Indian National Developmental Inclusive Alliance(INDIA)
-
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా.. భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రమే కూటమి మనుగడ కొనసాగాలనుకుంటే.. వెంటనే దానిని రద్దు చేయాలని సూచించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్లు తలపడుతుండడమే అందుకు కారణం. ఎన్సీ అధినేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో నేను మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఆ ఎన్నికలతో మాకు సంబంధం లేదు కాబట్టి. కానీ, మా ఇండియా కూటమికి ఓ కాలపరిమితి అంటూ లేకుండా పోయింది.దురదృష్టవశాత్తూ.. ఇండియా కూటమి సమావేశాలు జరిగినా నాయకత్వం, ఎజెండా, దాని మనుగడ గురించి స్పష్టత లేకుండా పోయింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే కూటమి అనుకుంటే గనుక దానిని రద్దు చేస్తేనే మంచిది అని అభిప్రాయపడ్డారాయన.#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, "... I cannot say anything about what's going on in Delhi because we have nothing to do with Delhi Elections... As far as I remember, there was no time limit to the INDIA alliance. Unfortunately, no INDIA alliance meeting is being… pic.twitter.com/u9w9FazeJG— ANI (@ANI) January 9, 2025ఇదిలా ఉంటే.. కిందటి ఏడాదిలో జరిగిన జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, ఎన్సీ కలిసే పోటీ చేసి విజయం సాధించాయి. అయితే.. మొన్నీమధ్య ఈవీఎంల వ్యవహారంలో ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీతో విబేధించారు. ఈవీఎంలను నిందించడం ఆపేసి గెలుపోటములను అంగీకరించాలని సలహా కూడా ఇచ్చారు. అయితే సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందంటూ కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్యలో..బీజేపీపైనా ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు గుప్పించడంతో ఆయన విపక్ష కూటమికి దూరం అవుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ వెంటనే ఆయన అమిత్ షాను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అయితే.. జమ్మూకశ్మీర్కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రహోదా పునరుద్దరణ కోసమే కేంద్ర మంత్రి అమిత్షాను కలిసినట్లు స్పష్టత ఇచ్చారు.తేజస్వి కామెంట్లతో.. ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమి రద్దు వ్యాఖ్యలు ఊరికనే చేయలేదు. ఇండియా కూటమిలో గత కొంతకాలంగా నాయకత్వం విషయంలో బేధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కూటమిని కాంగ్రెస్ ముందుండి నడిపించాలని భావిస్తుండగా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎస్పీ, ఆర్జేడీ లాంటి కొన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ కాంగ్రెస్ వెంట ‘బీజేపీ వ్యతిరేక నిరసనల్లో’’ ఈ రెండు పార్టీలు కలిసి రాలేదు. దీంతో ఇండియా కూటమి మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయనన్న చర్చ నడిచింది. ఈ తరుణంలో.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ ఫైట్ ఈ గ్యాప్ను మరింతగా పెంచాయి. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దానిని ఇండియా కూటమి నుంచి దూరం పెట్టాలని ఆప్ డిమాండ్ సైతం చేసింది. ఈ పోటీని ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన కామెంట్లపైనే ఆయన అలా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ తేజస్వి ఏమన్నారంటే.. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యం. కాబట్టి కూటమి ఆ లక్ష్యం వరకే కట్టుబడి ఉంటుంది. అలాంటప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆప్లు తలబడడం అసాధారణమైనదేం కాదు’’ అని తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ పరిణామంపై బీజేపీ సైతం స్పందించింది. ‘‘దేశీయంగా, అంతర్జాతీయంగా కుంభకోణాలు చేసినవాళ్లు, కేసులు ఉన్నవాళ్లు.. నిజాయితీపరుడైన మోదీకి వ్యతిరేకంగా ఒక్కతాటి మీదకు వచ్చాయి’’ అని ఎద్దేవా చేసింది. -
ON-OP: అదే జరిగితే మళ్లీ కథ మొదటికే!
దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక నిర్వహించాలన్న ‘జమిలి బిల్లు’ తొలి గండం గట్టెక్కింది. ఇవాళ లోక్సభలో బిల్లుల కోసం 269-198తో ఆమోదం లభించింది. దీంతో విస్తృత సంప్రదింపులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లులు వెళ్లనున్నాయి. అయితే అంతకంటే ముందే నిర్దిష్ట గడువులోగా జేపీసీ ఏర్పాటు కావాల్సి ఉంది.శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. అంటే ఈలోపే జేపీసీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు ఆయనకు ఎంతో కీలకం. ఆయన కమిటీని ఏర్పాటు చేసి.. త్వరగతిన పనిని అప్పగించాల్సి ఉంటుంది. జేపీసీలో రాజ్యసభ ఎంపీలు కూడా ఉంటారు. అధికార సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్సభ నుంచే 21 మంది ఉంటారు. ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. మళ్లీ వచ్చే సెషన్లో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.కాంగ్రెస్ తిరస్కరణమంగళవారం మధ్యాహ్నాం లోక్సభ ముందు జమిలి ఎన్నికల బిల్లులు వచ్చాయి. రాజ్యాంగ సవరణ బిల్లు (ఆర్టికల్ 129), కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టడానికి అవసరమైన డివిజన్ ఓటింగ్ కంటే ముందు.. సభలో వాడివేడిగా చర్చ నడిచింది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్డీయే సభ్య పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి. ఆపై విపకక్షాల అభ్యంతరాల నడుమ.. డివిజన్ ఓటింగ్ అనివార్యమైంది. ఈ ఓటింగ్లో బిల్లు ప్రవేశపెట్టడానికే ఆమోదం లభించింది. అయితే ఈ పరిణామం తర్వాత కాంగగ్రెస్ మరోసారి స్పందించింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని స్పష్టం చేసింది.జేపీసీకి డెడ్లైన్ ఉంటుందా?జమిలి ఎన్నికల నిర్వహణపై జేపీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదు. కేవలం విస్తృత సంప్రదింపుల ద్వారా నివేదికను మాత్రమే రూపొందిస్తుంది. ఇందుకోసం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీలో సభ్యులుకానీ ఎంపీలతో అలాగే రాజ్యాంగపరమైన మేధావులు, న్యాయ కోవిదులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘంలో మాజీ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతుంది. అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు జరపొచ్చని తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రం చేపడుతుంది. ఆపై తుది నివేదికను సమర్పిస్తుంది.జేపీసీకి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే ఆ గడువును పొడిగించే అవకాశమూ ఉంటుంది. ఆపై అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో బిల్లులపై చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356లకు సవరణ తప్పనిసరిగా జరగాలి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలు.. వచ్చే ఏడాదే ఓటింగ్ !! -
రాజ్యాంగం కన్నా... అధికారమే మీకు మిన్న
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం పార్లమెంటుకు చేరింది. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మధ్య వాడీవేడి చర్చకు శుక్రవారం లోక్సభ వేదికైంది. రాజ్యాంగ వజ్రోత్సవాలపై లోక్సభ చేపట్టిన రెండు రోజుల చర్చను ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రారంభించారు. కాంగ్రెస్కు ఎప్పుడూ అధికారంపైనే యావ అని, అందుకోసం రాజ్యాంగానికి నిరంతరం తూట్లు పొడుస్తూ వచ్చిందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో వ్యవస్థల స్వయం ప్రతిపత్తిని ఎన్నడూ సహించింది లేదు. రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి పాతర వేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. అలాంటి పార్టీ నోట రాజ్యాంగ పరిరక్షణ వంటి మాటలు వినడం ఎబ్బెట్టుగా ఉంది’’ అంటూ ఎత్తిపొడిచారు. ఆయన విమర్శలకు కాంగ్రెస్ తరఫున నూతన ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా గట్టిగా కౌంటరిచ్చారు. అసలు దేశానికి రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచానికి నిలువునా తూట్లు పొడిచిందే మోదీ ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. జడ్జి బి.హెచ్.లోయా మృతిపై తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సభలో ఆద్యంతం ఇరుపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. నినాదాలు, అరుపులు, కేకల నడుమ రెండుసార్లు సభ వాయిదా పడింది. జేబులో పెట్టుకోవడమే నైజం రాజ్యాంగాన్ని దేశానికి తానిచి్చన కానుకగా కాంగ్రెస్ భ్రమ పడుతోందని రాజ్నాథ్ అన్నారు. రాజ్యాంగ కూర్పులో, అది ప్రవచించిన విలువల పరిరక్షణలో విపక్షాలు, కాంగ్రెసేతర నేతల పాత్రను నిరంతరం తక్కువ చేసి చూపేందుకే ప్రయతి్నంచిందని ఆరోపించారు. 1944లోనే పలువురు దేశభక్త నేతలు స్వతంత్ర హిందూస్తాన్ రాజ్యాంగాన్ని రూపొందించారని నాటి హిందూ మహాసభ ప్రయత్నాలను ఉద్దేశించి రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘‘పండిట్ మదన్మోహన్ మాలవీయ, లాలా లజపతిరాయ్, భగత్సింగ్, వీర సావర్కార్ వంటి నాయకులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కాకపోయినా వారి భావజాలాలు రాజ్యాంగంలో అడుగడుగునా ప్రతిఫలిస్తున్నాయి. వారంతా నిత్య స్మరణీయులు. అలాంటి మహా నాయకులపైనా మతవాద ముద్ర వేసిన చరిత్ర కాంగ్రెస్ది! రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు, దాని రూపురేఖలనే మార్చేసేందుకు దుస్సాహసం చేసి పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. ఆ లక్ష్యంతోనే తన దశాబ్దాల పాలనలో రాజ్యాంగాన్ని చీటికీమాటికీ సవరిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీ విధింపు మొదలుకుని విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, ఇందిర సర్కారు నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే పక్కకు తప్పించడం దాకా ఇందుకు ఉదాహరణలన్నో! భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్కు చెందిన తొలి ప్రధాని నెహ్రూ కూడా ఏకంగా రాజ్యాంగాన్నే సవరించారు! అలాంటి పారీ్టకి చెందిన వాళ్లు నేడు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘పైగా విపక్ష నేతలు కొందరు కొద్ది రోజులుగా రాజ్యాంగ ప్రతిని జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు. చిన్నతనం నుంచీ వారు నేర్చుకున్నది అదే. ఎందుకంటే వారి కుటుంబ పెద్దలు కొన్ని తరాలుగా రాజ్యాంగాన్ని తమ జేబుల్లో పెట్టుకున్న వైనాన్ని చూస్తూ పెరిగారు మరి!’’ అంటూ రాహుల్గాంధీ తదితరులను ఉద్దేశించి రాజ్నాథ్ ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు చప్పట్లతో అభినందించగా విపక్ష సభ్యులు ‘సిగ్గు, సిగ్గు’ అంటూ నిరసించారు. -
అసమ్మతి... అనైక్యత...
ఆరు నెలల క్రితం లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అనతికాలంలోనే నాలుగు రోడ్ల కూడలిలో దిక్కుతోచని పరిస్థితిలో పడినట్టు కనిపిస్తోంది. జార్ఖండ్, జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుబాటలో పయనించినా, హర్యానా, మహారాష్ట్రల్లో ఎదురైన దిగ్భ్రాంతికరమైన పరాజయాలు ఇప్పుడు కూటమి భాగస్వామ్యపక్షాల మధ్య విభేదాల కుంపటిని రాజేస్తున్నాయి. హర్యానా ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేజేతులా కాంగ్రెస్ ఓటమి కొనితెచ్చుకుంటే, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) సోదిలో లేకుండా పోవడమూ స్వయంకృతమేనన్న భావన అసమ్మతిని పెంచింది. ఖర్గే సారథ్యంలోని ‘ఇండియా’ కూటమిలో ప్రధానపాత్ర కాంగ్రెస్దే గనక మహారాష్ట్రలో దెబ్బతో అనూహ్యంగా నాయకత్వ మార్పు అంశం తెర మీదకొచ్చింది. సారథ్యానికి సిద్ధమంటూ మమత ముందుకు రావడంతో కథ మలుపు తిరిగింది.కూటమి ఆశించిన ఫలితాలు రావడం లేదన్న అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితుల్లో అసలీ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించినదే మమతా బెనర్జీ గనక ఇప్పుడీ కూటమికి ఆమే సారథ్యం వహించాలనీ, అందుకామె సిద్ధంగా ఉన్నారనీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ ముందుగా గళం విప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దీదీ ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, ‘కూటమిని వారు నడిపించ లేకపోతే, నేనే నడిపిస్తాను’ అని కుండబద్దలు కొట్టేశారు. బెంగాల్ను వీడకుండా,అక్కడ నుంచే కూటమి సాఫీగా నడిచేలా చేస్తాననీ వ్యాఖ్యానించారు. దానికి కొనసాగింపుగా జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత శరద్ పవార్ సైతం జాతీయ నేతగా మమత సమర్థురాలనడంతో తేనెతుట్టె కదిలింది. కూటమిలోని లుకలుకలు, కాంగ్రెస్ పట్ల ఇతర భాగస్వామ్య పక్షాల అసంతృప్తి, అసమ్మతి స్వరాలు బయటపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అలాగే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ సహా పలువురు కోరస్ కలపడంతో విషయం వీథికెక్కింది. సీపీఐ సైతం సీట్ల సర్దు బాటులో వామపక్షాలకు కూటమి చోటివ్వడం లేదంటూ, కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకోవాలనేశారు.నిజానికి, ఈ ఏటి లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి కొంత ఊపు వచ్చినా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బలతో అంతా నీరుగారింది. ఆ మధ్య హర్యానాలో దెబ్బ తినడమే కాక, తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి తుడిచిపెట్టుకుపోవడం అశనిపాతమైంది. ఆశలు క్షీణించడంతో హస్తం పార్టీ సారథ్యంపై అసమ్మతి స్వరం పెరిగింది. ఆ మాటకొస్తే తృణ మూల్ చాన్నాళ్ళుగా కాంగ్రెస్కు దూరంగా ఉంటోంది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు సరికదా పార్లమెంట్ సమావేశాల్లోనూ అంటీముట్టని వైఖరి. ఇటీవల ఎస్పీది సైతం అదే ధోరణి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో హస్తం పార్టీతో కలవడానికి ఇష్టపడకపోగా, పార్లమెంట్లో రాహుల్ ముందుండి నడుపుతున్న అదానీ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లోనూ తృణమూల్ లానే పాలు పంచు కోవట్లేదు. ఇది చాలదన్నట్టు రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ఆప్ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు విడతల వారీగా విడుదల చేసేస్తూ, చర్చలకు తావు లేకుండా చేసేసింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలనీ, ప్రతిపక్ష ఐక్యతకు చర్యలు ఆలోచించాలనీ శివ సేన (ఉద్ధవ్ బాల్ఠాక్రే) పేర్కొన్నదంటే వ్యవహారం ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని కాంగ్రెస్ శైలిపై అసంతృప్తి బాహాటమవుతున్న వేళ... ప్రతిపక్ష కూటమి భవిష్యత్ నేత ఎవరు, భవిష్యత్ దిశ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమిని దీదీ నడిపితే అభ్యంతరం లేదంటూనే, ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో పలువురు సీని యర్ నేతలు ఉన్నందున కూర్చొని చర్చించి, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కారు. అసలు బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ కలసి ‘ఇండియా’ కూటమిగా జట్టు కట్టినా, వాటికి సరైన సైద్ధాంతిక భూమికే కాదు... నేటికీ సమ న్వయ సంఘం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్ మార్గదర్శనం లాంటివేమీ లేవు. అందు కోసం గడచిన ఏణ్ణర్ధం పైగా ప్రత్యేకించి కసరత్తులు చేసిన దాఖలాలూ లేవు. నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ గొడుగు కింద అందరూ కలసి పోటీ చేసినా... బాబ్రీ మసీదు కూల్చివేతను శివసేన (యుబీటీ) నేత ఒకరు సమర్థించడంతో యూపీలో ముస్లిమ్ ఓట్లపై ఆధార పడ్డ ఎస్పీ తాజాగా ఎంవీఏ నుంచి బయటకొచ్చేసింది. దీన్నిబట్టి ఎన్నికల కోసం కలవడమే తప్ప ‘ఇండియా’ పక్షాల మధ్య సహాయ సహకారాలే కాదు సమన్వయం కూడా లేదన్నది స్పష్టం.కాంగ్రెస్కు కానీ, కూటమికి కానీ సారథ్య బాధ్యతలు తీసుకోకున్నా చక్రం తిప్పడంలో ముందున్న రాహుల్ పరివారానికి ఇప్పుడిది కొత్త పరీక్ష. పార్లమెంట్లో సోనియా, రాహుల్, తాజాగా గెలిచొచ్చిన ప్రియాంక – ముగ్గురున్నా కూటమికి బలిమి చేకూరుతున్న దాఖలాలు లేవు. పెద్దన్న పాత్రలో అత్యుత్సాహం చూపుతున్న హస్తం పార్టీ కార్యకర్తలకు కానీ, ఇతర పార్టీలకు కానీ స్ఫూర్తినివ్వడంలో పదే పదే విఫలమవుతోంది. ఇకనైనా సాటిపక్షాల మాటలకు అది చెవి ఒగ్గాలి. పరస్పర గౌరవంతో అందరినీ కలుపుకొనిపోవాలి. తాజా గందరగోళంతో త్వరలోనే ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని బీజేపీ జోస్యం చెబుతోంది. కాషాయపార్టీపై సమైక్యంగా పోరు సాగించడమే ధ్యేయంగా పురుడు పోసుకున్న ప్రతిపక్ష కూటమి ఇలా అనైక్యతా రాగం ఆలపిస్తూ పోతే చివరకు అదే జరుగుతుంది. నాయకత్వచర్చ చివరకు కూటమి ఎన్నికల అజెండాపై కారుమబ్బుల్ని కమ్మేస్తేనే కష్టం. అధికారపక్ష అంచనా తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రతిపక్షాలదే! -
ఇండియా కూటమికి ‘దీదీ’ సరైన నాయకురాలు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సరైన నాయకురాలు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీయేనని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం(డిసెంబర్ 9) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు అవసరమైన రాజకీయ, ఎన్నికల అనుభవం ‘దీదీ’కి కావల్సినంత ఉంది. 42 లోక్సభ సీట్లున్న అతిపెద్ద పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి దీదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆమె నాయకత్వ పటిమ రుజువవుతూనే ఉంది’అని విజయసాయిరెడ్డి కొనియాడారు.Hon’ble West Bengal Chief Minister Didi Mamta Ji is an ideal candidate to lead the INDIA alliance as she has the required political and electoral experience to head an alliance. Didi is also the CM of a large state with 42 Lok Sabha seats and has proven herself time and again.…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 9, 2024ఇదీ చదవండి: టార్గెట్ కాంగ్రెస్..మమత రాజకీయం ఫలించేనా..? -
ఇండియా కూటమిలో లుకలుకలు!, ఈసారి..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలుఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది -
జార్ఖండ్ ప్రజలు విశ్వసించి పట్టం కట్టారు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు సమష్టి విజయమని, అక్కడి ప్రజలు తమను విశ్వసించి పట్టం కట్టారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, జార్ఖండ్ వనరుల పరిరక్షణ గురించి తాము ప్రజలకు చేసిన విజ్ఞప్తిని మన్నించారని, అందుకే ఇండియా కూటమికి ఘన విజయం చేకూర్చారని అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీనియర్ పరిశీలకుడి హోదాలో శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాంచీకి వెళ్లారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంతో పాటు జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నివాసంలో జరిగిన విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జేఎంఎం నేతృత్వంలో కూటమి గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పగలిగామని, అందుకే భారీ విజయం సాధ్యమైందన్నారు. జార్ఖండ్ ప్రజలకు బీజేపీపై భ్రమలు లేవని, అందుకే ఇండియా కూటమి వైపు నిలిచారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజలిచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెడతామని భట్టి స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి కీలకపాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, పార్టీ మేనిఫెస్టో తయారీ, వ్యూహాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పలు దఫాలుగా ప్రచారానికి వెళ్లారు. -
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’ ఒంటరి పోటీ
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) నిర్ణయించుకుంది. రాజధాని ముంబయి నగరంలోని మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత ప్రీతిశర్మ మీనన్ సోమవారం(ఆగస్టు5) మీడియాకు తెలిపారు.‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. అయితే జాతీయస్థాయిలో ఇండియా కూటమితో స్నేహం కొనసాగుతుంది. ముంబైలోని మొత్తం 36 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ పాలన మోడల్ను చూపించే ఎన్నికలకు వెళతాం. మహారాష్ట్రలో ప్రస్తుతమున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమంపై అసలు పట్టింపే లేదు.మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వాళ్లకు లేదు. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్లు గుజరాత్ కోసమే పనిచేస్తున్నారు. మహారాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదు’అని మీనన్ విమర్శించారు. -
బడ్జెట్పై ‘వివక్ష’ లేబుల్ : నిర్మలా సీతారామన్
Live Updatesకేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్డీయే కూటమి బలవంతం స్పష్టంగా కనిపిస్తోందని ఇండియా కూటమి నేతల ఆరోపణలు"Compulsion of government visible in Budget" say opposition leaders as INDIA bloc protests BudgetRead @ANI Story | https://t.co/G6jlOrJVKj#Budget2024 #INDIAbloc #Protest pic.twitter.com/2gbdRZ0sDN— ANI Digital (@ani_digital) July 24, 2024 బడ్జెట్పై విపక్షాల ఆరోపణపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విపక్షాలు చేసేవి చాలా విపరీతమైన ఆరోపణలు. బడ్జెట్పై విపక్షాలు వివక్ష అనే లేబుల్ వేశారు’’ అని ఆమె అన్నారు."Outrageous allegation," says Nirmala Sitharaman as opposition protest budget and labels it 'discriminatory'Read @ANI Story | https://t.co/w1LhIzXyRl#NirmalaSitharaman #Budget2024 #Opposition pic.twitter.com/Ua6CoO4n5K— ANI Digital (@ani_digital) July 24, 2024 విపక్షాల వాకౌట్కు ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. కుర్చీని కాపాడుకునే బడ్జెట్. మేము ఈ బడ్జెట్ను తీవ్రంగా ఖండింస్తున్నాం. ఇండియా కూటమి పార్టీలు నిరసన చేపడతాము. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడకపోతే.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?#WATCH | Before the Opposition walked out of Rajya Sabha over 'discriminatory' Budget, LoP Rajya Sabha Mallikarjun Kharge said, "...Yeh kursi bachane ke liye yeh sab hua hai...We will condemn it and protest against it. All INDIA alliance parties will protest...How will… pic.twitter.com/i00BsjXuhL— ANI (@ANI) July 24, 2024రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.పార్లమెంట్ సెంట్రల్ హాల్ల కేంద్రమంతులతో మోదీ భేటీఉభయ సభల్లో ఇండియా కూటమిని ఎదుర్కొవటంపై చర్చ పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు.బడ్జెట్ కేటాయింపులపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయిబడ్జెట్లో రాష్ట్రాల పట్ల వివక్షకు నిరసనగా ఇండియా కూటమి ఆందోళన నిరసనలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో లబ్ది జరిగిందని ఆరోపణ #WATCH | Delhi | Leaders of INDIA bloc protest against 'discriminatory' Union Budget 2024, demand equal treatment to all States, in Parliament pic.twitter.com/c6uOyF1TQr— ANI (@ANI) July 24, 2024 రాజ్యసభలో కేంద్ర బడ్జెట్, జమ్ము కశ్మీర్ బడ్జెట్పై చర్చ జరగనుంది.Rajya Sabha to hold general discussion on Union Budget, Jammu and Kashmir BudgetRead @ANI Story | https://t.co/kowyM0f1u7#RajyaSabha #Budget #KirenRijiju #NirmalaSitharaman pic.twitter.com/JABAVoeIAa— ANI Digital (@ani_digital) July 24, 2024 ఈరోజు నుంచి పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25పై చర్చ20 గంటల పాటు బడ్జెట్పై చర్చ జరగనుంది.పార్లమెంట్లో నిరసనలకు సిద్ధమైన ఇండియా కూటమి.ఉభయ సభల్లో నిరసన తెలపాలని ఇండియా కూటమి నిర్ణయంకుర్చి బచావో బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీపై విపక్షాల విమర్శలు బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలను విస్మరించారని ఆరోపణలుకేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఇవాళ పార్లమెంట్ లోపల, బయట నిరసన చేపట్టనుంది. మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసం ప్రతిపక్ష నేత రాహుల్గాంధీతో సహా కూటమి మిత్రపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ చూపిన వివక్షకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని నిర్ణయించారు.ఇండియా కూటమి మీటింగ్ అనంతరం కాంగ్రెస్ నేత కేసీవేణుగోపాల్ మీడియాతో మాట్లడారు. ‘‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీజేపీయేతర రాష్ట్రాలపై తీవ్రమైన వివక్ష చూపింది. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపేట్టిన కేంద్రం బడ్జెట్.. బడ్జెట్ అనే భావనను నాశనం చేసింది. ఇది చాలా వివక్ష, ప్రమాదకరమైన బడ్జెట్. సమాఖ్యావాదానికి, న్యాయానికి సంబంధించిన నియమాలకు విరుద్ధంగా ఉంది’’ అని అన్నారు.తమ నిరసనలో భాగంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూలై 27 జరిగే నీతి ఆయోగ్ మిటింగ్ను బాయ్కాట్ చేయనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించిందని కేసీ వేణగోపాల్ అన్నారు. -
స్పీకర్ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి కె.సురేష్ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు. ‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కాగా, 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి. -
ఎన్డీయే కూటమిపై బెంగాల్ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: ఎన్డీయే కూటమి పక్ష నేతగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమంలో తామ పార్టీ పాల్గొనటం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆమె శనివారం టీఎంసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది. అందుకే ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీఎంసీ పాల్గొనటం లేదు. 400 సీట్లు గెలుస్తామన్న వారు(బీజేపీ) కనీస మెజార్టి మార్క్ కూడా సాధించుకోలేకపోయింది. వెంటనే ఇండియా కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేస్తుందని చెప్పటం లేదు. ... కానీ, పరిస్థితులు మారటాన్ని మేము ఆసక్తిగా చూస్తూ ఉంటాం. కొన్ని రోజులకు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒకరోజు మాత్రమే ఉంటాయి. ఏదైనా జరిగితే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజులు మాత్రమే ఉండొచ్చు?’’ అని మమత అన్నారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు అయింది.మరోవైపు.. గురువారం జరిగిన ఇండియా కూటమి సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖేర్గే మాట్లాడుతూ.. బీజేపీ తమను పాలించవద్దని ప్రజలు సైతం గ్రహిస్తారని అన్నారు. ఇక.. ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించగా.. టీఎంసీ బెంగాల్లో 29 స్థానాల్లో గెలుపొందింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నాలుగో పార్టీగా టీఎంసీ నిలిచింది. రేపు (ఆదివారం) ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇండియా కూటమిలో బలమైన నేతగా ఉన్న సీఎం మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
నితీశ్కు ప్రధాని పదవి ఆఫర్ చేసిన ఇండియా కూటమి!
పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్లోని నితీష్కుమార్ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్ కుమార్కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకే నితీష్ వాళ్ల ఆఫర్ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్ కూటమికి లేకపోవటంతో నితీష్ కుమార్పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్తమ పార్టీ చీఫ్కు నితీశ్కుమార్కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
Bihar: ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్, తేజస్వి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూన్5) సాయంత్రం జరిగే ఎన్డీఏ,కూటమిల సమావేశాల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి నేతలు బయలుదేరారు. ఎవరి కూటమి సమావేశంలో ఆ కూటమికి చెందిన నేతలు పాల్గొంటారు. ఇదే విషయమై అయితే బిహార్లో మాత్రం ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి భేటీలో పాల్గొనేందుకు సీఎం నితీశ్కుమార్, ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామంతో ఎవరు ఎవరిని ఏ కూటమి వైపు తీసుకెళ్తారనే చర్చ మొదలైంది. అయితే తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని జేడీయూ నేత కేసీ త్యాగి ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరానని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ క్లారిటీ ఇచ్చారు. -
నేడు ఇండియా కూటమి సమావేశం.. కీలక వ్యూహాలపై చర్చ!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి 232 సీట్లను గెలుచుకుంది. 400 సీట్లలో విజయం సాధిస్తామనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్ దాటి 294 సీట్లకు పరిమితమైంది.#WATCH | Maharashtra: NCP-SCP chief Sharad Pawar and party MP from Baramati, Supriya Sule leaves from Mumbai for Delhi for the INDIA bloc meeting, scheduled for later today. NCP-SCP won 8 Lok Sabha seats in Maharashtra and Supriya Sule retained Baramati by a margin of 1,58,333… pic.twitter.com/oNClFFQBqj— ANI (@ANI) June 5, 2024 ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం భారీగా లేకపోవడంతో ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు ప్రారంభించాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఎటువంటి వ్యూహాలు అమలు పర్చాలనేదానిపై ఇండియా కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం.#WATCH | Tamil Nadu CM and DMK chief MK Stalin arrives in Delhi ahead of the INDIA bloc meeting scheduled for later today. His party won 22 seats in #LokSabhaElections2024 pic.twitter.com/I1onVWnrmF— NewsMobile (@NewsMobileIndia) June 5, 2024కూటమి గెల్చుకున్న సీట్ల సంఖ్య గతంతో కంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో రాజకీయ మార్పులు జరగనున్నాయని ఎన్సిపీ (శరద్ చంద్ర పవార్) పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం పేర్కొన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి తీసుకునే నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఇక.. ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, చంపయి సొరేన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా తదితర నేతలు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలు బీజేపీ గెలువకపోటంతో ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పలు పార్టీల కీలక నేతలు ఢిల్లీకి పయణమై చేరకుంటున్నారు. -
Lok Sabha Elections: లక్ష్యాన్ని చేరుకోని ఇరు పార్టీలు!
దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. అబ్ కి బార్... 400 పార్’ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీయే) ఆ లక్ష్యాన్ని అందుకునే లక్షణాలు దాదాపుగా కనిపించకపోగా... అధికార పక్షాన్ని గద్దె దింపుతాం... 295 స్థానాలతో పగ్గాలు చేపడతాం అని బీరాలకు పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి (ఇండియా) కూడా తన లక్ష్యానికి దగ్గరలోనే నిలిచిపోయింది. కాకపోతే గత ఎన్నికల్లో కేవలం 52 స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి వంద సీట్ల వరకూ సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికి ఎన్డీయే, ఇండియా కూటమి భాగస్వాముల్లో ఫిరాయింపుల్లాంటివేవీ కనిపించడం లేదు కానీ.. ఫలితాలన్నీ వెలువడిన తరువాత అసలు రాజకీయం మొదలకానుంది. సరే.. రెండు ప్రధాన కూటములు తమ తమ లక్ష్యాలను సాధించలేక పోయాయి? ఎందుకు? అతి విశ్వాసమా? లేక వ్యూహ రచన లోపమా?ఎన్డీయేలో ఏం కొరవడింది?ముందుగా ఎన్డీయే కూటమి విషయం చూద్దాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఎన్నికల రణనీతిని సమర్థంగా అమలు చేయడంలో మోడీ చాలా దిట్ట అన్న పేరు ఉంది. మోడీ-అమిత్ షాల ద్వయం అప్పట్లో కేవలం గుజరాత్కు మాత్రమే పరిమితం కాగా.. తరువాతి కాలంలో బీజేపీ వెనకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల బలాన్ని, క్రమశిక్షణను ఆసరాగా చేసుకుని జాతీయ స్థాయి ఎన్నికల్లోనూ తమ సత్తా చాటగలిగారు. ప్రతి నియోజకవర్గాంలోని ఒక్కో పోలింగ్ బూత్కు బాధ్యులుగా కొందరు కార్యకర్తలను నియమించడం... ప్రణాళికాబద్ధంగా ప్రచారం సాగించడం... తమకుతాము ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మోడీ-అమిత్ షాల శైలి రాజకీయాలని అర్థమవుతుంది. ఈ శైలితోనే మోడీ ప్రధానిగా రెండుసార్లు గెలవగలిగారనడం అతిశయోక్తి కాదు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303కుపైగా సీట్లు సాధించి రికార్డు సృష్టించింది కూడా. అయితే ఈ విజయంలో భాగమైన చాలామంది భాగస్వామ్య పక్షాలను నిలబెట్టుకోలేకపోయిందన్నది కూడా నిష్టూర సత్యం. భాగస్వామ్య పక్షాలు చాలావరకూ తప్పుకున్న నేపథ్యంలో బీజేపీ కొత్త మిత్రులను వెతుక్కునే ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఈ మిత్రత్వం ప్రభావం తక్కువే అన్నది తాజా ఫలితాల నేపథ్యంలో స్పష్టమవుతోంది.కాంగ్రెస్ మాటేమిటి?ఒకప్పుడు దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలు (రాజీవ్ గాంధీ హయాంలో 425) సాధించిన... దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను ఏకపక్షంగా శాంసిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో గణనీయంగా బలహీన పడిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పార్టీ రాజకీయాలన్నింటికీ ఢిల్లీని కేంద్రం చేసుకోవడం.. నమ్మకంగా పనిచేసిన సీనియర్ నేతలను నిరాదరించడం, సమయానకూలంగా వ్యూహాలను, కార్యాచరణను మార్చుకోకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ పతనానికి కారణాలుగా చెప్పవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో అతి స్వల్ప స్థానాలకు పరిమితమైన తరువాత గానీ ఈ పార్టీ తగిన పాఠలు నేర్చుకోలేకపోయింది. ఎన్డీయే దెబ్బకు కుదేలు కాగా మిగిలిన జవసత్వాలు కొన్నింటినైనా ఒక్కటి చేసుకుని మళ్లీ పైకి ఎదిగే ప్రయత్నాలు మొదలుపెట్టంది. పార్టీ అధ్యక్షుడిగా వైఫల్యాలు మూటకట్టుకున్న రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన భారత్ జోడో యాత్ర కానీ.. భారత్ న్యాయ యాత్ర కానీ రాహుల్ గాంధీపై అప్పటివరకూ ఉన్న ‘పప్పు’ ముద్రను తొలగించడంలో ఎంతో ఉపకరించిందనడంలో సందేహం లేదు. గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ దశ తిరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. నేతలందరూ ఐకమత్యంగా నిలబడి పోరాడితే విజయావకాశాలు పెరుగుతాయని తెలంగాణ విజయంతో అర్థమయింది. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది మొదలు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త జోష్తో పనిచేసిందని చెప్పాలి. బీజేపీ ప్రచారానికి మాటకు మాట రీతిలో జవాబివ్వడంతోపాటు ప్రచారంలోనూ కొత్త పుంతలు తొక్కింది ఈ పార్టీ. అదే సమయంలో ప్రతిపక్షాలన్నింటినీ ఒక దగ్గర చేర్చేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించాయని చెప్పాలి. దళిత నేత మల్లికార్జున ఖర్గేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం, ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించబోమన్న హామీల నేపథ్యంలో ఆప్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ వంటివి ఇండియా కూటమిలో భాగంగా నిలిచాయి. ఎన్నికల్లోనూ ఐకమత్యంతో పోరాడాయి. అంతిమ ఫలితాలేమైనప్పటికీ కాంగ్రెస్, ఇండియా కూటముల ప్రదర్శన మునుపటి కంటే మెరుగుపడటం ఎన్నో రాజకీయ పాఠాలు నేర్పుతుంది. -
కీలక రాష్ట్రాల్లో ’ఇండియా‘కు అనూహ్య లీడ్
న్యూఢిల్లీ: కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రస్తుత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మంగళవారం 12 గంటల వరకు వెలువడ్డ ఫలితాలు బీజేపీకి కొంత మేర నిరాశ కలిగించినట్లు కనిపిస్తోంది. భారీ విజయం సాధిస్తామనుకున్న వారి ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈసారి సొంతగా మ్యాజిక్ ఫిగర్ను దాటడం బీజేపీకి అంత సులువుకాదని ఫలితాల సరళిని పరిశీలిస్తే తెలుస్తోంది. ఇప్పటివరకు ఫలితాల్లో బీజేపీ సొంతగా 238 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ సొంతగా 95 స్థానాల్లో, ఇండియా కూటమి 230 సీట్లలో లీడ్లో కొనసాగుతోంది. ఇతరులు 21 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఎన్డీఏ,ఇండియా కూటముల వారిగా చూసుకుంటే ఎన్డీఏ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 272 దాటేసింది. ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీలు బీజేపీ దూకుడుకు కళ్లెం వేశాయి. యూపీలో ఇండియా కూటమి 42, మహారాష్ట్రలో 28, తమిళనాడు 37, కేరళ 17 సీట్లలో లీడ్లో కొనసాగుతూ ఎన్డీఏ కూటమిపై ఆధిక్యాన్ని ప్రదిర్శిస్తోంది. పశ్చిమబెంగాల్లో టీఎంసీ బీజేపీపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక్కడ బీజేపీకి ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు. కాగా, జాతీయ స్థాయిలో బీజేపీ, ఎన్డీఏలకు భారీ మెజారిటీ వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాస్త తప్పినట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ పీఠం ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ సంచలనం..
సాక్షి,న్యూఢిల్లీ: సుదీర్ఘంగా నలభై రోజులకుపైగా జరిగిన 2024 లోక్సభ ఎన్నికల ప్రక్రియ శనివారం(జూన్1) సాయంత్రం 6 గంటలకు ముగిసింది.అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న2024 పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తుది, ఏడవ విడత పోలింగ్ ముగిసిన వెంటనే టీవీ ఛానళ్లు, ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్పోల్స్ ఫలితాలు రిలీజ్ చేశాయి. రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ఎన్డీఏ-354ఇండియా-153ఇతరులు-30మొత్తం -543ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఇప్పటికి ప్రకటించినవి -463ఎన్డీఏ -294-329ఇండియా- 123-154ఇతరులు- 8-20మొత్తం సీట్లు-543ఎన్డీటీవీఎన్డీఏ-365ఇండియా-142ఇతరులు -36జన్కీ బాత్ ఎన్డీఏ-362-392ఇండియా-141-161ఇతరులు -10-20న్యూస్ నేషన్ ఎన్డీఏ-340-378ఇండియా-153-169ఇతరులు -21-23దైనిక్ భాస్కర్ఎన్డీఏ-281-350ఇండియా-145-201ఇతరులు -33-49 -
జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ పూర్తి అయింది. ఏడో విడత పోలింగ్ జూన్1న జరగనుంది. ఏడో విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి ఆల్ పార్టీ మీటింగ్ జూన్ 1(శనివారం)న జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఏడో విడత పోలింగ్ కూడా ఉంది. కూటిమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు ఫలితాలకు నాలుగు రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలుకు వేళ్లే ఒక రోజు ముందు ఇండియా కూటమి మీటింగ్ జరగనుంది. సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అదే రోజు సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో విపక్ష కూటమి తీసుకోవల్సిన చర్యలు, లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనబర్చిన పనితీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సామాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర కీలక నేతలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.ఇక.. ఎన్డీయే కూటమిని ప్రతిపక్షాల ఇండియా కూటమి స్వీప్ చేస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘ఆరు విడుతల పోలింగ్ పూర్తి అయింది. 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. పదవి నుంచి దిగిపోయే ప్రధాని రిటైర్మెంట్ ప్రణాళికలు రచించుకుంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విధి పూర్తిగా మూసివేయబడింది. దక్షిణంలో పూర్తిగా, ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతంలో సంగానికి బీజేపీ పడిపోయింది’’ అని జైరాం రమేష్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించడానికి లక్ష్యంగా 28 విపక్ష పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూషన్ అలియన్స్ (INDIA) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. -
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆరు విడతల్లో పోలింగ్ పూర్తి అయింది. అయితే.. విపక్షాల ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరితే.. ప్రధానమంత్రి ఎవరూ అని అడిగిన మీడియా ప్రశ్నకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున చమత్కారంగా స్పందించారు. ఈ ప్రశ్న ‘కౌన్ బనేగా క్రోర్పతి?’లా ఉందని అన్నారు. ఆయన శనివారం సిమ్లాలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇండియా కూటమి గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా ప్రధాని మంత్రి ఎవరూ అనేవిషయంపై నాయకులమంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. 2004 నుంచి 2014 వరకు యూపీఏ కూటమి పదేళ్లు పాలన చేసింది. ప్రధాని అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే 2004లో కాంగ్రెస్లో కొంతమంది నాయకులకు సోనియా గాంధీ ప్రధాని కావాలని ఉండేది. కానీ ఆమె తిరస్కంచారు. అప్పుడు మాకు మేజార్టీ(140 సీట్లు) లేదు. 2009లో మేము 209 సీట్లను గెలిచాం. అలా యూపీఏ కూటమిగా పదేళ్లు పాలన అందించాం. కొన్నిసార్లు తెలివైనవాళ్లు కూడా చరిత్ర మర్చిపోతారు( బీజేపీ నేతలను ఉద్దేశించి). 2014లో బీజేపీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం తగ్గింపు ఏమి జరగలేదు. ప్రధాని మోదీ, 2014, 2019లో ఇచ్చిన పెద్దపెద్ద హామీలను పక్కన పడేశారు. ప్రకృతి విపత్తులతో తల్లిడిల్లిన హిమాచల్ ప్రదేశ్ ప్రధాని మోదీ చిన్న సాయం కూడా చేయలేదు. దేశంలో బీజేపీ ప్రభుత్వాలను కూలగొట్టింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు పన్నింది’’ అని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 27 జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేశారు. అనంతరం వారు బీజేపీలో చేరారు. ఇక.. హిమాచల్ ప్రదేశ్లో ఏడో విడతలో జూన్ 1 నాలుగు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడదల కానున్నాయి. -
ఇండియా కూటమి ఎఫెక్ట్..! కన్ప్యూజన్లో ఎగ్జిట్ పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్గా లేరు.400సీట్ల టార్గెట్తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్ పోల్స్ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి -
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్లల్లాను టెంట్కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలనుకుంది. కాంగ్రెస్ వస్తే రామ్ లల్లాను మళ్లీ టెంట్ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్, పవార్.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ అన్నారు. మత నిర్జవ్స్త్రన్లకు ల్యాబ్గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు. -
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమిపై కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తానని ప్రకటించారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్తో విభేదాలు తలెత్తడం వల్లే ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. బుధవారం(మే15) కోల్కతాలో మమత మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇండియా కూటమికి బయటినుంచి మద్దతిస్తాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని తెలిపారు. కాగా, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ మద్దతిచ్చి తృణమూల్ను ఓడించాలని చూస్తున్నాయని మమత ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం. -
అది ఎదురుదెబ్బ ఎలా అవుతుంది?: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఉండడం వల్ల విరాళాలను ఎవరు, ఎవరికి ఇస్తున్నారో తెలిసే అవకాశం ఉందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని ప్రధాని నరేంద్రమోదీ అంటున్నారు. ఆదివారం ఒక తమిళ టీవీ ఛానల్కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఎన్నికల బాండ్ల రద్దు అంశంపై స్పందించారు. పంచెకట్టులో ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూకి హాజరు కావడం విశేషం. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయంపై ప్రధాని స్పందిస్తూ... ‘‘లోపం లేకుండా ఏ వ్యవస్థా ఉండదు. బాండ్ల విషయంలో ఎదురుదెబ్బ తిన్నామని చెప్పేలా మేం ఏం చేశామో చెప్పండి. వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది బాండ్ల వల్లే తెలుస్తోంది. 2014కి ముందు ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చాయో ఏ దర్యాప్తు సంస్థలు కూడా చెప్పలేవు.. .. అలాంటిది ఎన్నికల బాండ్ల పథకం ద్వారా విప్లవాత్మక మార్పు కోసం మేం ముందడుగు వేశాం. ఈ వ్యవహారంలో ఇప్పుడు గంతులేస్తూ గర్వపడుతున్నవారు(ఇండియా కూటమిని ఉద్దేశించి..) తర్వాత పశ్చాత్తాపపడతారు. నేను చేసే ప్రతి పనిలో రాజకీయాలను చూడకూడదు. నేను దేశం కోసం పనిచేస్తాను. ఓట్లే ప్రామాణికమైతే ఈశాన్య రాష్ట్రాలకు అన్ని పనులు చేసి ఉండకూడదు కదా. ఇతర ప్రధానులంతా కలిసి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లారో నేనొక్కడినే అంతకంటే ఎక్కువసార్లు వెళ్లాను.. .. నేను రాజకీయ నాయకుడినైనంత మాత్రాన ఎన్నికల్లో గెలుపుకోసమే పనిచేయాలనేం లేదు. తమిళనాడులో మాకు లభించే ఓట్లు డీఎంకేకు వ్యతిరేకమైనవి కాదు.. అవి బీజేపీకి అనుకూలమైనవి. తమిళ ఓటర్లు ఈసారి మాకు పట్టం కడతారు’’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. .. తమిళనాడులో అపారమైన సామర్థ్యం ఉంది, దానిని వృధా చేయకూడదు. వికసిత్ భారత్ అంటే దేశంలోని ప్రతి మూల అభివృద్ధి చెందాలి. తమిళనాడు కూడా ఇందుకు ఓ కేంద్రంగా మారుతుందని నేను భావిస్తున్నా. ఇక్కడి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అద్భుతంగా పని చేస్తున్నారు’’ అని ప్రధాని మోదీ కితాబిచ్చారు. అలాగే.. తమిళ భాషపై జరిగిన రాజకీయాలపై స్పందిస్తూ.. దాని వల్ల తమిళనాడుకే కాకుండా దేశానికి కూడా నష్టం వాటిల్లిందన్నారు. -
అవినీతిపరుల కూటమి: ప్రధాని మోదీ
మీరట్/ లక్నో: సార్వత్రిక సమరానికి షెడ్యూల్ మొదలయ్యాక ఉత్తరప్రదేశ్ వేదికగా ప్రధాని మోదీ తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొని విపక్షాల ‘ఇండియా’కూటమిపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఆదివారం మీరట్లో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈడీ అరెస్ట్తో కేజ్రీవాల్, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ కటకటాల వెనక్కి వెళ్లిన వేళ ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆదివారం విపక్ష ‘ఇండియా’ కూటమి ‘లోక్తంత్ర బచావో’ ర్యాలీ చేపట్టిన కొద్దిసేపటికే మోదీ విపక్షాల కూటమిపై విమర్శల జడివాన కురిపించారు. ‘‘అవినీతిపై నేను పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించగానే విపక్ష నేతలంతా కలిసి ఇండియా కూటమిగా పోగయ్యారు. నన్ను భయపెట్టొచ్చని భావించారు. కానీ నా భారతదేశమే నా సొంత కుటుంబం. అవినీతి నుంచి దేశాన్ని రక్షించేందుకు యుద్ధం మొదలుపెట్టా. అందుకే వాళ్లంతా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. వాళ్లకు సుప్రీంకోర్టు నుంచి కూడా కనీసం బెయిల్ దొరకడం లేదు. ఈసారి రెండు శిబిరాల మధ్యనే సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగబోతోంది. నా మంత్రం ‘భ్రష్టాచార్ హటావో’ (అవినీతి అంతం). వాళ్ల తంత్రం ‘భ్రష్టాచార్ బచావో’ (అవినీతిని కాపాడుకోవడం). పేదల కోసం ఉద్దేశించిన డబ్బు అవినీతిపరులకు దక్కకుండా పదేళ్లుగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తున్న ఎన్డీఏ ఒకవైపు ఉంటే, అదే అవినీతి నేతలను కాపాడేందుకు అలుపెరగక కష్టపడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలు మరోవైపు ఉన్నారు. అవినీతికి అంతం పలకాలో వద్దో మీరే నిర్ణయించుకోండి’ అన్నారు. ‘‘అవినీతిపరులకు చెప్పేదొక్కటే. కుటుంబం లేదంటూ నన్నెంతగా అవమానించినా, ఎన్ని ఆరోపణలు గుప్పించినా, బీజేపీ నేతలపై దాడులు చేసినా అవినీతిపై నేను పోరాటం ఆపబోను. అవినీతికి పాల్పడింది ఎంత పెద్ద నేతలైనా సరే కఠిన చర్యలు ఖాయం. దేశాన్ని లూటీ చేసిన వారు తిరిగి ఆ సొమ్ము కక్కాల్సిందే. ఇదే మోదీ గ్యారెంటీ’’ అని అన్నారు. ప్రజల కోసం ఆశల పల్లకీని మోసుకొచ్చామంటూ సభకు ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘పదేళ్లలో దేశవ్యాప్తంగా నా కుటుంబసభ్యులందరి ఆకాంక్షలూ తీర్చాం. కొంగొత్త కోరికలను తీర్చేందుకు మళ్లీ మీ ముందుకొచ్చాం. ఆశలు నెరవేర్చిన ఎన్డీఏఏ కూటమికే ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’’ అన్నారు. పదేళ్ల అభివృద్ధి ట్రైలరే ‘‘ఈసారి లోక్సభ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోవు. ఈ ఎన్నికలు వికసిత భారత్కు పునాది వేయనున్నాయి. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మేం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. మా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లకు మార్గసూచీని రూపొందిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 100 రోజుల్లో అమలుజరపాల్సిన పనులపై ఆలోచిస్తున్నాం. గత పదేళ్లకాలంలో మీరు చూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు దేశాన్ని మరింత శరవేగంతో అభివృద్ధి పథంలో ఉరకలెత్తిస్తాం. నేను పేదరికంలో జీవించా కాబట్టే పేదల గురించి తెల్సు నాకు. ప్రతి ఒక్క పేదవాడి బాధలు, కష్టాలను అర్ధంచేసుకోగలను. అందుకే పేదలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలుచేశాం. ఈ పథకాలు పేదల సాధికారతకు మాత్రమే బాటలు వేయవు. అవి పేదలకు ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చి ఇచ్చాయి’’ అని మోదీ అన్నారు. ‘‘అయోధ్యలో రామాలయం అసాధ్యమ ని చాలామంది అ న్నారు. నేడు రోజూ లక్షలాది మంది అయోధ్య రామాలయాన్ని దర్శించుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్పై కఠిన చట్టం, ఆరి్టల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం అసాధ్యమన్నారు. మేం చేసి చూపాం’ అని మోదీ అన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ పాలనలో దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని విపక్ష ఇండియా కూటమి ఆరోపించింది. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్షాలను, నేతలను వేధిస్తున్నారని మండిపడింది. ఢిల్లీ సీఎం, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును తీవ్రంగా ఖండించింది. వారికి అండగా నిలుస్తామని ప్రకటించింది. నియంతృత్వ పాలనను తరిమికొట్టి దేశాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ కూటమి మహా ర్యాలీ నిర్వహించింది. ‘తానాషాహీ హటావో, లోక్తంత్ర్ బచావో (నియంతృత్వాన్ని రూపుమాపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి)’ పేరుతో జరిగిన ఈ ర్యాలీ విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారింది. ఇండియా కూటమిలోని 28 పారీ్టల నేతలు ఇందులో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలను మోదీ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివరి్ణంచారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఎన్నికల్లో విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాం«దీ, రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీ, పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్ (సమాజ్వాదీ), డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), శరద్ పవార్ (ఎన్సీపీ–పవార్), ఉద్దవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ) తదితరులు వీరిలో ఉన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీత, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ రాజకీయాల్లోకి రావచ్చనే చర్చ ఊపందుకుంది. వారితో సోనియా వేదికపై చేతిలో చేయి కలిపి మాట్లాడారు. తన పక్కనే కూచోబెట్టుకున్నారు. విపక్షాలన్నీ ఒక్కటై బీజేపీని ఓడించాలని స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. స్టాలిన్ తరఫున ఆయన సందేశాన్ని డీఎంకే నేత తిరుచ్చి శివ చదివి విని్పంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా పోరాడదామని శరద్ పవార్ అన్నారు. దేశం పెను సంక్షోభంలో ఉందని డి.రాజా అన్నారు. ఈ ర్యాలీతో రాజకీయాల్లో కొత్త శక్తి పుట్టిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. తృణమూల్ విపక్ష ఇండియా కూటమిలోనే ఉందని ఓబ్రియాన్ చెప్పారు. కూటమి డిమాండ్లు... కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, విపక్ష నేతల అరెస్టులు, ఎన్నికల బాండ్ల పేరుతో బలవంతపు వసూళ్లు, విపక్షాలే లక్ష్యంగా ఆదాయ పన్ను నోటీసులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరోద్యగం, రైతులకు అన్యాయం వంటి ఏడు అంశాలపై కూటమి డిమాండ్లను ప్రియాంక చదివి ప్రస్తావించారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థల చర్యలను నిలిపేయాలని కోరారు. బీజేపీ ఎన్నికల బాండ్ల క్విడ్ ప్రో కో వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఆరెస్సెస్, బీజేపీ విషతుల్యం ‘‘ఆరెస్సెస్, బీజేపీ విషం వంటివి. పొరపాటున కూడా వాటిని రుచి చూడొద్దు. ఇప్పటికే దేశాన్ని ఎంతో నాశనం చేసిన విచి్ఛన్న శక్తులవి. మరింత సర్వనాశనం చేయకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలదే. పరస్పరం కుమ్ములాడుకోకుండా ఏకమైతేనే బీజేపీని ఓడించడం సాధ్యం. ప్రజాస్వామ్యం, నియంతృత్వాల్లో ఏది కొనసాగాలో నిర్ణయించే కీలక ఎన్నికలివి. ప్రజాస్వామ్యంపై మోదీకి నమ్మకం లేదు. అధికార వ్యవస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పి బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను పడదోస్తున్నారు. హేమంత్ సోరెన్ను బీజేపీలో చేరనందుకే అరెస్టు చేయించారు. తనకు లొంగడం లేదనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్నూ జైలుపాలు చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇలా ప్రతిపక్షాలకు బీజేపీతో సమానంగా ఎన్నికల్లో తలపడే అవకాశం లేకుండా చేస్తున్నారు. రూ.14 లక్షల నగదు డిపాజిట్లకు సంబంధించి కాంగ్రెస్కు ఏకంగా రూ.135 కోట్ల జరిమానా విధించారు. రూ.42 కోట్ల నగదు డిపాజిట్లు అందుకున్న బీజేపీకి అదే సూత్రం ప్రకారం రూ.4,600 కోట్ల జరిమానా విధించాలి’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేజ్రీవాల్ సింహం: సునీత ‘‘కేజ్రీవాల్ సింహం. ఆయనను ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేరు. దేశ ప్రజలంతా ఆయన వెంట ఉన్నారు’’ అని ఆయన భార్య సునీత అన్నారు. మోదీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. లోక్సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. మా రక్తంలోనే పోరాటం: కల్పన రాజ్యాంగ హక్కులన్నింటినీ మోదీ సర్కారు కాలరాస్తోందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన మండిపడ్డారు. ‘‘అధికారాన్ని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నామని కొన్ని పార్టీలు అపోహ పడుతున్నాయి. కానీ నిజమైన అధికారం ప్రజలదే. మేం గిరిజనులం. త్యాగం, పోరాటం మా రక్తంలోనే ఉన్నాయి. మా సుదీర్ఘ చరిత్రను తలచుకుని గర్వపడతాం’’ అన్నారు. నిర్ణాయక ఎన్నికలివి... ‘‘అంపైర్లపై ఒత్తిడి పెట్టి, కెపె్టన్ను, ఆటగాళ్లను కొనేస్తే మ్యాచ్ గెలిచినట్టే. క్రికెట్లో దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. లోక్సభ ఎన్నికల వేళ అంపైర్లను (కేంద్ర ఎన్నికల కమిషనర్లను) ఎంపిక చేసిందెవరు? మ్యాచ్ మొదలైనా కాకముందే ఇద్దరు ఆటగాళ్లను (సీఎంలను) అరెస్టు చేయించిందెవరు? ఇవ్నీ చేసింది ఒక్కే ఒక్క శక్తి. ప్రధాని మోదీ! ముగ్గురు నలుగురు బిలియనీర్ల సాయంతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా లోక్సభ ఎన్నికలను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను దేశమంతా గమనిస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్, ఈవీఎంల సాయంతోనే 400 సీట్లు నెగ్గుతామని బీజేపీ ధీమాగా అంటోంది. అదే జరిగితే దేశమే సర్వనాశనమవుతుంది. దేశ గుండె చప్పుడైన రాజ్యాంగం కనుమరుగవుతుంది. తద్వారా దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ లక్ష్యం. మ్యాచ్ఫిక్సింగ్, ఈవీఎంలు, మీడియాను బెదిరించడం, కొనేయడం జరగకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావు. కానీ ఇవేం ఎన్నికలు? విపక్షాలను నిరీ్వర్యం చేసి నెగ్గజూస్తున్నారు. ప్రచార వేళ అతి పెద్ద విపక్షమైన కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. ఈడీ, ఐటీ, సీబీఐ బెదిరింపులు, బల ప్రయోగాలతో దేశాన్ని పాలించలేరు. కానీ దేశం గొంతును అణచలేరు. ప్రజల గళాన్ని అణచే శక్తి ప్రపంచంలోనే లేదు. మోదీ అసమర్థ పాలనలో దేశంలో నిరుద్యోగం 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది. దేశ సంపదంతా ఒక్క శాతం సంపన్నుల చేతిలో పోగుపడింది. ఈ నిరంకుశత్వాన్ని పారదోలేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలివి’’ – కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అహంకారానికి అంతం తప్పదు ‘‘సత్యం కోసం చేసిన యుద్ధంలో రామునికి అధికారం లేదు, వన రుల్లేవు. అయినా అవన్నీ ఉన్న రావణుడిపై గెలిచాడు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం వీడాలని రాముని జీవి తం నేర్పుతోంది. రాముని భక్తులమని ప్రకటించుకునే వారికి ఇది చెప్పాలనుకుంటు న్నా. అహంకారం అణగక తప్పదు’’ – కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా -
ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 5 డిమాండ్లు
న్యూఢిల్లీ: ఇటీవల అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్లను వెంటనే విడుదల చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. కేజ్రీవాల్కు మద్దతుగా ఢిల్లీలో ఆదివారం(మార్చ్ 31) భారీ సభ నిర్వహించిన ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేసింది. ఈ డిమాండ్లను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ చదివి వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ని కూటమి డిమాండ్ చేసింది. ఎన్నికల్లో సీబీఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలి. సీఎం కేజ్రీవాల్, మాజీ సీఎం హేమంత్ సొరేన్లను వెంటనే విడుదల చేయాలి. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలను వెంటనే ఆపాలి. బీజేపీ చేస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అక్రమ వసూళ్లు, ఎన్నికల బాండ్ల ద్వారా చేస్తున్న మనీలాండరింగ్పై విచారించడానికి సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలి’ అని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, హేమంత్సోరేన్ భార్య కల్పన సోరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ అవి గుర్తు చేసుకోవాలి -
‘ఇండియా’ ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉందని ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ప్రకటించారు. లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ఆదివారం(మార్చ్ 31) ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఒబ్రెయిన్ పాల్గొని మాట్లాడారు.‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(ఏఐటీసీ) ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంది. ఇది బీజేపీకి ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరుగుతున్న పోరాటం’అని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ర్యాలీలో ఒబ్రెయిన్ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేయడం విశేషం. కాగా, కాంగ్రెస్తో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో వెస్ట్బెంగాల్లో సొంతగా పోటీ చేస్తున్నట్లు టీఎంసీ మార్చ్ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్య నేత, ఆ పార్టీ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పై క్రికెటర్ యూసఫ్ పటాన్ను రంగంలోకి దింపింది. ఏక పక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై అధిర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. మమతాబెనర్జీని ఇక ముందు ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు నమ్మడని మండిపడ్డారు. తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రధాని కార్యాలయానికి కూడా టీఎంసీ పంపిందని, తాము ఇండియా కూటమిలో లేము అని చెప్పేందుకే ప్రధానికి కూడా అభ్యర్థుల జాబితా పంపారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్, టీఎంసీలు ఒక పార్టీపై మరొకటి సాఫ్ట్ కార్నర్ చూపిస్తుండటం చర్చనీయాంశమైంది. Modi's guarantee has zero warranty! Zero warranty when it comes to price rise, jobs and protecting India's institutions. After the Pulwama tragedy, former Governor Satya Pal Malik ji publicly said that Narendra Modi ji did not even want the truth to come out. What did Narendra… pic.twitter.com/qeb0fgA5xS — Congress (@INCIndia) March 31, 2024 ఇదీ చదవండి.. దేశ ఆర్థిక మంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా -
మోదీ చేసింది సరైన పనేనా?: సునీతా కేజ్రీవాల్
Live Updates.. ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కామెంట్లు... ప్రజాస్వామ్యం కావాలో,నియంతృత్వవం కావాలో మీరే(ప్రజలు) నిర్ణయించుకోవాలి నియంతృత్వానికి మద్దతు ఇచ్చేవారిని దేశం నుంచి తరిమిగొట్టాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విషం లాంటివి వాటి విషం రుచి చూసినా మరణిస్తాం ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కామెంట్లు బీజేపీ భ్రమల్లో ముగినిపోయింది. వారికి నేను వెయ్యేళ్లనాటి కథ, నీతిని తెలియజేస్తున్నా. రాముడు సత్యం కోసం యుద్ధం చేశారు. రాముడికి అధికారం, వనరులు లేవు. రాముడికి కానీసం రథం కూడా లేదు. రావణాసురుడికి రథం, వనరులు, యుద్ధ సైన్యం ఉంది. రాముడి వద్ద సత్యం, నమ్మకం, విశ్వాసం, ఓర్పు, తెగువ ఉందని గుర్తు చేశారు. ఇండియా కూటమి ఐదు డిమాండ్లు చేస్తోంది #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "I think that they (BJP) are trapped in illusion. I want to remind them of a thousand-year-old tale and its message. When Lord Ram was fighting for the truth, He did… pic.twitter.com/43vpN9Y107 — ANI (@ANI) March 31, 2024 ఐదు డిమాండ్లు ఇవే... ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో అందరినీ సమానంగా చూడాలి బలవంతంగా ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ , ఐటీ అరెస్ట్లు, దాడులు ఆపేయాలి వెంటనే సీఎం అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ను విడిచిపట్టాలి0 ప్రతిపక్షాల ఆర్థిం వనరులను దెబ్బతీయటం ఆపేయాలి బీజేపీ పొందిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సిట్ ఏర్పాటు చేసి వెంటనే దర్యాప్తు జరపాలి #WATCH | Delhi: At the Maha Rally at the Ramlila Maidan, Congress General Secretary Priyanka Gandhi Vadra says, "INDIA Alliance has 5 demands. The Election Commission should ensure equal opportunity in the Lok Sabha elections. Second, the ECI should stop the forceful action… pic.twitter.com/pSUBSFwhvm — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్లు బీజేపీ 400 సీట్లు గెలుపు నినాదం సెటైర్లు ఈవీఎంలు లేకుండా, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపకై ఒత్తిడి పెంచకుండా బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలవలేదు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కామెంట్లు ఈడీ, సీబీఐ అండ్ ఐటీ బీజేపీకి చెందిన విభాగాలు. లాలూ ప్రసాద్ యావద్ను చాలా సార్లు వేధించాయి. మాపై వ్యతిరేకంగా కేసులు పెట్టారు. మా కుటుంబంలోని అందరిపై కేసులు మోపారు ఆర్జేడీ నేతలపై తరచూ సోదాలు జరుగుతున్నాయి ఈడీ, ఐడీ సోదాలు జరుగుతునే ఉన్నాయి. మేము ఎప్పడూ భయపడలేదు.. పోరాడుతూనే ఉన్నాం. టీఎంసీ ఇండయా కూటమిలో భాగమే.. ‘టీఎంసీ ఇండియా కూటమిలో భాగమే. ప్రజాస్వామ్యాకి బీజేపీకి మధ్య యుద్ధం జరుగుతోంది’టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. #WATCH | INDIA alliance rally: TMC MP Derek O'Brien says, "...All India Trinamool Congress (TMC) is very much was, is and will be part of the INDIA alliance. This is a fight of BJP versus democracy..." pic.twitter.com/5q2YuoHRCO — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమికి ఆప్ తరఫున మద్దతు తెలుపుతున్నా: సునీతా కేజ్రీవాల్ ఇండియా కూటమి కాదు.. ఇండియా అనేది మనందరి హృదయం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉండవు. దేశవ్యాప్తంగా పేదలకు విద్యుత్ ఉచితం. ప్రతి గ్రామంలో పిల్లలు నాణ్యమైన విద్యను పొందే మంచి పాఠశాల ఏర్పాటు గ్రామంలో మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు స్వామినాథన్ నివేదిక ప్రకారం రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వటం. ఢిల్లీ ప్రజలు చాలా ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. మేము అంతం చేస్తాము. ఢిల్లీ ప్రజలకు రాష్ట్ర హోదా పొందుతారు. ఐదేళ్లలో ఈ గ్యారంటీలు అమలుచేస్తాం #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal at the INDIA alliance rally in Ramlila Maidan, Delhi. pic.twitter.com/ah1WM7RhsH — ANI (@ANI) March 31, 2024 ప్రధాని మోదీ కేజ్రీవాల్ను జైలులో పెట్టారు: సునీతా కేజ్రీవాల్ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ లోక్తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) ర్యాలీ ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కేజ్రీవాల్ పంపిన లేఖలను చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ ప్రధాని మోదీ కేజ్రీవాల్ను జైలులో పెట్టారు మోదీ చేసింది సరైన పనేనా? సీఎం కేజ్రీవాల్ నిజాయితిపరుడని మీరు నమ్మటం లేదా? కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్ సింహం లాంటి వ్యక్తి కోట్ల మంది హృదయాల్లో కేజ్రీవాల్ ఉన్నారు #WATCH | INDIA alliance rally: Delhi CM Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Your own Kejriwal has sent a message for you from jail. Before reading this message, I would like to ask you something. Our Prime Minister Narendra Modi put my husband in jail, did the Prime… pic.twitter.com/aZsdXXvJOO — ANI (@ANI) March 31, 2024 రాంలీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ పంపిన లేఖ చదివి వినిపించిన సునీతా కేజ్రీవాల్ దేశం బాధలో ఉందని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. ‘ఇండియా కూటమి’మహా ర్యాలీ.. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కామెంట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజకీయ పార్టీలకు కనీస గౌరవం ఇవ్వడాన్ని పూర్తిగా నిరాకరిస్తోంది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల విషయంలో మరీ దారుణం ఇలాంటి తరుణంలో లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయని ఎలా నమ్ముతాం? దేశంలో ఎన్నికలను బీజేపీ హైజాక్ చేయాలనుకుంటోంది ప్రతిపక్షపార్టీలు, నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోంది అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి మెగా ర్యాలీని నిర్వహిస్తోంది #WATCH | On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress MP KC Venugopal says, "Now the Government of India under the leadership of PM Modi is completely refusing to provide a level playing field to political parties, especially the opposition parties. How can you ensure… pic.twitter.com/cw5ZUZoBsl — ANI (@ANI) March 31, 2024 ‘ఇండియా కూటమి’ మెగా ర్యాలీలో పాల్గొనేందుకు అరవింద్ కేజీవాల్ సతీమణి సునితా కేజ్రీవాల్ రాంలీలా మైదానానికి బయల్దేరారు. #WATCH | Delhi: Punjab CM Bhagwant Mann along with Delhi CM and AAP national convener Arvind Kejriwal's wife Sunita Kejriwal leave for Ramlila Maidan to attend the INDIA alliance rally pic.twitter.com/uCYhUes7MN — ANI (@ANI) March 31, 2024 రాజ్యాంగం దాడికి గురవుతోందని కాంగెస్ నేత సుప్రియా శ్రీనతే అన్నారు. రాంలీలా మైదనంలోని మెగా ర్యాలీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజ్యాంగం దాడికి గురవుతోంది. దేశం మొత్తం రాజ్యాంగ రక్షణకు కలిసికట్టుగా ముందుకువెళ్తోంది. ఇదే విషయాన్ని విషయాన్ని తెలియజేయటానికి ర్యాలీకి హాజరవుతున్నా’ అని అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan, Congress leader Supriya Shrinate says, "The democracy is being attacked. The whole country is standing in the favour of democracy. And we have come here to give the same message..." pic.twitter.com/WfgEQ8uRtK — ANI (@ANI) March 31, 2024 నియంత, మతతత్వ బీజేపీ పార్టీ విధానాలను ఎండకట్టేందుకు, అరవింద్ కేజ్రీవాల్, హెమంత్ సోరెన్ అరెస్ట్కు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో మహా ర్యాలీలో ప్రజలు. నేతలు పాల్గొంటున్నారని సీఐఎం(ఎం) నేత బృందా కారత్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఉపా చట్టాన్ని ఈడీ, సీబీ దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సమర్థమంతమైనది కాదనడానికి ఇదే నిదర్శనం అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, CPI-M leader Brinda Karat says, "The message is that people from all over the country have gathered against this dictator and communal government. This Maha rally in Delhi is against Arvind Kejriwal and Hemant… pic.twitter.com/ZmSSr2FjLQ — ANI (@ANI) March 31, 2024 ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ చేపట్టిన మెగా ర్యాలీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రవాల్ మాట్లాడనున్నారు. రాంలీలా మైదానానికి కూటమి నేతలు చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో ఢిల్లీ ప్రజలు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు చేరుకున్నారు. ఢిల్లీ ప్రజల కోసమే కేజ్రీవాల్ ఆందోళన.. రాంలీలా మైదనం వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని ఢిల్లీ మంత్రి ఆతిశీ అన్నారు. ఆమె మీడియా మాట్లాడారు. ‘ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చారని వారికి తెలుసు. ఆయన అరెస్ట్ అయ్యాక కూడా ఢిల్లీ ప్రజల కోసం ఆందోళన పడుతున్నారు’అని మంత్రి అతిశీ అన్నారు. #WATCH | Delhi: On the INDIA bloc's rally at Ramlila Maidan today, AAP Minister Atishi says, "It is 10 am and people have already gathered in huge numbers. People from all over the country have come against the arrest of Arvind Kejriwal. The people of Delhi are aware that Arvind… pic.twitter.com/6XF8mN5WnU — ANI (@ANI) March 31, 2024 ఇండియా కూటమి మెగా ర్యాలీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా రాంలీలా మైదానంలో మహా ధర్నా కేజీవాల్ జైల్లో ఉన్న ఫొటోలు ఏర్పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా 13 పార్టీల నేతల హాజరు ఎండ వేడిమి తట్టుకోవడానికి ఏర్పాట్లు మెగా ర్యాలీ వద్ద భారీ భద్రత ఏర్పాటు ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు నకిలీ దర్యాప్తు పేరుతో, మన్నల్ని, మా పార్టీని గత రెండేళ్లుగా కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ జాతీయ అధికప్రతినిధి ప్రియాంకా కక్కర్ అన్నారు. రామ్లీలా మైదానంలో విపక్షాల ఇండియా కూటమి ర్యాలీ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎటువంటి అధారాలు లేకుండా కొందరి నకిలీ ప్రకటనలతో సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేశారు. ఇది మా పార్టీ గొంతు నొక్కాలనే కుట్రలో భాగం. ఎవరైలే బీజేపీ ప్రశ్నిస్తారే వాళ్లను జైల్లో తోయటమే వారి పని’అని ప్రియాంకా మండిపడ్డారు. #WATCH | Delhi: On INDIA alliance rally at Ramlila Maidan, AAP leader AAP national spokesperson Priyanka Kakkar says, " It can be clearly seen how we are being targeted in the for last 2 years in the name of a fake investigation. Without any proof, just based on a few statements,… pic.twitter.com/7Ne4Kfuxcg — ANI (@ANI) March 31, 2024 ►ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి ఇండియా కూటమి రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ►రామ్లీల మైదానంలో కళ్లకు గంతులు కట్టుకుని కాంగ్రెస్ నేతల నిరసన #WATCH | Delhi: Congress workers organised a blindfold protest at the Ramlila Maidan. pic.twitter.com/5p0C5mwpRn — ANI (@ANI) March 31, 2024 ►ఇండియా కూటమి ర్యాలీకి బయలుదేరిన జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వానికి స్వస్థి పలికి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అన్నారు. #WATCH | Ranchi: Before leaving for Delhi to attend the INDIA Alliance Maha Rally at the Ramlila Maidan today, Jharkhand CM Champai Soren says, "We have to abolish the dictatorship and save the democracy..." pic.twitter.com/kOHI9A0EiV — ANI (@ANI) March 31, 2024 ►ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ , కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడంపై ఇండియా కూటమి భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పన్ను ఎగవేత కేసులో రూ.1800 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. #WATCH | Delhi: INDIA alliance to hold rally against the arrest of Delhi CM and AAP convener Arvind Kejriwal, at Ramlila Maidan from 10 am today (Visuals from the Ramlila Maidan) pic.twitter.com/cahR183k7g — ANI (@ANI) March 31, 2024 కీలక నేతలు హాజరు.. ►ఢిల్లీలో జరిగే ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోసియా గాంధీ, రాహుల్గాంధీ సహా కీలకనేతల పాల్గొనబోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు అడ్డంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఇవాళ్టి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నారు నేతలు. ఇవాళ్టి కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన నేపథ్యంలో ర్యాలీకి భారీ జనసమీకరణ చేసి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. డెరిక్ ఒబ్రియాన్ (టీఎంసీ), తిరుచ్చి శివ (డీఎంకే), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్సీపీ), తేజస్వీ యాద వ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితరులు పాల్గొంటారన్నారు. సునీత కేజ్రీవాల్కు కల్పన సొరేన్ సంఘీభావం ►ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్కు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సతీమణి కల్పన సొరేన్ శనివారం సంఘీభావం తెలిపారు. కేజ్రీవాల్ నివాసంలో వీరి భే టీ జరిగింది.శక్తిమంతులైన మహిళలు కలవడంతో బీజేపీ భయపడి ఉం టుందని.. వీరిద్దరి సమావేశంపై ఢిల్లీ మంత్రి ఆతీశి ట్వీట్ చేశా రు. కల్పన విలేకర్లతో మాట్లాడుతూ, సునీత కేజ్రీవాల్కు యావత్తు జార్ఖం డ్ ప్రజలు అండగా ఉంటారని, తాము ఒకరి ఆవేదనను మరొకరం పంచుకున్నామని చెప్పారు.తాము కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించామన్నారు. -
India Alliance: బిహార్లో కాంగ్రెస్ పోటీ చేసే సీట్లు ఎన్నంటే..
పాట్నా: లోక్సభ ఎన్నికల్లో బిహార్లో ఇండియా కూటమి సీట్ షేరింగ్ ఫైనల్ అయింది. పొత్తులో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ పార్టీ 26 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో వామపక్షాలు 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని కూటమి పార్టీలు శుక్రవారం(మార్చ్ 29) వెల్లడించాయి. బీహార్లో మొత్తం 40 సీట్లకు గాను ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 1న ఏడవ విడత పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16, జితన్ రామ్ మాంజీ పార్టీ హెచ్ఏఎమ్ ఒక సీటు, ఆర్ఎల్ఎస్పీ ఒక సీటు, చిరాగ్ పాశ్వాన్ లోక్జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్లో బీజేపీకి 24.1 శాతం ఓట్లు రాగా జేడీయూకు 22.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 7.9 శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. అయినా ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ఆర్జేడీ 9 సీట్లు ఇవ్వడం విశేషం. ఇదీ చదవండి.. కాంగ్రెస్కు మరో బిగ్ షాక్ -
ఇండియా కూటమితో టచ్లో పశుపతి పరాస్!
రాష్ట్రీయ లోక్జనశక్తి (ఆర్ఎల్జేపీ) పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్.. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తనకు అన్యాయం జరగటంతో ఎన్డీయే కూటమితో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపక్షాల ఇండియా కూటమికి టచ్లో ఉన్నారని తెలుస్తోంది. పశుపతి పరాస్ ఎన్డీయేకు గుడ్బై చెప్పిన వెంటనే ఆర్జేడీ నేత తేజ్ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. బిహార్లోని ప్రతిపక్ష కూటమికి ఆహ్వానించారు. ‘ఒకవేళ పశుపతి పరాస్ బీహార్ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. రాజీనామా చేసిన పరాస్ను బీజేపీ ఏం చేయలేదు’ అని అన్నారు. అయితే పరాస్.. పలు లోక్సభ స్థానాలతో పాటు హాజీపూర్ సెగ్మెంట్ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో కీలకమైన హాజీపూర్ స్థానంలో కచ్చితంగా పోటీ చేస్తానని.. అవసరమైతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్దమేని ఇటీవల పరాస్ ప్రకటించారు. అయితే సోమవారం బీజేపీ.. పరాస్ను పక్కనబెట్టి జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)తో సీట్ల పంపకం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పశుపతి పరాస్ ఎన్డీయే నుంచి తప్పుకున్నారు. మరోవైపు పరాస్కు కంచుకోట అయిన హాజీపూర్లో బీజేపీ.. లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) పార్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించటం గమనార్హం. ఒకవేళ పరాస్ ఇండియా కూటమిలో చేరితే ఆయనకు హాజీపూర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి. -
Lok Sabha Elections 2024: నువ్వా నేనా...!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల్లో హోరాహోరీ తలపడేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) సిద్ధమయ్యాయి. వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, ఆ పార్టీని ఈసారి ఎలాగైనా మట్టికరిపించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నాయి. పేదలు, మహిళలు, రైతులు, యువతను లక్ష్యంగా చేసుకుని హామీల వర్షం కురిపిస్తున్నాయి. సొంతంగా 370కి పైగా స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న అధికార బీజేపీ ఇప్పటికే ఏకంగా 267 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదుంది. ఇంకా కూటమి లెక్కలు తేలక కాంగ్రెస్ సతమతమవుతోంది. హోరాహోరీ పోరులో ఏ కూటమి నెగ్గేదీ తెలియాలంటే జూన్ 4న వరకు వేచి చూడాల్సిందే... అయోధ్యలో రామమందిర నిర్మాణం అనంతరం కదనోత్సాహంతో ఉన్న కమలదళం ఈ ఎన్నికల్లో భారీ లక్ష్యాలే నిర్ణయించుకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో 282 సీట్లు సాధించి 2019లో 303కు ఎగబాకిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 370కి పైగా సీట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఏ పక్షాలతో కలిపి 400లకు పైగా సీట్లు సాధించాలని భావిస్తోంది. ఎన్డీఏకు ప్రస్తుతం 335 మంది ఎంపీలుండగా వీరిలో బీజేపీ సొంత బలమే 290 (మిగతా ఎంపీలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగి రాజీనామా చేశారు). ఇక కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో కేవలం 52 సీట్లకు పరిమితమైంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పక్షాలన్నీ కలిపి 2019లో 144 సీట్లు మాత్రమే సాధించాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీఏకి 40 శాతం, ఇండియా కూటమికి 35 శాతం ఓట్లొచ్చాయి. ఎన్డీఏకు ఈసారి ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాలను చుట్టేశారు. దక్షిణాదిన కూడా దాదాపు అన్నిచోట్ల పర్యటించారు. అసెంబ్లీలవారీగా కూటముల బలాబలాలు... ► దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్డీఏ పార్టిలు 18 రాష్ట్రాల్లో, ఇండియా కూటమి పార్టిలు 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ► మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేల్లో 1,791 మంది ఎన్డీయే కూటమికి చెందినవారు కాగా 1,653 మంది ఇండియా కూటమికి చెందినవారున్నారు. ► శాసన మండలి ఉన్న ఆరు రాష్ట్రాల్లోని మొత్తం 426 ఎమ్మెల్సీల్లో 105 మంది ఇండియాకు, 184 మంది ఎన్డీఏకు చెందినవారు. ► ఎమ్మెల్యేలపరంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రతో సహా అత్యధిక జనాభా ఉన్న చాలా రాష్ట్రాల్లో ఎన్డీఏది ఆధిపత్యం. కాగా పశ్చిమబెంగాల్, కర్నాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్ల్లో ఇండియా కూటమిది పైచేయి. ► 2023–24 మధ్య తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఐదుచోట్ల ప్రభుత్వం మారింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ, రెండింట కాంగ్రెస్ నెగ్గాయి. మిగతా మూడు రాష్ట్రాలను ప్రాంతీయ పార్టిలు చేజిక్కించుకున్నాయి. బీజేపీ లక్ష్యం 370 ప్లస్ ఎన్డీఏ భాగస్వాములతో సీట్ల పంపకాలను బీజేపీ శరవేగంగా తేల్చేస్తోంది... ► అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో 80 లోక్సభ స్థానాలకు 2019లో 62 సీట్లు బీజేపీ సాధించిన ఈసారి 70 దాటాలని టార్గెట్ పెట్టుకుంది. మిత్రపక్షాల్లో అప్నాదళ్ (ఎస్)కు 5 సీట్లు, నిషాద్ పార్టికి ఒకట్రెండు కేటాయించవచ్చు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్ ఐదు సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ► మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 26 చోట్ల బీజేపీ పోటీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ (అజిత్)తో కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. ► 40 స్థానాలున్న బిహార్లో కనీసం 25 సీట్లులో పోటీ చేయనుంది. మిగతా స్థానాలను జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ, ఉపేంద్ర కుషా్వహా రా్రïÙ్టయ లోక్ జనతాదళ్, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్)లకు కేటాయించే అవకాశముంది. ► 28 లోక్సభ స్థానాలున్న కర్ణాటకలో కొత్త మిత్రుడు జేడీ(ఎస్)కు 3 స్థానాలిచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. అక్కడ 2019 ఎన్నికల్లో 25 స్థానాలు చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి వాటిని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ► అస్సాంలో 14 స్థానాలకు గాను 11 స్థానాల్లో బీజేపీ, మిగతా చోట్ల మిత్రపక్షాలు అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ (యూపీపీఎల్) పోటీ చేస్తారు. లెక్కలు తేలక ‘హస్త’వ్యస్తం... ఈసారి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించే లక్ష్యంతో భాగస్వాములతో కాంగ్రెస్ పొత్తు కసరత్తులు చేస్తోంది. ఒంటరిగా పోటీ చేసే రాష్ట్రాలు, మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగాల్సిన రాష్ట్రాలపై పీసీసీల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అంతర్గత నిర్ణయం మేరకు కర్ణాటక (28), గుజరాత్ (26), రాజస్థాన్ (25), ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), అస్సాం (14), చత్తీస్గఢ్ (11), హరియాణా (10), అరుణాచల్ప్రదేశ్ (2)ల్లో కాంగ్రెస్ ఒంటరి పోటీ చేయనుందని సమాచారం... యూపీలో కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాలని భావించినా చివరికి 17 స్థానాలకే పరిమితమవుతోంది. మిగతా చోట్ల ఇండియా కూటమి భాగస్వామి సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది. ► మహారాష్ట్రలో కనీసం 18 సీట్లలో బరిలో దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. మిగతా వాటిని మిత్రపక్షాలు ఎన్సీపీ (శరద్), శివసేన (యూబీటీ)లకు కేటాయించనుంది. ► పశి్చమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో మొత్తం 42 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయనుంది. ► బిహార్లో జేడీ(యూ) జారుకోవడంతో కనీసం 25 చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నా చివరికి 15 స్థానాలకే పరిమితమయ్యేలా ఉంది. మిత్రపక్షం ఆర్జేడీ మాత్రం 7 నుంచి 9 సీట్ల కంటే ఇచ్చేది లేదంటోంది! ► తమిళనాట డీఎంకేతో పొత్తున్నా కాంగ్రెస్కు రెండుకు మించి సీట్లు దక్కడం కష్టమే. ► జార్ఖండ్లోని ఏడు చోట్ల పోటీ చేసి జేఎంఎంకు 4, ఇతర పక్షాలకు 3 ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. ► కేరళలో 20 స్థానాల్లో 16 చోట్ల పోటీ చేసి వామపక్షాలకు 4 ఇవ్వనుంది. ► పంజాబ్లో ఆప్తో పొత్తు కుదరకపోవడం, అకాలీదళ్ కూడా దూరమవడంతో మొత్తం 13 సీట్లలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. ► ఢిల్లీలో మాత్రం నాలుగు చోట్ల ఆప్, మూడుచోట్ల కాంగ్రెస్ బరిలో దిగనున్నాయి. 2019లో ఇలా... 2014లో బీజేపీకి సొంతంగా 282 సీట్లు రాగా 2019 నాటికి 303కు పెరిగాయి. 2019 ఎన్నికల్లో హిందీ రాష్ట్రాలను చాలావరకు క్లీన్స్వీప్ చేసింది. 2019లో 31 శాతం ఓట్లు సాధించగా 2019లో 37.4కు పెంచుకుంది. 2019లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 353 ఎంపీల మద్దతుంది. కూటమి మొత్తం 40 శాతం ఓట్లు సాధించింది. ఎన్డీఏ కూటమి బలం బీజేపీ 290 జేడీ(యూ) 16 శివసేన 13 ఆర్ఎల్జేపీ 5 ఇతరులు 11 2019లో ఇలా... ప్రస్తుత ఇండియా కూటమి 2009 లోక్సభ ఎన్నికల్లో 40 శాతం ఓట్లతో 347 సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో ఓట్ల శాతం 42 శాతానికి పెరిగినప్పటికీ 161 సీట్లకే పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టిల మధ్య త్రిముఖ పోటీయే ఇందుకు ప్రధాన కారణం. ఇక 2019 ఎన్నికల్లో ఇండియా కూటమి 38 శాతం ఓట్లకు, కేవలం 144 సీట్లకు పడిపోయింది. ఇండియా కూటమి బలం కాంగ్రెస్ 48 డీఎంకే 24 టీఎంసీ 22 శివసేన (యూబీటీ) 6 ఎన్సీపీ (శరద్) 4 ఇతరులు 19 -
‘సీఏఏ’పై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తాజాగా అమల్లోకి వచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామని, ఈ హామీని రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పారు. సీఏఏ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్ణయాన్ని మంగళవారం ఢిల్లీలో ఆయన సమర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సీఏఏ చట్టం రాజ్యాంగం పరంగానే కాకుండా నైతికంగా కూడా పెద్ద తప్పు. పౌరసత్వం చట్టంలో మతాల ప్రస్తావన తీసుకురావడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించం. చట్టం పరిధిలో నుంచి ఒక మతాన్ని తప్పించకుండా ఉండి ఉంటే మేం సీఏఏను ఆహ్వానించి ఉండే వాళ్లం’ అని శశి థరూర్ పేర్కొన్నారు. కాగా, సీఏఏను అమల్లోకి తీసుకువస్తున్నట్లు సోమవారం (మార్చ్11) కేంద్ర ప్రభుత్వం రూల్స్ నోటిఫై చేసింది. ఇదీ చదవండి.. సీఏఏపై దళపతి విజయ్ ఏమన్నారంటే.. -
కూటమి నిజంగా బలహీన పడిందా?
ఇండియా కూటమి చీలిపోయిందంటూ ఇటీవల ప్రభుత్వ అనుకూల మీడియా తరచూ ప్రచారం చేస్తున్న విషయం అందరికీ విదితమే. ఇకపోతే ప్రధాని మోదీ ఇటీవల బీజేపీ వివిధ రాష్ట్రాల ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిత్ర పక్షాలను కలుపు కొని 400 సీట్లు గెలుస్తామని ఘంటాపథంగా చెప్పారు. దీన్నే ప్రామాణికంగా తీసుకొన్న వివిధ స్థాయుల్లోని బీజేపీ నాయకులూ బహుళ ప్రచారంలో పెట్టారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో మీడియా ‘ఇండియా’ కూటమి బలహీన పడిందంటూ బహుళ ప్రచారం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. ఇటీవలనే ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ–కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక్కడ మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉండగా బీజేపీ గత ఎన్నికల్లో 62 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అక్కడ గతంలో గెలుచుకున్నన్ని స్థానాలు సంపాదించడం కష్టమని అంచనా. గతంలో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. అప్పుడు సున్నితమైన పుల్వామా అంశం తెరపైకి వచ్చి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి. కాబట్టి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అంతేకాకుండా ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల పేపర్లు లీక్ కావటంతో యోగీ ప్రభుత్వం ఆ పరీక్షలను రద్దుచేసి మళ్లీ నిర్వహిస్తానని ప్రకటించింది. దీంతో యాభై లక్షలమంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై పడనుందని అంటున్నారు. అక్కడ ముఖ్యమంత్రి యోగి క్షత్రియ కులానికి చెందినవాడు. బ్రాహ్మణుల్లో తమకు యోగి ప్రభుత్వంలో సరియైన ప్రాతినిధ్యం లేదనే భావన ఉండటంతో ఈసారి ఆయనకు వ్యతిరేకంగా వారు పనిచేయవచ్చు. ఇక ఎన్డీయేలో భాగస్వామి అయిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తరచూ కూటములు మార టంతో ఆయన పలుకుబడి కుర్మీలలో బాగా తగ్గింది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొంటే గతంలో బీజేపీకి వచ్చినన్ని సీట్లు ఈసారి రావనేది రాజకీయ పరి శీలకుల భావన. ఈ సీట్లలో చాలావాటిని ‘ఇండియా’ కూటమే గెలుచుకుంటుందంటున్నారు. ఇక బిహార్ విషయాని కొద్దాం. ముఖ్యమంత్రి నితీశ్ పిల్లిమొగ్గలతో మొత్తం ఎన్డీయే మీదే అక్కడి ఓటర్లలో వ్యతి రేకత బాగా ఏర్పడింది. ఇక్కడ ఈసారి లాలూప్రసాద్ పార్టీ ఆర్జేడీ బలం పుంజుకొంది. దీనికితోడు కాంగ్రెస్, కమ్యూ నిస్టులు ఈసారి అక్కడ కలిసి పోటీచేయాలనుకుంటు న్నారు. ఇది ‘ఇండియా’ కూటమికి ప్రయోజనం కలిగే అంశం. ఇక బెంగాల్లో మమతా ఒంటరి పోరేనంటోంది. అక్కడ త్రిముఖ పోటీ ఉండటంతో ప్రభుత్వ ఓట్లు చీలి టీఎంసీకి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. రాజస్థాన్లో వసుంధరా రాజే తనను ముఖ్యమంత్రిగా చేయనందుకు రగిలిపోతోంది. ఆమె ఈసారి చురుగ్గా పనిచేయకపోవచ్చు. ఇక ఈశాన్యరాష్ట్రాలలో ఈసారి మణిపుర్ గొడవలు బీజేపీకి నష్టం చేకూర్చనున్నాయి. హిమాచల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం ‘ఇండియా’ కూటమికి అను కూలాంశం. కాంగ్రెస్–ఆప్ పొత్తు కుదుర్చుకున్నాయి కాబట్టి ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానాలలో ఇండియా కూటమి మెరుగయ్యే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనలను చీల్చి బీజేపీ చేసిన రాజకీయాలు ఓటర్ల మనో ఫలకాలపై వ్యతిరేక ముద్ర వేసిందనే చెప్పాలి. ఇక దక్షిణాదిలో... కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, గత బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లలో ఎన్డీయే ఖాతా తెరిచేది గగనమే. తెలంగాణలో గతంలో 4 స్థానాలు గెల వగా ఇప్పుడు వాటిని నిలబెట్టుకొని, మరిన్ని స్థానాలు కైవసం చేసుకోగలదా అన్నది చూడాలి. బీజేపీ రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ ప్రజాబాహు ళ్యంలోకి బాగా వెళ్లిందనీ, ఈసారి అదే అంశం బీజేపీకి అనుకూలాంశం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు ఉత్తర భారతంలో విశేష ప్రజాదరణ లభిస్తున్నందున బీజేపీకి అది అననుకూల అంశమే అవుతుంది. పైన పేర్కొన్న అనేక కారణాల వల్ల గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన స్థానాల కంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా. అందుకే, ఆ పార్టీ తమ ‘టార్గెట్ 400’ అంటూనే, వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తుకు దిగుతోందని విశ్లేషణ. – డా‘‘ కె. సుధాకర్ రెడ్డి,రిటైర్డ్ లెక్చరర్ ‘ 89850 37713 -
ఆప్, కాంగ్రెస్ల సీట్ షేరింగ్.. ఎవరికెన్ని సీట్లంటే..
న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)ల మధ్య సీట్ల పంపిణీ ఖాయమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా పూర్తయిందని ఆ పార్టీ నేతలు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలోని 7 సీట్లలో నాలుగింటిలో ఆప్, మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేయనుంది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీల్లో ఆప్ పోటీ చేయనుండగా చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 2014,2019 లోక్సభ ఎన్నికల్లో వరుసగా బీజేపీ ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లను కైవసం చేసుకోవడం విశేషం. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొన్ని సీట్లను ఆప్కు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఇందులో భాగంగా హర్యానాలో ఒకటి, గుజరాత్లో రెండు సీట్ల నుంచి కూడా పొత్తులో భాగంగా ఆప్కు కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఈ వారంలోనే ఇండియా కూటమిలోని మరో ప్రధాన పార్టీ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్ సీట్ల పంపకం ఖరారైన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా యూపీలో ఎస్పీ 63, కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కూటమిలోని మరో పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పశ్చిమబెంగాల్లోని మొత్తం 42 సీట్లలో తామే పోటీ చేస్తామని చెబుతుండడం ఇండియా కూటమి నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఇదీ చదవండి.. కాంగ్రెస్కు భారీ ఝలక్ -
కాంగ్రెస్కు రిలీఫ్.. సీఎం మమత కీలక నిర్ణయం!
ఢిల్లీ: ఇండియా కూటమిలో భాగంగా బెంగాల్లో సీట్ల సర్ధుబాటు అంశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతం తగ్గించుకుని కాంగ్రెస్తో చర్చకు రెడీ అయినట్టు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్లో దాదాపు ఆరు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియ కూటమికి బూస్ట్ లభించింది. ఇండియా కూటమిలో సీట్ల విషయంలో మమతా బెనర్జీ కూడా తన వైఖరిని తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, గతంలో పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ ఇప్పుడు బెంగాల్, మేఘాలయలో కూడా కాంగ్రెస్తో సీట్ల పంపకంపై చర్చలకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య తుది చర్చలు జరిగే అవకాశం ఉంది. Is it a better deal ?? In Bengal, a deal with TMC... Mamata Banerjee is willing to give Congress 5 seats. Initially, TMC had offered only 2 seats.#INDIAAlliance pic.twitter.com/N2phFmAd8n — Sunil Lamba (@Post4India) February 22, 2024 ఇక, రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరితే బెంగాల్లో ఆరు లోక్సభ స్థానాలను కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బెంగాల్లోని బెహ్రంపూర్, దక్షిణ మాల్దా, ఉత్తర మాల్దా, రాయిగంజ్, డార్జిలింగ్, పురిలియా స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఇందుకు మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దీనికి ప్రతిగా మేఘాలయ, అస్సాంలలో ఒక్కో సీటును టీఎంసీ కోరుతోందని సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో అధికారికంగా సీట్ల ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. యూపీలో కాంగ్రెస్.. అమేథీ, రాయ్బరేలీ సహా 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అఖిలేష్ ఒప్పుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా అఖిలేష్కు ఎంపీ సీటు ఇచ్చింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా కాంగ్రెస్ సీట్లు ఒప్పందం కుదుర్చుకుంది. -
ఇండియా కూటమిలో చేరికపై కమల్ హాసన్ స్పందన
చెన్నై: స్వార్థరహితంగా ఆలోచించే ఏ కూటమితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడుకు చెందిన ఎమ్ఎన్ఎమ్ పార్టీ చీఫ్ కమల్హాసన్ తెలిపారు. ఇండియా కూటమిలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తాము భాగస్వాములం కాదని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా స్థానిక ఫ్యూడల్ శక్తులతో కలిసి మాత్రం పనిచేయబోమని చెప్పారు. స్టాలిన్కు చెందిన డీఎంకే పార్టీతో కమల్హాసన్ కలిసి పనిచేయబోతున్నారన్న పుకార్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్హాసన్ ఈ సందర్భంగా స్వాగతించారు. ఇదీ చదవండి.. గగన్యాన్పై ఇస్రో కీలక అప్డేట్ -
ఇండియా కూటమి..యూపీలో పొత్తుకు బ్రేక్ ?
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి బీటలు వారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ఇచ్చే స్థానాలపై సమాజ్వాద్ పార్టీ కొంత కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రెండు పార్టీల నేతల మధ్య జరిగిన సీట్ షేరింగ్ చర్చల్లో మొరాదాబాద్ డివిజన్లోని మూడు సీట్లపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం. ఈ మూడు సీట్లను కాంగ్రెస్కు ఇచ్చేది లేదని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హస్తం పార్టీ నేతలకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. కాగా, సీట్ల పంపిణీ విషయంలో రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగే వరకు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేది లేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర యూపీలోనే కొనసాగతున్న విషయం తెలిసిందే. మరోవైపు పొత్తులో భాగంగా రాష్ట్రంలో మొత్తంగా 17 సీట్లను కాంగ్రెస్కు ఇచ్చేందుకు అఖిలేశ్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం -
TN: డీఎంకే ప్రచారం షురూ.. మారిన ప్రత్యర్థి !
చెన్నై: తమిళనాడులో లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలైంది. అధికార పార్టీ డీఎంకే ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ‘హక్కుల కోసం స్టాలిన్ పోరు’ పేరుతో ప్రచార భేరి మోగించింది. చెన్నైలోని మూడు, పుదుచ్చేరిలోని ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం తప్ప రాష్ట్రంలోని 37 లోక్సభ స్థానాల్లో ఒకేసారి ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా తమిళనాడులో ఎన్నిక ఏదైనా డీఎంకే, అన్నా డీఎంకే మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే ఈసారి అనూహ్యాంగా డీఎంకే నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి ప్రారంభించారు. తమిళనాడుకు అన్యాయం చేస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి నిధులు రావాలన్నా,మైనారిటీల హక్కులు కాపాడాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిందేనన్నారు. విరుదునగర్ జిల్లాలో జరిగిన ప్రచారంలో ఎంపీ కనిమొలి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు నిధులివ్వకపోయినప్పటికీ స్టాలిన్ విద్య,వైద్యం రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్వన్గా నిలిపారని చెప్పారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకూడదని, వారు ఒక వర్గం ప్రజలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి శేఖర్బాబు ఆరోపించారు. మరోవైపు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై డీఎంకే ఫైల్స్ 3 పేరుతో టూ జీ కుంభకోణానికి సంబంధించి డీఎంకే నేతల ఆడియో విడుదల చేశారు. ఇదీ చదవండి.. భారత్ జోడో న్యాయ యాత్రకు అఖిలేశ్ దూరం -
ఇండియా కూటమి కథ ముగిసింది: నితీశ్ కుమార్
పాట్నా: ఎన్డీఏలో చేరి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బిహార్ సీఎం నితీశ్కుమార్ ఇండియా కూటమిపై తొలిసారి స్పందించారు. శనివారం పాట్నాలో ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందునుంచే ఇష్టం లేదని చెప్పారు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించానన్నారు. బిహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీయేలో చేరానన్నారు. కాగా, ఇప్పటికే ఇండియా కూటమిలో పలు పార్టీలు పొత్తులను పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కూటమిలోని కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీట్లను తేల్చకపోవడం వల్లే మిగిలిన పార్టీలు సొంతగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. w ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ -
‘ఇండియా’కు మరో షాక్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
న్యూఢిల్లీ: ఇండియా కూటమి అసలు ఉంటుందా ఉండదా అని అనుమానాలు తలెత్తుతున్న వేళ కూటమి ఉనికిని ప్రశ్నించే మరో పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ అయిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఏకపక్షంగా వ్యవహరించింది. కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో సంప్రదించకుండా అస్సాంలోని మూడు ఎంపీ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ గురువారం ఢిల్లీలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియా కూటమి తమ అభ్యర్థులకు మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి. మేం ఇండియా కూటమితోనే ఉన్నాం’ అని పాఠక్ అన్నారు. ఇప్పటికే కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 16 మంది అభ్యర్థులతో యూపీలో తన తొలిజాబితాను ప్రకటించింది. ఓ పక్క కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ఎస్పీ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం వివాదాస్పదమైంది. తాజగా కూటమిలోని ఆప్ పార్టీ కూడా ఇదే పని చేయడంతో కూటమి ఉందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించి ఒక దశలో కన్వీనర్ పదవి తీసుకుంటారని ప్రచారం జరిగిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్ ఇప్పటికే కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో జతకట్టి బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి.. కాంగ్రెస్ బ్లాక్పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని -
బిహార్లో కూటమిగా పోటీ.. టీఎంసీ మిత్ర పక్షమే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్లో కూటమి, సీఎం మమతా బెనర్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఇండియా కూటమి బీజేపీపై పోరాడుతుందని తెలిపారు. బిహార్లో ఇండియా కూటమిలో భాగంగా బీజేపీపై పోటీ చేస్తామని అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు గమనిస్తే.. ఆమె ఇండియా కుటమిలో కీలకమైన భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి కీలకమైన మిత్రపక్షమని తెలిపారు. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగినప్పటికీ తాము బిహార్లో మిగిలిన పార్టీలతో ఇండియా కూటమిలో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ దిగుతామని వెల్లడించారు. తమ భాగస్వామ్య పార్టీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగం కాదంటే.. తాను ఎప్పటికీ అంగీకరించలేనని రాహుల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొంటామని.. లోక్సభ ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకుంటామని మమతా బెనర్జీ చెప్పటమే రాహుల్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. బెంగాల్ మమతా కాంగ్రెస్కు ఐదు లోక్ సభ స్థానాలు కేటాయించడానికి సిద్ధపడినా సీపీఎంతో పొత్తు కారణం ఇది సాధ్యం పడదని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగిప్పటికీ.. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల భాగస్వామ్యంతో బలంగానే ఉంది. 40 లోక్సభ స్థానాలు ఉన్న బిహార్లో ఇండియా కూటమి సాధ్యమైనన్ని సీట్లు గెలవడానికి కాంగ్రెస్ ప్రణళికలు రచిస్తోంది. -
‘‘ఇండియా కూటమికి నితీశ్ అంత్యక్రియలు చేశారు’’
లక్నో: ఇండియా కూటమిపై ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పుట్టగానే దానికి ఎన్నో వ్యాధులు సంక్రమించాయని, ఆ తర్వాత అది వెంటిలేటర్పైకి వెళ్లిందని ప్రమోద్ అన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఇండియా కూటమికి ఇటీవలే జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాట్నాలో అంత్యక్రియలు పూర్తి చేశారని చెప్పారు. ఇప్పుడిక ఇండియా కూటమి అనేది ఉనికిలో ఉందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రమోద్ ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపైనా పదునైన విమర్శలు గుప్పించారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడుతుంటే ఒక్క కాంగ్రెస్ మాత్రం 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని వ్యంగ్యాస్రం సంధించారు. గత వారమే ఒక విషయమై ప్రమోద్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన త్వరలో కాంగ్రెస్ను వీడీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రమోద్ గత ఎంపీ ఎన్నికల్లో లక్నో నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. ఇదీచదవండి.. ‘‘ఈవీఎంల గోల్మాల్లో ప్రధాని హస్తం ఉండొచ్చు’’ -
2004 - 2024 : కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశలు
2004కు 2024కు లింకుందా? నాడు ఎన్డీయే వర్సెస్ యూపీఏ. నేడు ఎన్డీయే వర్సెస్ ‘ఇండియా’. నాటి ప్రత్యర్థులు వాజ్పేయి-సోనియా. నేటికీ సోనియా, ఆమె ప్రత్యర్థిగా నరేంద్ర మోదీ. ఇప్పుడు కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు ఎందుకు పెట్టుకుంది? మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న సోనియా గాంధీ ఆమె ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఒకసారి ఊహించండి. ఈ ఊహ 20 ఏళ్ల నాడు ఒక నమ్మలేని నిజం.. సోనియా ముభావి. ఎవరితోనూ కలవరు. కానీ ఆ రోజు మాయావతి ఇంటికి వెళ్లిన సోనియా గాంధీ ఆమెతో రెండు గంటల సేపు మాట్లాడారు. తర్వాత బయటికి వస్తూ.. ‘‘రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బహుజన పార్టీతో పొత్తు కుదుర్చుకోబోతున్నది’’ అని ప్రకటించారు. అయితే ఆ మర్నాడే మాయావతి అలాంటి పొత్తేమీ ఉండబోదని స్పష్టం చేశారు! అందుకు ప్రతిస్పందనగా.. ‘‘మాతో పొత్తు పెట్టుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని పార్టీల మీద ఒత్తిడి తెస్తోంది’’ అని సోనియా ఆరోపించారు. నాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్నట్లే ఎన్డీయే. నాడు ప్రధానిగా ఉన్నది అటల్ బిహారి వాజ్పేయి. బహుజన పార్టీతో పొత్తుకోసం ప్రయత్నించినట్లే సోనియా గాంధీ నమాజ్వాది పార్టీ పొత్తు కోసం చేయిచాచారు. సోనియా ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి అమర్సింగ్ హాజరు అయ్యారు కానీ, ములాయం సింగ్ యాదవ్ మాత్రం పొత్తు వద్దు, 1999లో మాదిరిగా ఒంటరి పోరాటమే మేలని అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా పొత్తుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయనపై కార్యకర్తల ఒత్తిడి కారణంగా కాంగ్రెస్తో చేయీచేయీ కలిపేందుకు బలవంతపు నవ్వులనే ఆనాడు ఆయన రువ్వారు. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం కాంగ్రెస్తో కలిసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు దగ్గరే ఆయన గీచిగీచి బేరం ఆడారు. లాలూ 6 స్థానాలు మాత్రమే ఇస్తాం అంటే కాంగ్రెస్ కనీసం 10 అయినా కావాలని కోరింది. ఇక డీఎంకేతో పొత్తు. అప్పటికి (2004 నాటికి) 24 ఏళ్లుగా కాంగ్రెస్కు దూరంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్తో కలిసి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చింది. అయితే లాలూ మాదిరిగానే కరుణానిధి కూడా 5 లేదా 6 సీట్లు ఇవ్వగలం అన్నారు. ఆయన తరఫున టి.బాలు సోనియాతో చర్చలు జరిపారు. అవి విఫలం అయ్యాయి. అలాగే.. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తేనే మీతో పొత్తుకు వస్తాం అని కేసీఆర్ తెగేసి చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గింది. జేఎంఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు కోరడంతో పొత్తుకు ముందుకు రాలేదు. ఏమైతేనేం ఆ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ యూపీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయేకు 181 సీట్లు రాగా, యూపీఏకు 218 సీట్లు లభించాయి. ఎన్నికల పొత్తుకు ముందుకు రాని పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాయి! బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాది పార్టీ, కేరళ కాంగ్రెస్, లెఫ్ట ఫ్రంట్లకు వచ్చిన సీట్లు కూడా కలుపుకుని 543 సభ్యుల లోక్సభలో సౌకర్యవంతమైన 335 సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. విశేషం ఏమిటంటే.. 2004లో ఎవరి మధ్యనైతే పోటీ ఉందో వారి మధ్యనే ఈ 2024లోనూ పోటీ ఉండబోవటం. నాడు, నేడు అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే. నాడు నేడు ప్రతిపక్షంగా ఉన్నది యూపీఏ కూటమే. అయితే యూపీఏ కాస్తా ‘ఇండియా’ కూటమి అయింది. నాడు స్వయంగా సోనియాజీ వెళ్లి పొత్తు కోసం ప్రయత్నించినా పొత్తుకు ముందుకు వచ్చిన పార్టీలు తక్కువ. నేడూ ఇంచుమించుగా అదే పరిస్థితి. పొత్తుకు వచ్చిన పార్టీలు ఎక్కువే అయినా ఎన్నికల వరకు అవి కాంగ్రెస్తో నిలబడి ఉంటాయా అన్నది సందేహం. ఆ సందేహం కలిగించిన మొదటి వ్యక్తి నితీష్ కుమార్. మూడు రోజుల క్రితమే ఆయన ‘ఇండియా’ కూటమిని వీడిపోయి ఎన్డీయేలో కలిశారు. మమతా బెనర్జీ కూడా తాము విడిగానే పోటీ చేస్తామని అంటున్నారు. ‘ఆప్’ కూడా ఆమె బాటలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. నితీశ్ కమార్ బయటికి వెళ్లకముందు వరకు ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ‘ఇండిపెండెంట్’ పార్టీతో కలిపి మొత్తం 28 పార్టీలు ఉండేవి. అవి: 1. కాంగ్రెస్, 2. డీఎంకే, 3. శివసేన (యు.బి.టి.), 4. సి.పి.ఐ (ఎం), 5. ఎన్.సి.పి., 6. ముస్లిం లీగ్, 7. నేషనల్ కాన్ఫరెన్స్, 8. సి.పి.ఐ., 9. ఆప్, 10. జె.ఎం.ఎం., 11. కేరళ కాంగ్రెస్, 12. కేరళ కాంగ్రెస్ (ఎం), 13. వీసీకె (విదుతలై చిరుతైగళ్ కచ్చి), 14. ఆర్.ఎస్.పి., 15. ఆర్.జె.డి., 16. ఆర్.ఎల్.డి., 17. డి.ఎం.కె., 18. సీపీఐ (ఎంఎల్) ఎల్., 19. అప్నా దళ్, 20. పీసెంట్స్ అండ్ 21. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, 22. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, 23. పి.డి.పి., 24. ఎం.ఎం.కె., 25. కె.ఎం.డి.కె., 26. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 27. ఇండిపెండెంట్, 28. జేడీయు. నాటి ఎన్నికల్లో వాజ్పేయి-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. నేటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా పార్టీలో దింపుడు కళ్లెం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయి. చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
‘ఇండియా’కు తొలి ఓటమి.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: ఇండియా కూటమికి తొలిపోరులోనే ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలోని పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు కలిసి తొలిసారి చంఢీగఢ్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేశాయి. పరోక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎక్కువ కార్పొరేటర్ సీట్లున్నప్పటికీ అనూహ్యంగా బీజేపీకి చెందిన మనోజ్ సొంకార్ మేయర్గా విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలబడ్డ ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్పై మనోజ్ సొంకార్ గెలుపొందారు. మొత్తం 35 ఓట్లున్న కౌన్సిల్లో బీజేపీకి 14 మంది, ఆప్కు 13, కాంగ్రెస్కు 7, శిరోమణి అకాలీదల్కు ఒక సభ్యుడి బలం ఉంది. అయితే 8 మంది సభ్యులను ఓటింగ్లో పాల్గొనకుండా ప్రిసైడింగ్ అధికారి డిస్క్వాలిఫై చేయడంతో బీజేపీకి అభ్యర్థికి 15 ఓట్లు, ఇండియా కూటమి అభ్యర్థి 12 ఓట్లు వచ్చాయి. రిజల్ట్ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్, ఆప్ సభ్యులు నిరసనకు దిగారు. ఛండీగఢ్ మేయర్గా బీజేపీకి చెందిన అభ్యర్థి విజయం సాధించడంపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. బీజేపీ పట్టపగలు మోసం చేసి మేయర్ సీటు గెలిచిందన్నారు. మేయర్ ఎన్నిక కోసమే బీజేపీ ఇంత దిగజారితే రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఇంకెంతకైనా తెగిస్తుందని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇదీచదవండి.. పార్టీ కార్యాలయంలోనే కాంగ్రెస్ నేతల ఘర్షణ -
పిల్లిమొగ్గల రాజకీయం
అనుకున్నదే అయింది. ఊహాగానాల్ని నితీశ్ కుమార్ నిజం చేశారు. ‘ఇండియా’ కూటమిలో నుంచి బయటకురావడం, కూటమిలోని ఆర్జేడీతో కలసి బిహార్లో నడుపుతున్న సర్కార్కు స్వస్తి చెప్పడం, ‘ఎన్డీఏ’లో మళ్ళీ చేరుతున్నట్టు ప్రకటించడం, ముందుగా మాట్లాడిపెట్టుకున్న బీజేపీ మద్దతుతో ఆదివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. దీంతో, రానున్న ఎన్నికల రాజకీయ నాటకంలో ఒక అంకం ముగిసింది. కొత్త చర్చ మొదలైంది. తొమ్మిదోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతూ, ఎన్డీఏ నుంచి ఇక అటూ ఇటూ ఎక్కడికీ పోనంటూ నితీశ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ నమ్మడం లేదు కానీ, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ బిహారీ బాబు తాజా పిల్లిమొగ్గల పర్యవసానం ఏమిటి, మోదీపై యుద్ధానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు – ఒక వర్గం ఓటర్లు ఆశపడ్డ ‘ఇండియా’ కూటమి భవితవ్యం ఏమిటి, ఎన్డీఏ కూటమికి ఎంతగా లాభిస్తుందన్న చర్చ ఆగడం లేదు. తరచూ పొత్తులు మారుస్తూ, నోటికొచ్చిన వివరణతో నెట్టుకొస్తున్న నితీశ్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైన నేత. రెండేళ్ళలో రెండోసారి, దశాబ్ది పైచిలుకులో అయిదోసారి రంగులు మార్చి, తాజాగా తొమ్మిదోసారి పీఠమెక్కి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న ఆయన తీరును పలువురు తప్పుబట్టడంలో ఆశ్చర్యం లేదు. అసలు ‘ఇండియా’ కూటమి కట్టడంలో సూత్రధారే నితీశ్. దశాబ్దాల రాష్ట్ర రాజకీయ అనుభవం అనంతరం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆయన మోజుపడ్డారు. కూటమికి సమన్వయకర్తగా వ్యవహరించాలనీ, కాలం కలిసొస్తే రాబోయే ప్రతిపక్ష సర్కారుకు ప్రధాన మంత్రి కావాలనీ కలలు కన్నారు. కానీ, ఛాన్స్ తన దాకా రాకపోవచ్చని గ్రహించేశారు. పీతలబుట్ట లాంటి ప్రతిపక్షాలు, బలం పెరుగుతున్న బీజేపీ లాంటివి చూసి నితీశ్ ప్లేటు తిప్పేశారు. గెలుపు గుర్రంపై పందెం కాస్తే, పీఎం కాకున్నా ప్రయోజనాలైనా నెరవేరతాయను కున్నారు. ‘చస్తే మళ్ళీ వెళ్ళన’ని ఏడాది క్రితం అన్న ఎన్డీఏ కూటమిలోకే నిస్సిగ్గుగా ఫిరాయించారు. ఇందులో ప్రతిపక్ష కూటమి స్వయంకృతమూ ఉంది. ఆ మధ్య 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు, వాటిపైనే దృష్టిపెట్టి కూటమి తన పనిని పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. అలా 3 నెలల పైనే వృథా అయింది. సార్వత్రిక ఎన్నికల సన్నాహం, ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయ సాధన వెనకపట్టు పట్టింది. కనీసం 300 లోక్సభా స్థానాల్లో పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పట్టుబట్టడమూ కూటమి పక్షాలకు మింగుడుపడలేదు. పోనీ ఆ డిమాండ్కు తగ్గట్టు కాంగ్రెస్ తన బలిమిని చూపగలిగిందా అంటే అదీ లేదు. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింటిలో హస్తం వీగిపోయింది. ‘ఇండియా’ కూటమిలో తనదే పైచేయిగా ఉండాలన్న ఆ పార్టీ ఆశ అడియాసే అయింది. మునుపటంత బలం లేని జాతీయ పార్టీని తమ భుజాలపై మోయడానికి బలమైన ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు. పైగా, కన్వీనర్ అంటూ ఎవరినీ ఎంపిక చేయకపోవడం మరో తప్పిదం. కనీస ఉమ్మడి అజెండా మొదలు సీట్ల పంపిణీ దాకా అన్నిటినీ పేరబెట్టేసరికి చివరకు వ్యవహారం చేయి దాటింది. ఎన్నికలు కొద్ది నెలల్లోనే ఉన్నా, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇచ్చినంత ప్రాధాన్యం వాటికి ఇవ్వట్లేదన్నది కాంగ్రెస్పై మరో విమర్శ. ఈ యాత్ర ద్వారా ప్రజా బాహుళ్యంలో బలం పుంజుకొని, తమకు మరిన్ని సీట్ల కోసం గట్టిగా బేరం చేయాలనేది ఆ పార్టీ భావననీ ఓ విశ్లేషణ. ఏమైనా, ప్రతిపక్షాలు అనైక్యతతో ఇలా కుమ్ములాడుకుంటూ ఉండగానే, బీజేపీ మాత్రం ఎన్నికలకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ఇన్ఛార్జ్లను సైతం నియమించేసింది. గత వారం బులంద్షహర్లో సభతో ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల సమరభేరి మోగించారు. జైపూర్ లాంటి చోట్ల ర్యాలీలతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కొద్ది నెలల క్రితమే 5 రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడింటిని గెలుచుకోవడం సైతం బీజేపీకి కొత్త ఊపునిచ్చింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి మీడియా, అలాగే కేంద్ర సర్కార్ హంగామాతో హిందూత్వకు మారుపేరుగా ఆ పార్టీ తన స్థానం సుస్థిరం చేసుకుంది. అందుకే, దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిన ఈ హిందూత్వ ప్రభంజనానికి ఎదురొడ్డడం ప్రతి పక్షాలకు అగ్నిపరీక్షే. పైగా, మందిర్ ప్లస్ మండల్గా మారిన బీజేపీ వ్యూహం పదునైనది. మండల్ రాజకీయాల ఉద్ధృతిలో వచ్చిన కుల ఆధారిత పార్టీలకు సెగ తగులుతోంది. అయితే, మోదీ సర్కార్ విభజన రాజకీయాలు చేస్తోందనీ, ప్రజాస్వామ్యానికిది ప్రమాద భరితమనీ అన్న నోటితోనే నితీశ్ మళ్ళీ అదే పంచన చేరడం ఆయన ఇమేజ్ను పలచన చేసింది. కుల సమీకరణలు నిష్ఠురసత్యమైన ప్పటికీ, బిహార్లో బలం తగ్గుతున్న నితీశ్కూ, ఆయన పార్టీకీ తాజా పిల్లిమొగ్గ అద్భుత భవితను అందించకపోవచ్చు. నితీశ్ నైజం తెలుసు గనక ఆయన్ని అడ్డం పెట్టుకొని, లోక్సభ ఎన్నికల్లో 40 స్థానాల బిహార్లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. అవసరం తీరాక ఆ దోస్తీ కొనసాగకపోవచ్చు. లోక్సభ తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లోపు ఏమవుతుందో, మన ‘పల్టూ రామ్’ ఏం చేస్తారో చెప్పలేం. నెలల క్రితం ఆశ రేపిన ప్రతిపక్ష కూటమి ఇప్పుడు బలహీనమైందన్నది నిజం. కానీ, ఇంతటితో కూటమి కథ ముగిసిందనడం తొందరపాటే. తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ పాలనపై దేశమంతా తృప్తిగా ఏమీ లేదు. ధరలు, నిరుద్యోగం, విభజన రాజకీయాలపై జనంలో అసహనం ఉన్నా, మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం విషాదం. మోదీని దింపాలనే తప్ప పాజిటివ్ అజెండా చెప్పలేకుంటే ఈ అసంతృప్త, అనిశ్చిత ఓటర్ గణాన్ని ప్రతిపక్షాలు ఆకర్షించలేవు. ప్రతిపక్షాలంటే కుమ్ములాటల కూటమనే భావన తొలగించకపోతే, ఎన్ని ఎన్నికలొచ్చినా అది ఎడ్వాంటేజ్ బీజేపీయే. ఇది వికసిత, ఆత్మనిర్భర్ భారత్ అవునో కాదో కానీ, ‘ఇండియా’ మటుకు వెలిగిపోవడం లేదంటున్నది అందుకే! -
అనైక్యతా కూటమి
వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ప్రతిఘటిస్తామని 28 పార్టీల కలగూరగంప ‘ఇండియా’ కూటమి ఆది నుంచి చెబుతోంది. కానీ, ఎన్నికలు ముంచుకొస్తుంటే, కూటమి బీటలు వారుతోంది. అంతటా అనైక్యతా రాగాలే వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తేల్చేశారు. ‘ఆప్’ నేత – పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సైతం తమ రాష్ట్రంలోనూ అంతే అని కుండబద్దలు కొట్టారు. జేడీ(యూ) అధినేత – బిహార్ సీఎం నితీశ్ కుమార్ పైకి ఏమీ చెప్పకున్నా, లోలోపల కుతకుతలాడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. వెరసి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ అని తిరుగుతుంటే, ముందుగా ‘ఇండియా(కూటమి) జోడో’ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందే మమత షాక్ ఇచ్చారు. బెంగాల్లో హస్తం బలం పుంజుకుంటే, అది తనకు తలనొప్పి అవుతుందని మమతకు తెలుసు. అందుకే, కలసికట్టుగా పోటీ చేసినా... రాష్ట్రంలో నిరుడు కాంగ్రెస్ నెగ్గిన 2 లోక్సభా స్థానాలనే ఆ పార్టీకి కేటాయిస్తామన్నది తృణమూల్ ప్రతిపాదన. దూకుడు ప్రదర్శిస్తున్న స్థానిక హస్తం నేతలు అందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి నిత్యం మమతపై చేస్తున్న విమర్శలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. కాంగ్రెస్ పెద్దలు నష్టనివారణకు ప్రయత్నిస్తున్నా రాజీ లేదని దీదీ కొట్టిపారే శారు. కూటమిలో కొనసాగుతామంటూనే, ఎన్నికలయ్యాక కాంగ్రెస్ బలాన్ని బట్టి మిగతావి మాట్లా డదామని ఆమె చెబుతున్న మాటలు కంటితుడుపుకే తప్ప, బీజేపీపై కలసికట్టు పోరుకు పనికిరావు. మరోపక్క ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్రధారి, జేడీ (యూ) అధినేత, బిహార్ సీఎం అయిన నితీశ్ కుమార్ వ్యవహారశైలి సైతం అనుమానాస్పదంగానే ఉంది. కూటమిలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మోదీతో రామ్ రామ్ చెప్పి, ప్రతిపక్ష కూటమిలో చేరిన ఆయన తీరా ఇప్పుడు మళ్ళీ అధికార ఎన్డీఏ కూటమికే తిరిగి వచ్చేస్తారని ఊహాగానం. బిహార్లో ఉమ్మడి పాలన సాగిస్తున్న ఆర్జేడీ – జేడీయూల మధ్య కొన్నాళ్ళుగా సఖ్యత లేదు. ప్లేటు ఫిరాయించడంలో పేరొందిన నితీశ్ గతంలో బీజేపీకి కటీఫ్ చెప్పి, ఆర్జేడీతో కలసి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ, ఇటీవల తననే గద్దె దింపాలని చూసిన ఆర్జేడీ మీద గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీని పక్కకు నెట్టి, మళ్ళీ కమలనాథులతో నితీశ్ చేతులు కలిపే సూచనలున్నట్టు పుకారు. బిహార్లో జేడీయూ, ఆర్జేడీ నేతలు ఎవరికి వారు గురువారం కీలక భేటీలు జరపడం, ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తీరు చూస్తుంటే... ఆ రెండు పార్టీల ప్రేమకథ ముగిసినట్టే ఉంది. మరి, రాజకీయ చాణక్యుడు నితీశ్ రానున్న రోజుల్లో ఏం చేస్తారో చూడాలి. విచిత్రమేమిటంటే, మాటలే తప్ప చేతల్లో కూటమి అడుగు ముందుకు పడట్లేదు. సెప్టెంబర్లో అనుకున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం డిసెంబర్కి వాయిదా పడి, జనవరి ముగిసిపోతున్నా అతీగతీ లేకుండా పడివుంది. అన్ని పార్టీలూ కలసి సమష్టి ప్రతిపక్ష ర్యాలీ భోపాల్లో చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. నెలలు గడుస్తున్నా ఉమ్మడి మేనిఫెస్టో ఊసే లేదు. లౌకికవాద, రాజ్యాంగబద్ధ పాలన కోసం పోరాటం అని చెబుతున్నా... బీజేపీ వ్యతిరేకత, మోడీని గద్దె దింపడమనే లక్ష్యం మినహా తగిన సమష్టి సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. వివిధ రాష్ట్రాల్లో తమ బలాబలాలు తెలుసు గనక, పార్టీలు తమలో తాము పోరాడే కన్నా బీజేపీపై బాణం ఎక్కుపెడితే ప్రయోజనం. ఒకటి రెండు సీట్లకై పంపిణీలో కలహించుకొనే కన్నా పెద్ద లక్ష్యం కోసం విశాల హృదయంతో త్యాగాలకు సిద్ధపడితేనే లక్ష్యం చేరువవుతుంది. బెంగాల్లో తృణమూల్, పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ లేకుండా కూటమికి ప్రాసంగికత ఏముంది? వాస్తవాల్ని గుర్తించి కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలి. పెద్దమనిషిగా కాక, అందరికీ పెద్దన్నగా వ్యవహరించాలనుకోవడంతోనే అసలు ఇబ్బంది. అలాగే, ‘యాత్ర’లతో రాహుల్ ఇమేజ్ పెరగ వచ్చేమో కానీ, ప్రతిపక్ష కూటమికి జరిగే ప్రయోజనమేమిటో తక్షణం చెప్పలేం. మణిపుర్ నుంచి ముంబయ్ దాకా 100 లోక్సభా స్థానాల మీదుగా సాగి, మార్చి 20న యాత్ర ముగియనుంది. అన్ని పార్టీలనూ ఒక తాటిపై నడిపి, సమన్వయం సాధించాల్సిన ఎన్నికల వేళ రాహుల్ దూరంగా యాత్రలో ఉంటే ఎలా? కనీసం అన్ని పార్టీలతో కలిసైనా యాత్ర చేయాల్సింది. ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రతిపక్షాల్ని కూడగట్టడంలో 1977లో జేపీ, 1989లో వీపీ సింగ్, ఆ తరువాత యూపీఏ కాలంలో అందరి సమన్వయానికి సోనియా లాంటి వారు కృషి చేశారు. ప్రస్తుతం యాత్రతో రాహుల్, పార్టీ పునరుజ్జీవనంతో ఖర్గే బిజీ. మరి, కూటమి మెడలో ఐక్యత గంట కట్టేదెవరు? మొత్తానికి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రోడ్షోలు, ప్రచారగీతాలతో సింహనాదం చేస్తుంటే, ప్రతిపక్షాలు వేటికవి స్వలాభం చూసుకుంటూ విభేదాల బాట పట్టడం విడ్డూరం. సమావేశాలతో హంగామా రేపుతూ మొదలైన ప్రతిపక్ష కూటమి తీరా ఆట ఆడకుండానే ‘వాక్ ఓవర్’తో మోదీకి విజయం కట్టబెడుతోందని అనిపిస్తోంది. 28 కత్తులు ఒకే ఒరలో ఇమడడం కష్టమే. కానీ, అన్ని పార్టీ లకూ ఒకే లక్ష్యం ఉంటే, అసాధ్యం కాకపోవచ్చు. నిష్క్రియాపరత్వంతో, సొంత లాభం కోసం సాటి పార్టీల కాళ్ళు నరికే పనిలో ఉంటే లాభం లేదు. ఢిల్లీలో పాగా వేయాలంటే, సమయం మించిపోక ముందే కళ్ళు తెరవాలి. కూటమిది ఆరంభ శూరత్వం కాదని నిరూపించాలి. కలహాలు మాని కార్యా చరణకు దిగాలి. లేదంటే తర్వాతేం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. -
Opposition Meet: కాంగ్రెస్ త్యాగం?
ఢిల్లీ: విపక్ష కూటమి ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) శనివారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11.30 సమయంలో వర్చువల్గా 26 పార్టీలు సమావేశం కానున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలు అనే అంశం ప్రధానంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కూటమికి కన్వీనర్ ఎవరనేది కూడా రేపే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. ఈసారి మొత్తం 543 లోక్సభ సీట్లలో కేవలం 255 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. బీజేపీ ఓటమి లక్ష్యంగా.. కూటమిలోని ఇతర పార్టీల కోసం సీట్లను త్యాగం చేసే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అదే జరిగితే స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యల్ప స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. అంతకు ముందు 2004లో కాంగ్రెస్ 417 సీట్లకు పోటీ చేసింది.అయితే.. ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్య ధోరణి ప్రదర్శించే క్రమంలో.. సీట్ల పంపకాల ప్రక్రియను ముందుకు సాగడం లేదు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని సాకుగా చూపించి.. కాంగ్రెస్తో సీట్ల షేరింగ్కు అక్కడి పార్టీలు అయిష్టత చూపుతున్నాయి. బెంగాల్లో దక్షిణ మాల్దా, బహరాంపూర్ స్థానాల్ని వదులుకునేందుకు టీఎంసీ సుముఖంగా కనిపించడం లేదు. అదే విధంగా బీహార్ నుంచి జేడీయూ-ఆర్జేడీ కూటమి కూడా ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆప్ సైతం కాంగ్రెస్కు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తోంది. దీంతో.. రేపటి సమావేశంపై ఆసక్తి నెలకొంది. -
ఇండియా కూటమిలో సీట్ల పంచాయితీ.. కాంగ్రెస్ కీలక నిర్ణయం
ఢిల్లీ: ఇండియా కూటమి మిత్రపక్షాల ఒత్తిడితో కాంగ్రెస్ ఎట్టకేలకు సీట్ల పంపకాలపై మరో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సీట్ల పంపకం, సర్దుబాట్ల కోసం పార్టీ నేతలు మిత్రపక్షాలకు చేరువవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ వివిధ ప్రతిపక్ష పార్టీల అధినేతలకు ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. అంతేకాకుండా అవసరమైతే, ప్రతిపక్ష నేతలను కూడా కలవడానికి కాంగ్రెస్ నేతలు రాష్ట్రాలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక, జనవరి 14న ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ముందే సీట్ల పంపకాల ఒప్పందాలను ఖరారు చేయాలని పార్టీ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్రతోనే కాంగ్రెస్ తన ప్రచారాన్ని కొనసాగించాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల జాబితాను కూడా త్వరగా ఖరారు చేయాలని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ Vs టీఎంసీ ఇదిలా ఉండగా.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. కూటమిలో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. బెంగాల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్, టీఎంసీ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. ఒంటరి పోరుకు ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. మమత దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రాతిపాదించారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ అసలు రూపం బయటపడింది. ఒంటరిగా పోటీ చేసి గతంలో కంటే అధిక స్థానాలు గెలిచే సత్తా మాకు ఉంది. దానికి మేం సిద్ధంగా కూడా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఎద్దేవా చేశారు. అధీర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఇండియా కూటమిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్కు టీఎంసీ మద్దతిస్తోంది. సీట్లపై మమతా బెనర్జీ తుది నిర్ణయం తీసుకుంటారు. మమతా బెనర్జీ రెండు సీట్లు ఆఫర్ చేస్తే తమకు 8 కావాలని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. అసెంబ్లీలో 294 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో మీరు ఒక్క చోట కూడా ఎందుకు గెలవలేకపోయారని విమర్శించారు. -
కూటమిలో అనైక్యతా రాగం
ఎన్నికల సంవత్సరంలోకి వచ్చేశాం. కొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే రామమందిరం సహా రకరకాల వ్యూహాలతో జనంలోకి దూసుకుపోతోంది. మరి, బలమైన అధికార పక్షాన్ని ఢీ కొట్టాల్సిన ప్రతిపక్షాల మాటేంటి? అవి ఇప్పటికీ అయోమయంలో ఉన్నట్టున్నాయి. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పేరుకు ఒకే సమూహంగా ఉన్నా, అనేక అంశాల్లో అవి ఒక్క తాటి మీదకు రాలేకపోతున్న దుఃస్థితి కళ్ళకు కడుతోంది. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, ఎవరెక్కడ పోటీ చేయాలి, సీట్ల సర్దుబాటేంటి తదితర అంశాలు దేవుడెరుగు, కనీసం ఈ కూటమికి ఎవరు కన్వీనర్గా ఉండాలనే అంశంలోనూ ఏకాభిప్రాయం కొరవడింది. ఈ వార్తలు కూటమి బలహీనతలను బట్టబయలు చేస్తున్నాయి. బిహార్లో జేడీయూ నేత నితీశ్ కుమార్ను దింపి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ను సీఎంను చేసేందుకు ఇటీవల జరిగిన విఫల యత్నం ‘ఇండియా’ కూటమి పక్షాలు సొంత కాళ్ళు నరుక్కొనే మూర్ఖత్వమే! ప్రాధాన్యం తగ్గుతోందని భావిస్తున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ను విపక్ష ‘ఇండియా’ కూటమి కన్వీనర్ను చేసి, బుజ్జగించాలన్నది తాజా ప్రతిపాదన. అయితే, అందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సహా కొన్నిపక్షాలు ప్రతికూలం. ఈ అంశంపై కూటమి పక్షాల మధ్య గురువారం జరగా ల్సిన వర్చ్యువల్ సమావేశం సైతం ఆఖరి నిమిషంలో రద్దయింది అందుకే. ఇక, కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య ఢిల్లీ, పంజాబ్లలో సీట్ల సర్దు బాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గంతో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో కూడా సరిగ్గా ఇదే పంచాయతీ కాంగ్రెస్కు నడుస్తోంది. అలాగే, బీజేపీతో రాజకీయ రంగు పులుముకుంటున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్ళాలా, వద్దా అనే అంశంపైనా నిశ్చితాభిప్రాయం మృగ్యం. వెరసి, కూటమి పార్టీల మ«ధ్య పరస్పర విరుద్ధ ప్రయో జనాలు, సమన్వయ లోపాలు ఎన్నికలు సమీపిస్తున్నా జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలాయి. 2024 ఎన్నికల్లో మోదీని గద్దె దించాలనే లక్ష్యంతో ఈ పార్టీలన్నీ ఒక దగ్గరకు చేరాయి. కాంగ్రెస్ చొరవతో విస్తృత చర్చల తర్వాత గత జూలై 18న 26 పార్టీల కూటమిగా ‘ఇండియా’ ఆవిర్భవించింది. 80 మంది ఎంపీలున్న కాంగ్రెస్ ప్రాథమికంగా పెద్దన్న పాత్ర పోషిస్తుంటే, ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో ప్రత్యర్థులైన ఆప్, టీఎంసీ, వామపక్షాలు సైతం కూటమిలో ఉన్నాయి. ఈ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ముందు గత ఫిబ్రవరి, మే నెలల్లో 3 రాష్ట్రాల్లో (త్రిపుర, మేఘాలయ, కర్ణాటక) ఎన్నికలు జరిగాయి. కూటమి ఏర్పడ్డాక నవంబర్లో 5 రాష్ట్రాలు (తెలంగాణ, మిజోరమ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్) ప్రజాతీర్పు కోరాయి. రెండుసార్లూ ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీతో పాటు, తమలో తాము ఢీకొన్న పరిస్థితి. కూటమి ఉన్నా కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్లలో కాంగ్రెస్, తన కూటమి పక్షాలైన ఎస్పీ, జేడీయూలతోనూ పోటీ పడింది. ఫలితంగా మిశ్రమ ఫలితాలే దక్కాయి. దేశంలో తూర్పు నుంచి పడమటి వరకు రాహుల్ గాంధీ చేయనున్న సరికొత్త ‘భారత్ న్యాయ యాత్ర’ ఈ జనవరి ప్రథమార్ధం లోనే ఆరంభం కానుంది. ఎన్నికల ముందు ప్రతిపక్షాల బలప్రదర్శనకు ఈ యాత్రను అనువుగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావన. కూటమి సభ్యుల మధ్య సీట్ల పంపిణీ ఫార్ములాకు తుది రూపం ఇవ్వాలని ఆ పార్టీ అస్తుబిస్తు అవుతోంది. లోక్సభలో ఎన్నికలు జరిగే 543 స్థానాల్లో 290 సీట్లలో స్వయంగా పోటీ చేయాలని కాంగ్రెస్ యోచన. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలనీ, వీలైనచోటల్లా బీజేపీ సారథ్య ఎన్డీఏ అభ్యర్థికీ – తమ అభ్యర్థికీ మధ్య ముఖాముఖి పోరు జరిగేలా చూడాలని ‘ఇండియా’ ప్రయత్నం. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, రాహుల్తో ఎంత స్నేహంగా ఉన్నా సీట్ల సర్దుబాటులో నిక్కచ్చిగానే నిలబడతారు. పశ్చిమ బెంగాల్లో హస్తం పార్టీ క్రితంసారి గెలిచిన 2 స్థానాలు తప్ప, ఇంకేమీ ఇవ్వబోమన్నది టీఎంసీ ప్రతిపాదన. ఆ ‘భిక్ష’ అవసరం లేదనీ, మోదీకి అనుకూలంగా మమత పని చేస్తున్నారనీ అయిదు సార్లు ఎంపీగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధినేత అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్య. స్థానిక అనివార్యతల రీత్యా రానున్న రోజుల్లో ‘ఇండియా’ కూటమిలో ఇలాంటి అపరిణత వ్యాఖ్యలు, పరస్పర దూషణలు మరిన్ని వినిపిస్తాయి. ఐక్యత లేకపోవడం, ఈ అంతర్గత కుమ్ములాటలు కూటమిని బలహీనం చేస్తున్నాయి. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్, టీఎంసీల మధ్య పోరు బీజేపీకే లాభించింది. రేపు లోక్సభ ఎన్ని కల్లోనైనా కూటమి పక్షాల మధ్య సర్దుబాటు, సమన్వయం సవ్యంగా సాగుతుందా అన్నది అనుమానమే. నిజానికి, విజయవంతమైన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ మొదలు మోదీపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, పార్లమెంట్లో మూకుమ్మడి సస్పెన్షన్ల దాకా ప్రతిపక్షాలు గత ఏడాది వార్తల్లో నిలిచాయి. కానీ, కేవలం వార్తల్లో ఉంటే సరిపోదు. బీజేపీపై పోరాటం, మోదీని గద్దె దించడమే ఏకైక అజెండా అయితే అదీ జనానికి రుచించదు. కూటమికి లాభించదు. అందుకని, ఇప్పటికైనా ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు మార్గాలేమిటో ‘ఇండియా’ కూటమి పర్యాలోచించాలి. గమ్యానికి తగ్గట్టు గమనం ఉండాలన్నది విస్మరించి, భాగస్వామ్య పక్షాలు అభిప్రాయ భేదాలను కొనసాగిస్తే కష్టం. పిట్ట పోరు పిట్ట పోరు... పిల్లి తీర్చినట్టు అధికార బీజేపీకే కలిసొస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ తనవైన లెక్కలు వేసుకొనే ఎన్నికల ముంగిట దాన్ని నివారించడం ‘ఇండియా’ కూటమికి పెను సవాలు. కలవని రైలు పట్టాల లాగే స్నేహంతో ప్రతిపక్షాలకు ఒరిగేదేమిటి? -
ప్రశ్నిస్తే అరెస్టులు.. దుర్మార్గమైన చర్య: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: దేశంలో నియంతృత్వ పోకడ పాలన నడుస్తోందని.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంట్ ప్రతిపక్ష పార్టీల ఎంపీల సస్పెన్షన్ పరిణామంతో కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష కూటమి ‘ఇండియా’ దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఇందులో భాగంగా.. శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద కార్యక్రమం నిర్వహించింది. ‘‘దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య. నియంతృత్వ పోకడలతో మోదీ పాలన నడుస్తోంది. దేశంలో ఎక్కడా స్వేచ్ఛ లేదు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అంతా రోడ్డెక్కారు’’ అని అన్నారాయన. ఈ నిరసనలో షబ్బీర్ అలీతో పాటు పలువురు సీనియర్లు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘సమాధానం చెప్పే ధైర్యం లేక ఎంపీ లను సస్పెండ్ చేశారు. ప్రజాస్వామ్య స్పూర్తి కి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ ఎత్తేస్తే.. కాంగ్రెస్ కోర్టుకు పోయి కొట్లాడింది. నియంతృత్వ పోకడలతో వెల్లినందుకే బీఆర్ఎస్ కు బుద్ది చెప్పారు. బీజేపీ కి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్ కే రక్షణ లేదు దేశానికి రక్షణ ఉంటుందా?. పార్లమెంట్ పై దాడి గురించి ప్రశ్నిస్తే..సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి?. ఎంపీ లకు ప్రశ్నించే హక్కు లేదా?. దేశ ప్రజలంతా ఇండియా కూటమి కి మద్దతు గా నిలవాలి’’. మరోవైపు.. మోదీ ప్రభుత్వ విధానాలపై ఇండియా కూటమి నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్ భద్రతా విఘాతంపై హోంశాఖ మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాల పట్టుబట్టాయి. దీంతో 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో కీలకమైన మూడు నేర చట్టాలకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించింది. అయితే.. ప్రతిపక్షం లేకుండా బిల్లుల ఆమోదాన్ని విపక్ష కూటమి తీవ్రంగా ఖండిస్తోంది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ.. సస్పెండ్ అయిన ఇతర ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంట్ భద్రతను గాలికొదిలేశారని రాహుల్ ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగ కల్పన లేదు కాబట్టే సెల్ఫోన్లలో యువత గంటలు గంటలు గడుపుతోందని అభిప్రాయపడ్డారాయన. ఉద్యోగాలు లేక నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోందని అన్నారాయన. ఇదీ చదవండి: సగానికిపైగా అప్పులు తీర్చాం -
పంజాబ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్.. కేజ్రీవాల్ క్రేజీ కామెంట్స్
ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, పంజాబ్లోని ఆప్ సర్కార్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ కావడం పెను దుమారం లేపింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా తాము ఇండియా కూటమితోనే ముందుకు సాగుతామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము ఇండియా కూటమి విషయంలో పూర్తి నిబద్దతతో ఉన్నామన్నారు. ఇండియా కూటమితోనే ముందుకు సాగుతామన్నారు. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. డ్రగ్స్ కేసులో నిన్న పంజాబ్ పోలీసులు ఒక నేతను అరెస్టు చేశారని విన్నాను. దానికి సంబంధించిన వివరాలు నా దగ్గర లేవు. దీనిపై మీరు పంజాబ్ పోలీసులతో మాట్లాడుకోండి. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం మాత్రం నిబద్ధత కలిగినది. ఆప్ ప్రభుత్వం డ్రగ్స్ సమస్యను ముగించే లక్ష్యంతో ఉంది. ఈ పోరాటంలో ఎవరినీ విడిచిపెట్టదు అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. Delhi CM Arvind Kejriwal says, ‘AAP is committed to the INDIA Alliance. AAP will not separate ways from the INDIA Alliance. Yesterday, I heard that the Punjab Police arrested a particular leader (Sukhpal Singh Khaira) in connection with drugs. I don’t have the details; you will… pic.twitter.com/CJ5mWh302b — Gagandeep Singh (@Gagan4344) September 29, 2023 ఇదిలా ఉండగా.. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్, ఆప్ మధ్య ఎక్కడో ఒకచోట విభేదాలు బహిర్గమవుతూనే ఉన్నాయి. అయితే, పంజాబ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు (2015)లో సుఖ్పాల్ సింగ్ ఖైరాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వివరణ ఇచ్చారు. అనంతరం.. సుఖ్పాల్ను ఫజిల్కాలోని జలాలాబాద్ కోర్టులో హాజరుపరచడంతో రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ పరిణామాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా ప్రతిపక్ష కాంగ్రెస్ అభివర్ణించింది. దీంతో, పంజాబ్లో కాంగ్రెస్, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీంతో, బీజేపీ నేతలు ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉజ్జయిని ఘోరం.. బాధితురాలి దత్తతకు ముందుకు వచ్చిన పోలీసాయన -
మంచో చెడో ఏదో రకంగా పబ్లిసిటీ ఇస్తున్నాయిగా వదిలేద్దాం సార్!
మంచో చెడో ఏదో రకంగా పబ్లిసిటీ ఇస్తున్నాయిగా వదిలేద్దాం సార్! -
ఉప ఎన్నికల ఫలితాలు: బీజేపీపై ఇండియా కూటమి పైచేయి
Updates.. ► దేశంలో ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు సీట్లలో విజయం సాధించింది. అటు ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఇండియా కూటమి నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. జార్ఖండ్లో జేఎమ్ఎమ్ అభ్యర్థి బేబి దేవి విజయం సాధించారు. కాంగ్రెస్ కేరళలో ఒక సీటు, బెంగాల్లో టీఎంసీ ఒక సీటు, యూపీలో ఎస్పీ ఒక సీటును సాధించింది. ► ఉత్తరప్రదేశ్లోని ఘోసి స్థానంలో జరిగిన ఉపఎన్నికలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ విజయం సాధించారు. ► జార్ఖండ్లో డుమ్రి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చ అభ్యర్థి బేబి దేవి విజయం సాధించారు. ► పశ్చిమ బెంగాల్, ధూప్గురి ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ విజయం సాధించారు. TMC candidate Nirmal Chandra Roy wins Dhupguri (West Bengal) bye-election. The counting of votes for Ghosi in Uttar Pradesh and Dumri in Jharkhand is underway. pic.twitter.com/iLRg4KSNMm — ANI (@ANI) September 8, 2023 ► ఉత్తరాఖండ్లోని భాగేశ్వర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పార్వతీ దాస్ విజయం సాధించారు. BJP's Parwati Dass wins Bageshwar (Uttarakhand) bye-election. The counting of votes for Ghosi in Uttar Pradesh, Dhupguri in West Bengal, and Dumri in Jharkhand is underway. pic.twitter.com/maXhiYJ5Ix — ANI (@ANI) September 8, 2023 ► కేరళలోని పుతుపల్లి ఉప ఎన్నికల్లో మాజీ సీఎం ఉమెన్ చాందీ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఓమెన్ విజయం సాధించారు. Kerala bypoll: Congress calls it a "Siren of 2024 elections" as Chandy Oommen wins his father's Puthuppally seat Read @ANI Story | https://t.co/ylbp7e3ReY#Kerala #ChandyOommen #PuthupallyBypoll #Congress pic.twitter.com/awWh5lmDLL — ANI Digital (@ani_digital) September 8, 2023 ►బెంగాల్లో బీజేపీ లీడింగ్లో కొనసాగుతోంది. యూపీలో సమాజ్వాదీ పార్టీ, కేరళలో కాంగ్రెస్, జార్ఖండ్లో ఏజేఎస్యూ, ఉత్తరాఖండ్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ► త్రిపురలో రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ రెండు చోట్ల విజయం సాధించింది. ► పలు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. Bypoll Election Trends 2023 Ghosi , uk, west bangal, Tripura, Jharkhand , kerla#GhosiByElection #ghosi #bypolls #Election2023 pic.twitter.com/PfXXBzKOHu — Anurag Saxena (@AnuragSaxena78) September 8, 2023 ► బెంగాల్లోని ధూమ్గిరి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అధికార టీఎంసీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. DHUPGURI ( SC) ASSEMBLY BYPOLL UPDATE:- AFTER ROUND 2 , BJP is leading by 1564 votes. BJP- 18165 TMC- 17147 CPIM+CONG- 2079 #Dhupguribypoll — राजस्थानी चाचा (@Rajasthani200) September 8, 2023 ► ఉత్తరప్రదేశ్లో ఘోసీ ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి లీడింగ్లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి వెనుకంజలో కొనసాగుతున్నారు. Breaking from Uttar Pradesh bypoll: BJP gets a big shock! SP 17286 BJP 10219 Samajwadi leads by 7000+ votes.#GhosiByPoll — ⓂⒶⓃⒾ ⒶⓎⓎⒶⓁ (@iManiAyyal) September 8, 2023 ► కేరళలోని పుతుపల్లి ఉప ఎన్నకల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ఉమెన్ ఛాందీ కుమారుడు చాందీ ఓమెన్ ముందంజలో కొనసాగుతున్నారు. Puthuppally Assembly Bypoll: Kerala ▪️Chandy Oomen(INC): 35767 votes ▪️Jaick C Thomas(CPIM): 18,903 votes ▪️G Lijinlal(BJP): 3667 votes#Puthuppally #PuthuppallyBypoll https://t.co/DJSMrk08yc — राजस्थानी चाचा (@Rajasthani200) September 8, 2023 ► ఆరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. #WATCH | Jalpaiguri, West Bengal: Security tightened as the counting for the Dhupguri Assembly by-polls to begin shortly. (Visuals from Netaji Subhas Open University) pic.twitter.com/g9GPdtxPOK — ANI (@ANI) September 8, 2023 ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ప్రతిపక్ష కూటమి(ఇండియా) ఏర్పాటైన విషయం తెలిసిందే. కాగా, ఇండియా కూటమి టెస్టింగ్ టైమ్ ఆసన్నమైంది. పలు రాష్ట్రాల్లో ఈనెల 5న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల బలాన్ని పరీక్షించనున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. The counting of votes for the seven assembly seats across six states including Bageshwar in Uttarakhand, Ghosi in Uttar Pradesh, Puthuppally in Kerala, Dhupguri in West Bengal, Dumri in Jharkhand, and Boxanagar and Dhanpur in Tripura, begins. — ANI (@ANI) September 8, 2023 ► ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్లోని ధూప్గురి, జార్ఖండ్లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్పూర్లో ఏడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ► కాగా, ఘోసీ, డుమ్రీలలో, ప్రత్యర్థి పార్టీలు కొత్తగా ఏర్పడిన కూటమి ఇండియాలో భాగంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. ► ఏడు స్థానాల్లో మూడు (ధన్పూర్, బాగేశ్వర్ మరియు ధూప్గురి) బీజేపీకి, ఎస్పీ (ఘోసి), సీపీఐ (ఎం) (బోక్సానగర్), జేఎంఎం (డుమ్రీ), కాంగ్రెస్ (పుతుపల్లి) చేతిలో ఒక్కొక్కటి ఉన్నాయి. బీజేపీలో తిరిగి చేరిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే, ఓబీసీ నేత దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్లోని ఘోసీ స్థానం ఖాళీ అయింది. #WATCH | Jharkhand: Counting for the Dumri Assembly by-polls underway. pic.twitter.com/n6zZuaS4jg — ANI (@ANI) September 8, 2023 ► ఉత్తరాఖండ్లో ఈ ఏడాది ఏప్రిల్లో ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ మరణంతో బాగేశ్వర్ స్థానం ఖాళీ అయింది. 2007 నుంచి ఇప్పటి వరకు ఆయన నాలుగుసార్లు ఈ సీటును గెలుచుకున్నారు. ► జార్ఖండ్లో, డుమ్రీ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని గిరిదిహ్ జిల్లాలోని పచంభ, కృషి బజార్ సమితిలో ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మొత్తం 24 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుందని, 70 మంది అధికారులను ఈ కసరత్తు కోసం నియమించామని గిరిడిహ్ డిప్యూటీ కమిషనర్ కమ్ ఎలక్షన్ ఆఫీసర్ నమన్ ప్రీష్ లక్రా తెలిపారు. ► త్రిపురలో కౌంటింగ్ను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ అవసరమైన చర్యలు చేపట్టిందని సీనియర్ పోల్ అధికారి ఒకరు తెలిపారు. సోనామురా బాలికల హెచ్ఎస్ స్కూల్లో బోక్సానగర్, ధన్పూర్ రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని సెపాహిజాలా జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ కుమార్ తెలిపారు. ► అక్కడి నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి మిజాన్ హుస్సేన్పై బీజేపీ తఫజ్జల్ హుస్సేన్ను రంగంలోకి దించింది. ఓటింగ్ సందర్భంగా రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ(ఎం) కౌంటింగ్ను బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ► పశ్చిమ బెంగాల్లోని ధుప్గురిలో, జల్పైగురిలోని నార్త్ బెంగాల్ యూనివర్శిటీ రెండవ క్యాంపస్లోని స్ట్రాంగ్ రూమ్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులు కాపలాగా ఉన్నారని ఒక అధికారి తెలిపారు. 2.6 లక్షల మంది అర్హులైన ఓటర్లలో 76 శాతం మంది ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Jalpaiguri, West Bengal: Security tightened as the counting for the Dhupguri Assembly by-polls to begin shortly. (Visuals from Netaji Subhas Open University) pic.twitter.com/g9GPdtxPOK — ANI (@ANI) September 8, 2023 ► కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి అభ్యర్థిగా సీపీఐ(ఎం) ఈశ్వర్ చంద్రరాయ్ పోటీ చేస్తుండగా, అధికార టీఎంసీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నిర్మల్ చంద్ర రాయ్ను రంగంలోకి దింపింది. కొన్నేళ్ల క్రితం కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ భార్య తపసీ రాయ్ను బీజేపీ నామినేట్ చేసింది. ► కేరళ పుతుపల్లిలో కాంగ్రెస్ అగ్రనేత ఊమెన్ చాందీ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య తీవ్ర పోటీ చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు బసేలియస్ కళాశాలలోని ప్రత్యేక కౌంటింగ్ స్టేషన్లో ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్, సర్వీస్ బ్యాలెట్లను లెక్కించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. -
మణిపూర్ శాంతికి నాదీ హామీ: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఐదేళ్లు గడువిచ్చినా.. ప్రతిపక్షాలు అవిశ్వాసానికి సిద్ధం కాలేకపోయాయని, నో కాన్ఫిడెన్స్.. నో బాల్గానే మిగిలిపోయింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మణిపూర్ అంశంపై విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా గురువారం సాయంత్రం లోక్సభలో ప్రసంగించారాయన. ఈ మోషన్ మీద మీ చర్చ ఎలా జరిగింది?.. చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతీ మాట దేశం మొత్తం వింది. సోషల్ మీడియాలో దీనిపై ఏమని చర్చించారో తెలుసా?.. ‘విపక్షాలు ఫీల్డింగ్ చేస్తుంటే.. ఫోర్లు, సిక్సర్లు మా నుంచి పడ్డాయి’ అని మోదీ ఛలోక్తులు సంధించారు. మా గెలుపును నిర్ణయించేశారు దేవుడే ఎంతో దయ గలవాడు. ఏదో ఒక విధంగా మాట్లాడాలని చూస్తాడు. దేవుడి దయతోనే విపక్షాలు అవిశ్వాసం పెట్టాయని నమ్ముతున్నా. 2018లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా నేను చెప్పాను, ఇది మాకు బలపరీక్ష కాదు, వారికి బలపరీక్ష అని. ఫలితంగా వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల అవిశ్వాసం మాకు ఎప్పుడూ అదృష్టమే. ఈ రోజు మీరు మీరు (ప్రతిపక్షం) చేసిన పని మా గెలుపును నిర్ణయించేసింది. 2024 ఎన్నికల్లో ఎన్డీయే, బీజేపీ గొప్ప విజయం సాధిస్తాయని, మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయని.. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తాయని ఒక అభిప్రాయానికి వచ్చేశా. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోంది అవిశ్వాసం, అహంకారం విపక్షాల నరనరాల్లో నిండిపోయింది. భారత్ను అప్రతిష్టపాలు జేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. మేం దేశ ప్రతిష్టతను ఖండాంతరాలకు వ్యాపింపజేశాం. స్కామ్లు లేని భారత్ను అందించాం. ఫలితంగానే.. భారత్పై ప్రపంచ దేశాల్లో ఒక నమ్మకం ఏర్పడింది. దేశం ఎంత బలపడిందో చెప్పేందుకు విదేశీ పెట్టుబడులే నిదర్శనం. మన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించింది. భారత్ నలుమూలలా విస్తారంగా అవకాశాలు దక్కుతున్నాయి. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోంది. భారత్లో ప్రణాళిక, కృషి కొనసాగింపు కొనసాగుతుంది. అవసరాన్ని బట్టి దానికి కొత్త సంస్కరణలు ఉంటాయి. పనితీరు కోసం అన్ని ప్రయత్నాలు చేయబడతాయి. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. మీరు 2028లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినప్పుడు, ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలో దేశం ఒకటిగా ఉంటుందని దేశం విశ్వసిస్తోంది అంటూ ప్రధాని మోదీ విపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కోల్కతా నుంచి ఫోన్ వచ్చిందా? ఈ అవిశ్వాసంతో మునుపెన్నడూ చూడనివి, కొత్తవి, ఊహించలేనివి చూస్తున్నాం. ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ మాట్లాడకపోవడం విడ్డూరం. ఆయన్ని కాంగ్రెస్ ఎందుకు మాట్లానివ్వలేదు. బహుశా కోల్కతా నుంచి ఫోన్ వచ్చిందేమో. కాంగ్రెస్ ఆయన్ని పదే పదే అవమానిస్తూ వస్తోంది. అందుకే ఆయన్ని పక్కనపెడుతోంది. #WATCH | PM Modi says, "A few things in this No Confidence Motion are so strange that they were never heard or seen before, not even imagined...The name of the Leader of the largest Opposition party was not among the speakers...This time, what has become of Adhir ji (Adhir Ranjan… pic.twitter.com/NXdGzauxjT — ANI (@ANI) August 10, 2023 అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. తమ విధానాలతో దేశం కంటే పార్టీనే ముఖ్యమని కొన్ని విపక్ష పార్టీలు చాటి చెబుతున్నాయి. బహుశా మీకు దేశంలోని పేదల ఆకలితో పట్టింపులేదేమో. ఎందుకంటే వాళ్లకు అధికార దాహమే ఆలోచనగా ఉండిపోయింది కాబట్టి. ఎల్ఐసీపై దుష్ప్రచారం చేశారు అనరాని మాటలు అనడంతో విపక్షాల మనస్సులు శాంతించి ఉంటాయి. భారత్లో జరిగిన మంచిని విపక్షాలు సహించలేకపోతున్నాయి. HAL దివాళా తీస్తుందని ప్రచారం చేశారు. కానీ, హెచ్ఏఎల్ సరికొత్త రికార్డులు సృష్టించింది. అత్యధిక ఆదాయం అర్జించింది. ఎల్ఐసీ ప్రైవేటీకరణ చేస్తే నాశనం అవుతుందని, దివాళ తీస్తుందని ప్రచారం చేశారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారు. కానీ, ఎల్ఐసీ పటిష్ట స్థితిలో ఉంది. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుంది అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Hindustan Aeronautics Limited (HAL) recorded its highest-ever revenue. Despite their (opposition's) allegations, HAL has emerged as the pride of the country. They said many things about LIC that the money of the poor will sink but today LIC is getting stronger. 'Share… pic.twitter.com/dH2eOoGuk9 — ANI (@ANI) August 10, 2023 కాంగ్రెస్పై ప్రజలకు నో కాన్ఫిడెన్స్ కాంగ్రెస్కు ఎలాంటి విజన్ లేదు. నిజాయితీ లేదు. కాంగ్రెస్కు అంతర్జాతీయ ఆర్థిక విధానం లేదు. కాంగ్రెస్ హయాంలో దేశం పేదరికంలో మగ్గిపోయింది. కశ్మీర్పై, కశ్మీర్ ప్రజలపై కాంగ్రెస్కు ప్రేమ లేదు. తమిళనాడులో 1962లో, త్రిపురలో 1988లో, నాగాలాండ్లో 1988లో చివరిసారిగా నెగ్గారు. తమిళనాడు భారత్లో భాగం కాదన్నట్లు మాట్లాడుతున్నారు. ఢిల్లీ, ఏపీలోనూ ప్రజలు కాంగ్రెస్ను దూరం పెట్టారు. యూపీ, బీహార్, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారు. అధికారం కాంగ్రెస్కు అహంకారంతో కళ్లు మూసుకుపోయాయి. అందుకే అన్ని రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రజలు కాంగ్రెస్పై నో కాన్ఫిడెన్స్ ప్రకటించారు. విపక్షాలకు పాకిస్తాన్ అంటే ప్రేమ కనిపిస్తోంది. పాక్ చెప్పిందే విపక్షాలు నమ్ముతున్నాయి. పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ చేశామంటే సైన్యాన్ని సైతం కాంగ్రెస్ నమ్మలేదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఎగతాళి చేశారు. భారత్లో తయారైన వ్యాక్సిన్పై విపక్షాలకు నమ్మకం లేకుండా పోయింది. #WATCH | PM Modi says, "People of the country have no confidence in Congress. Due to arrogance, they are not able to see the reality. In Tamil Nadu, they won in 1962 and since 1962 the people of Tamil Nadu are saying 'No Congress'. In West Bengal they won in 1972, people of West… pic.twitter.com/8xHvTcIIKm — ANI (@ANI) August 10, 2023 ఇండియా కూటమిపై సెటైర్లు విపక్షాలు కొన్నిరోజుల కిందట బెంగళూరులో యూపీఏకి అంత్యక్రియలు జరిపాయి. ఇన్ని తరాలు గడిచినా.. పచ్చి మిర్చి, ఎండు మిర్చికి తేడా తెలియని రీతిలో ఉంది మీ తీరు. విపక్షాలు చివరకు ఇండియాను.. I.N.D.I.Aగా ముక్కలు చేశారు. తమను తాము బతికించుకోవడానికి ఎన్డీయే మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి వారిది. NDAలో రెండు ఐ(I లెటర్లు)లు చేర్చారు. మొదటి I.. 26 ;పార్టీల అహకారం. రెండో I.. ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనం. అలవాటు లేని ‘నేను’(I) అనే అహంకారం వారిని వదలడం లేదు. ఈ క్రమంలో ఎన్డీయేను కూడా దోచుకున్నారు. #WATCH | PM Narendra Modi says, "I want to express my sympathy with the opposition because a few days ago you performed the last rites of UPA in Bengaluru. On one hand, you were performing last rites par aap jashan bhi mana rahe the aur jashan bhi kis cheez ka- khandhar par naya… pic.twitter.com/cJXh220UNk — ANI (@ANI) August 10, 2023 ప్రతీ పథకం పేరు కాంగ్రెస్ ఒక కుటుంబం పేరును చేర్చింది. అక్కడ స్కీమ్లు లేవు. అన్నీ స్కామ్లే. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు గాంధీ పేరును వాడుకున్నారు. తమ పేర్ల మీద పథకాలు నడిపించారు. కాంగ్రెస్కు కుటుంబ పాలన, దర్బార్ పాలన అంటేనే ఇష్టం. వారి కుటుంబం నుంచి కాకుండా వేరే కుటుంబం నుంచి ప్రధాని అయితే సహించలేరు. మేం కుటుంబ పాలనకు వ్యతిరేకం. విపక్షాలది ఇండియా కూటమి కాదు.. అహంకారుల కూటమి. ఫెయిల్డ్ ప్రాజెక్టును కాంగ్రెస్ పదేపదే లాంచ్ చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ఇండియా కూటమిలో ప్రతీ ఒక్కరిదీ ప్రధాని కావాలనే కోరిక. ప్రజలే దేవుళ్లు.. తీర్పు ఇచ్చారు లంక దహనం జరిగింది హనుమాన్ వల్ల కాదు. రావణుడి అహంకారం వల్లే!. ప్రజలు కూడా రాముడి లాంటివాళ్లు. అందుకే 400 నుంచి మిమ్మల్ని 40కి పడేశారు. ప్రజలు రెండుసార్లు పూర్తి మద్దతు మాకు ఇచ్చారు. కానీ, మీకు ఓ పేద వ్యక్తి ఎలా ఇక్కడికి ఎలా వచ్చాడనే ఆలోచన మీకు నిద్రపట్టనివ్వడం లేదు. ప్రజలు 2024లోనూ మిమ్మల్ని నిద్రపోనివ్వరు. ఒకప్పుడు విమానాల్లో కేక్ కట్టింగులు జరిగాయి. కానీ, ఇప్పుడు అవే విమానాల్లో పేద ప్రజల కోసం వ్యాక్సిన్లు పంపుతున్నాం. #WATCH | PM Narendra Modi says, "It is true that Lanka was not set ablaze by Hanuman, it was set ablaze by his (Ravan) arrogance. People are also like Lord Ram and that is why you have been reduced to 40 from 400. People elected full majority government twice but it is troubling… pic.twitter.com/aMaxHkyfbH — ANI (@ANI) August 10, 2023 వారికి కలలో కూడా మోదీ కనిపిస్తాడు. 24 గంటలు మోదీ నామస్మరణ చేస్తారు. విపక్షాలు కొత్త కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. కాంగ్రెస్ది అబద్ధాల దుకాణం. త్వరలో ఆ దుకాణానికి కూడా తాళాలు వేయాల్సి వస్తుంది. దేశంలోని వ్యవస్థలన్నీ చచ్చిపోయానని వీళ్లు అంటున్నారు. కానీ, అవేంతో అదృష్టం చేసుకుని ఉన్నాయి. దేశానికి, ప్రజాస్వామ్యానికి వాళ్లు శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, మన దేశం, ప్రజాస్వామ్యం మరింత బలపడతాయి. అలాగే.. మేం కూడా మరింత బలోపేతం అవుతాం. విపక్షాలపై ప్రధాని విసుర్లు కొనసాగుతుండగానే.. ఇండియా కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. #WATCH | Opposition MPs walk out of the Lok Sabha as Prime Minister Narendra Modi speaks on #NoConfidenceMotion pic.twitter.com/2kYKRBiP1Z — ANI (@ANI) August 10, 2023 మణిపూర్పై.. మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలకు అర్థవంతమైన చర్చ జరిపే ఉద్దేశం లేదు. మేం చర్చలకు ఆహ్వానించినా.. వాళ్లు రావడం లేదు. ఎందుకంటే మణిపూర్పై చర్చ విపక్షాలకు అవసరం లేదు. మణిపూర్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందటారు. వాళ్ల మనసులో ఏదుంటే అదే కనిపిస్తుంది.. అదే బయటపడుతోంది. కొందరు భారతమాత చావు ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. భారతమాతను ముక్కలు చేసింది వీళ్లే. వందేమాతరం కూడా ముక్కలు ముక్కలు చేసింది కూడా వీళ్లే. కాపాడాల్సిన వాళ్లే భారతమాత భుజాలు నరికేశారు. తుక్డే గ్యాంగ్ను ప్రొత్సహిస్తున్నారు. 1966లో మిజోరాం ఘటనలకు కారణం ఎవరు? మిజోరాంలో సామాన్యులపైనా దాడులు చేయించారు. ఎయిర్ఫోర్స్ను ఉపయోగించారు. నెహ్రూపై లోహియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈశాన్య భారతంను చీకట్లో ఉంచేశారని లోహియా అన్నారు. మిజోరాం వాస్తవాన్ని కాంగ్రెస్ దేశ ప్రజల ముందు ఉంచింది. ఈశాన్య రాష్ట్రంలో 50సార్లు పర్యటించాను. మా ప్రభుత్వ హయాంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అలాంటిది ఈశాన్య రాష్ట్రాల గురించి వీళ్లా మనకు చెప్పేది. మణిపూర్లో సాయంత్రం నాలుగు తర్వాత గుడిలు, మసీదులు మూసేవారు. ఈ పాపం కాంగ్రెస్ది కాదా? అని నిలదీశారాయన. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్లో అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని మండిపడ్డారాయన. #WATCH | PM Narendra Modi speaks on Manipur; says, "Both the state and central governments are doing everything possible to ensure that the accused get the strictest punishment. I want to assure the people that peace will be restored in Manipur in the coming time. I want to tell… pic.twitter.com/cgI7RqSWs4 — ANI (@ANI) August 10, 2023 హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్లో పరిస్థితులు మారాయి. హైకోర్టు తీర్పులో రెండు కోణాలు ఉన్నాయి. మణిపూర్లో జరిగింది దిగ్భ్రాంతికరం. రాబోయే కాలంలో మణిపూర్లో శాంతి నెలకొంటుందని నేను అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నాను. నిందితులకు కఠిన శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయి. దేశం మీ వెంట ఉందని అక్కడి ఆడపడుచులు, బిడ్డలకు నేను చెప్పాలనుకుంటున్నా. ‘యావత్ దేశం మీ వెంట(మణిపూర్ ప్రజలను ఉద్దేశించి..) ఉందమ్మా’. మణిపూర్ త్వరలో ప్రగతి పథంలో పయనిస్తుంది. మణిపూర్ అభివృద్ధికి అన్నివిధాలుగా అండగా ఉంటాం. #WATCH | Prime Minister Narendra Modi says, "...In 2018, I gave them (Opposition) a work - bring No Confidence Motion in 2023 - and they followed my words. But I am sad. In 5 years, they should have done better. But there was no preparation, no innovation, no creativity...I will… pic.twitter.com/5gNGZ2OlP7 — ANI (@ANI) August 10, 2023 ప్రపంచానికి ఈశాన్య రాష్ట్రాన్ని దిక్సూచిని చేస్తాం. మన నుంచి ప్రజలు మంచి ఆశిస్తారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి. 2047 నాటికి భారత్ అభివృద్ధిచెందిన దేశంగా ఉంటుంది. మరోసారి అవిశ్వాసం పెట్టేముందు సరిగ్గా ప్రిపేర్ అవ్వండి అంటూ విపక్షాలకు చురకలంటించారాయన. -
‘మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి’
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ విపక్ష కూటమి ఇండియాపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. గురువారం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా.. బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాల తీరును తప్పుబట్టారాయన. ఢిల్లీ ఆర్డినెన్స్(సవరణ) బిల్లు-2023 రాజ్యాంగ బద్ధమే. కేంద్రానికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు ఆర్డినెన్స్ ప్రకారమే ఈ బిల్లు తీసుకొచ్చాం. కానీ, విపక్షాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆప్ దీనిని వ్యతిరేకిస్తోంది. దానికి కూటమి పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ప్రజలకు మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి. ఓట్లు, అధికారం కోసం కాదు. కూటమి కోసం కాదు.. ఢిల్లీ కోసం ఆలోచించండి. దేశం మంచి కోసం చేస్తున్న చట్టాల్ని వ్యతిరేకించొద్దు అంటూ విపక్షాలకు చురకలటించారాయన. 2015లో సేవ చేయాలనే ధ్యాస లేని ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే.. విజిలెన్స్ డిపార్ట్మెంట్ నియంత్రణ కోసం వాళ్లు పడుతున్న పాట్లు ఇవి. ఎందుకంటే బంగ్లాల కట్టడం లాంటి అవినీతిని కప్పిపుచ్చుకోవాలి కాబట్టి.. అని ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారాయన. #WATCH | In the year 2015, a party came to power in Delhi whose only motive was to fight, not serve...The problem is not getting the right to do transfer postings, but getting control of the vigilance department to hide their corruption like building their bungalows: Union Home… pic.twitter.com/pelULwGMgH — ANI (@ANI) August 3, 2023 నెహ్రూను నేనేం పొగడలే! పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. గురువారం లోక్సభ సెషన్లో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. భారత సమాజ వ్యవస్థాపకులైన జవహార్లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభ్భాయ్ పటేల్, సీ రాజగోపాలచారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్లు.. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను వ్యతిరేకించినవాళ్లే అని అన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ‘‘ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నేను చూస్తోంది నిజమేనా?. ఇది పగలా లేక రాత్రా?.. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన(అమిత్ షా) నోట్లో లడ్డూ పెట్టాలని ఉంది. ఎందుకంటే అమిత్ షా నెహ్రూను, కాంగ్రెస్ను పొగిడారు. ఇది నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే షా జోక్యం చేసుకని.. తానేం నెహ్రూని పొగడలేదని స్పష్టత ఇచ్చారు. ‘‘పండిట్ నెహ్రూను నేను పొగడలేదు. ఆయన ఏం చెప్పారో.. అదే ప్రస్తావించా. దానిని వాళ్లు పొగడ్తగా భావిస్తే.. నాకేం అభ్యంతరం లేదు’’ అని బదులు ఇచ్చారు. దీంతో రంజన్ మరోసారి జోక్యం చేసుకుని షా వ్యాఖ్యలకు కొనసాగింపుగా మాట్లాడారు. -
పార్లమెంట్ అంతరాయాలు.. మధ్యే మార్గం ద్వారా పరిష్కారం?
ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగటం లేదు. ఈ తరుణంలో అంతరాయాలు లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ‘ఇండియా’ ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కారంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. అంతరాయాన్ని ఛేదించడానికి, రాజ్యసభలో మణిపూర్పై చర్చ జరగడానికి ఇండియా కూటమి పార్టీలు ఆ సభా నాయకుడికి మధ్యే మార్గం పరిష్కారాన్ని అందించాయి. మోదీ ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారాయన. దీంతో ఆ ప్రతిపాదన ఏమై ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. INDIA parties have offered a middle path solution to the Leader of the House to break the logjam and get a discussion on Manipur going in an uninterrupted manner in the Rajya Sabha. Hope the Modi government agrees. — Jairam Ramesh (@Jairam_Ramesh) August 3, 2023 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా.. సభలు పట్టుమని పూట సరిగ్గా నడిచిన దాఖలాలు లేవు. మణిపూర్ అంశంపై రూల్ నెంబర్ 267 ద్వారా సుదీర్ఘ చర్చకు పట్టుబడుతూ.. ప్రధాని మోదీ మణిపూర్ శాంతిభద్రతలపై ప్రసంగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. కేంద్రం మాత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ప్రసంగిస్తారని, అదీ రూల్ నెంబర్ 176 ప్రకారం స్వల్ప కాలిక చర్చకే సిద్ధమని కరాకండిగా చెబుతోంది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసనల హోరు కొనసాగుతుంది. అధికార పార్టీ తరపు నుంచి ఫ్లోర్ లీడర్లు.. విపక్ష నేతలతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ఒక అడుగు వెనక్కి వేసి మధ్యే మార్గ పరిష్కారంతో ముందుకు రావడం గమనార్హం. -
ఇండియా కూటమికి రాష్ట్రపతి ముర్ము అపాయింట్మెంట్
ఢిల్లీ: మణిపూర్ అంశంపై తనతో చర్చించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ ఇచ్చారు. బుధవారం ఉదయం విపక్ష ఎంపీలతో భేటీ కానున్నారు. మణిపూర్ అంశంపై జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే అక్కడ పర్యటించాలని వాళ్లు ఆమెను కోరే అవకాశాలూ లేకపోలేదు. మణిపూర్ వ్యవహారంపై తమ ఆందోళనను పట్టించుకోవాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఉదయం 11.30 సమయంలో తనను కలవాలని ఆమె వాళ్లకు సూచించారు. ఇండియా కూటమిలో 21 పార్టీల ఎంపీలు రెండురోజులపాటు మణిపూర్లో పర్యటించారు. అల్లర్లు-హింసకు నెలవైన కొండాలోయ ప్రాంతాల్లో తిరిగి.. అక్కడి బాధితులను కలిశారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణ టైంలో మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికీని కలిసి శాంతి భద్రతలను తిరిగి నెలకొనేలా చూడాలంటూ మెమొరాండం సమర్పించారు కూడా. ఈ క్రమంలో ఇండియా కూటమి ఎంపీల మణిపూర్ పర్యటనపైనా బీజేపీ మండిపడింది. ఇటు పార్లమెంట్ కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తూ.. డ్రామాలు ఆడుతోందంటూ ఇండియా కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో పార్లమెంట్లో మణిపూర్ హింసపై సుదీర్ఘ చర్చ జరగాలని.. ప్రధాని ప్రసంగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సభను సజావుగా జరగనివ్వకుండా నినాదాలతో హెరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ అంశంపైనా అవిశ్వాసం ప్రకటించగా.. 8,9 తేదీల్లో చర్చ జరగాల్సి ఉంది. -
ఈసారయినా ప్రధాని అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వండి!
ఈసారయినా ప్రధాని అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వాలని ఒకటే ఫోన్లు సార్!