Kamalhasan
-
స్క్రీన్ మారలేదు, సీనే మారింది!
కథ చదవడం, వినడం పాత ప్రక్రియ! చూడటం వన్నె తగ్గని వెండితెర పంచే వింత వినోదం! కథను ఆడించే ఆ వెండితెర ఇంద్రజాలం నేర్చుకుంటే? మెదడు ఊహించని లోకాలకు తీసుకెళ్తుంది, నిజమే నమ్మలేని దృశ్యాలను చూపిస్తుంది. అదొక నయనానందం, అదొక మనోల్లాసం! మొత్తంగా మనిషిని మునివేళ్ల మీద నిలబట్టే సరికొత్త ప్రక్రియ! స్క్రీన్ మారలేదు, సీనే మారింది! బిహైండ్ ద స్క్రీన్ టోటల్గా చేంజ్ అయింది!కెమెరా కంటే ఎఫెక్ట్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఔట్ డోర్ కంటే గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎడిట్ సూట్స్ కంటే వీఎఫ్ఎక్స్ పవర్ ప్రదర్శిస్తున్నాయి. అవే మొన్న బాహుబలిని ప్రెజెంట్ చేశాయి. ఈరోజు కల్కిని క్రియేట్ చేశాయి. టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యాయి. ఆ ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్ను కంపాక్ట్గా చూద్దాం..అనాథ అయిన హీరో– అంతరిక్షం నుంచి భూమ్మీదకు పడే వస్తువులను అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. ఒక రోజు విజిటింగ్ వీసా మీద వేరే గ్రహం నుంచి వచ్చిన హీరోయిన్ను చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని సుదూరంలో ఉన్న ఆమె గ్రహానికి వెళ్తాడు. అక్కడ ఆమె తండ్రి మొదట వాళ్ల ప్రేమను కాదంటాడు. అక్కడికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే బ్లాక్ హోల్ దగ్గర ఉన్న తమ వారసత్వ సంపద టెక్నాలజీని తెస్తే పెళ్లికి ఒప్పుకుంటానని కండిషన్ పెడతాడు. దీంతో హీరో స్పేస్లో సాహసాలు చేయాల్సి వస్తుంది.ఆ ప్రయత్నంలో తన తల్లిదండ్రులు మరో గ్రహంపై బందీలుగా ఉన్నారనే షాకింగ్ విషయం హీరోకి తెలుస్తుంది. వెంటనే అక్కడకు చేరుకుని విలన్ల భరతం పడతాడు. వాళ్లను విడిపించుకుని, చాలెంజ్లో నెగ్గి హీరోయిన్ను దక్కించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ప్రేమ, ప్రతీకారం, లోక కల్యాణం కోసం విలన్ను హీరో అంతం చేయడం అనాదిగా తెలుగు సినిమాలో వస్తున్న స్టోరీ లైన్. కాకపోతే మారింది సినిమా పరిధి. నాటి ‘పాతాళ భైరవి’ నుంచి నేటి ‘కల్కి’ దాకా సినిమా అంటే కళ్లు చెదిరేలా ఉండాల్సిందే!ఎక్కడి మహాభారతం? ఎక్కడి 2898 సంవత్సరం? ఇతిహాసాన్ని ఆరువేల సంవత్సరాల భవిష్యత్తుకు ముడిపెట్టి తీసిన కల్పితగాథ ‘కల్కి’కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం మార్వెలస్గా ఉందని, మరో ప్రపంచంలో విహరింపజేశాడంటూ దర్శకుడిని పొగుడుతున్నారు. ఇక్కడ కథ కంటే భవిష్యత్తులో దర్శకుడి ఊహకు, అందులోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.నాటి కేవీరెడ్డి ‘మాయాబజార్’ నుంచి నేటి నాగ అశ్విన్ ‘కల్కి’ దాకా సినిమాలో కథ ఉంటుంది. కానీ, కథ కంటే దాని బ్యాక్గ్రౌండ్కి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. దానికి కారణం గ్రాఫిక్స్ మాయాజాలం. ఒక హీరో క్లైమాక్స్లో విలన్ తో భూమ్మీదే ఎందుకు పోరాడాలి? ఆ పోరాటం వినీలాకాశంలోనో, సాగర గర్భాంలోనో ఉంటే ఎలా ఉంటుందనే ప్రేక్షకుడి ఊహకు కూడా అందని ఆలోచన ఇప్పుడు తెర మీదకు వస్తోంది. మొత్తంగా ఒక సినిమా ద్వారా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే ప్రేక్షకుడి కోరికను దర్శకులు తీర్చేస్తున్నారు.కథ కొంచెం.. గ్రాఫిక్స్ ఘనం..సినిమాలో కథ ఉంటుంది. కథకు తగ్గట్లు పాత్రలు కదులుతుంటాయి. కానీ, తెర వెనుక జరిగేదంతా వేరే ఉంటుంది. మొత్తం కంప్యూటర్ మీదనే మాయచేస్తారు నిపుణులు. సీన్లను నార్మల్గా తీసి దానికి కంప్యూటర్లో మెరుగులు అద్ది నిజంగా ఫలానా చోట తీశారా అనే భ్రమను కలిగిస్తారు. అలా కథ కంటే గ్రాఫిక్స్ ఘనంగా మారిపోతున్నాయిప్పుడు. గ్రీన్ మ్యాట్ మీద తీసిన సీన్లకు సినిమాలో చూసిన సీన్లకు తేడా గమనిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు.పాత్రధారి లేకున్నా..తెరపై కనిపించకున్నా, నటీనటులు తమ గొంతుతో సినిమాను నడిపించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే టెక్నాలజీకి ముడిపెట్టి వాయిస్ ఓవర్తో మ్యాజిక్ చేయడం ఇప్పుడు చూస్తున్నాం. అమెజాన్, అలెక్సా, యాపిల్ సిరి, గూగుల్ నౌలను ఎలా ఉపయోగించుకుంటున్నామో అలాగన్నమాట! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సతో ఆలోచించే అడ్వాన్్సడ్ వెహికిల్గా ‘బుజ్జి’ కల్కి చిత్రంలో అదనపు ఆకర్షణ. నటి కీర్తి సురేష్ ఆ ఆకర్షణకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. తెరపై కనిపించకున్నా, ఈ సినిమా సక్సెస్లో తన వంతు పాత్రను పోషించింది.అయితే 2013లోనే ఆ తరహా ప్రయోగం ఒకటి జరిగింది. హాకిన్ ఫీనిక్స్ లీడ్ రోల్లో ‘హర్’ అనే చిత్రం వచ్చింది. అందులో సమాంత అనే వాయిస్ టెక్నాలజీతో భావోద్వేగమైన బంధంలో మునిగిపోతాడు హీరో! నటి స్కార్లెట్ జాన్సన్ ఆ టెక్ వాయిస్ ఇవ్వడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. విశేషం ఏమిటంటే ఏఐ అనే ప్రస్తావన లేకుండా సాగుతుందీ పాత్ర. ఇలా తెర మీద కనిపించకున్నా, ఆర్టిస్టులు ప్రభావం చూపిస్తున్నారు.కేరాఫ్ హాలీవుడ్..ఎలాంటి సాంకేతికతనైనా త్వరగా అందిపుచ్చుకోవడంలో హాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలానికి పుట్టినిల్లు అది. మన సినిమాల్లో టెక్నాలజీ వాడకం కొంత మేర ఉంటే, వాళ్లు పూర్తిగా సినిమానే దాంతో నింపేస్తున్నారు. ప్రారంభం నుంచి చివరి దాకా పూర్తిగా గ్రాఫిక్స్ మాయాజాలంతో బోలెడు సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి.అవతార్, మ్యాట్రిక్స్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, జురాసిక్ పార్క్, 2012, కింగ్ కాంగ్, ది అవెంజర్స్, గ్రావిటీ, ది డార్క్ నైట్, పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్, ఇన్సెప్షన్, ఏలియన్, టెర్మినేటర్, మమ్మీ, గాడ్జిల్లా, అనకొండ, ది జంగిల్ బుక్, లయన్ కింగ్– చెబుతూ పోతే కోకొల్లలు. అందుకే మన దర్శకులు అక్కడి టెక్నీషియన్ల సపోర్ట్ తీసుకుంటుంటారు. అయితే, వాటికి పనిచేసే టెక్నీషియన్లలో ఎక్కువ మంది అక్కడున్న భారతీయులే. అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడి గ్రాఫిక్స్ సంస్థలనూ నిర్మాతలు సంప్రదిస్తుండడంతో ఇక్కడి మనవాళ్లకూ తమ ప్రతిభను చూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి.కంప్యూటర్ గ్రాఫిక్స్ మొదలు..చలనచిత్ర రంగంలో గ్రాఫిక్స్ పాత్ర క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట్లో సెట్టింగుల కోసం, లొకేషన్ల కోసం హ్యాండ్ ప్రింటెడ్ బ్యాక్ డ్రాప్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆప్టికల్ ఎఫెక్ట్స్ వచ్చాయి. 80, 90వ దశకంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, 2000లో వీఎఫ్ఎక్స్.. వాటికి సంబంధించి స్టూడియోలే ఏర్పడటం మొదలైంది. సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) భూమిక ప్రధానమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలంటే ఇప్పుడు కచ్చితంగా వీఎఫ్ఎక్స్ ఉండాల్సిందే! ఇప్పుడు విజువల్స్ అంటే దృశ్య విన్యాసమే కాదు, కథలో అంతర్భాగం కూడా.ఇలా వచ్చిన రోబో, బాహుబలి చిత్రాలు భారతీయ చిత్రాల సత్తాను అంతర్జాతీయంగా చాటాయి. అయితే సాంకేతికంగా ఇంత అడ్వాన్స్మెంట్ లేని కాలంలో కూడా కేవి రెడ్డి, సింగీతం శ్రీనివాస్, శంకర్ షణ్ముగంలాంటి సినీ ఉద్దండులు ఈ తరహా ప్రయోగాలకు ఏడు దశాబ్దాల కిందటే క్లాప్ కొట్టారు ‘మాయాజబార్’తో! తర్వాత కాలంలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘జీన్ ్స’, అమ్మోరు’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘దేవి’, ‘ఇండియన్’ మొదలు ‘రోబో’, నిన్నటి ‘బాహుబలి’, నేటి ‘కల్కి 2898 ఏడీ’ వరకు అలాంటి ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచారు. అలా టెక్నాలజీ ఏదోరకంగా తన విజువల్ గ్రాండ్యూర్తో దేశీ వెండితెర మీద సందడి చేస్తూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ తరహా చిత్రాలే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాయి.సజీవంగా లేకున్నా..సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా దక్షిణాది హాలీవుడ్తో పోటీపడుతోంది. ఏఐని విరివిగా వినియోగిస్తోంది. ఏఐ సాయంతో దివంగత గాయనీ గాయకుల గాత్రాలను వినిపిస్తోంది. నటీనటుల అభినయాన్ని చూపిస్తోంది. గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’లో ఓ సీన్ కోసం ఫారిన్ లేడీ వాయిస్ను ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు. ‘లాల్ సలామ్’ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కూడా అలాంటి ప్రయోగమే చేశారు.2022లో వచ్చిన ‘టాప్ గన్: మావెరిక్’ సినిమాలో లెఫ్టినెంట్ టామ్ ఐస్ మ్యాన్ కజన్ స్కై పాత్రధారి వల్ కిల్మర్ కోసం ఏఐ వాయిస్ను సృష్టించారు. 2014లో గొంతు కేన్సర్ బారినపడి మాట పడిపోయింది ఆయనకు. అయితే ఏఐ సాయంతో అచ్చం ఆయన గొంతునే క్రియేట్ చేశారు. అలా దివంగత నటులనూ తెరపై చూపిస్తోంది ఏఐ. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ తను నటిస్తున్న ‘జేమ్స్’ సినిమా సెట్స్ మీద ఉండగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన నటించాల్సిన మిగిలిన సన్నివేశాలను గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసి చిత్రాన్ని పూర్తిచేశారు.మాయల బజార్..ఏఐతో అప్డేట్ అయిన సినిమాల యుగంలో కూడా మరువకుండా మరీ మరీ ప్రస్తావించుకోవాల్సిన మూవీ ‘మాయాబజార్.’ తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని విజువల్ వండర్స్ వచ్చినా.. ఆ చిత్ర సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకూంటూనే ఉంటారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఊహే లేని .. అంతెందుకు కంప్యూటర్ ఉనికే లేని కాలంలో లాప్టాప్ని పోలిన ప్రియదర్శిని అనే పేటికను, స్కైప్ కాల్ని తలపించేలా అభిమన్యుడు–శశిరేఖల వీడియో కాలింగ్ని ఎవరైనా ఊహించగలరా? కానీ దర్శకుడు కేవీ రెడ్డి ఆ ఊహకు వెండితెర రూపమిచ్చారు.అందమైన చందమామను చూస్తూ.. లాహిరి లాహిరిలో అంటూ సాగే అందులోని పాటను వాస్తవానికి ఓ ఎర్రటి ఎండలో తీశారంటే నమ్మగలమా? ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్ మాయా విన్యాసాలను ఇమాజిన్ చేయగలమా? ఆశ్చర్యం! రెట్రో రీల్, ఆంగ్లో–ఇండియన్ కెమెరామన్ మార్కస్ బార్టే› కెమెరా అద్భుతం అది! వివాహ భోజనంబు పాటనైతేతే నాలుగు రోజులపాటు శ్రమించి.. కెమెరా టెక్నిక్స్, స్టాప్ మోషన్ యానిమేషన్ టెక్నాలజీతో దాన్ని చిత్రీకరించారట.ఎంత ఎక్కువ టైమ్ తీసుకుంటే.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాంశంగా ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు వస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్.. విజువల్స్ బేస్ చేసుకుని సినిమా తీస్తున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వకపోతే ఆశించినంత రిజల్ట్ రాదు. గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఒక మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇదే జరిగింది. ప్రీ–ప్రొడక్షన్ కి సరైన సమయం ఇవ్వకుండా మేకర్స్ చాలా తొందరపడ్డారు.ఫలితంగా ఆ చిత్రం విజువల్స్ నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అలాగే టైమ్ తీసుకున్న చిత్రాలు మంచి అవుట్ ఫుట్ను ఇచ్చాయి. కాబట్టే ఆ సినిమాల కంటెంట్కి, విజువల్స్కి మ్యాచ్ అయింది. ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ సక్సెస్నూ సాధించాయి. ఫిల్మ్ మేకింగ్ అనేది క్రియేటివ్ ప్రాసెస్. అలాగని వీఎఫ్ఎక్స్తో ప్రయోగాలు చేసినా.. తొందర పెట్టినా.. బడ్జెట్ అంతకంతకూ పెరగడంతో పాటు అవుట్ ఫుట్ కూడా దెబ్బ తింటుంది. – పి. లక్ష్మీనారాయణ, వీఎఫ్ఎక్స్ నిపుణుడుఇదీ చిత్రమే..‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా కమల్ హాసన్ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కమల్ను అలా ఎలా చూపించారనే ఆసక్తికరమైన చర్చ నడిచింది అప్పట్లో. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం తొలిసారి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది.. విజువల్ ఎఫెక్ట్ డిజైనర్ ఎస్టీ వెంకీకి తొలి చిత్రం.అందులోని పాటలు, సర్కస్ పోర్షన్కి ఈ టెక్నాలజీని వాడారు. అయితే పొట్టి కమల్ హాసన్ కోసం ప్రత్యేకించి గ్రాఫిక్స్ ఉపయోగించకపోవడం గమనార్హం. డిఫరెంట్ టెక్నిక్స్.. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్లో చిత్రీకరించారు. ఇందుకోసం మోకాళ్లకు ప్రత్యేకంగా తయారు చేసిన షూ వాడడం, స్టడీ షాట్లో గుంతలు తీసి మోకాళ్ల దాకా కమల్ హాసన్ను అందులో పాతిపెట్టడం వంటివి చేశారట.డీ–ఏజ్ క్లిక్కు.. లుక్కుతో కిక్కు..మేకప్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మేకప్ అనే మాట ఏనాడో పాతదైపోయింది. ప్రోస్తటిక్, త్రీడీ మేకప్లతో అది కథలో భాగమైంది. ఇదింత మేకప్ అయి వచ్చినా టెక్నాలజీ ఎఫెక్ట్కి ఫేడ్కాక తప్పట్లేదు. దాన్నలా ఫేడ్ అవుట్ చేస్తోంది డీ–ఏజింగ్ డిజిటల్ మేకప్. ఇది సిల్వర్ స్క్రీన్ ౖపై చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. వయసు పైబడిన హీరో, హీరోయిన్లను యంగ్గా చూపించేందుకు విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్టులు ‘డీ–ఏజింగ్’ టెక్నిక్ను వాడుతున్నారు. దీనిద్వారా ఆర్టిస్ట్ ముఖంతో పాటు బాడీ షేపుల్లోనూ మార్పులు చేసుకునే వీలుంటుంది.2006లో ‘ఎక్స్మెన్ : ది లాస్ట్ స్టాండ్’లో ప్యాట్రిక్ స్టీవార్ట్, ఇయాన్ మెకెల్లెన్ ల కోసం ‘డీ–ఏజింగ్’ టెక్నిక్ని ఫస్ట్ టైమ్ పక్కాగా వాడారు. హెచ్బీవో నిర్మించిన ‘ది రైటస్ జెమ్స్టోన్ ్స’ టీవీ సిరీస్లో నటుడు జాన్ గుడ్మన్ కోసం ఒక ఎపిసోడ్ మొత్తం డిజిటల్లీ డీ–ఏజ్డ్ టెక్నాలజీనే ఉపయోగించారు. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’లో క్రియేటర్ సాన్లీ గెస్ట్ అపియరెన్ ్స కోసం రెండు వందల షాట్స్తో ఒక సీన్ రూపొందించారు.‘టెర్మినేటర్: డార్క్ ఫేట్, ఇట్– చాప్టర్2’లో ఈ టెక్నిక్ను ఉపయోగించాల్సి వచ్చింది. ‘కెప్టెన్ మార్వెల్’, ‘జెమినీ మ్యాన్ ’, ‘ది ఐరిష్మ్యాన్ ’– ఈ మూడు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యాయి. ‘కెప్టెన్ మార్వెల్’లో నిక్ ఫ్యూరీ క్యారెక్టర్ కోసం శామ్యూల్ జాక్సన్ ని కొద్దిసేపు యంగ్స్టర్గా చూపించారు. ‘జెమినీ మ్యాన్ ’ కోసం విల్ స్మిత్ను ఏకంగా ఇరవై మూడేళ్ల యువకుడిగా చూపించారు. మార్టిన్ స్కార్సిస్.. నెట్ఫ్లిక్స్ నిర్మాణంలో ‘ది ఐరిష్ మ్యాన్ ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఇందులో డెబ్బైతొమ్మిదేళ్ల రాబర్ట్ డి నీరో.. నలభై తొమ్మిదేళ్ల క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఈ మూడు సినిమాలూ ఆస్కార్ 2020 బరిలో విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఎంపికయ్యాయి. ఇంతకాలం హాలీవుడ్కే పరిమితం అనుకున్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మన చిత్రాల కోసం కూడా వినియోగిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్య రాయ్ని అలాగే తీర్చిదిద్దారు. అందులో ఆమె గుండ్రటి మొహం కాస్త కోలగా మారి ఆ సినిమాలో ఆమె వయసు తగ్గినట్టు కనిపిస్తుంది.ధైర్యంగా ముందుకు..కథాంశాన్ని బట్టి బడ్జెట్ మారుతుంది. కానీ, భారీ హంగులే ప్రధానాంశమైతే సినిమా బడ్జెట్ బరువు పెరుగుతుంది. ఒకప్పుడు స్టార్ యాక్టర్స్, భారీ సెట్లు, ఫారిన్ లొకేషన్ల కోసం బడ్జెట్ భారీగా మారేది. ఇప్పుడు ఆ జాబితాలో తారాగణం పారితోషికాలను మినహాయిస్తే మిగిలిన వాటి స్థానాలను ఒక్క గ్రాఫిక్సే భర్తీ చేస్తున్నాయి భారీగా. దీనివల్ల ఒక సినిమాకు ఐదారుగురు నిర్మాతలనే హాలీవుడ్ తీరూ మనకూ అనివార్యమైంది. ఇప్పుడు మన సినిమాలకు ఒకరి కన్నా ఎక్కువ మంది నిర్మాతలు ఉండటం, అంతర్జాతీయ సంస్థలూ భాగస్వాములుగా చేరుతుండటం సాధారణమైంది.దీనివల్ల విజువల్ వండర్స్ క్రియేట్ అవుతున్నాయి కదా అంటాయి సినీ వర్గాలు. కావచ్చు. ఈ బడ్జెట్తోనే వీఎఫ్ఎక్స్ సామాజిక అంశాలతో పాటు చరిత్ర, పురాణేతిహాసాలు, టైమ్ ట్రావెల్, కృష్ణ బిలాలు, సాపేక్ష సిద్ధాంతం లాంటి సంక్లిష్టమైన విషయాలను కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో కన్నులకు కడుతోంది. అందుకే కథను బట్టి గ్రాఫిక్స్ కాదు, గ్రాఫిక్స్ని బట్టే కథను రాసుకుంటున్నారు దర్శకులు. దాన్ని భరించే నిర్మాతలను వెదుక్కుంటున్నారు. దాంతో వీఎఫ్ఎక్స్ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్గా మారింది. దీనికి భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరిగింది.గంటల నుంచి నెలలు..సాధారణంగా విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్)కు అయ్యే ఖర్చు ఎంతమంది నిపుణులు పని చేస్తారు, వాళ్ల అనుభవం, ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ను ఉపయోగిస్తారు, వాటి నిడివి, అలాగే వాళ్లు ఉపయోగించే సాఫ్ట్వేర్లను బట్టి ఉంటుంది. ఆ అవసరాలకు తగ్గట్లు బడ్జెట్ కేటాయిస్తుంటారు నిర్మాతలు. కంపెనీ ప్రతినిధులను గంటల లెక్క నుంచి రోజులు, నెలల లెక్కన కేటాయిస్తాయి అవసరాలన్ని బట్టి. కేవలం కంపెనీలు మాత్రమే కాదు, ఫ్రీలాన్ ్సగా పని చేసే నిపుణులూ ఉన్నారు.మన దేశంలో వీఎఫ్ఎక్స్ నాణ్యత, నిడివి ప్రాతిపదికన నిమిషానికి రూ.500 నుంచి రూ. 2000 దాకా తీసుకునే వీడియో ఎడిటర్లు ఉన్నారు. వీఎఫ్ఎక్స్లో షాట్స్ను బట్టి పని లెక్క ఉంటుంది. పది కంటే తక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటే దాన్ని మినిమమ్ వర్క్గా భావిస్తారు. 10–50, 50–100, వంద కంటే ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ను అవసరానికనుగుణంగా వినియోగిస్తుంటారు.అయితే ఒక నిమిషం నిడివి ఉన్న వీఎఫ్ఎక్స్ వీడియో తీయాలంటే రూ. 80 వేల నుంచి లక్షన్నర రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇందులో.. ఇంటర్మీడియట్, అడ్వాన్ ్సడ్, హైలీ కాంప్లెక్స్ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ స్థాయిలు ఉంటాయి. ఒక్కొ లెవెల్ ముందుకు వెళ్లేకొద్దీ.. అంతకు మించే(రెట్టింపు) ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడయ్యాక ఇది మరింత ఖరీదుతో కూడిన వ్యవహారంగా మారింది. కానీ, ఇందులోనూ రకాలున్నాయి. తేలికగా అయ్యే వీఎఫ్ఎక్స్ కోసం ఖర్చు తక్కువగా ఉంటుంది. అదే షార్ట్ ఫిల్మ్, యానిమేషన్, షూటింగ్ లైవ్ యాక్షన్ లార్జ్ స్కేల్ వీఎఫ్ఎక్స్– ఇలా ఒక్కో కేటగరీలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చు పెరుగుతూ పోతుంది.ఉదాహరణకు ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ చిత్రం కోసం 4 వేల వీఎఫ్ఎక్స్ షాట్స్ను క్రియేట్ చేశారట! కానీ, అందులో 3,289 వీఎఫ్ఎక్స్ షాట్స్ను మాత్రమే తీసుకున్నాడట దర్శకుడు జేమ్స్ కామెరూన్ . ఆ ఒక్కో వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 62,500 డాలర్ల ఖర్చు అయ్యింది. ఆ సినిమా మొత్తం బడ్జెట్లో వీఎఫ్ఎక్స్ షాట్స్ కోసమే 250 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టారట! అయితే సినీ చరిత్రలో ఇప్పటి దాకా సీజీఐ కోసం అత్యధికంగా ఖర్చు పెట్టింది మాత్రం ‘ది అవెంజర్స్–ఎండ్గేమ్.’ వీటికోసం 356 మిలియన్ల డాలర్లను కుమ్మరించారంటే అతిశయోక్తికాదు. అలాగే, విజువల్స్ కోసం అత్యధికంగా బడ్జెట్ కేటాయించిన టాప్ 3 చిత్రాలు కూడా మార్వెల్ సినిమాలే కావడం మరో విశేషం! ఇదీ స్క్రీన్ మీద ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్లు క్రియేట్ చేసే సీన్! – భాస్కర్ శ్రీపతి -
Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు
‘‘కల్కి 2898 ఏడీ’ సెట్స్లో తొలిసారి అమితాబ్ బచ్చన్గారిని కలిసినప్పుడు ఆయన కాళ్లను తాకాలనుకున్నాను. అమితాబ్గారు వద్దన్నారు. నువ్వు చేస్తే నేనూ చేయాల్సి ఉంటుందన్నారు. సార్... ప్లీజ్ అన్నాను. అప్పట్లో ఎవరైనా టాల్గా ఉంటే అమితాబ్ అనేవారు. అమితాబ్ బచ్చన్గారి హెయిర్ స్టయిల్ బాగా ఫేమస్. ఇక ‘సాగర సంగమం’ చూసి ఆ సినిమాలో కమల్గారిలా డ్రెస్ కావాలని మా అమ్మతో అన్నాను. ‘ఇంద్రుడు చంద్రుడు’లో ఆయన నటన చూసి ఎగ్జైట్ అయ్యాను. ఈ స్టార్స్, దీపికా పదుకోన్తో కలిసి యాక్ట్ చేయడం నాకో మంచి ఎక్స్పీరియన్స్’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకకు హీరో రానా హోస్ట్గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్ను అమితాబ్ బచ్చన్కు అశ్వినీదత్ అందించగా, ఆయన నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్ను ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? అని అమితాబ్ను రానా అడగ్గా, మై బద్రర్ కమల్హాసన్కి అని చె΄్పారు. ఆ తర్వాత ఈ టికెట్ను అమితాబ్ నుంచి కమల్ అందుకుని, ‘షోలే’ సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంకా ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నేనిప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు అతను ఏం తాగితే ఇలాంటి ఐడియా వచ్చిందా అనిపించింది. తన విజన్ అద్భుతం. అశ్వినీదత్గారు సింపుల్గా ఉంటారు. సెట్స్లో నాకు కోపరేటివ్గా ఉన్నారు’’ అన్నారు. కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా స్టార్ట్ చేసేప్పుడు ఆసక్తిగా అనిపించింది. సెట్స్లో పాల్గొన్న తర్వాత సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తోంది. సాధారణంగా కనిపించేవారు అసాధారణ పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ విషయంలో నాకు అదే అనిపించింది. బ్యాట్మేన్లాంటి కథలు చేయాలని నాకు ఉండేది. ఈ సినిమాలో చేశాను. ఈ సినిమాలో నేనొక పాత్ర చేయాలనుకున్నా.. ఈ పాత్రను అమిత్జీ చేస్తున్నారన్నారు. మరో పాత్ర ఎంచుకున్నా.. అది ప్రభాస్ చేస్తున్నారన్నారు. ఫైనల్గా సుప్రీమ్ యాస్కిన్ అనే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘కరోనా టైమ్లో జూమ్లో నాగ్ అశ్విన్ కథ చె΄్పారు. తన విజన్ క్లియర్గా ఉంటుంది. ఇందులో తల్లి పాత్ర చేశాను. ఈ సినిమా సెట్స్లో ప్రభాస్ ఈ రోజు ఎవరికి ఏం ఫుడ్ పెట్టారు అన్నదే హైలైట్ డిస్కషన్గా ఉండేది (సరదాగా)’’ అన్నారు దీపికా పదుకోన్. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ వేడుకకు హాజరు కాలేదు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడిన వీడియో బైట్ను ప్లే చేశారు. కాశీ, కాంప్లెక్స్, షంబాల అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని చెప్పి, ఈ ప్రపంచాల నేపథ్యాలను వివరించారు నాగ్ అశ్విన్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్వ΄్నాదత్, ప్రియాంకా దత్, అనిల్ తడానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న దీపికా పదుకోన్ స్టేజ్ నుంచి దిగేటప్పుడు ప్రభాస్, స్టేజ్ ఎక్కేటప్పుడు అమితాబ్ హెల్ప్ చేయడం ఈవెంట్లో హైలైట్గా నిలిచింది. -
Chennai: డీఎంకేతో కుదిరిన కమల్హాసన్ పార్టీ పొత్తు.. డీల్ ఇదే
చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(ఎమ్ఎన్ఎమ్), అధికార డీఎంకే మధ్య తమిళనాడులో పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా తమ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కమల్ పార్టీ ఎమ్ఎన్ఎమ్ శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున ప్రచారం మాత్రమే చేస్తామని తెలిపింది. చెన్నైలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివలయంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్తో కమల్హాసన్ భేటీ తర్వాత ఎమ్ఎన్ఎమ్ పార్టీ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అయితే పొత్తులో భాగంగా 2025లో డీఎంకే, ఎమ్ఎన్ఎమ్కు ఒక రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొత్తు ప్రకటన అనంతరం కమల్హాసన్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం తాము డీఎంకే కూటమిలో చేరామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక్క లోక్సభ స్థానాల్లో డీఎంకే తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. ఇదీ చదవండి.. హిమాచల్ సంక్షోభం మళ్లీ మొదటికి -
ఇండియా కూటమిలో చేరికపై కమల్ హాసన్ స్పందన
చెన్నై: స్వార్థరహితంగా ఆలోచించే ఏ కూటమితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడుకు చెందిన ఎమ్ఎన్ఎమ్ పార్టీ చీఫ్ కమల్హాసన్ తెలిపారు. ఇండియా కూటమిలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తాము భాగస్వాములం కాదని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా స్థానిక ఫ్యూడల్ శక్తులతో కలిసి మాత్రం పనిచేయబోమని చెప్పారు. స్టాలిన్కు చెందిన డీఎంకే పార్టీతో కమల్హాసన్ కలిసి పనిచేయబోతున్నారన్న పుకార్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్హాసన్ ఈ సందర్భంగా స్వాగతించారు. ఇదీ చదవండి.. గగన్యాన్పై ఇస్రో కీలక అప్డేట్ -
ఫీమేల్ గెటప్లో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్న హీరోలు
క్యారెక్టర్ డిమాండ్ని బట్టి గెటప్ మారుతుంది. ఒక్కోసారి మేల్ ‘ఫీమేల్’గా మారాల్సి వస్తుంది. ఫీమేల్ ‘మేల్’గా మారాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఇద్దరు హిందీ హీరోలు ఫీమేల్ గెటప్లోకి మారారు. ఇటు సౌత్లో ఇద్దరు హీరోలు లేడీ గెటప్స్లోకి మారనున్నారు. ఆ ఫీ‘మేల్’ విశేషాలు... ఆయుష్ఉమన్ ‘‘అయ్య బాబోయ్.. స్త్రీ పాత్ర చేయడం అంత ఈజీ కాదండోయ్’’ అంటున్నారు ఆయుష్మాన్ ఖురానా. ‘డ్రీమ్ గర్ల్ 2’లో తను చేసిన పూజ పాత్ర గురించే ఆయన అలా అన్నారు. ‘అంధాధున్’లో అంధుడిగా, ‘బాలా’లో బట్టతల ఉన్న యువకుడిగా.. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన ఆయుష్మాన్ ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రంలో కరణ్వీర్ అనే యువకుడిగా, పూజ అనే యువతిగా కనిపించనున్నారు. 2019లో ఆయుష్మాన్ హీరోగా నటించిన ‘డ్రీమ్ గర్ల్’కి ఇది సీక్వెల్. తొలి భాగాన్ని తెరకెక్కించిన రాజ్ షాండిల్యానే మలి భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్ట్లోనూ పూజ పాత్రలో కనిపించిన ఆయుష్మాన్ సెకండ్ పార్ట్లోనూ ఆ పాత్ర చేశారు. ఓ చిన్న పట్టణానికి చెందిన కరణ్ తన తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి కష్టాలుపడుతుంటాడు. అతని ప్రేయసి పరీ (అనన్యా పాండే). అయితే ఆమెను పెళ్లాడటానికి పరీ తండ్రి కరణ్కి కొన్ని నిబంధనలు పెడతాడు. తన ముందున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూజాగా మారతాడు కరణ్. ఇలా కష్టాల కరణ్గా, నవ్వులు పూయించే పూజాగా ఆయుష్మాన్ నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ ఈ నెల 25న విడుదల కానుంది. కాగా.. ‘‘స్త్రీ వేషం చాలా సవాల్గా అనిపించింది. ముఖ్యంగా ఎండల్లో విగ్ పెట్టుకుని నటించడం కష్టంగా అనిపించింది. ఈ ఆయుష్‘మాన్’ చేసిన ఆయుష్‘ఉమన్’ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’’ అన్నారు ఆయుష్. అమ్మాయిగా ఆలోచించాలి ‘‘ఫీమేల్ ఆర్టిస్టులు వ్యానిటీ వేన్ నుంచి బయటకు రావడానికి అన్నేసి గంటలు ఎందుకు పడుతుందో నాకిప్పుడు అర్థమైంది. మేల్ ఆర్టిస్ట్ల మేకప్తో పోల్చితే ఫీమేల్కి చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. నేను చేసిన స్త్రీ పాత్ర మేకప్కి మూడు గంటలు పట్టేది’’ అని నవాజుద్దీన్ సిద్ధిఖీ అంటున్నారు. ‘హడ్డీ’ చిత్రంలో తాను చేసిన లేడీ క్యారెక్టర్ గురించే నవాజుద్దీన్ ఈ విధంగా అన్నారు. అక్షయ్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఓ చిన్న పట్టణానికి చెందిన హరి అనే యువకుడికి అమ్మాయిగా మారాలనే ఆకాంక్ష ఉంటుంది. లింగ మార్పిడి గురించి ఈ చిత్రంలో చూపించారు. ‘‘అమ్మాయి పాత్ర చేయడానికి అమ్మాయిలా మేకప్ వేసుకుంటే చాలదు.. అమ్మాయిలానే ఆలోచించాలి. నేను అలానే చేశాను’’ అంటూ ఈ పాత్రలో తానెంతగా లీనమయ్యారో చెప్పారు నవాజుద్దీన్. ఇదిలా ఉంటే... వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’లో ఆయన విలన్గా నటిస్తున్నారు. తెలుగులో నవాజుద్దీన్కి ఇది తొలి చిత్రం. పదిహేనేళ్ల తర్వాత... వైవిధ్యమైన పాత్రలకు చిరునామా కమల్హాసన్. ఫిజికల్లీ చాలెంజ్డ్, చిన్న వయసులో వృద్ధుడిగా, ఎత్తు పళ్లు, వృద్ధురాలిగా.. ఇలా క్యారెక్టర్ డిమాండ్ మేరకు మౌల్డ్ అవుతారు కమల్హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’ (1996) చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కమల్ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించనున్నారని తెలిసిందే. కొన్ని సన్నివేశాల్లో స్త్రీగానూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఇదే నిజమైతే పదిహేనేళ్ల తర్వాత కమల్ స్త్రీ వేషంలో కనిపించినట్లు అవుతుంది. గతంలో కమల్హాసన్ ‘భామనే సత్యభామనే’ (1996), ‘దశావతారం’ (2008)లో లేడీ గెటప్లో కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘ఇండియన్ 2’ విషయానికి వస్తే.. ఓ సమస్య పరిష్కారానికి కమల్ స్త్రీ వేషంలోకి మారతారని టాక్. లేడీ గెటప్ పై ఫోకస్ విశ్వక్ సేన్లో మంచి నటుడు–దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించిన చిత్రం ‘ఫలక్నుమా దాస్’. ఆ తర్వాత ‘హిట్’, ‘పాగల్’... ఇలా హీరోగా ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్రాలు చేస్తున్న విశ్వక్ ఆ మధ్య ఓ సినిమా ప్రమోషన్ సమయంలో తాను ఒక సినిమాలో లేడీ గెటప్లో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే జస్ట్ కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించి మాయం కాకుండా సినిమా సెకండాఫ్ మొత్తం ఆ గెటప్లోనే కనిపించనున్నారని సమాచారం. అందుకే ఈ చిత్రానికి ‘లీల’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని భోగట్టా. ఈ చిత్రం గురించి, ఈ పాత్ర గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం విశ్వక్ ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గామి’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు. మరి.. వీటిలో ఏదైనా సినిమాలో లేడీ గెటప్ ఉంటుందా? లేక వార్తల్లో ఉన్న ప్రకారం ‘లీల’ అనే సినిమా ఉంటుందా? అనే క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
కమల్, ప్రభాస్, చరణ్ డబుల్ ధమాకా.. సమంత, ఎన్టీఆర్ ట్రీట్ కూడా ఉందా?
హీరోలు స్క్రీన్పై సింగిల్గా కనిపించినా అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక డబుల్ రోల్స్లో కనబడితే పండగే పండగ. ఒకే సినిమాలో డ్యూయల్ రోల్ అంటే స్టార్ హీరోల ఫ్యాన్స్కు డబుల్ ధమాకానే. ఇలా ఫ్యాన్స్ను, ఆడియన్స్ను అలరించేందుకు రెండు పాత్రల్లో కనిపించే చిత్రాల్లో నటిస్తున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► కమల్హాసన్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్గా నిలిచిన చిత్రాల్లో ‘ఇండియన్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సేనాపతిగా, ఆయన కొడుకు చంద్రబోస్గా రెండు పాత్రల్లో మెప్పించారు కమల్హాసన్. ప్రస్తుతం కమల్, శంకర్ కాంబినేషన్లోనే ‘ఇండియన్’కు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కూడా కమల్ రెండు పాత్రలు చేస్తున్నట్లుగా తెలిసింది. ‘ఇండియన్’లో మాదిరిగానే ‘ఇండియన్ 2’లోనూ కమల్ తండ్రీకొడుకుగా కనిపించనున్నారని టాక్. ఈ సినిమా కథ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుందట. ► ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నుంచి ప్రభాస్కు చెందిన రెండు లుక్స్ రిలీజయ్యాయి. దీంతో ‘సలార్’లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. ► శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ చేంజర్’ చిత్రంలో డబుల్ రోల్లో కనిపించనున్నారు హీరో రామ్చరణ్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. ఐఏఎస్ ఆఫీసర్ల బ్యాక్డ్రాప్లో పొలిటికల్ టచ్ ఉన్న ఈ చిత్రంలో రామ్చరణ్ తండ్రీకొడుకుగా నటిస్తున్నారని తెలిసింది. 1920 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్లో ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా, సమకాలీన పరిస్థితుల్లో ఐఏఎస్ ఆఫీసర్గా రామ్చరణ్ కనిపిస్తారని ఫిల్మ్నగర్ ఖబర్. అలాగే రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్ బ్యాక్డ్రాప్లో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్చరణ్ అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ట్రీట్ ఉందా? అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ సినిమాలో ఎన్టీఆర్, ఒక హిందీ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మరి.. ఈ ఇద్దరి నుంచి డబుల్ ట్రీట్ ఉందా? అనేది త్వరలో తెలుస్తుంది. ► దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం విడుదలైన ‘ఆంధ్రావాలా’ సినిమాలో తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. మరోసారి తండ్రీకొడుకుగా ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్లోనే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ► ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్తో హిందీ ఆడియన్స్లో క్రేజ్ దక్కించుకున్నారు సమంత. ఇప్పుడు ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్లో నటిస్తున్నారామె. ఇక సమంత నటించనున్న తొలి హిందీ చిత్రంపై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా హిందీ హిట్ ‘స్త్రీ ’(2018) ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఓ హారర్ ఫిల్మ్ తెరకెక్కనుందని, ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్నగర్’ టైటిల్తో తెరపైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తారని టాక్. ఈ ఏడాది చివర్లో సెట్స్కి వెళ్లనున్న ఈ చిత్రంలో సమంత డ్యూయల్ రోల్ చేయనున్నారని సమాచారం. ఓ పాత్రలో సమంత ప్రేతాత్మగా కనిపిస్తారట. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. -
మేకప్ మాయ.. కొత్త లుక్లో సినీ తారలు
ముఖం మీద ముడతలు కావాలా? ఉందిగా మేకప్. తెల్లగా ఉన్నవాళ్లు నల్లగా కనబడాలా? మేకప్ ఉందిగా. వయసులో ఉన్నవాళ్లు వృద్ధులుగా కనబడాలా? మేకప్తో ఏదైనా సాధ్యమే. ప్రస్తుతం కొందరు తారలు వెరైటీగా కనబడే ప్రయత్నంలో ఉన్నారు. మేకప్ సహాయంతో నల్లబడుతున్నారు. ముసలివాళ్లవుతున్నారు. అంతా మేకప్ మాయ. అప్.. అప్.. మేకప్ అంటూ కొత్త లుక్లో కనపడబోతున్న తారల గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకూ కనిపించని లుక్లో వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలో కనిపించనున్నారు. తమిళ చిత్రం ‘అసురన్’కి రీమేక్గా రూపొందుతోంది ‘నారప్ప’. ఇందులో రైతు పాత్రలో కనిపించనున్నారు. మామూలు రైతు కాదు.. అన్యాయాన్ని సహించలేని రైతు. కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఎదురు తిరిగి, అక్రమార్కులను అంతం చేసే రైతు. ఈ పాత్రలో వెంకీ రఫ్గా కనిపిస్తారు. పైగా రైతు అంటే ఎండల్లో కష్టపడక తప్పదు కదా.. దానికి మ్యాచ్ అయ్యేట్లు ఆయన స్కిన్ టోన్ని కాస్త డల్ చేశారు. వెంకీ రైతు అయితే అల్లు అర్జున్ లారీ క్లీనర్. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ అనే లారీ క్లీనర్గా కమిలిపోయిన చర్మంతో కనబడతారు. సరిగ్గా దువ్వని జుట్టు, ట్యాన్ అయిన స్కిన్, ఆయిల్ మరకలతో బట్టలు.. అల్లు అర్జునేనా? అన్నంతగా మారిపోయారు. ఇక బాబాయ్ వెంకటేశ్లానే అబ్బాయ్ రానా కూడా ట్యాన్ అయ్యారు. ఒక్క సినిమా కోసం కాదు.. రెండు సినిమాలకు. ఒకటి ‘అరణ్య’, ఇంకోటి ‘విరాటపర్వం’. 25ఏళ్లుగా అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక వ్యక్తి కథ ‘అరణ్య’. పర్యావరణం, అడవుల నరికివేత వంటి అంశాలతో సాగే ఈ సినిమాలో అడవిలో నివసించేవాళ్లు ఎలా ఉంటారో అలా కనబడతారు రానా. అలాగే నక్సలిజమ్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ‘విరాటపర్వం’లో రానా మాత్రమే కాదు కథానాయిక సాయిపల్లవి, కీలక పాత్రలు చేస్తున్న ప్రియమణి, నందితా దాస్ కూడా డల్ మేకప్లోనే కనబడతారు. అందరూ నిజమైన నక్సలైట్లను తలపించేలా మౌల్డ్ అయిపోయారు. ఇప్పటివరకూ మోడ్రన్ గాళ్లా కనిపించిన రకుల్ ప్రీత్సింగ్ అచ్చమైన పల్లెటూరి పిల్లలా కనిపించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ సరసన ఆమె ఓ సినిమాలో నటిస్తున్నారు. అడవి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం బిగుతైన జడ, లంగా, ఓణీ, తక్కువ మేకప్తో విలేజ్ గాళ్లా మారిపోయారు రకుల్. సవాల్ అనిపించే పాత్రలు వస్తే సై అంటారు నటీనటులు. వీళ్లందరికీ అలాంటి పాత్రలు వచ్చాయి. వెరైటీ క్యారెక్టర్స్లో కనిపించాలనే ఆకలితో ఉన్న వీళ్లందరూ లుక్ని మార్చుకోవడమే కాదు.. నటనపరంగా కూడా విజృంభిస్తున్నారు. వీళ్లే కాదు.. ఇలాంటి చాలెంజింగ్ రోల్స్లో కనిపించనున్న తారలు ఇంకా చాలామందే ఉన్నారు. దర్శకుడితో జోడీ ‘మహానటి’తో తనలో ఉత్తమ నటి ఉందని నిరూపించుకున్నారు కీర్తీ సురేశ్. తమిళ సినిమా ‘సాని కాయిదమ్’లో ఆమె నటన వేరే లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. ‘7/జి బృందావన కాలనీ’ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రం ద్వారా నటుడిగా మారారు. సెల్వ, కీర్తీ జంటగా తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా ఫస్ట్ పోస్టర్లో సెల్వ, కీర్తిల లుక్ చూసి క్రైమ్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వృద్ధుని గానూ... ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కలవని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుంది? అనే కాల్పనిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వృద్ధునిగానూ కనిపించనున్నారని సమాచారం. అయితే కొమురం భీమ్ చిన్న వయసులోనే మరణించారు. ఇది కాల్పనిక కథ కాబట్టి ఎన్టీఆర్కి ఓల్డ్ గెటప్ కూడా పెట్టి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ ప్రోస్థెటిక్ మేకప్ వాడుతున్నారని టాక్. 90 ఏళ్ల వృద్ధునిగా వెరైటీ గెటప్పులు వేయడంలో కమల్హాసన్కి సాటి ఎవరూ రారంటే అతిశయోక్తి కాదు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ ‘భారతీయుడు’ (1996). అందులో యువకుడిగానే కాదు.. వృద్ధునిగానూ కమల్ కనిపించారు. తాజాగా ‘భారతీయుడు 2’ రూపొందుతోంది. ఇందులో 90 ఏళ్ల వృద్ధునిగా కమల్ కనిపిస్తారని తెలిసింది. హెవీ ప్రోస్థెటిక్ మేకప్తో కమల్ వృద్ధునిగా కనిపించనున్నారు. ఈ వృద్ధునికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆమె 85 ఏళ్ల వృద్ధురాలిగా కనబడతారని టాక్. -
పండగ తర్వాత ప్రారంభం
కమల్హాసన్–శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ (1996) ఓ సంచలనం. 24 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ఆరంభించారు కమల్–శంకర్. గతేడాది మూడు షెడ్యూల్స్ కూడా ముగించారు. కానీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత కరోనా లాక్డౌన్ వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే బడ్జెట్ సమస్యల వల్ల సినిమా మళ్లీ ట్రాక్ ఎక్కదనే వార్త మొదలైంది. కానీ అది నిజం కాదు. త్వరలో నాలుగో షెడ్యూల్ మొదలుపెట్టడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. జనవరిలో సంక్రాంతి పండగ తర్వాత లేదా ఫిబ్రవరిలో చిత్రీకరణ ఆరంభించడానికి పకడ్బందీగా షెడ్యూల్ ప్లాన్ చేశారు. చెన్నైలో షెడ్యూల్ పూర్తి చేశాక, దేశంలో పలు లొకేషన్స్లో షూటింగ్ చేయాలనుకుంటున్నారు. అలాగే విదేశాల్లోనూ షెడ్యూల్స్ ఉంటాయని సమాచారం. ఈ కరోనా టైమ్లో దేశ, విదేశాల్లో ఎక్కువమందితో షూటింగ్ అంటే సవాల్ అనే చెప్పాలి. ఈ సవాల్ని అధిగమించేలా దర్శకుడు శంకర్ అండ్ టీమ్ వర్కవుట్ చేస్తోంది. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్సింగ్ తదితరులు నటిస్తున్నారు. -
విందా? విధ్వంసమా?
రుచికరమైన భోజనం తయారు చేస్తున్నారు కమల్హాసన్. ఓ భారీ విందుని ఏర్పాటు చేసినట్టున్నారు. అతిథులందరూ వచ్చే లోపల విస్తళ్లు సిద్ధం చేశారు. ఆహార పదార్థాలు ఉన్న గిన్నెలు కూడా. వాటితో పాటు కొన్ని కత్తులు, తుపాకులు కూడా. ఇంతకీ ఇది విందు భోజనమా? విధ్వంసం సృష్టించే ముందు విందు పెడతారా? అనేది సినిమాలో చూడాలి. ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం కమల్హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ను, టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘విక్రమ్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. టీజర్లో కమల్ రుచికరమైన విందు వండుతూనే, విలన్స్ను వేసేయడానికి స్కెచ్ వేస్తున్నట్లుగా కనబడుతోంది. -
భారతీయుడు ఆగలేదు
‘‘భారతీయుడు’ సినిమా ఆగిపోయింది’’ అనే వార్త కోలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. గతంలో పలు సార్లు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను లైకా ఖండించింది. తాజాగా మరోసారి కూడా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. లైకా నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పందిస్తూ – ‘‘ఇండియన్ 2’ చిత్రం షూటింగ్ సుమారు 60 శాతం పూర్తయింది. ఇంత పూర్తి చేశాక సినిమాను ఎందుకు ఆపేస్తాం? లాక్ డౌన్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలుపెడతాం’’ అని పేర్కొన్నారు. -
ఇన్నుమ్ ఇరుక్కు!
ఏ ఇండస్ట్రీలో అయినా ప్రతి ఏడాది కొన్ని సీక్వెల్స్ వెండితెరపైకి వస్తూనే ఉంటాయి. కోలీవుడ్లో గత ఏడాది రజనీకాంత్ ‘2.0’, కమల్హాసన్ ‘విశ్వరూపం 2’, ధనుష్ ‘మారి 2’, విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలతో పాటు ‘కలకలప్పు 2’, ‘గోలీ సోడా 2’, ‘తమిళ్ పడమ్ 2’ చిత్రాలు సీక్వెల్స్గా వచ్చి ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశాయి. ‘ఇన్నుమ్ ఇరుక్కు’ (ఇంకా ఉంది) అంటూ తమిళంలో ఈ ఏడాది కూడా కొన్ని సీక్వెల్స్ వెండితెరపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో వాంగ పాక్కలామ్.. అదేనండీ.. రండి చూద్దాం. లోకనాయకుడు కమల్హాసన్ సీక్వెల్స్పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది ‘విశ్వరూపం 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ పనుల్లో ఉన్నారిప్పుడు. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. సేమ్ కాంబినేషన్లో సెట్స్పైకి వెళ్లిన ఈ ‘ఇండియన్ 2’ సినిమాలో కాజల్ అగర్వాల్ కథా నాయికగా నటిస్తున్నారు. అలాగే 1992లో భరతన్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా నటించిన ‘దేవర్మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్హాసనే గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా సీక్వెల్స్పై ఫుల్ కాన్సట్రేట్ చేశారు కమల్. యువహీరో ‘జయం’ రవి కూడా ఓ సీక్వెల్తో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్చరణ్ చేసిన హిట్ మూవీ ‘ధృవ(2016)’ తమిళంలో ‘జయం’ రవి హీరోగా నటించిన ‘తని ఒరువన్’ (2015)కు రీమేక్ అని తెలిసిందే. దీనికి మోహన్రాజా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘తని ఒరువన్’ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. సేమ్ మోహన్రాజా దర్శకత్వంలోనే ‘జయం’ రవి హీరోగా నటిస్తున్నారు. మొదటిపార్ట్ కన్నా మరింత మెరుగ్గా సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడతామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఇక తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్ ముఖ్య తారలుగా ఏఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ (తెలుగులో ‘అభినేత్రి’) చిత్రానికి సీక్వెల్గా ‘దేవి 2’ చిత్రం రూపొందుతోంది. ఏఎల్. విజయ్ దర్శకత్వంలోనే తమన్నా, ప్రభుదేవా ముఖ్యతారలుగా నటిస్తున్నారు. నందితా శ్వేత, కోవై సరళ ముఖ్యపాత్రలు చేస్తున్నారీ సీక్వెల్లో. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిసింది. తెలుగులో ‘అభినేత్రి 2’ పేరుతో విడుదల కావొచ్చు. మరోవైపు ఓ మల్టీస్టారర్ సీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇది ఇప్పటి చిత్రానికి సీక్వెల్ కాదు. దురై దర్శకత్వంలో కమల్హాసన్, శ్రీప్రియ నటించిన నీయా (1979) చిత్రానికి సీక్వెల్గా ‘నీయా 2’ వస్తోంది. మల్టీస్టారర్ మూవీగా జై, వరలక్ష్మీ శరత్కుమార్, రాయ్లక్ష్మీ, క్యాథరీన్లతో ఈ చిత్రం రూపొందింది. ఆల్రెడీ ఫస్ట్లుక్స్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ‘నాగకన్య’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నాలుగేళ్ల క్రితం హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చతురంగ వేటై్ట’. ఈ సినిమా ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో ఈ ఏడాది విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటించారు. ఇప్పుడు త్రిష, అరవింద్ స్వామి హీరోహీరోయిన్లుగా ‘చతురంగ వేటై్ట 2’ సినిమా సెట్స్పై ఉంది. ప్రముఖ కమెడియన్ వడివేలు నటించిన ‘ఇమ్సై అరసన్ 23 ఆమ్ పులికేశి’ (తెలుగులో ‘హింసించే రాజు 23వ పులకేశి’) చిత్రానికి సీక్వెల్గా ‘ఇమ్సై అరసన్ 24 ఆమ్ పులికేశి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. సీక్వెల్లో కూడా వడివేలునే తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఆ స్థానంలో యోగిబాబు నటిస్తారని టాక్. మరి.. హింసించే రాజు ఎవరో త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలే కాకుండా కొన్ని చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా సెట్స్పై ఉన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కొన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్ను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నారట కొంతమంది కోలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తుపాకీ’ (2012) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మురుగదాస్ ఈ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారని కోలీవుడ్లో వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్ పార్ట్లో విజయ్ నటించగా, సీక్వెల్లో మాత్రం అజిత్ హీరోగా నటిస్తారట. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘పుదుపేటై్ట’ (2006). ఈ సినిమా సీక్వెల్ ఆలోచన ఉన్నట్లు ఓ అభిమాని ప్రశ్నకు ధనుష్ సమాధానంగా చెప్పారు ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో. విశాల్,ధనుష్ అభివృద్ధి చెందిన నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఇరంబు దురై’ (2018). (తెలుగులో ‘అభిమన్యుడు’). పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నారు విశాల్. 2017లో వచ్చిన హారర్ మూవీ ‘గృహం’ సిద్ధార్థ్కు మంచి హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట. అలాగే నయనతార కలెక్టర్గా నటించిన ‘అరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’), సూర్య కెరీర్కు మంచి మైలేజ్ను తీసుకొచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ‘ఘర్షణ’) సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయని కోలీవుడ్లో కొత్తగా కథనాలు వస్తున్నాయి. ‘గోల్మాల్, రేస్, ధూమ్, క్రిష్’ చిత్రాల సీక్వెల్స్ ఫ్రాంచైజ్లుగా మారాయి బాలీవుడ్లో. ఈ ట్రెండ్ మెల్లిగా సౌత్కి వస్తున్నట్లు అర్థం అవుతోంది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఇప్పటికే ‘సింగం’ (తెలుగులో ‘యముడు’) సిరీస్లో మూడు సినిమాలు వచ్చాయి. మరో రెండేళ్లలోపు ‘సింగం 4’ అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సిరీస్ ఇలాంటిదే. ‘ముని’ పేరుతో మొదలైన ఈ హారర్ సిరీస్లో ఫోర్త్ పార్ట్గా ‘కాంచన 3’ ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్కు రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్ రాఘవ లారెన్స్తో పాటు, వేదిక, ఓవియా నటించారు. విశాల్ కెరీర్కు మాస్ ఇమేజ్ను తీసుకువచ్చిన చిత్రం ‘పందెం కోడి (2005)’. ఈ సినిమా సీక్వెల్ ‘పందెంకోడి 2’ గతేడాది విడుదల అయ్యింది. ‘పందెంకోడి 3’ సినిమా 2020లో సెట్స్పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విశాల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఓ సిరీస్లా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట టీమ్. భవిష్యత్లో ఈ సిరీస్ల ట్రెండ్ మరింత ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. -
సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి
సంగీత జ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇళయరాజా 75’ పేరుతో గత శని, ఆదివారాల్లో చెన్నైలో ఘనంగా వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను తమిళ నిర్మాతల మండలి నిర్వహించింది. ఈ వేడుకలోని హైలెట్స్... ► ఇళయరాజాగారితో ఉన్న అనుబంధం గురించి రెహమాన్ మాట్లాడుతూ – ‘‘నేను రాజాగారి దగ్గర పని చేసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ‘మూండ్రామ్ పిరై’ (వసంత కోకిల) సినిమాకు రాజాసార్ టీమ్లో జాయిన్ అయ్యాను. రాజాగారు రికార్డింగ్ స్టూడియోలోకి ప్రవేశిస్తుంటే ,హెడ్ మాస్టర్ క్లాస్రూమ్లోకి వస్తున్న భావన కలిగేది. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సంగీతంలో రాజాగారే నాకు స్ఫూర్తి’’ అన్నారు. ► ఈ కార్యక్రమానికి సీనియర్ నటి, మణిరత్నం భార్య సుహాసిని యాంకర్గా వ్యవహరించారు. ‘రెహమాన్ మిమ్మల్ని గురువు అన్నారు. దాని గురించి ఏదైనా పంచుకుంటారా? అని ఇళయరాజాని ఆమె అడగ్గా– ‘‘రెహమాన్ తన తండ్రి దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఉన్నాడు. కరెక్టే కదా (రెహమాన్ వైపు చూస్తూ). దానికి రెహమాన్ అవును అన్నారు. ‘ఈ విషయాలన్నీ నువ్వు (రెహమాన్) చెప్పాలి’ అని సరదాగా పేర్కొన్నారు. మరో యాంకర్గా వ్యవహరించిన నటి కస్తూరి.. రెహమాన్ కంపోజ్ చేసిన ఏదైనా పాటను పాడమని అడగ్గా ఇళయరాజా ‘మౌనరాగం’ చిత్రంలోని ‘మండ్రం వంద తెండ్రులుక్కు.’ అనే పాటను ఆలపించారు. అదే సమయంలో కీబోర్డ్ దగ్గర ట్యూన్ చేస్తున్న రెహమాన్.. సంగీతజ్ఞాని పాట వింటూ ఆగిపోయారు. ‘ఏమైంది? ట్యూన్ సరిగ్గా గుర్తులేదా? ’ అంటూ రాజా చమత్కరించారు. ► రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇళయరాజా స్వయంభూలింగం. ధోతి ధరించకముందు వరకూ సార్ అని పిలిచేవాణ్ని. ఆ తర్వాత నుంచి స్వామి అంటున్నాను. రాజాగారు కూడా నన్ను అలానే పిలుస్తారు. నాకంటే కమల్కు మంచి సంగీతాన్ని అందించారు’’ అని రజనీ అంటుండగా, ఇళయరాజా అందుకుంటూ ‘కమల్హాసనేమో మీకు మంచి మ్యూజిక్ ఇచ్చాను అంటుంటారు. నాకు యాక్టర్ ఎవరన్నది కాదు. ఏ పాటకైనా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ► కమల్ హాసన్ ఆయన కుమార్తె శ్రుతీహాసన్ స్టేజ్ మీద మూడు పాటలు పాడి, ఇళయరాజాతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు రాజాగారు సలహాలిచ్చారు’’ అన్నారు కమల్. ► ‘‘సంగీతానికి ఒకరే రాజు. ఆయనే ఇళయరాజా. లాంగ్డ్రైవ్లకు వెళ్తున్నప్పుడు బండిలో పెట్రోల్ ఉందా లేదా అని చూసుకోవడం కంటే ముందు ఇళయరాజా పాటలున్నాయా? లేదా ? అని చెక్ చేసుకుంటారు. ఇలాంటి లెజెండ్స్ను సన్మానించుకోవడం మా బాధ్యత. ఇండస్ట్రీలోని వాళ్లకోసం ఇండస్ట్రీ వాళ్లం ఈవెంట్స్ చేయడంలో తప్పు లేదనుకుంటున్నాను. ఈ వేడుక చరిత్రలో మిగిలిపోతుంది. అలాగే దీన్ని వ్యతిరేకించినవాళ్లు కూడా చరిత్రలో ఉంటారు’’ అని పేర్కొన్నారు నిర్మాతల మండలి అధ్యక్షుడు, హీరో విశాల్. రెహమాన్, ఇళయరాజా శ్రుతీహాసన్, కమల్హాసన్ కమల్, రజనీ -
మరో భారతీయుడు
చేతివేళ్లు మెలితిప్పి అవినీతిని తుడిచేసే ప్రయత్నం చేశారు ‘భారతీయుడు’ సినిమాలో సైనాపతి. ఇప్పుడు మరో సమస్యను చర్చించడానికి వస్తున్నారాయన. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు). ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తం శుక్రవారం జరిగింది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ స్వరాలు అందిస్తారు. -
నేటి భారతీయుడు
ఆయుధాలు లేకుండా కేవలం రెండు వేళ్లతో ప్రత్యర్థులను ఎదుర్కోగలడు సేనాపతి. అవినీతిని ఆశ్రయించినవాళ్లకు సమాధానం చెబుతూ 1995లో శంకర్ సృష్టించిన పాత్ర ఇది. సేనాపతి పాత్రలో కమల్హాసన్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు శంకర్. మొదటి భాగంలో కమల్ వృద్ధ గెటప్లో ఎలా కనిపించారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు నేటి భారతీయుడిని చూడండి. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ కానుంది. సంక్రాంతి స్పెషల్గా ఈ సినిమాలో కమల్ లుక్ను కొద్దిగా శాంపిల్ చూపించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. కమల్హాసన్ మనవడిగా సిద్దార్థ్ నటించనున్నారని టాక్. అనిరు«ద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
క్వాలిటీ ముఖ్యం!
ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్లో తన పేరు తప్పిపోకుండా కష్టపడుతూనే ఉన్నారు కాజల్ అగర్వాల్. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్లో స్పీడ్ పెంచారీ బ్యూటీ. మీ సక్సెస్ మంత్ర ఏంటి? అని కాజల్ని అడిగితే...‘‘నాకు సూట్ అయ్యే పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. సినిమా సినిమాకి నా పాత్రల మధ్య వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతా. నా పాత్రకు ఆడియన్స్ ఎంత కనెక్ట్ అవుతారనే విషయం కూడా మైండ్లో ఉంచుకుంటా. క్వాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ముఖ్యం. రోల్ మోడల్ అంటూ నాకు ప్రత్యేకంగా ఎవరూ లేరు. ప్రముఖ నటీనటుల నుంచి ఒక్కో డిఫరెంట్ క్వాలిటీని తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీత’ అనే సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు కాజల్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. కమల్హాసన్–శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తారు. తమిళంలో ఆమె నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. -
బుల్లితెర టైమ్ వచ్చింది!
కోలీవుడ్లో వెండితెరపై నటుడిగా సూపర్సక్సెస్ సాధించారు విజయ్ సేతుపతి. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన హోస్ట్గా ఓ ప్రముఖ చానల్లో ఓ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి అధికారికంగా వెల్లడించారు. ఈ షో త్వరలో మొదలుకానుంది. ఆల్రెడీ కమల్హాసన్ బిగ్బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. రీసెంట్గా శ్రుతీ హాసన్, విశాల్, వరలక్ష్మి బుల్లితెర కమిట్మెంట్కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేతుపతి వంతు వచ్చినట్లు ఉంది. ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే... రజనీకాంత్ నటించిన ‘పేట్టా’ చిత్రంలో జీతూ అనే కీలక పాత్ర చేశారు. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోగానూ కొన్ని తమిళ సినిమాలు చేస్తున్నారాయన. ఇటీవల విజయ్సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ‘96’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
ఫుల్ జోష్
విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సౌత్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ ఏడాది ‘కర్వాన్’ సినిమాతో బాలీవుడ్ గడప తొక్కిన దుల్కర్ ప్రస్తుతం ‘జోయా ఫ్యాక్టర్’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు. నార్త్, సౌత్ సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంటూ ఫుల్ జోష్లో ఉన్న ఆయనకు తాజాగా ‘ఇండియన్ 2’ చిత్రంలో నటించే చాన్స్ వచ్చిందని కోలీవుడ్ టాక్. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ‘ఇండియన్ 2’ సీక్వెల్. శంకర్ –కమల్హాసన్ కాంబినేషన్లోనే తెరకెక్కనున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా ఎంపికయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్ పేరు తెరపైకి వచ్చింది. ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. -
జస్ట్ మిస్
రజనీకాంత్, కమల్హాసన్... తమిళ సినిమాకు రెండు పిల్లర్స్ లాంటి యాక్టర్స్. ఎప్పుడో కెరీర్ తొలినాళ్లలో ఈ ఇద్దరు హీరోలు ‘అంతులేని కథ’, 16 వయదినిలే’ వంటి పలు బ్లాక్బాస్టర్ చిత్రాల్లో కలసి యాక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు ఈ సూపర్ స్టార్స్. రీసెంట్గా ఈ స్టార్స్ ఇద్దరూ కలసి నటించే చాన్స్ జస్ట్ మిస్ అయింది అంటున్నారు శంకర్. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘2.ఓ’. ఈ చిత్రంలో విలన్గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. కానీ తొలుత ఈ పాత్రకు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్, ఆ తర్వాత బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ పేర్లను పరిశీలించారనే టాక్ వినిపించింది. అయితే విలన్ పాత్రకు కమల్హాసన్ పేరును కూడా అనుకున్నారట దర్శకుడు శంకర్. ఆ పాత్ర కోసం కమల్ను సంప్రదించారని కూడా చెప్పుకొచ్చారు శంకర్. ఈ విషయాన్ని తెలియజేస్తూ– ‘‘2.ఓ’ కంటే ‘భారతీయుడు’ సీక్వెల్ మీద కమల్సార్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో కమల్సార్ని నటింపజేయాలనుకునే ఆలోచన విరమించుకున్నాను’’ అని అన్నారు శంకర్. -
ఉప ఎన్నికల బరిలో కమల్ పార్టీ
చెన్నై: తమిళనాడులో త్వరలో 20 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనుందని నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ వెల్లడించారు. ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న కమల్ హాసన్ విలేకరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. టీటీవీ దినకరన్ వర్గంలో చేరిన 18మంది ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును ఇటీవల మద్రాస్ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. దీంతోపాటు డీఎంకే అధినేత కరుణానిధి, ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మరణంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఏర్పడ్డాయి. -
అమావాస్య చందమామ!
కథానాయికలు కేవలం గ్లామర్కి మాత్రమే అంటే అస్సలు ఒప్పుకోరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఎప్పటికప్పుడు చాలెంజింగ్ రోల్స్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారామె. ఇందులో భాగంగా ఇటీవల అంధురాలిగా నటించడానికి కూడా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘రాజపార్వై’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు చిత్రబృందం. 1981లో వచ్చిన కమల్ హాసన్ సినిమా టైటిల్ ఇది కావడం విశేషం. ‘రాజపార్వై’ సినిమా ‘అమావాస్య చంద్రుడు’ టైటిల్తో తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అంటే వరలక్ష్మీ అమావాస్య చందమామగా కనిపించబోతోందా?. చూపు లేని అమ్మాయిగా కనిపించడానికి వరలక్ష్మీ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. అంధురాలిగా నటించడం ఓ సవాల్ అంటే.. ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేస్తారు వరలక్ష్మీ. అందుకోసం కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. పాత్ర పట్ల తనకున్న డెడికేషన్ అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం తమిళ హీరోయిన్స్లో ఫుల్ బిజీ యాక్టర్ కూడా వరలక్ష్మీనే. సుమారు 4–5 సినిమాలతో బిజీగా ఉన్నారు. -
ఇక షురూ
కమల్ హాసన్, విక్రమ్లను ఒకే ఫ్రేమ్లో చూసి మల్టీస్టారర్ మూవీకి కొబ్బరికాయ కొట్టారని తప్పులో కాలేయకండి. ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ విక్రమ్ హీరో. కమల్హాసన్ నిర్మాత. రాజేష్. ఎమ్. సెల్వ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా కమల్ సొంత సంస్థ రాజ్కమల్ ఇంటర్నేషనల్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కమల్ రెండో కుమార్తె అక్షరాహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ‘‘స్టైలిష్ అండ్ టాలెంట్ హీరో విక్రమ్తో నా సినిమా మొదలైంది. అమేజింగ్ టీమ్ కుదిరింది’’ అని రాజేష్ పేర్కొన్నారు. ఈ సినిమా ఓ ఫ్రెంచ్ మూవీకి రీమేక్ అని టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే.. విక్రమ్, కీర్తీ సురేశ్, ఐశ్వర్యా రాజేష్ ముఖ్య తారలుగా హరి దర్శకత్వంలో ‘సామి’కి సీక్వెల్గా రూపొందిన ‘సామీ స్క్యేర్’ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుందన్న వార్తలు వస్తున్నాయి. -
పెరియ మనుషన్ ఏమయ్యాడు?
‘‘భేష్.. సినిమా బాగుంది. రైట్ స్క్రిప్ట్ తీసుకొస్తే నీ డైరెక్షన్లో సినిమా చేస్తా’’... శంకర్కి సూపర్ స్టార్ రజనీకాంత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ‘జెంటిల్మేన్’ చూసి శంకర్కి రజనీ ఈ ఆఫర్ ఇచ్చారు. శంకర్కి దర్శకుడిగా ఇది ఫస్ట్ మూవీ. రజనీ ఇచ్చిన ఆఫర్తో ఉత్సాహంగా కథ రాయడం మొదలుపెట్టారు. అది రాస్తూనే ‘ప్రేమికుడు’ సినిమా తీయడం మొదలుపెట్టారు. ఈ సినిమా పూర్తయ్యేసరికి రజనీ కోసం తయారు చేసిన కథ కూడా పూర్తయింది. ‘పెరియ మనుషన్’ అని టైటిల్ కూడా పెట్టేశారు. అంటే పెద్ద మనిషి అని అర్థం. ఇక రజనీ కథ వినడమే ఆలస్యం. ‘పెరియ మనుషన్’ పట్టాలెక్కేస్తాడు. అయితే అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని జరగవు కొన్ని అనే సామెతలా రజనీతో తీయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ మొదలు కాలేదు. ఎందుకంటే, రజనీ అప్పటికి వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చేశారు. ఇది జరిగింది 1993లో. ఆ తర్వాత 14 ఏళ్లకు ‘శివాజీ’ (2007)తో రజనీ–శంకర్ కాంబినేషన్ కుదిరింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘రోబో’తో ఇద్దరూ మరో ఘనవిజయం ఇచ్చారు. ఈ చిత్రం సీక్వెల్ ‘2.0’తో ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ కుదిరింది. ‘2.0’ నవంబర్ 29న విడుదల కానుంది. అంతా బాగానే ఉంది. ఇంతకీ ఆ ‘పెరియ మనుషన్’ స్క్రిప్ట్ ఏమైంది? అంటే.. ఆ కథనే శంకర్ అటూ ఇటూ మార్చి కమల్హాసన్తో ‘భారతీయుడు’ తీశారని టాక్. -
ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు
‘‘విశ్వరూపం’ సినిమా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ సినిమాలకు వచ్చిన గ్యాప్ మా వల్ల కాదు. అది రాజకీయం. ఇప్పుడు అవన్నీ పక్కకు తప్పుకోవడంతో ఈ సినిమా ఆడియన్స్ దగ్గరకు వస్తోంది. ఇంతకు ముందు సినిమాను మర్చిపోతారేమో అనే భయం ఉండేది. డిజిటల్ యుగం వల్ల ఫస్ట్ పార్ట్ పోయిన సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలానే గుర్తుపెట్టుకొని సీక్వెల్ను స్వాగతిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అని కమల్హాసన్ అన్నారు. కమల్హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘విశ్వరూపం 2’. 2013లో రిలీజ్ అయిన ‘విశ్వరూపం’ చిత్రానికి సెకండ్ పార్ట్. ఆండ్రియా, పూజా కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. జిబ్రాన్ సంగీత దర్శకుడు. ఈ నెల 10న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా కమల్హాసన్ చెప్పిన విశేషాలు. సినిమాను ముందుగానే రెండు పార్ట్స్గా డిజైన్ చేశాం. ఈ సినిమా షూటింగ్ నాలుగేళ్ల క్రితం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యాయి. కొత్తగా ఏమీ షూటింగ్ చేయలేదు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేశాం. సెకండ్ పార్ట్ ఇండియాలో జరుగుతుంది. ఈ ఇండికేషన్ ఫస్ట్ పార్ట్ లాస్ట్లో చూపించాం. ఫస్ట్ పార్ట్ అంతా అమెరికాలో జరిగింది. సినిమాలో హీరోకి వసీమ్ అహ్మద్ కశ్మీరీ అనే పేరు ఎందుకు పెట్టాం? అనేది కూడా ఇందులో వివరిస్తాం. సెకండ్ పార్ట్ చూసేటప్పుడు సినిమాలోని అన్ని లేయర్స్ అర్థం అవుతాయి. ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు క్రియేటీవ్ ఫ్రీడమ్ అనేది మన దగ్గర చాలా తక్కువ అని ఫీల్ అవుతాను. వాక్ స్వాతంత్య్రం కూడా తక్కువే. సినిమా అనేది నాకు దొరికిన ఒక ప్లాట్ఫామ్. వివాదాలు చేసేవాళ్లు ఆ పనిని ఆపేశారు. ఇప్పుడు నేను కూడా రాజకీయ నాయకుడినే. ఇప్పుడు ఎవరూ ఎవరి ఉద్దేశాలు వినేలా లేరు. నేషనలిజానికి అర్థం మారుతూ ఉంటుంది. పెషావర్ మనది. కానీ ఇప్పుడు కాదే. నిజాం అని పిలిచే వాళ్లం. కానీ ఇప్పుడు? ఎవరి ఒపీనియన్ వాళ్లది. నేషనలిజానికి నా అర్థం ఏంటో నేను తెలుసుకున్నాను. ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు. మా స్టైల్లో మేం పాటిస్తూనే ఉన్నాం. ఎవరి అర్థం వారు డిఫైన్ చేసుకోవచ్చు. ప్రపంచ స్థాయి సినిమాలు తీస్తున్నాం ‘విశ్వరూపం 2’ యాక్షన్ సీన్స్ ఫస్ట్ పార్ట్స్ని మించి ఉంటాయి అనుకుంటున్నాను. నాతోటి హీరోలు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాను. పది సంవత్సరాల క్రితం చేసిన యాక్షన్స్ సినిమాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు సినిమా స్టాండర్డ్స్ ఇంకా పెరిగాయి. వరల్డ్ సినిమా స్టాండర్డ్స్లో మనం సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమా కూడా ఆ స్థాయికి తక్కువ ఏం ఉండదనుకుంటున్నాను. జిబ్రాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్కి పని చేసిన శంకర్ ఎహసన్ లాయ్ని రిపీట్ చేయడం కుదర్లేదు. సినిమాలు వేరు.. పాలిటిక్స్ వేరు సినిమాలు వేరు. పాలిటిక్స్ వేరు. సినిమాల్లానే నా పొలిటికల్ ఐడియాలజీలు కూడా సోఫిస్టికేటెడ్గా ఉంటాయా అంటే.. అందరూ ప్రజాస్వామ్యానికి అలవాటు పడాలి, అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. మనకు స్వాతంత్య్రం వచ్చి 71 సంవత్సరాలు అయింది. కానీ నేను మాత్రం 1948లోనే ఉన్నాం అని భావిస్తాను. స్వాతంత్య్రం వచ్చి ఒక్క ఏడాదే అయిందని భావించి, అభివృద్ధికి అందరూ తమ వంతు సహకారం అందించాలి. కమల్ పేరు వినిపించదు! చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇంత మంది జనాభా ఉన్నాం. మంచి నటులు వస్తారు, రావాలి. నేను చాలా స్వార్థపరుణ్ణి. మంచి మంచి పాత్రలన్నీ నేనే ఎంచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి. అయితే రాజకీయాల్లోకి వెళ్లాను కాబట్టి వేరే వాళ్లు చెబుతారు. కమల్హాసన్ అనే పేరు వినిపించదు. అంతే కానీ అదే టాలెంట్తో, ఇంకా ఎక్కువ టాలెంట్తో వస్తూనే ఉంటారు. ‘సాగర సంగమం’లో ‘ఆర్ట్ నెవర్ ఎండ్స్’ అని వేశాం. సినిమాలపై పొలిటికల్ ప్రెజర్ సినిమాలపై వచ్చే పొలిటికల్ ప్రెజర్ అసలు పొలిటికల్ ప్రెజరే కాదు. జస్ట్ ప్రెజర్ మాత్రమే. పొలిటికల్ అని అంటున్నాం. నిరంకుశత్వ ధోరణి ఉన్నవాళ్లే ఎక్కువ భయపడతారని నేను భావిస్తాను. ఫిల్మ్ జర్నలిస్ట్ అయినా, వేరే ఏ జర్నలిస్ట్ అయినా టైమ్ వచ్చినప్పుడు పొలిటీషియన్స్ను ప్రశ్నలు అడగాలి. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ బాధ్యత ఉంది జర్నలిస్ట్లకు. వాళ్లు సమాధానాలను దాటేయవచ్చు కానీ జర్నలిస్ట్లు క్వశ్చన్స్ వేయకుండా ఉండకూడదు. ఇలా జర్నలిస్ట్లు క్వశ్చన్స్ అడిగినప్పుడు పొలిటీషియన్గా నా పని ఈజీ అవుతుంది. బాలచందర్గారు స్టార్స్ని తయారు చేశారు యాక్టర్స్ని సెలెక్ట్ చేయడం రెండు విధాలు. ఒకటి స్టార్ దగ్గరకు వెళ్లడం, స్టార్స్ని తయారు చేయడం. బాలచందర్ గారు స్టార్స్ని తయారు చేయడం చూశాను. మట్టి బొమ్మలకు దేవత రూపాలు ఇచ్చారు. మేల్ స్టార్స్, ఫీమేల్ స్టార్స్ని తయారు చేశారు. ఆ పద్ధతి నాకు ఇష్టం. ఆర్ట్ని ప్రేమిస్తే తప్ప అలా చేయలేం. స్టార్స్ అంటే సెపరేట్ వ్యాన్, టచప్ చేయడం ఇవన్నీ కాదు. ఎప్పుడు రిహార్సల్స్కి పిలిచినా వచ్చేవారు. పట్టుదలతో చేసేవారే స్టార్స్. మా టీమ్ అందరం కలిసి స్క్రిప్ట్ చదువుతాం. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్లు నన్ను అడుగుతారు. ఈ సినిమా కెమెరామెన్ ఒక డైరెక్టర్, ఎడిటర్ ఒక డైరెక్టర్.. ఇలా ఎంతో మంది ఇంటెలిజెన్స్ పర్సన్స్ వేసే ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్, వచ్చే డిస్కషన్స్ సినిమాకు ప్లస్ అవ్వడంతో పాటు నా క్యారెక్టర్ మరింత మెరుగు అవ్వడానికి దోహదపడుతుంది. మా టీమ్లో ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నారు. ఒక సినిమాను తీయడంలో ఉన్న కష్టం ఏంటో వారందరికీ తెలుసు. వాళ్ల రుణం తీర్చుకోవాలి ఫిల్మ్ మేకింగ్లో ప్రతీ పనిని ఎంజాయ్ చేస్తాను. నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్తో కలిసి చూడటమే నా రెమ్యునరేషన్, ఫస్ట్ అడ్వాన్స్లా భావిస్తాను. నా ఫేమ్, మనీ, నా స్టేటస్ అన్నీ ఆడియన్స్ ఇచ్చినవే. వాళ్ల రుణం తీర్చుకోవాలి కదా. వాళ్లకు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను (రాజ కీయాల్లోకి అడుగుపెట్టడాన్ని ఉద్దేశించి). -
అమ్మ చేసింది తప్పు
... అని కమల్హాసన్ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అంటే మలయాళం నటీనటుల సంఘం అని అర్థం. గతేడాది నటి భావన కారులో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన వెనకాల నటుడు దిలీప్ హస్తం ఉందని భావన ఆరోపించారు. ఆమె ఫిర్యాదుని పరిశీలించి, పోలీసులు దిలీప్ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్పై బయటకు రావడం జరిగాయి. కాగా, ‘అమ్మ’లో దిలీప్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు సభ్యత్వం ఇచ్చారు ఇటీవల ‘అమ్మ’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్లాల్. ఈ నిర్ణయంపై బాధితురాలు భావనతో సహా పలువురు కథానాయికలు బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మళ్లీ సభ్యత్వం ఎలా ఇస్తారు? అని ‘అమ్మ’ని నిలదీశారు. ఈ విషయం గురించి కమల్హాసన్ స్పందించారు. ‘‘చట్టపరంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సభ్యత్వం ఇవ్వడం తప్పు. ఒకవేళ దిలీప్ని క్షమించాలనుకుంటే వ్యక్తిగతంగా చేయొచ్చు. అయితే ఓ అసోసియేషన్ తీసుకునే నిర్ణయానికి సభ్యులందరి ఆమోదం ఉండాలి. దిలీప్ని వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని ‘అమ్మ’లో ఉన్న పలువురు అంటున్నారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం సభ్యులందరితో చర్చించాలి. అలా కాకుండా అతనికి సభ్యత్వం ఇచ్చి, బాధిత నటికి అన్యాయం చేశారు. ఆర్టిస్టులందరి కలయికతో ఏర్పడేదే ఆర్టిస్ట్స్ అసోసియేషన్. అది సజావుగా సాగాలంటే అందరి సహకారం కావాలి’’ అన్నారు కమల్. చిత్రసీమలో లింగ వివక్ష గురించి మాట్లాడుతూ – ‘‘మిగతా చిత్రపరిశ్రమలతో పోల్చితే మలయాళంలో లింగ వివక్ష తక్కువ’’ అన్నారు కమల్. -
కాంగ్రెస్తో పొత్తా.. ఇప్పుడే చెప్పలేను!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవడంపై ఇప్పుడే చెప్పలేనని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్హాసన్ అన్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న తరువాత కమల్ మీడియాతో మాట్లాడారు. పొత్తు అంశాన్ని కాంగ్రెస్ అగ్ర నేతల వద్ద ప్రస్తావించలేదని అన్నారు. రాజకీయాల్లో తన దారేదో తానే నిర్ణయించుకుంటానని చెప్పారు. జాతీయ రాజకీయాల గురించి చర్చించేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిశానని తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకునే విషయంపై తన పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని అన్నారు. రాహుల్, కమల్ల భేటీపై స్పందించేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ నిరాకరించారు. -
రాహుల్తో కమల్ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్ నివాసంలో బుధవారం గంటపాటు జరిగిన ఈ భేటీలో ప్రియాంక వాద్రా కూడా పాల్గొన్నారు. ‘మేమిద్దరం రాజకీయాలపై చర్చలు జరిపాం. తమిళనాడులో మక్కల్ నీధి మయ్యమ్, కాంగ్రెస్ కూటమి ఏర్పాటుపై మాట్లాడుకోలేదు. ఇది మర్యాద పూర్వక సమావేశం మాత్రమే’ అని కమల్ విలేకరులతో అన్నారు. అంతకుముందు కమల్ ఎన్నికల కమిషన్(ఈసీ) అధికారులను కలిశారు. తన మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ రిజిస్ట్రేషన్పై వారితో మాట్లాడారు. తమ పార్టీకి త్వరలోనే గుర్తింపు దక్కనుందని తెలిపారు. పార్టీ గుర్తు ఇంకా ఖరారు చేయలేదన్నారు. రాహుల్తో సమావేశం మర్యాద పూర్వకమేనని కమల్ చెబుతున్నప్పటికీ, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఎన్ఎం, వామపక్షాలు కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాట రాజకీయ పరిస్థితులు అస్పష్టంగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత నెలలో సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా బెంగళూరులో కమల్, రాహుల్ సమావేశమయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో మొదటిసారిగా జయలలిత, కరుణానిధి లేకుండా ఈసారి అక్కడ ఎన్నికలు జరుగనుండగా కొత్తగా రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పార్టీని ఇంకా ఖరారు చేయలేదు. బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మించుకునే పనిలో ఉన్నారు. అయితే, కమల్ హాసన్ ఇవేమీ లేకుండానే పార్టీ కార్యకలాపాలను ప్రారంభించారు. కమల్, కాంగ్రెస్, దినకరన్ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే అధికారం ఖాయమని ఏఐఏడీఎంకే నేత ఒకరు విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే కమల్, రాహుల్ సమావేశం జరిగిందని సమాచారం. తమిళనాడులో ఉన్న 39 లోక్సభ స్థానాలపై అధికార బీజేపీ కూడా కన్నేసి ఉంచింది. -
‘కాలా’ విడుదలకు చర్యలు తీసుకోండి
బెంగళూరు: సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమాను కర్ణాటకలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్ఐఎఫ్సీసీ)ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)తో చర్చించాలని సూచించింది. కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక అమలు చేయాలని రజనీకాంతలో గతంలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లతో కర్ణాటకలో ఈ నెల 7న కాలా విడుదలపై కేఎఫ్సీసీ నిషేధం విధించింది. సినీ పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని సినిమా విడుదల చేసేలా కేఎఫ్సీసీతో చర్చించాలని ఎస్ఐఎఫ్సీసీకి సూచించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సాక్షి మహ్రా తెలిపారు. కర్ణాటకలోని రజనీకాంత్ అభిమానుల సంఘం కూడా కేఎఫ్సీసీకి లేఖ రాసింది. వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరింది. కాలాతో సంబంధమేంటి?: ప్రకాశ్రాజ్ యశ్వంతపుర: రజనీకాంత్ ‘కాలా’ సినిమాకు, కావేరి జలాల వివాదానికి సంబంధమేంటి? అని నటుడు ప్రకాశ్రాజ్ ప్రశ్నించారు. ‘కావేరి పర్యవేక్షక మండలిని ఏర్పాటు చేయాలంటూ రజనీకాంత్ తమిళనాడుకు మద్దతు పలికారు. అయితే కాలా సినిమాకు, కావేరి వివాదానికి సంబంధం ఏమిటి? ఆ సినిమాను మాత్రమే కన్నడ సంఘలు ఎందుకు లక్ష్యం చేసుకున్నాయి. గతంలో బీజేపీ నాయకులు కూడా ‘పద్మావత్’ సినిమా విడుదల సమయంలో ఇలాగే వివాదం చేశారు. సినిమాను విడుదల చేయనివ్వండి, సినిమా చూడాలో వద్దో అభిమానులే నిర్ణయిస్తారు’ అని ట్విటర్లో పోస్ట్చేశారు. చర్చలతోనే ‘కావేరి’ పరిష్కారం కుమార స్వామి, కమల్ హాసన్ ఆకాంక్ష సాక్షి, బెంగళూరు: కావేరి జలాల వివాదాన్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కర్ణాటక సీఎం కుమార స్వామి అభిలషించారు. ప్రముఖ నటుడు, మక్కల నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్.. కుమారస్వామిని కలిశారు. గంటకుపైగా చర్చించారు. కమల్తో కావేరి వివాదం, యాజమాన్య బోర్డు అంశాలపై చర్చించినట్లు కుమారస్వామి మీడియాతో చెప్పారు. ఇరు రాష్ట్రాలు ఏకతాటిపై నడుస్తూ చర్చలు జరిపితే సమస్య పరిష్కారమవుతుందని కమల్ సూచించారు. కావేరిపై కోర్టుకెళ్లడం చివరి మెట్టుగా కావాలని పిలుపునిచ్చారు. కాలా చిత్ర ప్రదర్శనపై అడగ్గా, సినిమాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. -
వేసవిలో విశ్వరూపం
అవును...... మే లో విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారట కమల్హాసన్. నాలుగు సంవత్సరాలుగా పలు వివాదాలతో లేటవుతున్న‘విశ్వరూపం2’ ఈ సమ్మర్కు కచ్చితంగా థియేటర్స్లో సందడి చేయనుందట. కమల్హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వరూపం’ సినిమాకు ఇది సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్హాసన్ నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయనీ, ఎలాగైనా సమ్మర్లో తీసుకురావాలని ‘విశ్వరూపం 2’ చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ టాక్. విశేషం ఏంటంటే.. ‘విశ్వరూపం 2’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ‘కాలా’ కంటే ముందే కంప్లీట్ అయిపోయాయట. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని టాక్. ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ రెడీ అయిందని, తమిళనాడులో జరిగిన థియేటర్స్ బంద్ వల్ల రిలీజ్ చేయలేదని టాక్. ఆండ్రియా, పూజాకుమార్, శేఖర్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించారు. -
ఎప్పటికైనా ఫస్ట్ హీరో మాత్రం నాన్నే..
అమ్మాయిలకు చాలామంది రోల్ మోడల్స్ ఉండొచ్చు కానీ ఎప్పటికైనా ఫస్ట్ హీరో మాత్రం నాన్నే. నాన్నే సూపర్ హీరో. నాన్న నడిచిన బాటలో వెళ్లడమే కాకుండా ఇప్పుడు నాన్నతో కలిసి నటిస్తున్నారు కొందరు కూతుళ్లు. నటిగా బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు వాళ్ల నాన్నతో కలిసి యాక్ట్ చేస్తున్న హీరోయిన్లు కొందరైతే, నడక నేర్చుకున్నాక తండ్రితో కలిసి నటిస్తున్నవారు మరికొందరు. ఆన్ స్క్రీన్ కూడా ‘డాడ్ అండ్ డాటర్స్’గానటిస్తున్నవారు కొందరైతే.. కూతురి కోసం స్పెషల్ రోల్స్ చేస్తున్నవారు మరికొందరు. ఆ డాడ్ అండ్ డాటర్స్ గురించి తెలుసుకుందాం. నాన్న కూచి మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్గా నిరూపించుకోకముందే ‘ముద్ద పప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ అయిన నిహారిక ఇటీవల డాడ్ నాగబాబుతో కలిసి ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఇందులో వీళ్లిద్దరూ డాడ్ అండ్ డాటర్గా నటించారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయతలను చూపించడమే కాకుండా కూతురు లవ్ స్టోరీ – తండ్రి లవ్స్టోరీ అంటూ రెండు ట్రాక్స్ వేసి, డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఆన్లైన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ను నిహారిక తన సొంత ప్రొడక్షన్ హౌస్పై నిర్మించారు. నిహారిక, నాగబాబు తొమ్మిదేళ్లకుతండ్రికి కూతురిగా... కమల్హాసన్ విలక్షణ నటుడు. ఎటువంటి పాత్రకైనా ప్రాణం పోయగల సామర్థ్యం ఉన్న నటుడు. కేవలం నటుడు మాత్రమేనా? కథా రచయిత, దర్శకుడు, గాయకుడు.. మొత్తంగా మల్టీ టాలెంటెడ్ పర్శన్. మరి ఆయన రక్తం అంటే ఎలా ఉంటుంది? సేమ్ ఆయన లక్షణాలే పుణికి పుచ్చుకుని ఉంటారు కదా. శ్రుతీహాసన్ కూడా సేమ్ తండ్రిలాగే మల్టీ టాలెంటడ్. చైల్డ్ ఆర్టిస్ట్గా కమల్హాసన్ ‘హే రామ్’ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది శ్రుతి. అలాగే కమల్ నటించిన ‘దేవర్ మగన్’కి ‘పోట్రి పాడడి పెన్నే..’ అనే పాట పాడింది. పెద్దయ్యాక ఏకంగా తండ్రి నటించిన ‘ఈనాడు’ సినిమా ద్వారా సంగీత దర్శకురాలిగా మారింది. మరి.. చిన్నప్పుడు ‘హే రామ్’లో నటించారు కదా.. పెద్దయ్యాక ఎప్పుడు నటిస్తారు? అనే ప్రశ్నకు ‘శభాష్ నాయుడు’తో ఫుల్స్టాప్ పెట్టారు శ్రుతి. కథానాయికగా ఇండస్ట్రీలోకి వచ్చిన తొమ్మిది సంవత్సరాల తర్వాత తండ్రి కమల్తో కలిసి ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కమల్హాసన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘శభాష్ నాయుడు’లో కమల్, శ్రుతి రీల్ లైఫ్లో కూడా తండ్రీ కూతుళ్లులా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కమల్, శ్రుతి కూతురి లవ్స్టోరీకి నాన్న సపోర్ట్ చిన్నప్పుడు నాన్న ఎన్నో కథలు చెబుతాడు. వాటిలో కొన్ని రియల్ లైఫ్ స్టోరీలై ఉండచ్చు. ఏమో పేర్లు మార్చి చెప్పిన లవ్స్టోరీలు ఉండొచ్చు. అలా సోనమ్ కపూర్కి ఆమె తండ్రి అనిల్ కపూర్ బోలెడన్ని కథలు చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు కూతురి లవ్స్టోరీకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇది రీల్ లవ్స్టోరీ. ‘సావరియా’ అనే బ్యూటిఫుల్ లవ్స్టోరీ మూవీతోనే ఇండస్ట్రీకు వచ్చిన సోనమ్ పదేళ్ల తర్వాత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాకే తండ్రి అనిల్ కపూర్తో కలిసి నటిస్తున్నారు. ‘1942 ఎ లవ్ స్టోరీ’ సినిమాలో మనీషా కొయిరాలా కోసం అనిల్ కపూర్ పాడిన ఫేమస్ సాంగ్ ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఏశా లగా...’ టైటిల్తో షెల్లీ చోప్రధర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోనే తండ్రి అనిల్కపూర్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు సోనమ్. ‘‘ఇండస్ట్రీకు వచ్చిన పదేళ్లకు ఫస్ట్ టైమ్ మా నాన్నగారితో కలిసి యాక్ట్ చేస్తున్నాను. మీకు ‘ఆన్ స్క్రీన్ డాటర్’గా కనిపించబోతున్నందుకు చాలా ఎగై్జటెడ్గా ఉన్నాను’’ అని సోనమ్ ట్వీటర్లో పేర్కొంటే ‘‘మనిద్దరం కలిసి యాక్ట్ చేద్దాం అంటే నువ్వు డైరెక్ట్గా రిజెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కలిసి యాక్ట్ చేయబోతున్నాం. నీకు ఎగై్జటెడ్గా ఉందేమో. నాకు మాత్రం చాలా నెర్వస్గా ఉంది’’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు అనిల్కపూర్. ఈ సినిమా అక్టోబర్ 12న విడుదల కానుంది. సోనమ్, అనిల్ కపూర్ నాన్న తోడుగా... దెబ్బ తగిలితే ఎవరైనా అమ్మా అంటారు. కానీ పాము కనిపిస్తే మాత్రం చిన్నతనంలో మోస్ట్లీ నాన్ననే పిలుస్తారు. కానీ నాన్నే పాము మనిషి ఐతే ?? నాన్న చేయి పట్టుకోవడానికి తోడుగా వెళ్లడానికి కొంతమంది మాత్రమే రెడీగా ఉంటారు. ఈ లిస్ట్లోనే ఉన్నారు హీరోయిన్ వరలక్ష్మీ. 2012లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి రోల్స్ చేస్తున్న వరలక్ష్మీ ఫస్ట్ టైమ్ తండ్రి శరత్ కుమార్తో కలిసి యాక్ట్ చేస్తున్నారు. శరత్కుమార్ ముఖ్య పాత్రలో ఏ. వెంకటేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పాంబన్’. ఈ సినిమాలో తండ్రితో కలిసి వెండితెరను పంచుకోబోతున్నారు వరలక్ష్మీ శరత్కుమార్. ఇందులో సగం శరీరం పాములా మారిన వ్యక్తి పాత్రలో కనిపించ నున్నారు శరత్కుమార్. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టారై్టంది. ఇందులో వరలక్ష్మీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. శరత్కుమార్, వరలక్ష్మి డాటర్ లవ్కు నాన్న డైరెక్షన్! కూతురికి ఎవరైనా లవ్లెటర్ రాస్తే తండ్రి ఊరుకుంటారా? ఉహూ.. కొత్త అవతారం చూపించి లెటర్ రాసిన కుర్రాడి కాళ్లు విరగ్గొడతాడు. కానీ యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రం అందరిలా కాదు. డిఫరెంట్ ఫాదర్. అమ్మాయి ఇష్టాన్ని తెలుసుకొని తన కోసం అర్జునే ఓ లెటర్ రాసి ఇచ్చాడు. నచ్చలేదంది, ఇంకోటి రాశాడు. ఇది చాలా బావుందని నవ్వేసింది. ఇంకో అడుగు ముందుకేసి ఎందుకైనా మంచిదని సీన్లోకి స్పెషల్ గెస్ట్గా వచ్చారు. కానీ ఇదంతా రీల్ లైఫ్లోనే.. ‘ప్రేమ బహార’ అనే సినిమా కోసం అన్నమాట. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించి, తన కుమార్తె ఐశ్వర్యను కన్నడ పరిశ్రమకు పరిచయం చేస్తూ తీసిన సినిమా ‘ప్రేమ బహార’. ఈ సినిమా కోసం మూడు లవ్స్టోరీలు రాసి, తన కుమార్తెకు వినిపించారట అర్జున్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టోరీ నచ్చలేదన్నారట. చివరికి మూడో స్టోరీ నచ్చి నటించటానికి ఒప్పుకున్నారట. ఈ టైటిల్ను కుడా అర్జున్ పాత సినిమా ‘ప్రతాప్’లోని ఒక పాటలో నుంచి తీసుకున్నారట. ఇటీవల రిలీౖజñ థియేటర్స్ వద్ద డీసెంట్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అర్జున్, ఐశ్వర్య -
నోలన్కి కమల్ సారీ
కమల్హాసన్.. దేశం గర్వించదగ్గ నటుడు. క్రిస్టోఫర్ నోలన్... ప్రపంచమంతా అభిమానులు సంపాదించుకున్న దర్శకుడు. ఈ ఇద్దరూ ఒకే వేదిక పై కలిస్తే ఎలా ఉంటుంది? సినీ ప్రియులకు కనువిందుగా ఉంటుంది. ఈ వేడుకలో నోలన్ను క్షమాపణలు కోరారు కమల్ హాసన్. క్షమాపణలు ఎందుకు కోరారు? కమల్ ఏం పొరపాటు చేశారు అనుకుంటున్నారా? మేటర్ ఏంటంటే డిజిటల్ ఏజ్లో కూడా నోలన్ ఫిల్మ్ మేకింగ్కు ఇంకా (సెల్యులాయిడ్) రీల్ పద్ధతులనే పాటిస్తారు. డిజిటల్ యుగంలో సెల్యులాయిడ్ సినిమా ఆవశ్యకతను, ఫిల్మ్ ప్రిజర్వేషన్ ఇంపార్టెన్స్ను డిస్కస్ చేయటం కోసమే నోలన్ ఇండియా వచ్చారు. నోలన్ ఇండియాకు రావడం ఇది ఫస్ట్టైమ్. ‘‘నోలన్ను కలిశాను. తన లేటెస్ట్ సినిమా ‘డంకర్క్’ను డిజిటల్ ఫార్మాట్లో వీక్షించినందుకు క్షమాపణలు కోరాను. బదులుగా నా ‘హే రామ్’ సినిమా వీక్షించమని డిజిటల్ ఫార్మాట్ ప్రింట్ అయనకు అందించాను. నోలన్ నా ‘పాపనాశనం’ సినిమా చూశారని తెలిసి ఆశ్చర్యపోయాను’’ అని పేర్కొన్నారు కమల్. వీళ్లిద్దరూ కలిసి ముచ్చటిస్తున్న ఫొటోను ట్వీటర్లో షేర్ చేశారు కమల్. -
నయన్ ఖర్చుపై రచ్చ
తమిళసినిమా: సక్సెస్కు ఐఎస్ఐ ముద్ర అంత నమ్మకంగా మారిన నటి నయనతార. ప్రముఖ, యువ కథానాయకులంటూ భేదం లేకుండా ఎడాపెడా చిత్రాల్లో నటించేస్తున్న ఈ అగ్రతార మరో పక్క హీయిరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తమి ళం, తెలుగు, మలయాళం అంటూ డజను చిత్రాలకు పైగా చేతిలో చి త్రాలున్న నయనతార హిట్కు రూ. కోటి చొప్పున ఇటీవల పారితో షికాన్ని పెంచుకుంటూపోతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇమైకా నోడిగళ్ చిత్రానికి నయనతార రూ. 3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నారు. ఆ చిత్రం ఇంకా విడుదల కానేలేదు. ప్రస్తుతం ఆమె పారి తోషికం రూ.5 కోట్లకు చేరుకుందట. ఈ మధ్యలో తమిళ చిత్రం అరమ్, వేలైక్కారన్, తెలుగు చిత్రం జైసింహా చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా ఇంతకు ముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేస్తూ, అజిత్కు జంటగా విశ్వాసం చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా కమలహాసన్కు జంటగా ఇండియన్–2 చిత్రంలో కథానాయకి అవకాశం నయనతారనే వరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ ఉండడం వల్ల ఈ అమ్మడికి రూ. 5 కోట్లు పారితోషికాన్ని అందించడానికి నిర్మాతలు అభ్యంతరం చెప్పడం లేదు. ఇక్కడ చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే ఆమె సహాయకులకు, ఇతర ఖర్చులకు తడిపి మోపెడవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం గురించి సినియర్ నిర్మాత రాజన్ ఒక చానల్కిచ్చిన భేటీలో పేర్కొంటూ నయనతార పారితోషికం, ఆమె సహాయకులకయ్యే ఖర్చుపై మండిపడ్డారు. ఇటీవల రూ.3 కోట్లు పారితోషికాన్ని పుచ్చుకుంటున్న నయనతార ఇప్పుడు రూ.5కోట్లకు పెంచేశారన్నారు. ఇదలా ఉంచితే ఆమె సహాయకులంటూ 5గురు వెంట ఉంటారన్నారు. వారి ఖర్చే రోజుకు రూ.60 వేలు అవుతోందని, ఇవి కాకుండా కేరవన్ మరో రూ.10 ఖర్చు అని అన్నారు. అదే విధంగా తింటానికి లేనట్టుగా నయనతార తరచూ తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందని ఆయన విమర్శల వర్షం కురిపించారు. దీనికి నయనతార వర్గం ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. -
కమల్హాసన్ రోడ్ షో
సాక్షి, చెన్నై: ప్రజలకు చేరువయ్యేందుకు మక్కల్ నీది మయ్యం నేత కమల్హాసన్ శనివారం రోడ్ షో నిర్వహించారు. కోయంబత్తూరు నుంచి ఈరోడ్–తిరుప్పూర్ వైపుగా సాగిన ఈ షోలో 18 చోట్ల పార్టీ జెండాలను ఎగుర వేశారు. ప్రధానంగా పశ్చిమ తమిళనాడు మీద దృష్టి పెట్టిన కమల్ హఠాత్తుగా తిరుప్పూర్, ఈరోడ్, కోయంబత్తూరు పర్యటనలకు సిద్ధమయ్యారు. కోయంబత్తూరు విమానాశ్రయానికి చేరుకున్న కమల్కు అక్కడి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. జనం అత్యధికంగా గుమిగూడిన ప్రదేశాల్లో తన వాహనంలోని ఓపెన్ విండో నుంచి అభివాదం చేస్తూ కమల్ ముందుకు సాగారు. జెండా ఎగుర వేసిన చోటంతా ఓపెన్ విండో నుంచి ప్రసంగించారు. అలాగే మార్గమధ్యంలోని ఓ గ్రామంలో అక్కడి ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గ్రామాల మీదుగానే కమల్ పర్యటన ఈరోడ్ వరకు సాగింది. సాయంత్రం అన్నదాతలతో, చేనేత కార్మికులతో కమల్ భేటీ అయ్యారు. -
సభ్యత్వ నమోదు వేగవంతం చేయండి
సాక్షి, చెన్నై : పార్టీని బలోపేతం చేసే దిశగా మక్కల్ నీది మయ్యం అధినేత కమల్హాసన్ చర్యలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు శిబిరాల్ని విస్తృతంగా ఏర్పాటు చేయాలని పార్టీ జిల్లా ఇన్చార్జ్లను ఆదేశించారు. సోమవారం జిల్లాల ఇన్చార్జ్లతో ఆళ్వార్పేటలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అభిమానుల సహకారంతో మక్కల్ నీది మయ్యం లక్ష్యాలను , ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సభ్యులుగా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువత కమల్కు మద్దతు తెలియజేస్తూ, మక్కల్ నీది మయ్యంలో చేరారు. -
శ్రీదేవి ఎన్ ఎంగచ్చి
‘శ్రీదేవి ఎన్ తంగచ్చి’ అనే షాకింగ్ కామెంట్ చేశారు కమల్హాసన్. అర్థం కావడం లేదా? ‘శ్రీదేవి నా సోదరి’ అంటున్నారు కమల్. సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న కమల్హాసన్–శ్రీదేవి ఆఫ్ స్క్రీన్లో అన్నాచెల్లెలిలా మెలిగేవారట. శ్రీదేవి మరణించిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఆమెతో వాళ్లకున్న అనుబంధం గురించి షేర్ చేసుకుంటున్నారు. శ్రీదేవితో 27 సినిమాలు చేసిన కమల్హాసన్ కూడా పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఓ తమిళ పత్రికతో ఆయన మాట్లాడుతూ– ‘‘ఆ రోజుల్లో పెళ్లిళ్లలో జంటను చూసి అచ్చం ‘కమల్హాసన్–శ్రీదేవి’లా ఉన్నారు కదా అనుకునేవారు. సినిమాలో మేం ఇద్దరం డ్యూయెట్లు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ కనిపించడంతో అలా అనుకొని ఉండుంటారు. వాళ్ల కలల్ని కూల్చేయటం ఎందుకు? అని మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ను ఎప్పుడూ బయటపెట్టలేదు. సినిమాలో దేవుడు–దేవత పాత్రలు పోషించేవాళ్లు.. వాళ్లకు జోడీగా నటించే ఆర్టిస్ట్ను అన్నయ్య అనో చెల్లెమ్మ అనో పిలిచేవారు. నేను, శ్రీదేవి కూడా అన్నాచెల్లెలమే. సునిశితంగా గమనిస్తే.. ఆన్ స్క్రీన్ మేం అన్నాచెల్లెలు లాగా కనిపిస్తాం. మా కాంబినేషన్ ఎంత హిటై్టందంటే మమ్మల్ని సంప్రదించకుండానే ఈ స్టోరీలో వీళ్లిద్దరూ యాక్ట్ చేసేస్తారులే అనుకునేవారు దర్శక–నిర్మాతలు. ఇలా వరుసగా సినిమాలు చేసేసరికి ‘మళ్లీ శ్రీదేవేనా?’ అనుకునేవాణ్ణి. ఏదో అలా అనుకున్నాను కానీ ‘శ్రీదేవితో యాక్ట్ చేయాలని ప్రతి నటుడు కోరుకునేవాడు’’ అని పేర్కొన్నారు కమల్హాసన్. -
కొత్త సినిమాలు గురూ!
సాక్షి, చెన్నై: విశ్వనటుడు కమల్, సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేసినా, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వచ్చేదెప్పుడో అన్న ప్రశ్న బయలు దేరింది. రాజకీయాల మీద కన్నా, నటన మీదే దృష్టి అన్నట్టుగా వీరిద్దరి అడుగులు సాగుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఈ ఇద్దరు కొత్త సినిమాలకు సంతకాలు చేసి ఉండడం గమనార్హం. ఒకరు దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్, మరొకరు విశ్వ నటుడు కమల్. ఈఇద్దరు ప్రస్తుతం తమిళనాట రాజకీయ చర్చల్లో ఉన్నవారే. తమిళనాడు రక్షణ, తమిళుల సంక్షేమం, సామాజిక న్యాయం నినాదాలతో ఈ ఇద్దరు రాజకీయ అరంగ్రేటం చేశారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ కసరత్తుల వేగం పెంచిన సమయంలో కమల్ ఒక అడుగు ముందుకు వేశారు. మక్కల్ నీధి మయ్యం పేరుతో రాజకీయ పార్టీని కమల్ ప్రకటించేశారు. పార్టీ ›ప్రకటన తదుపరి రాష్ట్ర పర్యటన అని ప్రకటించినా, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో విశ్వనటుడు వెనక్కు తగ్గారని చెప్పవచ్చు. మరింత సమయాన్ని ఆయన తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.కమల్ రాజకీయ పార్టీ ప్రకటనతో కథానాయకుడి పార్టీ, రూపు రేఖల మీద అంచనాలు పెరిగి ఉన్నాయి. అయితే, తలైవా రాక మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరురాజకీయ పార్టీని ప్రకటించేసి మరింత సమయాన్ని తీసుకునే పనిలో నిమగ్నం కాగా, మరొకరు పార్టీ ప్రకటనకు మరింత సమయాన్ని తీసుకునేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు తగ్గ పరిణామాలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. తలైవా ..ఆలస్యమేనా: ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో ‘2.ఓ’, పా రంజిత్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న ‘కాలా’ చిత్రాలను ముగించారు. ఈ రెండు చిత్రాలు విడుదలకు ముస్తాబు అవుతున్నాయి. ఈ చిత్రాల తదుపరి ఇక, రజనీ కాంత్ సినిమాల్ని పక్కన పెట్టి రాజకీయాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడుతారన్న భావనలో సర్వత్రా నిమగ్నం అయ్యారు. మక్కల్ మండ్రం కు ఇన్చార్జ్ల నియమకం పూర్తి కాగానే, తలైవా రాష్ట్ర పర్యటన ప్రారంభం కావచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ప్రస్తుతానికి పార్టీ మీద కన్నా, షూటింగ్ మీద రజనీ కాంత్ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇందుకు తగ్గట్టు కొత్త సినిమాలకు సంతకాలు చేసి ఉండటం గమనార్హం. డిఎంకే అధినేత ఎం కరుణానిధి మనవడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సోదరుడు, సన్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్ నిర్మించనున్న చిత్రానికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండటం సర్వత్రా విస్మయంలో పడేసి ఉన్నది. ఎన్నికలు వస్తే పార్టీతో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అని కథానాయకుడు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఈ దృష్ట్యా, రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవన్న భావనలో ఆయన ఉన్నట్టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటుగా కొనసాగుతుందని సిఎం పళని స్వామి ధీమా వ్యక్తం చేస్తుండటాన్ని రజనీ పరిగణించినట్టున్నారు. మరో వైపు ఈ ప్రభుత్వం కుప్ప కూలేందుకు తగ్గ పరిస్థితులు కనిపించని దృష్ట్యా, కాస్త ఆలస్యంగానే రాజకీయ పయానాన్ని మొదలెట్టేందుకు రజనీ నిర్ణయించారా...? అన్న చర్చ ఊపందుకుంది. భారతీయుడి –2 మీదే : ప్రస్తుతం కమల్ ‘విశ్వరూపం–2 పూర్తి చేసి విడుదలకు ముస్తాబు చేసే పనిలో ఉన్నారు. అలాగే, . శభాష్నాయుడు షూటింగ్ మీద దృష్టి పెట్టిందుకు నిర్ణయించి ఉన్నారని చెప్పవచ్చు. ఈ సమయంలో శంకర్ దర్శకత్వంలో భారతీయుడు–2 చిత్రానికి కమల్ సంతకం పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, బిగ్బాస్–2కు రెడీ అవుతున్న సమాచారంతో రాజకీయ గెటప్ను కాస్త పక్కన పెట్టిమ సినీ మేకప్ మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల మీద కన్నా, 2021 మీదే దృష్టి అన్నట్టు కమల్ సైతం ముందుకు సాగేందుకు నిర్ణయించి ఉండటం బట్టి చూస్తే, స్టార్ల రాజకీయ అడుగుల వేగం ప్రస్తుతానికి మందగించినట్టేనా..? అన్న ప్రచారం ఊపందుకుని ఉన్నది. ఇదిలా ఉండగా, ‘మక్కల్ నీది మయ్యం’ చిహ్నం లోగో ముంబయి తమిళ సంఘం లోగోను పోలి ఉందన్న వివాదం తెర మీదకు రావడం కమల్కు షాక్ తగిలినట్టుగా అవుతోన్నది. ఆ పేరుకు నిషేధం విధించాలని తమిళనాడు ఎన్నికల సంఘాన్ని ఆ సంఘం వర్గాలు ఆశ్రయించి ఉండటం గమనార్హం. అదే సమయంలో శనివారం తన అభిమాన సంఘాల నేతలతో, మద్దతు దారులతో జరిగిన సమావేశంలో ఏప్రిల్లో తిరుచ్చిలో పర్యటించేందుకు విశ్వనటుడు నిర్ణయించడం ఆలోచించాల్సిందే. -
రజనీ కోసం ఆ ముగ్గురు..
తమిళసినిమా: దక్షిణాది సినిమానే కాదు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు కమలహాసన్, రజనీకాంత్ చుట్టూనే తిరుగుతున్నాయన్నది వాస్తవం. వీరిలో కమలహాసన్ సినిమాలకు గుడ్బై చెప్పేశారు. నిర్మాణంలో ఉన్న విశ్వరూపం–2, శభాష్నాయుడు చేయనున్నట్లు ప్రకటించినా ఇండియన్ 2 చిత్రాలనే ఆయన నుంచి ఆశించవచ్చు. ఇక రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం కార్యక్రమాలు ముమ్మరంగా జరగుతున్నాయి. ఆయన త్వరలోనే పార్టీ జండా, అజెండాలను వెల్లడించే సమయం ఆసన్నమైంది. రజనీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న విషయం తెలిసిందే. శంకర్ ఈ చిత్రాన్ని నభూతోనభవిష్యత్ అనే విధంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో తన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మాణంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించిన కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి ముస్తాబుతోంది. ఇక రజనీకాంత్ మరో చిత్రం చేస్తారా, 2.ఓ చివరి చిత్రం అవుతుందా? అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆయన కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేశారు. సూపర్స్టార్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం తమ చిత్రాలను పట్టాలెక్కించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనే ప్రచారం కోలీవుడ్లో వైరల్ అవుతోంది. యువ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజారాణి, తెరి, మెర్శల్ చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్నారు. ఇక మరో వర్థమాన దర్శకుడు మణికంఠన్ కాక్కాముట్టై చిత్రంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ ఇద్దరూ రజనీకాంత్ కోసం కథలను సిద్ధం చేసి ఆయనకు వినిపించారు కూడా. మరో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్ కూడా సూపర్స్టార్ కోసం బ్రహ్మాండమైన కథను సిద్ధం చేశారట. అట్లి, కేవీ.ఆనంద్ రాజకీయ ఇతివృత్తంతో కథలను తయారు చేయగా కాక్కాముట్టై చిత్రం ఫేమ్ మణకంఠన్ వ్యవసాయం నేపథ్యంలో కథను రెడీ చేశారట. ఈ మూడు కథలు రజనీకాంత్ను ఇంప్రెస్ చేశాయని, వీరిలో ఏవరికి ఆయన పచ్చజెండా ఊపుతారన్నది ఆసక్తికరంగా మారిందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
విజయం మనదే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కొంతకాలంగా రాష్ట్రంలో రెండే ప్రధాన చర్చలు. ఒకటి రజనీ పార్టీ, రెండోది కమల్ పార్టీ. వీటిల్లో కమల్హాసన్ పార్టీ ఎప్పుడు...ఏమిటి...ఎలా అనే చర్చకు ఈనెల 21వ తేదీన తెరపడింది. మక్కల్ నీది మయ్యం అని పార్టీ పేరును ప్రకటించిన కమల్హాసన్ తరువాత కార్యాచరణ ప్రణాళికలో ఉన్నారు. ఇక మిగిలింది రజనీకాంత్ పార్టీ. ‘నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం’ అని గత నెలలో ప్రకటించడం ద్వారా కొన్ని ఊహాగానాలకు తావులేకుండా చేశారు. అయితే పార్టీ పేరు, పతాకం, మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎప్పుడో రజనీ చెప్పడం లేదు. సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్చార్జ్ల నియామకాలు సాగిస్తున్నారు. ఎవరు ముందా అని ప్రజలు ఎదురుచూస్తుండగా ఈనెల 21న కమల్ తన పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. దీంతో ఇక రజనీవంతైంది. జిల్లా ఇన్చార్జ్ల నియామకాల్లో భాగంగా ఈనెల 20 నుంచి ‘రజనీకాంత్ ప్రజా సంఘం’ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో కాంచీపురం, విల్లుపురం, కడలూరు జిల్లాల ఇన్చార్జ్ల ఎంపిక కార్యక్రమం జరిగింది. జాతీయ ఇన్చార్జ్లు నిర్వహించే ఈ సమావేశాలకు రజనీకాంత్ హాజరుకావడం లేదు. సుదూర జిల్లా నుంచి వచ్చే అభిమానులు రజనీని చూడలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అయితే ఈనెల 21న కమల్హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రకటించి తన కంటే ఒక అడుగు ముందుకు వేయడంతో రజనీ కూడా జోరు పెంచారు. చెన్నై రాఘవేంద్ర కల్యాణ మండపంలో శుక్రవారం తిరునెల్వేలి జిల్లా సమావేశాలు జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో రజనీకాంత్ అకస్మాత్తుగా హాజరయ్యారు. రజనీ వస్తారని ఏ మాత్రం ఎదురుచూడని అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమానుల సంఘాల నుంచి మా పార్టీ ఉద్బవిస్తోంది. తాము ఇప్పుడు చేసేదల్లా వాటిని మరింత బలోపేతం చేయడం. నా అభిమానులకు ఎవ్వరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా అభిమానులే ఇతరులకు పాఠం చెప్పగలరు. ఏమి చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం జరుపుకుంటూ రాజకీయాల్లో మార్పు తేవడం సాధ్యం అనే నమ్మకం నాకుంది. అనంతరం మీడియాతో మాట్లాడారు. కమల్ నిర్వహించిన బహిరంగసభ బాగుంది, కమల్కు ముందుగానే నేను శుభాకాంక్షలు చెప్పాను. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలూ కలిసి పోరాడాలి. అన్ని జిల్లాల్లో ఇన్చార్జ్ల నియామకం పూర్తికాగానే రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తాను. రజనీ ఏమిటి ఇలా మౌనంగా ఉన్నారని కొంతమంది విమర్శిస్తున్నారు, వారిని అలానే విమర్శించనీయండి, మన పనిలో మనం ఉందాం. నేను కుటుంబ పెద్దగా సరిగ్గా ఉన్నాను, మనమంతా ఒక కుటుంబంలా ముందుకు సాగుతున్నాం. 32 జిల్లాల ఇన్చార్జ్లను ఒకేసారి కలుసుకునేందుకు కొద్దిరోజులవుతుంది. అన్ని జిల్లాల నియామకం పూర్తికాగానే రాష్ట్రపర్యటన తేదీలను ఖరారు చేస్తాను. కావేరీ జలాల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎడపాడి అఖిలపక్ష సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాని చెప్పారు. -
నాయకన్ తమిళ నాడి పడతారా?
తమిళ చలనచిత్ర రంగంలో ఎంతో నిజాయితీ కలిగిన నిర్మాతగా కమల్కు ఖ్యాతి ఉంది. అయితే తమిళ ఎన్నికల రంగం అంతా అవినీతిమయం. ఇప్పటిదాకా జరిగిన చాలా ఎన్ని కలలో ఓట్లకు డబ్బు వెదజల్లిన ఘనత ఉంది. దీనికి భిన్నమైన వ్యవస్థను ఇస్తానని కమల్ చెబుతున్నారు. ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, డబ్బులు ఇవ్వనని చెబుతున్న కమల్ పార్టీకి తమిళ ఓట్లు పడతాయా? లేకపోతే ఓటుకు నాలుగువేల రూపాయల వంతున పంచే సంప్రదాయక పార్టీలకే మళ్లీ తమిళులు ఓట్లు కుమ్మరిస్తారా? సెప్టెంబర్ 22, 1921న మహాత్మాగాంధీ పూర్తిగా మారిపోయారు. తల పాగా సహా తన గుజరాతీ వస్త్రధారణ మొత్తం ఆయన ఆరోజు వదిలి పెట్టేశారు. ఒక అంగవస్త్రం, పైగుడ్డ ధరించారు. ఇలాంటి వస్త్రధారణలోకి మారా లని అంతకు ముందు పలుమార్లు గాంధీజీ ఆలోచించినప్పటికీ, అంతిమంగా మద్రాస్ నుంచి మధురై (అప్పుడు మధుర అనేవారు)కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడే తుది నిర్ణయానికి వచ్చారు. ఆయన మారాలని భావించిన వేషధారణతోనే వెస్ట్ మాసీ స్ట్రీట్లోని 251 ఏ నంబర్ ఇల్లు మొదటి ఫ్లోర్లోని తన గది నుంచి ఆ ఉదయం ప్రత్యక్షమయ్యారు. తన ‘కొత్త’ దుస్తులతోనే గాంధీజీ రామనాథపురం బయలుదేరారు. ఆ వేష ధారణలో ప్రజలు మొదటిసారి ఎక్కడైతే చూశారో, అక్కడే ఇప్పుడు గాంధీజీ శిలావిగ్రహం ఉంది. ‘మహాత్మాగాంధీ సంకలిత రచనలు’ పుస్తకంలో ఈ ఉదంతాన్ని ఆయన నమోదు చేశారు కూడా. అక్కడ నుంచి 2018 సంవత్సరానికి వద్దాం. గాంధీజీ జీవితం, ఉద్య మాలతో బహుధా ఉత్తేజితుడైన ఒక వ్యక్తి ఆయన వలెనే చెన్నై నుంచి మధురైకు ప్రయాణమవుతున్నారు. తనకు ప్రేరణగా నిలిచిన గాంధీజీ వలెనే నటుడు కమల్ హాసన్ కూడా తన సినిమా నటుడి అవతారాన్ని త్యజిస్తు న్నారు. సినీ తళుకు బెళుకు వేషం నుంచి ఆ మధురైలోనే రాజకీయ నాయకుడి వేషధారణలోకి మారుతున్నారు. గాంధీజీ అడుగుజాడలలోనే ఫిబ్రవరి 21న రామనాథపురం బయలుదేరుతున్నారు కూడా. కమల్లో కలాంను చూస్తున్న ప్రజలు ఇది కూడా కమల్ సినిమాలలో మాదిరిగానే పటిష్టంగా కూర్చిన బలమైన సన్నివేశం వంటిదే కాగలదు. నిజానికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. సృజనాత్మక కళాకారునిగా రూపం ప్రాధాన్యం ఎలాంటిదో కమల్కు బాగా తెలుసు. బుధవారం సాయంత్రం తన రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏమిటో చెప్పడానికి ఇలాంటి సమాంతర వేషధారణ అవసరమన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. మధురైలో అడుగు పెడితే ఇప్పుడు ఆ నగరం కమల్ సొంతమైనట్టు ఉంది. కమల్లో ఏపీజే అబ్దుల్ కలాంను చూసుకుంటున్న అభిమానులు ఏర్పాటు చేసిన పోస్టర్లతో నగరం నిండి ఉంది. ఇంకొన్ని పోస్టర్లలో 1992లో ఆయన నటించిన ‘దేవర్ మగన్’ను గుర్తు చేస్తూ ముద్రించిన పోస్టర్లు కనిపిస్తున్నాయి. కొన్ని పోస్టర్లు కమల్ను తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతితో పోల్చి చూపుతున్నాయి. ఇంకొన్ని పోస్టర్లు ఆయనను ‘ద్రవిడ కమల్’ అని పేర్కొంటున్నాయి. తమిళనాడు రాజకీయా లలో కోలీవుడ్ ప్రభావానికి తగ్గట్టుగానే సభ ఏర్పాట్లన్నీ సినిమా పంథాలోనే ఉన్నాయి. ఇటీవలనే రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించిన రజనీకాంత్కీ, తనకీ మధ్య పోటీలో తన బలమే తక్కువన్న వాస్తవం కమల్కు తెలుసు. రజనీ కాంత్ వలే కమల్ మాస్ వర్గాల నాయకుడు కాదు. కమల్ ఒకింత పై తరగతి వర్గం అభిమానించే కళాకారుడనీ, గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి అందని మేధావి అని ఒక అభిప్రాయం ఉంది. అలాంటి అభిప్రాయాన్ని తటస్థం చేయడానికి మధురై సభ కమల్కు అవకాశం కల్పిస్తున్నది. తన రాజకీయ ప్రవేశం గురించి, పార్టీ గురించి ప్రకటించడానికి ఆయన మధురైను జాగ్ర త్తగానే ఎంచుకున్నారు. ఎందుకంటే అది జల్లికట్టు క్రీడ జరిగే ప్రాంతాలలో ఒకటి. అంటే ఎద్దులను లొంగదీసుకునే క్రీడను అభిమానించే ప్రాంతం. ‘విరుమాండి’ అనే చలనచిత్రంలో కమల్ది కథానాయకుని పాత్ర. అది ఎద్దును లొంగదీసుకునే పాత్రే కూడా. 2004లో వచ్చిన ఆ చిత్రం మధురై ప్రాంతంలో ఆయనకు ఎంతో ఆదరణను తెచ్చి పెట్టింది. జల్లికట్టు క్రీడకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా 2017లో మెరీనాలో జరిగిన ఆందోళనకు మద్దతుగా, ఆ క్రీడ మీద నిషేధం ఎత్తివేయాలంటూ మొదట బయటకు వచ్చిన సినీ ప్రముఖడు కమల్. ‘మీరు జల్లికట్టును నిషే ధిస్తే తరువాత బిర్యానీని కూడా అలాగే నిషేధించాలి’ అని ఆయన అన్నారు. ఆ సినిమాలో నటన, మెరీనా ఉద్యమంలోకి రావడం రెండూ కూడా ఆయన కొత్త పార్టీకి శుభ సంకేతాలవుతాయని ఎదురు చూస్తున్నారు. తనదైన ముద్ర వేయగలరా? ప్రత్యేక ముద్ర, తనదైన గుర్తింపు కోసం చూసే వారికి మధురై సంస్కృతి సరైన నేపథ్యాన్ని కూడా అందిస్తుంది. మద్రాస్ కంటే మధురై మరింత తమిళ సంస్కృతితో ఉంటుంది. అందుకే తన వాగ్ధాటితో అక్కడి ప్రజలను సమ్మో హనం చేయడం సాధ్యమని కమల్ ఆశించవచ్చు. ఈ విషయంలో కమల్తో పోలిస్తే రజనీకాంత్కు కొంత ప్రతికూలత ఉంది. తాను కూడా నిజమైన తమి ళుడనేనని చెప్పుకుంటున్నప్పటికీ, రజనీకాంత్ పొరుగున ఉన్న కర్ణాటకలో పుట్టిన మరాఠీయేనంటూ ఎదురుదాడి తప్పదు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతూ ఉండవచ్చు. ఇందుకు మీదు కట్టి ఉండవచ్చు. కానీ రాజకీయ రంగం మీద కమల్ తనదైన ముద్ర వేయగలరా అనేది మాత్రం ఆయన చెప్పే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు ఆయన మంచి విమర్శకుడిగా కనిపించారు. అన్నాడీఎంకే పాలనలోని దోషాల గురించే మాట్లాడారు. అయితే కొత్త సీసాలో పాత సారా చందంగా ఉంటే మిగతా రాజకీయులకీ ఆయనకీ తేడా ఉండదు. ఒక వస్తువు మీద అతికించిన కాగితం కొత్తగా ఉన్నంత మాత్రానే దానిని కొనుగోలు చేయరు. ఒకసారి దానికేసి చూస్తారు. అంతవరకే. ఆయన ప్రతిపాదించే పరిష్కారాలు అటు అన్నా డీఎంకే, ఇటు డీఎంకే చూపించే పరిష్కారాల కంటే భిన్నంగా ఉంటేనే కమల్ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. ఇంతవరకు కమల్ వ్యవహార శైలిని చూస్తే, ఆయన మంచి వ్యక్తుల వైపు మొగ్గుతున్నాడనే అనిపిస్తుంది. ఆయన ‘మరో కలాం’ కావాలంటూ మధు రైలో పోస్టర్లు వెలసినా, భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్తో సమావేశమైనా కమల్ సరైన పంథాలోనే ఉన్నారని భావించేటట్టు చేస్తున్నారు. అలాగే ఆలోచించే రాజకీయవేత్తగా కూడా ఆయన మాట్లాడుతు న్నారు. ఒక సాంకేతిక నిపుణుడి వలే ఆయన నీట్, పర్యావరణం వంటి అంశాల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. తన రాజకీయ సరళి ద్రవిడ రాజకీయ మూసలోనే ఉంటుందని కమల్ చెప్పేశారు. దానికి హేతుబద్ధతను జోడిస్తే మరింత విజయవంతంగా ఉంటుంది. ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలైన ద్రవిడ పార్టీ డీఎంకే ఉంది. దానికి కార్యకర్తలు, మందీ మార్బలం ఉంది. స్టాలిన్ అనే నేత కూడా ఉన్నారు. అలాంటప్పుడు ప్రజలు కమల్ను ఎందుకు ఎంచుకుం టారు? కాబట్టి ఇప్పుడు కమల్ ఎదుట ఉన్న సవాలు ఏమిటంటే, తాను కూడా ద్రవిడ రాజకీయ తానులో ముక్కనేనని చెబుతున్నప్పుడు, తన సేవలు ఎంత నాణ్యంగా ఉండబోతున్నాయో, ఉన్నతంగా ఉండబోతున్నాయో ఆయన స్పష్టం చేయాలి. నిజానికి డీఎంకే, అన్నా డీఎంకేలకు ఉన్న ఓటర్లు భిన్నమైనవారు. అన్నా డీఎంకేలో కనిపించే ఓటర్లంతా ప్రధానంగా డీఎంకే వ్యతిరేకులు, కరుణానిధి వ్యతిరేకులే. ఇక డీఎంకే ఓటర్లు రెండు రకాలు. ఒక రకం డీఎంకే సిద్ధాంతానికి నిబద్ధులు. రెండో రకం–కరుణానిధి వక్తృత్వానికి సమ్మోహితులై ఓట్లు వేసే వారు. ఇందులో ఈ రెండో తరహా ఓటర్లు కమల్ వైపు ఆకర్షితులు కావచ్చు. ఎందుకంటే కరుణానిధి కుమారుడు స్టాలిన్ తండ్రి వలే రాజకీయోపన్యాసాన్ని కవితాత్మకంగా ఆవిష్కరించలేరు. అయితే అన్నాడీఎంకే ఓటరు కమల్ పట్ల మొగ్గు చూపగలరా? ఈ పార్టీకి పడే ఓట్లు మూడు రకాలుగా చీలి పోయి ఉన్నాయి. అవి ఎడప్పాడి పళనిస్వామి శిబిరం ఓటర్లు, ఒ. పన్నీర్సెల్వం శిబిరం ఓట్లు, టీటీవీ దినకరన్ పట్ల మొగ్గు చూపే ఓటర్లు. డీఎంకే ఓటర్ల వలే కాకుండా అన్నా డీఎంకే ఓటర్లు దైవభక్తులు. వారి నాయ కురాలు జయలలిత మాదిరిగానే వారు కూడా ప్రేరణ కోసం ఆలయాలను దర్శిస్తారు. జయ నాయకత్వంలో ఆ పార్టీలోని ద్రవిడ వర్ణం పలచబడింది. అలాగే ఆ పార్టీ నాయకులకు మూఢ నమ్మకాలు ఉన్నాయని ప్రతీతి. మంచి ముహూర్తం చూసి మాత్రమే వారు కార్యక్రమాలు చేపడతారు. కానీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలంటే కమల్ హేతువాద దృక్పథం పెద్ద అడ్డంకి అవుతుంది. రజనీకాంత్ పరిస్థితి వేరు. ఆయన అన్నా డీఎంకే కార్య కర్తలు, నేతల మాదిరిగా దైవభక్తుడు. కాబట్టి ఆ పార్టీ ఓట్లలో ఆయన తన వాటాను తెచ్చుకోగలరు. కమల్కు పట్టం కడతారా? కమల్ హాసన్ రాష్ట్రానికి ఏమి ఇస్తానని చెబుతున్నారో సుస్పష్టం. అది పార దర్శకమైన, అవినీతి రహితమైన, కుల రహితమైన, మత రహితమైన ప్రత్యా మ్నాయం ఇస్తానని చెబుతున్నారు. తమిళ చలనచిత్ర రంగంలో ఎంతో నిజాయితీ కలిగిన నిర్మాతగా కమల్కు ఖ్యాతి ఉంది. అయితే తమిళ ఎన్నికల రంగం అంతా అవినీతిమయం. ఇప్పటిదాకా జరిగిన చాలా ఎన్నికలలో ఓట్లకు డబ్బు వెదజల్లిన ఘనత ఉంది. దీనికి భిన్నమైన వ్యవస్థను ఇస్తానని కమల్ చెబుతున్నారు. ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, తమిళ ఓట్లు డబ్బులు ఇవ్వని కమల్ పార్టీకి పడతాయా? లేకపోతే ఓటుకు నాలుగువేల రూపాయల వంతున పంచే సంప్రదాయక పార్టీలకే మళ్లీ తమిళులు ఓట్లు కుమ్మరిస్తారా? రజనీకాంత్ వలెనే కమల్హాసన్తో వచ్చిన సమస్య ఏమిటంటే, ఆయ నది కూడా ఏకపాత్రాభినయం. తన పార్టీ వామపక్షాలతో స్నేహపూర్వక షరతులతో కూడి ఉండే కేంద్రీకృత పార్టీ అని కమల్ చెబుతున్నారు. కానీ వామ పక్షాలు ఎన్నికల వ్యవహారంలో ఇప్పుడు అంత ప్రాధాన్యం ఉన్నవి కాదు. ఈ రెండు పార్టీలు దగ్గరవుతాయా? తన రాజకీయ పార్టీ రంగు నలుపు అని కమల్ చెబుతున్నారు. కానీ రజనీ పార్టీని చూడబోతే కాషాయ ఛాయలో ఉండేటట్టు కనిపిస్తున్నది. అది బీజేపీని సంకేతిస్తుంది. ఇప్పటికే రజనీకాంత్, విజయ్కాంత్, కరుణానిధి వంటి తమిళ నాయకులను కలుసుకుని ఆ ఒక్క విషయంలో తను ఎంతో భిన్నమైన వ్యక్తినని ఇప్పుటికే కమల్ నిరూపించుకున్నారు. ఇలాంటి రాజకీయ మర్యాదలు తమిళనాట కనిపించవు. కరుణానిధి, ఎంజీఆర్కు ఉన్న తీవ్ర వైషమ్యాలే ఇందుకు కారణం. అదే వైషమ్యం తరు వాత జయలలితతో కూడా కరుణానిధి కొనసాగించారు. తన రాజకీయోప న్యాసంలో కమల్ నాగరికతను ధ్వనింపచేయగలిగితే ఆయన తమిళుల హృదయాలను గెలుచుకోగలరు. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు టీఎస్ సుధీర్ -
రజనీకాంత్తో కమల్హాసన్ భేటీ
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీనటులు రజనీకాంత్, కమల్హాసన్ చెన్నైలో భేటీ అయ్యారు. పోయెస్ గార్డెన్లోని రజనీ నివాసానికి ఆదివారం మధ్యాహ్నం వెళ్లిన కమల్.. ఈ నెల 21న మదురైలో పార్టీ ప్రకటన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గంటసేపు భేటీ తర్వాత వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. తామిద్దరం మంచి మిత్రులమనీ, ఏ కార్యక్రమం చేపట్టినా పరస్పరం తెలియజేసుకుంటామని కమల్ చెప్పారు. రాజకీయ కార్యాచరణపై రజనీ తనను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించారు. సినిమాల తరహాలోనే రాజకీయాల్లో కూడా తామిద్దరి దారులు వేర్వేరని వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి చెన్నై గోపాలపురంలోని నివాసంలో కరుణానిధిని కలిసిన కమల్, ఆయన ఆశీస్సులు అందుకున్నారు. -
21న మదురైలో కమల్ పార్టీ ప్రకటన
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ తమిళనాడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. 21న రామేశ్వరం నుంచి మదురై జిల్లాలోని ఒత్తకడై వరకూ పర్యటించనున్న కమల్ అదే రోజు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నెల 21న ఉదయం దివంగత రాష్ట్రపతి కలాం నివాసం నుంచి కమల్ పర్యటన మొదలుకానుంది. ఉదయం కలాం పాఠశాలను సందర్శించాక జాలర్ల సంఘాల నేతలతో కమల్ మాట్లాడతారు. రామనాథపురం, పరమకుడి జంక్షన్, మానామదురైలలో జరిగే సభలలో ప్రసంగిస్తారు. -
చెయ్యేసే బాస్కు బడితపూజ
ఆడవాళ్లకు మాత్రమే సీటులో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఆఫీసుకు టైమ్కు వస్తుంది టైమ్కు వెళుతోంది అని అనిపిస్తుంది. కాని ఒకామె భర్తకు ఉద్యోగం పోయింది. ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగం పోయినందుకు చిన్నబుచ్చుకుంటూ ఇంట్లో ఉన్నందుకు భార్యకు సాయం చేస్తూ చిన్న పాప ఉంటే ఆ పాపను చూసుకుంటూ ఉన్నాడు. భర్త గురించి ఆమెకు టెన్షన్. కాని తయారయ్యి ఆఫీసులో సీటులో కూర్చుని ఉంటే ఆ టెన్షన్ కనిపిస్తుందా? ఇంకొక ఆమెకు మొగుడు తాగుబోతు. దేవుడి హుండీని కూడా లుంగీలో దాచుకెళ్లి చుక్కేసుకొని వచ్చి పెళ్లాంతో వాదులాటకు దిగుతుంటాడు. చిన్న గుడిసె. లేని బతుకు. జీవితం గడవాలంటే పని చేయాలి. తనొచ్చి ఆఫీసులో చీపురు పట్టి ఊడుస్తూ ఉంటే ఆమె టెన్షన్ కనిపిస్తుందా? ఇంకొక అమ్మాయికి పెళ్లి కాదు. వీళ్లు యాభై వరకు అనుకొని ఉంటారు. వచ్చినవాడు లక్ష అడుగుతుంటాడు. పైగా ఇరవై తులాల బంగారం పెట్టాలట. బండి ఇవ్వాలట. పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలట. ఆ అమ్మాయికి కోపం. అలాగైతే తాళి నేను కడతాను కట్టించుకోమనండి అంటుంది. అలాంటి అమ్మాయి తన సీటులో తాను కూర్చుని ఉంటే ఆ సమస్య కనిపిస్తుందా? ఆఫీసు టైము టెన్ టు ఫైవ్. ఆ టైములో వీరు ముగ్గురు ఆఫీసులో అవైలబుల్గా ఉంటారు. సీట్లలో కూర్చుని ఉంటారు. వీళ్లకు బాస్ తను. అనగా వీళ్లపై సర్వాధికారి తను. వీళ్ల ఒంటి మీద చెయ్యేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది... ‘ఆడవాళ్లకు మాత్రమే’ కథ అవుతుంది. ∙∙ గార్మెంట్స్ ఫ్యాక్టరీ అది. అందరూ మహిళా ఉద్యోగులే. ఒంటి మీద బట్టలు కుట్టే వీళ్ల వొంటి మీది పవిట పట్టుకుని లాగాలనుకునే మేనేజర్ నాజర్. కింది ఉద్యోగులు ఏం చేయగలరు? ఏమైనా చేయాలనుకుంటే ఉద్యోగం తీసేయడూ? అదీ అతడి ధైర్యం. నాజర్ది గొప్ప పురుష హృదయం. అతడికి పీఏ, కంప్యూటర్ డిజైనర్, స్వీపర్ అనే తేడా లేదు. అందరూ కావాలి. తను పిలిస్తే అందరూ వస్తారని అభిప్రాయం. ఊర్వశి– అతడి పీఏ. ఆమెను పిలిచి తన కుర్చీ పక్కన నిలబడేలా చేసి వెనుక నుంచి తడిమేసే ప్రయత్నం చేస్తుంటాడు. రోహిణి– ఆ ఆఫీసు స్వీపర్. లోపలికి పిలిచి ‘నువ్వు బాగా చిమ్మాలి’... ‘నువ్వు బాగా పని చేయాలి’... ‘నువ్వు...’ ఈ ‘నువ్వు’ అనేటప్పుడంతా అతడు తన చూపుడు వేలిని ఆమె ఎద మీద గుచ్చుతుంటాడు. ఆమె చీపురు అడ్డం పెట్టుకుంటూ ఉంటుంది. రేవతి– కంప్యూటర్ డిజైనర్. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి కాబట్టి లంచ్కు పిలుస్తుంటాడు. ‘ఏదో జోక్లో చదివాను. ఇలాగే ఒక మేనేజర్, అతడి అసిస్టెంట్ అమ్మాయి కలిసి భోం చేస్తుంటే ‘నంచుకోవడానికి ఏమైనా ఉందా’ అని మేనేజర్ అడుగుతాడు. ‘నంచుకోవడానికి ఏమీ లేదు కాని ఉంచుకోవడానికి నేనున్నాను’ అని ఆ అమ్మాయి అంటుంది’ అని పెద్దగా నవ్వుతాడు. మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు చూస్తాడు. దారిన పోయే వెధవ ఒక మాట అనేసి పోతాడు. బస్సులో రాసుకుని వెళ్లే వెధవ బస్సు ఆగగానే దిగి వెళ్లిపోతాడు. ఇది అలా కాదు. ఈ బాస్ రోజూ ఉంటాడు. రోజూ వేధిస్తుంటాడు. తందామంటే తన్నలేరు. మాట విందామంటే వినలేరు. నరకం. ∙∙ ఆఫీసులో ఏదో పొరపాటు జరుగుతుంది. ముగ్గురి మీద పోలీసు కంప్లయింట్ పెడతాను అని బెదిరిస్తాడు నాజర్. అలా వద్దనుకుంటే నాతో మూడు రోజులు గెస్ట్హౌస్లో గడపాలి అని కోరతాడు. ముందు నుయ్యి. వెనుక గొయ్యి. సరే అని ఒప్పుకుని గెస్ట్హౌస్కు వెళతారు ముగ్గురు. కాని ఏమయితే అదవుతుందని అతణ్ణి చావబాది కట్టేస్తారు. ఆ తర్వాత పెద్ద ఇంజనీరింగ్ చేసి అతణ్ణి దూలానికి వేళ్లాడ గట్టి బాత్రూమ్కు వెళ్లగలిగేలా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసి బంధిస్తారు. మమ్మల్ని హింసించినందుకు ఇది నీకు శిక్ష అని చెబుతారు. అంతే కాదు అతడి చేత సంతకం పెట్టించి ఆఫీసు ఇన్చార్జ్షిప్ తీసుకుంటారు. అప్పటి దాకా మగవాడి దృష్టికోణం నుంచి ఆఫీసు నడుస్తుంది. ఇప్పుడు స్త్రీల దృష్టి కోణంలో. ఆఫీసును మంచి ఈస్తటిక్ సెన్స్తో డెకరెట్ చేస్తారు. ఆడవాళ్లకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగిస్తారు. తల్లులైన ఉద్యోగుల కోసం ఆఫీసులోనే క్రష్ పెడతారు. ఆఫీసు ఎంతో బాగుపడుతుంది. కాని నాజర్ బుద్ధి మాత్రం మారదు. అతడు స్త్రీలను వేధించడానికే ప్రయత్నిస్తుంటాడు. చివరకు హెడ్డాఫీసు వారికి అతడి వ్యవహారం తెలుస్తుంది. అండమాన్ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. సినిమా ముగుస్తుంది. ∙∙ పని చేసే ఆడవాళ్లు పని చేయడానికి మాత్రమే వస్తారు. వ్యక్తిగత జీవితంలో వారికి ఉండే వొత్తిళ్లు వారికి ఉంటాయి. వారి సంపాదన కుటుంబానికి ముఖ్యం కావచ్చు. అలాగే చేసే పనిలో కూడా వొత్తిళ్లు, సవాళ్లు ఉంటాయి. ఇన్ని ఉండగా వాళ్లు స్త్రీలైన పాపానికి హరాస్మెంట్కు దిగితే ఎంత అవస్థగా ఉంటుంది. కక్కలేక మింగలేక వాళ్లు పడే అవస్థ అవసరమా? ‘నవమాసాలు మోసి కనేది తల్లి. కాని ఇంటి పేరు మాత్రం తండ్రిది’ అనే డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో. ‘పేరుకు లేడీస్ స్పెషల్ బస్సు. కాని నడిపేది మాత్రం మగవాడు. అందుకే ఆడవాళ్లను చూసినా ఆపడు’ అనే డైలాగ్ కూడా ఉంది. వేధింపులకు మూలమైన బేస్ వేల ఏళ్ల నుంచి మగాడు సిద్ధం చేసి ఉన్నాడు. కాని ఆడవాళ్లు తమకు తాముగా నిర్ణయాత్మక స్థానాల్లోకి వచ్చినప్పుడు ఈ పరిస్థితులను మార్చుకుంటారు అని ఈ సినిమా చెబుతుంది. మనసులో దురుద్దేశం పెట్టుకుని ‘సునందా... ఒకసారి కేబిన్లోకి రా’ అని పిలిచే బాసులారా.. జాగ్రత్త. మిమ్మల్ని తలకిందులు చేసే శక్తి వారికి ఉంది. బీ గుడ్. డూ గుడ్. మగళిర్ మట్టుమ్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమలహాసన్ నిర్మాతగా 1994లో విడుదలైన సినిమా ‘మగళిర్ మట్టుమ్’. తెలుగులో మురళీమోహన్ డబ్ చేయగా ‘ఆడవాళ్లకు మాత్రమే’గా విడుదలైంది. వర్కింగ్ విమెన్ ఎదుర్కొనే సెక్సువల్ హరాస్మెంట్ మీద పూర్తి కమర్షియల్ ఫార్మెట్లో వచ్చిన తొలి సినిమా ఇదే కావచ్చు. దీనికి మూలం హాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘9 టు 5’ (1980). 10 మిలియన్లతో తీసిన ఆ సినిమా ఆ రోజుల్లోనే వంద మిలియన్లు సంపాదించింది. బహుశా అమెరికాలో ఆ సమయంలో పని చేసే ఆడవాళ్లు ఎక్కువ కావడం వర్క్ప్లేస్ హరాస్మెంట్ ఎక్కువ ఉండటం కారణం కావచ్చు. తమిళంలో మంచి విజయమే సాధించిన ఆడవాళ్లకు మాత్రమే తెలుగులో పూర్తిగా సఫలం కాలేదు. దానికి కారణం అప్పటికి నాజర్ ఇంకా పూర్తిగా తెలుగువారికి తెలియకపోవడమే. అయినా ఈ సినిమా సున్నితమైన హాస్యంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రేవతి, రోహిణి, ఊర్వశి గొప్ప నటనతో ఆకట్టుకుంటారు. డీగ్లామరస్గా కనిపించే రోహిణి అచ్చు ఒక పనిమనిషిలానే ఉంటుంది. ఇందులో ‘శవం’ పాత్ర నగేశ్ పోషించాడు. క్లయిమాక్స్లో కమలహాసన్ కాసేపు కనపడతాడు. హిందీలో ఈ సినిమాను రణధీర్ కపూర్తో తీశారు. కాని ఏ కారణం చేతనో సినిమా విడుదల కాలేదు. అయితే ‘మగళిర్ మట్టుమ్’ కంటే ఏడాది ముందు ‘9 టు 5’ స్ఫూర్తితోనే జంధ్యాల ‘లేడీస్ స్పెషల్’ తీశారు. కాని ఫ్లాప్ అయ్యింది. సింగీతం శ్రీనివాసరావు – కె -
రజనీ కాషాయమైతే పొత్తు నో
కేంబ్రిడ్జ్ (మసాచుసెట్స్): సూపర్స్టార్ రజనీకాంత్ కాషాయ(బీజేపీ) రాజకీయాలు చేస్తే ఆయనతో ఎటువంటి రాజకీయ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రముఖ నటుడు కమల్హాసన్ ప్రకటించారు. తాము రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల రజనీకాంత్, కమల్హాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన యాన్యువల్ ఇండియన్ కాన్ఫరెన్స్లో కమల్హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. తమ ఆలోచనలు, మేనిఫెస్టోలో ఏకాభిప్రాయం ఉంటే రజనీకాంత్తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే తమ మధ్య ప్రస్తుతం ఉన్న వ్యత్యాసం మతం.. కాషాయం మాత్రమే అని చెప్పారు. అవసరమైతే ఎవరితోనైనా చేయి కలిపేందుకు సిద్ధమని చెప్పారు. ఎన్నికల ముందు ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అనే ప్రశ్నకు లేదని సమాధానం చెప్పారు. ఎవరికీ మెజారిటీ రాకుండా ప్రజలు తీర్పు ఇస్తే.. తాను ప్రతిపక్షంలోనే కూర్చుంటానని, తర్వాత ఎన్నికల కోసం సిద్ధమవుతానని స్పష్టం చేశారు. తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు కమల్ వెల్లడించారు. కాగా, ఈ నెల 21న కమల్ హాసన్ ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. -
రజనీతో పొత్తును కాలమే నిర్ణయిస్తుంది
సాక్షి ప్రతినిధి, చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ పెట్టబోయే పార్టీతో పొత్తు అంశాన్ని కాలమే నిర్ణయిస్తుందని నటుడు కమల్ హాసన్ తెలిపారు. ఒకవేళ ఎన్నికల్లో కలసి పోటీచేయాలంటే తాను, రజనీ బాగా ఆలోచించాల్సి ఉంటుందన్నారు. తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్’కు రాసిన వ్యాసంలో కమల్ తన అభిప్రాయాన్ని తెలిపారు. రజనీతో పొత్తు సినిమాకు నటీనటుల్ని ఎంపిక చేసుకున్నంత సులభం కాదనీ, ఇవి రెండూ పూర్తి భిన్నమైన అంశాలన్నారు. పొత్తు కోసం ఇరు పార్టీల సిద్ధాంతాల్లో కూడా సారూప్యత కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు కమల్తో పొత్తుపై రజనీ స్పందిస్తూ.. ‘నేను మీకు ఇప్పటికే చెప్పా. కాలమే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పగలదు’ అని వ్యాఖ్యానించారు. -
రజనీ, కమల్ కలిసి పనిచేయాలి : లారెన్స్
పెరంబూరు: నటులు రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లో కలిసి పని చేస్తే బాగుంటుందని నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ అన్నారు. ఇటీవల జల్లికట్టు క్రీడలో ప్రాణాలు కోల్పోయిన సేలానికి చెందిన యోగేశ్వరన్ కుటుంబానికి ఈయన ఇల్లు నిర్మించి ఇచ్చారు. బుధవారం ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సేలం వెళ్లిన లారెన్స్ మీడియాతో మాట్లాడారు. యేగేశ్వరన్ జల్లికట్టు పోటీల్లో ప్రాణాలు కోల్పోయాడన్న విషయం తెలిసి తాను అతని అంత్యక్రియలకు హాజరయ్యానన్నారు. ఆ సమయంలో యోగేశ్వరన్ తల్లిదండ్రుల కంటతడి తనను కదిలించదన్నారు. వారి పెద్ద కొడుకులా యోగేశ్వరన్ బాధ్యతలను నెరవేర్చుతానని వారికి మాట ఇచ్చానని చెప్పారు. ఆ ప్రకారం వారికి ఇల్లు నిర్మించి ఇచ్చినట్టు తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావాలన్న కాంక్షతోనే ఇలాంటివి చేస్తున్నానని కొందరు అంటున్నారన్నారు. అయితే గత పదేళ్ల నుంచి తాను వివిధ రకాలుగా సేవలందిస్తున్నానన్నారు. వృద్ధ, అనాథ ఆశ్రమాలను నిర్వహణ, 142 మందికి గుండె శస్త్ర చికిత్సలకు సాయం చేశానని గుర్తు చేశారు. రాజకీయం అంటే సేవ అని మా అమ్మకు అర్థం అయ్యాకే తాను రాజకీయాల్లోకి వస్తానని లారెన్స్ వెల్లడించారు. నటుడు రజనీకాంత్ తన గురువన్నారు. రజనీకాంత్, కమలహాసన్ ప్రజలకు సేవ చేయాలన్న భావంతోనే రాజకీయరంగప్రవేశం చేశారన్నారు. -
భారతీయుడి బెలూన్ ఎగిరింది
లంచం కోసం పీడించేవాడు సొంత కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే అనే కాన్పెప్ట్తో ఆల్మోస్ట్ 22ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను ప్లాన్ చేశారు దర్శకుడు శంకర్. ఫస్ట్ పార్ట్లో హీరోగా నటించిన కమల్హాసన్నే ఈ సీక్వెల్లోనూ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా గురించిన అప్డేట్ను రిపబ్లిక్ డే సందర్భంగా దర్శకుడు శంకర్ తెలియజేశారు. ‘ఇండియన్ 2’ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు ‘హీలియమ్ బెలూన్’ను ఆయన తైవాన్లో ఎగురవేశారు. ఆ బెలూన్పై ‘ఇందియన్ 2’ అని తమిళంలో ‘ఇండియన్ 2’ అని ఇంగ్లిష్లో రాసి ఉంది. ఇలా రెండో భారతీయుడు తైవాన్లో స్టార్ట్ అయ్యాడన్నమాట. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘2.0’కి ఓ రచయితగా వ్యవహరించిన జయమోహన్ ‘భారతీయుడు 2’కి కూడా రైటర్గా చేయనున్నారట. వచ్చే నెల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. -
దక్షిణాది రాష్ట్రాల్లోని లౌకికవాద పార్టీలతో కూటమి!
సాక్షి, చెన్నై: పార్టీ ఏర్పాటుకు ముందే విశ్వనాయకుడు కమల్హాసన్ కూటమి ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ప్రధానంగా బిజేపికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల్లోని లౌకికవాద పార్టీలను ఏకం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వస్థలం రామేశ్వరం నుంచి రాష్ట్ర పర్యటనకు కమల్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార పత్రికలో ఆర్టికల్ రాస్తూ వస్తున్న కమల్ తాజాగా శుక్రవారం వెలువడ్డ సంచికలో బిజేపికి వ్యతిరేకంగా కొత్త ప్రయత్నం గురించి స్పందించారు. అందులో ద్రావిడం అన్నది ఒక్కత మిళనాడుకే పరిమితం కాదని, ఇది దేశవ్యాప్తంగా ముడిపడి ఉన్న పదం అని వివరించారు. దక్షిణ భారతం అంతా ఒకే ద్రావిడం అన్న పదానికి కట్టుబడక తప్పదన్నారు. చంద్రబాబు నాయుడు, పినరయ్ విజయన్, చంద్రశేఖర రావు, సిద్దరామయ్యలూ ద్రవిడులేనని వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ అందరితోఆశల్ని పంచుకోవాల్సి ఉందని, ఇది భవిష్యత్తులో సత్పలితాన్ని ఇవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం నుంచి తన పయనం మొదలు కానున్నదని, ఆ రోజు నుంచి ప్రజలతో అన్ని విషయాలను పంచుకుంటానని, అందరిలోకి తీసుకెళ్తాననని ఆయన పేర్కొన్నారు. అందరం ఒకే వేదిక మీద, ఒకే వైపు ఉంటే ఫలితం ఉంటుందన్నారు. పరోక్షంగా కేంద్రం వద్ద తలలు దించుకోవాల్సిన అవసరం లేదని, అన్నీ దరి చేరే రీతిలో ఐక్యతతో దక్షిణ భారతంలోని లౌకికవాదులందరూ ముందడుగు వేయడానికి సిద్ధం కావాలని ఆ కాలంలో పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
చిన్నింటి నుంచి పతిని ఇంటికి తెచ్చుకున్న సతీ లీలావతి
హలో వరకూ అయితే ఓకే. కలిసి భోం చేద్దామా అన్నప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. ఈ సండే ఖాళీయేనా అని ఎంక్వయిరీ చేస్తే ప్రాబ్లమ్ ఇంకా పెద్దదైనట్టే. అర్ధరాత్రి ఒక ఫోన్. ఎవరూ లేనప్పుడు ఇంటికి రాకడ. అంటే ఏమని? నిండా మునిగామని. తప్పు చేయకుండా మనిషి ఉండడు.ఆకర్షణలో పడకుండా కూడా ఉండడు. అటువంటి సమయంలోనే మనం ఏంటి, ఎక్కడున్నాం, ఇది చేస్తే ఎంత సమస్య అనే ఇంగితాన్ని పాటించి సంయమనం వహించాలి. లేకుంటే, ఏమవుతుందిలే అని అనుకుంటే సమస్య పీకకు చుట్టుకుంటుంది. ఒక్కోసారి పీక తెగి పడవచ్చును కూడా. ఈ సినిమాలో హీరా ఒక అందమైన యువతి. దుష్టురాలు కాదు. దుర్మార్గురాలు కాదు. తను చాలా దయనీయమైన బాల్యాన్ని చూసింది కనుక కాస్త డబ్బున్నవాణ్ణి చూసి పెళ్లాడాలనుకుంటుంది. డబ్బున్నవాణ్ణి అని అనుకుంది తప్ప అతడు ఇది వరకే పెళ్లయినవాడా కాదా అన్నది చూసుకోలేదు. ఫలితంగా పెళ్లయిన రమేశ్ అరవింద్ ఆమెకు పరిచయం అవుతాడు. ఆమెను దగ్గరకు తీస్తాడు. ఆమెకు దాదాపు భార్య స్థానం ఇస్తాడు. దాదాపు అని ఎందుకు అనంటే ఈ సమాజంలో అంతకుమించి ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి. పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు ఉండి వారికి అన్యాయం చేసి ఇంకొకరితో తిరుగుతానంటే లోకం ఊరుకోదు. వాతలు పెడుతుంది. ఇతను హీరాకు ఫ్లాట్ ఇచ్చిందీ, అక్కడకు రోజూ రాకపోకలు సాగిస్తున్నదీ, ఇంట్లో అబద్ధాలు చెప్పి తిరుగుతున్నదీ అన్నీ భార్య కల్పన దృష్టికి వస్తాయి. మొదట తిడుతుంది. ఆ తర్వాత కొడుతుంది. ఆ తర్వాత నేను కావాలా ఆమె కావాలా తేల్చుకో అని నిలదీస్తుంది. అతడేం చెప్తాడు? ఒకవైపు ఇద్దరు పిల్లలను కని, షేప్ అవుట్ అయ్యి, పూజలు పునస్కారాలు అంటూ తిరిగే పాతముఖం భార్య. మరో వైపు బాబ్ కట్తో, అందమైన డ్రస్సులతో, సన్నగా నాజుకుగా ఉన్న ప్రియురాలు. మనవాడు ఇటే మొగ్గుతాడు.ప్రియురాలే పానకం అనుకొని వెళ్లిపోతాడు.ఇప్పుడు ఏమిటి చేయడం?మునిగిన వాడికి చలివేయదు.కాని ఒడ్డున ఉన్నవారికి ఒకటే ఒణుకు. జైలు నుంచి పారిపోయిన దొంగ ఈజీగా పోలీసులకు చిక్కుతాడు. ఎందుకంటే అతడు సరాసరి ఇంటికి వస్తాడు కనుక వాళ్లు అక్కడే కాచుకుని ఉండి చేజిక్కించుకుంటారు. ఇంకో ఆడదాని మోజులో పడి వెళ్లిన మగవాడికి కూడా ఇల్లు పీకుతూ ఉంటుంది. పిల్లలు మనసులోకి వస్తుంటారు. ఆ పాత జీవితం తాలూకు గిల్ట్ ఏదో లాగుతూ ఉంటుంది. అందుకే కల్పన అతడి మీద పిల్లలను ఎక్కుపెడుతుంది. ఏ ఫ్లాట్లో అయితే రమేశ్ అరవింద్ హీరాతో ఉంటున్నాడో ఆ ఫ్లాట్కు పిల్లలను పంపించేస్తుంది. ఆ తర్వాత మామగారిని పంపించేస్తుంది. వాళ్లు అక్కడ తిష్ట వేస్తారు. ఈ పాత బంధాల పాశం కొత్తబంధపు మోజు వీటి మధ్య భర్త నలుగుతాడు. హీరా కూడా ఏమిటి ఈ తలనొప్పి అనుకుంటుంది. మరోవైపు రమేశ్ స్నేహితుడైన కమలహాసన్ పదే పదే ఈ బంధాన్ని డిస్కరేజ్ చేస్తుంటాడు. అప్పటికి రమేశ్ అరవింద్కు హీరా మీద మోహం, హీరాకు రమేశ్ అరవింద్తో అవసరం తీరిపోయాయి. అక్కడి నుంచి ముందుకు పోయేంత గాఢత, నిజాయితీ వారి బంధంలో లేదు. ఎప్పుడో వాళ్ల మనసుల్లో పగుళ్లు ఏర్పడిపోయాయి. ఈ సందర్భాన్ని కల్పన అదునుగా తీసుకుంటుంది. హీరాను అదివరకే ప్రేమించి ఉన్న దగ్గుపాటి రాజాతో ఆమెను కలుపుతుంది. వాళ్లు ఒకరికొకరు సన్నిహితంగా ఉండటం చూసి రమేశ్ అరవింద్ మనసు విరిగిపోతుంది. ఆమె తనకు ద్రోహం చేసినట్టు భావిస్తాడు. కాని తను మాత్రం తన భార్యకు చేసింది ద్రోహం కాదా?మధ్యలో వచ్చిన గాలివాన పూర్తిగా వెలిసిపోతుంది. రమేశ్ అరవింద్ లెంపలు వేసుకుని భార్య దగ్గరకు చేరుకుంటాడు. హీరా తన ప్రియుడితో కొత్త జీవితం వెతుక్కుంటూ వెళ్లిపోతుంది. పెళ్లి ఒక సిస్టమ్ కావడం వల్ల మాత్రమే మన దేశంలో గొప్పగా నిలబడలేదు. పెళ్లి వల్ల ఏకమైన స్త్రీ, పురుషులు కూడా ఆ సిస్టమ్ పట్ల తమ గౌరవాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఎన్ని చికాకులు, ఆకర్షణలు, పక్కచూపులు, పెను అపార్థాలు వచ్చినా పెళ్లిని కాపాడుకుంటూ ఉన్నారు. సతీ లీలావతులు నేరుగా కనపడతారు. పతి దేవుళ్లు నిశ్శబ్దంగా ప్రాధేయపడి ఇంటిని నిలబెట్టుకుంటారు.సతీ పతి మధ్య ఏ కష్టమైనా రావచ్చు. కాని ‘మూడో వ్యక్తి’ మాత్రం రారాదు.అలా వచ్చిన మరుక్షణం ‘పరస్పర విశ్వాసం’ అనే మస్కిటోమేట్ని వెలిగించి ఆ దోమను తరిమికొట్టాలి.లేకుంటే ‘నమ్మకం’ అనే బ్యాట్ ఆడించాలి. అదిగో ఆకర్షణ. టప్. 1995లో కమలహాసన్ తన స్వీయ నిర్మాణంలో బాలూ మహేంద్ర దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘సతీ లీలావతి’. తమిళంలో పెద్ద హిట్టయ్యి అదే పేరుతో తెలుగులో డబ్ అయితే ఇక్కడా పెద్ద హిట్ అయ్యింది. దీనికి మూలం భాగ్యరాజా ‘చిన్నిల్లు’ అని చెప్పుకోవచ్చు. ఇదే సినిమాను హిందీలో సల్మాన్ఖాన్తో ‘బీవీ నంబర్ 1’గా తీస్తే అక్కడా హిట్ అయ్యింది. ఈ మధ్య దీనినే ఇవివి ‘కితకితలు’గా తీశారు. భర్త ప్రాణాల కోసం పోరాడిన పతివ్రతలు మనకు తెలుసు. కాని భర్తను భర్తగా దక్కించుకోవడానికి భార్య చేసే పోరాటమే ఈ సినిమా. దీనిని లైటర్ వెయిన్లో చెప్పడం వల్ల ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కమల్హాసన్ డాక్టర్గా శ్రీకాకుళం భాష మాట్లాడే స్నేహితుడిగా కనిపిస్తాడు. ఇతడి భార్యగా కోవై సరళ ఆశ్చర్యపరుస్తుంది. కమలహాసన్కు బాలూ డబ్బింగ్ చెప్పడం ఆనవాయితే అయినా నాగూర్ బాబూ అంతే బాగా చెప్పడం విశేషం. ఎయిర్పోర్ట్లో కమలహాసన్ రమేశ్ అరవింద్ను ఇబ్బంది పెట్టడం, హోటల్లో రమేశ్ అరవింద్ హీరాతో ఉండగా అతడి నడుము పట్టేయడం, క్లయిమాక్స్లో కోవై సరళ కమలహాసన్ను అపార్థం చేసుకోవడం ఇవన్నీ బాగా నవ్వు తెప్పిస్తాయి. నటి ఊర్వశి సోదరి అయిన కల్పన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె ‘ఊపిరి’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే మృతి చెందడం ప్రేక్షకులకు గుర్తు. – కె. బాలూ మహేంద్ర, కల్పన -
రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా
సాక్షి, చెన్నై: తమిళనాట ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం ఖరారైంది.తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్దామని అభిమానులకు కమల్ పిలుపునిచ్చారు. వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపుల కోసం తన 63 వ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న ప్రత్యేక మొబైల్ యాప్ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం చెన్నై శివారులోని కేలంబాక్కంలో దాదాపు పదిహేను వందల మంది అభిమానులతో కమల్ హాసన్ సమావేశమయ్యారు. అభిమానుల సంక్షేమ సంఘం 39 వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ భేటీలో అవినీతి నిర్మూలన, నదీ జలాల పరిరక్షణ, తమిళనాడు ప్రగతిపై కమల్ మాట్లాడారు. అనంతరం అభిమానులతో విడిగా కొద్దిసేపు మంతనాలు జరిపారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా. పార్టీ ఏర్పాటుచేసి ప్రజల్లోకి వెళ్దాం. పార్టీ పెట్టాలంటే కోట్లు అవసరమంటున్నారు. విరాళాలు ఇచ్చేందుకు, సేకరించేందుకు సిద్ధమా!’ అని వారిని ప్రశ్నించారు. విరాళాల కోసం తమిళనాడు ప్రజల ముందు చేతులు చాపేందుకు సిగ్గుపడనని ఆయన చెప్పారు. ‘పార్టీ ఏర్పాటు చేయడం ఒక్క రోజు పని. కానీ అంతకుముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ దిశగా ముందుకు సాగుదాం’ అని అభిమానులకు సూచించారు. అణిచివేత రాజకీయాల్లో ఒక భాగమని, ఎంత మంది నిన్ను బెదిరిస్తున్నారు అన్నది ముఖ్యం కాదని, నువ్వు ఏం చేయబోతున్నావు అన్నదే ముఖ్యమని కమల్ పేర్కొన్నారు. దెబ్బలు తినేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే అదే సమయంలో పదే పదే దెబ్బలు తినేందుకు తాను మృదంగం కానని చెప్పారు. చెన్నై వరదలను ప్రస్తావిస్తూ.. ‘ప్రకృతి విపత్తులకు ధనిక, పేద భేదం ఉండదు. మనం ప్రేమించిన వ్యక్తుల్ని కోల్పోయాక మేల్కొనడం కంటే ముందస్తుగా విపత్తు నివారణ చర్యలు తీసుకోవాలి’ అని కమల్హాసన్ సూచించారు. « -
నవంబర్లో ఇల్లే.. ఇల్లే!
తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్గా ఉన్నాయి. ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవాళ్లు, రావాలనుకున్నవాళ్లు ఎవరి శైలిలో వాళ్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సినిమా రంగం నుంచి రజనీకాంత్, కమల్హాసన్ ఈసారి పాలిటిక్స్లోకి ఎంటర్ కావడం ఖాయం అన్నట్లుగా అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో కమల్ చేసిన కొని కామెంట్స్ని బట్టి ఆయన పాలిటిక్స్లోకి వచ్చేస్తారనే ఫీలింగ్ చాలామందిలో బలపడింది. త్వరలో పొలిటికల్ పార్టీ పెట్టడానికి మంచి టైమ్ చూస్తున్నారని తమిళనాట ఓ మాట వినిపిస్తోంది. ఆ పార్టీ స్థాపించే ముహూర్తం ఇంకెప్పుడో కాదని, కమల్ పుట్టినరోజు నవంబర్ 7నే అన్న వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాల్లో సపోర్టింగ్గా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. దీని గురించి కమల్ స్పందించారు. పొలిటికల్ పార్టీ పెట్టడం లేదని తెలిపారు. ‘‘నా బర్త్డేకి ప్రతి ఏడాది అభిమానులను కలవడం అనేది కామన్. ఈసారి కూడా అలానే కలవాలనుకుంటున్నాను. పార్టీ అనౌన్స్మెంట్ కోసం పెట్టబోతున్న మీటింగ్ కాదిది. ఒకవేళ పార్టీ అనౌన్స్ చేయాలనుకుంటే, ప్రజల సాక్షిగానే చేస్తాను’’ అని కమల్ స్పష్టం చేశారు. సో.. నవంబర్లో ఇల్లే ఇల్లే అన్నమాట.. అదేనండీ అనౌన్స్మెంట్ లేదన్న మాట! -
దిల్ రాజు తప్పుకున్నారా?
సాక్షి, సినిమా : ఇండియన్ -2 చిత్ర నిర్మాత మారారా? కోలీవుడ్లో తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. 1996లో తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ఇండియన్. విశ్వనటుడు కమలహాసన్ తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఇందులో నటి మనీషా కోయిరాలా, ఊర్మిళ కథానాయికలుగానూ, సుకన్య, కస్తూరి తదితరులు ముఖ్య పాత్రల్లోనూ నటించిన ఈ చిత్రం స్టార్ డైరెక్టర్ శంకర్ అద్భుత సృష్టి. అవినీతిపై కమల్, శంకర్లు పూరించిన అస్త్రం. కాగా, ఆ చిత్రానికి సీక్వెల్ పై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల కమలహాసన్, శంకర్ సమిష్టిగా ఇండియన్ -2 చిత్రం త్వరలో ప్రారంభం అవుతుందని ఒక టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. ఆ సమయంలో ప్రముఖ తెలుగు నిర్మాత దిల్రాజు కూడా వారితో ఉన్నారు. ఇండియన్-2 చిత్రాన్ని ఈయనే తమిళం, తెలుగు భాషల్లో నిర్మించనున్నారని ప్రకటించారు. చిత్రం జనవరిలో సెట్పైకి వెళ్లనుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో తాజాగా ఈ చిత్ర నిర్మాత మారనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్ర నిర్మాణం నుంచి దిల్ రాజు తప్పుకున్నారని, లైకా సంస్థ ఇండియన్-2 చిత్ర నిర్మాణానికి సిద్ధం అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. లైకా సంస్థ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని బ్రహ్మాండంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతుండగా, వెంటనే ఇండియన్-2 చిత్రం ప్రారంభం అవుతుందనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
20 దేశాలు... 200 కోట్లు!
భారతీయుడు భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడిప్పుడు! ఏమాత్రం తగ్గడం లేదు. ఖర్చులో... ఖర్చుకి రెండింతలు రాబట్టే విషయంలోనూ... ఆల్రెడీ స్కెచ్ రెడీ చేసేశాడు. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కల్ట్ క్లాసిక్ ‘భారతీయుడు’కి సీక్వెల్గా ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ‘ఇండియన్–2’ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిన్మాను 200 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోషల్ ఇష్యూస్పై పొలిటికల్ ఎంట్రీకి ముందు కమల్ నటించే సిన్మా కావడం... సోషల్ ఇష్యూస్తో సిన్మాలు తీయడంతో స్పెషలిస్ట్ అయిన శంకర్, ‘2.0’ తర్వాత తీయబోయే సిన్మా కావడంతో ఆల్రెడీ ‘ఇండియన్–2’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పట్నుంచి సినిమా గురించి డిస్కషన్ జరుగుతోంది. అందుకు తగ్గట్టే సినిమాను భారీ లెవల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్న ‘ఇండియన్–2’ను పలు భాషల్లో అనువదించి, దాదాపు 20 దేశాల్లో విడుదల చేయాలనుకుంటున్నారట!! -
నవంబర్ 7న కమల్ హాసన్ పార్టీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన 63వ పుట్టినరోజు అయిన నవంబర్ 7న కొత్త పార్టీని ప్రకటించొచ్చని తమిళనాడు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటికి బలం చేకూరుస్తూ ఆయన బుధవారం తన అభిమానులతో సమావేశమయ్యారు. కమల్ పుట్టిన రోజు వేడుకల నిర్వహణ, తాము చేపట్టబోయే సేవా కార్యక్రమాలపైనే చర్చలు జరిగినట్లు కమల్ హాసన్ సంక్షేమ క్లబ్ సీనియర్ సభ్యుడు తంగవేలు చెప్పారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కమల్ సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలిసింది. పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని, తొందరపాటుతో ప్రభుత్వం, పార్టీ నేతలపై అసభ్యకర రీతిలో విమర్శలు చేయరాదని అభిమాన సంఘాల నేతలకు కమల్ సూచించారు. -
‘రాజకీయాల్లో గెలుస్తా’
సాక్షి ప్రతినిధి, చెన్నై : రాజకీయాల్లో గెలిచి తీరుతానని ప్రముఖ నటుడు కమల్హాసన్ ధీమా వ్యక్తం చేశారు. ‘మొదట బహిష్కరిస్తారు.. ఆ తర్వాత హేళనగా నవ్వుతారు. వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు. చివరికి గెలుపు నీదే..’ అనే గాంధీ సూక్తి తనకు స్ఫూర్తి అని కమల్హాసన్ సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
యాక్టింగ్కి ఎండ్ కార్డా!?
తప్పదు... రాజకీయాల్లోకి చట్టబద్ధంగా ప్రవేశించాలనుకుంటే ‘యాక్టింగ్కి ఎండ్ కార్డ్’ వేయక తప్పదు! అంటున్నారు కమల్హాసన్. ఇటీవలే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమల్, వచ్చినప్పుడు ఓన్లీ పాలిటిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తానంటున్నారు. ‘‘బాధగానే ఉంటుంది (యాక్టింగ్కి ఎండ్ కార్డ్ వేయడం). బట్, సిన్మాకో నహి చోడేంగే’’ అన్నారాయన. అదేంటి? అంటే... సిన్మాల్లో యాక్టివ్గా ఉండకపోవచ్చు. కానీ, ఏదో రకంగా సిన్మా ఫీల్డ్కి కనెక్ట్ అయ్యే ఉంటానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కమిట్మెంట్స్ వేరే విధంగా ఉంటాయని కమల్ అన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లోపు కమల్హాసన్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కమల్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి
తమిళ సినిమా: కమలహాసన్ రాజకీయరంగప్రవేశంపై తీసుకున్న నిర్ణయానికి చివరి వరకూ కట్టుబడి ఉండాలని సీనియర్ హాస్యనటుడు వివేక్ అన్నారు. తమిళనాడులో మరో వంద రోజుల్లో ఎన్నికలు జరిగినా పోటీ చేయడానికి నేను రెడీ అంటూ నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. ఇప్పటివరకూ పరోక్షంగా తన రాజకీయ రంగప్రవేశం గురించి చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా తన నిర్ణయాన్ని వెల్లడించడాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హాస్యనటుడు వివేక్ శనివారం తన ట్విట్టర్ పేజీలో రాజకీయరంగ ప్రవేశ నిర్ణయాన్ని తీసుకున్న కమలహాసన్ను అభినందిస్తున్నానన్నారు. ఆయన చివరి వరకూ ఆ నిర్ణయానికి కట్టుబడాలని నిజాయితీపరుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. వచ్చేది ఎవరైనా, ఆహ్వానించడం సంప్రదాయం అయినా, ఆదరించేది ప్రజలేనని వివేక్ పేర్కొన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే మరో నటుడు ఎస్వీ.శేఖర్ అన్నాడీఎంకే నేతలపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మైలాడుదురైలోని కావేరి పుష్కర స్నానం చేసి ఆడి కంచి శంకరస్వామిజీలను దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఎస్వీ.శేఖర్ విలేకరులతో మాట్లాడుతూ కావేరి మహాపుష్కర స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం అన్నారు. అందుకే ఇక్కడ నిత్యం 50 వేల మంది పుణ్యస్నానాలు చేస్తున్నారన్నారు. అయితే కావేరి నీరు రాకపోవడంతో కలుషిత నీటిలోనే పుణ్య స్నానాలాచరిస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఇక్కడ కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అన్నాడీఎంకే నేతలు తమ ప్రభుత్వాన్ని ,పార్టీ గుర్తును కాపాడుకోవడం పైనే దృష్టి సారిస్తున్నారని, ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. రజనీ,కమల్ ఎవరైనా.. రజనీకాంత్, కమలహాసన్, విజయ్ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వారు ప్రజలకు ఏం చేస్తారో స్పష్టం చేయాలన్నారు. -
వంద రోజుల్లో ఎన్నికలొస్తే.. వస్తా!
సాక్షి, చెన్నై: తమిళనాట వంద రోజుల్లో ఎన్నికలొస్తే రాజకీయాల్లోకి వస్తా.. వాటిని ఒంటరిగానే ఎదుర్కొనేందుకు సిద్ధం.. అంటూ సినీహీరో కమల్హాసన్ చెప్పారు. కమల్ తాజా వ్యాఖ్యలతో ఆయన రాజకీయ ప్రవేశంపై చర్చమొదలైంది. శుక్రవారం ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఓ బలవంతపు పెళ్లితో పోల్చారు. అన్నాడీఎంకే పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నట్టు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వంద రోజుల్లోపు ఎన్నికలొస్తే.. రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమని, ఒంటరిగానే ఆ ఎన్నికలను ఎదుర్కొంటానని ధీమా వ్యక్తంచేశారు. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారు.. పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు.. తదితర ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. రజనీకాంత్తో తరచూ రాజకీయాలపై మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. ‘ఆయన మార్గం వేరు.. నా మార్గం వేరు’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కమల్ వ్యాఖ్యలు డొంక తిరుగుడుగా ఉండటంతో రాజకీయాల్లోకి వస్తారా.. లేదా అనే దానిపై చర్చ మొదలైంది. ‘స్వచ్ఛతే సేవ’కు రజనీకాంత్ మద్దతు ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛతే సేవ’ మిషన్కు సూపర్స్టార్ రజనీకాంత్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా చేపడుతున్న ఈ మిషన్ ‘పరిశుభ్రతే పరమాత్మ’ అని చాటుతోందని రజనీ ట్వీటర్లో పేర్కొన్నారు. -
శంకర్ తదుపరి హీరో ఎవరు?
తమిళసినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ తదుపరి చిత్రం ఏమిటీ? ఏ హీరోతో చేయబోతున్నారన్నది దక్షిణ సినీ పరిశ్రమలో ఆసక్తిగా మారింది. శంకర్ చిత్రాల్లో సామాజిక అంశాలు ఉంటాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ఇలా ప్రేక్షకులను విస్మయపరిచే, ఆలోచింపజేసే, ఆహ్లాదపరచే అంశాలు ఉంటాయి కాబట్టే చేసింది తక్కువ చిత్రాలే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసే చిత్రాల దర్శకుడిగా ఎదిగారు. తాజాగా సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని నభూతో నభవిష్యత్ అనే స్థాయిలో సిల్వర్ సెల్యులాయిడ్పై ఆవిష్కరిస్తున్నారు. ఎమీజాక్సన్ కథానాయకిగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ ప్రతినాయకుడిగానూ నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుని (ఒక్క పాట మినహా) నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. జనవరిలో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో శంకర్ తదుపరి చిత్రం ఏమిటన్న అంశంపై చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి. అజిత్తో ముదల్వన్–2: శంకర్ విశ్యనటుడు కమలహాసన్, సూపర్స్టార్ రజనీకాంత్, విజయ్, విక్రమ్, అర్జున్, ప్రశాంత్, ఇలా చాలా మంది ప్రముఖ నటులతో చిత్రాలు చేశారు. అయితే అజిత్ హీరోగా ఇప్పటికీ చిత్రం చేయలేదు. వీరి కాంబినేషన్లో చిత్రం ఉంటుందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అది వాస్తవరూపం దాల్చలేదు. కాగా తాజాగా అజిత్ నటించిన వివేగం ఈ మధ్యనే విడుదలైంది. ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. దీంతో శంకర్, అజిత్ కలయికలో భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం తాజాగా జోరందుకుంది. శంకర్ దర్శకత్వంలో ముదల్వన్–2 చిత్రం రూపొందే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కమలహాసన్ హీరోగా ఇండియన్–2 శంకర్ తదుపరి కమలహాసన్ హీరోగా ఇండియన్–2 చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారన్నది. నిజానికి ఈ విషయమై శంకర్ కమలహాసన్ను కలిసి మాట్లాడారట. ఆయనతో చిత్రం ఖరారు చేసుకుందాం అనుకుంటున్న సమయంలో కమల్ తాజాగా రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించడానికి రెడీ అవుతుండటంతో శంకర్ తన ఇండియన్–2 చిత్ర ప్రయతాలకు బ్రేక్ వేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. విక్రమ్తో అన్నియన్–2 ఇక మరో వెర్షన్ ఏమిటంటే విక్రమ్ హీరోగా అన్నియన్–2 చిత్రానికి శంకర్ సిద్ధం అవుతున్నారన్నది. అన్నియన్ చిత్రానికి సీక్వెల్ చిత్రం వస్తుందనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. కాగా విక్రమ్ ప్రస్తుతం స్కెచ్, ధ్రువనక్షత్రం చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా సామి–2కు రెడీ అవుతున్నారు. తదుపరి శంకర్ దర్శకత్వంలో అన్నియన్–2 చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిజానికి ఇవన్నీ ఊహాగానాలే. పైన చెప్పిన వాళ్లలో ఏ ఒక్కరూ ఈ వార్తలపై స్పందించలేదు. ఖండించనూ లేదు. ఇంతకీ శంకర్ తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పటికి..? -
రజనీకి పోటీగా రాజకీయాల్లోకి కమల్ హాసన్...?
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాది చలనచిత్ర నటుడు కమల్ హాసన్ గత రెండు నెలలుగా సినిమాల గురించి కాకుండా రాజకీయాల గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. తమళి ‘బిగ్ బాస్’కు వ్యాఖ్యాతగా కొత్త అవతారం ఎత్తిన ఆయన తమిళనాడు పాలకపక్ష అఖిల భారత అన్నా డిఎంకే పార్టీనే లక్ష్యంగా పెట్టుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన విమర్శలు తాజాగా మరింత పదునెక్కాయి. 70 మంది చిన్నారులు ఆక్సిజన్ అందక ఆస్పత్రిలో మరణిస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ను తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికే ఎన్నో నేరాలు చేసిన మన ముఖ్యమంత్రి రాజీనామాను ఎందుకు కోరరంటూ తమిళనాడు సీఎం ఈకే పళని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన అవినీతికి వ్యతిరేకంగా కొత్త స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రారంభించాలని కూడా తన అభిమానులకు పిలుపునిచ్చారు. జల్లికట్టును అనుమతించాలంటూ రాష్ట్రంలో కొనసాగిన ఆందోళనకు కమల్ హాసన్ మద్దతిచ్చారు. సినిమాలకు జీఎస్టీని తగ్గించాలంటూ ఆందోళన చేశారు. జాతీయ ఉమ్మడి మెడికల్ ప్రవేశ పరీక్షల వల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాం జరుగుతోందంటూ గళమెత్తారు. ఇలా వివిధ ప్రజా సమస్యలపై మున్నెన్నడు లేనివిధంగా కమల్ హాసన్ స్పందించడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. జయలలిత మరణంతో ఆమె లోటు కనిపించడం, పార్టీలు వర్గాలుగా చీలిపోవడం, సీనియర్ ద్రవిడ నాయకుడు ఎం. కరుణానిధి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని కమల్ హాసన్ భావిస్తున్నారా? ‘జరగబోయే ఓ యుద్ధానికి మీరంతా సిద్ధంగా ఉండాలి’ అంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు బహిరంగంగా పిలుపునిచ్చిన నేపథ్యంతో కమల్ హాసన్ రాజకీయ వ్యాఖ్యానాలు ఎక్కువగా చేస్తున్నారు. అంటే రజనీకాంత్తో పోటీ పడి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ఇంకా ముందే రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? పాలకపక్షంతో ఆయనకు సంబంధాలు కొత్తగా ఏమీ తెగిపోలేదు. జయలలిత ఉన్నప్పుడే చెడిపోయాయి. కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సినిమా విడుదల సందర్భంగా 2013లో ముస్లింలు ఆందోళన నిర్వహించారు. తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నందున సినిమా విడుదలను నిలిపి వేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సినిమాను ప్రదర్శించరాదంటూ ముఖ్యమంత్రి జయలలిత సినిమా థియేటర్లను ఆదేశించింది. తన సినిమాను అడ్డుకున్నట్లయితే తాను దేశాన్ని విడిచే వెళ్లిపోతానని కమల్ హాసన్ హెచ్చరించారు. అనంతరం ముస్లిం పెద్దలతో రాజీకి వచ్చి వారికి అభ్యంతరకరమైన దృశ్యాలను ఎత్తివేశారు. ముస్లింలతో రాజీకీ అవకాశం కల్పించినందుకు నాడు జయలలితకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాడు తన సినిమాపై వివాదం సష్టించిందే రాష్ట్ర ప్రభుత్వమని ఆరోపించారు. ఎంజీఆర్, ఎం. కరుణానిధిలను కూర్చోపెట్టిన పీఠంపై జయలలితను కూర్చోబెట్టలేమని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లోని అంతరార్థమేమిటీ? జయలలిత బతికుండగా రాజకీయాల గురించి ఎన్నడూ మాట్లాడని కమల్ హాసన్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. కమల్ వర్సెస్ రజనీకాంత్ కమల్ హాసన్, రజనీకాంత్లు చేస్తున్న రాజకీయ వ్యాఖ్యానాలు చూస్తుంటే నాడు 1970, 1980లో శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్లు అనుసరించిన రాజకీయాలు గుర్తుకు రాక తప్పవు. తమిళ సినీ పరిశ్రమ కూడా కమల్ హాసన్ను శివాజీ వారుసుడిగా, రజనీకాంత్ను ఎంజీఆర్ వారసుడిగా పరిగణిస్తోంది. రాజకీయాల్లో కూడా వీరిద్దరు, వారి గురువులనే అనుసరిస్తారేమో! మొదటి నుంచి డీఎంకే వారసుడైన శివాజీ గణేశన్ ఓసారి తిరుమలలోని వేంకటేశ్వరస్వామిని సందర్శించుకోవడం డీఎంకే కార్యకర్తలకు కోపం తెప్పించింది. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కరుణానిధి నాస్తికుడవడం వల్ల డీఎంకే కార్యకర్తలు కూడా నాడు దేవున్ని నమ్మేవాళ్లు కాదు. కమల్ హాసన్ నాస్తికుడు కాకపోయినా హేతువాదన్న విషయం తెల్సిందే. ఎంజీఆర్ చనిపోయిన అనంతరం ఆయన భార్య జానకీ రామచంద్రన్ సీఎం అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వనందుకు నిరసనగా శివాజీ గణేశన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. 1989 ఎన్నికల్లో ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో అంతటితో ఆయన రాజకీయ చరిత్రకు తెరపడింది. ఇక ఎంజీఆర్ వారసురాలిగా జయలలిత రాజకీయ చరిత్ర చర్విత చరణమే. రజనీకాంత్ కూడా గతంలో రాజకీయాల గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం జరిగింది. రాజకీయాలతో సంబంధం ఉన్నా, లేకున్నా అన్ని విషయాల్లో రజనీతోని కమల్ హాసన్ తానున్నానంటూ పోటీ పడుతుంటారు. ఇటీవల డీఎంకే పత్రిక ‘మురసోలి’ స్వర్ణోత్సవాల సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడకపోవడం మంచిదని రజనీకాంత్ నిర్ణయించుకుంటే ఆత్మ రక్షణకన్నా ఆత్మగౌరవం ముఖ్యం కనుక తాను మాట్లాడుతానంటూ కమల్ హాసన్ మైక్ పుచ్చుకున్నారు. కమ్యూనిస్టుగా, హేతువాదిగా, భూస్వామిగా, కళాకారుడిగా, తాగుబోతుగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన కమల్ హాసన్ రాజకీయ ఫిలాసఫీ ఏమిటీ ఎవరికి తెలియదు. మాస్ పాత్రల్లోనే ఎక్కువ మెప్పించిన రజనీకాంత్కు రాజకీయ ఫిలాసఫీ ఉంటుందా? అన్న అనుమానం రాకపోదు. ఎవరిదీ ఏ ఫిలాసఫీ అయినా కమల్ హాసన్కు కలిసొచ్చే అంశం ఒకటుంది. ఆయన తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. రజనీకాంత్ మహారాష్ట్ర మరాఠా కుటుంబానికి చెందిన వారు. అందుకనే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరిగినప్పుడల్లా ద్రవిడ జాతీయవాదులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కమల్ హాసన్కు అలాంటి వ్యతిరేకత లేదు. కాకపోతే అదే కులానికి చెందిన జయలలిత ఇంతకాలం పదవిలో కొనసాగినప్పటికీ రాజకీయాల్లో బ్రాహ్మణులకు అంతగా బలం లేదు. ‘తమిళ బిగ్ బాస్’కు కమల్ హాసన్ ఆతిథ్యం ఇవ్వడం టీఆర్పీ రేట్ల కోసమా, రానున్న రాజకీయ అవసరాల అన్నది కాలమే తేల్చాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
సంచలన టైటిల్తో రానున్న కమల్
చెన్నై: నటుడు కమల్హాసన్ నాయకుడున్నాడు అంటున్నారు. ఏమిటీ అప్పడే ఏదేదో ఊహించుకుంటాన్నారా? మీరు అనుకుంటున్నట్లు ఇది రాజకీయపరమైనది కాదు. ఆయన తాజా చిత్రానికి తలైవన్ ఇరుక్కిరాన్ అనే పేరును ఖరారు చేశారు. కమల్హాసన్ ప్రస్తుతం ఒక బిగ్బాస్ రియాలిటీ గేమ్ షోపై దృష్టి పెట్టినా, తాను స్వీయ దర్శకత్వంలో నటించిన విశ్వరూపం-2 చిత్రాన్ని విడుదల చేసే కార్యక్రమాల్లోనూ నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం తుది ఘట్ట కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. విశ్వరూపం-2 చిత్రం తరువాత నిర్మాణంలో ఉన్న మరో చిత్రం శభాష్నాయుడు షూటింగ్ను పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో కమల్ తన తాజా చిత్రాన్ని ప్రకటించడం విశేషం. దీనికి తలైవన్ ఇరుక్కిరాన్ (నాయకుడున్నారు) అనే టైటిల్ను నిర్ణయించినట్లు గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే నిజానికి ఇదే టైటిల్ను కమల్హాసన్ ఎనిమిదేళ్ల క్రితమే వెల్లడించారు. దీన్ని తమిళం, హిందీ భాషలలో తెరకెక్కించనున్నట్లు, హిందీ వెర్షన్లో నటుడు సల్మాన్ఖాన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత రెండేళ్లకు సల్మాన్ఖాన్కు బదులు నటుడు సైఫ్అలీఖాన్ నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అవేమీ తెరరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి తలైవన్ ఇరుక్కిరాన్ టైటిల్ను కమల్ వెల్లడించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కమల్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
మంత్రులకు నేను చాలు
తమిళసినిమా: రాష్ట్రాన్ని కాపాడడానికే మీ అవసరం కావాల్సి ఉంటుంది. మంత్రులకు బదులివ్వడానికి నేను చాలు అని నటుడు కమలహాసన్ తన అభిమానులకు సూచించారు. కమలహాసన్కు, రాష్ట్ర మంత్రులకు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన రాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు సంధించడమే వారి మధ్య వార్కు తెరలేచిందన్న విషయం తెలిసిందే. అవినీతికి ఆధారాలుంటే బయట పెట్టాలన్న మంత్రుల సవాల్తో కమలహాసన్ శాఖల వారిగా అవినీతిపై ఆధారాలు సేకరించాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు.కాగా ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కమలహాసన్ అభిమానులు మంత్రులపై మాటల దాడి చేస్తూ పోస్టర్లను అతికించారు. ఈ చర్యలకు స్పందించిన నటుడు కమలహాసన్ పోస్టర్లు ముద్రిస్తూ డబ్బును వృథా చేయవద్దని, ఆ డబ్బును సహాయ కార్యక్రమాలను ఉపయోగిస్తే మంచిదని హితవు పలికారు. రాష్ట్రాన్ని కాపాడడానికే మీ అవసరం ఉంటుందని, ఇలాంటి మంత్రులకు బదులివ్వడానికి తాను చాలని కమల్ సోమవారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కమల్కు లేదు
-
చిట్టా వస్తోంది జాగ్రత్త!
♦ మంత్రులకు కమల్ హెచ్చరిక ♦ వెబ్సైట్లలో అభియోగాలు నమోదు ‘అవినీతి ఆరోపణలపై ఆధారాలు కావాలన్నారు కదా.. ఇదిగో చిట్టా వస్తోంది జాగ్రత్త’ అని నటుడు కమల్హాసన్ హెచ్చరించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతిని ప్రభుత్వ వెబ్సైట్లలో నమోదు చేయాల్సిందిగా అభిమానులకు పిలుపునిస్తూ బుధవారం ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : అవినీతిని నిరూపించాలని మంత్రుల సవాల్కు కమల్హాసన్ స్పందించారు. అభిమానుల చేతికి అస్త్రం అందించారు. గత కొంతకాలంగా రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్న కమల్ ఇటీవల అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాలను మరో మలుపుతిప్పింది. అధికార, ప్రతిపక్షాలు కమల్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డాయి. అన్నాడీఎంకే అవినీతిమయమంటూ సుమారు వారం రోజల క్రితం కమల్చేసిన విమర్శలపై రాజకీయం ఇంకా రగులుతూనే ఉంది. అధికారపక్షంపై విపక్షాలన్నీ ఏకమై ప్రతిరోజూ ఏదో ఒక మూల చర్చాగోష్టిలో మునిగితేలుతున్నాయి. విమర్శలతో ఆత్మరక్షణలో పడిపోయిన ప్రభుత్వం ఆధారాలు చూపాలంటూ సవాలు విసిరి కమల్ను మరింత రెచ్చగొట్టాయి. మంత్రుల సవాలును స్వీకరించిన కమల్హాసన్ దీటుగా స్పందించారు. ‘ప్రభుత్వ అవినీతిపై రాష్ట్రమంతా కోడై కూస్తున్నా, మీడియాలు ప్రధాన శీర్షికల్లో ప్రచురిస్తున్నా ఇంకా ఆధారాలు కావాలా?’ అని ఆయన ఎద్దేవా చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తించని మంత్రులు తెలిసో తెలియకో అవాకులు చవాకులు పేలుతున్నారని కమల్ విమర్శించారు. రాష్ట్రంలో అసలు అవినీతే లేదని సమర్థించుకున్నంటున్న మంత్రులకు అభిమానులు సరైన సమాధానం చెబుతారని ఆయన తెలిపారు. అవినీతిని ఆధారాలతో నిరూపించు అని మంత్రి జయకుమార్ కవ్వింపు చేష్టలకు డిజిటల్ విధానంలో చరమగీతం పాడండని అభిమానులను కోరారు. ఆమేరకు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఉత్తరాలు, పోస్టు కార్డులు, పోస్టర్లు ద్వారా ప్రచారం చేస్తే చెరిగిపోతాయి, చిరిగిపోతాయి, ఇది డిజిటల్ యుగం, ఇంటర్నెట్ ద్వారా ప్రభుత్వంపై అవినీతి ఆధారాలను సంధించండి’ అని కోరారు. రాష్ట్రప్రభుత్వ మంత్రుల అధికారిక వెబ్సైట్ చిరునామాను అభిమానులకు అందజేశారు. కమల్ ఇచ్చిన పిలుపునకు వెంటనే స్పందించిన అభిమానులు పెద్ద ఎత్తున అవినీతి సమాచారం వెబ్సైట్లో పెడుతున్నారు. మదురై జిల్లాకు చెందిన అభిమానులు రేషన్దుకాణాల అవకతవకలపై వివరాలను నమోదుచేశారు. రెండువేల మంది రేషన్కార్డుదారుల నుంచి సంతకాలు సేకరించి హోంశాఖకు పంపుతున్నారు. డీవైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు గురువారం నగరంలో కమల్కు మద్దతుగా ర్యాలీ జరిపాయి. శశికళ ఆదేశాల మేరకు ప్రభుత్వం.. ఇదిలా ఉండగా, అవినీతిపరురాలిగా ముద్రపడి జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆదేశాల ప్రకారం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ కమల్ సోదరుడు చారుహాసన్ సైతం మంత్రి జయకుమార్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మంత్రి విజయభాస్కర్ ఇంటిలో ఐటీ దాడులు అవినీతికి రుజువులు కావా అని ప్రశ్నించారు. బరిలోకి దిగితే కమలే బిగ్బాస్ అంటూ సినీ హాస్యనటుడు దాడి బాలాజీ అన్నారు. అవినీతి ప్రభుత్వానికి కమల్ను విమర్శించే అర్హత లేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
మనోభావాలు కించపర్చలేదు: కమల్హాసన్
బిగ్బాస్ షో కారణంగా తమిళ సంస్కృతికి భంగం కలగలేదని నటుడు కమల్హాసన్ అన్నారు. ఆయన హోస్ట్ చేస్తున్న సెలబ్రెటీ రియాల్టీ షో 'బిగ్బాస్'పై వివాదం తలెత్తడంపై ఆయన బుధవారం స్పందించారు. బిగ్బాస్ షో ఎవరి మనోభావాలను కించపరచదని చెప్పారు. తమిళ భాష తెలియని వారికి నేర్పడం తప్పుకాదని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవినీతి ఉందని, దాన్ని రూపుమాపడానికి ఎవరో ఒకరు రావాలని సూపర్స్టార్ రజనీకాంత్ అన్నమాటలను ప్రస్తావించారు. ఆ మాటలను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వెజ్, నాన్ వెజ్ ఎవరి అలవాట్లు వారివని వాటిపై నిబంధనలు, ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. కాగా, షో పేరిట తమిళ సంస్కృతిని దెబ్బతీస్తున్నారంటూ హెచ్ఎంకే (హిందూ మక్కల్ కట్చి) సంఘం సెక్రటరీ శివ.. చెన్నై పోలీస్ కమిషనర్కు కమల్హాసన్, షో నిర్వాహకులపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
విశ్వరూపం కంటే బెటర్గా..
విశ్వ నటుడు కమలహాసన్ ఇంతకు ముందు నటించిన విశ్వరూపం చిత్రం పలు ఆవరోధాలను అధిగమించి తెరపైకి వచ్చి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రానికి సీక్వెల్గా కమలహాసన్ తెరకెక్కిస్తున్న విశ్వరూపం–2 చిత్రం కూడా ఆర్థిక సమస్యల వంటి పలు ఆటంకాలను ఎదుర్కొంది. కాగా అలాంటి వాటన్నింటిని చేధించుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం కమల్ తన తాజా చిత్రం శభాష్ నాయుడు చిత్రాన్ని పక్కన పెట్టి విశ్వరూపం–2 చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మరింత మెరుగులు దిద్దే పనిలో భాగంగా ప్యాచ్ వర్క్ షూటింగ్ను స్థానిక పూందమల్లిలోని గోకుల్ స్టూడియోలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రం గురించి తెలుపుతూ విడుదల తేదీ ఇంకా నిర్ణయంచలేదు గానీ, త్వరలోనే అందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. విశ్వరూపం చిత్రానికి మించి విశ్వరూపం–2 ఉంటుందని పేర్కొన్నారు. -
వెండితెరపై మహాగణపతి
సాక్షి,హైదరాబాద్: కళాతపశ్వి కె. విశ్వనాథ్ అద్భుత కళాసృష్టి ‘సాగర సంగమం’ చిత్రం. 1983లో తీసిన ఈ చిత్రం.. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం బ్యాక్డ్రాప్లో కమల్హాసన్ వీరావేశంతో నర్తిస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. అలా మన గణనాథుడు వెండితెరకు సైతం ఎక్కాడు. -
ఆయన అడిగితే కాదంటానా!
కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో 1990 ప్రాంతంలో నటించి ప్రముఖ కథానాయకిగా వెలుగొందిన నటి అమల. తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ప్రముఖ కథానాయకులతో నటించిన అమల నాగార్జునను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపట్టారు. ఆ తరువాత పలువురు దర్శక నిర్మాతలు అమలను మళ్ల నటింపజేయాలని ప్రయత్నించినా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. రెండు దశాబ్దాల తరువాత ఆ మధ్య లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే చిత్రంలో మెరిశారు. అమల లాంటి ప్రతిభావంతురాలు రీఎంట్రీ అయితే ఇక మన దర్శక నిర్మాతలు చూస్తూ ఊరుకుంటారా? అంత వరకూ ఎందుకు విశ్వ నటుడు కమలహాసనే అమలను తన చిత్రంలో నటించమని కోరారు. అంతటి గొప్ప నటుడు అడిగితే అమల ఎలా కాదనగలరు. కథ, తన పాత్ర బాగుంటే. ఆమె త్వరలో కమలహసన్తో కలిసి అప్పా అమ్మా విళైయాట్టు చిత్రంలో నటించనున్నారు. దీనిగురించి అమల ఏమంటున్నారో చూద్దాం. 'మళ్లీ కమలహాసన్తో కలిసి నటిస్తానని ఊహించలేదు. ఒక కార్యక్రమంలో కలిసిన ఆయన తనతో నటిస్తారా అని అడిగారు. నేనూ ఓకే అన్నాను. అంతే దర్శకుడు రాజీవ్కుమార్ పంపి కథ వినిపించారు. కథ బాగుంది. పాత్ర తనకు తగినట్లు ఉంది. చిత్ర షూటింగ్ అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఇందులో నేను కమల్కు భార్యగా నటించనున్నాను. షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. బహూశా ఫిబ్రవరిలో ప్రారంభం కావచ్చు. అయితే నేను ఇప్పటికే చాలా బిజీగా ఉన్నాను. పనులు చాలా ఉన్నాయి. అందువల్ల కమలహాసన్కు జంటగా ప్రత్యేక పాత్రలోనే నటించనున్నాను. ఎక్కువ రోజులు కాల్షీట్స్ కేటాయించలేను. సినిమాలో నేను చాలా నేర్చుకున్నాను. అందుకే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యాను. అయితే నాకు తగిన పాత్ర అయితేనే అంగీకరిస్తాను' అని అమల పేర్కొన్నారు. ఈ చిత్రంలోనే నటి శ్రుతిహాసన్ నటించనున్నారు. -
ఉద్రిక్తత నడుమ నడిగర్ ఎన్నికలు
-
ఉద్రిక్తత నడుమ నడిగర్ ఎన్నికలు
♦ దక్షిణ భారత నటీనటుల సంఘం ♦ ఎన్నికల్లో విశాల్ వర్గం విజయం ♦ అధ్యక్షుడిగా నాజర్.. ♦ {పధాన కార్యదర్శిగా విశాల్ ఎన్నిక సాక్షి, చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలు ఆదివారం ఉద్రిక్తతల మధ్య జరిగాయి. తొమ్మిదేళ్లుగా అప్రతిహతంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నటుడు శరత్ కుమార్ ప్యానల్పై.. కుర్రహీరో విశాల్ ప్యానల్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచింది. విశాల్ ప్యానల్ తరపున అధ్యక్షుడిగా పోటీ చేసిన కేరెక్టర్ నటుడు నాజర్ శరత్పై 109 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా విశాల్ 141 ఓట్ల తేడాతో గెలిచారు. కోశాధికారిగా మరో నటుడు కార్తి గెలుపొందారు. చెన్నై హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పద్మనాభన్ నేతృత్వంలో.. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఓటింగ్ నిర్వహించినప్పటికీ.. రెండు వర్గాల మధ్య వాగ్యుద్ధాలు.. భౌతిక దాడులు.. ఘర్షణలతో పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రంలో శరత్కుమార్, విశాల్ ల మధ్య తీవ్రంగా వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఇదే సమయంలో శరత్కుమార్ వర్గానికి చెందిన కొందరు విశాల్పై దాడి చేశారని.. పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన తరువాత విశాల్ ఆరోపించారు. అయితే విశాల్ ఆరోపణలను శరత్కుమార్ ఖండించారు. అయితే ఇదే సమయంలో దక్షిణ భారత నటీనటుల సంఘం పేరును తమిళనాడు నటీనటుల సంఘంగా మార్చాలని రజనీకాంత్ ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా డిమాండ్ చేశారు. నడిగర్ సంఘంలో ఉన్న వాళ్లంతా తమిళనటీనటులే కావటం వల్ల దానికి దక్షిణభారత నటీనటుల సంఘం అనటం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇక కమల్హసన్ మరో అడుగు ముందుకు వేసి భారతీయ సినీనటుల సంఘంగా పేరు పెట్టాలన్నారు. మొత్తం 3,139మంది కళాకారులు సభ్యులుగా ఉన్న నడిగర్ సంఘంలో 1,824 మంది ప్రత్యక్షంగా, 783 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
పోలీస్గా కమల్..?
‘ఉత్తమ విలన్’ తర్వాత కమల్హాసన్ నటించబోయే సినిమా మీద చాలా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా తెలిసిన వార్త ఏంటంటే లోకనాయకుడు కమల్హాసన్ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు వినికిడి. ఈ సినిమా కోసం ఇప్పటికే కమల్హాసన్ కసరత్తులు మొదలుపెట్టారట. ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్ ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. -
'పీకే' రీమేక్ చిత్రంలో కమల్హాసన్?
బాలీవుడ్లో కనకవర్షం కురిపించిన సూపర్ హిట్ చిత్రం 'పీకే'ను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయవచ్చని, ఇందులో ప్రముఖ హీరో కమల్హాసన్ నటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆమీర్ ఖాన్, అనుష్క శర్మ నటించిన పీకే ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 620 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గ్రహాంతరవాసిగా ఆమీర్ నటనకు ప్రశంసలు అందుకున్నారు.