International Space Station
-
యాక్సియోమ్–4 మిషన్ వాయిదా?
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే వారిని వెనక్కి తీసుకురావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్పేస్ఎక్స్ సంస్థ తొలుత నిర్ణయించాయి. సాంకేతిక కారణాలతో మార్చి నెలకు వాయిదా వేశాయి. అది కూడా సాధ్యమయ్యే అవకాశం లేదని సైంటిస్టులు అంటున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఇద్దరు వ్యోమగాములను రప్పించడానికి స్పేస్ఎక్స్ సిద్ధం చేస్తున్న నూతన అంతరిక్ష వాహనం ‘డ్రాగన్’లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. బ్యాటరీల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటిలోగా సరి చేస్తారన్న ఎవరూ చెప్పలేకపోతున్నారు. డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ సిద్ధమైతే తప్ప సునీతా విలియమ్స్, విల్మోర్ వెనక్కి రాలేరు. ఏప్రిల్ నాటికి కూడా డ్రాగన్ అందుబాటలోకి రావడం అనుమానమేనని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, సునీతా విలియమ్స్, విల్మోర్ రాక ఆలస్యమవుతుండడం మరో కీలక ప్రయోగంపై ప్రభావం చూపుతోంది. యాక్సియోమ్–4 మిషన్లో భాగంగా డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్లోనే భారత గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు ప్రైవేట్ వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకోవాల్సి ఉంది. ఏప్రిల్లో ఈ ప్రయోగం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. డ్రాగన్లో సునీతా విలియమ్స్, విల్మోర్ను వెనక్కి వస్తేనే ఈ నలుగురు ఐఎస్ఎస్కు చేరుకోగలుగుతారు. లేకపోతే ప్రయోగం వాయిదా వేయక తప్పదు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 19లోగా ఇద్దరు వ్యోమగాములు వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు యాక్సియోమ్–4 మిషన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సునీతా విలియమ్స్, విల్మోర్ గత ఏడాది జూన్లో బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్లైనర్ క్యాప్సూల్లో ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వారం రోజుల్లో భూమిపైకి తిరిగిరావాలి. స్టార్లైనర్ క్యాప్సూల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో అది సాధ్యం కాలేదు. వారిద్దరూ అక్కడే ఉండిపోయారు. వారి ఆరోగ్యం బాగుందని, ఎలాంటి సమస్యలు లేవని నాసా అధికారులు ప్రకటించారు. -
సునీతా విలియమ్స్, విల్మోర్ ఉమ్మడి స్పేస్వాక్
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా అస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ గురువారం ఉమ్మడిగా స్పేస్వాక్ చేశారు. ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించారు. ఐఎస్ఎస్కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. ఇరువురు కలిసి స్పేస్వాక్ చేయడం ఇదే మొదటిసారి. వేర్వేరుగా స్పేస్వాక్ చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వారిద్దరూ గత ఏడాది జూన్లో ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎనిమిది నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ను కోరారు. మరోవైపు సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్వాక్ చేశామని, చాలా ఆనందంగా ఉందని విల్మోర్ చెప్పారు. -
డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ పైలట్గా శుభాంశు శుక్లా
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) రికార్డుకెక్క బోతు న్నాడు. స్పేస్ఎక్స్(SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్Dragon spacecraft)కు పైలట్గా వ్యవహరించబోతున్నాడు. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి మంజూరు చేసింది. యాక్సి యోమ్–4 మిషన్లో భాగంగా నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని కి చేరుకోనున్నారు. 14 రోజుల తర్వాత తిరిగి వస్తారు. ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైతం భాగస్వా మిగా మారింది. డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ సారథ్యం వహించనున్నా డు. పోలాండ్కు చెందిన ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబో ర్ కపూ సైతం ఇందులో పాలుపంచుకుంటున్నా రు. మొత్తం నలుగురు అస్ట్రోనాట్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్కు చేరుకుంటారు. త్వరలో ఈ ప్రయోగం చేపట్టడానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. శుభాంశు శుక్లా ప్రస్తుతం భార త వైమా నిక దళంలో గ్రూప్ కెప్టెన్గా పనిచేస్తున్నాడు. యా క్సియోమ్–4 మిషన్కు ఎంపికయ్యాడు. నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీలో శిక్షణ పొందాడు. -
సునీతా విలియమ్స్ను తీసుకురండి: ట్రంప్
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసుకురావాలంటూ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆ యన తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పంచుకున్నారు. ‘బైడెన్ ప్రభుత్వం అంతరిక్ష కేంద్రంలో వదిలేసిన ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగాములను తీసుకురావాలని మస్క్ ను కోరుతున్నా. సునీత, విల్మోర్ కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యోమగాములను తీసుకురావాలి. గుడ్ల క్ ఎలాన్’అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మేం తీసుకొస్తాం. బైడెన్ ప్రభుత్వం ఇంతకాలం వారిన లా వదిలేయడం దారుణం’’అని మస్క్ వ్యాఖ్యానించారు. పది రోజుల మిషన్ కోసం సునీత, విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక వ్యోమనౌకలోని థ్రస్టర్ పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి స్టార్లైనర్ క్యాప్సుల్ మాత్రం సెపె్టంబర్ 7న తిరిగి భూ మి మీదకొచి్చంది. అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండటంతో ఆమె చాలా బరువు తగ్గినట్లు ఇటీవల బహిర్గతమైన ఫొటోల ద్వారా వెల్లడైంది. తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను గతేడాది నవంబర్లో సునీత తోసిపుచ్చారు. తన శరీరం కొద్దిగా మారిందని, అదే బరువుతో ఉన్నానని చెప్పారు. ఒకవేళ మార్చి నెలాఖరులో వీళ్లిద్దరూ భూమికి తిరిగొస్తే అనుకోకుండా అక్కడే ఉండిపోయి 300 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములుగా మరో రికార్డ్ నెలకొల్పుతారు. ఎలా నడవాలో గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా: సునీత ఇప్పటికే 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత తాను చదివిన పాఠశాల విద్యార్థులతో సోమవారం మాట్లాడారు. వర్చువల్గా జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో సునీతను విద్యార్థులు అత్యల్ప గురుత్వాకర్షణ స్థితిపై ప్రశ్నలు సంధించారు. ‘‘ఈత కొట్టడం, ఎగరడం వంటి అనుభూతిని మాత్రమే ఆస్వాదిస్తున్నా. ఎక్కువకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల తన శరీరం అనేక సర్దుబాట్లకు లోనైంది. చాలాకాలంగా నేను నడవలేదు. కూర్చోలేదు. పడుకోలేదు. నడవడం ఎలా ఉంటుందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’అని తెలిపారు. ‘‘ఎలాగోలా తిరిగి రావడానికి మరో నెలరోజుల సమయం పడుతుందనుకున్నా. కానీ ఇన్ని రోజులైనా ఇంకా ఉండాల్సి రావడం కాస్త ఇబ్బందిపెడుతోంది. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లితో వీలైనంతసేపు మాట్లాడుతున్నా. అంతరిక్ష కేంద్రంలో బిజీ షెడ్యూల్, కుటుంబంతో క్రమం తప్పకుండా మాట్లాడటం వల్ల తాను ఒంటరిగా ఉన్నట్లు భావించట్లేను’’అని సునీత చెప్పారు. -
అంతరిక్షంలో ఉన్నా మాకూ సెలవు కావాలి
‘సెలవు కావాలి’. పండుగలు, పెళ్లిళ్లు, ముఖ్యమైన సందర్భాల్లో ఉద్యోగి నోట వినిపించే మొట్టమొదటి మాట ఇది. ప్రపంచదేశాలు అన్ని చోట్లా ఇదే వినతి. ఇప్పుడు ఈ విన్నపం భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికీ చేరింది. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల కోసం తాము కూడా విధులకు గైర్హాజరై సెలవు పెడతామని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లోని ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ తెగేసి చెప్పారు. వీళ్ల సెలవు అభ్యర్థనకు ఇప్పటికే ఆమోదముద్ర పడిందోఏమో క్రిస్మస్, కొత్త ఏడాది సంబరాలకు వ్యోమగాములంతా సిద్ధమైపోయారు. ప్రత్యేకంగా క్రిస్మస్, న్యూ ఇయర్ విందు కోసం ఇప్పటికే ప్యాక్ చేసి పంపించిన ఆహారపదార్థాలు తినేందుకు నోరూరుతోందని అక్కడి భారతీయమూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చెప్పారు. ఐఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాముల బృందం క్రిస్మస్, జనవరి ఒకటిన తమ రోజువారీ శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలను కాసేపు పక్కనబెట్టి సంబరాల్లో తేలిపోతారని తెలుస్తోంది. తాజాగా ఐఎస్ఎస్కు వచి్చన స్పేస్ఎక్స్ డ్రాగన్ 2,700 కేజీల కార్గోలో వ్యోమగాముల కోసం విడి విడిగా వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి గిఫ్ట్లు వచ్చాయి. స్పెషల్ మీల్స్ తింటూ కుటుంబంతో వీడియోకాల్స్ మాట్లాడుతూ వ్యోమగాములు సరదాగా గడపనున్నారు. ఇప్పటికే హాలిడే మూడ్ను తెస్తూ సునీత, డాన్ పెటిట్లు శాంటా టోపీలు ధరించిన ఫొటో ఒకటి తాజాగా షేర్చేశారు. బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్లో ఐఎస్ఎస్కు వచి్చన సునీతా విలియమ్స్ తాము వచ్చిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా తిరిగి భూమికి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. నెలల తరబడి అక్కడే ఉండిపోయిన సునీతకు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కాస్తంత ఆటవిడుపుగా ఉండబోతున్నాయి. – వాషింగ్టన్ -
ఐఎస్ఎస్ చేరిన డ్రాగన్
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు బయల్దేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సోమవారం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. కాసేపటికే అందులోని వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్ ఐఎస్ఎస్లో ప్రవేశించారు. సునీత, విల్మోర్ తదితరులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. స్పేస్ ఎక్స్ క్రూ–9 మిషన్ను అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్కెనవెరల్ నుంచి శనివారం ప్రయోగించడం తెలిసిందే. జూన్లో బోయింగ్ తొలిసారి ప్రయోగాత్మకంగా పంపిన స్టార్లైనర్ క్యాప్సూల్లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ చేరుకున్నారు. 8 రోజుల్లో వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుబడిపోయారు. చివరికి స్టార్లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. సునీత, విల్మోర్ డ్రాగన్ క్యాప్సూల్లో ఫిబ్రవరిలో తిరిగి రానున్నారు. వారికి చోటు కలి్పంచేందుకు వీలుగా నాలుగు సీట్ల సామర్థ్యమున్న డ్రాగన్ క్యాప్సూల్లో హేగ్, గోర్బనోవ్లను మాత్రమే పంపడం తెలిసిందే. -
స్పేస్ఎక్స్ మిషన్లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్లో స్టార్లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
Sunita Williams: నీ రాక కోసం!
కేప్కనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను సురక్షితంగా భూమికి తిరిగి తెచ్చేందుకు శనివారం స్పేస్–ఎక్స్ క్యాప్సుల్ డ్రాగన్ బయలుదేరింది. ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ నిర్మిత స్టార్లైనర్ తొలి ప్రయోగంలో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత, విల్మోర్లు ఎనిమిది రోజులకు భూమికి తిరిగి రావాల్సి ఉండగా.. స్టార్లైనర్లో హీలియం లీక్, థ్రస్టర్ల సమస్యలు తలెత్తడంతో అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. మానవసహిత తిరుగు ప్రయాణానికి స్టార్లైనర్ సురక్షితం కాదని నాసా తేల్చడంతో అది ఖాళీగానే తిరిగివచ్చింది. సునీత, విల్మోర్లను భూమికి తేవడానికి వీలుగా డ్రాగన్లో రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. ఇద్దరు వ్యోమగాములతో శనివారం ఇది ప్రయాణమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్మోర్లను తీసుకొని భూమికి తిరిగి వస్తుంది. ఎనిమిది రోజుల్లో రావాల్సిన వీరు ఏకంగా ఎనిమిది నెలల తర్వాత భూమికి వస్తారు. -
సునీత విలియమ్స్ కోసం 26న క్రూ–9 ప్రయోగం.. అయినా 5 నెలలు పడుతుందా!
కేప్ కెనవెరల్ (అమెరికా): హమ్మయ్యా... సునీతా విలియమ్స్ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ఈ భారతీయ సంతతి అమెరికన్ వ్యోమగామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంకో రెండు రోజుల్లోనే (సెప్టెంబరు 26వ తేదీ) దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ను కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించనున్నామని నాసా ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే సునీత, బుచ్ విల్మోర్లతోపాటు అమెరికా, రష్యాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూమ్మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.బోయింగ్ స్టార్లైనర్ -12 ద్వారా ఈ ఏడాది జూన్లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారి తిరుగు ప్రయాణం మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. స్టార్లైనర్లోని 24 థ్రస్టర్లలో ఐదు పనిచేయకుండా పోయాయి. అలాగే ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీక్ అయినట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్ నుంచే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సునీత, విల్మోర్లు, గ్రౌండ్స్టేషన్ నుంచి నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ఈ స్టార్లైనర్ సురక్షితంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదని, ల్యాండింగ్ను నియంత్రించడమూ కష్టమని తేలిన నేపథ్యంలో ఖాళీగానే వెనక్కు రప్పించాలని నాసా నిర్ణయించింది. దీంతో సునీత, విల్మోర్లు నాలుగు నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కొసమెరుపు ఏమిటంటే.. ఈ నెల 26 నాటి ప్రయోగం కూడా కచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఫ్లారిడాకు సమీపంలోని మెక్సికో జలసంధి వద్ద ఏర్పడ్డ ‘నైన్’ తుపాను ప్రయోగ కేంద్రం కేప్ కెనవెరాల్ వైపు దూసుకు వస్తూంది ఫలితంగా అనానుకూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయోగం వాయిదా పడే సూచనలు ఉన్నాయి.భూమికి సురక్షితంగా చేరుకున్న ముగ్గురు మాస్కో: ఇద్దరు రష్యన్, ఒక అమెరికన్ వ్యోమగాములతో కూడిన సోయుజ్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి కజకిస్తాన్కు చేరుకుంది. ఐఎస్ఎస్ నుంచి సోమవారం విడివడిన క్యాప్సూల్ మూడున్నర గంటల తరువాత కజకిస్తాన్లోని పచ్చిక మైదానంలో దిగింది. సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా క్యాప్సూల్లోని రెండు థ్రస్టర్లను కొద్దిసేపు మండించారు. ఆఖరు దశలో 7.2 మీటర్ల పారాచూట్ విచ్చుకుని క్యాప్సూల్ సురక్షితంగా గంటకు 16 మైళ్ల వేగంతో కిందికి వచ్చింది.చదవండి: ట్రంప్ నోట ఓటమి మాట.. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే..అనంతరం అందులోని వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి, వైద్య పరీక్షలు జరిపారు. ఈ వ్యోమగాములు ఒలెగ్ కొనొనెంకో, నికొలాయ్ చుబ్లు 374 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. ఇది ప్రపంచ రికార్డని అధికారులు తెలిపారు. వీరితోపాటే వచ్చిన అమెరికన్ వ్యోమగామి ట్రేసీ డైసన్ ఆరు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉన్నారు. కాగా, ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్ సహా ఇంకా 8 మంది వ్యోమగాములున్నారు. -
అంతరిక్షంలో 370 రోజులకు పైగా!
మాస్కో: రష్యా వ్యోమగాములు ఒలెగ్ కొనొకెంకో, నికోలాయ్ చుబ్ శుక్రవారం సరికొత్త రికార్డు సృష్టించారు. వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో 370 రోజుల 21 గంటల 22 నిమిషాలకుపైగా ఉన్నారు. పాత రికార్డును తిరగరాశారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడే పరిశోధనల్లో భాగస్వాములవుతున్నారు. వ్యోమగాములు నిరాటంకంగా ఇన్ని రోజులో ఐఎస్ఎస్లో ఉండడం ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా ఎక్కువ కాలం ఐఎస్ఎస్లో ఉన్న రికార్డు రష్యా అస్ట్రోనాట్స్ సెర్గీ ప్రొకోపివ్, దిమిత్రి పెటెలిన్, అమెరికా అస్ట్రోనాట్ ఫ్రాన్సిస్కో రుబియా పేరిట ఉంది. వారు 370 రోజుల 21 గంటల 22 నిమిషాలు ఐఎస్ఎస్లో గడిపారు. ఈ రికార్డును ఒలెగ్ కొనొకెంకో, నికోలాయ్ చుబ్ బద్ధలు కొట్టారు. వారు సోమవారం భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 59 ఏళ్ల కొనొకెంకో మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. సోమవారం నాటికి ఆయన ఐఎస్ఎస్లో ఏకంగా 1,110 రోజులు గడిపినట్లు అవుతుంది. ఇప్పటిదాకా ఇన్ని రోజులు అక్కడ ఉన్నవారెవరూ లేరు. -
Butch Wilmore and Sunita Williams: ఐఎస్ఎస్లో ఇబ్బందేమీ లేదు
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎగువన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగడానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చెప్పారు. మానసికంగా, శారీరకంగా తమను తాము సిద్ధం చేసుకున్నామని, పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి ప్రయతి్నస్తున్నామని తెలిపారు. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన సీఎస్టీ–100 స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్లో ఈ ఏడాది జూన్లో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, స్టార్లైనర్లో సాంకేతిక లోపాలు తలెత్తడంలో అది సాధ్యపడలేదు. స్టార్లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగివచి్చంది. ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సునీతా విలిమమ్స్, విల్మోర్ శుక్రవారం ఐఎస్ఎస్ నుంచి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. మనం నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆందోళన చెందడం అనవసరమని విల్మోర్ అన్నారు. ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు కంటే ఉండడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డామని వివరించారు. తాము ప్రొఫెషనల్ వ్యోమగాములం కాబట్టి అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పనులు చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎల్లప్పుడు ఆసక్తికరంగానే ఉంటుందని సునీతా విలియమ్స్ వ్యాఖ్యానించారు. స్టార్లైనర్లో వెనక్కి వెళ్లలేకపోవడం పట్ల తమకు ఎలాంటి విచారం లేదన్నారు. అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్, విల్మోర్ ఓటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యత అని సునీతా విలియమ్స్ చెప్పారు. ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి ‘నాసా’ తగిన ఏర్పాట్లు చేస్తోందని విల్మోర్ వెల్లడించారు. -
తిరిగొచ్చిన స్టార్లైనర్
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లిన స్టార్ లైనన్ స్పేస్క్రాఫ్ట్ ఒంటరిగానే తిరిగొచ్చింది. ఆరు గంటల ప్రయాణం తర్వాత స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9.31 గంటలకు అమెరికాలో న్యూమెక్సికో ఎడారిలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ సమీపంలో క్షేమంగా దిగింది. ఐఎస్ఎస్ నుంచి కేవలం 10 రోజుల్లో తిరిగి రావాల్సిన స్టార్ లైనర్ సాంకేతిక లోపాల వల్ల మూడు నెలలకు పైగా ఆలస్యంగా భూమిపై అడుగుపెట్టింది. స్టార్ లైనర్లో వెనక్కి రావాల్సిన సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారు భూమిపైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఐఎస్ఎస్లోనే ఉండి, అంతరిక్ష పరిశోధనల్లో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లి, ఒంటరిగా తిరిగివచ్చిన మొట్టమొదటి స్పేస్క్రాఫ్ట్గా స్టార్ లైనర్ రికార్డుకెక్కింది. ఏమిటీ స్టార్ లైనర్? ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష వాహక నౌక స్టార్ లైనర్. ఈ ఏడాది జూన్ 5వ తేదీన ప్రయోగాత్మకంగా ఇద్దరు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. సునీతా విలియమ్స్, విల్మోర్ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో ఉండగానే సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇంజన్లోని కొన్ని థ్రస్టర్లు విఫలమయ్యాయి. హీలియం గ్యాస్ లీకైనట్లు గుర్తించారు. తాత్కాలిక మరమ్మత్తులతో స్టార్ లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వాస్తవానికి సునీతా విలియమ్స్, విల్మోర్ 8 రోజులపాటు అక్కడే ఉండి, ఇదే స్టార్లైనర్లో వెనక్కి తిరిగిరావాలి. మరమ్మత్తులు చేయడం సాధ్యం కాకపోవడంతో వారిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండాపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ స్పేస్క్రాఫ్ట్లో వారిద్దరూ భూమిపైకి తిరిగి రానున్నారు. ‘డ్రాగన్’లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంది. కానీ, ఇద్దరే ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. వచ్చేటప్పుడు సునీతా విలియమ్స్, విల్మోర్ను కూడా తీసుకురానున్నారు. – వాషింగ్టన్ -
నేడు ఖాళీగా స్టార్లైనర్ తిరుగుప్రయాణం
కేప్కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్సాండ్స్ మిసై్పల్ రేంజ్లో దిగుతుంది. బోయింగ్ నిర్మిత స్టార్లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్లైనర్లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. పలు పరీక్షల అనంతరం స్టార్లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్ను ఐఎస్ఎస్కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్ఎస్లో డ్రాగన్ పార్కింగ్కు వీలుగా శుక్రవారం స్టార్లైనర్ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు. -
అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లా
న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టబోతున్నాడు. ఇందుకోసం భారతవాయుసేన గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లాను ఎంపికచేశారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మానవసహిత అంతరిక్ష వ్యోమనౌక కేంద్రం (హెచ్ఎస్ఎఫ్సీ), నాసా, అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా గగనయాత్రికులను నాసా ఐఎస్ఎస్కు తీసుకెళ్లనుంది. మిషన్ పైలట్గా గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా వ్యవహరిస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన వెళ్లలేకపోతే బ్యాకప్ మిషన్ పైలట్గా మరో గ్రూప్ కెపె్టన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను ఐఎస్ఎస్కు పంపిస్తారు. వీరికి ఈ వారంలోనే శిక్షణ మొదలవుతుంది. యాక్సియమ్–4 మిషన్ ద్వారా అక్కడకు వెళ్లే శుక్లా ఐఎస్ఎస్లో తోటి వ్యోమగాములతో కలిసి శాస్త్ర పరిశోధనలుచేయడంతోపాటు పలు సాంకేతికతలను పరీక్షించనున్నారు. తర్వాత ఐఎస్ఎస్ ఆవల అంతరిక్షంలోనూ గడిపే అవకాశముంది. శుక్లాతోపాటు ఐఎస్ఎస్కు అమెరికా, పోలండ్, హంగేరీల నుంచి ఒకరు చొప్పున వ్యోమగామి రానున్నారు. భారత తన సొంత మానవసహిత అంతరిక్ష ప్రయోగాల కోసం నలుగురిని గత ఏడాదే ఎంపికచేసిన విషయం తెల్సిందే. గగన్యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో వ్యోమగామి శిక్షణా కేంద్రంలో వీరి శిక్షణ కూడా గతంలో మొదలైంది. ఇటీవల రష్యాలోనూ ప్రాథమిక శిక్షణ పూర్తిచేసుకున్నారు. గగన్యాన్లో భాగంగా నలుగురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా సముద్రజలాల్లో దింపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. -
Sunita Williams: వచ్చేస్తాగా..!
సాహసం అంటే సునీతకు సరదా! అంతరిక్షంలో భారరహిత స్థితిలో తలకిందులుగా తేలియాడుతూ... ‘డ్యూటీ’ చేయటం ఆమెకొక విహారం. ఇక స్పేస్లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా ఆమె వ్యాయామం ఆపలేదు! ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి మేలు చేసే ఎక్సర్సైజ్లే అన్నీ. మానసికంగా శక్తినిచ్చే సాధనకు సైతం ఏనాడూ ఆమె విరామం ఇవ్వలేదు. ఆ సాధనే... అనుదిన భగవద్గీత పఠనం. ప్రస్తుతం సునీత ఆ అంతరిక్షంలోనే చిక్కుబడిపోయారు. భూమిపై అందరూ ఆమె కోసం భయాందోళనలు చెందుతూ ఉంటే ఆమె మాత్రం... చిరునవ్వుతో... ‘‘వచ్చేస్తాగా...’’ అని తనే రివర్స్లో నాసాకు, భారతీయులకు నమ్మకం ఇస్తున్నారు!సునీతా విలియమ్స్ గత 53 రోజులుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. సునీతను, సహ వ్యోమగామి బచ్ విల్మోర్ను భూకక్ష్యకు 400 కి.మీ ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఐ) విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడికి చేర్చాక చేతులెత్తేసింది. జూన్ 5న వాళ్లు వెళ్లారు. తిరిగి జూన్ 12కి, కనీసం జూన్ 15 కి వారు భూమి పైకి రావలసింది. స్టార్లైనర్లోని రాకెట్ మోటార్లు (థ్రస్టర్స్) మొరాయించటంతో విల్మోర్తో పాటుగా సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. మరోవైపు నాసా టీమ్ భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్కు నెలన్నరకు పైగా మరమ్మతులు చేస్తూ ఉంది. స్టార్లైనర్ మానవ ప్రయాణానికి పనికొస్తుందా లేదా అని ప్రత్యక్షంగా పరీక్షించేందుకు వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే ఉండిపోయారు. వారు ఎప్పటికి తిరిగొస్తారు అనే ప్రశ్నకైతే ఇప్పటి వరకు సమాధానం లేదు. తాజాగా చిన్న ఆశ మినుకుమంది! థ్రస్టర్స్ని మండించి చూసిన నాసాకు అవి పని చేయబోతున్న సంకేతాలు కనిపించాయి. ఇది గుడ్ న్యూస్. నాసాకే కాదు, సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్న యావత్భారతావనికి కూడా. ‘‘స్టార్లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది’’ అని సునీత భూమి పైకి సందేశం పంపారు. ‘‘ఆమె చాలా ధైర్యంగా ఉన్నారు’’ అని సహ వ్యోమగామి విల్మోర్ ఆమె గురించి గొప్పగా చె΄్పారు.అంతరిక్షంలో డాన్స్!విల్మోర్ చె΄్పారనే కాదు.. సునీతా విలియమ్స్ గట్టి అమ్మాయి. భూమి మీద ఉండి మనం ఆమె గురించి భయపడుతున్నాం కానీ.. అంతరిక్షంలో ఆమె ఉల్లాసంగా గడుపుతున్నారు. నాసా వారు ఇచ్చిన వీక్ ఆఫ్ని చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతున్నారు కూడా. ఇంకా.. మైక్రో గ్రావిటీలో మొక్కలు నీటిని ఎలా సంగ్రహిస్తాయో సునీత పరీక్షిస్తున్నారు. నిజానికి రోదసీయానం సునీతా విలియమ్స్కి ఇదే మొదటిసారి కాదు. 2006లో, 2012లో ఐఎస్ఎస్కి వెళ్లారు. 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. మొత్తం కలిపి 50 గంటల 40 నిముషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆనందంతో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది కూడా. సునీతకు అంతరిక్ష యాత్ర ఇదే తొలిసారి కాకున్నా.. బోయింగ్ స్టార్ లైనర్తో మానవ సహిత యాత్రను నిర్వహించటం నాసాకు మొదటిసారే. కన్నవారి కలకల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాలు కలిగిన రెండో మహిళ సునీతా విలియమ్స్. అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు సునీత. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ. తల్లి ఉర్సులిన్ స్లొవేనియా మహిళ. సునీత ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు. ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికన్ నావికాదళంలో కొన్నాళ్లు డైవింగ్ ఆఫీసర్గా ఉద్యోగం చేశారు. 1998లో రోదసీయానంలో శిక్షణ తీసుకున్నారు. వ్యోమగామి కావాలన్నది మాత్రం తల్లిదండ్రుల కల. ఆ కల నెరవేరటానికి కూడా కారణం అమ్మానాన్నే అంటారు సునీత. సునీత త్వరగా భూమిపైకి తిరిగి రావాలని ఆకాంక్షిద్దాం. -
ఐఎస్ఎస్ నుంచి త్వరలో సునీత రాక!
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్లైనర్ వ్యోమనౌక భూమికి తిరుగుపయనంపై ఆశలు ఇంకాస్త చిగురించాయి. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేర్చాక స్టార్లైనర్లోని రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థలోని కొన్ని థ్రస్టర్లు మొరాయించిన విషయం విదితమే. నౌకను శూన్యంలో సరైన దిశలో తిప్పేందుకు చిన్నపాటి ఇంజన్లవంటి థ్రస్టర్లు అత్యంత కీలకం. హీలియం సైతం లీక్ అవుతుండటంతో సునీత, విల్మోర్ల తిరుగుప్రయాణాన్ని వాయిదావేసి రిపేర్ల పనిపట్టడం తెల్సిందే. తాజాగా థ్రస్టర్లను ఒకదాని తర్వాత మరొకటి ఇలా 27 థ్రస్టర్లను మండించి వాటి పనితీరును పరిశీలించారు. 97–02 శాతం ఖచి్చతత్వంతో అవి పనిచేశాయని హాట్ ఫైర్ పరీక్షకు నాయకత్వం వహించిన ఫ్లైట్ డైరెక్టర్ కోలోయి మెహరింగ్ చెప్పారు. ఈ పరీక్ష జరిపినంతసేపు హీలియం వ్యవస్థలు సవ్యంగానే పనిచేశాయని మెహరింగ్ ప్రకటించారు. ఈ ఫలితాలను వచ్చేవారు సమీక్షించనున్నారు. ఐఎస్ఎస్ను ఏ రోజున భూమికి తిరుగుపయనం మొదలెట్టాలనే విషయాన్ని వచ్చేవారం సమీక్షలో చర్చించనున్నారు. -
నాసా ప్రయోగానికి ‘గగన్యాన్’ వ్యోమగామి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా ఉమ్మడిగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే దిశగా ముందడుగు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగంలో పాలుపంచుకొనేందుకు ‘గగనయాన్’ మిషన్ వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లనున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్యాన్ ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని ఐఎస్ఎస్కు పంపిచనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అమెరికాలో పర్యటించారు. ఉమ్మడి అంతరిక్ష ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించారు. ఉమ్మడి స్పేస్ మిషన్లలో భాగంగా 2024లో భారత వ్యోమగామిని ఐఎస్ఎస్కు పంపిస్తామని బైడెన్ ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు గగన్యాన్ మిషన్ కోసం భారత వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో అస్ట్రోనాట్స్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. -
స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం
కేప్కనవెరాల్: బోయింగ్ అంతరిక్ష నౌక ‘స్టార్ లైనర్’లో పలు సమస్యలు తలెత్తినప్పటికీ.. తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామనే విశ్వాసం ఉందని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం తెలిపారు. స్టార్ లైనర్ తొలి మానవసహిత రోదసీ యాత్రలో జూన్ 5న సునీత, విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు. హీలియం వాయువు లీక్ కావడం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్తో అతికష్టం మీద అనుసంధానం కాగలిగారు. ఎనిమిది రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ రాకెట్లో సమస్యల వల్ల ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఐఎస్ఎస్ నుంచి బుధవారం వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్ను పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవుతామన్నారు. రోదసీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావడం పట్ల తమకేమీ ఫిర్యాదులు లేవని, ఐఎస్ఎస్లోని ఇతర వ్యోమగాములకు సహాయపడటాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపారు. ‘స్టార్ లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది. సమస్యేమీ లేదు’ అని సునీతా విలియమ్స్ విలేకరులతో అన్నారు. -
మన అంతరిక్ష కేంద్రంపై... ఇస్రో కీలక నిర్ణయం
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూ స్థిర కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (కక్ష్య తాలూకు వంపు కోణం)లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమ నౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ (ఓఐ)ది చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల ఓఐ వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశముంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90 శాతానికి పైగా జనావాసాలనూ కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఐఎస్ఎస్ కక్ష్యే ఎందుకు? ఐఎస్ఎస్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో స్థిర కక్ష్యకు 51.6 డిగ్రీల వంపు కోణంలో పరిభ్రమిస్తుంది. బీఏఎస్ కోసం ఇస్రో దాదాపు అదే కోణాన్ని ఎంచుకోవడం దూరదృష్టితో కూడిన నిర్ణయమని చెబుతున్నారు. ఈ కోణంలో భూమిని అత్యంత విస్తృతంగా కవర్ చేయడం సులువవుతుంది. అంతేగాక ఐఎస్ఎస్ 2030 నాటికి పూర్తిగా తెరమరుగు కానుంది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించి ఏర్పడే శూన్యాన్ని బీఏఎస్ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రానికి సులువుగా అనుసంధానమయేందుకు ఈ కోణం వీలు కలి్పస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘తద్వారా ఇంధన వాడకం తగ్గడమే గాక పనితీరుకు సంబంధించిన అనేకానేక సంక్లిష్టతలు తప్పుతాయి. దీనికి తోడు ఐఎస్ఎస్తో కమ్యూనికేషన్, ట్రాకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ఇస్రో యథాతథంగా వాడుకోగలుగుతుంది. కనుక మనకు వ్యయ ప్రయాసలు కూడా బాగా తగ్గిపోతాయి’’ అని ఇస్రో మాజీ ఇంజనీర్ మనీశ్ పురోహిత్ వివరించారు. అయితే బీఏఎస్ ఏర్పాటులో కీలకమైన 51.6 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ను సాధించడం సవాలే కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఏఎస్ కొన్ని విశేషాలు... → భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మన సొంత పరిశోధన కేంద్రం → ఐఎస్ఎస్ మాదిరిగానే ఇది కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది → బీఏఎస్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది → దీన్ని 2035కల్లా పూర్తిస్థాయిలో నిర్మించాలన్నది లక్ష్యం → బీఏఎస్ నమూనాను 2029 కల్లా ప్రయోగాత్మకంగా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరోరాల కనువిందు
వాషింగ్టన్: భూ ఉపరితల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది. కనువిందు చేసే ఆకుపచ్చ, ఊదా రంగుల కాంతి పుంజాల (ఆరోరా) ఫొటోలు, వీడియోలను భూమికి పంపింది. ఆరోరాల పైనుంచి అంతరిక్ష కేంద్రం పయనిస్తున్న సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర ధ్రువజ్యోతి అని, కాంతి ప్రవాహం అని పిలిచే అరోరాలు భూమి నుంచి అరుదుగా కనిపిస్తుంటాయి. గాలి రేణువులు, విద్యుత్ శక్తి కలిగిన సూర్యకాంతి రేణువులు భూ అయస్కాంత క్షేత్రంలో ఢీకొన్నప్పుడు అరోరాలు ఏర్పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో కనిపిస్తాయి. -
మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్తోపాటు బుచ్ విల్మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు కచి్చతంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్లైనర్లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో స్టార్లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజులదాకా పొడిగించాలని భావిస్తున్నారు. జూన్ 5న సునీత, విల్మోర్ అంతరిక్షంలోకి బయలుదేరారు. స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది. కానీ, మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్, విల్మోర్ భూమిపైకి చేరుకొనే అవకాశం ఉంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్లైనర్ ఎయిర్క్రాఫ్ట్లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. స్టార్లైన్ స్పేస్క్రాఫ్ట్లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్లైనర్ ఎయిర్క్రాఫ్ట్లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్కు సునీతా ఫైలట్గా, విల్మోర్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్మిల్పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తిచేశారు. అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టు మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పేస్క్రాఫ్ట్ సిద్ధమైంది. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్ సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది. -
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
24 గంటల్లో 16 న్యూ ఇయర్స్
కేవలం 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? భూమిపై ఉన్న మనకు సాధ్యం కాకపోవచ్చు గానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు ముమ్మాటికీ సాధ్యమే! వారు ఒక్కరోజులో 16 సార్లు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమిచుట్టూ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో తిరుగుతుండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తారు. వేర్వేరు టైమ్జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. మనకు ఒకరోజులో ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం ఉంటే వ్యోమగాములు మాత్రం 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే, వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు, 45 నిమిషాలు రాత్రి ఉంటాయి. ఈ చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. మరోమాట.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూగోళం స్పష్టంగా కనిపిస్తుంది. భూమిపై విద్యుత్ వెలుగులను వ్యోమగాములు వీక్షిస్తుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా 24 గంటల్లో 16 సార్లు వారు ఈ వేడుకలను తిలకిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోదసీలో టూల్బ్యాగ్ చక్కర్లు
న్యూయార్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) బయటివైపు మరమ్మతుల కోసం తీసుకెళ్లిన టూల్బ్యాగ్ ఒకటి కనిపించకుండా పోయింది. అది ఎక్కడ పడిపోయిందా అని అంతటా వెతికితే అది అంతరిక్షంలో చక్కర్లు కొడుతోందని తేలింది. అది తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ మళ్లీ అంతరిక్ష కేంద్రాన్నే ఢీకొడుతుందనే భయం మధ్యే అసలు విషయాన్ని బయటిపెట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా). నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనను తాజాగా బహిర్గతంచేసింది. అసలేం జరిగిందంటే? ఆరోజు వ్యోమగాములు మేజర్ జాస్మిన్ మోగ్బెలీ, లోరల్ ఓహారాలు ఐఎస్ఎస్ బయటివైపు ఉన్న హ్యాండ్లింగ్ బార్ ఫిక్చర్, బేరింగ్లను తొలగించి కొత్తవి అమర్చేందుకు స్పేస్వాక్ చేశారు. బయటే వారు ఆరు గంటల 42 నిమిషాలసేపు గడిపారు. తర్వాత స్పేస్స్టేషన్లోకొచ్చి మిగతా పనుల్లో పడిపోయారు. ‘‘వెంట తీసుకెళ్లిన వస్తువుల జాబితాను సరిచూసుకోగా ఈ బ్యాగ్ మిస్సయింది. టూల్ బ్యాగ్ దొరకలేదు. స్పేస్వాక్ చేసిన ప్రతిసారీ ఆ బ్యాగ్తో పనిపడదు. అందుకే దానిని తిరిగి వెంటతేవడం వాళ్లు మర్చిపోయారు. అంతరిక్షంలో ఆ బ్యాగ్ పథమార్గాన్ని బట్టిచూస్తే అది ఒకవేళ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొన్నా ఐఎస్ఎస్కు పెద్దగా ముప్పు వాటిల్లకపోవచ్చు’’ అని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ ఒక వెలుగులా కనిపించే టూల్బ్యాగ్ జాడను ఎర్త్స్కై అనే వెబ్సైట్ కనిపెట్టింది. ‘ టూల్బ్యాగ్ భూమికి ఏకంగా 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. మేఘాలు లేకుండా ఆకాశం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నపుడు బైనాక్యులర్ సాయంతో నేరుగా మనం దానిని చూడొచ్చు. ఐఎస్ఎస్ చుట్టుపక్కల చక్కర్లు కొడుతూ కనబడుతుంది. అయితే ఇది అలా కొన్ని నెలలపాటు తిరిగాక సవ్యమైన మార్గాన్ని కోల్పోయి విచి్చన్నమవుతుంది’’ అని వెబ్సైట్ విశ్లేషించింది. ఆ టూల్బ్యాగ్లో ఏమేం వస్తువులు ఉన్నాయనే వివరాలను నాసా బహిర్గతంచేయలేదు. టూల్బ్యాగ్లాగా పాత కృత్రిమ ఉపగ్రహాల సూక్ష్మ శకలాలు వేలాదిగా అంతరిక్షంలో తిరుగుతూ నూతన శాటిలైట్లకు ముప్పుగా పరిణమించాయని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సెపె్టంబర్ నెలలో ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి 35,000 శిథిలాల ముక్కలు అక్కడి పాత శాటిలైట్ల కక్ష్యల్లో తిరుగుతున్నాయి. -
నాలుగు దేశాలు.. నలుగురు వ్యోమగాములు
కేప్ కెనవెరాల్: నాలుగు వేర్వేరు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ ఎక్స్ రాకెట్ శనివారం కేప్ కెనవెరాల్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ఆదివారం నలుగురు వ్యోమగాములు అడుగిడుతారు. మార్చి నెల నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న వ్యోమగాముల స్థానంలో వీరు బాధ్యతలు చేపడతారు. ఆరు నెలలపాటు అక్కడుంటారు. నలుగురిలో ఒకరు నాసాకు చెందిన వారు కాగా, మిగతా ముగ్గురు డెన్మార్క్, జపాన్, రష్యా దేశస్తులు. అమెరికా ఇలా ఒకే అంతరిక్ష నౌకలో వేర్వేరు దేశాలకు చెందిన వారిని ఐఎస్ఎస్కు పంపించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు నాసా పంపించిన స్పేస్ ఎక్స్ ట్యాక్సీ రాకెట్లలో ఇద్దరు లేదా ముగ్గురు అమెరికన్లు ఉండేవారు. తాజా బృందానికి నాసాకు చెందిన జాస్మిన్ మొఘ్బెలి అనే మెరైన్ పైలట్ నాయకత్వం వహిస్తున్నారు. జాస్మిన్ తల్లిదండ్రులు ఇరాన్ దేశస్తులు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో జర్మనీ వెళ్లిపోయారు. అక్కడే జాస్మిన్ పుట్టారు. న్యూయార్క్లో పెరిగారు. అమెరికా మెరైన్స్ చేరి అఫ్గానిస్తాన్లో యుద్ధ హెలికాప్టర్లు నడిపారు. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని ఇరాన్ బాలికలకు చూపుతున్నానని ఆమె అంటున్నారు. -
వ్యోమగాముల మెదడుకు ముప్పు!
అంతరిక్ష ప్రయోగాలంటే అందరికీ ఆసక్తే. అంతరిక్ష రహస్యాలను ఛేదించడానికి వ్యోమగాములు (అస్ట్రోనాట్స్) శ్రమిస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘకాలం గగనతలంలోనే ఉండాల్సి వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్), నాసా స్పేస్ షటిల్స్లో వ్యోమగాములు నెలల తరబడి గడపాల్సి ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా కొన్నిసార్లు సంవత్సరానికిపైగానే అంతరిక్షంలో ఉండిపోవాలి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగా అక్కడ ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి ఉండదన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ప్రధానంగా మెదడులో జరిగే మార్పులేమిటి? దీనిపై అమెరికా సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ వివరాలను ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్లో ప్రచురించారు. ► అధ్యయనంలో భాగంగా 30 మంది అస్ట్రోనాట్స్ బ్రెయిన్ స్కానింగ్లను క్షుణ్నంగా పరిశీలించారు. అంతరిక్షంలోకి వెళ్లడానికి ముందు, వెళ్లివచ్చిన తర్వాత బ్రెయిన్ స్కానింగ్లను సేకరించి, పరిశీలించారు. ► 30 మందిలో 8 మంది రెండు వారాలపాటు అంతరిక్షంలో ఉన్నారు. 18 మంది ఆరు నెలలు, నలుగురు దాదాపు సంవత్సరంపాటు అంతరిక్షంలో ఉండి వచ్చారు. ► ఆరు నెలలకుపైగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల మెదడులోని జఠరికలు(వెట్రికల్స్) కొంత వెడల్పుగా విస్తరించినట్లు గుర్తించారు. ఈ మార్పు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందంటున్నారు. ► మెదడులోని ఖాళీ భాగాలనే జఠరికలు అంటారు. ఇందులో సెరిబ్రోస్పైనల్ ద్రవం ఉంటుంది. వర్ణ రహితమైన ఈ ద్రవం మెదడుచుట్టూ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మెదడుకు రక్షణ కల్పిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది. ► జఠరికల విస్తరణ వల్ల మెదడులోని కణజాలం ఒత్తిడికి గురవుతున్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని చెబుతున్నారు. జఠరికల్లో మార్పుల కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న దానిపై పరిశోధకులు దృష్టి పెట్టారు. ► అంతరిక్షంలో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువగా జఠరికల్లో మార్పులు సంభవిస్తాయని, తద్వారా మెదడు పరిమాణం పెరిగి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని గమనించినట్లు సైంటిస్టు రేచల్ సీడ్లర్ చెప్పారు. ఆరు నెలలకుపైగా ఉన్నవారికే ముప్పు ఉన్నట్లు తేలిందని అన్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక మెదడు ఎప్పటిలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి 3 సంవత్సరాలు పడుతున్నట్లు వివరించారు. ► భూమిపై మనిషి శరీరంలో రక్తప్రసరణ ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. నరాల్లో కవాటాలు(వాల్వులు) ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో రక్తం పైనుంచి పాదాల్లోకి ప్రవహించి, అక్కడే స్థిరపడకుండా ఈ కవాటాలు అడ్డుకుంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో ఇందుకు వ్యతిరేక దిశలో జరుగుతుంది. రక్తం, ఇతర ద్రవాలు నరాల గుండా తలలోకి చేరుకుంటాయి. తలపై ఒత్తిడిని కలుగజేస్తాయి. దీనివల్ల మెదడులో జఠరికలు విస్తరిస్తున్నట్లు, కపాలంలో మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ► ఆరు నెలల్లోగా అంతరిక్షం నుంచి తిరిగివచ్చేవారికి ప్రమాదం ఏమీ లేదని, వారి మెదడులో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..
కేప్ కెనవెరాల్: అరబ్ దేశాల నుంచి మొట్టమొదటి వ్యోమగామి సహా మూడు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకుంది. ఆరు నెలల ఈ మిషన్లో యూఏఈ రెండో వ్యోమగామి సుల్తాన్ అల్–నెయాడీ పాలుపంచుకుంటున్నారు. నెయాడీతోపాటు అమెరికాకు చెందిన స్టీఫెన్ బోవెన్, వారెన్ హొబర్గ్, రష్యాకు చెందిన అండ్రీ ఫెడ్యాయెవ్ ఉన్నారు. వీరు అక్కడికి చేరుకున్నాక ఐఎస్ఎస్లో గత ఏడాది అక్టోబర్ నుంచి ఉంటున్న అమెరికా, రష్యా, జపాన్ వ్యోమగాములు భూమిపైకి చేరుకోవాల్సి ఉంది. -
అంతరిక్షంలో సినిమా షూటింగ్
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ తన తదుపరి సినిమాలో ఒక సీక్వెన్స్ను నాసా సహకారంతో అంతరిక్షంలో షూట్ చేయబోతున్నారన్న వార్త ఇటీవల అందరినీ ఆకర్షించింది. కానీ ఆయన కంటే ముందే రష్యా ఈ ఘనత సాధించేసింది. రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో రూపొందిస్తున్న సినిమా ‘ద చాలెంజ్’లో ఒక సీక్వెన్స్ను 2021 అక్టోబర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తీశారు. అందులో నటించిన యూలియా పెరెస్లిడ్తో కలిసి ఇందుకోసం 12 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. తద్వారా అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్ రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఓ కాస్మొనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్ఎస్కు వెళ్లిన డాక్టర్గా యూలియా ఇందులో నటిస్తోంది. షూట్ కోసం సినిమా బృందం ఐఎస్ఎస్లో లాండైన తీరును కూడా సినిమాలో చూపించనున్నారు. మున్ముందు చంద్రునితో పాటు అంగారకునిపైనా షూటింగ్ చేస్తానని క్లిమ్ చెబుతున్నారు! -
సొంతంగా స్పేస్ స్టేషన్ని నిర్మించనున్న రష్యా...యూఎస్తో మరో ఆరేళ్లు...
వాషింగ్టన్: రష్యా అంతరిక్ష కేంద్రం చీఫ్ బోరిసోవ్ సంచలన ప్రకటన చేశారు. 2024 నాటికల్లా రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఐతే ఇరు దేశాల మాజీ ప్రచ్ఛన యుద్ధ వ్యతిరేకులు రెండు వారాల కిందటే క్రూ ఎక్స్ఛేంజ్ ఒప్పందంపై సంతకాలు చేసిన తరుణంలో ఆయన ఈ అనుహ్య ప్రకటన వెల్లడించారు. ఇది భవిష్యత్తులో యూఎస్ వ్యోమోగాములు, రష్యన్ వ్యోమోగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విమానాలు పంచుకునేలా వీలు కల్పించే ఒప్పందం. అదీగాక నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్నెల్సన్ రష్యా ఐఎస్ఎస్ భాగస్వామ్యాన్ని 2030 వరకు పొడిగించేలా నాసా, రోస్కోస్మోస్ చర్చలు జరుపుతున్నాయని అన్నారు. పైగా ఈ చర్చలు సఫలం అయ్యేవరకు కూడా రష్యా కొనసాగేలా నాసా ప్రణాళికను అమెరికా శ్వేతసౌధం అమోదించిందని చెప్పారు. అంతేకాదు రష్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తమ సొంత అంతరిక్ష ఔట్పోస్ట్ను నిర్మించి, పనిచేసేంత వరకు తమతో కలిసి పనిచేయాలని నాసా అధికారులు కోరినట్లు తెలిపారు. పైగా రష్యా కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేసింది కూడా. దీంతో అమెరికాతో రష్యా తన భాగస్వామ్యాన్ని మరో ఆరేళ్లు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. 1998లో ప్రారంభించబడిన ఐఎస్ఎస్ యూఎస్-రష్యన్ నేతృత్వంలోని భాగస్వామ్యం నవంబర్ 2020 నుంచి నిరంతరంగా కొనసాగింది. దీనిలో కెనడా, జపాన్తో సహా సుమారు 11 యూరోపియన్ దేశాల భాగస్వామ్యాం కూడా ఉంది. ఐతే రష్యా తమ భాగస్వామ్యంలో భాద్యతలన్నింటిని నెరవేర్చి 2024 తర్వాత నుంచి వైదోగాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు బోరిసోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అన్నారు. కానీ ఐఎస్ఎస్ డైరెక్టర్ రాబిన్ గాటెన్స్ ఈ విషయం గురించి రష్యన్ సహచరులు తనకు తెలియజేయలేదని ఆమె అన్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు వైట్ హౌస్ ప్రతినిధి కరీన్ జీన్-పీటర్స్ కూడా మాస్కో ఐఎస్ఎస్ నుంచి వైదొలగాలనే ఉద్దేశాన్ని అమెరికాకు అధికారికంగా తెలియజేయలేదని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతోనే యూఎస్, రష్యా దేశాల మధ్య సంబంధాలు కొంత మేర దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధాన్ని విరమించుకోమని యూఎస్ పదేపదే హెచ్చరించడమే కాకండా ఆంక్షలు విధించేందుకు కూడా యత్నించింది. దీంతో ఇరు దేశాల మధ్య కాస్త విభేదాలు తలెత్తాయి. ఐతే అమెరికాలోని నాసా అధికారులు మాత్రం ఇరు దేశాల మధ్య అంతరిక్ష కేంద్రంలో ద్వైపాక్షిక సహకారం అలాగే ఉంటుందని చెప్పడం గమనార్హం. అంతేకాదు అమెరికా కాలిఫోర్నియా విశ్యవిద్యాలయం ప్రస్తుత వ్యోమోగామీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారెట్ రీస్మాన్, రిటైర్డ్ వ్యోమగామీ తాము కలిసే ఉన్నామని, తమ భాగస్వామ్య సహకారం అలాగే కొనసాగుతుందని చెప్పడం విశేషం. (చదవండి: యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా... యూఎస్కి స్ట్రాంగ్ వార్నింగ్) -
నాసా సంచలన ప్రకటన.. పుతిన్ ముందస్తు కౌంటర్!
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యాను ఏకాకిని చేసేందుకు అమెరికా శతవిధాల ప్రయత్నించింది. ఆంక్షల ద్వారా ప్రపంచ దేశాలను మాస్కోకు దూరం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయితే.. ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకుంది అగ్రరాజ్యం. రష్యాతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విమానాలను తిరిగి ప్రారంభిస్తామని శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తాజాగా ఒక ప్రకటన చేసింది. ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిరంతర సురక్షిత కార్యకలాపాలను నిర్ధారించడానికి, వ్యోమగాముల జీవితాలను పరిరక్షించడానికి.. అంతరిక్షంలో నిరంతరం US ఉనికిని నిర్ధారించడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంటోంది. నాసా US క్రూ స్పేస్క్రాఫ్ట్-రష్యన్ సోయుజ్లో సమీకృత సిబ్బందిని తిరిగి ప్రారంభిస్తుంది అని నాసా ఆ ప్రకటనలో ప్రకటించింది. అయితే.. నాసా ఈ ప్రకటన కంటే ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోస్ కాస్మోస్ సంస్థ డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ను బాధ్యతల ఆఘమేఘాల మీద తప్పించారు. ఈ మేరకు క్రెమ్లిన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తద్వారా నాసా ప్రకటనకు తాము సానుకూలంగా లేమనే సంకేతాలను ఆయన పంపిచినట్లయ్యింది. #UPDATE Russian President Vladimir Putin has relieved the head of the country's space agency, Dmitry Rogozin, of his duties, according to a decree released by the Kremlin on Friday. 📸 Dmitry Rogozin was appointed in 2018 as the head of Roscosmos. pic.twitter.com/pJpE6V0Aec — AFP News Agency (@AFP) July 15, 2022 నాసా ప్రకటన కంటే ముందే దిమిత్రిని తప్పించడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. నాసాకు అనుకూలంగా వ్యవహరించాడనే ఆరోపణలపైనే ఆయన్ని తొలగించారా అనే కోణంలోనే పలు అంతర్జాతీయ మీడియా హౌజ్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. మరోవైపు రష్యాతో కలిసి పని చేయడం తప్ప.. ఐఎస్ఎస్ విషయంలో అమెరికాకు మరో మార్గం లేదా? అని ప్రశ్నిస్తున్నారు పలువురు. -
అంతరిక్షంలో చెత్తకు కొత్త విరుగుడు.. అక్కడే మండించేందుకు పరికరం
హూస్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో తయారయ్యే వ్యర్థాలను భూమిపైకి తేకుండా అంతరిక్షంలోనే మండించే కొత్త పరికరాన్ని హూస్టన్కు చెందిన నానో ర్యాక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. బిషప్స్ ఎయిర్లాక్ అనే ఈ పరికరంలో ఒకేసారి 600 పౌండ్లు, సుమారు 272 కిలోల చెత్తను ఉంచి కాల్చవచ్చు. ఐఎస్ఎస్లో ఆస్ట్రోనాట్ల వల్ల ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నస్ కార్గో వెహికల్ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇందుకు సమయం పడుతోంది. కానీ, బిషప్స్ ఎయిర్ లాక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలుపలి అంతరిక్షంలోనే మండించి, తిరిగి ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నానోర్యాక్స్ తెలిపింది. -
ఓరి మీ దుంపదెగ..అంతరిక్షంలోనూ టిక్ టాక్ వీడియోలు!
టిక్టాక్ ప్రపంచ దేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ భూమ్మీదే కాదండోయ్...అంతరిక్షంలోనూ ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇటలీకి చెందిన 45ఏళ్ల యురేపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫోరెట్టి టిక్టాక్ వీడియోలతో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న అంతరిక్షంలో ఉన్న ఈఎస్ఏకి చెందిన ఆర్బిటింగ్ ల్యాబ్కు చేరుకున్నారు. 6నెలల పాటు అక్కడ ఉండనున్నారు. అనంతరం భూమ్మీదకు చేరుకోనున్నారు. Back on the International @Space_Station (and TikTok) pic.twitter.com/oCgJSdWKcu — Samantha Cristoforetti (@AstroSamantha) May 6, 2022 అయితే ఈ నేపథ్యంలో ఈఎస్ఏ నుంచి 88 సెకన్ల టిక్ టాక్ వీడియో చేశారు. ఈ వీడియోలో స్పేస్ఎక్స్ఎస్ క్రూ-4 మెషిన్లో భాగంగా టూ 'జీరో - జీ ఇండికేటర్స్' తో పాటు ఎట్టా అనే మంకీ బొమ్మ గురించి వీడియోలో పేర్కొన్నారు. సమంతా తీసిన టిక్ టాక్ వీడియోను 2లక్షల మందికి పైగా వీక్షించగా..8వేల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన టిక్టాక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చదవండి👉ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే? -
అన్నంత పని చేసేసిన రష్యా! షాక్లో అమెరికా, యూరప్ దేశాలు
Russia detaches: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతుండడంతో అమెరికా యూరప్తో సహా పలు దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యా తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. దీంతో పలు అగ్రదేశాలు రష్యా పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. అయితే రష్యా మాత్రం తన దూకుడును తగ్గించకుండా అమెరికాకు వరుస హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అంతటితో ఆగకుండా ప్రస్తుతం అనుకున్నంత పనిచేసేసింది రష్యా ఇప్పడూ. తాను ముందు నుంచి హెచరిస్తున్న విధంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగింది. అంతేకాదు తాను అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగితే ఎదురయ్యే పరిణామాల గురించి రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ అమెరికాను ముందుగానే హెచ్చరించారు కూడా. ఈ మేరకు రష్యా తాను అంతరిక్ష కేంద్రం నుంచి డిస్కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను సోషల మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు అమెరికా ఆంక్షలు విధించిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియోని అనూహ్యంగా విడుదల చేసింది. అయితే 47 సెకన్ల నిడివి గల వీడియోలో రష్యన్ వ్యోమగాములు రష్యన్ హాచ్ను లాక్ చేసి, ఫ్లయింగ్ అవుట్పోస్ట్ నుంచి దూరంగా జ్వెజ్డా మాడ్యూల్లో విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తుంది. మాడ్యూల్ స్టేషన్ నివాస గృహాలకు ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. యూఎస్ విభాగంలో జపనీస్, యూరోపియన్ ప్రయోగశాలలు ఉన్నాయి. జ్వెజ్డా మాడ్యూల్ మొత్తం అవుట్పోస్ట్కు స్పేస్ టగ్గా కూడా పనిచేస్తుంది. స్టేషన్ను స్పేస్ జంక్ నుండి దూరంగా నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మాడ్యూల్లోని లైఫ్-సపోర్ట్ సిస్టమ్ యూఎస్ ల్యాబ్, డెస్టినీ లోపల ఉన్న సిస్టమ్తో కలిసి పని చేస్తుంది, ఇది మొత్తం అవుట్పోస్ట్లో కీలకమైన భాగం. ప్రస్తుతం స్పేస్ స్టేషన్లో అమెరికన్, రష్యన్, యూరోపియన్ సంతతికి చెందిన ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. ఆ స్పేస్ స్టేషన్ నుంచి రష్యా వైదొలగి ఆ 500 టన్నుల నిర్మాణాన్ని భారత్కి, చైనాకి వదిలేసే అవకాశం కూడా ఉంది. వచ్చే ఐదేళ్లలో రష్యా ఇప్పటికే చైనా తరహాలో సొంత స్పేస్ స్టేషన్ కోసం ప్లాన్ చేస్తోంది కూడా. Russian Roskosmos creates a “joke” film about disconnecting of the Russian ISS modules from the station. Russian ISS modules like Zvezda provide most of the life support systems to the orbital station pic.twitter.com/qIVZphvfam — Dmitri Alperovitch (@DAlperovitch) March 5, 2022 (చదవండి: మోదీజీ యుద్ధం ఆపమని పుతిన్కి చెప్పండి!) -
ప్రపంచంలో మరో వింత.. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో!
అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?. కానీ, మీరు చదివింది నిజమే. స్పేస్ ఎంటర్ ప్రైజ్(సీఈఈ) ప్లాన్ చేసిన విధంగా అన్నీ పనులు జరిగితే డిసెంబర్ 2024లో అంతరిక్షంలో ఒక ఫిల్మ్ స్టూడియో ప్రారంభంకానుంది. అంతరిక్షంలో మూవీ ప్రొడక్షన్ స్టూడియో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు యు.కె.కు చెందిన స్పేస్ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజ్(సీఈఈ) ప్రకటించింది. సీఈఈ-1 పేరుతో ఈ మాడ్యూల్'ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వాణిజ్య విభాగమైన ఆక్సియోమ్ స్టేషన్కు అనుసంధానం చేస్తారు. ఆక్సియోమ్ తన స్వంత మాడ్యూల్ ఆక్సియోమ్ స్టేషన్ను సెప్టెంబర్ 2024లో ఐఎస్ఎస్'కు అనుసంధానించాలని యోచిస్తోంది. ఆ రెండు నెలల తర్వాత సీఈఈ-1 ఆక్సియోమ్ స్టేషన్ తో అనుసంధానం కానుంది. ఆక్సియోమ్ స్టేషన్ 2028లో ఐఎస్ఎస్ నుంచి విడిపోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుందో ఎక్కడ పేర్కొనలేదు. ఈ అంతరిక్ష మాడ్యూల్ వల్ల ఫిల్మ్ మేకర్లు, కళాకారులు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తక్కువ భూ కక్ష్య(లియో)లో మైక్రోగ్రావిటీలో షూటింగ్ చేసే అవకాశం ఏర్పడుతుంది. అంతరిక్షంలో షూటింగ్ గతంలో రష్యాకి చెందిన 'ది ఛాలెంజ్' అనే సినిమా కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ అంతరిక్షానికి వెళ్లి అక్కడ షూటింగ్ చేశారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్తో కలిసి ఐఎస్ఎస్ వెళ్లారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్ ఐఎస్ఎస్కు వెళ్లే సీన్ ను చిత్రీకరించడానికి స్పేస్ కి వెళ్లారు. సినిమాలో ఈ ఎపిసోడ్ దాదాపు 35 నుంచి 40 నిమిషాల వరకు ఉంటుందట. -
కోట్లకు అధిపతి.. కానీ డెలివరీ బాయ్గా మారాడు
గతంలో తినాలంటే ఇంట్లో చేసిన ఫుడ్ లేదా బయట హాటల్కి వెళ్లి కడుపునిండా ఆరగించేవాళ్లం. టెక్నాలజీ పుణ్యమా అని పుడ్ కూడా డెలివరీ యాప్స్ ద్వారా మన గడప వద్దకే వస్తోంది. ఇంకేముంది కదలకుండానే నచ్చిన ఆహారాన్ని లాగించేస్తున్నాం. ఇదంతా నిత్య జీవితంలో భాగమైపోయింది. అయితే ఇటీవల జరిగిన ఓ ఘటన చాలా అరుదు అని చెప్పాలి. ఎందుకంటే పుడ్ డెలివరీ అంటే 10 లేదా 20 కిలోమీటర్లు డెలివరీ చేస్తారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 400 కిలోమీటర్ల దూరంలోని వ్యక్తికి డెలివరీ చేశాడు. అది డెలివరీ చేసిన బాయ్ కూడా మామూలు వ్యక్తి కాదు.. ఆయనో బిలినియర్ అవ్వడం విశేషం. ఇలా చేయడం అసాధ్యమే కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఉబర్ పుడ్ డెలివరీ సంస్థ. వివరాల ప్రకారం.. అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న ఓ వ్యోమగామికి ఉబెర్ ఈట్స్ ఫుడ్ను డెలివరి చేసింది. ఆ డెలివరీ ఇచ్చింది జపాన్కి చెందిన బిలినియర్ మెజ్వానా. డిసెంబర్ 11న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకోసం ఆయన దాదాపు 12 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలోని కక్ష్యలో ప్రయాణం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Uber Eats のデリバリーは、進化し続けています。 今、配達していない場所へ、次々と。@yousuck2020 さん、配達ありがとうございます🚀#宇宙へデリバリー #UberEats pic.twitter.com/Sh0PsXXwMX — Uber Eats Japan(ウーバーイーツ) (@UberEats_JP) December 14, 2021 -
జపాన్ కుబేరుడి రోదసీ యాత్ర
మాస్కో: జపాన్ బిలియనీర్, ఫ్యాషన్ వ్యాపా రాధిపతి యుసాకు మెజావా బుధవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు పయనమయ్యారు. సొంత నిధులతో అంతరిక్ష యాత్ర చేపట్టిన యుసాకుతో పాటు ప్రముఖ నిర్మాత యోజో హిరానో ఉన్నారు. యుసాకు యాత్రను హిరానో డాక్యమెంటరీగా చిత్రీకరించనున్నా రు. రష్యాకు చెందిన సోయుజ్స్పేస్క్రాఫ్ట్లో రష్యా కాస్మొనాట్ అలెగ్జాండర్ మిస్రుకిన్తో కలిసి వీరిరువురు రోదసీలోకి వెళ్లారు. కజకిస్తాన్లోని బైకనుర్ లాంచింగ్ స్టేషన్ నుంచి ఈ నౌక బయలుదేరింది. 12 రోజుల పాటు యుసాకు, హిరానో ఐఎస్ఎస్లో గడుపుతారు. 2009 తర్వాత స్వీయ నిధులతో ఒకరు రోదసీలోకి వెళ్లడం ఇదే ప్రథమం. యాత్రకు అయ్యే ఖర్చువివరాలు బహిర్గతం కాలేదు. రోదసీ నుంచి భూమిని వీక్షించడాన్ని ఇష్టపడతానని, భార రహిత స్థితిని అనుభవించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని యాత్రకు ముందు యుసాకు చెప్పారు. జపాన్లోని అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ మాల్ జోజోటవున్కు యుసాకు అధిపతి. ఆయన ఆస్తుల మొత్తం సుమారు 200 కోట్ల డాలర్లని అంచనా. 2023లో ఎలాన్ మస్క్ నిర్వహించే చంద్రయాత్రలో కూడా యుసాకు పాలుపంచుకోనున్నారు. -
NASA: నాసా కొత్త టీంలో అనిల్ మీనన్
నాసా.. అమెరికా స్పేస్ ఏజెన్సీ. కానీ, ప్రపంచం దృష్టిలో అత్యున్నతమైన అంతరిక్ష ప్రయోగాలకు ఇది నెలవనే అభిప్రాయం ఉంది. అందుకే నాసాలో పని చేయడానికి దేశాలకతీతకంగా సైంటిస్టులు, రీసెర్చర్లు ఉవ్విళ్లూరుతుంటారు. అదే టైంలో టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో నాసా ఎప్పుడూ ముందుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త ఆస్ట్రోనాట్ టీంను ప్రకటించింది. సోమవారం కొత్తగా పది మందితో కూడిన ఆస్ట్రోనాట్ బృందాన్ని ప్రకటించింది నాసా. మొత్తం 12,000 అప్లికేషన్లు రాగా, అందులోంచి ఈ పది మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీళ్లంతా నాసా భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లలో పాల్గొననున్నారు. ఇక ఈ టీంలో భారత మూలాలున్న అనిల్ మీనన్ ఇందులో ఒకరు. We're honored to announce the 2021 class of NASA Astronaut Candidates! Get to know them: https://t.co/NbU6BlaTQK. All 10 of these individuals are taking YOUR #askNASA questions, right here on this thread. What do you want to ask them about becoming a NASA Astronaut? pic.twitter.com/byeGl8yphh — NASA Astronauts (@NASA_Astronauts) December 6, 2021 ►45 ఏళ్ల అనిల్ మీనన్.. నాసా ఫ్లయిట్ సర్జన్గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు. ►ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో డిప్యూటీ క్రూ సర్జన్గా వ్యవహరించారు కూడా. ►డాక్టర్ అనిల్ మీనన్ భారత మూలాలున్న వ్యక్తే. ►నాసాలోని బయోడేటా ప్రకారం.. అనిల్ మీనన్.. ఉక్రెయిన్-భారత సంతతికి చెందిన పేరెంట్స్కి జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మిన్నియాపొలిస్(మిన్నెసోటా)లో. ►1999లో హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీ అందిపుచ్చుకున్నారు. ►2004లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ►2009 స్టాన్ఫర్డ్ మెడికల్ స్కూల్ నుంచి మెడిసిన్లో డాక్టరేట్ పూర్తి చేశారాయన ►యూఎస్ ఎయిర్ఫోర్స్లో కొంతకాలం విధులు నిర్వహించారు ►2018లో స్పేస్ఎక్స్లో చేరిన అనిల్.. కంపెనీ ఫస్ట్ హ్యూమన్ ఫ్లైట్ ప్రిపరేషన్లో పాలుపంచుకున్నాడు. ►స్పేస్ఎక్స్ ఐదు లాంఛ్లకు సంబంధించి.. ఫ్లైట్ సర్జన్గా విధులు నిర్వహించారు. ►కాలిఫోర్నియా ఎయిర్ నేషనల్ గార్డ్లో చేరిన మీనన్, అడవుల్లో సంచరించేవాళ్లు హఠాత్తుగా గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించడంలో నేర్పరి కూడా. ►ఎమర్జెన్సీ మెడిసిన్, స్పేస్ మెడిసిన్ మీద ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ ప్రచురించారాయన. ►ప్రస్తుతం ఆయన ఫ్లయిట్ సర్జన్గా నాసాలో పని చేస్తూ.. హోస్టన్లో ఉంటున్నారు. భార్య అన్నా మీనన్తో అనిల్ ►నాసా ప్రొఫైల్ ప్రకారం.. అనిల్ మీనన్ 2010 హైతీ భూకంప సమయంలో, 2015 నేపాల్ భూకంప సమయంలో, 2011 రెనో ఎయిర్షో ప్రమాద సమయంలో ముందుగా స్పందించారు. ►భార్య అన్నా మీనన్తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ►నాసా అడ్మినిస్ట్రేటర్ బిల నెల్సన్.. ఆస్ట్రోనాట్ బృందాన్ని స్వయంగా ప్రకటించారు. వీళ్లను ఐదు కేటగిరీల శిక్షణ ఇప్పిస్తారు. అందులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సంక్లిష్ట సమస్యల పరిష్కారం, స్పేస్వాక్ శిక్షణ, సంక్షిష్టమైన రొబోటిక్ స్కిల్స్ను డెవలప్ చేసుకోవడం, టీ-38 ట్రైనింగ్ జెట్ను సురక్షితంగా ఆపరేట్ చేయడం, చివరగా.. రష్యన్ లాంగ్వేజ్ స్కిల్స్ శిక్షణ. ► 2022 జనవరిలో అనిల్ మీనన్ నాసా ఆస్ట్రోనాట్ టీంలో చేరి.. శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. చదవండి: ఐఎంఎఫ్లో నెంబర్ 2 మన ఆడపడుచు -
అంతరిక్ష చెత్త భయంతో ఆగిన స్పేస్వాక్
కేప్ కనావెరల్: అంతరిక్షంలో తాజాగా పెరిగిన ‘చెత్త’ కారణంగా అమెరికా నాసా తన స్పేస్వాక్ కార్యక్రమాన్ని వాయిదావేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు సమీపంగా వేగంగా పరిభ్రమిస్తున్న శకలాలు స్పేస్వాక్ సమయంలో వ్యోమగాముల సూట్కు తూట్లు పెట్టే ప్రమాదముందని స్పేస్వాక్ను ఆపేశారు. ఐఎస్ఎస్కూ నష్టం వాటిల్లవచ్చని భావించారు. ఐఎస్ఎస్ బయటి యాంటీనాను మార్చేందుకు వ్యోమగాములు సిద్ధమయ్యారు. అయితే, సోమవారం రాత్రి ఒక శకలం ఐఎస్ఎస్కు దగ్గరగా దూసుకెళ్లవచ్చని అంచనాకొచ్చారు. దీంతో యాంటీనా పునరుద్ధరణ కార్యక్రమం ఆగింది. నవంబర్ 15న తన పాత కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా క్షిపణి సాయంతో పేల్చేసింది. దాంతో 1,700 పెద్ద, వేలాది సూక్ష్మ శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. స్పేస్వాక్కు ఆటంకం కల్గించింది ఈ శకలాలా? కాదా? అనేది నిర్ధారణ కాలేదని నాసా అధికారులు చెప్పారు. -
రష్యా మిస్సైల్ పరీక్షలతో ప్రపంచానికి పెనుముప్పు
రష్యా తాజాగా యాంటీ శాటిలైట్ మిస్సైల్ను పరీక్షించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా బాధ్యతారహితంగా, ప్రమాదకరమైన రీతిలో వ్యవహరించినట్లు అమెరికా పేర్కొంది. ఈ యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షలో భాగంగా రష్యా తన స్వంత శాటిలైట్లలో ఒకదానిని పేల్చివేసింది. రష్యా ఈ పరీక్ష చేయడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని సిబ్బందికి ప్రమాదం ఏర్పడింది అని, ఆ సిబ్బంది రక్షణ కోసం(ఐఎస్ఎస్) క్యాప్సూల్స్లో దాక్కోవాల్సి వచ్చినట్లు అమెరికా తెలిపింది. స్పేస్ స్టేషన్లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో నలుగురు అమెరికన్లు, ఒక జర్మన్, ఇద్దరు రష్యన్లు. ఈ రష్యన్ యాంటీ శాటిలైట్ క్షిపణి పరీక్షలో తన స్వంత శాటిలైట్లను పేల్చడంతో అంతరిక్షంలో 1,500కు పైగా ఉపగ్రహ శకలాలు భూనిమ్న కక్ష్య(ఎల్ఈఓ)లో తిరుగుతున్నాయి. ఈ ప్రత్యక్ష ఆరోహణ యాంటీ శాటిలైట్(డిఏ-ఏఎస్ఎటి) క్షిపణి పరీక్ష వల్ల వేలాది చిన్న ముక్కలను అంతరిక్షంలో తిరుగుతున్నాయి, వీటిని ట్రాక్ చేయడం కష్టం అని అంతరిక్ష నిపుణులు తెలుపుతున్నారు. నాసా, రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ఈ ఉపగ్రహ శకలాలు నుంచి అంతరిక్ష కేంద్రానికి ప్రస్తుతానికి ముప్పు లేదని పేర్కొన్నప్పటికి, ఉపగ్రహంను పేల్చడంతో వెలువడిన ఎగిరిన రాతి, ధూళి కణాలు లేదా పెయింట్ చిప్స్ వంటి ట్రాక్ చేయడానికి వీలు కానీ వాటి వల్ల అంతరిక్షంలో ప్రమాదం ఏర్పడే అవకాశమ ఉన్నట్లు తెలిపారు. ఉపగ్రహ శకలాలు ప్రతి 93 నిమిషాలకు ఒకసారి ఐఎస్ఎస్ను దాటుతున్నట్లు ఖగోళ శాస్త్రవేత్త & శాటిలైట్ ట్రాకర్ జోనాథన్ మెక్ డోవెల్ తెలిపారు. (చదవండి: హైడ్రోజన్ కారు 484 కి.మీ మైలేజీ.. గరిష్ట వేగం 353 కి.మీ) సైన్స్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్న కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. అమెరికా స్పేస్ కమాండ్ సెంటర్ ఈ పరీక్షను తీవ్రంగా ఖండించింది. అన్ని దేశాల అంతరిక్ష భద్రతపట్ల రష్యా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించినట్లు పేర్కొంది. దీర్ఘకాలిక అంతరిక్ష కార్యకలాపాలకు ఇది ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నట్లు యుఎస్ స్పేస్ కమాండ్ కమాండర్ జనరల్ జేమ్స్ డికిన్సన్ అన్నారు. దీనివల్ల ప్రపంచానికి పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అని అన్నారు. 1982లో ప్రయోగించిన తన సొంత ఉపగ్రహం కాస్మోస్-1408ను రష్యా పేల్చినట్లు తెలుస్తోంది. ఈ పనిచేయని ఉపగ్రహం సుమారు 2,000 కిలోల బరువు ఉంది. చివరిసారిగా 485 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలో ట్రాక్ చేసినట్లు స్పేస్ న్యూస్ తెలిపింది. ఐఎస్ఎస్ భూమికి 402 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ఉంది. రష్యా చేసిన పని వల్ల అంతర్జాతీయ అంతరిక్ష సంస్థకు ముప్పు ఉందని, చైనా స్పేస్ స్టేషన్కు చెందిన టైకోనాట్లకు కూడా విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఆరోపిస్తోంది. అయితే ఈ ఘటన పట్ల రష్యా స్పేస్ ఏజెన్సీ స్పందించలేదు. చైనా, భారతదేశం, రష్యా, యుఎస్ వంటి నాలుగు దేశాలు మాత్రమే యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించగలిగాయి. -
తాత పుట్టింది మహబూబ్నగర్.. మనవడు అడుగు పెట్టేది చంద్ర మండలం
జాబిల్లిపై పరిశోధనలు విస్తృతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రాయాన్ ప్రయోగాల్లో బిజీగా ఉండగానే భారత మూలాలు ఉన్న మరో వ్యక్తి ఏకంగా జాబిల్లిపై అడుగు పెట్టేందుకు ఆకాశంలోకి అడుగు పెట్టాడు. Raja Chari-Led SpaceX Crew-3 Mission Lifts Off: నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి పంపించేందుకు ప్రయోగించిన స్పేస్ఫ్లైట్ స్పేస్ఎక్స్ క్రూ 3లో ఇండో అమెరికన్ రాజాచారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. రాచాచారితో పాటు మిషన్ స్పెషలిస్ట్ కేయ్లా బారోన్, వెటరన్ అస్ట్రోనాట్ టామ్ మార్ష్బర్న్లు అంతరిక్ష యానానికి బయల్దేరి వెళ్లారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్ స్టేషన్ నుంచి నిప్పులు కక్కుకుంటూ వీరిని ఫాల్కన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. #Crew3... 2... 1... and liftoff! Three @NASA_Astronauts and one @ESA astronaut are on their way to the @Space_Station aboard the @SpaceX Crew Dragon Endurance: pic.twitter.com/dxobsFb4Pa — NASA (@NASA) November 11, 2021 మూలాలు మహబూబ్నగర్లో అంతరిక్షంలో అడుగు పెడుతున్న రాజాచారి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి అమెరికాలో సెటిల్ అయ్యారు. శ్రీనివాసాచారి తండ్రి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా. అక్కడి నుంచి గణితం బోధించే అధ్యాపకుడిగా పని చేసేందుకు హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్ టూ అమెరికా ఉస్మానియా యూనివవర్సిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు శ్రీనివాసాచారి. అక్కడ ఉద్యోగం చేస్తూ అమెరికన్ మహిళ పెగ్గీ ఎగ్బర్ట్ని వివాహం చేసుకున్నారు. వీరికి 1977 జూన్ 24న రాజాచారి జన్మించారు. రాజాచారి పూర్తి పేరు రాజా జాన్ వీర్పుత్తూర్ చారి. అస్ట్రోనాట్ చిన్నప్పటి నుంచే అస్ట్రోనాట్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నారు చారి. అందుకు తగ్గట్టే చదువులోనే కాదు ఆటపాటల్లోనూ ఆస్ట్రోనాట్ కల ప్రతిబింబిచేలా ప్రవర్తించేవారు. అందుకు తగ్గట్టే 1995లో యూఎస్ స్టేట్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో చేరారు. ఆ తర్వాత 1999లో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఇదే విభాగంలో 2011లో మాస్టర్స్ పూర్తి చేశారు. నాసాలోకి ఎంట్రీ అంతరిక్ష పరిశోధనల కోసం నాసా 2017లో ఎంపిక చేసిన అస్ట్రోనాట్ గ్రూప్ 22కి ఎంపికయ్యారు రాజా చారి. రెండేళ్ల శిక్షణ అనంతరం 2024లో నాసా చంద్రుడి మీద ప్రయోగాల కోసం చేపట్టనున్న ఆర్టెమిస్ టీమ్కి సైతం ఎంపికయ్యారు. ఆ ప్రాజెక్టు సన్నహకాల్లో భాగంగా కమాండ్ ఇన్ ఛీఫ్ హోదాలో స్పేస్ ఎక్స్ క్రూ 3లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్లారు. We like turtles. There are three aboard the #Crew3 Endurance capsule on the way to the @Space_Station: Two from the "Turtles" class of astronauts, Kayla Barron and @Astro_Raja, and the third... well, can you spot the zero G indicator? pic.twitter.com/kBmxKawusH — NASA (@NASA) November 11, 2021 ట్యాంక్బండ్ జ్ఞాపకాలు మరిచిపోలేను ‘నా తండ్రి మూలాలు భారత్లో ఉన్నాయనే విషయం నేను మరిచపోలేదు. ఇప్పటి వరకు మూడు సార్లు హైదరాబాద్కి వచ్చాను. అక్కడ మా బంధువులు చాలా మంది ఉన్నారు. చిన్నతనంలో వేసవి సెలవులకు హైదరాబాద్ వచ్చినప్పుడు ట్యాంక్బండ్కి వెళ్లాం. చాలా ఎంజాయ్ చేశాం. సంతోషంగా గడిపిన ఆ రోజులను నేను ఎన్నడూ మరిచిపోను’ అంటూ భాగ్యనగరంతో తనకున్న అనుభవాలను ఇటీవల నెమరువేసుకున్నారు రాజాచారి. అంతేకాదు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడి ఫుడ్ బాగా ఎంజాయ్ చేశానని, కొన్ని తెలుగు పదాలు కూడా నేర్చుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ తెలుగు పదాలు అంతగా గుర్తులేవన్నారు. "It's really mind boggling when you think about how much effort it takes to put people in space and then to sustain them in space." — @Astro_Raja, Commander of the #Crew3 mission to the @Space_Station. pic.twitter.com/FGv5w46Q7a — NASA (@NASA) November 10, 2021 త్వరలో జాబిల్లిపైకి రాజాచారి ప్రస్తుతం హుస్టన్ నగరంలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతరిక్ష స్పేస్ స్టేషన్లో ప్రయోగాలు ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన చంద్రమండల యాత్రకు సన్నద్ధం అవుతారు. చదవండి: చల్లని ‘రాజా’ ఓ చందమామ -
అద్భుతం: 'లక్షల కోట్లను సేవ్ చేసిన టీ బ్యాగ్'
మనకో కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తే .. గడ్డిపోచని సైతం బ్రహ్మస్త్రంగా మార్చుకోవచ్చు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడొచ్చు. వీళ్లు కూడా అదే చేశారు. అది భూమి మీద కాదు. భూమి నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ స్టేషన్లో. ఓ చిన్న టీ బ్యాగ్ లక్షల కోట్లకు పైగా నష్టాన్ని, అందులో ఉన్న ఆస్ట్రానాట్స్ ప్రాణాల్ని కాపాడగలిగింది. అదెలా అంటారా? వరుస ప్రమాదాలు ఇటీవల కాలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాలం చెల్లిన హార్డ్వేర్, సిస్టమ్స్ కారణమనే ఆరోపణలు వెల్లువెత్తతున్నాయి. అయినా ఆస్ట్రోనాట్స్ ఎప్పటికప్పుడు ఆ ప్రమాదాల్ని నివారిస్తూనే ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో స్పేస్ స్టేషన్లోని ఓ విభాగంలో రంధ్రం పడింది. ఈ స్పేస్ స్టేషన్ ప్రతి రోజూ భూమి చుట్టూ 15.5 సార్లు ప్రయాణిస్తుంది. ఒక్కో కక్ష్య చుట్టి రావడానికి 93 నిమిషాల సమయం పడుతుంది. అయితే మాడ్యుల్లో పడిన ఈ రంధ్రం వల్ల ప్రతి రోజూ 250 గ్రాముల (0.6 పౌండ్ల) కంటే ఎక్కువ గాలిని కోల్పోయింది. లీకవుతున్న గాలిని ఎలా గుర్తించారు. స్పేస్ స్టేషన్లో యూఎస్ఏ, జపాన్, రష్యా, కెనడా, యూరప్ దేశాలకు చెందిన ఆస్ట్రోనాట్స్ ప్రయోగాలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో రంధ్రం పడిన మరుసటి రోజు స్పేస్ స్టేషన్కి ఏదో ప్రమాదం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే స్పేస్ స్టేషన్లో ప్రమాదాన్ని గుర్తించే పనిలో పడ్డారు. ప్రతి సెక్షన్ను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇలా ఒక్కోస్టేషన్లో ప్రమాదాన్ని గుర్తించేందుకు నాలుగురోజులు సమయం పట్టింది. అయినా వాళ్లకు నిరాశే ఎదురైంది. ఇక అన్ని మాడ్యుల్స్ను క్లోజ్ చేస్తూ చివరిగా స్పేస్ స్టేషన్లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఉండే రష్యా ఆస్ట్రోనాట్స్ ఉండే విభాగం 'జ్వెజ్డా'లోకి వచ్చారు. లక్షల కోట్ల నష్టం నుంచి గట్టెక్కించిన టీ బ్యాగ్ జ్వెజ్డా విభాగంలోకి వచ్చిన ఆస్ట్రోనాట్స్ కి అక్కడే లీకేజీ అవుతున్న విషయాన్ని గుర్తించారు. గుర్తించిన వెంటనే స్పేస్ స్టేషన్ ప్రమాదానికి గురవుతుందని, ప్రమాదం వల్ల జరిగే నష్టం గురించి ఇలా అనేక భయాలు ఆస్ట్రోనాట్స్ మెదడులను తొలిచివేస్తున్నాయి. అదే సమయంలో రష్యన్ ఆస్ట్రోనాట్ 'అనాటోలీ ఇవానిషిన్' కు మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిచన్ విభాగంలో ఉన్న టీ బ్యాగ్ ను తెచ్చు. వెంటనే అందులో ఉన్న టీ పొడిని రధ్రం పడిన ప్రాంతాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించారు. అద్భుతం. గాలి లీక్ అవ్వడం ఆగిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్స్ ఆ ప్రాంతాన్ని శాస్వతంగా కవర్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరకు ప్రత్యేకంగా తయారు చేసిన ద్రావాన్ని ఆ హోల్లో పోసి సీల్ వేశారు. దీంతో లక్షల కోట్లకు పైగా విలువ చేసే స్పేస్ స్టేషన్ను, అందులో పనిచేస్తున్న ఆస్ట్రోనాట్స్ ప్రాణాల్ని కాపడగలిగారు. రంధ్రం పడితే ఏమవుతుంది నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్పేస్ స్టేషన్కు రంధ్రం పడడం వల్ల లోపలి గాలి బయటకు విడుదలవుతుంది. ఆ సమయంలో స్పేస్ లోపల ఉన్న అంతరిక్షంలో ఉన్నపుడు వ్యోమగాముల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కాళ్లలోని ఎముకలు, వెన్నెముకపై శరీరబరువు పడదు. దాంతో కాల్షియం విడుదలపై ప్రభావం పడి ఎముకలు, వెన్నుపూస విరిగే ప్రమాదం ఉంది. వీటితో పాటు రక్త ప్రసరణ ఇతర శరీర భాగాలకు వెళ్లకుండా ఆగిపోతుంది. ఐఎస్ఎస్.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)ను 1998లో ప్రారంభించారు. దీని విలువ భారత కరెన్సీ ప్రకారం లక్షకోట్లకు పై మాటే. భూమిపై సాధ్యం కాని పరిశోధనలను అంతరిక్షంలో నిర్వహించేందుకు ఈ కేంద్రాన్ని శాస్త్రవేత్తలు వినియోగించుకుంటుంటారు. ఇప్పటివరకు ఈ కేంద్రంలో 108 దేశాలకు చెందిన పరిశోధకులు 3 వేలకు పైగా పరిశోధనలు జరిపారు. మరి లక్షకోట్ల విలువైన స్పేస్ స్టేషన్ను ప్రమాదం నుంచి కాపాడేందుకు చాకిచక్యంగా ఓ చిన్న టీ బ్యాగ్ను వినియోగించడంపై సహచర ఆస్ట్రోనాట్స్ అనాటోలీపై ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి : నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...! -
అంతరిక్షంలో సినిమా షూటింగ్ విజయవంతం
మాస్కో: రష్యన్ సిని బృందం తొలిసారిగా భూకక్ష్యలో విజయవంతంగా సినిమా షూటింగ్ని పూర్తి చేసుకుంది. రష్యా నటి యులియా పెరెసిల్డ్, దర్శకుడు క్లిమ్ షిపెంకో, వ్యోమగామి అంటోన్ ష్కాప్లెరోవ్ కజికిస్తాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్ ఎంఎస్-18 అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో 12 రోజులు పాటు విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని భూమికి చేరుకున్నారు. అయితే వీరు కజకిస్తాన్ స్టెప్పీ సమీపంలో సురక్షింతంగా ల్యాండ్ అయ్యినట్లు రష్యన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ మేరకు ఈ సినిమా బడ్జెట్ వ్యయం విషయం కూడా అత్యంత గోప్యంగా ఉంచారు. పైగా వారు ఈ ప్రయాణం కోసం నాలుగు నెలలు శిక్షణను కూడా తీసుకున్నారు. అంతేకాకుండా అమెరికాలో అత్యాధునిక రాకెట్ ప్రయోగాలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేసేలా సరి కొత్త చరిత్రను తిరగారాయలన్న ఉద్దేశంతోనే రష్యా స్పేస్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ మేరకు 'చాలెంజ్' అను పేరుతో నిర్మిస్తున్న ఈ సినిమా అంతరిక్షంలోని వ్యోమోగామీకి గుండె నొప్పి రావడంతో అతనికి చికిత్స చేసేందుకు వెళ్తున్న సర్జన్ ఏ విధంగా అంతరిక్షం చేరుకుంటుంది అనేది ఇతివృత్తంగా చేసుకుని తీస్తున్నారు. ఇందులో ఇద్దరూ రష్యన్ వ్యోమోగాములు అతిధి పాత్రలో నటించడం విశేషం. ఈ సోయుజ్ ఎంఎస్-18 అంతరిక్షం నుంచి తిరిగి భూమికి పయనమయ్యే సమయంలో కొంత సమయం ఇబ్బంది తలెత్తినప్పటికీ సురక్షితం అనుకున్న సమయానికి భూమికి చేరుకన్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ పేర్కొంది. Touchdown after 191 days in space for @Novitskiy_ISS and 12 days in space for two Russian filmmakers! More... https://t.co/CrQl3O1BUl pic.twitter.com/kzXlCTr0og — International Space Station (@Space_Station) October 17, 2021 -
అంతరిక్షంలో సినిమా షూటింగ్
మాస్కో: తొలిసారిగా భూకక్ష్యలో సినిమా షూటింగ్ జరగనుంది. ఇందుకోసం రష్యా నటి, సినిమా డైరెక్టర్ మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకున్నారు. కజఖ్స్తాన్లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిసిన సోయుజ్ అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఈ బృందంలో నటి యులియా పెరెసిల్డ్(37), దర్శకుడు క్లిమ్ షిపెంకో(38)తోపాటు వ్యోమగామి అంటోన్ ష్కాప్లెరోవ్ ఉన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అంటోన్ ఈ ప్రయాణానికి నాయకత్వం వహించారు. ఛాలెంజ్ అనే పేరున్న సినిమాలో నటి యులియా సర్జన్గా నటిస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోని ఒక సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆమె అక్కడికి వెళ్లి చికిత్స అందించే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న నోవిట్స్కీ, పీటర్ డుబ్రోవ్ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నటించనున్నారు. నోవిట్స్కీ గుండెపోటుకు గురైన వ్యోమగామి పాత్ర పోషించనున్నారు. ఈనెల 17వ తేదీన భూమికి చేరుకుని, సినిమాలోని మిగతా సన్నివేశాలను షూట్ చేస్తారు. ఈ ప్రయాణం కోసం నాలుగు నెలల నుంచి కఠిన శిక్షణ పొందారు. ‘ఛాలెంజ్’ను రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ సాయంతో ప్రభుత్వ టీవీ ‘చానెల్ వన్’నిర్మిస్తోంది. సభ్యుల శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే చానెల్ వన్ విస్తృతంగా కవరేజీ అందించింది. ఈ మిషన్ రష్యా శక్తి, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుందని ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. -
చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్..!
అప్పుడప్పుడు మనం సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూస్తూ ఉంటాం. అయితే, అలాంటి చిత్రాల కోసం ప్రత్యేకంగా సెట్స్ డిజైన్ చేయడమో లేదా గ్రాఫిక్స్ రూపంలోనో వాటిని డైరెక్టర్లు చూపిస్తారు. ఆ చిత్రాలు కూడా నిజంగానే అంతరిక్షానికి వెళ్లి తీశారో ఏమో అన్న అనుభూతిని కలిగిస్తాయి. తాజాగా, అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ కోసం రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లారు. షూటింగ్ కోసం ఆ సినిమా డైరెక్టర్, హీరోయిన్ ప్రత్యేక వ్యోమనౌకలో నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఐస్)కు బయల్దేరి వెళ్లారు. ‘ది ఛాలెంజ్’ అనే సినిమా షూటింగ్ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ నేడు అంతరిక్షానికి బయల్దేరారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్తో కలిసి ఐఎస్ఎస్ వెళ్లారు. మన దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో కజకిస్థాన్లోని బైకోనుర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ స్పేస్క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. 12 రోజుల పాటు వీళ్లు స్పేస్ స్టేషన్లోనే ఉండనున్నారు. ఆ తర్వాత వీళ్లను మరో రష్యన్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకు వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం నాలుగు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అంతరిక్షంలో మూవీ షూటింగ్ను రష్యన్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శించినా లెక్క చేయకుండా రష్యన్ స్పేస్ కార్పొరేషన్ రాస్కాస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ ఈ మిషన్లో కీలక పాత్ర పోషించారు. అక్కడి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయితే, అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం రష్యానే కానుంది. గతేడాది ప్రముఖ హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కూడా స్పేస్లో షూటింగ్ చేయడం కోసం సిద్దమైన సంగతి తెలిసిందే. దానికోసం నాసా, స్పేస్-ఎక్స్ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే ఆ తర్వాత దానిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ మధ్య కాలంలో అంతరిక్ష పర్యటన అనేది చాలా ఒక బస్ జర్నీ లాగా మారింది. The #SoyuzMS19 spacecraft successfully reaches orbit 🚀 Cosmonaut @Anton_Astrey and spaceflight participants Yulia Peresild and Klim Shipenko are on their way to the International Space Station! The docking will take place in 3 hours - at 12:12 UTC. pic.twitter.com/viEeHHVovH — РОСКОСМОС (@roscosmos) October 5, 2021 -
‘బార్బీ’ ది ఆస్ట్రోనాట్
బార్బీ బొమ్మలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్. చాలా దేశాల్లో బార్బీతో ఆడుకోని అమ్మాయిలే ఉండరని చెప్పొచ్చు. ఇప్పుడా బార్బీ సరికొత్త రూపం సంతరించుకుని.. అంతరిక్షంలో చక్కర్లు కొట్టేసి వచ్చింది. వచ్చే ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కీ వెళ్లబోతోంది. ‘స్టెమ్’ వైపు అమ్మాయిలు.. ‘సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్’ రంగాల సంక్షిప్త రూపమే ‘స్టెమ్’. ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలను స్టెమ్, స్పేస్ రీసెర్చ్ వైపు ప్రోత్సహించడం, ఆయా రంగాల్లో తమ ఆడపిల్లలను ప్రోత్సహించేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా ‘బార్బీ ఆస్ట్రోనాట్’ను రూపొందించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), బార్బీ బొమ్మల కంపెనీ సంయుక్తంగా ‘వుమన్ ఇన్ స్పేస్’ థీమ్తో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తాజాగా ఈఎస్ఏ నిర్వహించిన ‘వామిట్ కమెట్’ జీరో గ్రావిటీ ప్రయోగంలో బార్బీ బొమ్మకు కూడా స్థానం కల్పించారు. భార రహిత స్థితిలో తేలుతున్న బార్బీ చిత్రాలను విడుదల చేశారు. ఆ రూపం ఎవరిదో తెలుసా..? ఇంతకీ ‘బార్బీ ఆస్ట్రోనాట్’ రూపం ఎవరిదో తెలుసా.. ఇటలీ ఆస్ట్రోనాట్ సమంతా క్రిస్టోఫరెట్టి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త అయిన ఆమె.. ఇంతకుముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 200 రోజులు గడిపి వచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆమె మళ్లీ ఐఎస్ఎస్కు వెళ్తున్నారు. అప్పుడు ‘బార్బీ ఆస్ట్రోనాట్’ను కూడా తన వెంట తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతానికి ఈ ‘బార్బీ ఆస్ట్రోనాట్’ బొమ్మలు యూరప్ దేశాల్లో విక్రయిస్తున్నారు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశముంది. ఈ ఫొటోలో ధగధగా మెరుస్తూ వెంట్రుకల్లా ఉన్నవేమిటో తెలుసా..? అగ్ని పర్వతం నుంచి వెలువడిన గాజు పోగులు. హవాయిలో ఇటీవలే బద్దలైన కిలాయి అగ్ని పర్వతం నుంచి.. అచ్చం వెంట్రుకల్లా సన్నగా, తేలిగ్గా లేత బంగారు రంగులో ఉండే గాజు పోగులు వెలువడుతున్నాయి. వీటిని ‘పెలెస్ హెయిర్’గా పిలుస్తారు. హవాయ్ ప్రజలు పూజించే అగ్నిపర్వతాల దేవత పేరు ‘పెలె’. బంగారు రంగులో ఉండే ఈ గాజు పోగులు ఆ దేవత వెంట్రుకలేనని స్థానికులు చెప్తారు. అందుకే వీటికి పెలెస్ హెయిర్’గా పేరుపెట్టారు. ఎలా ఏర్పడుతాయి? అగ్నిపర్వతం నుంచి వెలువడే లావాలో గాజు బుడగలు ఏర్పడతాయని, అవి పగిలినప్పుడు సన్నగా, వెంట్రుకల్లా ఉండే గాజు పోగులు వెలువడతాయని హవాయ్ వల్కనో అబ్జర్వేటరీ శాస్త్రవేత్త డాన్ స్వాన్సన్ తెలిపారు. తేలిగ్గా ఉండే ఈ గాజు వెంట్రుకలు గాలిలో చాలా ఎత్తువరకు వెళతాయని.. ఎగురుతూ, కొట్టుకుపోతూ విస్తరిస్తుంటాయని చెప్పారు. చూడటానికి అందంగా ఉన్నా.. ఈ గాజు పోగులు ప్రమాదకరమని తెలిపారు. ఇవి పదునుగా ఉంటాయని.. చిన్నచిన్న ముక్కలుగా మారి పీల్చేగాలిలో, తాగే నీటిలో చేరి ఇబ్బందులకు కారణమవుతాయని వెల్లడించారు. 2018లోనూ ఈ అగ్ని పర్వతం లావాను వెదజల్లిందని.. అప్పుడు కూడా ఇలాగే ‘పెలెస్ హెయిర్’ భారీగా వెలువడిందని తెలిపారు. -
వారెవ్వా.. అంతరిక్షంలోకి సమంత
Samantha Cristoforetti Barbie Doll: వన్ సెకన్.. మీరనుకుంటున్న సమంత కాదిమే. ఈమె ఇటాలియన్ ఆస్ట్రోనాట్. పూర్తి పేరు సమంత క్రిస్టోఫోరెట్టి(44). అరుదైన ఓ గౌరవం అందుకుని ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కి మొట్టమొదటి యూరోపియన్ ఫిమేల్ కమాండర్ ఘనత దక్కించుకున్నారు. అంతేకాదు అచ్చం ఆమెలాంటి బొమ్మతో పిల్లల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవంలో భాగంగా మహిళా సాధికారికత దిశగా అడుగులు వేస్తోంది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇందులో భాగంగా అమ్మాయిలకు స్పేస్ స్టడీస్తోపాటు సైన్స్ టెక్నాలజీ మ్యాథ్స్ అండ్ ఇంజినీరింగ్(STEM) రంగాల్లో కెరీర్ పట్ల ఆసక్తి కలిగించేందుకు కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకోసం ఐఎస్ఎస్కు కమాండర్గా వెళ్లబోతున్న సమంత బొమ్మను ఉపయోగించబోతున్నారు. అచ్చం సమంత క్రిస్టోఫోరెట్టి రూపంతో ఉన్న బొమ్మ(బార్బీ డాల్) ఒకదానిని తయారుచేయించి.. అంతరిక్ష ప్రయోగాల్ని, పరిశోధనల అనుభూతుల్ని పిల్లలకు తెలియజెప్పే ప్రయోగం చేస్తున్నారు. ఇందుకోసం జర్మనీకి చెందిన ఓ జీరో గ్రావిటీ ఫ్లైట్ను వినియోగించారు. స్పేస్లోకి వెళ్లే ముందు ఏం చేయాలి? అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాల్ని జీరో గ్రావిటీలో సమంత బొమ్మను ఉపయోగించి చూపిస్తారు. అక్టోబర్ 4-10 మధ్య వరల్డ్ స్పేస్ వీక్ జరుగుతోంది. ఈ ఏడాదిని ‘విమెన్ ఇన్ స్పేస్’ థీమ్తో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె బొమ్మ ద్వారా పిల్లలకు ఆసక్తికరంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయోగం ద్వారా వచ్చే డబ్బును విమెన్ ఇన్ స్పేస్ ప్రోత్సాహకం కోసం ఉపయోగించనున్నట్లు బార్బీ ప్రతినిధి ఇసాబెల్ ఫెర్రెర్ తెలిపారు. ఇక తన బొమ్మ ద్వారా పాఠాలపై సమంత సైతం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే సమంతా క్రిస్టోఫోరెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్లో తర్వాతి మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లనున్నారు. ఆరు నెలలపాటు కమాండర్ హోదాలో ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే బార్బీ గతంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు శాలీ రైడ్, అన్నా కికినా బొమ్మలను సైతం రూపొందించింది. చదవండి: నాసా పోస్ట్ చేసిన బొమ్మ.. అద్భుతం -
నక్షత్రాలు మెరిసేది అందుకేనంట!
మెరుస్తున్న నక్షత్రాలు ఓవైపు.. భూమిపై నగరాల విద్యుత్ ధగధగలు మరోవైపు.. మధ్యలో నారింజ రంగులో వాతావరణం మిలమిలలు.. భూమి, వాతావరణం, అంతరిక్షంలో కాంతులు మూడూ ఒకేచోట కనిపిస్తున్న అరుదైన చిత్రమిది. థామస్ పెస్కెట్ అనే ఫ్రెంచ్ వ్యోమగామి.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ఈ ఫొటో తీశారు. రాత్రిళ్లు భూమ్మీది విద్యుత్ లైట్ల కాంతులు ఐఎస్ఎస్లోని వారికి స్పష్టంగా కనిపిస్తాయి. అదే నక్షత్రాలు ఎప్పుడూ అలా మెరుస్తూనే ఉంటాయి. చదవండి: ఐన్స్టీన్, హాకింగ్లకన్నా ఈ చిన్నారి బుర్ర మరింత స్మార్ట్ కానీ భూమి వాతావరణంలో సుమారు 75 కిలోమీటర్ల ఎత్తున ఉండే సోడియం పొర వెలుగులు మాత్రం.. ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే కనిపిస్తాయి. సూర్యుడు, నక్షత్రాల నుంచి వచ్చే కాంతి, రేడియేషన్ ప్రభావం వల్ల.. సోడియం పొర నారింజ రంగులో మెరుస్తుంది. అది ఇలా రాత్రిపూట వెలుగులు విరజిమ్మడం, భూమ్మీది కాంతులు, నక్షత్రాల మెరుపులు జతకూడటం మాత్రం అరుదే. ఇంతేకాదు.. జాగ్రత్తగా గమనిస్తే ఈ నారింజ రంగు పొరపైన సన్నగా ఆకుపచ్చ రంగులో మరోపొరనూ చూడొచ్చు. ఆక్సిజన్ ఆయాన్లతో కూడిన ఈ పొర సౌర రేడియేషన్ కారణంగా.. ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్! Co2ను గాల్లోంచి గుంజేసి రాళ్లూరప్పల్లో కలిపేస్తది -
వైరల్: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు
వ్యోమగామిగా ఉండటం కష్టమైన ఉద్యోగాలలో ఒకటిని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారు భూమికి దూరంగా వేలాది మైళ్లు ప్రయాణించి తమకిచ్చిన పనిని పూర్తి చేస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే రిస్క్తో కూడుకున్న జాబ్ అనే చెప్పాలి. టెక్నాలజీ పుణ్యమా అని స్పేస్ ప్రయాణం కూడా ముందున్నంత కష్టంగా లేవనే చెప్తున్నారు వ్యోమగామలు. తాజాగా ఓ వ్యోమగాముల బృందం అంతరిక్షంలో పార్టీ చేసుకున్న వీడియో వైరల్గా మారింది. అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లలో రోజులు కాదు నెలల కొద్దీ గడిపేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉన్న కొందరు వ్యోమగాములు అక్కడ సరదాగా పిజ్జా పార్టీ చేసుకున్నారు. ఈ వీడియోను ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్.. థామస్ పెస్క్వెట్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. స్నేహితులతో కలిసి ఓ తేలియాడే పిజ్జా నైట్, మరోలా చెప్పాలంటే మాకిది భూమిపై శనివారం జరుపుకునే పార్టీలా అనిపిస్తుందని క్యాప్షన్గా పెట్టాడు. ఆ వీడియోలో.. స్పేస్ షిప్లో ఉన్న కొందరు వ్యోమగాములు పిజ్జాలు గాలిలో ఎగురుతుంటే.. తమ నోటితో పట్టుకొని తింటున్నారు. అక్కడ ఏ వస్తువు అయినా అలా ఎగురుతూనే ఉంటాయి. స్పేస్లో గ్రావిటీ ఉండదనే సంగతి తెలిసిందే. ఏదైనా సరే గాల్లో గింగిరాలు కొట్టాల్సిందే. అంతెందుకు స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు మనుషులు కూడా గాలిలో ఎగురుతూనే ఉంటారు. అందుకే.. స్పేస్లో ఉండటం చాలా కష్టం. మొత్తానికి.. వ్యోమగాములు పిజ్జా పార్టీ.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరచడంతో పాటు ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Thomas Pesquet (@thom_astro) చదవండి: Italy Fire Accident: ఎత్తైన బిల్డింగ్.. అగ్నికీలలతో సుందర భవనం ఎలా మారిందంటే.. -
అంతరిక్షంలో ఒలింపిక్స్ ఎలా ఆడతారో తెలుసా..?
భూమ్మీద అతిపెద్ద క్రీడా పోటీల సంబరం ఏదంటై ఠక్కున గుర్తొచ్చేది ఒలింపిక్స్. అలాంటి ఒలిపింక్స్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020 పోటీలు 2021లో సాదాసీదాగా జరిగాయి. సత్తా చాటిన క్రీడాకారులు పతకాలు సొంతం చేసుకున్న విజయానందంతో తమ స్వదేశాలకు చేరుకున్నారు. ఆదివారంతో క్రీడా పోటీలు ముగిశాయి. అయితే ఇప్పుడు మరో ఒలింపిక్స్ వార్త వైరల్గా మారింది. ఇన్నాళ్లు భూమ్మీద ఒలింపిక్స్ చూశారు ఇప్పుడు అంతరిక్షంలో కూడా పోటీలు జరిగాయి. వ్యోమగాములు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో పలు పోటీలు సరదాగా ఆడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వారి ఆటలు చూస్తుంటే తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. జిమ్నాస్టిక్స్, ఈత, నో హ్యాండ్బాల్, వెయిట్లెస్ షార్ప్ వంటి ఆటలు ఆడేందుకు తెగ పాట్లు పడుతున్నారు. వారి పాట్లు మనకు హాస్యం పంచుతున్నారు. జీవో గ్రావిటీలో నాలుగు రకాల ఆటలు ఆడారు. బాల్ను పట్టుకునేందుకు.. జంప్స్ చేసేందుకు పడుతున్న కష్టాలు సరదాగా ఉన్నాయి. ఆస్ట్రోనాట్స్ కూడా సరదాగా నవ్వుతూ ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్ థామస్ పెక్క్వెట్ తెలిపారు. అచ్చం భూలోకంలో జరిగినట్టు ఈ ఒలింపిక్స్ వేడుకల ముగింపు కార్యక్రమం కూడా నిర్వహించడం విశేషం. -
ఐఎస్ఎస్కు తప్పిన పెనుముప్పు
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పెనుముప్పు తప్పింది. రష్యా ప్రయోగించిన ఓ మాడ్యూల్లో ఏర్పడిన మంటల కారణంగా ఐఎస్ఎస్ దిశ మారింది. నిమిషానికి అర డిగ్రీ చొప్పున మొత్తం 45 డిగ్రీల కోణంలోకి వెళ్లింది. భూమిపై ఏర్పాటు చేసిన సెన్సర్లు దీన్ని గుర్తించడంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అప్రమత్తమమై దాన్ని సరిచేసింది. అసలేం జరిగింది: గురువారం రష్యాకు చెందిన నౌకా అనే మాడ్యూల్ ఐఎస్ఎస్ వద్దకు ప్రయాణ మైంది. ఐఎస్ఎస్కు అది చేరుకున్న తర్వాత ఆటోమేటిగ్గా దానికి అనుసంధానం కావాల్సి ఉంది. అయితే, అలా జరగలేదు. దీంతో మాన్యువల్గా మాడ్యూల్ను ఐఎస్ఎస్కు అనుసంధానం చేశారు. అంతలోనే మరో సమస్య ఏర్పడింది. నౌకా మాడ్యూల్ లోని థ్రస్టర్లు ఉన్నట్టుండి మండటంతో ఐఎస్ఎస్ దిశ మారడం ప్రారంభమైంది. దీన్ని భూమ్మీద ఉన్న సెన్సర్లు గుర్తించడంతో నాసా శాస్త్రవేత్తలు అప్రమత్త మయ్యారు. నాసాకు చెందిన థ్రస్టర్లను, ఇంజిన్లను పూర్తిగా ఆపేశారు. దానికి వ్యతిరేక దిశలో ఉన్న మరో మాడ్యూల్ నుంచి థ్రస్టర్లను మండించి సరైన దిశకు మళ్లించారు. ఈ ప్రక్రియ 45 నిమిషాల పాటు సాగింది. ప్రారంభంలో మాడ్యూల్ దిశ మారుతుండగా మొదటి 15 నిమిషాల్లో కోల్పోయిన సిగ్నల్స్.. ఐఎస్ఎస్ తిరిగి సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ అందాయి. ప్రమాదం జరిగి ఉంటే.. నాసా శాస్త్రవేత్తలు తక్షణం స్పందించ డంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఐఎస్ఎస్లో ఉన్న ఏడుగురు ఆస్ట్రోనాట్లు ప్రమాదంలో పడి ఉండేవారు. అలా జరిగితే ఆకాశంలోకి తప్పించుకోవడానికి వేరే సదుపాయాలు ఉన్నాయని నాసా పేర్కొంది. తప్పించుకోవడానికే ఏర్పాటు చేసిన స్పేస్ ఎక్స్ క్రూ కాప్సూ్యల్ వారి ప్రాణాలను రక్షించేదని తెలిపింది. -
ఛాలెంజ్ నెగ్గిన నాసా.. ‘స్పేస్’లో మిరపకాయలు?
అంతరిక్షంలో నివాస యోగ్యత గురించి పరిశోధనలు-ప్రయోగాలు ఎన్నేళ్లు సాగుతాయో చెప్పడం కష్టంగా ఉంది. అయితే విశ్వంలోని కొన్ని మర్మాలను చేధించడం, అక్కడి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయోగాలు మాత్రం సజావుగానే సాగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మరో అడుగు ముందుకు వేసింది. స్పేస్ వాతావరణంలో మిరకాయల్ని పండించే ప్రయత్నంలో సగం విజయం సాధించింది. 15,000 వేలకోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చుతో ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మిరపకాయల్ని పండిస్తోంది నాసా. మెక్సికన్ రకానికి చెందిన మేలైన హట్చ్ రకపు మిరప గింజలు ఈ జూన్లో స్పేస్ ఎక్స్ కమర్షియల్ సర్వీస్ ద్వారా స్పేస్ స్టేషన్కు చేరుకున్నాయి. నాసా ఆస్ట్రోనాట్ షేన్ కిమ్బ్రాగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నాడు. కిచెన్ ఓవెన్ సైజులో ఉండే ‘సైన్స్ క్యారియర్’ అనే డివైజ్లో వీటిని పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవి పూర్తిస్థాయిలో ఎదగడానికి నాలుగు నెలలలోపు టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాసా దీన్నొక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పరిశోధనగా అభివర్ణించుకుంటోంది. వ్యోమగాములకు ఆహార కొరత తీర్చే చర్యల్లో భాగంగానే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇదే రీతిలో పూలు, దుంపల కోసం ప్రయత్నించారు కూడా. అయితే జీరోగ్రావిటీ ల్యాబ్లో మిరపకాయల్ని పండించడం వీలుకాదని సైంటిస్టులు నాసాతో ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలో ఛాలెంజింగ్గా తీసుకున్న నాసా.. సత్పలితాన్ని రాబట్టింది. సాధారణంగా స్పేస్ ప్రయాణంలో వ్యోమగాములు వాసన, రుచి సామర్థ్యం కోల్పోతారు. ఆ టైంలో వాళ్లు ‘స్పైసీ’ ఫుడ్కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ తరుణంలో ఈ ప్రయోగం ఫలితానిచ్చేదేనని నాసా అభిప్రాయపడుతోంది. 🌶️ Chile peppers are spicing up the @Space_Station! Recently, @astro_kimbrough added water to NASA’s Plant Habitat-04 experiment. In less than 4⃣ months, @NASA_Astronauts will pick their first harvest. Follow along as these space peppers kick up the heat: https://t.co/KpCVpd850U pic.twitter.com/KS3qvRoz22 — NASA's Kennedy Space Center (@NASAKennedy) July 14, 2021 -
NASA: అంతరిక్షంలోకి బుల్లి జీవులు: ఎందుకు? ఎవరి కోసం?
సాక్షి, సెంట్రల్ డెస్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చిన్న చిన్న ఆక్టోపస్ వంటి స్క్విడ్స్ను, నీటి ఎలుగుబంట్ల(వాటర్ బేర్స్)ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లోకి పంపనుంది. స్పేస్ ఎక్స్ సీఆర్ఎస్–22 మిషన్ ద్వారా ఈ జలచరాలు నింగిలోకి గురువారం దూసుకుపోనున్నాయి. అయితే వీటిని ఎందుకు అంతరిక్షంలోకి పంపుతున్నారో తెలుసా? మనకోసమే.. అయితే, వీటినే ఎందుకు పంపిస్తున్నారు..? వీటిని అక్కడికి పంపడం వల్ల మనకు ఉపయోగాలేంటి? ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.. అలా అంతరిక్షం వరకూ.. ఐఎస్ఎస్.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)ను 1998లో ప్రారంభించారు. భూమిపై సాధ్యం కాని పరిశోధనలను అంతరిక్షంలో నిర్వహించేందుకు ఈ కేంద్రాన్ని శాస్త్రవేత్తలు వినియోగించుకుంటుంటారు. ఇప్పటివరకు ఈ కేంద్రంలో 108 దేశా లకు చెందిన పరిశోధకులు 3 వేలకు పైగా పరిశోధనలు జరిపారు. స్పేస్ ఎక్స్ సీఆర్ఎస్–22 మిషన్ శాస్త్రీయ, సాంకేతిక పరికరాలను ఐఎస్ఎస్కు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి మోసుకెళ్లనుంది. స్పేస్ ఎక్స్ కార్గో రీసప్లయ్ మిషన్ (సీఆర్ఎం) 22వ సారి ఐఎస్ఎస్కు పరికరాలను గురువారం తీసుకెళ్లనుంది. అంతరిక్ష పరిస్థితులను వాటర్ బేర్స్ తట్టుకుంటాయా? సహజీవన ప్రక్రియపై అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఎలా ప్రభావితం చేస్తుంది? మూత్రపిండాల్లో రాళ్లు ఎలా ఏర్పడతాయి? వంటి అంశాలపై ఐఎస్ఎస్లో పరిశోధనలు నిర్వహించనున్నారు. వాటర్ బేర్స్ ఎందుకు? వాటర్ బేర్స్ (టార్డిగ్రేడ్స్) 8 పాదాలు కలిగిన సూక్ష్మజీవులు. సాధారణ జంతుజాలం జీవించడానికి అవసరమైన వాతావరణం కన్నా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా భూమిపై, అంతరిక్షంలో ఇది మనగలుగుతుంది. ఈ జీవి ఇలాంటి పరిస్థితుల్లో కూడా జీవించి ఉండేందుకు దోహదపడే జన్యువుల గురించి అధ్యయనం చేయనున్నారు. టార్డిగ్రేడ్స్ (వాటర్ బేర్స్)పై సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందనే విషయం తెలుసుకునేందుకు అధ్యయనం చేయనున్నారు. ఈ వాటర్ బేర్స్ సంతానాన్ని కూడా ఇక్కడే అభివృద్ధిపరిచి, వాటిల్లో వచ్చిన జన్యు మార్పులను గుర్తించనున్నారు. అంతరిక్షంలో మానవులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని లోతుగా అర్థం చేసుకుని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది. బుల్లి స్క్విడ్స్ ఎందుకు? అప్పుడే పుట్టిన స్క్విడ్ పారా లార్వాలను (బేబీ స్క్విడ్స్)ను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఐఎస్ఎస్లో ఈ స్క్విడ్స్ వేరే బ్యాక్టీరియాతో సహజీవనం చేసి ప్రత్యేక అవయవం మాదిరి కాలనీ ఏర్పడేలా చూస్తారు. ఈ అవయవాన్ని లైట్ ఆర్గాన్ అంటారు. స్క్విడ్ శరీరంలో బ్యాక్టీరియా వల్ల కలిగే మార్పులను రికార్డు చేస్తారు. స్క్విడ్– సూక్ష్మజీవుల మధ్య సంబంధంపై తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు పరిశోధనలు జరపనున్నారు. ఏం తెలుసుకుంటాం..? సూక్ష్మజీవి–జంతువుల సహజీవనంపై అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకునేందుకు జరిగే పరిశోనలే ‘ఉమామి’. సూక్ష్మ జీవులు వాటి అతిథేయి (హోస్ట్– స్క్విడ్)పై అంతరిక్ష వాతావరణం ప్రభావం గురించి తెలుసుకునేందుకు ఉమామి పరిశోధన దోహదం చేస్తుంది. ఇప్పటివరకు ఈ జీవుల మధ్య సంబంధాలపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు. చదవండి: డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం -
రష్యన్ కాస్మోనాట్ను ప్రతిబింబించే బార్బీ బొమ్మ
డ్రస్ ఏదైనా బార్బీ బొమ్మలు ముచ్చటగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ‘బార్బీ’ డాల్స్కున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ బొమ్మలను ఇష్టపడతారు. అందమైన అమ్మాయిలను ప్రతిబింబించేలా చూడముచ్చటగా బార్బీ సంస్థ ఈ బొమ్మలను రూపొందిస్తోంది. అయితే సంస్థ తయారుచేసే ప్రతిబొమ్మ వెనక ఒక నేపథ్యం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న లేటెస్ట్ ఫ్యాషన్స్ను ప్రతిబింబించేలా బొమ్మలను రూపొందించే బార్బీ సంస్థ ఈ సారి సరికొత్త థీమ్తో ముందుకొచ్చింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు.. ధైర్యంగా, సాహోసోపేతంగా ముందుకుసాగే మహిళలను ప్రతిబింబించే విధంగా బార్బీ బొమ్మలను రూపొందించింది. ఈ క్రమంలోనే బాలికలు, మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు రష్యన్ మహిళా కాస్మోనాట్ ‘అన్నా కికినా’ రూపంలో బార్బీ బొమ్మను తయారు చేసింది. సోవియట్ యూనియన్ ప్రయోగించిన ‘ఫస్ట్ క్రూయిడ్ స్పేస్కాఫ్ట్’ ఈ ఏడాది ఏప్రిల్ 12 నాటికి అంతరిక్షంలోకి వెళ్లి 60 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బార్బీ సంస్థ రెండు సరికొత్త బొమ్మలను ఆవిష్కరించింది. ప్రస్తుతం రష్యా స్పేస్ టీమ్లో ఉన్న ఏకైక మహిళా కాస్మోనాట్ ‘అన్నా కికినా’ రూపంతో బార్బీ బొమ్మలను తయారు చేసింది. అచ్చం అన్నా లా కనిపించే ఈ బార్బీ బొమ్మలు తెలుపు, నీలం రంగు డ్రెస్లతో ఉన్నాయి. వ్యోమగామి ధరించే తెల్లని సూట్తోపాటు, జెట్ బ్లూ జంప్సూట్తో ధరించిన ఈ బార్బీడాల్స్పై అన్నా కికినా పేరుతోపాటు రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ అధికారిక లోగో ఉండటం విశేషం. 36 ఏళ్ల కాస్మోనాట్ కికినా.. వాలెంటినా తెరెష్కోవా తర్వాతా ఐదో మహిళగా 2022లో అంతరిక్షంలోకి అడుగిడనుంది. ప్రస్తుత రోజుల్లో ఇంజినీర్ అయిన అన్నా కికినా ఎంతోమందికి ఆదర్శమని రష్యన్ స్పేస్ ఏజెన్సీ చెప్పింది. తను ఎంతో ధైర్యవంతురాలైన మహిళే కాకుండా అందరితో కలిసిపోయే తత్వం, పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తితో నడుచుకునే ఎంతో తెలివైన కాస్మోనాట్ అని తెలిపింది. రోస్కోస్మోస్లో ఇప్పటిదాకా మొత్తం 124 మంది కాస్మోనాట్స్ ఉండగా వారిలో కేవలం నలుగురు మాత్రమే మహిళా కాస్మోనాట్స్. అందుకే మరింతమంది మహిళలను స్పేస్ ఏజెన్సీ లో పనిచేసేలా ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పేస్ ఏజెన్సీ వివరించింది. ‘‘నేను చిన్నతనంలో వ్యోమగామి కావాలని అనుకోలేదు. నా దగ్గర ఆస్ట్రోనాట్ రూపంలో ఉన్న బార్బీ బొమ్మ ఉంటే ఆ సమయంలో కచ్చితంగా ఆస్ట్రోనాట్ కావాలనే ఆలోచన వచ్చేది. బార్బీ బొమ్మతో ఆడుతున్న ప్రతీ అమ్మాయి వ్యోమగామి కావాలని అనుకోదు. ప్రతిఒక్కరికీ తమకంటూ ఒక అభిరుచి ఉంటుందని నేను భావిస్తున్నా’’ అన్నాకికినా చెప్పింది. కాస్మోనాట్ బార్బీ బొమ్మతో ఆడుకునే వారిలో కొంతమంది అమ్మాయిలైనా ప్రేరణ పొంది స్పేస్ ఏజెన్సీల్లో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తారని ఆశిద్దాం. -
అంతరిక్షంలో నాట్లు.. వ్యోమోనౌకలోనే పంటలు
ప్లాంట్ రిసెర్చ్లో అద్భుతంగా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఇటీవలే భూమికి 400 కిలోమీటర్ల పైన అంతరిక్షంలో జరిగింది. భూమి వాతావరణం లేనిచోట తొలిసారి మొక్కలు నాటే ప్రయత్నం (ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్) ఫలించింది. అంతరిక్షంలోని ఐఎస్ఎస్(అంతర్జాతీయ స్పేస్ స్టేషన్)లోని ఐఎస్ఎస్ వెజిటబుల్ ప్రొడక్షన్ సిస్టమ్ ఫెసిలిటీలో మైక్హాప్కిన్స్ అనే ఆస్ట్రోనాట్ ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్లో అంతరిక్షంలో భారీగా పంటలు పండించే ప్రయోగాలకు ఇది తొలిమెట్టుగా నాసా వ్యాఖ్యానించింది. ఐఎస్ఎస్లో పంటలు పండించడంతో అందులోని వ్యోమోగాములకు ఆహార కొరత లేకుండా చూడవచ్చు. అలాగే భవిష్యత్లో ఇతర గ్రహాలకు జరిపే ప్రయాణంలో భూమిపై నుంచే ఆహారం తీసుకుపోయే అవసరం లేకుండా అవసరమైనప్పుడు వ్యోమోనౌకలోనే పంటలు పండించుకోవచ్చని అభిప్రాయపడింది. ఎక్స్పెడిషన్ 64 కార్యక్రమంలో మైక్ పనిచేస్తున్నారు. స్పేస్ఎక్స్ క్రూ1 మిషన్లో భాగంగా ఆయన ఐఎస్ఎస్కు వచ్చారు. ఐఎస్ఎస్లో పలు మొక్కలు జీవించలేక పోవడాన్ని గమనించిన మైక్ వాటిని తిరిగి నాటడం చేపట్టారు. మొలకల దశలో ఉన్న మొక్కలను ఒకచోట నుంచి తీసి మరోచోట నాటడం అనే ప్రక్రియ సాధారణంగా మొక్కలకు రిస్కుగా భావిస్తారు. కానీ ఐఎస్ఎస్లో ఈ ప్రక్రియను విజయవంతం గా పూర్తి చేశారని నాసా తెలిపింది. మైక్రోగ్రావిటీ అంతరిక్షంలో పలు ప్రతికూలతలకు కారణమని, కానీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో మైక్రోగ్రావిటీనే సక్సెస్కు కారణమైందని వివరించింది. ఆముదం, ఆకుకూర మొక్కలను ఈ ప్రయోగంలో నాటడం జరిగిందని, అవి బాగానే ఉన్నాయని తెలిపింది. భవిష్యత్లో ఈ అంశంపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సైంటిస్టులకు తాజా ఫలితాలు ఉత్సాహాన్నిస్తున్నాయి. -
నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం
ఫ్లోరిడా: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం సాధించాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా అమెరికా వ్యోమగాములు డగ్ హార్లీ, బాబ్ బెంకెన్ అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరుకున్నారు. భారత కాలమనం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12.18కి ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో డ్రాగన్ క్యాప్సుల్ సురక్షితంగా దిగింది. వీరు సురక్షితంగా భూమికి చేరడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అపోలో కమాండ్ మాడ్యుల్ అమెరికాలో దిగిన 45ఏళ్ల తర్వాత ఇదే తొలి స్పాష్ డౌన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. 'అంతరిక్షయానం కూడా సాధారణ విమాన ప్రయాణంలాగా మారిపోయినప్పుడు భవిష్యత్లో మానవాళి మనుగడకు భద్రత దొరికనట్లే' అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. (ట్రంప్కి ఎన్ని కల్లలేనా?) "Thanks for flying @SpaceX." 📍 Current Location: Planet Earth A 2:48pm ET, @AstroBehnken and @Astro_Doug splashed down, marking the first splashdown of an American crew spacecraft in 45 years. #LaunchAmerica pic.twitter.com/zO3KlNwxU3 — NASA (@NASA) August 2, 2020 -
స్పేస్ ఎక్స్.. నింగిలోకి వ్యోమగాములు
ఫ్లోరిడా : అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన రాకెట్.. ఇద్దరు నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) తీసుకెళ్లింది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ ప్రయోగంపై అందరిలోను ఆసక్తి నెలకొంది. నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్ స్టేషన్ నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్ ఎక్స్ రూపొందించిన ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డగ్లస్ హర్లీ మరియు రాబర్ట్ బెంకెన్ అంతరిక్షంలోకి ప్రయాణమయ్యారు. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత వీరు ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. అక్కడ ఉన్న రష్యా వ్యోమగాములు అనాటోలీ ఇవానిషిన్, ఇవాన్ వాగ్నెర్, అమెరికా వ్యోమగామి క్రిస్ కాసిడీలను కలుసుకోనున్నారు. ఈ ప్రయోగంపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనతోపాటు స్పేస్ ఎక్స్లో ఉన్న ప్రతి ఒక్కరి కల అని తెలిపారు. మరోవైపు ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలువురు అధికారులతో కలిసి వీక్షించారు. ‘ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు మేము అమెరికా గడ్డపై నుంచి, అమెరికన్ రాకెట్లలో, అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషాల్లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. Liftoff! pic.twitter.com/DRBfdUM7JA — SpaceX (@SpaceX) May 30, 2020 -
చివరి నిమిషాల్లో స్పేస్ ఎక్స్ ప్రయోగం వాయిదా
ఫ్లోరిడా : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన స్పేస్ ఎక్స్ ప్రయోగం వాయిదా పడింది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ఈ మిషన్ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు వాయిదా పడినట్టు నాసా వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాసా తెలిపింది. అన్ని అనుకూలిస్తే స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.22 గంటలకు గానీ, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్పేస్ ఎక్స్ను నింగిలోకి పంపనున్నారు. ఓ వైపు 2011 తర్వాత యూఎస్ నుంచి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడం, మరోవైపు తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ(స్పేస్ ఎక్స్) అభివృద్ధి చేసిన రాకెట్ కావడంతో ఈ ప్రయోగం నాసాకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాగా, స్పేస్ ఎక్స్ రూపొందించిన ఈ ఫాల్కన్ రాకెట్ ద్వారా డగ్లస్ హర్లీ, రాబర్ట్ బెంకెన్ అంతరిక్షంలోకి వెళ్లేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం సాయంత్రం 4.33 గంటలకు రాకెట్ నింగిలోకి వెళ్లడానికి కౌంట్డౌన్ స్టార్ అయింది. ప్రయోగ సమయానికి రెండు గంటల ముందే హర్లీ, బెంకెన్లు తమ సీట్లలో కూర్చున్నారు. అయితే ప్రయోగానికి సరిగ్గా 16 నిమిషాల ముందు వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు స్పేస్ ఎక్స్ లాంచ్ డైరెక్టర్ మైక్ టేలర్ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ఫ్లోరిడా స్పేస్ కోర్డు వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. అయితే ప్రయోగం వాయిదా పడటంతో వారు కాసింత నిరాశ చెందారు. -
భూమి నుంచి అంతరిక్షంలో వైద్యం
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ఓ వ్యోమగామికి మెడ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టింది. దానికి భూమ్మీద నుంచే ఓ వైద్య బృందం చికిత్స అందించింది. ఈ విధంగా చికిత్స అందించడం ఇదే తొలిసారి. ఆరు నెలల పాటు విధులు నిర్వర్తించేందుకు ఐఎస్ఎస్కు వెళ్లిన వ్యోమగామికి ఈ సమస్య ఉన్నట్లు అక్కడికెళ్లిన రెండో నెలలో తెలిసింది. వైద్య బృందాన్ని వేగంగా అక్కడికి పంపే అవకాశం లేకపోవడంతో భూమి నుంచే వైద్యాన్ని కొనసాగించారు. గడ్డకట్టిన రక్త నాళాలకు చికిత్స అందించే నిపుణుడైన ప్రొఫెసర్ స్టీఫన్ మోల్ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. మెయిల్స్ ద్వారా సమాచారం పంపుకుం టూ వైద్యం కొనసాగించారు. రక్తం గడ్డకట్టకుండా చూసే ప్రత్యేక మందును ఆయన ఇంజెక్షన్ ద్వారా తీసుకునేవారు. 40 రోజుల పాటు ఈ వైద్యం కొనసాగిన తర్వాత ప్రత్యేక రాకెట్ ద్వారా తర్వాత వాడాల్సిన మందులను పంపించారు. మొత్తంగా ఈ చికిత్స 90 రోజుల పాటు కొనసాగింది. వ్యోమగామి తిరిగి భూమి మీదకు వచ్చే నాలుగు రోజుల ముందు చికిత్సను ఆపేశారు. అతను భూమ్మీదకు వచ్చేసరికి తదుపరి చికిత్స కూడా అవసరం లేకుండా వ్యాధి నయమైందని సంబంధిత వర్గాలు విడుదల చేసిన అధ్యయనంలో తేలింది. -
నేలకు దిగిన బోయింగ్ ఆశలు!
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో నింగిలోకి దూసుకెళ్లిన బోయింగ్ కంపెనీ స్టార్లైనర్ క్రూ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌక ఆదివారం న్యూమెక్సికోలోని ఎడారిలో సురక్షితంగా ల్యాండైంది. అయితే అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లకుండానే వెనుదిరిగి రావడంతో వచ్చే ఏడాది వ్యోమగాములతో చేయాల్సిన ప్రయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కిందకు దిగే క్రమంలో మూడు పారాచ్యూట్లు తెరుచుకోవడంతోపాటు ఎయిర్బ్యాగులు కూడా సరిగా పనిచేయడం వల్ల సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. వారం రోజులకు పైగా అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సిన నౌక.. కేవలం ప్రయోగించిన రెండు రోజులకే వెనుదిరగాల్సి వచ్చింది. సురక్షిత ల్యాండింగ్ కావడం కొంతమేర సానుకూల అంశం. నాసా భాగస్వామ్యంతో నిర్మించిన స్టార్లైనర్ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌకను మానవరహితంగా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ప్రయోగించారు. అట్లాస్–5 రాకెట్తో నింగిలోకి ఎగిరిన స్టార్లైనర్ 15 నిమిషాలకు దాని నుంచి వేరుపడింది. అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తమ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్య నుంచి దారి తప్పిందంటూ బోయింగ్ ట్వీట్ చేసింది. దాన్ని సరైన కక్ష్యలోకి తెచ్చే ప్రయత్నాల్లో తాము నిమగ్నమైనట్లు తెలిపింది. వచ్చే ఏడాది వ్యోమగాములను స్టార్లైనర్ ద్వారా అంతరిక్ష యాత్రకు పంపాలని సంకల్పించిన క్రమంలో తాజా వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కానుంది. వచ్చే ఏడాది స్టార్లైనర్ కాప్సూ్యల్లో ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు బోయింగ్ సన్నాహాలు చేస్తోంది. -
అంతరిక్షం నుంచి కార్చిచ్చు ఫొటోలు
వాషింగ్టన్ : అమెరికా అడవుల్లో మరోసారి కార్చిచ్చు రగులుతోంది. కాలిఫోర్నియా, పశ్చిమ లాస్ ఏంజెల్స్ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవుతున్నారు. అక్టోబరు 23న మొదలైన కార్చిచ్చు వల్ల హాలీవుడ్ నటులు సహా దాదాపు 10 వేల మంది వెస్ట్ లాస్ ఏంజెల్స్ నివాసులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర కాలిఫోర్నియా, సోనోమా కంట్రీలో నివసిస్తున్న దాదాపు లక్షన్నర మంది అగ్ని ప్రమాద బాధితులుగా మిగిలిపోయారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన వ్యోమగామి అండ్రూ మోర్గాన్ కార్చిచ్చుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం స్పేస్ స్టేషన్లో ఉన్న అతడు.. ‘ అంతరిక్షం నుంచి కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటల ఫొటోలు తీశాను. ఈ ఘటనలో ఇళ్లు కోల్పోయిన వారి గురించి, వాళ్లను కాపాడిన సాహసవంతుల గురించి ఆలోచిస్తున్నా అని ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా అతడి ట్వీట్పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ అంతరిక్షంలో ఇంత స్పష్టత ఉన్న లెన్సులు ఉన్నాయా’ అంటూ కొంతమంది సందేహం వ్యక్తం చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఇంత గొప్ప టెక్నాలజీని ఉపయోగిస్తున్న మనం.. కార్చిచ్చు రగలకుండా మాత్రం జాగ్రత్తపడలేకపోతున్నాం. అమెజాన్.. ఇప్పుడు ఇది ఇలా ఎన్ని అడవులు నాశనమైనా మానవాళి తీరు మారదు’ అని కామెంట్లు చేస్తున్నారు. From @Space_Station I was able to catch these pictures of the California wildfires burning north of the Bay Area. Thinking of the people who have lost their homes and the brave first responders on the front lines protecting them. pic.twitter.com/islV3DP5yM — Andrew Morgan (@AstroDrewMorgan) October 30, 2019 -
క్యాట్ వాక్ కాదు స్పేస్ వాక్
వాషింగ్టన్: ఆకాశంలో సగంగా కాదు. ఆకాశమంతటా తామేనని నిరూపించారు మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్లు. మునుపెన్నడూ ఎరుగని ఈ అనుభవాన్ని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం శుక్రవారం ఈ అనంతకోటి ప్రపంచానికి కనువిందు చేసింది. మొత్తంగా ఏడు గంటల 17 నిమిషాలపాటు అంతరిక్షంలో గడిపి వీరిద్దరూ స్పేస్వాక్ విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షభవనం వైట్హౌస్లో నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్కాల్ చేశారు. మహిళా వ్యోమగాములిద్దరినీ అభినందించారు. మీరిద్దరినీ చూసి అమెరికా గర్విస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్ 54 ఏళ్లలో తొలిసారి అచ్చంగా మహిళా వ్యోమగాములు పురుషులతోకలసి కాకుండా మహిళా వ్యోమగాములు మాత్రమే స్పేస్ వాక్ చేసిన తొలి సందర్భం ఇదే కావడం విశేషం. అర్ధశతాబ్దకాలానికిపైగా వ్యోమగాములు 420 సార్లు స్పేస్ వాక్ చేశారు. 421వ స్పేస్ వాక్ ఆసాంతం మహిళల సొంతం. ఇప్పటి వరకు మొత్తం 227 మంది వ్యోమగాములు స్పేస్ వాక్ చేస్తే, అందులో మహిళలు కేవలం 14 మందే. గతంలో స్పేస్ వాక్ చేసిన స్త్రీలంతా ఇతర పురుషులతో కలిసి చేసినవారే తప్ప ప్రత్యేకించి స్త్రీలే స్పేస్వాక్ చేసిన సందర్భం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. క్రిస్టినా కోచ్, జెస్సికా మియెర్ వ్యోమగాములు క్రిస్టినా కోచ్, జెస్సికా మియెర్లు ఈ చారిత్రక ఘటనలో పాలుపంచుకున్నారు. మార్చి నుంచి క్రిస్టినా కోచ్, ఫిబ్రవరి నుంచి జెస్సికా మియెర్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో ఉన్నారు. అంతరిక్షంలో తేలుతూ ఈ ఇద్దరు మహిళలు గత వారాంతంలో స్పేస్ స్టేషన్ వెలుపల నిరుపయోగంగా మారిన బ్యాటరీ చార్జర్ను మార్చారు. దీంతోపాటు ఇతరత్రా రిపేర్ల కోసం స్పేస్ స్టేషన్ వెలుపల ఏడుగంటల 17 నిమిషాలపాటు అంతరిక్షంలో గడిపారు. ఇప్పటి వరకు స్పేస్ వాక్లు జరిపిన వారిలో జెస్సికా 228 వ వారు. ప్రత్యేకించి మహిళా వ్యోమగాల స్పేస్ వాక్ నిజానికి ఆరు నెలల క్రితమే జరగాల్సి ఉంది. అయితే వ్యోమగాములకు సరిపోయే స్పేస్ సూట్ లేకపోవడం వల్ల స్సేస్ వాక్ ఆర్నెల్లు వాయిదాపడింది. ఇద్దరికి స్పేస్ సూట్ కావాల్సి ఉండగా ఒకే ఒక్క మధ్యతరహా కొలతలతో కూడిన స్పేస్ సూట్ అందుబాటులో ఉండడంతో ఇంతకాలం ఆగాల్సి వచ్చింది. వీరికోచ్ మెక్ క్లెయిన్ తిరిగి భూమిపైకి రావడంతో రెండో స్పేస్ సూట్ అంతరిక్ష పరి శోధనా కేంద్రానికి తీసుకెళ్ళడం సాధ్యమైంది. -
అంతరిక్ష కేంద్రం నుంచి క్షేమంగా భూమికి..
జెజ్కాజ్గన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ముగ్గురు వ్యోమగాములు భూమికి క్షేమంగా చేరుకున్నారు. నాసా వ్యోమగామి అన్నే మెక్క్లయిన్, రష్యన్ వ్యోమగామి ఒలెగ్ కొనోనెన్కో, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి సెయింట్ జాక్వస్లు కజఖ్ సిటీ సమీపంలో మంగళవారం పారాచూట్ సాయంతో సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. రష్యన్ అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా సోయుజ్ రాకెట్లో ఈ ముగ్గురు అంతరిక్ష కేంద్రానికి డిసెంబర్ 3న వెళ్లారు. అంతకుముందు అక్టోబర్లో రష్యా, అమెరికాకు చెందిన వ్యోమగాములు అలెస్కీ, నిక్ హాగ్లను తీసుకెళ్లేందుకు సోయుజ్ రాకెట్ బయలుదేరింది. అయితే ప్రయోగించిన నిమిషాల్లోనే కొన్ని సమస్యల కారణంగా వారిద్దరు అత్యవసరంగా భూమిపై ల్యాండయ్యారు. ఇక ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడిపిన మొదటి కెనడా వ్యోమగామిగా సెయింట్ జాక్వస్ రికార్డు సృష్టించారు. -
రానుపోను రూ. 400 కోట్లు ఖర్చు!!
న్యూయార్క్: అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ క్రమంలో 30 రోజుల పాటు ప్రైవేట్ వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా కక్షలో తిరుగుతున్న ఈ ఉపగ్రహంలో ఒక్క రాత్రి గడపాలనుకునే వారి నుంచి 35 వేల డాలర్లు(రూ.24 లక్షలు) చొప్పున వసూలు చేస్తామని తెలిపింది. మొత్తం రానుపోను చార్జీలతో కలిపి ఒక్కొక్కరికి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని వివరించింది. అంతరిక్ష కేంద్రం నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని నాసా భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాదిలో రెండు సార్లు ప్రైవేట్ వ్యోమగాములను అనుమతించేందుకు అవకాశముందని నాసా అధికారులు తెలిపారు. ఈ పర్యటనలను ఏడాదికి 12 వరకు పెంచే అవకాశం ఉందన్నారు. కాగా అమెరికాకు చెందిన వ్యాపారవేత్త డెన్నిస్ టిటో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లిన యాత్రికుడు. ఇందుకు రష్యాకు టిటో రూ.138 కోట్లు చెల్లించారు. ఇక మానవులను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లేందుకు నాసాతో పాటు స్పేస్ఎక్స్ కూడా వివిధ ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. -
అంతరిక్షంలో బ్యాక్టీరియా బెడద
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లో కూడా సూక్ష్మజీవుల బెడద తప్పట్లేదు. అక్కడ బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మజీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్ఎస్లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని కనుగొనడం వల్ల వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ కోసం, అంతరిక్షంలోకి ప్రయాణం చేసేటప్పుడు, అక్కడ నివసించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చని నాసా పేర్కొంది. ‘ఐఎస్ఎస్ వంటి మూసి ఉన్న ఆవరణలో సూక్ష్మజీవులు ఎంత కాలం జీవించి ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పరిశోధన బృందంలోని భారత సంతితికి చెందిన కస్తూరి వెంకటేశ్వరన్ వివరించారు. అక్కడ కనుగొన్న బ్యాక్టీరియాలో 26 శాతం స్టెఫైలోకోకస్, 23 శాతం పాంటియా, 11 శాతం బాసిల్లస్ ఉన్నట్లు ఆయన తెలిపారు. మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఎంటిరోబ్యాక్టర్, స్టెఫైలోకోకస్ ఆరియస్ (10 శాతం)ను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఇవి వ్యోమగాములు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా లేదా అన్న విషయం ఇంకా తెలియదని తెలిపారు. అంతరిక్షంలో ఆ వాతావరణంలో బ్యాక్టీరియాలు క్రియాశీలకంగా ఉంటాయా లేదా అనేది కూడా పరిశోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐఎస్ఎస్లోని లోపలి ఉపరితలంలో 8 ప్రాంతాల్లో (కిటికీ, టాయిలెట్, డైనింగ్ టేబుల్..) సేకరించిన నమూనాలను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. అరుణ గ్రహంపై జీవం అరుణగ్రహంపై జీవం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగారకుడికి చెందిన ఉల్కపై బ్యాక్టీరియా ఉందని వారు లండన్కు చెందిన పరిశోధకులు గుర్తించారు. దీన్ని బట్టి అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. 1977–78 మధ్య అంటార్కిటికా ప్రాంతంలో జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ జరుపుతున్న తవ్వకాల్లో ఏఎల్హెచ్–77005 అనే ఉల్క దొరికినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఎర్త్ సైన్సెస్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అధ్యయనం చేసి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్క లోపల సేంద్రియ పదార్థ రూపంలో బ్యాక్టీరియా ఉందని కనుగొన్నట్లు ఇల్డికో గ్యొల్లయ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ‘భౌగోళిక, జీవ, రసాయన, వాతావరణ శాస్త్ర రంగాలకు చెందిన పరిశోధకులకు మా పరిశోధనలు ఎంతో మేలు చేస్తాయి’అని ఇల్డికో చెప్పారు. తమ పరిశోధనతో భవిష్యత్తులో ఉల్కలు, గ్రహ శకలాలను అధ్యయనం చేసే తీరు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘45 రోజుల్లో పూర్తిగా నాశనమవుతాయి’
న్యూఢిల్లీ : అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు భారత్ చేపట్టిన ప్రయోగం ‘మిషన్ శక్తి’ కారణంగా మిగిలిపోయిన ఉపగ్రహ శకలాలు 45 రోజుల్లో ధ్వంసమవుతాయని డీఆర్డీవో చీఫ్ జి. సతీష్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ లాంటి శక్తిమంతమైన దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేసినపుడే మన సామర్థ్యం గురించి ప్రపంచ దేశాలకు ఒక అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతరిక్షంలో మిషన్ శక్తి వంటి ప్రయోగాల ద్వారా రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుందన్నారు. ఇక మిషన్ శక్తి గురించి కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ ఇలాంటి ప్రయోగాలు చేసినపుడు వాటి ఫలితాలను రహస్యంగా ఉంచడం సాధ్యంకాని విషయం. ప్రయోగ సమయంలో మన ఉపగ్రహాన్ని ప్రపంచలోని అన్ని స్పేస్ స్టేషన్లు ట్రాక్ చేశాయి. ఇందుకు సంబంధించి మేము అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకు సాగాం’ అని సతీష్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిషన్ శక్తికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. (చదవండి : అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు) కాగా శత్రుదేశాల ఉపగ్రహాలు కూల్చేసేందుకు ఇటీవల భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి (ఏశాట్) పరీక్ష వల్ల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికే (ఐఎస్ఎస్) ముప్పు వాటిల్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ ప్రయోగం వల్ల అంతరిక్షంలో దాదాపు 400 వ్యర్థ శకలాలు పోగుపడ్డాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్స్టిన్ తెలిపారు. దీంతో ఐఎస్ఎస్ను వ్యర్థాలు ఢీకొనే ప్రమాదం 44 శాతం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సతీష్రెడ్డి మాట్లాడుతూ.. ఐఎస్ఎస్కు భద్రతను దృష్టిలో పెట్టుకునే తమ టీమ్ ఈ ప్రయోగాన్ని చేపట్టిందని, 45 రోజుల్లోగా ఈ శకలాలు నాశనమవుతాయని పేర్కొన్నారు. #WATCH Defence Research and Development Organisation releases presentation on #MissionShakti pic.twitter.com/4llQ1t3JUG — ANI (@ANI) April 6, 2019 -
‘మిషన్ శక్తి’తో ఐఎస్ఎస్కు ముప్పు
వాషింగ్టన్: శత్రుదేశాల ఉపగ్రహాలు కూల్చేసేందుకు ఇటీవల భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి (ఏశాట్) పరీక్ష వల్ల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికే (ఐఎస్ఎస్) ముప్పు వాటిల్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది. ఆ ప్రయోగం వల్ల అంతరిక్షంలో దాదాపు 400 వ్యర్థ శకలాలు పోగుపడ్డాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్స్టిన్ తెలిపారు. దీంతో ఐఎస్ఎస్ను వ్యర్థాలు ఢీకొనే ప్రమాదం 44 శాతం పెరిగిందన్నారు. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలను కూల్చేయగల చరిత్రాత్మక ‘మిషన్ శక్తి’ని విజయవంతంగా భారత్ ప్రయోగించినట్లు ప్రధాని మోదీ మార్చి 27న వెల్లడించడం తెల్సిందే. 60 వ్యర్థ శకలాలను గుర్తించామని, అందులో 24 ఐఎస్ఎస్కు అతి దగ్గరలో ఉన్నాయని బ్రైడెన్స్టిన్ చెప్పారు. ‘అంతరిక్షంలోకి వ్యర్థాలను పంపడం చాలా ఘోరమైన చర్య. అది కూడా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి దగ్గరగా పంపడం దారుణం. భవిష్యత్తులో మానవులు అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలకు ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయి’అని చెప్పారు. మిషన్ శక్తిలో భాగంగా భారత్ తన ప్రయోగాన్ని వాతావరణ దిగువ పొరల్లోనే చేయడం వల్ల శకలాలు కొన్ని వారాల వ్యవధిలోనే వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసినా అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. భారత్ ఏశాట్ పరీక్షకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయం నుంచి మాట్లాడిన తొలి వ్యక్తి బ్రైడెన్స్టిన్ కావడం గమనార్హం. శకలాల వల్ల ఐఎస్ఎస్కు ముప్పు పొంచి ఉందనే విషయాన్ని నాసా నిపుణులు, జాయింట్ స్పేస్ ఆపరేషన్స్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు చెప్పినట్లు బ్రైడెన్స్టిన్ తెలిపారు. 2007లో చైనా ఇలాంటి ప్రయోగమే చేపట్టడం వల్ల పోగుపడ్డ శకలాలు ఇంకా అంతరిక్షంలోనే ఉన్నాయని గుర్తు చేశారు. -
అతివ.. ఆకాశ మార్గాన!
నిప్పులు చిమ్ముతూ నింగికెగసి వినీలాకాశంలో చక్కర్లు కొడుతున్న వ్యోమనౌకను వీడి ఇద్దరు మహిళలు ఈ నెల 29న స్పేస్వాక్ చేయబోతున్నారు. మెక్ క్లెయిన్, క్రిస్టినా కోచ్లు భూమికి దాదాపు 300 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో నడిచి కేవలం మహిళలు పాల్గొన్న తొలి స్పేస్వాక్గా రికార్డు సృష్టించబోతున్నారు. మెక్ క్లెయిన్, క్రిస్టినా కోచ్ల స్పేస్వాక్కు భూమిపై నుంచి మరో మహిళ సాయం చేయబోతున్నారు. మేరీ లారెన్స్ లీడ్ ఫ్లైట్ డైరెక్టర్గా పనిచేస్తే, జాకీ కేగీ స్పేస్వాక్ ఫ్లైట్ కంట్రోలర్గా ఉంటారు. మెక్ క్లెయిన్ అమెరికా సైన్యంలో మేజర్, పైలట్ కూడా. ఈమె ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ క్రిస్టినా కోచ్ మార్చి 14న అంతరిక్ష నౌకలో వెళ్లి మెక్ క్లెయిన్ను కలుసుకుంటారు. స్పేస్ వాక్కు ఎలా వెళ్తారు? అంతరిక్ష నౌక నుంచి బయటకు రావడాన్నే స్పేస్ వాక్ అంటారు. బయటకు రావాలంటే వారి రక్షణకోసం స్పేస్ సూట్ ధరిస్తారు. స్పేస్ సూట్లో వారు శ్వాస పీల్చుకోవడానికి ఆక్సిజన్, తాగేందుకు నీళ్లూ ఉంటాయి. స్పేస్ వాక్కు కొన్ని గంటల ముందే స్పేస్ సూట్ను ఆక్సిజన్తో నింపి దాన్ని ధరిస్తారు. ఒకసారి దాన్ని ధరించాక కొన్ని గంటలపాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీల్చవచ్చు. ఆ తర్వాత వ్యోమగామి శరీరం నుంచి నైట్రోజన్ను పూర్తిగా తొలగిస్తారు. ఒకవేళ నైట్రోజన్ను బయటకు పంపకపోతే స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు వారి శరీరం నిండా బొబ్బలు వచ్చి, ఈ బొబ్బల కారణంగా వ్యోమగాముల భుజాలదగ్గరా, మోచేతులపైనా, ముంజేతులపై, మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తాయి. దీంతో వ్యోమగాములు పరిస్థితి అత్యంత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అరుదైన.. అద్భుతమైన.. మెక్క్లెయిన్, క్రిస్టినా కోచ్ ఇద్దరూ మార్చి 29న చేసే అరుదైన స్పేస్వాక్ మహిళలందరికీ గర్వించదగిన సందర్భంగా మారబోతోంది. ఇప్పటి వరకు ఇద్దరు పురుషులో, లేదా ఒక పురుషుడి తోడుగానో మరో మహిళ స్పేస్ వాక్లో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు కేవలం ఇద్దరూ మహిళలే ఆ సాహసాన్ని అవలీలగా ఆవిష్కరించబోతున్నారు. -
అంతరిక్షం.. ఆరోగ్యం జాగ్రత్త!
అంతరిక్షం..అబ్బా చూడ్డానికి ఎంత బాగుంటుందో.. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అయితే తెల్లటి సూటులేసుకుని. డింగుడింగుమంటూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే..భలే మజా వస్తుంది కదూ..నిజంగానే.. అక్కడ అంత బాగుంటుందా? లేదా మన కళ్లకు కనిపిస్తున్నదంతా నాణేనికి ఒక వైపేనా.. రండి.. రెండో వైపు చూసి వద్దాం.. నిజానికి సుదీర్ఘకాల స్పేస్మిషన్ల వల్ల చంద్రుడు, అంగారకుడిపైకి వెళ్లే వ్యోమగాములకు అక్కడ గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం, రేడియోధార్మికత కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. 2022 కల్లా అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన ‘గగన్యాన్’ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో అంతరిక్షంలో ఆరోగ్యపరంగా వ్యోమగాములు ఎదుర్కొనే ఇబ్బందులపై ఓ లుక్కేస్తే.. 1 దృష్టి సమస్యలు శరీరంలోని ద్రవాలు ప్రసరించి తలవైపు వస్తున్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది 2 గుండె మెల్లిగా బలహీనమవుతుంది.ఆకారంలో మార్పులొస్తాయి.గుండె బరువు తగ్గుతుంది. గుండెకొట్టుకునే విధానంలో చాలా మార్పులొస్తాయి. 3 మూత్రపిండాలు క్యాల్షియం ఎక్కువ మొత్తంలో రక్తంలో కలవడం కారణంగా.. కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4 కండరాలు 5–11రోజుల అంతరిక్ష ప్రయాణంలో 20%వరకు కండరాలు బలహీన పడతాయి. 5 వెన్నెముక వెన్నెపూస దాదాపు 5 సెంటీమీటర్లు సాగేందుకు అవకాశం ఉంటుంది. 6 ఎముకలు భూమిపై వృద్ధుల్లో ఏడాదికి ఎముకల బలహీనత 1.5% వరకు ఉంటుంది. అదే అంతరిక్షంలో నెలకు ఇది 1–1.5% ఉంటుంది. - మిషన్ అనంతరం భూమిపైకి తిరిగొచ్చాక ఈ సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావం నుంచి వ్యోమగాములు బయటపడతారు. -
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 20 ఏళ్లు!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి 20 ఏళ్లు నిండాయి. 1998 నవంబర్ 20న రష్యా రాకెట్ ద్వారా నింగికెగసిన ఐఎస్ఎస్ దశలదశలుగా విస్తరించి ఇప్పుడు ఓ ఫుట్బాల్ మైదానమంత సైజుకు చేరుకుంది. అంతరిక్షంపై కూడా పట్టు సాధించాలన్న సంకల్పంతో రష్యా ఐఎస్ఎస్ నిర్మాణాన్ని మొదలుపెట్టినా.. అమెరికా, యూరప్, కెనడా, జపాన్ చేరికతో అసలు సిసలైన అంతర్జాతీయ పరిశోధన కేంద్రంగా అవతరించింది. అంతరిక్ష పరిస్థితులను అర్థం చేసుకునేందుకు.. భవిష్యత్తులో గ్రహాంతర ప్రయాణానికి తొలి మజిలీగా ఉపయోగపడుతుందన్న అంచనాతో సిద్ధమైన ఐఎస్ఎస్ విశేషాలు మరిన్ని.. 230 +2000 నవంబర్ నుంచి ఐఎస్ఎస్ను సందర్శించిన వ్యోమగాముల సంఖ్య!! భారతీయ అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా 2003 ఫిబ్రవరి 1న ఐఎస్ఎస్ నుంచి తిరిగి వస్తూండగా జరిగిన ప్రమాదంలో మరణించగా.. సునీతా విలియమ్స్ విజయవంతంగా తిరిగివచ్చారు. ఉన్న బెడ్రూమ్లు 6 భూమి నుంచి ఐఎస్ఎస్కు చేరేందుకు పట్టే సమయం కూడా 6 గంటలే అనుసంధానం కాగల రాకెట్ల సంఖ్య కూడా ఆరే! 2028 ఐఎస్ఎస్ జీవితకాలం ముగిసే సంవత్సరం నిర్మాణానికి అయిన మొత్తం వ్యయం. ఇందులో నాసా భాగం పది వేల కోట్ల డాలర్లు! 15000 బిల్షెపర్డ్ (అమెరికా), సెర్గీక్రికలేవ్, యూరీ గిడ్జెంకో (రష్యా) ఐఎస్ఎస్పై అడుగుపెట్టిన తొలి వ్యోమగాములు 4–6 నెలలు... వ్యోమగాములు ఇక్కడ గడిపిన సమయం 90 నిమిషాలు.. భూమిని చుట్టేసేందుకు ఐఎస్ఎస్కు పట్టే సమయం ఇది! ఇంకోలా చెప్పాలంటే ఇది గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతూంటూ ఉంటుందన్నమాట! రాత్రివేళ ఆకాశంలో కనిపించే మూడో అతి ప్రకాశవంతమైన ఆకారం ఇదే! 16... అంతరిక్ష కేంద్రంలో భాగంగా ఉండే సోలార్ ప్యానెళ్ల సంఖ్య. వీటిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుతోనే మొత్తం వ్యవహారాలు నడుస్తాయి. 1200 ఐఎస్ఎస్లో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రచురితమైన వ్యాసాలు! ఐఎస్ఎస్లో వ్యోమగాముల శరీరపు స్వేదం ఆవిరి కానే కాదు. దీంతో తరచూ టవళ్లను వాడాల్సి వస్తుంది. 1760 83 దేశాల శాస్త్రవేత్తలు రిమోట్ పద్ధతి ద్వారా నిర్వహించిన పరిశోధనలు. చిన్న చిన్న మరమ్మతులకు అవసరమైన పరికరాలను అక్కడికక్కడే ప్రింట్ చేసుకునేందుకు ఐఎస్ఎస్లో ఒక త్రీడీ ప్రింటర్ కూడా ఉంది. ఈ ప్రింటర్తో ఇప్పటి వరకూ ఒక రెంచ్తోపాటు 13 డిజైన్లతో కూడిన 20 వస్తువులను ముద్రించారు. 2001 ఏప్రిల్ 30న ఐఎస్ఎస్పై అడుగుపెట్టి తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించారు.. డెన్నిస్ టిటో! సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రష్యా రాకెట్ అత్యవసర ల్యాండింగ్
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి రష్యా ప్రయోగించిన సూయిజ్ రాకెట్కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. గురువారం కజకిస్తాన్లోని బైకనూర్ కేంద్రం నుంచి బయల్దేరిన కాసేపటికే ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రాకెట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న వ్యోమగాములు నిక్ హేగ్(అమెరికా), అలెస్కీ ఒవ్చినిన్(రష్యా)లు క్షేమంగా ఉన్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ‘ప్రయోగంలో తొలి దశ పూర్తయ్యాక బూస్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. క్షణాల్లో స్పందించిన ఎమర్జెన్సీ రెస్క్యూ బృందం చాకచక్యంగా వ్యవహరించి రాకెట్ను సురక్షితంగా నేలకు దించారు’ అని తెలిపింది. జెజ్కాజ్గన్ పట్టణంలో రాకెట్ అత్యవసరంగా ల్యాండ్ అయిందని, వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కంట్రోల్ రూంలోని రెస్క్యూ బృందంతో వారు మాట్లాడుతున్నారని నాసా అధికారి ఒకరు తెలిపారు. శిక్షణలోనూ వారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని, రాకెట్ అసాధారణ వేగంతో నేలకు దిగుతున్నప్పుడు అధిక గురుత్వాకర్షణ శక్తికి లోనైనా తట్టుకున్నారని వెల్లడించారు. ప్రయోగం ప్రారంభమైన 2 నిమిషాల్లోనే సమస్య తలెత్తిందని, అప్పటికి తామింకా సీటు బెల్టును పూర్తిగా పెట్టుకోలేదని వ్యోమగామి ఒవ్చినిన్ అన్నట్లు ఓ వీడియో బహిర్గతమైంది. -
రాకెట్ ప్రమాదం.. వ్యోమగాములు సేఫ్
న్యూయార్క్: ఇద్దరు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) తీసుకెళ్తున్న రష్యాకు చెందిన సూయజ్ రాకెట్ సాంకేతిక కారణాల వల్ల కజకిస్థాన్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా బయటపడ్డారని నాసా ఉన్నతాధికారి జిమ్ బ్రిడెన్స్టైన్ తెలిపారు. సూయజ్ రాకెట్లో రష్యాకు చెందిన వ్యోమగామి అలెక్సీ ఓవ్చినిన్, అమెరికా వ్యోమగామి నిక్ హగ్లు ప్రయాణిస్తుండగా రాకెట్ బూస్టర్లో సమస్య తలెత్తింది. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాములు బాలిస్టిక్ డీసెంట్ మోడ్లో తిరిగి భూమిపైకి వచ్చినట్లు నాసా పేర్కొంది. సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరిగే ల్యాండింగ్ అని నాసా తెలిపింది. సూయజ్ రాకెట్లో ఆరు గంటల పాటు ప్రయాణించి ఐఎస్ఎస్కు చేరాల్సి ఉంది. వీళ్లు ఆరు నెలల పాటు స్పేస్ స్టేషన్లో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం వాళ్లు ల్యాండైన ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. నాసా ట్విట్ చేసిన వీడియోలో రాకెట్ తన మార్గాన్ని మరల్చుకుని తిరిగి భూమివైపు రావడం కనిపిస్తోంది. LIFTOFF! Shooting into the sky at 4:40am ET, the Soyuz rocket carrying @AstroHague and Alexey Ovchinin leaves Earth on a four-orbit, six-hour journey to the @Space_Station. Watch: https://t.co/BjMDNrNorR pic.twitter.com/0Cfm0Uu2Jx — NASA (@NASA) October 11, 2018 .@NASA astronaut Nick Hague and Russian cosmonaut Alexey Ovchinin are in good condition following today's aborted launch. I’m grateful that everyone is safe. A thorough investigation into the cause of the incident will be conducted. Full statement below: pic.twitter.com/M76yisHaKF — Jim Bridenstine (@JimBridenstine) October 11, 2018 -
ప్రైవేటుకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)ను అమెరికా త్వరలోనే ప్రైవేటీకరించనుందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. భారీగా నిధులు వెచ్చించాల్సిరావడంతో ఐఎస్ఎస్ నిర్వహణ బాధ్యతల నుంచి 2025 నాటికి అమెరికా తప్పుకోనుందని నాసాకు చెందిన పత్రాలను ఉటంకిస్తూ వెల్లడించింది. నాసా, రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రాస్కాస్మోస్ ఐఎస్ఎస్ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్లో వాణిజ్య అవసరాలకు ఐఎస్ఎస్ను నాసా ప్రైవేటు సంస్థలకు అప్పగించే అవకాశముందని వాషింగ్టన్ పోస్ట్ ఈ కథనంలో పేర్కొంది. ఐఎస్ఎస్ నిర్వహణకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.963.97 కోట్లు అవసరమవుతాయని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిందని పోస్ట్ తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి వీలుగా ఆయా సంస్థల నుంచి అభివృద్ధి ప్రణాళికల్ని, మార్కెట్ వ్యూహాలను నాసా కోరే అవకాశముందని వెల్లడించింది. 1998లో ఐఎస్ఎస్ను ప్రయోగించడంతో పాటు అభివృద్ది చేసేందుకు ఇప్పటివరకూ అమెరికా రూ.6.42 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు)ను ఖర్చుచేసిన నేపథ్యంలో ప్రైవేటీకరణకు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తంకావొచ్చని అభిప్రాయపడింది. -
ఐఎస్ఎస్ వద్ద కనిపించింది ఏలియన్లేనా?
-
ఐఎస్ఎస్ వద్ద కనిపించింది ఏలియన్లేనా?
సాక్షి, ప్రత్యేకం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) కిందిగా ఆకాశంలో ప్రయాణించిన మూడు వింత ఆకారాలు కాన్స్ఫిరసీ థియరిస్టులను ఆశ్చర్యపోయేలా చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కాన్స్ఫిరసీ థియరిస్టులు బ్రెట్, బ్లేక్లు బయటపెట్టారు. అయితే, అవి ఏలియన్లా? కాదా? అన్న అంశాలను మాత్రం బయటపెట్టలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కిందుగా వింత ఆకారాలు ప్రయాణిస్తున్న సమయంలో వీడియో తీసినట్లు చెప్పారు. అయితే, బ్రెట్, బ్లేక్లు తీసిన వీడియోను తిలకించిన వారు మాత్రం.. అవి స్పేస్షిప్ లేదా మేఘాలు అయ్యుంటాయని కామెంట్స్ చేశారు. -
అంతరిక్షంలో క్యాబేజీ
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో పండించిన తొలి క్యాబేజీ పంట కోతకొచ్చింది. నాటిన నెల రోజుల తరువాత పచ్చని ఆకులతో చైనీస్ క్యాబేజీ కోతకు సిద్ధమైనట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. వ్యోమగామి పెగ్గీ విట్సన్ కోస్తున్న ఈ చైనీస్ క్యాబేజీ పంటలో కొంత భాగాన్ని ఐఎస్ఎస్ సిబ్బంది తినడానికి ఉపయోగించగా మిగిలిన దాన్ని నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్కు పరిశోధనల నిమిత్తం తీసుకొస్తారు. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాగైన ఐదో పంట. వివిధ ఆకు కూరలను అనేకరకాలుగా పరీక్షించిన మీదట అంతరిక్షంలో పెరిగినప్పుడు వీటి పోషక విలువల్లో తేడాను గుర్తించడానికి ఐఎస్ఎస్లో దీన్ని సాగుచేయడానికి ఎంపిక చేశారు. -
లైవ్లో కనిపించిన యుఎఫ్వో.. వెంటనే కట్!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న వస్తువు ఒక్కటి నాసా లైవ్ ప్రసారంలో కనిపించడం ఇటీవల కలకలం రేపింది. ఇది కనిపించిన కాసేపటికే ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో అది యూఎఫ్వో (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) అయి ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రోదసిలో భూపరిధికి కాస్త ఎత్తులో చీకటి నుంచి వేగంగా ప్రయాణిస్తున్న చిన్న చుక్కలాంటి వస్తువు ఒక్కటి ఐఎస్ఎస్ చానెల్లో దర్శనమిచ్చింది. లైవ్లో ఇది ఐదు సెకన్లు మాత్రమే కనిపించింది. ఆ వెంటనే లైవ్ ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ‘కోల్డ్పైరో’ అనే నెటిజన్ ఇది యూఎఫ్వో అయి ఉంటుందని, దీనిని గుట్టుగా ఉంచేందుకే నాసా లైవ్ ప్రసారాల్ని అకస్మాత్తుగా కట్ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే సాంకేతిక కారణాల వల్లే లైవ్ ప్రసారం నిలిచిపోయిందని నాసా పేర్కొంది. యూఎఫ్వో అన్వేషకులు మాత్రం ఇది అద్భుతమైన వీడియో అని, భూమికి చేరువలో యూఎఫ్వోలు తిరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనమని అంటున్నారు. మరికొందరు మాత్రం వేగంగా ప్రయాణిస్తూ వెళ్లిన ఆ వస్తువు యూఎఫ్వో అనడానికి ప్రామాణిక ఆధారం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విశ్వంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుండటం సాధారణమేనని అంటున్నారు. -
తొలిసారిగా అంతరిక్షంలో డీఎన్ఏ అమరిక
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జన్యుక్రమ అమరికను విజయవంతంగా నిర్వహించింది. అంతరిక్షంలో జీవుల జన్యుక్రమ అమరిక సామర్థ్యం శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు తెర తీస్తుందని నాసా పేర్కొంది. నాసాకు చెందిన కేట్ రుబిన్స్ చేపట్టిన బయోమాలిక్యుల్ సీక్వెన్స్ ప్రయోగంలో భాగంగా అతి తక్కువ గురుత్వశక్తిలో తొలిసారిగా డీఎన్ఏను క్రమపద్ధతిలో అమర్చారు. ఈ ప్రయోగం వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అనారోగ్య పరిస్థితులను గుర్తించడమే కాకుండా, సూక్ష్మజీవులను కనిపెట్టడంతో పాటు వాటివల్ల వ్యోమగాములకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా లేదా అనేది తెల్సుకునేందుకు వీలవుతుంది. -
అంతరిక్షంలో ఆవాసం..!
వాషింగ్టన్: నాసా మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను మరి కాస్త విస్తరించింది. రెండు రోజుల క్రితం ఇదే ప్రయత్నంలో విఫలమైన ‘నాసా’.. ఐఎస్ఎస్ను తాజాగా ఒక గది మేరకు విస్తరించగలిగింది. వ్యోమగామి జెఫ్ విలియమ్స్.. నెమ్మదిగా చిన్న చిన్న పేలుళ్ల ద్వారా పీడనం పెంచుతూ ఐఎస్ఎస్ను పూర్తిగా 67 అంగుళాల మేర విస్తరించగలిగారు. అనంతరం ‘బిగ్లో ఎక్స్పాండబుల్ యాక్టివిటీ మోడ్యూల్ (బీమ్)’ అనే ఈ తొలి మార్పులు చేయగల ఆవాసం లోపల 8 ఎయిర్ ట్యాంక్లను వదిలారు. వ్యోమగాము లు ఉండేందుకు అవసరమైన ఒత్తిడి, ఇతర వాతావరణ పరిస్థితులు నెలకొల్పారు. మొత్తం ఈ ప్రయత్నానికి రూ. 113 కోట్లు ఖర్చయింది. ఈ బీమ్ను సంపూర్ణంగా విస్తరిస్తే 13 అడుగుల పొడవు, 10.5 అడుగుల వెడల్పు ఉన్న గదిలా మారుతుంది. బిగ్లో ఏరోస్పేస్ సంస్థ సహకారంతో నాసా ఈ ఘనత సాధించగలిగింది. చంద్రుడు, అంగారకుడి మీద నివాసయోగ్య గదులను ఏర్పాటు చేసేందుకు నాసా యత్నిస్తోంది. -
అంతరిక్షంలో 42 కిలోమీటర్ల పరుగు పందెం!
లండన్: బ్రిటన్ వ్యోమగామి టిమ్ పీక్ రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో 42 కిలోమీటర్ల మారథాన్ అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ఔరా అనిపించాడు. తాను చేసిన ఈ సాహసాన్ని లండన్లో పలువురు ప్రత్యక్షంగా వీక్షించారు. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ రికార్డు నమోదైంది. బ్రిటిష్ యూరోపియన్ ఎజెన్సీకి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. మొత్తం ఆరు నెలల కార్యక్రమం కోసం ఈ స్టేషన్ కు వెళ్లిన టిమ్ ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఒక ట్రెడ్ మిల్ ను ఏర్పాటుచేసుకొని ఈ మారథాన్ ప్రారంభించాడు. మొత్తం 3గంటల 35 నిమిషాల్లో ఈ మారథాన్ పూర్తి చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. గతంలో ఈ రికార్డు భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునితా విలియమ్స్ పేరిట ఉంది. ఆమె బోస్టన్ మారథాన్ పేరిట 2007లో ఇదే లక్ష్యాన్ని 4 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేశారు. కాగా, టిమ్ మాత్రం లండన్ మారథాన్ పేరిట ఈ పరుగును పూర్తి చేసి గిన్నిస్ కు చేరారు. అసలు గ్రావిటీ ఏమాత్రం ఉండని కక్షలో ఉండి ఇంత వేగంగా మారథాన్ పూర్తి చేయడం నిజంగా ఒక ప్రపంచ రికార్డు అని గిన్నిస్ వరల్డ్ తెలిపింది. ఈ 44 ఏళ్ల మారథాన్ వీరుడు.. భూమిపై ఉన్న 39 వేలమంది మారథాన్ పోటీ దారుల్లో ఒకరు కూడా.