Indian student
-
పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదు
అప్పుడెప్పుడో పదిహేనేళ్ల క్రితం ఆర్థిక మాంద్యం.. సాఫ్ట్వేర్ రంగం నేల చూపులు చూస్తున్న తరుణంలో భాస్కర భట్ల రాసిన వాక్యాలు మళ్ళీ ఇప్పుడు నిజమవుతున్నాయి. కొడుకు చదువు అయిపొయింది.. ఇక ఉద్యోగం రావడమే తరువాయి.. పెళ్లి చేసేద్దాం అనుకుంటున్న రవణమ్మకు కొడుకు ఆనాటి సామాజిక .. ఆర్ధిక పరిస్థితులు వివరిస్తూ ఒక సాంగ్ వేసుకుంటాడు.. అప్పటి పరిస్థితులకు సరిగ్గా కళ్ళకు కట్టినట్లుండే ఆ పాట అప్పట్లో మార్మోగిపోయింది. రికార్డింగ్ డాన్సులు.. ఆర్కెస్ట్రాలు.. యూత్ ఫెస్టివల్స్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంతకూ భాస్కర భట్ల ఏమన్నాడంటేరియల్ ఎస్టేట్ ఏమో కుప్ప కూలిపోయిందిసాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడి పోయిందిఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనువ్వు అర్థం చేసుకునిఈ మంగళం మాని వేయ వలయునోఅవునట్టు మర్సిపోయానుఅమెరికా నుంచి మనోళ్లందరూతట్ట బుట్ట సర్దుకునివచ్చేస్తున్నారే తల్లీఎందుకేె రవణమ్మాపెళ్లేందుకే రవణమ్మాఎందుకె రవణమ్మాపెళ్లేందుకే రవణమ్మాతానూ దూర సందు లేదు యోతానూ దూర సందు లేదు యోతానూ దూర సందు లేదుమెడకేమో డోలా రవణమ్మాచిక్కెను ముక్క లేదుచిల్డ్ బీరు చుక్క లేదుగర్ల్ ఫ్రెండు లేదుకాల్చనీకి కింగ్ లేదుఈడ్చి కొడితే దమ్మిడీ లేదుఅప్పు కూడా పుడతా లేదుసినిమా లేదు సరదా లేదుఅతి గతి లేనే లేదుసాలరీలోస్తా లేదుసెల్ బిల్లు కడత లేదుబుర్ర పనిచేస్తా లేదువీకెండు సెలవు లేదుమింగా మెతుకు లేదు యోమింగా మెతుకు లేదు యోమింగా మెతుకు లేదుసంపెంగే నూనె రవణమ్మాసతాయించాకే రవణమ్మాఇలా సాగుతుంది ఆ పాట .. సరిగ్గా ప్రస్తుతం అమెరికాలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయ్. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక పరిస్థితులు అమాంతం మారిపోయాయి అని చెప్పడం కాదుగానీ.. ముందునుంచే అమెరికన్ సాఫ్ట్ వేర్ పరిశ్రమతోబాటు జాబ్ మార్కెట్ బాగా నేలచూపులు చూస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులు లేకున్నా మొత్తానికి అమెరికాలో చదువు అవగానే ఉద్యోగం వస్తుంది అనే భ్రమలు ఐతే తొలిగాయి.వాస్తవానికి ఏటా లక్షల్లో భారతీయ విద్యార్థులు.. అమెరికాలో ఎమ్మెస్.. ఎంబీఏ.. ఫార్మా వంటి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్తారు.. అప్పులు చేసి మరీ అక్కడకు వెళ్లి.. లక్షల్లో ఫీజులు కట్టి ముగ్గురు నలుగురు చిన్న చిన్న రూముల్లో ఇరుక్కుని.. వంట చేసుకుంటూ ఎడ్జస్ట్ అయి చదువుకుంటారు. కొందరు పార్ట్ టైం పేరిట పెట్రోల్ పంపులు.. షాపింగ్ మాల్స్ .. హోటళ్లలో పని చేసి ఖర్చులమందం డబ్బులు తెచ్చుకుని చదువు పూర్తి చేసేవారు. చేతికి మాస్టర్స్ డిగ్రీ రాగానే ఏదో ఉద్యోగం కుదురుకుంటుందన్న నమ్మకం కూడా ఉండేది.అయితే ఇప్పుడు రూల్స్ మారాయి.. దేశంలో రూలింగ్ కూడా మారిపోయింది. అమెరికాలో జన్మించినంతమాత్రాన గ్రీన్ కార్డు ఇవ్వాలన్న రూల్ లేదు అని ట్రంప్ ఒక టెంకి జెల్ల కొట్టారు. క్యాంపస్ దాటి బయటకు వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడమూ ఇప్పుడు చట్ట విరుద్ధమే. దీంతో అక్కడి విద్యార్థులు చేతి ఖర్చులకు డబ్బుకోసం ఇంటివైపు చూస్తున్నారు. అటు సాఫ్ట్ వేర్ రంగం కూడా గొప్పగాలేదు. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న సీనియర్ల పరిస్థితి కూడా భయంభయంగా ఉంటోంది. దీంతో కొత్తగా డిగ్రీ చదవగానే ఉద్యోగం అనే నమ్మకాలూ పోతున్నాయి. దీంతో దాదాపు యాభై లక్షలు పెట్టి అక్కడ ఎమ్మెస్ చదవడం సాహసమేనని నిపుణులు అంటున్నారు. పైగా దేశంలోకి అక్రమంగా వచ్చేసి ఏదోలా ఉద్యోగం చేసేద్దాం అనుకునేవాళ్ళందరినీ తరిమేస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇంకోపెద్ద ప్రకంపన పుట్టిస్తోంది. ఇంకా H1-B వీసాల మీదా పరిమితి విధించారు. ఈ నేపథ్యంలో తమకు తెలిసినవాళ్లున్నారని అప్పులు చేసి అమెరికా రావద్దని.. అక్కడున్న తమ పరిస్థితే అంత గొప్పగాలేదని అక్కడివారు చెబుతున్నారు. పరిస్థితులు అంత సానుకూలంగా లేవు : పద్మనాభం సప్తగిరిఅక్కడి ప్రస్తుత పరిస్థితిపై జేపీ మోర్గాన్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పద్మనాభం సప్తగిరి మాట్లాడుతూ ఐటీ రంగం ఇప్పుడు ఒడుదుడుకులు ఎదుర్కొంటోందని.. అసాధారణ ప్రతిభ..నైపుణ్యాలు ఉంటే తప్ప ఉద్యోగం రావడం కష్టం అని అన్నారు. పరిస్థితులు గతంలో లా లేవని..మంచి స్కాలర్ షిప్తో మంచి యూనివర్సిటీలో సీట్ వస్తేనే అమెరికా రావాలని..ఇక్కడ ఏదోలా గెటాన్ అయిపోదాం అనుకుంటే కుదరదని అన్నారు. ఉద్యోగావకాశాలు కూడా మునుపు ఉన్నంత గొప్పగా లేవని..సీనియర్స్..ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకు కొంత ఫరవాలేకున్నా ఫ్రెషర్స్కు ఓపెనింగ్స్ అంత సానుకూలంగా లేదని అన్నారు.పద్మనాభం సప్తగిరి, జేపీ మోర్గాన్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ -
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్)/చౌటుప్పల్ రూరల్: ఉన్నత చదువులు, ఉన్నతమైన జీవితం కోసం అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ దుండగుల కాల్పులకు బలయ్యా డు. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసిన రవితేజ.. మాస్టర్స్ చదివేందుకు 2022లో అమెరికాకు వెళ్లాడు. వాషింగ్టన్లో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొడుకు మృతిచెందాడన్న వార్త తల్లిదండ్రులను కలచివేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెంకు చెందిన కొయ్యడ చంద్రమౌళి–సువర్ణ దంపతులు కొంతకాలం నుంచి ఆర్కే పురం డివిజన్ గ్రీన్హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రమౌళి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు రవితేజ (26), ఒక కుమార్తె ఉన్నారు. రవితేజ ప్రస్తుతం కనెక్టికట్లో ఓ రెస్టారెంట్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం కారు అద్దెకు తీసుకొని కేక్ డెలివరీ చేయడానికి వెళ్లారు. అయితే, దుండగులు అప్పటికే చోరీకి పాల్పడి.. పారిపోయే క్రమంలో రవితేజ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. రవితేజ ఎంతసేపటికీ తిరిగి రెస్టారెంట్కు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టిన లొకేషన్కు వెళ్లి చూడగా రవితేజ మృతదేహం కనిపించింది. ఈ సమాచారాన్ని సోమవారం తెల్లవారుజామున రవితేజ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రవితేజ సోదరి ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో హైదరాబాద్లోని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రీన్హిల్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను మాస్టర్ డిగ్రీ పట్టా అందుకునే కార్యక్రమానికి రావాలని రవితేజ తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్పోర్ట్, వీసా తీసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఇంతలోనే కుమారుడు మృతి చెందడంతో వారు విషాదంలో మునిగిపోయారని బంధువులు చెప్పారు. డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడుతాను గత శనివారం కొడుకుతో మాట్లాడానని చంద్రమౌళి చెప్పారు. తనకు త్వరలోనే మంచి జాబ్ వస్తుందని... మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడన్నారు. త్వరలోనే నీకు మంచి గిఫ్టు ఇస్తానన్నాడని, అయితే అది ఇదేనా అంటూ ఆయన భోరున విలపించారు. తన కొడుకు మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్కు వచ్చేలా చూడాలని చంద్రమౌళి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్.. రవితేజ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి సహాయం చేస్తానని చెప్పారని ఆయన కార్యాలయం తెలిపింది. -
కెనడాలో ఏపీకి చెందిన విద్యార్థి హఠాన్మరణం!
కెనడాలో ఉన్నత చదువులకోసం వెళ్లిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు పిల్లి ఫణి కుమార్(36) వైజాగ్లోని గాజువాక ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. దీంతో ఫణి కుమార్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయికాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SAIT)లో సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎంఎస్ చదివేందుకు 2024 ఆగస్టు నెలలో వెళ్ళాడు ఫణి కుమార్. అయితే డిసెంబర్ 14న ఫణి కుమార్ రూమ్మేట్, ట్రక్ డ్రైవర్ తన కమారుడి మరణం గురించి సమాచారం అందించాడని తండ్రి, నాగ ప్రసాద్ తెలిపారు. గుండెపోటుతో చనిపోయినట్టు భావిస్తున్నప్పటికీ అయితే, ఈ మరణానికి గల కారణాలపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాల్గరీ పోలీసులు ఫణి కుమార్ వస్తువులను అతని ల్యాప్టాప్, పాస్పోర్ట్, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన కుమారుడి మృతదేహాన్ని కెనడా నుంచి భారతదేశానికి తీసుకునేందుకు సహకరించాల్సిందిగా నాగప్రసాద్, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కెనడాలో భారత విద్యార్థి హత్య
టొరంటో:కెనడాలో మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. చదువుకుంటూ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న హర్షన్దీప్సింగ్ను ఎడ్మాంటన్లోని అతడి అపార్ట్మెంట్లోనే దుండగులు కాల్చి చంపారు. హత్యకు పాల్పడ్డ ముగ్గిరిలో ఇవాన్ రెయిన్,జుడిత్ సాల్టియాక్స్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుండగులు తొలుత హర్షన్దీప్సింగ్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించారు. అతన్ని ఫ్లాట్లో నుంచి లాగి మెట్ల మీదకు నెట్టేస్తూ వెనుక నుంచి కాల్పులు జరిపారు.కాల్పుల సమాచారం అందుకుని తాము అపార్ట్మెంట్కు చేరుకునే సరికే హర్షన్దీప్సింగ్ స్పందించడంలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు అతడి మృతిని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిందని చెబుతున్న వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. హత్య వెనుక కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఇటీవలే అల్పాహారం విషయంలో గొడవ జరిగి స్నేహితుడి చేతిలో భారతీయ విద్యార్థి ఒకరు హత్యకు గురైన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: డేంజర్ బెల్స్.. మనపాలిట శాపాలివే -
విదేశీ చదువుల క్రేజ్
-
US: అమ్మాయి అనుకుని చాటింగ్.. భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి బుద్ధి వక్రీకరించి 12 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు ఓ భారత విద్యార్థి. స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లిన ఉపేంద్ర ఆడూరు(32) భారత విద్యార్థి సోషల్ మీడియాలో 13 ఏళ్ల బాలిక అనుకుని ఓ వ్యక్తితో చాటింగ్ మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు మభ్యపెట్టే విధంగా సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాకు అశ్లీల చిత్రాల మెసేజ్లు కూడా పెట్టాడు. ఏకంగా ఓ రోజు టైమ్ ఫిక్స్ చేసుకుని ఆ బాలికను కలవడానికి వెళ్లాడు. ఇక్కడే అతడికి ఎదురైంది పెద్ద ట్విస్టు. ఉపేంద్ర అనుకున్నట్లు ఆ ఖాతా 13 ఏళ్ల బాలికది కాదు.మైనర్ల మీద లైంగికనేరాలకు పాల్పడే వారిని వలపన్ని పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ క్రియేట్ చేసిన నకిలీ ఖాతా. ఉపేంద్ర బాలికను కలిసేందుకు మీటింగ్ స్పాట్కు వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారు. అతడి ఫోన్ లాక్కుని అందులోని అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా 2022 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6 మధ్యలో జరిగింది. ఈ కేసులో ఉపేంద్రకు 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు రిలీజ్ అయిన తర్వాత మరో 10 ఏళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. -
ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు
యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) జూన్ 10 నుంచి 14 వరకు కాలిఫోర్నియాలో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవను కుక్ కలిశారు.టిమ్ కుక్.. భారతీయ విద్యార్థి, డెవలపర్ అయిన అక్షత్ శ్రీవాస్తవతో జరిపిన పరస్పర చర్యను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్'లో గెలిచిన విద్యార్థి డెవలపర్లతో మాట్లాడాను. వారి క్రియేటివిటీ, ప్రదర్శనను చూడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.నేను గత సంవత్సరం భారతదేశాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గొప్ప డెవలపర్లను కలిశాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అనేక మార్గాలు వారిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ వారం అక్షత్ని కలవడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్లాసిక్ గేమ్ల పట్ల తనకున్న ప్రేమను తరువాత తరంతో పంచుకోవడానికి సరికొత్త మార్గాన్ని సృష్టించారు అని వెల్లడించారు.శ్రీవాస్తవ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్లో భాగంగా మైండ్బడ్ అనే యాప్ను సమర్పించారు. ఇది తన మేనల్లుడితో పంచుకున్న ఉల్లాసభరితమైన క్షణాల నుంచి ప్రేరణ పొంది, ఈ యాప్ను రూపొందించినట్లు సమాచారం. మైండ్బడ్ పిల్లలు తమ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఆనందించడానికి రూపొందించిన నాలుగు ఆకర్షణీయమైన చిన్న గేమ్లను కలిగి ఉంది.శ్రీవాస్తవ మైండ్బడ్ని సృష్టించడానికి స్విఫ్ట్యుఐ, ఎవికిట్ (ఆడియో), పెన్సిల్కిట్, ఫైల్మేనేజర్లను ఉపయోగించారు. కొత్త టెక్నాలజీలు అనుగుణంగా దీనిని రూపొందించారు.అక్షత్ శ్రీవాస్తవ కోవిడ్ సంక్షోభ సమయంలో ట్విట్టర్, ఫేస్బుక్లోని సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పడకలను ట్రాక్ చేయడానికి ఒక యాప్ను అభివృద్ధి చేశారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీల మీద ఆసక్తి కనపరిచిన శ్రీవాస్తవ యాపిల్ పార్క్లో జరిగే కార్యక్రమానికి 50 మంది విద్యార్థులలో ఒకరుగా వెళ్లారు.Kicking off #WWDC24 in the best way possible—meeting with student developers who won our Swift Student Challenge. It’s amazing to see their creativity and determination on full display! pic.twitter.com/b56k8kcGZs— Tim Cook (@tim_cook) June 9, 2024 -
అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
అమెరికాలో వరుస హత్యలు, రోడ్డు ప్రమాదాలు, అదృశ్యం, అనూహ్యమరణాలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో అదృశ్యం కావడం ఆందోళన రేపింది. ఎన్నో కలలతో ఉన్నత చదువులకోసం అమెరికా పయనం కాబోతున్న భారతీయ యువతకు, అందులోనూ తెలుగు విద్యార్థులకు, తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.హైదరాబాద్కు చెందిన కందుల నితిషా (23) మే 28 నుంచి కనిపించకుండా పోయింది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలోని శాన్ బెర్నార్డినోకు చెందిన విద్యార్థిని నితిషా కనిపించడం లేదన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కందుల నితిషా కాలిఫోర్నియాలోని లాసె ఏంజెల్స్ నుంచి కనిపించ కుండా పోయిందని, ఆమె ఆచూకీ లభిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటించారు. కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్తో 2021 టయోటా కరోలాకారులో వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని CSUSB చీఫ్ ఆఫ్ పోలీస్ జాన్ గుట్టీరెజ్ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటన జారీ చేశారు.ఆచూకీ తెలిసినవారు (909) 537-5165 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. కాగా ఇటీవల క్లీవ్ ల్యాండ్ నగరంలో అదృశ్యమైన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ (25) తర్వాత శవమై కనిపించాడు. అలాగే చికాగోలో తెలంగాణకు చెందిన విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం లాంటి అనేక ఘటనలు అమెరికాలో మన విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. -
అమెరికాలో మరో విషాదం, తెలుగు విద్యార్థి దుర్మరణం
ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థులు వరుస మరణాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బెలెం అచ్యుత్ (సన్నీ) బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.న్యూయార్క్లోని ‘స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్’లో చదువుతున్న అచ్చుత్ బైక్పై వెళ్తుండగా మరో వాహనం వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.Saddened to learn about the untimely demise of Shri Belem Atchyuth, a student at SUNY who met with a bike accident and passed away yesterday evening; our deepest condolences to the family; @IndiainNewYork is in touch with the bereaved family & local agencies to extend all…— India in New York (@IndiainNewYork) May 23, 2024 అచ్యుత్ మృతి పట్ల అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. అతని మృతదేహాన్నిభారతదేశానికి తిరిగి పంపడం లాంటి ఇతర సహాయాన్ని అందించడానికి వారి కుటుంబ సభ్యులు, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ వెల్లడించింది. కాగా అమెరికాలో 2024లోనే పదకొండు మందికి పైగా విద్యార్థులు మరణించారు . అనేక మంది తీవ్ర దాడులను ఎదుర్కొన్నారు. ఇటీవల జార్జియాలోని అల్ఫారెట్టా నగరంలో జరిగిన ఘోరురోడ్డు కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ సంతతి విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. -
కెనడాలో కాల్పులు
ఒట్టావా: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాల ఘటనలు ఆగట్లేవు. తాజాగా కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్ ప్రాణాలు కోల్పోయారు. వాంకోవర్ సిటీ పరిధిలో 12వ తేన రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వాంకోవర్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హరియాణాలోని సోనిపట్ నుంచి చిరాగ్ కెనడాకు వచ్చారు. విద్యార్థి వీసా మీద కెనడాకు వచ్చి ఎంబీఏ చేసి ఇక్కడే తాత్కాలిక ఉద్యోగంలో చేరారు. ఏప్రిల్ 12వ తేదీన చిరాగ్ తన కారులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి చిరాగ్ తన కారులో విగతజీవిగా పడి ఉన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్చేయలేదు. చిరాగ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు భారత సర్కార్ సాయపడాలంటూ చిరాగ్ కుటుంబం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తిచేసింది. -
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి కిడ్నాప్.. విషాదం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్.. విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడ్ని డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిందని, కాపాడాలంటూ అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అరాఫత్ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది. Anguished to learn that Mr. Mohammed Abdul Arfath, for whom search operation was underway, was found dead in Cleveland, Ohio. Our deepest condolences to Mr Mohammed Arfath’s family. @IndiainNewYork is in touch with local agencies to ensure thorough investigation into Mr… https://t.co/FRRrR8ZXZ8 — India in New York (@IndiainNewYork) April 9, 2024 ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని, విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది. అదే చివరిసారి.. నాచారంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన మహ్మద్ సలీమ్ కుమారుడు అబ్దుల్ మహ్మద్ అరాఫత్(25) 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను చివరిసారి మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి స్పందనలేదు. ఆ మరుసటిరోజునే అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మార్చి 9వ తేదీన ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్ బంధువులు క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్ అరాఫత్ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్లాండ్లోని వాల్మార్ట్ స్టోర్లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. చివరకు.. మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సహాయం కోరిన బాధిత కుటుంబం తండ్రికి వాట్సాప్ కాల్ ఆ వెంటనే.. మార్చి 19వ తేదీన అబ్దుల్ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అబ్దుల్ను తాము కిడ్నాప్ చేశామని.. 1200 అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే డబ్బులిచ్చేందుకు అంగీకరించిన సలీం.. అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగారు. దీనికి ఆగ్రహించిన కిడ్నాపర్లు ఫోన్ పెట్టేడయంతో సలీం ఆందోళన చెందారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనూ తమ కుమారుడిని రక్షించాలంటూ మీడియా సాక్షిగా అధికారులు కోరారాయన. అయితే.. చివరకు ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి. Telangana | A resident of Hyderabad's Nacharam Mohammed Abdul Arfath, who went to the United States to pursue his master's degree has gone missing from his residence in the USA after March 7. Abdul's father, Mohammed Saleem said "My son went to USA on May 23 to pursue a… pic.twitter.com/1iSxywKgyv — ANI (@ANI) March 21, 2024 ఇదిలా ఉంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన విద్యార్థులే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. -
'అమెరికాలో ఇలా చెయ్యొద్దు'!.. భారతీయ విద్యార్థులకు ఇంద్రానూయి సూచనలు!
అమెరికాలో వెలుగు చూసిన భారత సంతతి విద్యార్థుల ఘటనలపై పెప్పికో మాజీ సీఈవో ఇంద్రానూయి స్పదించారు. ఈ ఘటనలన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దయచేసి యూఎస్కి వచ్చే భారతీయ విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే కార్యకలాపాల జోలికి వెళ్లొద్దని సూచిస్తూ పది నిమిషాల నిడివిగల వీడియోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఇంద్రనూయి.."అక్కడ దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులకు సంబంధించిన వార్తల గురించి విన్నాను. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియోని రికార్డు చేశాను. అమెరికాలో సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలనేది తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చట్ట పరిధికి లోబడి ఉండండి. రాత్రిపూట ఒంటరిగా చీకటి ప్రదేశాల్లోకి వెళ్లొద్దు. మాదకద్రవ్యాల జోలికి, అతిగా మద్యపానం సేవించడం వంటివి అస్సలు చెయ్యొద్దు. ఇవన్నీ మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టెవే. ముఖ్యంగా ఇక్కడకు వచ్చే విద్యార్థులు తగిన యూనివర్సిటీని, కోర్సును ఎంపిక చేసుకోండి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు యూఎస్కి రావడం చాలా మంచిది. ఇది గొప్ప సాంస్కృతిక మార్పు కూడా. పైగా వారు తమ కుటుంబాలు, బంధువులు, పర్యావరణ పరిస్థితులకు చాలా దూరంగా చదువు కోసం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అప్రమత్తతో వ్యవహరించాలి. అమెరికాలో దిగిన క్షణం నుంచే తగిన స్నేహితులను ఎంచుకోండి. కొత్తగా రావడంతో మీకు ఇక్కడి అలవాట్లు, జీవనశైలి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వీటి వ్యామోహంలో పడి చెడు స్నేహాల్లో చిక్కుకోవద్దు. కొంతమంది విద్యార్థులు సరదాగా మాదక ద్రవ్యాలకు ట్రై చేయాలని చూస్తున్నారు. ఇలాంటివి అస్సలు వద్దు ప్రాణంతకం, పైగా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అదీగాక ఇందులో చిక్కకుంటే మీ కెరీర్ నాశనం అవుతుంది. ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాల్లో అస్సలు పాల్గొనవద్దు. మీ చర్యల వల్ల జరిగే పరిణామలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామందికి ఈ ఆతిథ్య దేశం చట్టాలు, నిబంధనలు అస్సలు తెలియవు. అంతేగాదు మీ వీసా స్థితి, పార్ట్ టైం ఉద్యోగం విషయంలో దానికున్న చట్ట బద్ధత అర్థం చేసుకోవాలి. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించవద్దు. యూఎస్లో ఉన్నప్పుడూ విదేశీ విద్యార్థిగా హద్దుల్లోనే ఉండాలనే విషయం మరిచిపోవద్దు. అలాగే మీరు నివశించే ప్రాంతాల గురించి పూర్తిగి తెలుసకోవాలి. సమూహంగా లేదా స్నేహితులతోనే తప్పక వెళ్లండి." అని సూచించారు ఇంద్రానూయి. అలాగే ఇక్కడ విశ్వవిద్యాలయాలు, స్థానిక కమ్యూనిటీల గురించి అవగాహన ఉండాలన్నారు. ఇక్కడ ఉండే స్థానిక భారతీయ అమెరికన్లతోనూ, భారతీయ కాన్సులేట్తోనూ టచ్లో ఉండాలని చెప్పారు. సామాజిక మాధ్యమాలతో సహా వివిధ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, ఇటీవలే అమెరికాలో చదువుతున్న హైదరాబాద్కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహమ్మద్ సలీం పేర్కొనడం గమనార్హం. అలాగే అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు కూడా చెప్పారు. కొద్దివారాల క్రితం వివేక్ సైనీ అనే విద్యార్థి నిరాశ్రయుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. గత ఫిబ్రవరి నెలలో పర్డ్యూ యూనివర్శిటీకి చెందిన భారతీయ-అమెరికన్ సమీర్ కామత్ (23) అనే విద్యార్థి తలపై తానే తుపాకీతో కాల్చుకుని మరణించాడని అధికారులు తెలిపారు. ఇవేగాక మరి కొందరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పలు దిగ్బ్రాంతికర ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. For Indian students studying/planning to study in the United States of America 🇺🇸 : a very useful video message by Ms. @Indra_Noooyi, former Chairman & CEO of PepsiCo @DrSJaishankar @MEAIndia @EduMinOfIndia @binaysrikant76 @IndianEmbassyUS @CGI_Atlanta @cgihou… pic.twitter.com/EWTrdKd4tg — India in New York (@IndiainNewYork) March 22, 2024 (చదవండి: US: అమెరికాలో ఇంత భక్తి ఉందా?) -
అమెరికాలో హైదరాబాద్ యువకుడు కిడ్నాప్..$1200 లు డిమాండ్
-
ఎన్ఆర్ఐ అభిజిత్ది హత్యా? ఆత్మహత్యా? పోలీసుల ప్రకటన ఆంతర్యం ఏమిటి?
అమెరికాలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయిన 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పరుచూరి అభిజిత్ది హత్యకాదని అమెరికా పోలీసులు తేల్చారు. హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు తమ ప్రాథమిక విచారణలో హత్య అని అనుమానించేందుకు ఆధారాలేవీ లేవని చెప్పినట్లు న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు. అభిజిత్ అకాల మరణంపై విచారాన్ని వ్యక్తం చేసిన కాన్సులేట్, అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, ఈ విషయంలో స్థానిక అధికారులతో పాటు భారతీయ-అమెరికన్ కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ ఎక్స్( ట్విటర్) పోస్ట్లో పేర్కొంది. దీంతో అభిజిత్ ఆత్మహత్య చేసుకున్నాడా?అనే అనుమానాలు తలెత్తెతున్నాయి. అదే నిజమైతే అభిజిత్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అసలు డెడ్ బాడీ అడవిలోకి ఎలా వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి దంపతుల తమ తనయుడు అభిజిత్ను మార్చి 11న యూనివర్శిటీ క్యాంపస్లో గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని కారులో అడవిలో వదిలివెళ్లారని ఆరోపించిన సంగతి తెలిసిందే. చక్రధర్, శ్రీలక్ష్మి దంపతులు చాన్నాళ్ల క్రితమే బుర్రిపాలెం నుంచి అమెరికాలోని కనెక్టికట్ వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. వీరి కుమారుడు అభిజిత్ బోస్టన్లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీ నుంచి అభిజిత్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు అతని సెల్ నంబర్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని బోస్టన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అదే రోజు గుర్తించడం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అభిజిత్ భౌతిక కాయానికి స్వస్థలం బుర్రిపాలెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఏడాది (2024) ప్రారంభం నుండి, అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు తొమ్మిది మంది మరణించడం విషాదం. Deeply saddened to learn about the unfortunate demise of Mr. Abhijeeth Paruchuru, an Indian student in Boston. Mr. Puruchuru’s parents, based in Connecticut 🇺🇸, are in direct touch with detectives. Initial investigations rule out foul play. @IndiainNewYork rendered… — India in New York (@IndiainNewYork) March 18, 2024 -
జాహ్నవి కేసు.. భారత్ కీలక ప్రకటన
సీటెల్: రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అధికారికి అక్కడి కోర్టు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లేనందున ఆ అధికారిపై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్ స్టేట్లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. అయితే జాహ్నవి కందుల కేసులో భారత్ కీలక ప్రకటన చేసింది. తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సీటెల్లోని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. ‘‘దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం అని దౌత్య కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తీర్పుపై సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని పేర్కొంది. సీటెల్ పోలీస్ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని, అప్పటిదాకా కేసు పురోగతిని పరిశీలిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. On the recently released investigation report of the King County Prosecution Attorney on the unfortunate death of Jaahnavi Kandula, Consulate has been in regular touch with the designated family representatives and will continue to extend all possible support in ensuring justice… — India In Seattle (@IndiainSeattle) February 23, 2024 ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో ఇంటికి వెళ్లబోతూ రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వేగానికి వంద అడుగుల ఎత్తులో ఎగిరిపడి తీవ్రంగా గాయపడి జాహ్నవి మృతి చెందింది. ఆ టైంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. ఇంకోవైపు.. ఇదీ చదవండి: జాహ్నవికి అన్యాయం.. కేటీఆర్ ఆవేదన సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. ప్రమాదం గురించి పైఅధికారికి సమాచారం చేరవేస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె(జాహ్నవి) జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. పరిహారంగా కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. ఈ వ్యవహారం వీడియోతో సహా బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అవమానించేందుకు అలా మాట్లాడలేదంటూ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు ఆర్డరర్. అంతేకాదు.. జాహ్నవి మృతికి కారణమైన కెవిన్కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు కూడా. ఇక కెవిన్పై ఇప్పటికిప్పుడు క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు తప్పవు. -
మరో భారతీయ విద్యార్థి అమెరికాలో దుర్మరణం
న్యూయార్క్: ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెడుతున్న కొందరు భారతీయ విద్యార్థుల భవిత అర్ధంతరంగా ముగిసిపోతోంది. ఆ విషాదపర్వంలో మరో ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న విద్యార్థి సమీర్ కామత్ సోమవారం సాయంత్రం ఇండియానా రాష్ట్రంలో విగతజీవిగా కనిపించారు. 23 ఏళ్ల సమీర్ మెకానికల్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేస్తున్నారు. క్రోవ్స్ గ్రో ప్రాంతంలోని స్థానిక నేచర్ ప్రిసర్వ్లో సమీర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు వారెంట్ కౌంటీ అధికారి వెల్లడించారు. పోస్ట్మార్టమ్ నివేదిక వచ్చాకే మరణానికి కారణాలపై అంచనాకు రాగలమన్నారు. హైదరాబాద్ విద్యార్థిపై దాడి అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్కు చెందిన సయ్యద్ మజహర్ అలీ అనే విద్యారి్థపై దుండుగులు దాడికి పాల్పడ్డారు. అతను ఇండియానా వెస్లియాన్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చదువుతూ షికాగోలో నివసిస్తున్నాడు. ఈ నెల 4న ఇంటి సమీపంలో ముగ్గురు దండగులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఇటీవల పలువురు భారత విద్యార్థులు అమెరికాలో హత్యకు గురవడం తెలిసిందే. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. నెల రోజుల వ్యవధిలో అమెరికాలో చోటుచేసుకున్న నాలుగో ఘటన ఇది. ఓహియో రాష్ట్రం సిన్సినాటిలో లిండ్నెర్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకుంటున్న శ్రేయస్ రెడ్డి బెనిగెరి అనే తెలుగు విద్యార్థి చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని, అతడి మరణం వెనక ఎటువంటి కుట్ర లేదని భావిస్తున్నట్లు న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం గురువారం తెలిపింది. శ్రేయస్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, సాధ్యమైనంత మేర వారికి సాయం అందజేస్తామని పేర్కొంది. శ్రేయస్ రెడ్డి తండ్రి త్వరలోనే అమెరికా రానున్నారని తెలిపింది. -
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలోని సిన్సినాటిలో భారతీయ విద్యార్థి ఒకరు చనిపోయారు. అతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇండియానా రాష్ట్రంలోని పర్డూ యూనివర్సిటీలో చదువుకుంటున్న నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. ఇతడు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం ధ్రువీకరించారు. వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన ఇది రెండోది కావడం గమనార్హం. మూడు రోజుల క్రితం ఎంబీఏ చదువుకుంటున్న వివేక్ సైనీ(25) అనే భారతీయ విద్యార్థిని జూలియన్ ఫాక్నర్ అనే డ్రగ్స్ బానిస సుత్తితో కొట్టి దారుణంగా పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. -
అమెరికాలో భారత విద్యార్థుల వరుస మరణాలు
అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మూడో విద్యార్థి మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా అమెరికాలోని సిన్సినాటిలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. ఆయన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. వివేక్ సైనీ ఇటీవలే వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్నర్ హత్య చేశాడు. నీల్ ఆచార్య ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం రోజుల క్రితం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆదిత్య అద్లాఖా గత ఏడాది నవంబర్లో ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని దారుణంగా హత్యకు గురయ్యాడు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు. ఇదీ చదవండి: Jordan Attack: అంతటి అమెరికా సైన్యమే పొరబడింది! ఫలితంగా ముగ్గురు మృతి -
అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
అమెరికాలో భారతీయుల విద్యార్ధుల మరణాలు కలకలం రేపుతున్నాయి. జార్జియాలోని లిథోనియా నగరంలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్ సైనీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు సైనీ తలపై 50 సార్లు సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్ధి అమెరికాలో ప్రాణాలు విడిచాడు. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్లో మాస్టర్స్చేస్తున్న ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే క్యాంపస్ నుంచి అదృశ్యమైన ఆచార్య మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. క్యాంపస్లోని మారిస్ జే జుకక్రో లాబొరేటరీస్ సమీపంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం వద్దనున్న ఐడీ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు. పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ కూడా నీల్ ఆచార్య మరణాన్ని ధృవీకరించారు. అయితే నీల్ ఆచార్యను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు 10 రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు అమెరికాలో ప్రాణాలు విడవడం కలకలం రేపుతోంది. Our son Neel Acharya is missing since yesterday Jan 28( 12:30 AM EST) He is studying in Purdue University in the US. He was last seen by the Uber driver who dropped him off in Purdue university. We are looking for any info on him. Please help us if you know anything. pic.twitter.com/VWIS5uyJde — Goury Acharya (@AcharyaGoury) January 29, 2024 తల్లి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే.. తన కొడుకు ఆచూకీ కనుక్కోవాలని ఆదివారం నీల్ తల్లి గౌరీ ఆచార్య ఇన్స్టాగగ్రామ్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ కొడుకు జనవరి 28 నుంచి కనిపించడం లేదని, అతను యూఎస్లోని పర్డ్యూ యూనివర్సిటీలో చదవుతున్నట్లు తెలిపారు. తమ కుమారుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే చెప్పాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమయ్యారు. తాము పర్డ్యూ విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అనంతరం నీల్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డ్రగ్స్కు బానిసైన ఒకడు ఆయన్ను సుత్తితో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హరియాణాకు చెందిన వివేక్ సైనీ బీటెక్ పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవలే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఎంబీయే పూర్తి చేసిన అతడు..జార్జియా రాష్ట్రం లిథోనియా నగరంలో ఉంటూ ఓ స్టోర్లో పార్ట్–టైం క్లర్కుగా పనిచేస్తున్నాడు. అదే స్టోర్ వద్ద నిలువ నీడ లేని జులియన్ ఫాల్క్నర్ అనే డ్రగ్ అడిక్ట్ ఉంటున్నాడు. వివేక్ అతడికి రెండు రోజులుగా నీళ్లు, చిప్స్, కోక్ ఇస్తున్నాడు. చలి నుంచి కాపాడుకునేందుకు జాకెట్ సైతం అతడికి ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన ఫాల్క్నర్ ఇంటికి వెళ్తున్న వివేక్కు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగకుంటే పోలీసులకు చెబుతా నంటూ హెచ్చరించాడు. అతడు లక్ష్యపెట్టక సుత్తితో వివేక్పై దాడికి దిగాడు. వివేక్ తలపై 50సార్లు సుత్తితో మోదాడు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చే సరికి వివేక్ మృతదేహం వద్దే ఆ ఉన్మాది ఉండటం గమనార్హం. -
NRI: జాలి చూపడమే అతని తప్పైంది!
న్యూయార్క్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆశ్రయం లేని వ్యక్తిపై జాలి చూపించిన క్రమంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. సాయం చేశాడన్న కృతజ్ఞత మరిచిన ఆ వ్యక్తి.. భారతీయ విద్యార్థిని దారుణంగా హత్య చేశాడు. జార్జియాలో జనవరి 16న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్లోని హర్యానాకు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవల ఎంబీఏ పట్టా కూడా పొందాడు. జార్జియాలోని ఓ స్టోర్లో పార్ట్ టైమ్ క్లర్క్గా పని చేస్తున్నాడు. ఇటీవల తాను పనిచేస్తున్న స్టోర్ వద్ద అతనికి జూలియన్ ఫాల్కెనర్ అనే వ్యక్తి కన్పించాడు. అతడిని చూస్తే నిలువ నీడలేనట్టు కనిపించాడు. దీంతో చలించిపోయిన వివేక్ మానవత్వంతో అతన్ని చేరదీశాడు. రెండు రోజుల పాటు తినడానకి ఫుడ్ ఇస్తూ సాయం చేశాడు. ఇక.. అక్కడ చలి ఎక్కువగా ఉండటంతో వేసుకొనేందుకు తనవద్ద ఉన్న జాకెట్ను కూడా ఇచ్చాడు. రోజూలాగే జనవరి 16న కూడా జూలియన్ స్టోర్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే దుకాణం మూసేసి ఇంటికి వెళ్తున్న వివేక్.. అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. వివేక్ మాటలను అతను పట్టించుకోలేదు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తానని అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన జూలియన్ తన వెంట ఉన్న సుత్తితో విచక్షణారహితంగా వివేక్ తలపై కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే వివేక్ మృతి చెందాడు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జూలియన్ మత్తుపదార్థాలకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివేక్ మృతదేహాన్ని భారత్కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: మాల్దీవుల పర్యాటకం.. తగ్గిన భారత టూరిస్టులు -
ఇటలీలో భారతీయ విద్యార్థి మృతి
రాంచీ: ఇటలీలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాకు చెందిన రామ్ రౌత్ మరణించాడని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి రౌత్ తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రౌత్ ఎంబీఏ చదివేందుకు ఇటలీ వెళ్లాడు. కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రౌత్ తల్లిదండ్రులు అతని వసతి గృహ యజమానిని సంప్రదించారు. విద్యార్థి మరొక ఇంటి వాష్రూమ్లో శవమై కనిపించాడని గుర్తించారు. అతని మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి జార్ఖండ్లోని సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను రౌత్ కుటుంబం సంప్రదించింది. ఈ సంఘటనపై వెస్ట్ సింగ్భమ్ డిప్యూటీ కమిషనర్ అనన్య మిట్టల్ మాట్లాడుతూ.. రామ్ రౌత్ మరణం గురించి తమకు సమాచారం అందిందని తెలిపారు. అవసరమైన చర్యల కోసం హోం శాఖ, రాష్ట్ర మైగ్రేషన్ విభాగానికి తెలియజేసినట్లు చెప్పారు. ఈ కేసులో అన్ని పరిణామాలను తాను పర్యవేక్షిస్తున్నానని, బాధిత కుటుంబంతో కూడా టచ్లో ఉన్నానని మిట్టల్ తెలిపారు. ఇదీ చదవండి: ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం -
భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ విద్యార్థి నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు. అయితే ఆ యువతి జాడ తెలిపిన వారికి 10 వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 8.32 లక్షలు) ఇవ్వనున్నట్లు యూఎస్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రకటించింది. వివరాలు.. 29 ఏళ్ల మయూషీ భగత్.. 2019, ఏప్రిల్ 29వ తేదీన జెర్సీ సిటీలోని తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయింది. తల్లిదండ్రులు ఫోన్ చేస్తేమో స్విచ్చాఫ్ వచ్చింది. ఆమె స్నేహితుల్ని సంప్రదించినా ఎలాంటి సమాచారం లభించలేదు.దీంతో కూతురు అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మే 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మయూషీ ఇంటి నుంచి వెళ్లిన సమయంలో కలర్ పైజామా, బ్లాక్ టీ షర్ట్ ధరించింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి మిస్సింగ్పై న్యూజెర్సీలోని ఎఫ్బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం గత నాలుగేళ్లుగా కోసం వెతుకుతూనే ఉంది. పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినా.. ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే మయూషీ ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో తాజాగా ఎఫ్బీఐ ఓ ప్రకటన చేసింది. యువతి సమాచారం ఇచ్చిన వారికి పదివేల డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్లు ఎఫ్బీఐ తెలిపింది. చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..! ఎవరీ మయూషీ భగత్ మయూషీ భగత్.. భారతీయ విద్యార్థి. 1994లో వడోదరాలో జన్మించింది. 2016లో ఎఫ్ 1 స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన ఆమె అక్కడ న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తోంది. మయూషి భగత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుందని. గోధుమ రంగు కళ్ళు, నల్లటి జుట్టు కలిగి ఉంటుందని అధికారులు వివరాలు వెల్లడించారు. ఆమె 2016లో ఎఫ్1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చింది. FBI గత ఏడాది జూలైలో తన వెబ్సైట్లోని ‘మోస్ట్ వాంటెడ్’ పేజీలో మయూషీ ‘తప్పిపోయిన వ్యక్తుల’ పోస్టర్ను ప్రదర్శించింది. -
యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!
లండన్: గత వారం యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి తూర్పు లండన్లోని కానరీ వార్ఫ్ సరస్సులో శవమై కనిపించాడు. డిసెంబర్ 14న అదృశ్యమైన గురష్మాన్ సింగ్ భాటియా(23 ) మృతదేహాన్ని కానరీ వార్ఫ్ సరస్సులో డైవర్లు బుధవారం గుర్తించారు. లాఫ్బరో యూనివర్శిటీకి చెందిన విద్యార్థి గురష్మాన్ సింగ్ భాటియా డిసెంబర్ 14న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ క్రమంలో కానరీ వార్ఫ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చివరిసారిగా సౌత్ క్వే ప్రాంతంలోని సీసీటీవీలో డిసెంబర్ 15న కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆయన జాడ తెలియలేదు. చివరగా బుధవారం కానరీ వార్ఫ్ ప్రాంతంలోని సరస్సులో డైవర్లకు గురష్మాన్ సింగ్ మృతదేహం కనిపించింది. గురష్మాన్ సింగ్ మరణవార్త సమాచారాన్ని పంజాబ్లోని ఆయన కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేపడుతామని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే చెప్పారు. గురష్మాన్ సింగ్ అదృశ్యంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పందించారు. గత నెలలో కూడా యూకేలో భారతీయ విద్యార్థి థేమ్స్ నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? -
అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి
-
అమెరికాలో తెలుగు యువతి మృతి.. ఎవరీ జాహ్నవి కందుల?
సియాటెల్: గత జనవరిలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. జాహ్నవి కందుల అనే యువతి రోడ్డు దాటుతుండగా కెవిన్ డేవ్ అనే అధికారి 911 పోలీస్ వాహనాన్ని అతివేగంతో నడిపి ఆమెను ఢీకొట్టాడు. దీంతో ఆమె 100 అడుగులు ఎగిరి దూరంపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎవరీ జాహ్నవి కందుల? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన యువతి జాహ్నవి (23) అమెరికాలో సియాటెల్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. 2021లో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం మీద బెంగుళూరు నుంచి యూఎస్ వెళ్లింది. ఈ డిసెంబర్లో ఆమె మాస్టర్స్ పూర్తి కానుంది. ఇంతలోనే జాహ్నవి మరణ వార్త తెలియడంతో కందుల కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది. తన మనవరాలును దూరం చేసుకున్న భాధ నుంచి కోలుకోక ముందే పోలీసు ప్రవర్తన గురించి తెలియడం మరింత దిగ్బ్రాంతికి గురిచేస్తందని ఆమె తాత ఆవేదన వ్యక్తం చేశారు. విషాదకరమైన ప్రమాదం తర్వాత ఎవరైనా అలా ఎలా మాట్లాడగలరని వాపోయారు. చదవండి: జాహ్నవి మృతి: కేంద్ర మంత్రి జైశంకర్కు సీఎం జగన్ లేఖ పోలీస్ వెకిలి నవ్వులు అయితే జాహ్నవి మృతి పట్ల అక్కడి పోలీస్ అధికారి చులకనగా మాట్లాడిన వీడియో తాజాగా బయటికి రావడంతో తీవ్ర దుమారానికి దారీతీసింది. జాహ్నవి మరణం విషయం తెలిసి దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసు అధికారి డానియెల్ అడరర్.. పైఅధికారికి వివరాలు చెప్తూ జాహ్నవి పట్ల వెకిలిగా మాట్లాడారు. గట్టిగా నవ్వుతూ ‘ఆమె చచ్చిపోయింది. ఆ ఓ మామూలు వ్యక్తేలే. ‘ఏముంది. ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు ఉంటాయేమో..విలువ తక్కువే..’ అని పగలబడి నవ్వుతూ మాట్లాడారు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డవ్వగా వీటిని సోమవారం సియాటెల్ పోలీసులు బయటకు విడుదల చేశారు. దీనిపై సియాటెల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంది. సదరు పోలీసు అధికారి నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అదే విధంగా కారు బాడీకామ్ వీడియోపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేసింది. జాహ్నవి మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. అతివేగమే ప్రమాదానికి కారణం ప్రమాదం జరిగినప్పుడు కెవిన్ డేవ్ గంటకు 119 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు సీటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ నివేదికలో తెలిపింది. వాహనం ఢీకొనడానికి అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. డేవ్ జాహ్నవిని ఢీకొట్టే నికి ఒక సెకను ముందు బ్రేకులు వేయడంతో ఆ వేగం ధాటికి ఆమె 100 అడుగుల ముందుకు ఎగిరిపడింది. వాస్తవానికి ప్రమాదం జరిగిన వీధిలో వేగ పరిమితి గంటకు 25 మైళ్లు లేదా గంటకు 40 కి.మీ మాత్రమే. అయితే జాహ్నవిని ఢీకొని ఆమె మరణానికి కారణమైన తోటి పోలీసు అధికారి కెవిన్ను కాపాడేందుకు డానియెల్ ప్రయత్నించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కెవిన్ కారును గంటకు 50 మైళ్ల వేగంతోనే నడుపుతున్నాడని, కారు అదుపు తప్పలేదని డానియల్ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నాడు. తప్పు జాహ్నవిదే అన్నట్టుగా చూపడానికి ప్రయత్నించాడు. -
పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి..
అమెరికాలోని సీటెల్లో 2023 జనవరిలో పోలీస్ వాహనం ఢీకొని తెలుగు యువతి కందుల జాహ్నవి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇది అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ యువతి కుటుంబంలో విషాదం నింపింది. తాజాగా ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో కీలకంగా మారింది. నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్న జాహ్నవి గత జనవరి 23న రోడ్డు దాటుతుండగా ఆమెను ఒక పోలీస్ వాహనం ఢీకొంది. ఆ సమయంలో పోలీసుల వాహనంలో సీటెల్ పోలీస్ విభాగానికి చెందిన కెవిన్ డేవ్ ఉన్నారు. కెవిన్ డేవ్ బాడీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను గమనిస్తే.. నాటి కారు స్పీడో మీటర్ గంటకు 74 మైళ్ల వేగాన్ని చూపుతోంది. అదే స్పీడ్లో వాహనం జాహ్నవిని థామస్ స్ట్రీట్ కూడలి వద్ద ఢీకొంది. ప్రమాదంలో గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానికులు, పోలీసు అధికారులు హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో కెవిన్ ఓ ఎమర్జెన్సీ కాల్ మాట్లాడుతున్నట్లు సమాచారం. అందుకే అతను వాహనం సైరన్ను తగ్గించాడని తెలుస్తోంది. అయితే ఈ అత్యవసర పరిస్థితి గురించి ఆమెకు హెచ్చరించడంలో కెవిన్ విఫలమయ్యాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై కెవిన్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను సైరన్ మోగించానని, అప్పుడు జాహ్నవి క్రాస్ వాక్లో ఉందన్నారు. తమ కారును చూసి కూడా ఆమె క్రాస్ వాక్ గుండా వేగంగా పరిగెత్తిందని కెవిన్ తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన ఆరు నెలల తర్వాత బాడీ క్యామ్లో రికార్డ్ అయిన నాటి ఘటన దృశ్యాలు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల 2021లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లి సీటెల్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేరారు. గత జనవరి 23న ఆమె కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇది కూడా చదవండి: ఇన్ని చిరుకప్పలు ఎక్కడి నుంచి Body cam footage shows Kevin Dave hitting and killing Jaahnavi Kandula in a crosswalk at 8 p.m. on Jan. 23. Dave had chirped his siren, but did not have it running consistently, as he plowed into Kandula, a 23 Y/O master’s student at Northeastern University’s Seattle campus pic.twitter.com/IeTVuUA7cK — That Guy Shane (@ProfanityNewz) July 24, 2023 -
కెనడాలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి
టొరంటో: కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న భారతీయ విద్యార్థి ఒకరు దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. పంజాబ్లోని కరీంపూర్ చావ్లా గ్రామానికి చెందిన గుర్విందర్ నాథ్(24) టొరంటోలోని బ్రామ్టన్లో ఉంటూ బిజినెస్ స్కూల్లో చదువుకుంటున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మిస్సిస్సౌగాలో ఈ నెల 9న అర్థరాత్రి దాటాక 2.10 గంటల సమయంలో నాథ్ ఒక ఇంట్లో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా కొందరు దుండగులు తీవ్రంగా కొట్టి అతడి దగ్గరున్న విలువైన వస్తువులతోపాటు, కారును తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన నాథ్ను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 14న నాథ్ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచాడు. దుండగులు అతడి కారును అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కారులో పలు ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. నాథ్, దుండగులకు మధ్య గతంలో ఎటువంటి పరిచయం లేదన్నారు. అతడి కారు ఎత్తుకెళ్లేందుకే దుండుగులు పిజ్జా డెలివరీ చేసినట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై టొరంటోలోని భారత్ కాన్సుల్ జనరల్ సిద్ధార్థ నాథ్ విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. ఈ నెల 27న నాథ్ మృతదేహాన్ని భారత్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2021 జులైలో కెనడా వెళ్లిన నాథ్ చివరి సెమిస్టర్లో ఉన్నాడని, చదువు పూర్తయ్యాక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాడని అతడి స్నేహితులు తెలిపారు. ఆదివారం నాథ్ స్మత్యర్థం సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసౌగాలో కొవ్వొత్తులతో నివాళులరి్పంచారు. -
మహిళపై అత్యాచారం.. భారతీయ విద్యార్థికి యూకేలో ఆరేళ్ల జైలు శిక్ష
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను అత్యాచారం చేసిన కేసులో భారతీయ మూలాలున్న యువకునికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది యూకే కోర్టు. గత ఏడాది నైట్ క్లబ్లో పరిచయమైన ఓ మహిళపై ఈ దారుణానికి పాల్పడ్డాడని కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. #INCOURT l A man has been jailed for raping at a woman at a halls of residence in #Cardiff. CCTV showed Preet Vikal carrying the victim in his arms and later across his shoulders out of the city centre. 1/2 pic.twitter.com/wfYrIggd7o — South Wales Police Cardiff (@SWPCardiff) June 16, 2023 ప్రీత్ వికాల్(20) యూకేలో ఇంజినీరింగ్ చదవడానికి వెళ్లిన భారతీయ యువకుడు. గత ఏడాది నైట్క్లబ్లో తప్పతాగి సృహలో లేని మహిళను ప్రీత్ చేతులపై ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మహిళను తన నివాసానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఫొటోలను తన స్నేహితులకు షేర్ చేశాడు. ఇవే ఈ కేసులో పోలీసులకు కీలకంగా మారాయి. ఈ ఆధారాలతో ప్రీత్ వికాల్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆధారాలను గమనించిన న్యాయస్థానం ప్రీత్ను దోషిగా గుర్తించి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదీ చదవండి:చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...! -
Dubai: భారతీయుడికి రూ.11 కోట్ల పరిహారం
అబుదాబీ: దుబాయ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి భారీ పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని యూఏఈ సుప్రీం కోర్టు ఆదేశించింది. స్టూడెంట్గా ఉన్న సమయంలో ఆ యువకుడు యాక్సిడెంట్కు గురికాగా, దాని వల్ల అతని జీవితం నాశనం అయ్యిందని.. కాబట్టి భారీగానే పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు తెలిపింది. 2019లో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మెట్రో స్టేషన్ పార్కింగ్లోకి ప్రవేశించే చోట బస్సు డ్రైవర్ ఓవర్హెడ్ హైట్ బారియర్ను ఢీకొట్టడంతో.. బస్సు ఎడమ పైభాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. అందులో 12 మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో అప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్న ముహమ్మద్ బైగ్ మీర్జా సైతం గాయపడ్డాడు. తన చివరి సెమీస్టర్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న అతను.. సెలవుల్లో బంధువుల ఇంటికి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. యాక్సిడెంట్కు కారణమైన డ్రైవర్కు (ఒమన్కు చెందిన వ్యక్తి) 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది అక్కడి చట్టం. అంతేకాదు.. బాధిత కుటుంబాలకు 3.4 మిలియన్ దిర్హామ్ ‘బ్లడ్ మనీ’(పరిహారపు నగదు) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అప్పట్లో.. ఈ ప్రమాదంలో గాయపడిన మీర్జాకు 1 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని యూఏఈ ఇన్సూరెన్స్ అథారిటీ చెప్పింది. అయితే ఆ పరిహారం సరిపోదని బాధితుడి బంధువులు కోర్టుకి ఎక్కారు. తన క్లయింట్ ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని, సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని, ప్రమాదంలో అతని బ్రెయిన్ సగ భాగం దెబ్బతిందని, ప్రధాన అవయవాలన్నీ పూర్తిగా దెబ్బ తిన్నాయని, పైగా చదువు కూడా పూర్తి చేయలేకపోయాడని, అతని జీవితమే నాశనం అయ్యిందిని.. మీర్జా తరపు న్యాయవాది వాదనలు వినిపించాడు. ఇంతకాలం వాదనలు జరగ్గా.. బుధవారం యూఏఈ సుప్రీం కోర్టు ఐదు మిలియన్ల దిర్హామ్(మన కర్సెనీలో రూ. 11 కోట్లు) మీర్జాకు చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది. -
చైనాలో తమిళనాడు వైద్య విద్యార్థి మృతి.. కరోనానే కారణం?
చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చైనాలో తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ఓ వైద్య విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. గత ఐదేళ్లుగా చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన ఆ కుటుంబం తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది. వైద్య విద్య పూర్తి చేసేందుకు భారత్లోని తమిళనాడుకు చెందిన అబ్దుల్ షేక్ అనే యువకుడు ఐదేళ్ల క్రితం చైనాకు వెళ్లాడు. కరోనా వ్యాప్తి కారణంగా భారత్ తిరిగివచ్చిన అతను 20 రోజుల క్రితమే(2022 డిసెంబర్ 11)న తిరిగి చైనాకు వెళ్లాడు. 8 రోజుల ఐసోలేషన్ తర్వాత ఈశాన్య చైనాలోని హెయిలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని కికిహార్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో అతడిని ఐసీయూలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. అనారోగ్యంతో తమ కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది ఆ కుటుంబం. అలాగే.. తమకు సాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు -
కెనడాలో రోడ్డు ప్రమాదం.. హరియాణా విద్యార్థి మృతి
టొరంటో: కెనడా రాజధాని టొరంటోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరియాణా విద్యార్థి ఒకరు దుర్మరణం చెందారు. శుక్రవారం మధ్యాహ్నం సైకిల్పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పికప్ ట్రక్కు ఢీకొట్టి, అతడిని లాక్కెళ్లింది. ఎమర్జెన్సీ సిబ్బంది ట్రక్కు నుంచి అతికష్టమ్మీద అతడిని వేరు చేశారు. అప్పటికే అతడు చనిపోయాడు. మృతుడిని హరియాణాలోని కర్నాల్కు చెందిన కార్తీక్ సైని(20)గా గుర్తించారు. టొరంటోలోని షెరిడాన్ కాలేజీలో జాయినయ్యేందుకు 2021 ఆగస్ట్లో అతడు కెనడా వెళ్లినట్లు అతడి సోదరుడు పర్వీన్ సైని చెప్పారు. -
భారత సంతతి విద్యార్థిపై దాడి...మోదీజీ సాయం చేయండి అంటూ వేడుకోలు
సిడ్నీ: భారత సంతతి విద్యార్థిపై ఒక దుండగుడు 11 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు బాధితుడని శుభమ్ గార్గ్గా గుర్తించారు. అతను సిడ్నీలోని న్యూ సౌత్వేల్స్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నట్లు తెలిపారు. అతని తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉంటారు. శుభమ్ ఐఐటీ మద్రాస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. గత నెల అక్టోబర్ 6న శుభమ్పై దాడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే నిందితుడు 23 ఏళ్ల వ్యక్తి అని, అతను ఆ రోజు శుభమ్ వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపారు. ఐతే శుభమ్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కత్తితో పలు చోట్ల దాడి చేసి పరారైనట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత శుభమ్ ఏదోరకంగా సమీపంలోని తన ఇంటికి వెళ్లి తదనంతరం ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. పోలీసులు సదరు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. భాదితుడి తండ్రి రమణివాస్ గార్గ్ తన కొడుకుకి పొత్తి కడుపులో సుమారు 11 గంటల ఆపరేషన్ జరిగినట్లు చెప్పారు. దయచేసి తన కొడుకు చికిత్సకు సాయం అందించమని, అలాగే తాము ఆస్ట్రేలియా వెళ్లేందుకు వీసా వచ్చేలా ఏర్పాటు చేయమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మేరకు బాధితుడి చెల్లెలు కావ్య గార్గే ట్విట్టర్లో..."సిడ్నీలో ఉన్న తన సోదరుడు శుభమ్ గార్గ్పై చాలా దారుణమైన దాడి జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని చూసేందుకు మా కుటుంబానికి అత్యవసర వీసా ఏర్పాటు చేసి సాయం అందించండి" అని ప్రధాని నరేంద్ర మోదీని, విదేశాంగ మంత్రి జై శంకర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని అభ్యర్థిస్తూ ట్వీట్ చేశారు. అంతేగాదు తన సోదరుడికి త్వరితగతిన సర్జరీలు చేయకపోతే ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పారని వాపోయింది. ఈ మేరకు సిడ్నీలోని భారత రాయబార కార్యాలయం బాధితునికి తగిన సాయం అందిస్తోంది. అంతేగాదు ఆస్ట్రేలియా హై కమిషన్ సదరు బాధిత కుటుంబ సభ్యునికి వీసా సౌకర్యం కల్పించనుందని హై కమిషన్ ప్రతినిధి తెలిపారు (చదవండి: మళ్లీ పేలిన తుపాకీ.. ఉత్తర కరొలినాలో కాల్పుల కలకలం) -
కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థి మృతి
టోరంటో: కెనడాలోని అంటారియా ప్రావిన్స్లో కాల్పుల కలకలం జరిగింది. ఈ ఘటనలో 28 ఏళ్ల భారతీయ విద్యార్థి, పోలీస్ కానిస్టేబుల్ తోపాటు మరోక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన భారతీయ విద్యార్థిని సత్వీందర్ సింగ్గా గుర్తించారు. అతను ఈ కాల్పుల సమయంలో ఆటో రిపేర్స్లో పార్ట్టైమ్గా పనిచేస్తున్నాడని తెలిపారు. అతను కెనడాలోని కోనెస్టాగా కాలేజీ విద్యార్థి అని చెబుతున్నారు. ఈ కాల్పుల్లో టొరంటో పోలీస్ కానిస్టేబుల్ ఆండ్రూ హాంగ్, ఆటో రిపేర్స్ యజమాని, మెకానిక్ షకీల్ అష్రఫ్ అక్కడికక్కడే మరణించారని చెప్పారు. ఐతే సత్వీందర్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 40 ఏళ్ల సీన్ పెట్రీగా గుర్తించి, అతనిపై కాల్పులు జరిపి హతమార్చినట్లు వెల్లడించారు. నిందితుడు ఒక అధికారి కోసం వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. (చదవండి: పుట్టిన రోజు నాడే విషాదం.. స్కూల్ బస్సులో చిన్నారి నిద్ర.. సిబ్బంది నిర్లక్ష్యంతో..) -
కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
వాషింగ్టన్: కెనడాలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి ఒకరు మృతి చెందారు. టొరంటో నగరంలోని సబ్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద గురువారం సాయంత్రం దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత్కు చెందిన కార్తీక్ వాసుదేవ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు, ప్రత్యక్ష సాక్షులు, సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాసుదేవ్ హత్యపై టోరంటోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ‘గురువారం టొరంటోలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ విద్యార్థి కార్తిక్ వాసుదేవ్ దురదృష్టవశాత్తు మృతి చెందాడు. అతని మరణం పట్ల మేము దిగ్భ్రాంతి చెందాం. మృతుడి కుటుంబంతో టచ్లో ఉన్నాం. మృతదేహాన్నిస్వదేశానికి తీసుకొచ్చేందుకు సాధ్యమైన సాయాన్ని అందిస్తాము’ అని ట్విట్టర్లో తెలిపింది. Grieved by this tragic incident. Deepest condolences to the family. https://t.co/guG7xMwEMt — Dr. S. Jaishankar (@DrSJaishankar) April 8, 2022 స్పందించిన విదేశాంగ మంత్రి కెనడాలో భారత విద్యార్థి మృతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అయితే వాసుదేవ్ స్థానిక సెనెకా కాలేజ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడని, సబ్వేలో ఉద్యోగానికి వెళ్తుండగా హత్య జరిగినట్లు అతని సోదరుడు తెలిపారు. కాగా వాసుదేవ్ ఈ జనవరిలోనే కెనడా వెళ్లాడు. -
నవీన్ మృతదేహం బెంగళూరుకి చేరనుంది: కర్ణాటక సీఎం
సాక్షి బెంగళూరు: ఉక్రెయిన్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి మృతదేహం ఆదివారం బెంగళూరుకు చేరుకుంటుందని కర్ణాటక సీఎం ట్విట్టర్లో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఆఖరి సంవత్సరం వైద్య విద్యార్థి నవీన్ జ్ఞానగౌడర్ మార్చి 1న షెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. నవీన్ కుటుంబ సభ్యులు అతడి డెడ్ బాడీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొడుకును కడసారి చూడాలని పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు కూడా. ఈ మేరకు నవీన్ తండ్రి కుమారుడి మృతదేహాన్నిఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించారు కూడా . ప్రభుత్వ కూడా వారికి హామీ ఇచ్చింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉక్రెయిన్లోని ఖార్కివ్లో షెల్లింగ్లో మరణించిన భారతీయ వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ భౌతికకాయం ఆదివారం బెంగళూరుకు చేరుకుంటుందని శుక్రవారం తెలిపారు. నవీన్ మృతదేహానికి ఎంబామ్ చేసి ఉక్రెయిన్లోని మార్చురీలో ఉంచినట్లు బొమ్మై గతంలోనే తెలియజేశారు. (చదవండి: బంగ్లాదేశ్లోని ఇస్కాన్ టెంపుల్పై 200 మంది మూకుమ్మడి దాడి) -
మళ్లీ ఉక్రెయిన్ వెళ్తా!
చిత్తూరు (బి.కొత్తకోట) : ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆగిపోయాక చదువుకునేందుకు మళ్లీ ఉక్రెయిన్ వెళ్తానని వైద్య విద్యార్థి చైతన్య అన్నాడు. స్థానిక శెట్టిపల్లెరోడ్డులో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణ కుమారుడు ఎస్.చైతన్య ఫిబ్రవరి 13న ఉక్రెయిన్ వెళ్లాడు. ఇవానో ఫ్రాక్విస్ మెడికల్ కళాశాలలో వైద్యవిద్య తొలి ఏడాది తరగతులకు హాజరయ్యేందుకు వెళ్లగా యుద్ధం కారణంగా రెండు వారాలకు శనివారం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇవానోలోని అపార్ట్మెంట్ ప్లాట్లో తోటి విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. గత శనివారం ఇవానో నుంచి బస్సులో రుమేనియా సరిహద్దుకు వెళ్లి, అక్కడి రాజధాని బుకారెస్ట్లోగడిపాక విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చి బి.కొత్తకోటకు చేరుకున్నాడు. చైతన్య మాట్లాడుతూ ఉక్రెయిన్లో వైద్యవిద్య చదివేందుకు తల్లిదండ్రులు రూ.9లక్షలకు పైగా ఫీజులు చెల్లించి పంపారు. వెళ్లిన పదిరోజులకే రష్యా సైనిక చర్య చేపట్టడం ఆందోళన కలిగించింది. ఇక్కడి మిత్రులతో కలిసి బయటపడేందుకు ప్రయత్నించి రొమెనియా చేరుకున్నాం. అమ్మానాన్న కూడా సురక్షితంగా ఇంటికి వచ్చేయమంటూ కోరారు. తానుంటున్న ఫ్లాం్లట్కు సమీపంలోనే బాంబులు పడ్డాయి. భయంతో వణికిపోయాం. తమ బాధను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ఎంపీ మిథున్రెడ్డి స్పందించి చర్యలు తీసుకున్నారు. వారందించిన సహకారానికి రుణపడి ఉంటాం. యుద్ధం ఆగిపోయాక మళ్లీ ఉక్రెయిన్ వెళ్లి వైద్యవిద్య చదువుకుంటా. -
నవీన్ మృతదేహం స్థలంలో 12 మంది రావొచ్చు
బెంగళూరు: ఉక్రెయిన్లో మృతిచెందిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ(22) మృతదేహం తరలింపుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవీన్ పార్థివదేహాన్ని తీసుకొచ్చేందుకు విమానంలో ఉపయోగించే స్థలంలో 10 నుంచి 12 మందిని కూర్చోబెట్టవచ్చని అన్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో బతికి ఉన్నవాళ్లను తీసుకురావడమే చాలా కష్టంగా మారగా మృతదేహాలను సొంత దేశాలకు తరలించడం మరింత కష్టమన్నారు. అయినప్పటికీ నవీన్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని వివరించారు. (చదవండి: జెలెన్స్కీ ఎక్కడ? ఆయన పై మూడు సార్లు హత్యాయత్నం) -
ఉక్రెయిన్లో భారత విద్యార్థి: ‘నేను చనిపోయాక విమానం పంపినా లాభంలేదు’
ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఆ దేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఉక్రెయిన్ నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటీవల దాడిలో ఓ విద్యార్థి మరణించిన సంగతి తెలిసిందే. గత వారం మరో విద్యార్థి హర్జోత్ సింగ్ కాల్పుల్లో గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నాక హర్జోత్ మాట్లాడుతూ.. అంబులెన్స్లో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు అతను గాయాలతో గంటల తరబడి రోడ్డుపైనే ఉన్నట్లు తెలిపాడు. తనపై దాడి జరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికి కూడా భారత రాయబార కార్యాలయం నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి సహాయం అందడంలేదని అవేదన వ్యక్తం చేశాడు. అంతేకాక తాను భారత ఎంబసీతో టచ్లో ఉన్నానని.. అయినా ప్రతిరోజు వాళ్లు ఏదో ఒకటి చేస్తామని మాటలు చెబుతున్నారు తప్ప చేతులు ఏంలేదని వాపోయాడు హర్జోత్ సింగ్. అదృష్టవశాత్తు దేవుడు తనకు రెండవ జీవితాన్ని ఇచ్చాడని, తాను చనిపోయిన తర్వాత విమానం పంపితే ఏం లాభం లేదని హర్జత్ తన అవేదనను వ్యక్తం చేశాడు. తనని ఉక్రెయిన్ నుంచి భారత్కు రప్పించాలని, వీల్ చైర్ వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు డాక్యుమెంటేషన్లో తనకు సహాయం చేయాలని రాయబార కార్యాలయాన్ని అభ్యర్థిస్తున్నట్లు” సింగ్ తన భావోద్వేగ విజ్ఞప్తిలో పేర్కొన్నాడు. ప్రతిరోజూ బాంబులు, కాల్పులు, క్షిపణుల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పారు. కాగా ఈ ఘటన ఫిబ్రవరి 27న జరిగింది. ఉక్రెయిన్లోని పరిస్థితుల దృష్ట్యా హర్జోత్ తిరిగి భారత్కు రావాలని నిర్ణయించుకుని ఒక క్యాబ్ని మాట్లాడుకొని ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో అతని కాల్పులు జరిగాయి. #WATCH "No support from the Indian embassy yet. I have been trying to get in touch with them, every day they say we will do something but no help yet," says Harjot Singh, an Indian who sustained multiple bullet injuries in war-torn Ukraine, receiving treatment at a Kyiv hospital pic.twitter.com/8oc9urO74s — ANI (@ANI) March 4, 2022 -
విమానంలో డెడ్ బాడీకి ఎక్కువ ప్లేస్ కావాలి.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: ఉక్రెయిన్లో ఆ దేశ సైనికులకు, రష్యా బలగాలకు మధ్య భీకరపోరు నడుస్తోంది. ఈ దాడుల్లో రెండు దేశాల సైనికులు, సామాన్య పౌరులు సైతం మృత్యువాత పడుతున్నారు. ఈ దాడుల్లో ఇటీవల కర్నాటకకు చెందిన నవీన్ శేఖరప్ప చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ కుటుంబ సభ్యులు అతడి డెడ్ బాడీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొడుకును కడసారి చూడాలని పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. విమానంలో మృతదేహాన్ని తరలిస్తే ఎక్కువ చోటు ఆక్రమిస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. హుబ్లీ-ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ మాట్లాడుతూ.. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు పయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే, యుద్దం జరుగుతున్న ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకువచ్చేందుకే పరిస్థితులు ఎంతో సవాల్తో కూడుకున్నాయని.. అలాంటిది చనిపోయిన వారిని తీసుకురావడం ఎంతో కష్టంతో కూడుకున్నదని వెల్లడించారు. ఈ క్రమంలోనే విమానంలో మృతదేహం ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దానికి బదులుగా ఆ ప్లేసులో 8-10 మంది కూర్చోవచ్చు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. నవీన్ డెడ్ బాడీని రెండు రోజుల్లో ఇంటికి తీసువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు నవీన్ తండ్రి జ్ఞానగౌడ్ తెలిపారు. తన కుమారుడి మృతదేహాన్నిఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా తాను ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించినట్లు ఆయన చెప్పారు. -
ఉక్రెయిన్లో భారత విద్యార్థిపై కాల్పులు.. పరిస్థితి విషమం!
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు యుద్ధ వాహనాలు, ట్యాంకర్ల ద్వారానే కాల్పులు జరిపిన రష్యా బలగాలు తాజాగా వైమానిక దాళాలతో దాడులను వేగవంతం చేశాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖర్కీవ్లో భయాంకర దాడులు జరుగుతున్నాయి. ఇరు దేశాల సైనికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్దభూమిలో పోరును కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు, విదేశీయులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో, భద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే తల దాచుకుంటున్నారు. మరోవైపు విద్యార్థుల తరలింపు కోసం మంత్రి వీకే సింగ్ పోలాండ్ వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కీవ్ నగరంలో భారత విద్యార్థిపై కాల్పులు జరిగినట్టు కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు. కీవ్లో రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థిపై ఫైరింగ్ జరిగినట్టు మంత్రి వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారని.. ప్రస్తుతం అతడికి వైద్య చికిత్సలు జరుగుతున్నట్టు చెప్పారు. మరోవైపు మంగళవారం రష్యా దాడుల్లో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో ఇంకా 1700 మంది భారతీయ విద్యార్థులు చిక్కున్నారని, వారిని భారత్కు తరలించేందుకు అన్ని ప్రయాత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా కారణంగా కేంద్రం అడ్వైజరీ జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు 17 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ను వదిలి స్వదేశానికి వచ్చారని స్పష్టం చేశారు. అయితే, భారత్ నుండి ఉక్రెయిన్లో దాదాపు 20 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. -
ఇప్పుడు గులాబీ ఇచ్చి ఏం లాభం.. కేంద్రంపై భారత విద్యార్థి తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో ఇప్పటి వరకు 18 వేల మంది భారత్కు తిరిగొచ్చినట్లు కేంద్ర విదేశాగశాఖ వెల్లడించింది. గురువారం 17 విమానాల్లో 3,726 మంది స్వదేశానికి వస్తున్నట్టు పేర్కొంది. గత 24 గంటల్లో 3 వేల మంది భారతీయులు 15 విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి వచ్చారని తెలిపారు. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో 30 విమనాల ద్వారా 6,400 మందిని ఇండియాకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే భారత్కు చేరిన విద్యార్థులను కేంద్ర మంత్రులు, అధికారులు స్వయంగా విమనాశ్రయానికి వెళ్లి స్వాగతం పలుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ నుంచి భారత్కు తిరిగొచ్చిన ఓ విద్యార్థి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యుద్ధ వాతావరణం నుంచి పౌరులను రక్షించేందుకు సరైన సమయంలో చర్యలు చేపట్టనప్పుడు.. గులాబీలు అందించడం అర్థరహితమని కొట్టిపారేశాడు. బిహార్లోని మోతీహరి ప్రాంతానికి చెందిన దివ్యాన్షు సింగ్ అనే విద్యార్థి ఉక్రెయిన్లోయుద్దం మొదలైన తరువాత హంగేరి మీదుగా గురువారం మధ్యాహ్నానికి ప్రత్యేక విమానంలో ఇండియా చేరాడు. అయితే ఢిల్లీ విమానాశ్రంలో దిగిన తరువాత అతనికి గులాబీ అందించి అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా.. మీకు భారత ఎంబసీ ఏ విధంగా సహకరించిందని ప్రశ్నించగా.. దివ్యాన్షు ఘాటుగా బదులిచ్చాడు. చదవండి: Viral Video: ఉక్రెయిన్లో ఘోరం..? ఆకలికి తాళలేక గడ్డితింటున్న బాలుడు? ‘క్రెయిన్ సరిహద్దు దాటి హంగేరిలోకి అడుగుపెట్టిన తర్వాతే మాకు సాయం లంభించింది. అంతకు ముందు ఎలాంటి సహాయం లేదు.. మేము అన్నీ ఏర్పాటు మా సొంతంగానే చేసుకున్నాం.. పది మంది కలిసి ఓ గ్రూప్గా ఏర్పడి రైలు ఎక్కాం.. ఆ రైలు కూడా కిక్కిరిసిపోయింది. కానీ స్థానికులు మాకు చాలా సహాయం చేశారు. మా పట్ల ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదు.. అయితే పోలెండ్ సరిహద్దుల్లో కొంత మంది విద్యార్థులు వేధింపులు ఎదుర్కొన్నది నిజమే. దీనికి మన ప్రభుత్వానిదే బాధ్యత.. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవాళ్లం కాదు’ అని దివాన్షు సింగ్ తెలిపారు. ఇక తన చేతిలో ఉన్న గులాబీని పట్టుకుని ‘‘ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు గులాబీ ఇచ్చారు.. దీని అర్థం ఏమిటి? దీనితో మనం ఏమి చేస్తాం? అక్కడ మాకు ఏదైనా జరిగితే మా కుటుంబాలు ఏం చేస్తాయి.. సరైన సమయంలో స్పందించి ఇతర దేశాలను అనుసరించి రోడ్మ్యాప్ రూపొందించి ఉంటే ఇన్ని ఆటంకాలు ఉండేవి కావు’ అని పేర్కొన్నారు. సరైన సమయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం పూలు అందజేసే అవసరం ఉండేది కాదు అని దివ్యాన్షు వెల్లడించారు. చదవండి: ఉక్రెయిన్కు పెరిగిపోతున్న మద్దతు, రష్యాకు కోలుకోలేని దెబ్బ!! -
కొడుకు డాక్టర్గా వస్తాడని అనుకున్నారు.. కానీ..
శివాజీనగర: తనయుడు డాక్టర్ అయి తిరిగి వస్తాడని అనుకుంటే విగతజీవిగా మారడంతో కుటుంబం తల్లిడిల్లిపోతోంది. కడసారి చూడాలని తపిస్తోంది. ఉక్రెయిన్లో క్షిపణి దాడిలో మరణించిన హావేరి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ గ్యానగౌడర్ (22) కుటుంబానికి వెల్లువలా పరామర్శించారు. బుధవారం రాణి బెన్నూరు తాలూకా చళగేరి గ్రామంలో ఉన్న నవీన్ ఇంట్లో విషాద మౌనం ఆవరించింది. కుమారుడిని కోల్పోయి దిక్కు తోచక తండ్రి శేఖరగౌడ కూర్చొన్నారు. బంధుమిత్రులు పెద్దసంఖ్యలో ఇంటికి చేరుకొన్నారు. ఇంటి ముందు నవీన్ ఫోటోను ఏర్పాటు చేయగా ప్రజలు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఇతర విద్యార్థులనైనా కాపాడండి: తండ్రి.. తండ్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ, ప్రముఖులు తనతో మాట్లాడారని, తన కొడుకు ప్రాణాలతో రాలేదు, కనీసం ఇతర విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని తాను మోదీని వేడుకొన్నట్లు చెప్పారు. మరణానికి ముందు తన కుమారుడు ఫోన్లో మాట్లాడేవాడని బంకర్లో ఉండడం కష్టం, బయటికి వచ్చినా కష్టమని చెప్పాడని, యుద్ధం జరగదని, ధైర్యంగా ఉండాలని కాలేజీవారు భరోసా ఇచ్చారన్నారు. ఇక్కడి రాజకీయం, రిజర్వేషన్, విద్యా విధానాలు సరిగా లేక తమ కుమారుడు ఉక్రెయిన్కు వెళ్లాల్సి వచ్చిందని విలపించారు. భోజనాలకు తన వద్ద డబ్బు లేదు. డబ్బు వేయాలని కోరాడు, అదే ఆఖరి మాటైందని స్నేహితుడు శ్రీకాంత్ ఓ టీవీ చానల్కు తెలిపారు. భౌతికకాయం తరలింపునకు చర్యలు: సీఎం.. ప్రస్తుతం ఖార్కివ్ నగరంలో నవీన్ మృతదేహం ఉండగా, అక్కడ నుండి విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ కుటుంబానికి పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై చెప్పారు. భౌతికకాయాన్ని తీసుకురావడం ప్రథమ కర్తవ్యమని అన్నారు. కాగా మిగిలిన కన్నడిగులను వేగంగా వెనక్కి రప్పిస్తామని చెప్పారు. నా సోదరుడు రావడం లేదు.. సమాజానికి ఏదో ఒకటి చేయాలని తన తమ్ముడు కలలు కన్నాడని, అతని వెంట వెళ్లినవారంతా వెనుతిరిగి ప్రాణాలతో వస్తున్నారు. అయితే తన తమ్ముడు రావడం లేదని మృతుడు నవీన్ సోదరుడు హర్ష రోదించారు. పేదల కలలపై నీట్ పిడుగు: కుమార పేద, మధ్యతరగతి వర్గాల మెడిసిన్ కలను నీట్ భగ్నం చేస్తోందని, ఇదే విద్యార్థుల, తల్లిదండ్రుల పాలిట మరణశాసనమైనదని మాజీ సీఎం హెచ్.డీ.కుమారస్వామి ధ్వజమెత్తారు. ఉన్నత విద్యను సంపన్నులకు రిజర్వు చేసి పేదలకు వట్టి చేయి చూపుతున్నారని నవీన్ మరణాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై మండిపడ్డారు. -
ఉక్రెయిన్లో మరో భారత విద్యార్థి మృతి
ఉక్రెయిన్ సంక్షోభం మరింత తీవ్రతరం కావడంతో అక్కడ ఉన్న భారతీయులను తరలింపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అయితే దురదృష్టవశాత్తు మంగళవారం ఖార్కివ్లో రష్యన్ షెల్లింగ్లో మెడిసిన్ విద్యార్థి నవీన్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల ప్రకారం.. 21 ఏళ్ల చందన్ జిందాల్ ఉక్రెయిన్లోని విన్నిట్సియాలో నాలుగేళ్లుగా చదువుతున్నాడు. అతను పంజాబ్లోని బుర్నాలాకు చెందినవాడు. అయితే ఇసెమిక్ స్ట్రోక్తో బాధపడుతోన్న చందన్ జిందాల్ను ఫిబ్రవరి 2న వినిట్సియాలోని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో భారత్లో ఉంటున్న చందన్ తల్లిదండ్రులు ఫిబ్రవరి 7న ఉక్రెయిన్ చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చందన్కు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆరోగ్యం క్షీణించిన కారణంగా చందన్ మరణించినట్లు మంగళవారం వైద్య అధికారలు తెలిపారు. (చదవండి: Russia-Ukraine War: రష్యాకు సపోర్ట్.. బెలారస్కు బిగ్ షాక్ ) -
అలా వెళ్లి ఉండకపోతే.. నవీన్ సజీవంగా ఉండేవాడేమో!
Indian Student Dies In Russia Attack: ఉక్రెయిన్పై రష్యా బలగాల దాడుల్లో ఉక్రెయిన్ సైన్యం మాత్రమే కాదు.. సాధారణ పౌరులూ ప్రాణాలు విడుస్తున్నారు. మంగళవారం రష్యా బలగాల దాడుల్లో భారతీయ విద్యార్థి నవీన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాద వార్తతో మిగతా తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది. ఉక్రెయిన్లోని ఖర్కీవ్లో ఉంటూ మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్నాడు నవీన్ శేఖరప్ప. నవీన్ స్వస్థలం కర్ణాటకలోని హవేరి జిల్లా చలగేరి. అయితే మంగళవారం రష్యాబలగాల దాడుల్లో అతను దుర్మరణం పాలయ్యాడు. ఇదిలా ఉంటే నవీన్ మృతిపై రెండు వేర్వేరు కథనాలు వినిపిస్తున్నాయి. బంకర్లో(సురక్షిత ప్రాంతం)లో తలదాచుకున్న నవీన్.. తినడానికి, తాగడానికి ఏం లేకపోవడంతో బయటకు వచ్చాడని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రష్యన్ బలగాల కాల్పుల్లో తూటాలకు నవీన్ బలైనట్లు అతని దగ్గరి బంధువు ఉజ్జనగౌడ చెప్తున్నారు. గ్రాసరీ స్టోర్ బయట క్యూలో నిల్చున్న నవీన్ శేఖరప్పను.. రష్యా సైనికులు కాల్చి చంపేశారని, ఆరోజు ఉదయం తాను నవీన్ను ఆఖరిసారిగా చూశానని ఉజ్జనగౌడ అంటున్నారు. అయితే గ్రాసరీ స్టోర్ బయట క్యూలో నిలబడి ఉండగా.. మిస్సైల్ దాడి జరిగిందని, ఈ దాడిలోనే నవీన్ మృతి చెందినట్లు ఖార్కివ్లోని స్టూడెంట్ కోఆర్డినేటర్ పూజా ప్రహరాజ్ చెప్తున్నారు. ఖార్వివ్లోని గవర్నర్ హౌస్ సమీపంలో ఉంటున్న నవీన్.. ఆహారం కోసం ఓ స్టోర్ బయట క్యూలో నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా గవర్నర్ హౌస్ను రష్యా బలగాలు బాంబులతో పేల్చివేశాయని, దీంతో సమీపంలో ఉన్న నవీన్ మృతి చెందినట్లు పూజా ప్రహరాజ్ ఫోన్ ద్వారా తెలియజేశారు. సామాగ్రి కోసం నవీన్ ఒక్కడే బయటకు వెళ్లాడు. హాస్టల్లో ఉంటున్న అందరికీ మేమే వసతులు కల్పించాం. కానీ, నవీన్ మాత్రం గవర్నర్ హౌజ్ను ఆనుకుని ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అందుకే సకాలంలో అందించలేకపోయాం. కాసేపు ఆగి ఉంటే అతనికి ఆహారం అందించి ఉండేదే. అయితే బయటకు వెళ్లిన చాలాసేపటికి నవీన్ తిరిగి రాకపోవడంతో అతని ఫోన్ను కాల్ చేశామని, ఒక ఉక్రేనియన్ మహిళ నవీన్ ఫోన్ లిఫ్ట్చేసి ‘ఈ ఫోన్కు సంబంధించిన వ్యక్తి మృతి చెందాడు’ అని తెలిపినట్లు పూజా ప్రహరాజ్ వెల్లడించారు. నవీవ్ కాల్పులు జరపడం వల్ల మృతి చెందాడా? లేదా మిస్సైల్ దాడిలో మరణించడా? అనే దానిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ.. అతనికి ఆహారం అంది ఉన్నా.. నవీన్ ఒంటరిగా అలా బయటకు వెళ్లి ఉండకపోయినా సజీవంగా ఉండేవాడేమోనని అధికారులు అంటున్నారు. తండ్రి చివరి సలహ ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ ఉద్రిక్తతల సమయం నుంచి కుటుంబంతో రోజూ నవీన్ ఫోన్లో మాట్లాడుతూనే వస్తున్నాడు. యుద్ధం మొదలయ్యాక.. కంగారుపడ్డ అతని కుటుంబ సభ్యులు ఎలాగైనా అక్కడి నుంచి బయటపడమని నవీన్తో చెప్పారు. అయితే పరిస్థితులు అనుకూలంగా లేవని నవీన్ వాళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో భారతీయ జెండాను బిల్డింగ్పై ఉంచమని నవీన్ తండ్రి సూచించాడట. మృతదేహం అప్పగింతపై! ఇక నవీన్ మృతదేహం అప్పగింతపై నీలినీడలు అలుముకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ భౌతిక కాయాన్ని తరలించడం కష్టమని ఉక్రెయిన్ అధికారులు.. భారత రాయబార అధికారులతో చెప్పినట్లు సమాచారం. మరోవైపు నవీన్ మృతదేహాన్ని ఎలాగైనా కుటుంబ సభ్యులకు అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. చదవండి: రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి -
ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఓ భారతీయ విద్యార్ధి మృతి
-
ఉక్రెయిన్ పెయిన్: రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి
ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఆరో రోజు కూడా భీకరంగానే కొనసాగుతోంది. ఇప్పటికే కీవ్ ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి సరిహద్దు దేశాలకు వెళ్లిపోయారు. ఇక ఉక్రెయిన్లో ఉన్న భారత విద్యార్థులను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నంలో కేంద్రం నిమగ్నమైన సంగతి తెలిసిందే. అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక అక్కడే ఉన్న భారత విద్యార్థులు బంకర్లో తలదాచుకుంటు బిక్కు బిక్కుమంటు కాలం గడుపుతున్నారు. మంగళవారం ఖార్కీవ్లో రష్యన్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. కర్నాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్గా అధికారులు గుర్తించారు. ఉదయం ఖర్కీవ్లో జరిగిన దాడిలో చనిపోయినట్లు స్థానికి మీడియా ప్రకటించింది. విద్యార్థి మృతిని విదేశీ వ్యవహారాలశాఖ ధృవీకరించింది. ఈ ఘటనతో ఉక్రెయిన్లో ఉంటున్న మిగిలిన భారత విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థి మృతి గురించి కేంద్ర విదేశాంగ శాఖ తెలియజేశామని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని భారత విదేశాంగ అధికార ప్రతినిధి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్లోని ఖార్కివ్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు. ఖార్కివ్ కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి చెందిన వార్త తెలియగానే నవీన్ కుటుంబసభ్యులతో ప్రధాని మోదీ మాట్లాడారు. With profound sorrow we confirm that an Indian student lost his life in shelling in Kharkiv this morning. The Ministry is in touch with his family. We convey our deepest condolences to the family. — Arindam Bagchi (@MEAIndia) March 1, 2022 -
Ukraini Russia War: జై హింద్.. జై భారత్.. ప్లీజ్ హెల్ప్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. తమను కాపాడమంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. సహాయం చేయాలంటూ ఓ విద్యార్థిని వేడకుంటున్న వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్లో షేర్ చేశారు. భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దయచేసి తమను రక్షించాలని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన గరిమా మిశ్రా అనే యువతి వీడియోలో వేడుకున్నారు. ఉక్రెయిన్లో ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదని వాపోయింది. అనుక్షణం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని కన్నీటి పర్యంతమైంది. తమకు ఎవరూ సహాయం చేయడం లేదని, రాయబార కార్యాలయానికి ఫోన్ చేసినా స్పందన లేదని వాపోయింది. …@narendramodi जी, @DrSJaishankar जी यूक्रेन से आ रहे भारतीय छात्र-छात्राओं के वीडियो मन को बहुत ही ज्यादा व्यथित करने वाले हैं। इन बच्चों को भारत वापस लाने के लिए जो कुछ भी बन पड़ता है , भगवान के लिए, वह करिए। पूरा देश इन छात्र-छात्राओं और इनके परिवारों के साथ है।...1/2 pic.twitter.com/PfmBw8McLY — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 27, 2022 ‘సరిహద్దుకు బస్సులో వెళ్లిన మా స్నేహితులను రష్యా సైనికులు అడ్డుకున్నారని మాతో చెప్పారు. విద్యార్థులపై కాల్పులు జరిపి బాలికలను ఎత్తుకెళ్లారు. అబ్బాయిలు ఏమయ్యారో మాకు తెలియదు. మాకు సాయం చేయడానికి భారత సైన్యాన్ని పంపిండి. దయచేసి మాకు సహాయం చెయ్యండి. జై హింద్! జై భారత్! మాకు సహాయం అందేలా చేసేందుకు ఈ వీడియోను దయచేసి షేర్ చేయండి’ అంటూ గరిమా మిశ్రా ముకుళిత హస్తాలతో వేడుకున్నారు. (క్లిక్: రష్యాతో చర్చల వేళ.. ఈయూ ఎదుట జెలెన్ స్కీ కీలక డిమాండ్) కాగా, ప్రత్యేక విమానాల ద్వారా భారత విద్యార్థుల తరలింపు కొనసాగుతోంది. తాజాగా హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మంది భారత పౌరులతో బయలుదేరిన విమానం సోమవారం ఢిల్లీ చేరుకుంది. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.. విమానాశ్రయంలో భారతీయులకు స్వాగతం పలికారు. (క్లిక్: ఉక్రెయిన్ ప్రెసిడెంట్పై సమంత పోస్టు.. ఏమందంటే?) -
‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’
లండన్: ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’ టాప్–10 ఫైనలిస్టుల జాబితాలో భారత విద్యార్థిని సీమా కుమారి(18)కి చోటు లభించింది. విజేతకు లక్ష డాలర్ల నగదు బహుమతి లభించనుంది. ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపిన వారిని గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్తో సత్కరిస్తారు. చెగ్.ఓఆర్టీ వెబ్సైట్ వివిధ దశల్లో వడపోత అనంతరం తుది విజేతను నవంబర్ 10న ప్రకటించనున్నారు. భారత్లోని జార్ఖండ్కు చెందిన సీమా కుమారి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతోంది. జార్ఖండ్లోని ఆమె స్వగ్రామంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే తలపెట్టిన వివాహాన్ని ధైర్యంగా ఎదిరించి, చదువుపై ఆసక్తితో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ‘యువ’ అనే మహిళా సాధికారత సంఘం ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో హార్వర్డ్ యూనివర్సిటీలో చేరింది. టాప్–10 ఫైనలిస్టుల్లో తన పేరు ఉండడం పట్ల సీమా కుమారి ఆనందం వ్యక్తం చేసింది. -
కొడుకు ఆత్మహత్య.. వెళ్లలేని స్థితిలో తల్లిదండ్రులు
లండన్ : ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్కి వెళ్లిన భారత విద్యార్థి అక్కడ ఆత్మహత్యకి పాల్పడడంతో ఇక్కడ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. లాక్డౌన్ కారణంగా అక్కడికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారు.. తమ కుమారుడి మృతదేహాన్ని భారత్కు పంపించాలని ఇంగ్లండ్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు. పుణెకు చెందిన సిద్ధార్థ్ ముర్కుంబి అనే 23 ఏండ్ల యువకుడు సెంట్రల్ లాంక్షైర్ యూనివర్శిటీలో మార్కెటింగ్ కోర్సు చదువుతున్నాడు. మార్చి 15న యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం ఓ నది ఒడ్డున సిద్ధార్థ్ మృత దేహం లభించింది. గత నెల మిస్సయిన సిద్ధార్థ్ ఇప్పుడు నది ఒడ్డున విగతజీవిగా కనిపించడంతో.. అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఇంగ్లండ్ పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి : కోవిడ్: విషమంగా బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం) కాగా, దేశంకాని దేశంలో ఉన్నత చదువు కోసం వెళ్లిన కొడుకు మృతి చెందడం, కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేకపోవడం పుణేలో ఉన్న సిద్ధార్థ్ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని భారత్కు పంపించాలని సిద్ధార్థ్ తండ్రి శంకర్ ముర్కుంబి ఇంగ్లండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
దుబాయ్లో భారతీయ విద్యార్థికి కరోనా
దుబాయ్: దుబాయ్లోని ఒక భారతీయ విద్యార్థి (16)కి కోవిడ్ -19 (కరోనా వైరస్) సోకినట్టు నిర్ధారణ అయింది. విదేశాలకు వెళ్ళిన విద్యార్థి తల్లిదండ్రుల నుంచి అతనికి ఇన్ఫెక్షన్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ) ను ఉటంకిస్తూ పేర్కొంది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొత్తం కరోనా బాధిత కేసుల సంఖ్య 27 కి చేరిందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. విదేశాలకు వెళ్లిన దుబాయ్కు తిరిగి వచ్చిన ఐదు రోజుల తరువాత బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కరోనా వైరస్ లక్షణాలతో బాధడ్డారు. దీంతో మొత్తం కుటుంబాన్ని క్వారంటైన్ చేసిన ఆరోగ్య అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో విద్యార్థికి పాజిటివ్ రాగా, మిగిలి కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా గురువారం నుంచి స్కూలు మూసివేస్తున్నట్టు ఇండియన్ హై గ్రూప్ ఆఫ్ స్కూ ప్రకటించింది. పాఠశాల విద్యార్థులు, సిబ్బందికి డిహెచ్ఎ అధికారులు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
అమెరికాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
మైసూరు : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మైసూరు యువకుడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. గురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైసూరులోని కువెంపు నగర్కు చెందిన అభిషేక్ సుధేశ్ భట్ (25) ఇంజనీరింగ్ పూర్తిచేసి ఏడాదిన్నర క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. శాన్ బెర్నార్డియాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఓ హోటల్లో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హోటల్కు వచ్చిన ఓ దుండగుడు అభిషేక్తో గొడవపడి, తుపాకితో కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్ర గాయాలతో అభిషేక్ అక్కడిక్కడే మృతి చెందాడు. -
అమెరికా వర్సిటీల్లో చైనా, భారత్ల హవా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గరిష్ట స్థాయిలో నమోదైంది. ఇది ఆల్టైమ్ రికార్డని అమెరికా ప్రక టించింది. ఈ ఏడాది చేరిన 10,95,299 మంది విదేశీ విద్యార్థుల్లో చైనా, భారత్లదే అగ్రస్థానం. మొత్తం విద్యార్థుల్లో ఈ రెండు దేశాలకు చెందిన వారే 52.18 శాతం మేర ఉన్నారు. తరువాత స్థానాల్లో దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కె నడా ఉన్నాయి. మొత్తం 10,95,299 మంది అంతర్జాతీయ విద్యార్థులు 2019 లో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరారు. వారిలో 5,71,562 మంది చైనా, భారత్ విద్యార్థులు. ఆ తరువాత అధిక సంఖ్యలో విద్యార్థులు కలిగి ఉన్న దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా వి ద్యార్థులను కూడా కలుపుకుంటే టాప్ 5 దేశాలకు చెందిన విద్యార్థులు 62.72 శాతం మంది అయ్యారు. మిగిలిన దేశాలకు చెందిన విద్యార్థులు 4,08,285 మంది ఉండగా మొత్తం విద్యార్థుల్లో వా రిది 37.26 శాతం. యూరప్ దేశాల నుంచి గరిష్టంగా 1.5 శాతం మంది, కనిష్టంగా 0.75 శాతం మంది విద్యార్థులుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తా న్, మలేసియా, హాంకాంగ్ నుంచి 1.5 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారు కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థులు సైతం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. -
‘సీనియర్స్’ కోసం..
రోబో నడిపిస్తుంది.. ఒకప్పుడు వృద్ధులకు ఊతకర్రలే సాయంగా ఉండేవి. ఇప్పుడు వృద్ధుల కోసం ఆధునిక టెక్నాలజీతో ఒక రోబోటిక్ కర్ర అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన భారతీయుడు సునీల్ అగర్వాల్ నేతృత్వం లోని ఓ బృందం ఈ రోబో కర్ర తయారు చేసింది. ఈ రోబోటిక్ కేన్ ద్వారా వృద్ధులు సునాయాసంగా నడక సాగించే వీలు కలుగుతుంది. ఈ కేన్ను పట్టుకుని నడిస్తే.. వారు ఎలా అడుగులు వేస్తున్నారు..ఒక్కో అడుగు వేసేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారు.. వంటి విషయాలను దీనిలోని సెన్సర్లు అంచనా వేస్తాయి. తర్వాత దానంతట అదే ఆ కర్ర కదులుతుంది.మొబైల్ రోబోకు ఇది అనుసంధానంగా పనిచేస్తుందని అగర్వాల్ పేర్కొన్నారు. దీన్ని పట్టుకుని నడిస్తే పక్కన ఓ వ్యక్తి ఉండి వారిని నడిపించినట్లే ఉంటుందని చెప్పారు. ఈ యాప్ చెప్పేస్తుంది.. ఒంటరిగా ఉండే వృద్ధులను అనుక్షణం గమనిస్తుండాలి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. దీని కోసం ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన విద్యార్థులు ఛ్చిట్ఛ4u అనే మొబైల్ యాప్ రూపొందించారు. వృద్ధులకు ఇది సంరక్షకురాలిగా పనిచేస్తుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇంట్లో ఉన్న వృద్ధులు, వారి పిల్లల ఫోన్లలో దీన్ని ఇన్స్టాల్ చేస్తే చాలు చాలా పనులు చేసేస్తుంది. దీని ద్వారా చాటింగ్, కాల్స్ చేయొచ్చు. క్యాబ్లు బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో ఒకసారి ఫీడ్ చేస్తే చాలు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది. వారు ఎప్పుడైనా కిందపడితే వెంటనే దానికి అనుసంధానం చేసిన వారి నంబర్కు ఆటోమేటిక్గా కాల్ వెళ్తుంది. వృద్ధులు ఉన్న లొకేషన్ షేర్ చేస్తుంది. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఇది పనిచేసేలా డిజైన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వారు 5.8 కోట్లు. అంటే ప్రతి సెకనుకు ఇద్దరు వ్యక్తులకు 60 ఏళ్లు నిండుతున్నాయి. చైనా తర్వాత అత్యధిక మంది వృద్ధులు ఉన్న దేశం మనదే. 2050 నాటికి ప్రపంచంలో 15 ఏళ్ల పిల్లలకన్నా వృద్ధులే అధికంగా ఉంటారట. మన దేశంలో 2026 నాటికి వృద్ధుల జనాభా 17.3 కోట్లకు పెరగనుంది. భారత్లో కేరళలో వయోధికులు 12.6 శాతం మంది ఉన్నారు. గోవాలో 11.2 శాతం, తమిళనాడులో 10.4 శాతం, పంజాబ్లో 10.3 శాతం, హిమాచల్ ప్రదేశ్లో 10.2 శాతం ఉన్నారు. అతి తక్కువ మంది వృద్ధులున్న రాష్ట్రాల్లో అరుణాచల్ప్రదేశ్ తొలిస్థానంలో ఉంది. ఇక్కడ 4.6 శాతం మంది ఉన్నారు. మేఘాలయలో 4.7 శాతం. నాగాలాండ్లో 5.2 శాతం. మిజోరంలో 6.3 శాతం.. సిక్కింలో 6.7 శాతం మంది వృద్ధులు ఉన్నారు. (నేడు సీనియర్ సిటిజన్ డే) -
‘ఎలా ఉన్నారు టిమ్ యాపిల్’
వాషింగ్టన్ : జీవితంలో మనం కలవాలనుకున్న ముఖ్యమైన వ్యక్తిని నిజంగా కలిసినప్పుడు ఆనందంతో మాటలు రావు. ఒక వేళ మాట్లాడిన ఆ ఉద్వేగంలో ఏం మాట్లాడతామో మనకే తెలీదు. ఇదే పరిస్థితి ఢిల్లీకి చెందిన పలాశ్ తనేజా అనే కుర్రాడికి ఎదురయ్యింది. ఆ సమయంలో అతడు ఏం చేశాడో ఆ వివరాలు.. యాపిల్ సీఈవో టిమ్ కుక్ను కలవాలనేది పలాశ్ చిరకాల కోరిక. కొన్ని రోజుల క్రితం ఆ కల నిజమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఓ 13 మంది విద్యార్థులను టిమ్ కుక్ ఆహ్వానించారు. వీరిలో పలాశ్ కూడా ఉన్నాడు. ఈ విద్యార్థులతో పాటు యాపిల్ సిబ్బంది కుక్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కుక్ రానే వచ్చారు. అప్పుడు పలాశ్ యాపిల్ సీఈవోను ఉద్దేశిస్తూ.. ‘టిమ్ యాపిల్.. ఎలా ఉన్నారు’ అని ప్రశ్నించాడు. పలాశ్ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కంటే ముందు టిమ్ కుక్తో సహా అక్కడున్న సభ్యులంతా ఒక్క సారిగా నవ్వారు. ఆ తర్వాత కుక్ ‘నేను బాగున్నాను. నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడిగావో నేను అర్థం చేసుకోగలను’ అంటూ చిరునవ్వుతో ముందుకు సాగారు. ఇంతకు ఇక్కడ విషయం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో టిమ్ కుక్తో సమావేశమయ్యారు. ట్రంప్ది అసలే హాఫ్ మైండ్ కదా. దాంతో యాపిల్ సీఈవో టిమ్ కుక్ను కాస్తా టిమ్ యాపిల్గా సంభోందించారు. టిమ్ ఇంటి పేరును.. కంపెనీ లోగోను కలిపి ఇలా పిల్చారన్నమాట. ఈ ప్రయోగం ఏదో బాగుందని భావించిన కుక్ ఆ రోజు నుంచి తన ట్విటర్ పేరును కాస్తా టిమ్ యాపిల్గా మార్చుకున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పలాశ్ టిమ్ కుక్ను.. టిమ్ యాపిల్గా సంభోదించడం.. దానికి కుక్ నవ్వడం జరిగాయి. ఇక పలాశ్ విషయానికోస్తే.. ఎనిమిదో తరగతి నుంచే అతను కోడింగ్ మీద ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ ఆసక్తే అతనికి టిమ్తో సమావేశమయ్యే అవకాశం కల్పించింది. భారత్ను నుంచి కేవలం పలాశ్కు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఈ సమావేశంలో అతను అతడు కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ ఆధారిత ప్రాజెక్టులను తయారు చేసి టిమ్కు చూపించారు. ప్రస్తుతం పాఠశాల విద్య పూర్తి చేసిన పలాశ్(18) యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో చేరనున్నాడు. -
తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు!
న్యూయార్క్: కళాశాలకు చెందిన కంప్యూటర్లకు భారీగా నష్టం కల్గించినందుకు తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) స్టూడెంట్ వీసాపై 2015లో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలో సెయింట్ రోజ్ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో ‘యూఎస్బీ కిల్లర్’ అనే పెన్డ్రైవ్ సాయంతో కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేశాడు. ఈ పనిని మొబైల్లో షూట్చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నార్త్ కరోలినా పోలీసులు విశ్వనాథ్ను అరెస్ట్చేశారు. కావాలనే ఈ పనికి పూనుకున్నట్లు ఒప్పుకున్న అతడు జరిగిన నష్టం రూ.40 లక్షలు చెల్లించేందుకు కూడా అంగీకరించాడు. ఆగస్టులో కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. -
డల్లాస్లో జరిగిన ప్రమాదంలో భారత విద్యార్థి మృతి
డల్లాస్: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఓ భారత విద్యార్థి అక్కడ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. కేరళకు చెందిన 23 ఏళ్ల లింటో ఫిలిప్ నాలుగు నెలల కిందట మాస్టర్స్ కోసం డల్లాస్ వెళ్లాడు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు సుసాన్ ఫిలిప్, పీఎం ఫిలిప్ దుబాయ్లో నివాసం ఉంటున్నారు. డల్లాస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో మాస్టర్స్ చేస్తున్న లింటో శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి సాహసోపేతమైన కయాకింగ్ ట్రిప్కు వెళ్లాడు. కయాకింగ్ అనేది నీటిలో ఒక చిన్న పడవపై చేసే ప్రయాణం. లేక్ రే హుబ్బార్డ్లో లింటో కయాకింగ్ చేస్తుండగా.. జలల ప్రవాహం అధికంగా ఉండటంతో అతని కయాక్ తిరగబడిందని డల్లాస్ పోలీసులు తెలిపారు. దీంతో లింటో నీళ్లలో కొట్టుకుపోయాడని వెల్లడించారు. గల్లంతయిన అతడి మృతదేహాన్ని గుర్తించిన రెస్యూ సిబ్బంది పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. -
సెల్ఫీ తీసుకుంటూ భారత విద్యార్థి మృతి
లండన్: ఐర్లాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మొహెర్ కొండ అంచుల్లో సెల్ఫోన్తో సెల్ఫీ తీసుకుంటూ జారిపడి భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బాధితుడు డబ్లిన్లో చదువుకుంటున్న ఓ భారత సంతతి విద్యార్థి అని మాత్రమే తెలిసిందని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ విద్యార్థి ఎత్తైన మొహెర్ కొండ అంచులకు చేరుకుని, తన మొబైల్తో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా కాలు జారి పట్టుతప్పి కిందపడిపోయాడు. తోటి పర్యాటకుల హెచ్చరికలతో రంగంలోకి దిగిన పోలీసులు హెలికాప్టర్ సాయంతో అతడిని గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భారత్లో ఉన్న అతడి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
13 ఏళ్లకే సాఫ్ట్వేర్ కంపెనీ
దుబాయ్: 9 ఏళ్లకే మొబైల్ యాప్ను అభివృద్ధి చేసిన భారతీయ బాలుడు ఇప్పుడు 13 ఏళ్లకే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని దుబాయ్లో స్థాపించాడు. కేరళకు చెందిన ఆదిత్యన్ రాజేశ్ ఐదేళ్లకే కంప్యూటర్ వాడటం ప్రారంభించాడు. ఈ బుడతడు ఇప్పటికే పలు కంపెనీలకు వెబ్సైట్లు, లోగో లు రూపొందిస్తున్నాడు. ఆదిత్యన్ కేరళలోనే పుట్టినా తన తల్లిదండ్రుల తో కలిసి 8 ఏళ్ల క్రితం నుంచి దుబాయ్లో ఉంటున్నాడు. తాజాగా అతను ట్రైనెట్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని అక్కడే స్థాపించాడు. ప్రస్తుతానికి ఇందులో ముగ్గురు ఉద్యోగులుండగా వారంతా ఆదిత్యన్ సహ విద్యార్థులు, స్నేహితులే. కంపెనీకి యజమాని అవ్వాలంటే 18 ఏళ్ల కనీస వయసు ఉండాలనీ, అయితే ట్రైనెట్ సొల్యూషన్స్ కూడా కంపెనీలాగే పనిచేస్తుందనీ, ఇప్పటికే 12 మంది క్లైంట్లకు ఉచితంగా సేవలందించామని ఆదిత్యన్ తెలిపాడు. -
ఇకపై పార్కింగ్ సమస్య ఉండదు!
హూస్టన్: ఆఫీస్, షాపింగ్ మాల్కు వెళ్లినప్పుడు కారు లేదా బైక్ను పార్క్ చేయడానికి ఎక్కడ ఖాళీగా ఉందా.. అని వెతకాడనికే సమయం వృథాకావటం చూస్తుంటాం. అమెరికాలోని అలబామా వర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి మెట్టుపల్లి సాయినిఖిల్రెడ్డి ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సంక్లిష్టమైన, ఖర్చుతో కూడిన పార్కింగ్ యాప్స్ కంటే భిన్నంగా స్పేస్ డిటెక్టింగ్ పద్ధతిలో దీనిని అభివృద్ధి చేశారు. బిగ్డేటా ఎనలిటిక్స్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ సాయంతో డేటాను విశ్లేషించి డ్రైవర్లు నేరుగా పార్కింగ్లో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుందో చెబుతుంది. ఈ ఆవిష్కరణకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్ హౌస్ పోటీ (2018)ల్లో రెండో బహుమతి వచ్చింది. -
ఒక్క రోజు బ్రిటిష్ హై కమిషనర్గా భారత విద్యార్థిని
న్యూఢిల్లీ : ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక్క రోజు సీఎంగా విధులు నిర్వర్తిస్తాడు. ఆ సీన్ దాదాపు అందరికి గుర్తుండేఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలో చోటుచేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిని ఒక్క రోజు బ్రిటీష్ హై కమిషనర్ గా పాటు విధులు నిర్వర్తించింది. ఆమె పేరు ఈషా బహల్. ప్రస్తుతం ఈషా.. నోయిడా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ విభాగంలోని కోర్సు చేస్తోంది. కాగా.. అనుకోకుండా ఆమె ఒక్కరోజు బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అదెలా అంటారా.. అంతర్జాతీయ బాలికల దినోత్సవం(అక్టొబర్ 11) పురస్కరించుకొని బ్రిటీష్ హై కమిషన్ 18నుంచి 23ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిలకు ఓ పోటీని నిర్వహించారు. మీ దృష్టిలో లింగ సమానత్వానికి అర్థం ఏమిటి.. అనే ప్రశ్నకి సమాధానంగా ఓ చిన్న వీడియో రూపొందించాలని పంపాలని ప్రకటించింది. అందులో గెలిచినవారికి ఒక్కరోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.ఈషాతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 58మంది అమ్మాయిలు వీడియోలను పంపించారు. కాగా.. అలా పంపిన వీడియోల్లో ఈషా విజయం సాధించింది. దీంతో ఆమెకు ఒక్క రోజు ఇండియాలో బ్రిటీష్ హైకమిషనర్ అయ్యే అవకాశం లభించింది. దీనిపై ఈషా మాట్లాడుతూ..‘ బ్రిటీష్ హైకమిషనర్ గా ఒక్కరోజు పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. ఇది ఒక అరుదైన అనుభూతి. దీని వల్ల యూకేకీ భారత్ కి మధ్యగల సంబంధాల గురించి కొంత తెలుసుకోగలిగాను. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది. ఇక వాస్తవ భారత బ్రిటీష్ హైకమిషనర్ డొమినిక్ ఆస్కిత్ మాట్లాడుతూ.. భారత మహిళ హక్కుల చర్చకు ఈ పోటీ ఓ వెదికగా ఉందని నమ్ముతున్నారు. విద్యార్థినీలు పంపిన వీడియోలు చాలా బాగున్నాయి. ఈషా పంపిన వీడియో ఆకర్షనీయంగా, ఆలోచించే విధంగా ఉన్నాయి. ఆ వీడియో బాలిక హక్కుల గురించి చక్కగా వివరించింది. ఒక్కరోజు బ్రిటిష్ హై కమిషనర్గా ఎన్నికైన ఈషాకి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. -
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి దుర్మరణం
మెల్బోర్న్: భారతీయ విద్యార్థి ఒకరు సెల్ఫీ తీసు కుంటూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయి చనిపోయిన విషాద ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అంకిత్ అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బనీ పట్టణం దగ్గర్లోని ప్రఖ్యాత పర్యాటక సముద్ర తీరం వద్ద ఉన్న రాళ్లపై స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఐదుగురు స్నేహితులతో కలిసి గురువారం అక్కడికి వెళ్లిన అంకిత్, అక్కడి రాళ్లపై ఉత్సాహంగా దూకుతూ ఉన్న సమయంలో, 40 అడుగుల ఎత్తైన రాతి శిఖరం నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
కొండపై సెల్ఫీకి యత్నం.. భారతీయ విద్యార్థి మృతి
మెల్బోర్న్: సెల్ఫీ సరదాకి మరో ప్రాణం బలైపోయింది. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొండపై సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలు జారి సముద్రంలో పడి మృతి చెందాడు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బెనీ పట్టణంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల అంకిత్ పెర్త్లో విద్యనభ్యసిస్తున్నాడు. తన ఫ్రెండ్స్తో సరదాగా షికారుకు వెళ్లాడు. ఈ ప్రయత్నంలో 40 మీటర్ల ఎత్తైన కొండ రాయిపై సెల్ఫీకి యత్నించి.. జారి సముద్రంలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తర్వాత అతని మృతదేహాన్ని బయటకు తీశారు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, రెండేళ్ల క్రితం మూసివేసినప్పటికీ తరచూ కొందరు అక్కడికి వస్తున్నారని అధికారులు వెల్లడించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాలో భారత విద్యార్థి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ కిరాణా దుకాణంలో దొంగతనానికి వచ్చిన నలుగురు వ్యక్తులు భారత విద్యార్థిని కాల్చి చంపారు. హంతకుల్లో ఒకరు భారత సంతతికి చెందినవాడని తెలిసింది. ఫ్రెస్నో పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 21 ఏళ్ల ధరమ్ప్రీత్ సింగ్ జసార్ అనే విద్యార్థి టాకిల్ బాక్స్ అనే స్టోర్లో పనిచేస్తున్నాడు. అతను విధుల్లో ఉన్న సమయంలోనే చోరీ చేయడానికి నలుగురు దొంగలు తుపాకులతో లోనికి ప్రవేశించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి జసార్ క్యాష్ కౌంటర్ వెనక దాక్కున్నా దొంగతనం చేసి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగుల్లో ఒకరు అతనిపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడని ఫ్రెస్నోబీ అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. దొంగలు అక్కడి నుంచి కొంత నగదు, సిగరెట్ బాక్సులు ఎత్తుకెళ్లినట్లు పేర్కొంది. పంజాబ్కు చెందిన జసార్ అకౌంటింగ్ కోర్సు చేస్తున్నారు. స్టూడెంట్ వీసాపై మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. స్టోర్లో దొంగతనానికి పాల్పడిన నలుగురిలో ఒకడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో భారత సంతతి విద్యార్థి 22 ఏళ్ల అమృత్రాజ్ సింగ్ అత్వాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హార్వీ ఎఫెక్ట్: భారత విద్యార్థి మృతి
హోస్టన్: అమెరికాలోని హూస్టన్ వరదల్లో భారత విద్యార్థి మరణించాడు. హార్వీ తుపాను ధాటికి బ్రేన్ సరస్సులో చిక్కుకుపోయిన టెక్సాస్ ఏఅండ్ఎం వర్సిటీ విద్యార్థి నిఖిల్ భాటియా, మరో భారత విద్యార్థిని షాలినీ సింగ్ను అధికారులు రక్షించారు. అయితే తీవ్రగాయాలతో భాటియా మరణించగా, షాలిని పరిస్థితి ఇంకా విషమంగా ఉందని కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులకు తాము ఎప్పటికప్పుడు వారి సమాచారం చేరవేస్తున్నామని అధికారులు చెప్పారు.జైపూర్కు చెందిన భాటియా, ఢిల్లీకి చెందిన అతని ఫ్రెండ్ షాలినీ పబ్లిక హెల్త్లో మాస్టర్స్ చేస్తున్నారు. వరద బీభత్సంలో వారు సరస్సుకు ఎందుకు వెళ్లారన్నది తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. -
ఇదీ.. భారతీయత అంటే!
షికాగో పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది వివేకానందుడు. భారతీయ సంస్కృతి గొప్ప తనాన్ని షికాగో వేదికగా చాటిచెప్పిన మహనీ యుడు ఆయన. మళ్లీ ఆ తర్వాత అదే వేదికపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పిన వ్యక్తిగా ఓ భారతీయ విద్యార్థి పేరు గడించాడు. ఆ విద్యార్థి తాను చేసిన ఒక పని వల్ల ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన గౌరవ్ జవేరి అనే భారతీయ విద్యార్థి స్నాతకోత్సవంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వేదిక మీదకు వెళ్లిన గౌరవ్ పట్టా అందుకున్న వెంటనే యూనివర్సటీ డీన్ కాళ్లకు నమస్కారం చేసి కిందికి వెళ్లిపోయాడు. భారతీయ సంప్రదాయం తెలియని డీన్ ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయారు. కాసేపటి తర్వాత తేరుకున్న డీన్ విద్యార్థి తన కాళ్లకు నమస్కరించినట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ షేర్ అవు తోంది. ట్వీటర్లో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న వీడియోల్లో ఒకటిగా నిలచింది. భారతీయులు ఎక్కడున్నా భారతీయులేనని, గురువుకు నిజమైన గౌరవం దక్కిందంటూ కొందరు, ఇదీ భారతీయత అంటే.. అంటూ మరికొందరు ట్వీటర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
కాళ్లకు దండం పెడితే.. క్షణం పాటు..!
-
కాళ్లకు దండం పెడితే.. క్షణం పాటు..!
చికాగో: ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి కోర్సు కమెన్స్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వేదిక మీదకు వెళ్లిన అతను డీన్ కాళ్లకు దండం పెట్టి కిందికి వెళ్లిపోయాడు. భారతీయ సంప్రదాయం తెలియని డీన్ ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయారు. కొంచెం తెరుకున్న తర్వాత విద్యార్థి కాళ్లకు దండం పెట్టినట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో తెగ షేర్ అవుతోంది. ట్వీటర్లో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న వీడియోల్లో ఒకటిగా నిలిచింది. మరి మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయరాదు. -
పోలండ్లో భారతీయ విద్యార్థిపై దాడి
న్యూఢిల్లీ: పోలండ్లోని పోజ్నన్లోని ఓ ట్రామ్ వాహనంలో దుండగుడు భారతీయ విద్యార్థిపై బుధవారం దాడి చేశాడు. అతనికి ప్రాణాపాయం తప్పింది. ఓ భారతీయ విద్యార్థిపై కొందరు దాడి చేయడంతో మరణించాడని అక్కడి మీడియాలో ఓ వార్త ప్రసారమైంది. దీనిని ఓ వ్యక్తి విదేశాంగ మంత్రి సుష్మ దృష్టికి తీసుకురావడంతో ఆమె స్పందించారు. నివేదిక ఇవ్వాల్సిందిగా పోలండ్లో భారత రాయబారిని ఆదేశించారు. అమెరికాలో సిక్కు డాక్టర్కు బెదిరింపులు: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని మోన్రో ఆసుపత్రిలో పనిచేస్తున్న సిక్కు డాక్టర్ అమన్దీప్ సింగ్కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. గతంలోనూ వివిధ మతాలకు చెందిన వారిని చాలా మందిని చంపినట్లుగా ఆగంతకుడు సందేశంలో పేర్కొన్నాడు. ‘14 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి బెదిరింపులకు భయపడి సమాజసేవను ఆపను’ అని తెలిపారు. -
ఆక్స్ఫర్డ్ బోధన చెత్త: భారతీయ విద్యార్థి కేసు
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే అందరూ ఒక ఆరాధనాభావంతో చూస్తారు. అక్కడ చదువుకోవడం అంటే పూర్వజన్మ సుకృతం అనుకుంటారు. కానీ, అలాంటి యూనివర్సిటీలో బోధన పరమ బోరింగ్గా ఉందని, దానివల్ల తనకు డిగ్రీలో సెకండ్ క్లాస్ వచ్చి, న్యాయవాదిగా తన కెరీర్లో సంపాదన కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపిస్తూ ఒక భారతీయ విద్యార్థి కేసు వేశాడు. ఫైజ్ సిద్దిఖీ అనే యువకుడు యూనివర్సిటీలోని బ్రాసెనోస్ కాలేజిలో ఆధునిక చరిత్ర చదివాడు. అక్కడి టీచర్లు బోధనలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లండన్ హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. ముఖ్యంగా తాను ప్రత్యేక సబ్జెక్టుగా తీసుకున్న ఇండియన్ ఇంపిరీయల్ హిస్టరీ బోధన ఘోరంగా ఉందన్నాడు. ఈ కేసులో తీర్పు ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉంది. 1999-2000 విద్యాసంవత్సరం సమయంలో ఏషియన్ హిస్టరీ బోధించేవాళ్లు మొత్తం ఏడుగురు ఉండగా అందులో నలుగురు సెలవులో ఉన్నారని, అందువల్ల మిగిలినవాళ్లు కూడా సరిగా చెప్పలేదని సిద్దిఖీ తరఫు న్యాయవాది రోజర్ మలాలియూ వాదించారు. తాను ఆక్స్ఫర్డ్లో చదివితే తనకు మంచి ర్యాంకులు వచ్చి, అంతర్జాతీయ కమర్షియల్ లాయర్గా పెద్దజీతం అందుకుంటానని భావించానని సిద్దిఖీ అన్నాడు. దక్షిణ భారత చరిత్రలో నిపుణుడైన డేవిడ్ వాష్బ్రూక్ చాలా బోరింగ్గా చెప్పారని తెలిపాడు. అయితే.. సిబ్బంది కొరత కారణంగానే ఆయనపై భరించలేనంత ఒత్తిడి కలిగిందని మలాలియూ చెప్పారు. అయితే వాష్బ్రూక్ మీద తాము వ్యక్తిగత ఆరోపణలు ఏమీ చేయడంలేదని, యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అన్నారు. సిద్దిఖీ పరీక్షలలో తన ఫలితాలు చూసుకుని తీవ్రమైన డిప్రెషన్, నిద్రలేమికి గురయ్యాడని, అందువల్ల ఎక్కువసేపు సమర్థంగా పనిచేయలేకపోతున్నాడని కూడా వాదించారు. -
కడుపులోని బిడ్డకు తండ్రివి కాదన్నందుకు..
వెల్లింగ్టన్: ప్రెగ్నెన్సీతో ఉన్న గాళ్ఫ్రెండ్ను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో భారతీయ విద్యార్థికి 17 ఏళ్ల కనీస శిక్షతో జీవిత కారాగార శిక్ష పడింది. మంగళవారం ఆక్లాండ్ హైకోర్టు జడ్జి మాథ్యూ పాల్మెర్ ఈ మేరకు తీర్పు చెప్పారు. ఆకాశ్ (24) అనే విద్యార్థి న్యూజిలాండ్లో చదువుకుంటున్నాడు. అతనికి గురుప్రీత్ కౌర్ (22) అనే గాళ్ఫ్రెండ్ ఉంది. వీరిద్దరూ ఏడాది పాటు రహస్యంగా డేటింగ్ చేశారు. కాగా గత ఏప్రిల్ 7న ఆకాశ్, కౌర్ ఘర్షణ పడ్డారు. తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రివి నీవు కావని, బంధాన్ని ఇంతటితో తెంచుకుందామని కౌర్.. ఆకాశ్కు చెప్పడంతో గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహం చెందిన ఆకాశ్ కత్తి తీసుకుని 29 సార్లు కౌర్ను విచక్షణరహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి ఆక్లాండ్ దక్షిణ ప్రాంతంలో పొదల్లో పడేశాడు. కౌర్ను తాను హత్య చేయలేదని తొలుత బుకాయించిన ఆకాశ్ పోలీసులు విచారణలో నేరం అంగీకరించాడు. కోర్టు ఆకాశ్ను దోషిగా నిర్ధారించి శిక్షను ఖరారు చేసింది. -
ప్రొఫెసర్ను, భార్యను కాల్చి.. ఆపై ఆత్మహత్య
► హంతకుడి ఇంటినుంచి కిల్ లిస్టు స్వాధీనం ► లిస్టులోని ఓ మహిళ మృతదేహం గుర్తింపు ► అతడి భార్యే అయి ఉంటుందన్న పోలీసులు ► 3222 కిలోమీటర్లు కారులో వెళ్లి కాల్చిన మైనాక్ సర్కార్ ► ఐఐటీ ఖరగ్పూర్లో పట్టభద్రుడు.. యూఎస్లో డాక్టరేట్ ► మరో ప్రొఫెసర్నూ చంపాలన్న యోచన లాస్ ఏంజిలస్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిలస్ (యూసీఎల్ఏ)లో భారతీయ విద్యార్థి మైనాక్ సర్కార్ (38) బుధవారం కాల్పులకు పాల్పడి ఓ ప్రొఫెసర్ను హత్యచేశాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఏకంగా దాదాపు 3222 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణించి వచ్చాడు. ఐఐటీ ఖరగ్పూర్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) విద్యార్థి అయిన మైనాక్ సర్కార్.. యూసీఎల్ఏ ప్రొఫెసర్ విలియమ్ వద్ద డాక్టరేట్ విద్యార్థిగా ఉండేవారు. 2013లో డాక్టరేట్ పూర్తయింది. కొంతకాలానికి తన కంప్యూటర్ కోడ్ చోరీ అయిందని గుర్తించిన ప్రొఫెసర్ విలియమ్ దీన్ని మైనాక్ దొంగిలించి వేరేవాళ్లకు ఇచ్చాడని ఆరోపించారు. దీంతో మైనాక్ సామాజిక మాధ్యమంలో ప్రొఫెసర్పై బహిరంగంగానే విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో తాజా దారుణం జరిగింది. అయితే.. మినసొటాలోని మైనాక్ నివాసంలో సోదాలు నిర్వహించగా.. ఓ ‘కిల్ లిస్ట్’ దొరికింది. ఇందులో ఒకరు ఇదే వర్సిటీ ప్రొఫెసర్, మరో మహిళ పేరును గుర్తించారు. అయితే.. ఆమె చిరునామా ఆధారంగా ఇంటికి వెళ్లేసరికే ఆ మహిళ చనిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె అతడి భార్య అయి ఉంటుందని భావిస్తున్నారు. ఆష్లీ హస్తి అనే మహిళతో సర్కార్కు 2011లో పెళ్లయింది. అయితే వాళ్లిద్దరూ ఇంకా కలిసి ఉంటున్నారా లేదా అనే విషయం మాత్రం నిర్ధారణ కాలేదు. బుధవారం జరిగిన ఈ హత్యతో యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు. వాస్తవానికి మరో ప్రొఫెసర్ను కూడా చంపాలని మైనాక్ సర్కార్ యూనివర్సిటీకి వెళ్లాడు. అయితే సమయానికి రెండో ప్రొఫెసర్ వర్సిటీలో లేకపోవడంతో ఒక్కరిని మాత్రమే చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వద్ద రెండు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్లగ్ అసలు ప్రొఫెసర్లా ఉండాల్సిన వ్యక్తి కాదని, అమెరికాకు కొత్తగా వచ్చేవాళ్లు అతడివద్దకు వెళ్లొద్దని అంతకుముందు సర్కార్ తన సోషల్ మీడియా అకౌంట్లలో రాశాడు. -
కార్డుబోర్డుతో ఇంక్యుబేటర్.. భారత విద్యార్థి ప్రతిభ
ముందుగానే పుట్టడం, బరువు తక్కువగా పుట్టడం.. ఇలా రకరకాల సమస్యలతో సతమతమయ్యే చిన్నారుల జీవితాలను రక్షించేందుకు లండన్లో చదివే భారతీయ విద్యార్థి మాలవ్ సంఘవి.. నడుం బిగించాడు. అతి తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్ తయారు చేశాడు. దీనికి బేబీ లైఫ్ బాక్స్ అని పేరు పెట్టాడు. ఇంపీరియల్ కాలేజ్ లండన్లో ఇన్నోవేషన్ డిజైన్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డ్యుయెల్ డిగ్రీ కోర్సు చేస్తున్న మాలవ్ ఈ ఇంక్యుబేటర్ను కార్డుబోర్డుతోనే తయారు చేయడం విశేషం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మాలవ్ సంఘవి... లండన్లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో జరిగిన ఓ పోటీలో పాల్గొని తన ఆవిష్కరణకు 3వ బహుమతిని గెలుచుకున్నాడు. నవజాత శిశువుల సంరక్షణ కోసం తగిన సదుపాయాలుండే ఇంక్యుబేటర్... వైద్య సదుపాయాలు లేని భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు బాగా ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నాడు. దీనిలోని దిగువ భాగం లో ఉండే 'కాట్' పుట్టిన తర్వాత బిడ్డకు తల్లిలా రక్షణ ఇస్తుంది. పుట్టుక సమయంలో బిడ్డలకు వచ్చే అంటువ్యాధులు, ఇంకా పూర్తిగా ఎదగకుండానే పుట్టడం లాంటి సమస్యలకు ఇంక్యుబేటర్లే పరిష్కారం. కొన్నాళ్ల క్రితం మాలవ్ బంధువుల బిడ్డను ఇంక్యుబేటర్లో ఉంచడం వల్ల సజీవంగా బయటపడటంతో అతడికి ఈ ఆలోచన వచ్చింది. నగరాల్లో ఇటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, మారుమూల గ్రామాల్లో తక్కువ ఖర్చుతో తక్షణ సంరక్షణ పొందడానికి మాలవ్... కార్డుబోర్డుతో ఈ కొత్త ఇంక్యుబేటర్ను తయారు చేశాడు. తన ప్రయోగాలను మరింత అభివృద్ధి పరిచేందుకు నిధుల సేకరణలో నిమగ్నమైన మాలవ్... తన బోర్డులోకి మరింతమంది నిపుణులను తీసుకొని, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఇంక్యుబేటర్ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మాలవ్ తన ఆలోచనను బయటపెట్టగానే అప్పటికప్పుడే పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభించింది. తమ మొదటి పరిశోధన ప్రకారం భారతదేశంలోని ఆరోగ్య సేవా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో పుట్టే బిడ్డలకు మంచి సౌకర్యాలను అందించే అవకాశం ఉందంటున్నారు మాలవ్. -
యూఎస్లో తెలుగు విద్యార్థి దుర్మరణం
-
యూఎస్లో తెలుగు విద్యార్థి దుర్మరణం
నల్లగొండ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన అభిషేక్ రెడ్డి (27) దుర్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ రెడ్డి మరణించాడని ఆతడి కుటుంబ సభ్యులు శనివారం వెల్లడించారు. తమ కుమారుడు అభిషేక్రెడ్డి (27) అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎమ్మెస్సీ చేస్తున్నాడని అతడి తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, పద్మజా శనివారం తెలిపారు. అభిషేక్ తన సోదరి ప్రియాంకతో కలసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడని చెప్పారు. మరో 10 రోజుల్లో అతడి చదువు పూర్తి కానుందని... సెప్టెంబర్లో ఉద్యోగంలో చేరవలసి ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిందని వారు కన్నీరుమున్నీరయ్యారు. నర్సింహరెడ్డి, పద్మజా దంపతుల స్వగ్రామం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామం. అయితే వారు వ్యాపార రీత్యా హైదరాబాద్లోని సాగర్రోడ్డులోని గాయత్రి చౌరస్తా సమీపంలో వారు నివసిస్తున్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడాడు
మెల్బోర్న్: ఓ భారతీయ విద్యార్థి దాదాపు ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.... శుక్రవారం మరణించాడు. ఈ సంఘటన న్యూజిలాండ్లో చోటు చేసుకుంది. భారత్కు చెందిన బుద్దేశ్ పళని (26) న్యూజిలాండ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. పళని సోమవారం సముద్రంలో విహారానికి వెళ్లాడు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మునిగిపోయాడు. అదే సమయంలో సముద్రంలో విహరిస్తున్న నలుగురు యువతియువకులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అతడు వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... శుక్రవారం మరణించాడు. అయితే ఆసుపత్రిలో ఆపస్మారక స్థితిలో ఉన్న పళనిని ఎవరు గుర్తించలేదు. పళని ఫోటోలతో స్థానిక మీడియాలు పలు వార్తా కథనాలు ప్రసారం చేసింది. కథనాల్లో ప్రసారం అయ్యేది పళని అని అతడి స్నేహితులు గుర్తించి... వెల్డింగ్టన్ ఆసుపత్రికి చేరుకున్నారు. పళని ప్రమాదం వార్తను అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
హత్య కేసులో భారతీయ విద్యార్థికి జీవిత ఖైదు!
న్యూయార్క్: యూఎస్లో స్నేహితుడి హత్య కేసులో భారతీయ విద్యార్థి రాహుల్ గుప్తాకు జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో మేరిల్యాండ్ కోర్టు ఏప్రిల్ 16న తుది తీర్పు వెలువరించనుంది. భారతీయ విద్యార్థి రాహుల్ గుప్తా జార్జీ వాషింగ్టన్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే అతడి గర్ల్ ఫ్రెండ్ టైలర్ తోపాటు అతడి సహా విద్యార్థి మార్క్ వాగ్ తనను మోసం చేస్తున్నారని రాహుల్ అనుమానించాడు. ఆ క్రమంలో 2013, ఆక్టోబర్ 13వ తేదీన రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా అతడి అపార్ట్మెంట్లో పుట్టిన రోజు వేడుకలు ఏర్పాటు చేసి... స్నేహితులను ఆహ్వానించాడు. ఆ వేడుకలకు గర్ల ఫ్రెండ్, మార్క్ వాగ్తోపాటు మరో స్నేహితుడు విచ్చేశారు. ఇదే సమయమని భావించిన రాహుల్ కత్తితో పొడిచి మార్క్ వాగ్ను హత్య చేశాడు. గర్ల ఫ్రెండ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రాహుల్ను అరెస్ట్ చేశాడు. పోలీసుల విచారణలో రాహుల్ తన నేరాన్ని అంగీకరించాడు. చిన్న నాటి నుంచి కలసి చదువుకున్న గర్ల ఫ్రెండ్, మార్క్ వాగ్తో కలసి తనను మోసం చేసిందని అందుకే అతడిని హత్య చేశానని రాహుల్ పోలీసులకు తెలిపాడు. -
రేప్ కేసులో భారత విద్యార్థి అరెస్ట్
న్యూయార్క్:అమెరికాలో అత్యాచారం కేసుకు సంబంధించి ఓ భారతీయ విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఒస్వేగోలోని న్యూయార్ స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్న ఢిల్లీకి చెందిన అభయ్ పాంట్ అనే విద్యార్థి , మరో స్థానిక విద్యార్థితో కలిసి ఓ యువతి గదిలోకి ప్రవేశించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అభయ్ ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గతవారం వేకువజాము ప్రాంతంలో పక్క గదిలో ఉంటున్న యువతి ఇంట్లోకి ప్రవేశించిన వారు ఆమెను లైంగికంగా వేధించినట్లు పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ జులీ బ్లిసెర్ట్ తెలిపారు. అతన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్ కు తరలించినట్లు స్పష్టం చేశారు. -
బ్రిటన్ లో భారతీయ విద్యార్థి టాప్!
లండన్: బ్రిటన్ లో ఒక భారతీయ విద్యా కుసుమం పరిమళించింది. బ్రిటన్ లో అత్యంత ప్రతిభ కల్గిన కుర్రాడిగా 18 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అశానిష్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. లాంక్ షైర్ లో తల్లి సుజాతతో కలిసి ఉంటున్నఅశినాష్ ఐదు సబ్జెక్టుల్లో వంద శాతం మార్కులను సాధించి బ్రిటన్ లో అత్యంత తెలివైన విద్యార్థిగా రికార్డు నెలకొల్పాడు. బ్రిటన్ లో ప్రాథమిక స్థాయిలో నిర్వహించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, క్రిటికల్ థింకింగ్ విభాగాల్లో సత్తాచాటిన అశినాష్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో మెడిసన్ చేయటానికి అర్హత సాధించాడు.