డీఏ పార్టిలు 18 రాష్ట్రాల్లో, ఇండియా కూటమి పార్టిలు 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ► మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేల్లో 1,791 మంది ఎన్డీయే కూటమికి చెందినవారు కాగా 1,653 మంది ఇండియా కూటమికి చెందినవారున్నారు. ► శాసన మండలి ఉన్న ఆరు రాష్ట్రాల్లోని మొత్తం 426 ఎమ్మెల్సీల్లో 105 మంది ఇండియాకు, 184 మంది ఎన్డీఏకు చెందినవారు. ► ఎమ్మెల్యేలపరంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రతో సహా అత్యధిక జనాభా ఉన్న చాలా రాష్ట్రాల్లో ఎన్డీఏది ఆధిపత్యం. కాగా పశ్చిమబెంగాల్, కర్నాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్ల్లో ఇండియా కూటమిది పైచేయి. ► 2023–24 మధ్య తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఐదుచోట్ల ప్రభుత్వం మారింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, రెండింట కాంగ్రెస్ నెగ్గాయి. మిగతా మూడు రాష్ట్రాలను ప్రాంతీయ పార్టిలు చేజిక్కించుకున్నాయి. బీజేపీ లక్ష్యం 370 ప్లస్ ఎన్డీఏ భాగస్వాములతో సీట్ల పంపకాలను బీజేపీ శరవేగంగా తేల్చేస్తోంది... ► అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో 80 లోక్సభ స్థానాలకు 2019లో 62 సీట్లు బీజేపీ సాధించిన ఈసారి 70 దాటాలని టార్గెట్ పెట్టుకుంది. మిత్రపక్షాల్లో అప్నాదళ్ (ఎస్)కు 5 సీట్లు, నిషాద్ పార్టికి ఒకట్రెండు కేటాయించవచ్చు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్ ఐదు సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ► మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 26 చోట్ల బీజేపీ పోటీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ (అజిత్)తో కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. ► 40 స్థానాలున్న బిహార్లో కనీసం 25 సీట్లులో పోటీ చేయనుంది. మిగతా స్థానాలను జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ, ఉపేంద్ర కుషా్వహా రా్రïÙ్టయ లోక్ జనతాదళ్, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్)లకు కేటాయించే అవకాశముంది. ► 28 లోక్సభ స్థానాలున్న కర్ణాటకలో కొత్త మిత్రుడు జేడీ(ఎస్)కు 3 స్థానాలిచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. అక్కడ 2019 ఎన్నికల్లో 25 స్థానాలు చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి వాటిని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ► అస్సాంలో 14 స్థానాలకు గాను 11 స్థానాల్లో బీజేపీ, మిగతా చోట్ల మిత్రపక్షాలు అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ (యూపీపీఎల్) పోటీ చేస్తారు. లెక్కలు తేలక ‘హస్త’వ్యస్తం... ఈసారి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించే లక్ష్యంతో భాగస్వాములతో కాంగ్రెస్ పొత్తు కసరత్తులు చేస్తోంది. ఒంటరిగా పోటీ చేసే రాష్ట్రాలు, మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగాల్సిన రాష్ట్రాలపై పీసీసీల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అంతర్గత నిర్ణయం మేరకు కర్ణాటక (28), గుజరాత్ (26), రాజస్థాన్ (25), ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), అస్సాం (14), చత్తీస్గఢ్ (11), హరియాణా (10), అరుణాచల్ప్రదేశ్ (2)ల్లో కాంగ్రెస్ ఒంటరి పోటీ చేయనుందని సమాచారం... యూపీలో కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాలని భావించినా చివరికి 17 స్థానాలకే పరిమితమవుతోంది. మిగతా చోట్ల ఇండియా కూటమి భాగస్వామి సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది. ► మహారాష్ట్రలో కనీసం 18 సీట్లలో బరిలో దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. మిగతా వాటిని మిత్రపక్షాలు ఎన్సీపీ (శరద్), శివసేన (యూబీటీ)లకు కేటాయించనుంది. ► పశి్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో మొత్తం 42 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయనుంది. ► బిహార్లో జేడీ(యూ) జారుకోవడంతో కనీసం 25 చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నా చివరికి 15 స్థానాలకే పరిమితమయ్యేలా ఉంది. మిత్రపక్షం ఆర్జేడీ మాత్రం 7 నుంచి 9 సీట్ల కంటే ఇచ్చేది లేదంటోంది! ► తమిళనాట డీఎంకేతో పొత్తున్నా కాంగ్రెస్కు రెండుకు మించి సీట్లు దక్కడం కష్టమే. ► జార్ఖండ్లోని ఏడు చోట్ల పోటీ చేసి జేఎంఎంకు 4, ఇతర పక్షాలకు 3 ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. ► కేరళలో 20 స్థానాల్లో 16 చోట్ల పోటీ చేసి వామపక్షాలకు 4 ఇవ్వనుంది. ► పంజాబ్లో ఆప్తో పొత్తు కుదరకపోవడం, అకాలీదళ్ కూడా దూరమవడంతో మొత్తం 13 సీట్లలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. ► ఢిల్లీలో మాత్రం నాలుగు చోట్ల ఆప్, మూడుచోట్ల కాంగ్రెస్ బరిలో దిగనున్నాయి. 2019లో ఇలా... 2014లో బీజేపీకి సొంతంగా 282 సీట్లు రాగా 2019 నాటికి 303కు పెరిగాయి. 2019 ఎన్నికల్లో హిందీ రాష్ట్రాలను చాలావరకు క్లీన్స్వీప్ చేసింది. 2019లో 31 శాతం ఓట్లు సాధించగా 2019లో 37.4కు పెంచుకుంది. 2019లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 353 ఎంపీల మద్దతుంది. కూటమి మొత్తం 40 శాతం ఓట్లు సాధించింది. ఎన్డీఏ కూటమి బలం బీజేపీ 290 జేడీ(యూ) 16 శివసేన 13 ఆర్ఎల్జేపీ 5 ఇతరులు 11 2019లో ఇలా... ప్రస్తుత ఇండియా కూటమి 2009 లోక్సభ ఎన్నికల్లో 40 శాతం ఓట్లతో 347 సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో ఓట్ల శాతం 42 శాతానికి పెరిగినప్పటికీ 161 సీట్లకే పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టిల మధ్య త్రిముఖ పోటీయే ఇందుకు ప్రధాన కారణం. ఇక 2019 ఎన్నికల్లో ఇండియా కూటమి 38 శాతం ఓట్లకు, కేవలం 144 సీట్లకు పడిపోయింది. ఇండియా కూటమి బలం కాంగ్రెస్ 48 డీఎంకే 24 టీఎంసీ 22 శివసేన (యూబీటీ) 6 ఎన్సీపీ (శరద్) 4 ఇతరులు 19 -
‘సీఏఏ’పై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తాజాగా అమల్లోకి వచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామని, ఈ హామీని రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పారు. సీఏఏ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్ణయాన్ని మంగళవారం ఢిల్లీలో ఆయన సమర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఏఏ చట్టం రాజ్యాంగం పరంగానే కాకుండా నైతికంగా కూడా పెద్ద తప్పు. పౌరసత్వం చట్టంలో మతాల ప్రస్తావన తీసుకురావడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించం. చట్టం పరిధిలో నుంచి ఒక మతాన్ని తప్పించకుండా ఉండి ఉంటే మేం సీఏఏను ఆహ్వానించి ఉండే వాళ్లం’ అని శశి థరూర్ పేర్కొన్నారు. కాగా, సీఏఏను అమల్లోకి తీసుకువస్తున్నట్లు సోమవారం (మార్చ్11) కేంద్ర ప్రభుత్వం రూల్స్ నోటిఫై చేసింది. ఇదీ చదవండి.. సీఏఏపై దళపతి విజయ్ ఏమన్నారంటే.. -
కూటమి నిజంగా బలహీన పడిందా?
ఇండియా కూటమి చీలిపోయిందంటూ ఇటీవల ప్రభుత్వ అనుకూల మీడియా తరచూ ప్రచారం చేస్తున్న విషయం అందరికీ విదితమే. ఇకపోతే ప్రధాని మోదీ ఇటీవల బీజేపీ వివిధ రాష్ట్రాల ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిత్ర పక్షాలను కలుపు కొని 400 సీట్లు గెలుస్తామని ఘంటాపథంగా చెప్పారు. దీన్నే ప్రామాణికంగా తీసుకొన్న వివిధ స్థాయుల్లోని బీజేపీ నాయకులూ బహుళ ప్రచారంలో పెట్టారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో మీడియా ‘ఇండియా’ కూటమి బలహీన పడిందంటూ బహుళ ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. ఇటీవలనే ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ–కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక్కడ మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉండగా బీజేపీ గత ఎన్నికల్లో 62 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అక్కడ గతంలో గెలుచుకున్నన్ని స్థానాలు సంపాదించడం కష్టమని అంచనా. గతంలో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. అప్పుడు సున్నితమైన పుల్వామా అంశం తెరపైకి వచ్చి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి. కాబట్టి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అంతేకాకుండా ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల పేపర్లు లీక్ కావటంతో యోగీ ప్రభుత్వం ఆ పరీక్షలను రద్దుచేసి మళ్లీ నిర్వహిస్తానని ప్రకటించింది. దీంతో యాభై లక్షలమంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై పడనుందని అంటున్నారు. అక్కడ ముఖ్యమంత్రి యోగి క్షత్రియ కులానికి చెందినవాడు. బ్రాహ్మణుల్లో తమకు యోగి ప్రభుత్వంలో సరియైన ప్రాతినిధ్యం లేదనే భావన ఉండటంతో ఈసారి ఆయనకు వ్యతిరేకంగా వారు పనిచేయవచ్చు. ఇక ఎన్డీయేలో భాగస్వామి అయిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తరచూ కూటములు మార టంతో ఆయన పలుకుబడి కుర్మీలలో బాగా తగ్గింది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటే గతంలో బీజేపీకి వచ్చినన్ని సీట్లు ఈసారి రావనేది రాజకీయ పరి శీలకుల భావన. ఈ సీట్లలో చాలావాటిని ‘ఇండియా’ కూటమే గెలుచుకుంటుందంటున్నారు. ఇక బిహార్ విషయాని కొద్దాం. ముఖ్యమంత్రి నితీశ్ పిల్లిమొగ్గలతో మొత్తం ఎన్డీయే మీదే అక్కడి ఓటర్లలో వ్యతి రేకత బాగా ఏర్పడింది. ఇక్కడ ఈసారి లాలూప్రసాద్ పార్టీ ఆర్జేడీ బలం పుంజుకొంది. దీనికితోడు కాంగ్రెస్, కమ్యూ నిస్టులు ఈసారి అక్కడ కలిసి పోటీచేయాలనుకుంటు న్నారు. ఇది ‘ఇండియా’ కూటమికి ప్రయోజనం కలిగే అంశం. ఇక బెంగాల్లో మమతా ఒంటరి పోరేనంటోంది. అక్కడ త్రిముఖ పోటీ ఉండటంతో ప్రభుత్వ ఓట్లు చీలి టీఎంసీకి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. రాజస్థాన్లో వసుంధరా రాజే తనను ముఖ్యమంత్రిగా చేయనందుకు రగిలిపోతోంది. ఆమె ఈసారి చురుగ్గా పనిచేయకపోవచ్చు. ఇక ఈశాన్యరాష్ట్రాలలో ఈసారి మణిపుర్ గొడవలు బీజేపీకి నష్టం చేకూర్చనున్నాయి. హిమాచల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం ‘ఇండియా’ కూటమికి అను కూలాంశం. కాంగ్రెస్–ఆప్ పొత్తు కుదుర్చుకున్నాయి కాబట్టి ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానాలలో ఇండియా కూటమి మెరుగయ్యే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనలను చీల్చి బీజేపీ చేసిన రాజకీయాలు ఓటర్ల మనో ఫలకాలపై వ్యతిరేక ముద్ర వేసిందనే చెప్పాలి. ఇక దక్షిణాదిలో... కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, గత బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లలో ఎన్డీయే ఖాతా తెరిచేది గగనమే. తెలంగాణలో గతంలో 4 స్థానాలు గెల వగా ఇప్పుడు వాటిని నిలబెట్టుకొని, మరిన్ని స్థానాలు కైవసం చేసుకోగలదా అన్నది చూడాలి. బీజేపీ రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ ప్రజాబాహు ళ్యంలోకి బాగా వెళ్లిందనీ, ఈసారి అదే అంశం బీజేపీకి అనుకూలాంశం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు ఉత్తర భారతంలో విశేష ప్రజాదరణ లభిస్తున్నందున బీజేపీకి అది అననుకూల అంశమే అవుతుంది. పైన పేర్కొన్న అనేక కారణాల వల్ల గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన స్థానాల కంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా. అందుకే, ఆ పార్టీ తమ ‘టార్గెట్ 400’ అంటూనే, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తుకు దిగుతోందని విశ్లేషణ. – డా‘‘ కె. సుధాకర్ రెడ్డి,రిటైర్డ్ లెక్చరర్ ‘ 89850 37713 -
ఆప్, కాంగ్రెస్ల సీట్ షేరింగ్.. ఎవరికెన్ని సీట్లంటే..
న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)ల మధ్య సీట్ల పంపిణీ ఖాయమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా పూర్తయిందని ఆ పార్టీ నేతలు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలోని 7 సీట్లలో నాలుగింటిలో ఆప్, మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేయనుంది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీల్లో ఆప్ పోటీ చేయనుండగా చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 2014,2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా బీజేపీ ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లను కైవసం చేసుకోవడం విశేషం. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొన్ని సీట్లను ఆప్కు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఇందులో భాగంగా హర్యానాలో ఒకటి, గుజరాత్లో రెండు సీట్ల నుంచి కూడా పొత్తులో భాగంగా ఆప్కు కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఈ వారంలోనే ఇండియా కూటమిలోని మరో ప్రధాన పార్టీ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్ సీట్ల పంపకం ఖరారైన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా యూపీలో ఎస్పీ 63, కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కూటమిలోని మరో పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పశ్చిమబెంగాల్లోని మొత్తం 42 సీట్లలో తామే పోటీ చేస్తామని చెబుతుండడం ఇండియా కూటమి నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఇదీ చదవండి.. కాంగ్రెస్కు భారీ ఝలక్ -
కాంగ్రెస్కు రిలీఫ్.. సీఎం మమత కీలక నిర్ణయం!
ఢిల్లీ: ఇండియా కూటమిలో భాగంగా బెంగాల్లో సీట్ల సర్ధుబాటు అంశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతం తగ్గించుకుని కాంగ్రెస్తో చర్చకు రెడీ అయినట్టు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్లో దాదాపు ఆరు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియ కూటమికి బూస్ట్ లభించింది. ఇండియా కూటమిలో సీట్ల విషయంలో మమతా బెనర్జీ కూడా తన వైఖరిని తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, గతంలో పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ ఇప్పుడు బెంగాల్, మేఘాలయలో కూడా కాంగ్రెస్తో సీట్ల పంపకంపై చర్చలకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య తుది చర్చలు జరిగే అవకాశం ఉంది. Is it a better deal ?? In Bengal, a deal with TMC... Mamata Banerjee is willing to give Congress 5 seats. Initially, TMC had offered only 2 seats.#INDIAAlliance pic.twitter.com/N2phFmAd8n — Sunil Lamba (@Post4India) February 22, 2024 ఇక, రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరితే బెంగాల్లో ఆరు లోక్సభ స్థానాలను కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బెంగాల్లోని బెహ్రంపూర్, దక్షిణ మాల్దా, ఉత్తర మాల్దా, రాయిగంజ్, డార్జిలింగ్, పురిలియా స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఇందుకు మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి ప్రతిగా మేఘాలయ, అస్సాంలలో ఒక్కో సీటును టీఎంసీ కోరుతోందని సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో అధికారికంగా సీట్ల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. యూపీలో కాంగ్రెస్.. అమేథీ, రాయ్బరేలీ సహా 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అఖిలేష్ ఒప్పుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా అఖిలేష్కు ఎంపీ సీటు ఇచ్చింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా కాంగ్రెస్ సీట్లు ఒప్పందం కుదుర్చుకుంది. -
ఇండియా కూటమిలో చేరికపై కమల్ హాసన్ స్పందన
చెన్నై: స్వార్థరహితంగా ఆలోచించే ఏ కూటమితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడుకు చెందిన ఎమ్ఎన్ఎమ్ పార్టీ చీఫ్ కమల్హాసన్ తెలిపారు. ఇండియా కూటమిలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తాము భాగస్వాములం కాదని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా స్థానిక ఫ్యూడల్ శక్తులతో కలిసి మాత్రం పనిచేయబోమని చెప్పారు. స్టాలిన్కు చెందిన డీఎంకే పార్టీతో కమల్హాసన్ కలిసి పనిచేయబోతున్నారన్న పుకార్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్హాసన్ ఈ సందర్భంగా స్వాగతించారు. ఇదీ చదవండి.. గగన్యాన్పై ఇస్రో కీలక అప్డేట్ -
ఇండియా కూటమి..యూపీలో పొత్తుకు బ్రేక్ ?
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి బీటలు వారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ఇచ్చే స్థానాలపై సమాజ్వాద్ పార్టీ కొంత కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రెండు పార్టీల నేతల మధ్య జరిగిన సీట్ షేరింగ్ చర్చల్లో మొరాదాబాద్ డివిజన్లోని మూడు సీట్లపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం. ఈ మూడు సీట్లను కాంగ్రెస్కు ఇచ్చేది లేదని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హస్తం పార్టీ నేతలకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. కాగా, సీట్ల పంపిణీ విషయంలో రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగే వరకు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేది లేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర యూపీలోనే కొనసాగతున్న విషయం తెలిసిందే. మరోవైపు పొత్తులో భాగంగా రాష్ట్రంలో మొత్తంగా 17 సీట్లను కాంగ్రెస్కు ఇచ్చేందుకు అఖిలేశ్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం -
TN: డీఎంకే ప్రచారం షురూ.. మారిన ప్రత్యర్థి !
చెన్నై: తమిళనాడులో లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలైంది. అధికార పార్టీ డీఎంకే ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ‘హక్కుల కోసం స్టాలిన్ పోరు’ పేరుతో ప్రచార భేరి మోగించింది. చెన్నైలోని మూడు, పుదుచ్చేరిలోని ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం తప్ప రాష్ట్రంలోని 37 లోక్సభ స్థానాల్లో ఒకేసారి ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా తమిళనాడులో ఎన్నిక ఏదైనా డీఎంకే, అన్నా డీఎంకే మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే ఈసారి అనూహ్యాంగా డీఎంకే నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి ప్రారంభించారు. తమిళనాడుకు అన్యాయం చేస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి నిధులు రావాలన్నా,మైనారిటీల హక్కులు కాపాడాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిందేనన్నారు. విరుదునగర్ జిల్లాలో జరిగిన ప్రచారంలో ఎంపీ కనిమొలి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు నిధులివ్వకపోయినప్పటికీ స్టాలిన్ విద్య,వైద్యం రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్వన్గా నిలిపారని చెప్పారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకూడదని, వారు ఒక వర్గం ప్రజలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి శేఖర్బాబు ఆరోపించారు. మరోవైపు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై డీఎంకే ఫైల్స్ 3 పేరుతో టూ జీ కుంభకోణానికి సంబంధించి డీఎంకే నేతల ఆడియో విడుదల చేశారు. ఇదీ చదవండి.. భారత్ జోడో న్యాయ యాత్రకు అఖిలేశ్ దూరం -
ఇండియా కూటమి కథ ముగిసింది: నితీశ్ కుమార్
పాట్నా: ఎన్డీఏలో చేరి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బిహార్ సీఎం నితీశ్కుమార్ ఇండియా కూటమిపై తొలిసారి స్పందించారు. శనివారం పాట్నాలో ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందునుంచే ఇష్టం లేదని చెప్పారు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించానన్నారు. బిహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీయేలో చేరానన్నారు. కాగా, ఇప్పటికే ఇండియా కూటమిలో పలు పార్టీలు పొత్తులను పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కూటమిలోని కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీట్లను తేల్చకపోవడం వల్లే మిగిలిన పార్టీలు సొంతగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. w ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ -
‘ఇండియా’కు మరో షాక్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
న్యూఢిల్లీ: ఇండియా కూటమి అసలు ఉంటుందా ఉండదా అని అనుమానాలు తలెత్తుతున్న వేళ కూటమి ఉనికిని ప్రశ్నించే మరో పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ అయిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఏకపక్షంగా వ్యవహరించింది. కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో సంప్రదించకుండా అస్సాంలోని మూడు ఎంపీ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ గురువారం ఢిల్లీలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియా కూటమి తమ అభ్యర్థులకు మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి. మేం ఇండియా కూటమితోనే ఉన్నాం’ అని పాఠక్ అన్నారు. ఇప్పటికే కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 16 మంది అభ్యర్థులతో యూపీలో తన తొలిజాబితాను ప్రకటించింది. ఓ పక్క కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ఎస్పీ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం వివాదాస్పదమైంది. తాజగా కూటమిలోని ఆప్ పార్టీ కూడా ఇదే పని చేయడంతో కూటమి ఉందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించి ఒక దశలో కన్వీనర్ పదవి తీసుకుంటారని ప్రచారం జరిగిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ ఇప్పటికే కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో జతకట్టి బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి.. కాంగ్రెస్ బ్లాక్పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని -
బిహార్లో కూటమిగా పోటీ.. టీఎంసీ మిత్ర పక్షమే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్లో కూటమి, సీఎం మమతా బెనర్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఇండియా కూటమి బీజేపీపై పోరాడుతుందని తెలిపారు. బిహార్లో ఇండియా కూటమిలో భాగంగా బీజేపీపై పోటీ చేస్తామని అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు గమనిస్తే.. ఆమె ఇండియా కుటమిలో కీలకమైన భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి కీలకమైన మిత్రపక్షమని తెలిపారు. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగినప్పటికీ తాము బిహార్లో మిగిలిన పార్టీలతో ఇండియా కూటమిలో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ దిగుతామని వెల్లడించారు. తమ భాగస్వామ్య పార్టీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగం కాదంటే.. తాను ఎప్పటికీ అంగీకరించలేనని రాహుల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొంటామని.. లోక్సభ ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకుంటామని మమతా బెనర్జీ చెప్పటమే రాహుల్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. బెంగాల్ మమతా కాంగ్రెస్కు ఐదు లోక్ సభ స్థానాలు కేటాయించడానికి సిద్ధపడినా సీపీఎంతో పొత్తు కారణం ఇది సాధ్యం పడదని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగిప్పటికీ.. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల భాగస్వామ్యంతో బలంగానే ఉంది. 40 లోక్సభ స్థానాలు ఉన్న బిహార్లో ఇండియా కూటమి సాధ్యమైనన్ని సీట్లు గెలవడానికి కాంగ్రెస్ ప్రణళికలు రచిస్తోంది. -
‘‘ఇండియా కూటమికి నితీశ్ అంత్యక్రియలు చేశారు’’
లక్నో: ఇండియా కూటమిపై ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పుట్టగానే దానికి ఎన్నో వ్యాధులు సంక్రమించాయని, ఆ తర్వాత అది వెంటిలేటర్పైకి వెళ్లిందని ప్రమోద్ అన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఇండియా కూటమికి ఇటీవలే జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాట్నాలో అంత్యక్రియలు పూర్తి చేశారని చెప్పారు. ఇప్పుడిక ఇండియా కూటమి అనేది ఉనికిలో ఉందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రమోద్ ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపైనా పదునైన విమర్శలు గుప్పించారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడుతుంటే ఒక్క కాంగ్రెస్ మాత్రం 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని వ్యంగ్యాస్రం సంధించారు. గత వారమే ఒక విషయమై ప్రమోద్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన త్వరలో కాంగ్రెస్ను వీడీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రమోద్ గత ఎంపీ ఎన్నికల్లో లక్నో నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. ఇదీచదవండి.. ‘‘ఈవీఎంల గోల్మాల్లో ప్రధాని హస్తం ఉండొచ్చు’’ -
2004 - 2024 : కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశలు
2004కు 2024కు లింకుందా? నాడు ఎన్డీయే వర్సెస్ యూపీఏ. నేడు ఎన్డీయే వర్సెస్ ‘ఇండియా’. నాటి ప్రత్యర్థులు వాజ్పేయి-సోనియా. నేటికీ సోనియా, ఆమె ప్రత్యర్థిగా నరేంద్ర మోదీ. ఇప్పుడు కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు ఎందుకు పెట్టుకుంది? మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న సోనియా గాంధీ ఆమె ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఒకసారి ఊహించండి. ఈ ఊహ 20 ఏళ్ల నాడు ఒక నమ్మలేని నిజం.. సోనియా ముభావి. ఎవరితోనూ కలవరు. కానీ ఆ రోజు మాయావతి ఇంటికి వెళ్లిన సోనియా గాంధీ ఆమెతో రెండు గంటల సేపు మాట్లాడారు. తర్వాత బయటికి వస్తూ.. ‘‘రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బహుజన పార్టీతో పొత్తు కుదుర్చుకోబోతున్నది’’ అని ప్రకటించారు. అయితే ఆ మర్నాడే మాయావతి అలాంటి పొత్తేమీ ఉండబోదని స్పష్టం చేశారు! అందుకు ప్రతిస్పందనగా.. ‘‘మాతో పొత్తు పెట్టుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని పార్టీల మీద ఒత్తిడి తెస్తోంది’’ అని సోనియా ఆరోపించారు. నాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్నట్లే ఎన్డీయే. నాడు ప్రధానిగా ఉన్నది అటల్ బిహారి వాజ్పేయి. బహుజన పార్టీతో పొత్తుకోసం ప్రయత్నించినట్లే సోనియా గాంధీ నమాజ్వాది పార్టీ పొత్తు కోసం చేయిచాచారు. సోనియా ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి అమర్సింగ్ హాజరు అయ్యారు కానీ, ములాయం సింగ్ యాదవ్ మాత్రం పొత్తు వద్దు, 1999లో మాదిరిగా ఒంటరి పోరాటమే మేలని అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా పొత్తుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయనపై కార్యకర్తల ఒత్తిడి కారణంగా కాంగ్రెస్తో చేయీచేయీ కలిపేందుకు బలవంతపు నవ్వులనే ఆనాడు ఆయన రువ్వారు. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం కాంగ్రెస్తో కలిసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు దగ్గరే ఆయన గీచిగీచి బేరం ఆడారు. లాలూ 6 స్థానాలు మాత్రమే ఇస్తాం అంటే కాంగ్రెస్ కనీసం 10 అయినా కావాలని కోరింది. ఇక డీఎంకేతో పొత్తు. అప్పటికి (2004 నాటికి) 24 ఏళ్లుగా కాంగ్రెస్కు దూరంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్తో కలిసి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చింది. అయితే లాలూ మాదిరిగానే కరుణానిధి కూడా 5 లేదా 6 సీట్లు ఇవ్వగలం అన్నారు. ఆయన తరఫున టి.బాలు సోనియాతో చర్చలు జరిపారు. అవి విఫలం అయ్యాయి. అలాగే.. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తేనే మీతో పొత్తుకు వస్తాం అని కేసీఆర్ తెగేసి చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గింది. జేఎంఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు కోరడంతో పొత్తుకు ముందుకు రాలేదు. ఏమైతేనేం ఆ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ యూపీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయేకు 181 సీట్లు రాగా, యూపీఏకు 218 సీట్లు లభించాయి. ఎన్నికల పొత్తుకు ముందుకు రాని పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాయి! బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాది పార్టీ, కేరళ కాంగ్రెస్, లెఫ్ట ఫ్రంట్లకు వచ్చిన సీట్లు కూడా కలుపుకుని 543 సభ్యుల లోక్సభలో సౌకర్యవంతమైన 335 సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. విశేషం ఏమిటంటే.. 2004లో ఎవరి మధ్యనైతే పోటీ ఉందో వారి మధ్యనే ఈ 2024లోనూ పోటీ ఉండబోవటం. నాడు, నేడు అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే. నాడు నేడు ప్రతిపక్షంగా ఉన్నది యూపీఏ కూటమే. అయితే యూపీఏ కాస్తా ‘ఇండియా’ కూటమి అయింది. నాడు స్వయంగా సోనియాజీ వెళ్లి పొత్తు కోసం ప్రయత్నించినా పొత్తుకు ముందుకు వచ్చిన పార్టీలు తక్కువ. నేడూ ఇంచుమించుగా అదే పరిస్థితి. పొత్తుకు వచ్చిన పార్టీలు ఎక్కువే అయినా ఎన్నికల వరకు అవి కాంగ్రెస్తో నిలబడి ఉంటాయా అన్నది సందేహం. ఆ సందేహం కలిగించిన మొదటి వ్యక్తి నితీష్ కుమార్. మూడు రోజుల క్రితమే ఆయన ‘ఇండియా’ కూటమిని వీడిపోయి ఎన్డీయేలో కలిశారు. మమతా బెనర్జీ కూడా తాము విడిగానే పోటీ చేస్తామని అంటున్నారు. ‘ఆప్’ కూడా ఆమె బాటలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. నితీశ్ కమార్ బయటికి వెళ్లకముందు వరకు ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ‘ఇండిపెండెంట్’ పార్టీతో కలిపి మొత్తం 28 పార్టీలు ఉండేవి. అవి: 1. కాంగ్రెస్, 2. డీఎంకే, 3. శివసేన (యు.బి.టి.), 4. సి.పి.ఐ (ఎం), 5. ఎన్.సి.పి., 6. ముస్లిం లీగ్, 7. నేషనల్ కాన్ఫరెన్స్, 8. సి.పి.ఐ., 9. ఆప్, 10. జె.ఎం.ఎం., 11. కేరళ కాంగ్రెస్, 12. కేరళ కాంగ్రెస్ (ఎం), 13. వీసీకె (విదుతలై చిరుతైగళ్ కచ్చి), 14. ఆర్.ఎస్.పి., 15. ఆర్.జె.డి., 16. ఆర్.ఎల్.డి., 17. డి.ఎం.కె., 18. సీపీఐ (ఎంఎల్) ఎల్., 19. అప్నా దళ్, 20. పీసెంట్స్ అండ్ 21. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, 22. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, 23. పి.డి.పి., 24. ఎం.ఎం.కె., 25. కె.ఎం.డి.కె., 26. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 27. ఇండిపెండెంట్, 28. జేడీయు. నాటి ఎన్నికల్లో వాజ్పేయి-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. నేటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా పార్టీలో దింపుడు కళ్లెం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయి. చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
‘ఇండియా’కు తొలి ఓటమి.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: ఇండియా కూటమికి తొలిపోరులోనే ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. పరోక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎక్కువ కార్పొరేటర్ సీట్లున్నప్పటికీ అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్గా విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలబడ్డ ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్పై మనోజ్ సొంకార్ గెలుపొందారు. మొత్తం 35 ఓట్లున్న కౌన్సిల్లో బీజేపీకి 14 మంది, ఆప్కు 13, కాంగ్రెస్కు 7, శిరోమణి అకాలీదల్కు ఒక సభ్యుడి బలం ఉంది. అయితే 8 మంది సభ్యులను ఓటింగ్లో పాల్గొనకుండా ప్రిసైడింగ్ అధికారి డిస్క్వాలిఫై చేయడంతో బీజేపీకి అభ్యర్థికి 15 ఓట్లు, ఇండియా కూటమి అభ్యర్థి 12 ఓట్లు వచ్చాయి. రిజల్ట్ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్, ఆప్ సభ్యులు నిరసనకు దిగారు. ఛండీగఢ్ మేయర్గా బీజేపీకి చెందిన అభ్యర్థి విజయం సాధించడంపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. బీజేపీ పట్టపగలు మోసం చేసి మేయర్ సీటు గెలిచిందన్నారు. మేయర్ ఎన్నిక కోసమే బీజేపీ ఇంత దిగజారితే రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఇంకెంతకైనా తెగిస్తుందని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇదీచదవండి.. పార్టీ కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతల ఘర్షణ -
పిల్లిమొగ్గల రాజకీయం
అనుకున్నదే అయింది. ఊహాగానాల్ని నితీశ్ కుమార్ నిజం చేశారు. ‘ఇండియా’ కూటమిలో నుంచి బయటకురావడం, కూటమిలోని ఆర్జేడీతో కలసి బిహార్లో నడుపుతున్న సర్కార్కు స్వస్తి చెప్పడం, ‘ఎన్డీఏ’లో మళ్ళీ చేరుతున్నట్టు ప్రకటించడం, ముందుగా మాట్లాడిపెట్టుకున్న బీజేపీ మద్దతుతో ఆదివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. దీంతో, రానున్న ఎన్నికల రాజకీయ నాటకంలో ఒక అంకం ముగిసింది. కొత్త చర్చ మొదలైంది. తొమ్మిదోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతూ, ఎన్డీఏ నుంచి ఇక అటూ ఇటూ ఎక్కడికీ పోనంటూ నితీశ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ నమ్మడం లేదు కానీ, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ బిహారీ బాబు తాజా పిల్లిమొగ్గల పర్యవసానం ఏమిటి, మోదీపై యుద్ధానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు – ఒక వర్గం ఓటర్లు ఆశపడ్డ ‘ఇండియా’ కూటమి భవితవ్యం ఏమిటి, ఎన్డీఏ కూటమికి ఎంతగా లాభిస్తుందన్న చర్చ ఆగడం లేదు. తరచూ పొత్తులు మారుస్తూ, నోటికొచ్చిన వివరణతో నెట్టుకొస్తున్న నితీశ్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైన నేత. రెండేళ్ళలో రెండోసారి, దశాబ్ది పైచిలుకులో అయిదోసారి రంగులు మార్చి, తాజాగా తొమ్మిదోసారి పీఠమెక్కి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న ఆయన తీరును పలువురు తప్పుబట్టడంలో ఆశ్చర్యం లేదు. అసలు ‘ఇండియా’ కూటమి కట్టడంలో సూత్రధారే నితీశ్. దశాబ్దాల రాష్ట్ర రాజకీయ అనుభవం అనంతరం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆయన మోజుపడ్డారు. కూటమికి సమన్వయకర్తగా వ్యవహరించాలనీ, కాలం కలిసొస్తే రాబోయే ప్రతిపక్ష సర్కారుకు ప్రధాన మంత్రి కావాలనీ కలలు కన్నారు. కానీ, ఛాన్స్ తన దాకా రాకపోవచ్చని గ్రహించేశారు. పీతలబుట్ట లాంటి ప్రతిపక్షాలు, బలం పెరుగుతున్న బీజేపీ లాంటివి చూసి నితీశ్ ప్లేటు తిప్పేశారు. గెలుపు గుర్రంపై పందెం కాస్తే, పీఎం కాకున్నా ప్రయోజనాలైనా నెరవేరతాయను కున్నారు. ‘చస్తే మళ్ళీ వెళ్ళన’ని ఏడాది క్రితం అన్న ఎన్డీఏ కూటమిలోకే నిస్సిగ్గుగా ఫిరాయించారు. ఇందులో ప్రతిపక్ష కూటమి స్వయంకృతమూ ఉంది. ఆ మధ్య 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు, వాటిపైనే దృష్టిపెట్టి కూటమి తన పనిని పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. అలా 3 నెలల పైనే వృథా అయింది. సార్వత్రిక ఎన్నికల సన్నాహం, ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయ సాధన వెనకపట్టు పట్టింది. కనీసం 300 లోక్సభా స్థానాల్లో పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పట్టుబట్టడమూ కూటమి పక్షాలకు మింగుడుపడలేదు. పోనీ ఆ డిమాండ్కు తగ్గట్టు కాంగ్రెస్ తన బలిమిని చూపగలిగిందా అంటే అదీ లేదు. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింటిలో హస్తం వీగిపోయింది. ‘ఇండియా’ కూటమిలో తనదే పైచేయిగా ఉండాలన్న ఆ పార్టీ ఆశ అడియాసే అయింది. మునుపటంత బలం లేని జాతీయ పార్టీని తమ భుజాలపై మోయడానికి బలమైన ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు. పైగా, కన్వీనర్ అంటూ ఎవరినీ ఎంపిక చేయకపోవడం మరో తప్పిదం. కనీస ఉమ్మడి అజెండా మొదలు సీట్ల పంపిణీ దాకా అన్నిటినీ పేరబెట్టేసరికి చివరకు వ్యవహారం చేయి దాటింది. ఎన్నికలు కొద్ది నెలల్లోనే ఉన్నా, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇచ్చినంత ప్రాధాన్యం వాటికి ఇవ్వట్లేదన్నది కాంగ్రెస్పై మరో విమర్శ. ఈ యాత్ర ద్వారా ప్రజా బాహుళ్యంలో బలం పుంజుకొని, తమకు మరిన్ని సీట్ల కోసం గట్టిగా బేరం చేయాలనేది ఆ పార్టీ భావననీ ఓ విశ్లేషణ. ఏమైనా, ప్రతిపక్షాలు అనైక్యతతో ఇలా కుమ్ములాడుకుంటూ ఉండగానే, బీజేపీ మాత్రం ఎన్నికలకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ఇన్ఛార్జ్లను సైతం నియమించేసింది. గత వారం బులంద్షహర్లో సభతో ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల సమరభేరి మోగించారు. జైపూర్ లాంటి చోట్ల ర్యాలీలతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కొద్ది నెలల క్రితమే 5 రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడింటిని గెలుచుకోవడం సైతం బీజేపీకి కొత్త ఊపునిచ్చింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి మీడియా, అలాగే కేంద్ర సర్కార్ హంగామాతో హిందూత్వకు మారుపేరుగా ఆ పార్టీ తన స్థానం సుస్థిరం చేసుకుంది. అందుకే, దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిన ఈ హిందూత్వ ప్రభంజనానికి ఎదురొడ్డడం ప్రతి పక్షాలకు అగ్నిపరీక్షే. పైగా, మందిర్ ప్లస్ మండల్గా మారిన బీజేపీ వ్యూహం పదునైనది. మండల్ రాజకీయాల ఉద్ధృతిలో వచ్చిన కుల ఆధారిత పార్టీలకు సెగ తగులుతోంది. అయితే, మోదీ సర్కార్ విభజన రాజకీయాలు చేస్తోందనీ, ప్రజాస్వామ్యానికిది ప్రమాద భరితమనీ అన్న నోటితోనే నితీశ్ మళ్ళీ అదే పంచన చేరడం ఆయన ఇమేజ్ను పలచన చేసింది. కుల సమీకరణలు నిష్ఠురసత్యమైన ప్పటికీ, బిహార్లో బలం తగ్గుతున్న నితీశ్కూ, ఆయన పార్టీకీ తాజా పిల్లిమొగ్గ అద్భుత భవితను అందించకపోవచ్చు. నితీశ్ నైజం తెలుసు గనక ఆయన్ని అడ్డం పెట్టుకొని, లోక్సభ ఎన్నికల్లో 40 స్థానాల బిహార్లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. అవసరం తీరాక ఆ దోస్తీ కొనసాగకపోవచ్చు. లోక్సభ తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లోపు ఏమవుతుందో, మన ‘పల్టూ రామ్’ ఏం చేస్తారో చెప్పలేం. నెలల క్రితం ఆశ రేపిన ప్రతిపక్ష కూటమి ఇప్పుడు బలహీనమైందన్నది నిజం. కానీ, ఇంతటితో కూటమి కథ ముగిసిందనడం తొందరపాటే. తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ పాలనపై దేశమంతా తృప్తిగా ఏమీ లేదు. ధరలు, నిరుద్యోగం, విభజన రాజకీయాలపై జనంలో అసహనం ఉన్నా, మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం విషాదం. మోదీని దింపాలనే తప్ప పాజిటివ్ అజెండా చెప్పలేకుంటే ఈ అసంతృప్త, అనిశ్చిత ఓటర్ గణాన్ని ప్రతిపక్షాలు ఆకర్షించలేవు. ప్రతిపక్షాలంటే కుమ్ములాటల కూటమనే భావన తొలగించకపోతే, ఎన్ని ఎన్నికలొచ్చినా అది ఎడ్వాంటేజ్ బీజేపీయే. ఇది వికసిత, ఆత్మనిర్భర్ భారత్ అవునో కాదో కానీ, ‘ఇండియా’ మటుకు వెలిగిపోవడం లేదంటున్నది అందుకే! -
అనైక్యతా కూటమి
వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ప్రతిఘటిస్తామని 28 పార్టీల కలగూరగంప ‘ఇండియా’ కూటమి ఆది నుంచి చెబుతోంది. కానీ, ఎన్నికలు ముంచుకొస్తుంటే, కూటమి బీటలు వారుతోంది. అంతటా అనైక్యతా రాగాలే వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తేల్చేశారు. ‘ఆప్’ నేత – పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సైతం తమ రాష్ట్రంలోనూ అంతే అని కుండబద్దలు కొట్టారు. జేడీ(యూ) అధినేత – బిహార్ సీఎం నితీశ్ కుమార్ పైకి ఏమీ చెప్పకున్నా, లోలోపల కుతకుతలాడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. వెరసి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ అని తిరుగుతుంటే, ముందుగా ‘ఇండియా(కూటమి) జోడో’ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందే మమత షాక్ ఇచ్చారు. బెంగాల్లో హస్తం బలం పుంజుకుంటే, అది తనకు తలనొప్పి అవుతుందని మమతకు తెలుసు. అందుకే, కలసికట్టుగా పోటీ చేసినా... రాష్ట్రంలో నిరుడు కాంగ్రెస్ నెగ్గిన 2 లోక్సభా స్థానాలనే ఆ పార్టీకి కేటాయిస్తామన్నది తృణమూల్ ప్రతిపాదన. దూకుడు ప్రదర్శిస్తున్న స్థానిక హస్తం నేతలు అందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి నిత్యం మమతపై చేస్తున్న విమర్శలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. కాంగ్రెస్ పెద్దలు నష్టనివారణకు ప్రయత్నిస్తున్నా రాజీ లేదని దీదీ కొట్టిపారే శారు. కూటమిలో కొనసాగుతామంటూనే, ఎన్నికలయ్యాక కాంగ్రెస్ బలాన్ని బట్టి మిగతావి మాట్లా డదామని ఆమె చెబుతున్న మాటలు కంటితుడుపుకే తప్ప, బీజేపీపై కలసికట్టు పోరుకు పనికిరావు. మరోపక్క ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్రధారి, జేడీ (యూ) అధినేత, బిహార్ సీఎం అయిన నితీశ్ కుమార్ వ్యవహారశైలి సైతం అనుమానాస్పదంగానే ఉంది. కూటమిలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మోదీతో రామ్ రామ్ చెప్పి, ప్రతిపక్ష కూటమిలో చేరిన ఆయన తీరా ఇప్పుడు మళ్ళీ అధికార ఎన్డీఏ కూటమికే తిరిగి వచ్చేస్తారని ఊహాగానం. బిహార్లో ఉమ్మడి పాలన సాగిస్తున్న ఆర్జేడీ – జేడీయూల మధ్య కొన్నాళ్ళుగా సఖ్యత లేదు. ప్లేటు ఫిరాయించడంలో పేరొందిన నితీశ్ గతంలో బీజేపీకి కటీఫ్ చెప్పి, ఆర్జేడీతో కలసి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ, ఇటీవల తననే గద్దె దింపాలని చూసిన ఆర్జేడీ మీద గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీని పక్కకు నెట్టి, మళ్ళీ కమలనాథులతో నితీశ్ చేతులు కలిపే సూచనలున్నట్టు పుకారు. బిహార్లో జేడీయూ, ఆర్జేడీ నేతలు ఎవరికి వారు గురువారం కీలక భేటీలు జరపడం, ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తీరు చూస్తుంటే... ఆ రెండు పార్టీల ప్రేమకథ ముగిసినట్టే ఉంది. మరి, రాజకీయ చాణక్యుడు నితీశ్ రానున్న రోజుల్లో ఏం చేస్తారో చూడాలి. విచిత్రమేమిటంటే, మాటలే తప్ప చేతల్లో కూటమి అడుగు ముందుకు పడట్లేదు. సెప్టెంబర్లో అనుకున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం డిసెంబర్కి వాయిదా పడి, జనవరి ముగిసిపోతున్నా అతీగతీ లేకుండా పడివుంది. అన్ని పార్టీలూ కలసి సమష్టి ప్రతిపక్ష ర్యాలీ భోపాల్లో చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. నెలలు గడుస్తున్నా ఉమ్మడి మేనిఫెస్టో ఊసే లేదు. లౌకికవాద, రాజ్యాంగబద్ధ పాలన కోసం పోరాటం అని చెబుతున్నా... బీజేపీ వ్యతిరేకత, మోడీని గద్దె దింపడమనే లక్ష్యం మినహా తగిన సమష్టి సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. వివిధ రాష్ట్రాల్లో తమ బలాబలాలు తెలుసు గనక, పార్టీలు తమలో తాము పోరాడే కన్నా బీజేపీపై బాణం ఎక్కుపెడితే ప్రయోజనం. ఒకటి రెండు సీట్లకై పంపిణీలో కలహించుకొనే కన్నా పెద్ద లక్ష్యం కోసం విశాల హృదయంతో త్యాగాలకు సిద్ధపడితేనే లక్ష్యం చేరువవుతుంది. బెంగాల్లో తృణమూల్, పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ లేకుండా కూటమికి ప్రాసంగికత ఏముంది? వాస్తవాల్ని గుర్తించి కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలి. పెద్దమనిషిగా కాక, అందరికీ పెద్దన్నగా వ్యవహరించాలనుకోవడంతోనే అసలు ఇబ్బంది. అలాగే, ‘యాత్ర’లతో రాహుల్ ఇమేజ్ పెరగ వచ్చేమో కానీ, ప్రతిపక్ష కూటమికి జరిగే ప్రయోజనమేమిటో తక్షణం చెప్పలేం. మణిపుర్ నుంచి ముంబయ్ దాకా 100 లోక్సభా స్థానాల మీదుగా సాగి, మార్చి 20న యాత్ర ముగియనుంది. అన్ని పార్టీలనూ ఒక తాటిపై నడిపి, సమన్వయం సాధించాల్సిన ఎన్నికల వేళ రాహుల్ దూరంగా యాత్రలో ఉంటే ఎలా? కనీసం అన్ని పార్టీలతో కలిసైనా యాత్ర చేయాల్సింది. ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రతిపక్షాల్ని కూడగట్టడంలో 1977లో జేపీ, 1989లో వీపీ సింగ్, ఆ తరువాత యూపీఏ కాలంలో అందరి సమన్వయానికి సోనియా లాంటి వారు కృషి చేశారు. ప్రస్తుతం యాత్రతో రాహుల్, పార్టీ పునరుజ్జీవనంతో ఖర్గే బిజీ. మరి, కూటమి మెడలో ఐక్యత గంట కట్టేదెవరు? మొత్తానికి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రోడ్షోలు, ప్రచారగీతాలతో సింహనాదం చేస్తుంటే, ప్రతిపక్షాలు వేటికవి స్వలాభం చూసుకుంటూ విభేదాల బాట పట్టడం విడ్డూరం. సమావేశాలతో హంగామా రేపుతూ మొదలైన ప్రతిపక్ష కూటమి తీరా ఆట ఆడకుండానే ‘వాక్ ఓవర్’తో మోదీకి విజయం కట్టబెడుతోందని అనిపిస్తోంది. 28 కత్తులు ఒకే ఒరలో ఇమడడం కష్టమే. కానీ, అన్ని పార్టీ లకూ ఒకే లక్ష్యం ఉంటే, అసాధ్యం కాకపోవచ్చు. నిష్క్రియాపరత్వంతో, సొంత లాభం కోసం సాటి పార్టీల కాళ్ళు నరికే పనిలో ఉంటే లాభం లేదు. ఢిల్లీలో పాగా వేయాలంటే, సమయం మించిపోక ముందే కళ్ళు తెరవాలి. కూటమిది ఆరంభ శూరత్వం కాదని నిరూపించాలి. కలహాలు మాని కార్యా చరణకు దిగాలి. లేదంటే తర్వాతేం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement