The Kashmir Files Movie
-
ఓటీటీకి వివేక్ అగ్నిహోత్రి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అదే జోరుతో వివేక్ ది వ్యాక్సిన్ వార్ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొవిడ్ టైంలో వ్యాక్సిన్ను శాస్త్రవేత్తలు ఎలా అభివృద్ధి చేశారనేది ఈ చిత్రంలో చూపించారు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. ఈనెల 24న తేదీ నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. దక్షిణాది భాషల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మేకర్స్ వెల్లడించలేదు. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. -
కశ్మీర్ ఫైల్స్కు జాతీయ సమైక్యత అవార్డా?.. తప్పు పట్టిన సీఎం
కేంద్ర ప్రభుత్వం గురువారం 69వ సినీ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ అత్యధిక అవార్డులను కై వసం చేసుకుంది. అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఆశాజనకమైన అవార్డులను గెలుచుకుంది. నటుడు కమల్ హాసన్ వంటి పలువురు సినీ ప్రముఖులు దక్షిణాది చిత్ర పరిశ్రమ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఈ అవార్డులు చిహ్నంగా పేర్కొన్నారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జాతీయ ఉత్తమ అవార్డులకు ఎంపికైన చిత్రాలకు, దర్శక నిర్మాతలకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అందులో కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి నర్గీస్దత్ పేరుతో జాతీయ సమైక్యత అవార్డును ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పలు విధాలుగా వివాదాలను ఎదుర్కొన్న కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాలకు ఇలాంటి అవార్డులకు ప్రకటించడం దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ఉత్తమ చిత్రంగా రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్ను ప్రకటించగా.. ప్రాంతీయ భాషలో ఉత్తమ చిత్రంగా ఉప్పెనకు జాతీయ అవార్డు అనౌన్స్ చేశారు. ఉత్తమ నటుడిగా పుష్ప:పార్ట్ 1 సినిమాకు అల్లు అర్జున్, ఉత్తమ నటిగా గంగూబాయి కతియావాడి సినిమాకుగానూ ఆలియా భట్, మిమీ చిత్రానికిగానూ కృతి సనన్ ఎంపికయ్యారు. #69thNationalFilmAwards -இல் தமிழில் சிறந்த படமாகத் தேர்வாகியிருக்கும் #கடைசிவிவசாயி படக்குழுவினருக்கு என் பாராட்டுகள்! @VijaySethuOffl #Manikandan #நல்லாண்டி மேலும், #இரவின்நிழல் படத்தில் ‘மாயவா சாயவா’ பாடலுக்காகச் சிறந்த பின்னணிப் பாடகி விருதை வென்றுள்ள @shreyaghoshal,… pic.twitter.com/Bc2veRY5gs — M.K.Stalin (@mkstalin) August 24, 2023 జాతీయ అవార్డుల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమంటున్నారు.. కానీ: విజయ్ దేవరకొండ -
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో?
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. అలానే మిగతా దక్షిణాది భాషల్లోని చిత్రాలు సైతం అవార్డులు గెలుచుకున్నాయి. 'పుష్ప' మూవీకిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకోవడం మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. అలానే 'ఆర్ఆర్ఆర్'కి ఏకంగా ఆరు పురస్కారాలు దక్కడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. (ఇదీ చదవండి: మహేశ్బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?) అయితే చాలామంది ఎవరెవరికి ఎన్ని అవార్డులు వచ్చాయనేది చూస్తుంటే.. సినీ ప్రేమికులు మాత్రం ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందా అని తెగ వెతికేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల కోసం మేం ఆ లిస్టుతో వచ్చేశాం. అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది తెలియాలంటే దిగువన లిస్ట్పై అలా ఓ లుక్కేసేయండి. నేషనల్ అవార్డ్ మూవీస్- ఓటీటీ ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ ప్లస్ హాట్స్టార్ (తెలుగు) పుష్ప - అమెజాన్ ప్రైమ్ (తెలుగు) రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ - జియో సినిమా (తెలుగు-హిందీ) ఉప్పెన - నెట్ఫ్లిక్స్ (తెలుగు) కొండపొలం - నెట్ఫ్లిక్స్ (తెలుగు) ద కశ్మీర్ ఫైల్స్ - జీ5 (తెలుగు డబ్బింగ్) చార్లి 777 - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) గంగూబాయి కతియావాడి - నెట్ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) మిమీ - నెట్ఫ్లిక్స్ (హిందీ) #Home - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్) షేర్షా - అమెజాన్ ప్రైమ్ (హిందీ) సర్దార్ ఉద్దామ్ సింగ్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ) కడైసి వివసయ్ - సోనీ లివ్ (తెలుగు డబ్బింగ్) నాయట్టు - నెట్ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్) (ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) -
జాతీయ అవార్డ్స్ కోసం లాబీయింగ్.. స్పందించిన నిర్మాత
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ కూడా తెలుగు చిత్రసీమకు చెందినవారే కావడం విశేషం. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా గుర్తించి అందుకు గాను జాతీయ అవార్డును ప్రకటించారు. అంతేకాకుండా ఇందులో తన నటనతో మెప్పించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయనటి విభాగంలో అవార్డు దక్కింది. ఈ అంశంపై తాజాగ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు రెండు జాతీయ అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అభిషేక్ తెలిపారు. ఈ సినిమా ప్రారంభం నుంచి తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. సినిమాను చూసిన కొందరు యాంటీ ముస్లిం అంటూ కామెంట్లు చేశారు.. ఈ విధంగా ఎలా కామెంట్ చేశారో ఇప్పటికీ అర్థం కాలేదని ఆయన అన్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా యాంటీ టెర్రరిస్ట్ కథాంశంతో తెరకెక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అమెరికాలో ఉన్నారని, ఈ అవార్డుతో ఆయన మరింత సంతోషంగా ఉన్నారని తెలిపారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రస్తుతం తెలుగు సినిమా అనేది రాష్ట్రాన్ని దాటి ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. కొందరు రాజకీయాల్లో వస్తున్నానంటూ తన గురించి ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని తను ఎప్పటికీ రాజకీయాలకు దూరం అని చెప్పాడు. అంతేకాకుండా అవార్డ్స్ కోసం లాబీయంగ్ చేశారంటూ కొందరు చెబుతున్నారని ఈ అవార్డ్స్ కోసం ఎలాంటి లాబీయింగ్ చెయ్యలేదని అసలు అలాంటి విషయాలు తనకు తెలీయదని అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. '69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ ఇది ప్రజల సినిమా. ప్రజలు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు. దేశ ప్రజలకు, కశ్మీర్ పండిట్లందరికీ ఈ పురస్కారాల్ని అంకితమిస్తున్నాం. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ పొందడం చాలా అనందంగా ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడం, ఉప్పెన, కొండపొలం పాటకి చంద్రబోస్కు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కార్తికేయ 2 తర్వాత ప్రస్తుతం నిర్మిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. పాన్ ఇండియా ఆడియన్స్ అలరించే కంటెంట్ టైగర్ నాగేశ్వరరావులో ఉంది. అక్టోబర్ 20న విడుదల చేస్తున్నాం. దానికి కూడా జాతీయ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కావాలి.'' అని అన్నారు. వాస్తవిక అంశాల చుట్టూ ది కాశ్మీర్ ఫైల్స్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం 2022లో విడుదలై భారీ కలెక్షన్స్తో పాటు పలు వివాదాలను కూడా క్రియేట్ చేసింది. దీనిని వివేక్ అగ్నిహోత్రి రచించి, అతనే దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలసలను వర్ణిస్తుంది. వాస్తవిక అంశాలనే కథాంశంగా దీనిని నిర్మించారు. కశ్మీర్ ఫైల్స్ కోసం మొత్తం షూటింగ్ జరిగిపింది నెలరోజులే. కానీ కథ కోసం రెండేళ్లపాటు దర్శకుడు పరిశోధన చేశాడు. ఈ సినిమా కోసం కశ్మీర్ రాష్ట్రం దాటి వెళ్లిపోయిన ఏడువందల మంది కశ్మీరీ పండిట్లను ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించారు. అగ్నిహోత్రి రూపొందించిన ఫైల్స్ త్రయంలో ఇది రెండవ చిత్రం, దీనికి ముందు ది తాష్కెంట్ ఫైల్స్, తరువాత ది ఢిల్లీ ఫైల్స్ ఉన్నాయి. -
స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?
The Kashmir Files Web Series: బాలీవుడ్కి గతేడాది అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి. అయితే 2022లోనే ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకున్న చిత్రం 'ద కశ్మీర్ ఫైల్స్'. ఈ మూవీకి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దానితో పాటే లెక్కకు మించి వివాదాలకు ఈ చిత్రం కారణమైంది. ఇప్పుడు మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యేందుకు ఆ దర్శకుడు రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) అప్పుడు సినిమా ఇప్పుడు సిరీస్ దాదాపు రెండేళ్లపాటు రీసెర్చ్ చేసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. కశ్మీర్ నుంచి వెళ్లిపోయిన 700 మంది కశ్మీరి పండితులని ఇంటర్వ్యూ చేశాడు. వాళ్లు చెప్పిన కొన్ని పాయింట్స్ ఆధారంగా, 1990ల్లో జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయిన పండితుల కథతో 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమా తీశాడు. ఆ మూవీలో చెప్పలేకపోయిన మిగిలిన అంశాలతో ఇప్పుడు ఏకంగా వెబ్ సిరీస్ తీసేశారు. 'ద కశ్మీర్ ఫైల్స్: అన్ రిపోర్టెడ్' పేరుతో రాబోతున్న ఈ సిరీస్ త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడి ట్వీట్ 'కశ్మీరీ పండితుల మారణ హోమం జరిగిందనే వాస్తవాన్ని అంగీకరించలేని వాళ్లు, భారత్కు శత్రువులు 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు నేను కశ్మీర్ హిందువుల మారణ హోమానికి సంబంధించిన చేదు నిజాన్ని వెబ్ సిరీస్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎమోషన్స్తో తీసిన ఈ సిరీస్ చూడటానికి రెడీగా ఉండండి. కనిపిస్తున్న వాస్తవాన్ని అంగీకరించలేని వాళ్లే దీన్ని విమర్శిస్తారు' అని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేశాడు. ఓ టీజర్ని కూడా పోస్ట్ చేశాడు. PRESENTING: A lot of Genocide Deniers, terror supporters & enemies of Bharat questioned The Kashmir Files. Now bringing to you the VULGAR truth of Kashmir Genocide of Hindus which only a devil can question. Coming soon #KashmirUNREPORTED. Be ready to cry. Only on @ZEE5India… pic.twitter.com/DgGlnzSKwA — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 19, 2023 (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) -
కేవలం దాని కోసమే పెళ్లి చేసుకుంటున్నారు: వివేక్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కించిన 'ది కశ్మీర్ ఫైల్స్' సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కశ్మీర్లో హిందూ పండితులపై జరిగిన దాడులను కథాంశంగా సినిమాను రూపొందించారు. అయితే ప్రస్తుతం ఆయన 'ది వ్యాక్సిన్ వార్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే) తాజాగా వివేక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రోజుల్లో వెడ్డింగ్స్ జరగడంపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. కేవలం పెళ్లి ఫొటోలు తీసుకోవడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారని వివేక్ అగ్నిహోత్రి వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. మే 13న దిల్లీలో జరిగిన పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం జరగడంతో ఆయన ట్వీట్పై చర్చ నడుస్తోంది. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) వివేక్ తన ట్వీట్లో రాస్తూ.. ' ఈ రోజుల్లో కేవలం ఫోటోలు, వీడియోల కోసమే పెళ్లి చేసుకుంటున్నాపరు. 'డెస్టినేషన్ వెడ్డింగ్' ట్యాగ్ని పొందడానికి పెళ్లి చేసుకుంటున్నారని నాతో ఓ వెడ్డింగ్ ప్లానర్ చెప్పారు. నేను ఓ డెస్టినేషన్ వెడ్డింగ్లో ఉన్నా. ఆ వివాహానికి ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తున్నాడని ఎవరో చెప్పారు. దీంతో వధువు స్పృహ తప్పి పడిపోయింది.' అంటూ పోస్ట్ చేశారు. వివేక్ చేసిన ట్వీట్పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. “People are getting married just to get wedding photos, videos and to get ‘destination wedding’ tag for show off”. - a wedding planner told me. It’s true I was in a destination wedding and someone said that the wedding photographer is going to be late and the bride fainted. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 13, 2023 -
కాశ్మీర్ ఫైల్స్పై అనుచిత వ్యాఖ్యలు.. సీఎం మమతకు లీగల్ నోటీసులు
ముంబై: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అదే కోవలోకి ఇటీవలే విడులైన ది కేరళ స్టోరీ కూడా చేరింది. ఈ నేపథ్యంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేశాయి. ఇక, పశ్చిమ బెంగాల్లో కూడా ఈ సినిమాను బ్యాన్ చేసింది తృణముల్ కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రెండు సినిమాలపై మమత స్పందిస్తూ.. "ది కాశ్మీర్ ఫైల్స్" అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్ అయ్యారు. అందుకే కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేసినట్టు తెలిపారు. What is "The Kashmir Files"? it is to humiliate one section. What is "The Kerala Story"?... It is a distorted story: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/yRFwhlumum — ANI (@ANI) May 8, 2023 కాగా, మమత బెనర్జీ వ్యాఖ్యలపై బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీరియస్ అయ్యారు. దీంతో, మమతకు లీగల్ నోటీస్ పంపించారు. తన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను ఆమెకు లీగల్ నోటీస్ పంపించానని అగ్నిహోత్రి తెలిపారు. తాను తీసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతోపాటు తన రాబోయే మరో సినిమా కూడా పశ్చిమబెంగాల్లో హింసాకాండను ఆధారంగా తీసుకుని తీస్తున్నవేనని సీఎం మమత ఆరోపిస్తున్నారని, కానీ ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అంతా తప్పుడు ప్రచారమని అగ్నిహోత్రి విమర్శించారు. తన సినిమాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపించారని, అది కూడా తప్పుడు ఆరోపణేనని అన్నారు. BREAKING: I have, alongwith @AbhishekOfficl & Pallavi Joshi, sent a LEGAL NOTICE to the Chief Minister, Bengal @MamataOfficial for her false & highly defamatory statements made with malafide intention to defame us & our films #TheKashmirFiles & upcoming 2024 film #TheDelhiFiles. pic.twitter.com/G2SjX67UOB — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 9, 2023 ఇది కూడా చదవండి: The Kerala Story: యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం -
నిజమెంత? నిజాయతీ ఎంత?
‘నిజజీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది తీశామ’ని అంటున్న సినిమాలో నిజాలు ఉంటాయనే ఆశిస్తాం. నిజాయతీగా ఉంటుందనే భావిస్తాం. కానీ అవే లోపిస్తే? శుక్రవారం విడుదలవుతున్న హిందీ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ సరిగ్గా అవే ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. విషయం మద్రాస్, కేరళ హైకోర్ట్ల మొదలు సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్ళాల్సి వచ్చింది. దాదాపు 10 కట్స్తో సెన్సార్ బోర్డ్ పచ్చజెండా ఊపిన ఈ వివాదాస్పద చిత్ర ప్రదర్శనను ఆపడానికి కానీ, కనీసం ‘కల్పిత పాత్రలతో అల్లుకున్న కథ’ అని టైటిల్స్లో వేయడానికి కానీ గడచిన మూడు రోజుల్లో 3 సార్లు సుప్రీమ్ ససేమిరా అనడంతో, బంతి ఇప్పుడు థియేటర్లలోని ప్రజాకోర్టులో పడింది. ‘సంఘ్ పరి వార్ వారి అసత్యాల కర్మాగారంలో తాజా ఉత్పత్తి’ అంటూ కేరళ సీఎం ఈ చిత్రాన్ని గర్హించారు. కేరళలో జెండా పాతాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మినహా ప్రతిపక్షాలూ ఆ మాటే అంటున్నాయి. బహిష్కరణ పిలుపుతో సహా కేరళ సర్కార్ వివిధ మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో కల్పనను నిజమని నమ్మించే ప్రమాదభరిత సృజనాత్మక స్వేచ్ఛ విపరిణామాలపై కచ్చితంగా చర్చ అవసరం. ఏప్రిల్ ద్వితీయార్ధంలో ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ‘కేరళ స్టోరీ’ వివాదాలకు కేంద్రబిందువైంది. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రభావం పతాకస్థాయిలో ఉన్నవేళ కేరళ నుంచి ‘దాదాపు 32 వేల మంది స్త్రీలు’ కనిపించకుండాపోయారనీ, వారి తెర వెనుక కథల్ని ‘బహిర్గతం’ చేసే యత్నమే మత మార్పిడి అంశం ఇతివృత్తమైన ఈ చిత్రమనీ దర్శక, నిర్మాతల మాట. ‘లవ్ జిహాద్’లో భాగంగా 32 వేల మందినీ ముస్లిమ్లుగా మార్చి, అత్యధికులను ఐఎస్ పాలనలోని సిరియాకు తీసుకువెళ్ళారనేది ఈ చిత్ర వాదన. సాక్ష్యాధారాలు లేని ఈ కాకుల లెక్కతో కేరళను తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడంపై సహజంగానే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇది ముస్లిమ్లపట్ల ద్వేషం పెంచే దుర్మార్గ ప్రయత్నమనే వాదన బలపడింది. ‘లవ్ జిహాద్’ లేదని నాటి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే పార్లమెంట్లో చెప్పినప్పుడు కేరళపై బురద చల్లేలా ఇలాంటి సినిమా ఎలా తీస్తారన్నది ప్రశ్న. కేరళలో హిందువుల జనాభా దాదాపు 55 శాతమైతే, ఆ తర్వాత అత్యధికంగా ముస్లిమ్లు 26 శాతం పైగా, క్రైస్తవులు 18 శాతం ఉన్నట్టు లెక్క. దశాబ్దాల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత సాధించి, నిత్యం చైతన్యం నిండిన ఆలోచనాపరుల సమాజంగా దేశంలో మలయాళ సీమది ప్రత్యేక స్థానం. సాహిత్యం, సంస్కృతి, కళలు, సినిమాలు సహా అనేక రంగాల్లో దిక్సూచిగా నిలిచిన ఘనత దానిది. మానవాభివృద్ధి సూచిలో ముందుంది. అలాంటి రాష్ట్రాన్ని పచ్చి తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడం కించపరచడమే. విమర్శలు పెరిగి, వివాదం ముదిరేసరికి సినీరూపకర్తలు సైతం సర్దు కోవాల్సి వచ్చింది. కేరళలోని ‘32 వేల మంది మహిళల కథల ఆధారంగా తీశా’మంటూ మొదట ట్రైలర్లో తొడకొట్టినవాళ్ళు చివరకు మే మొదట్లో దాన్ని ముగ్గురంటే ‘ముగ్గురు యువతులు’గా మార్చేశారు. కడుపులో ఏదో పెట్టుకొని కథ రాసుకున్నప్పటికీ కోట్లు పెట్టి సినిమా తీసినవారికి మూడుకూ, 32 వేలకూ తేడా తెలీదా? ఒకటీ అరా ఘటనలు జరిగాయేమో తెలీదు కానీ దాన్ని పట్టుకొని కేరళలోని ప్రబలమైన ధోరణి అన్నట్టు చిత్రించాలనుకోవడం ఏ రకంగా సమర్థనీయం? మొత్తం కేరళ కథ అన్నట్టు సినిమాకు పేరు పెట్టి, బురద జల్లడం ఎవరిచ్చిన సృజనాత్మక స్వేచ్ఛ? భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిందే. సృజనాత్మక స్వాతంత్య్రం కావాల్సిందే! కానీ ట్రైలర్ను బట్టి చూస్తే... వాస్తవాలను చూపుతున్నామనే పేరుతో, నిజాలను వక్రీకరించి సంచలనాత్మకం చేయడం ‘కేరళ స్టోరీ’లోని అతి పెద్ద ఇబ్బంది. ఇలా లెక్కలతో సహా అన్నిటినీ అతి చేస్తున్నప్పడు ఈ చిత్ర రూపకల్పన వెనుక ఉన్న ఉద్దేశాలపై, సాధించదలచిన లక్ష్యాలపై తప్పక అనుమానాలు తలెత్తుతాయి. పైగా, కేరళలో ముస్లిమ్, ముస్లిమేతరులుగా ప్రజలను రెండు ప్రత్యర్థి వర్గాలుగా ఏకీకృతం చేసే ప్రయత్నాలు పెరుగుతున్న సమయంలో సినిమా రావడం సందేహాల్ని పెంచుతోంది. ఆ మధ్య ‘పద్మావత్’ నుంచి ఇటీవలి ‘పఠాన్’ దాకా సినిమాలపై నిషేధపు డిమాండ్లు, కోర్టు కేసులు చూశాం. అప్పుడైనా ఇప్పుడైనా నిషేధాలు పరిష్కారం కావు. కానీ సెంటిమెంట్లను దెబ్బతీసి, ఉద్రి క్తత సృష్టించి, విద్వేషాన్ని పెంచే ప్రయత్నాలను తప్పక అడ్డుకోవాల్సిందే. శాంతిభద్రతలకు భంగం వాటిల్లినప్పుడు భావప్రకటన స్వేచ్ఛపై నిర్బంధాలు తప్పవని ఆర్టికల్ 19 (2) అనుమతిస్తోంది. శాంతిభద్రతలేమో కానీ, మనోఫలకంపై నిలిచి ఆలోచనల్లోకి ఇంకిపోయే భావోద్వేగాల ప్రభావమే అర్ధసత్య చిత్రాలతో అతి ప్రమాదం. బ్రిటిష్ వారి వద్దే మన్యం వీరుడు అల్లూరి పోలీసుగా పని చేశాడని భావితరాలు నమ్మేలా సినిమా తీసి, ఆస్కార్ల దాకా వెళ్ళిన మన కథలే అందుకు సాక్ష్యం. ‘కేరళ స్టోరీ’కీ కనీసం కల్పితపాత్రల కథనమని పేర్కొనమంటూ పిటిషనర్లు కోరిందీ అందుకే. సెకనుకు 24 ఫ్రేమ్ల చొప్పున తెరపై చూపే సత్యం సినిమా అనే సూక్తికి ‘కేరళ స్టోరీ’ లాంటివి నిలబడతాయా అన్నది సందేహమే! సామాన్య ప్రజలు తాము తెరపై చూసేదంతా సత్యమని భ్రమ పడితే, సమాజంలో పెచ్చరిల్లే విద్వేషాగ్నికి బాధ్యులెవరు? ‘కశ్మీర్ ఫైల్స్’తో దేశం ఆ చివరన మొద లైన అర్ధసత్య, అసత్య ప్రచార చిత్రాలు ఇప్పుడు ‘కేరళ స్టోరీ’తో ఈ చివరన కన్యాకుమారికి విస్తరించడం దేనికి సంకేతం? భావప్రకటన స్వేచ్ఛ ఓకే కానీ, నిజాన్ని వక్రీకరించి చూపడంపై గళమెత్తా ల్సిందే! ఈ రొచ్చుకు అడ్డుకట్ట ఏమిటో కనిపెట్టాల్సిందే! రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను వాడుకొనేందుకు పెరుగుతున్న ప్రాపగాండా ప్రయత్నాలను గమనించాలి. గత తొమ్మిదేళ్ళలో ఎన్నికల ముందే ఇలాంటి చిత్రాలు ఎందుకు, ఎవరి ప్రాపుతో వస్తున్నాయో ఆలోచించాలి. -
ఆ వివాహాలు నేరం కాదు.. అవసరం: వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహం నేరం కాదని ఆయన ట్వీట్ చేశారు. ఇది వారి హక్కు అంటూ తన మద్దతు ప్రకటించారు. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటివి సాధారణమైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా స్వలింగ వివాహంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వివేక్ తన ట్వీట్లో రాస్తూ.. 'స్వలింగ వివాహం అనేది 'అర్బన్ ఎలిటిస్ట్' అన్న భావన కరెక్ట్ కాదు. ఇది మానవ అవసరం. చిన్న పట్టణాలు, గ్రామాలలో ఎప్పుడూ ప్రయాణించని కొంతమంది వ్యక్తులే దీన్ని ప్రశ్నిస్తున్నారు. మొదట స్వలింగ వివాహం అనేది ఒక కాన్సెప్ట్ కాదు. అది ఒక అవసరం మాత్రమే. అలాగే ఇది ఒక హక్కు కూడా. భారతదేశం వంటి ప్రగతిశీల దేశంలో స్వలింగ వివాహం సాధారణమైన విషయమే. ఎలాంటి నేరం కాదు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. స్వలింగ వివాహం అనేది పట్టణ ఉన్నత వర్గాల భావన అని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇది దేశంలోని సామాజిక తత్వానికి దూరంగా ఉందని తెలిపింది. స్వలింగ వివాహాన్ని ప్రోత్సహించడం కొత్త సమస్యలు సృష్టిస్తుందని కేంద్రం పేర్కొంది. దీన్ని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించి ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: షూటింగ్లో ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు) NO. Same sex marriage is not an ‘urban elitist’ concept. It’s a human need. Maybe some sarkari elites drafted it who have never travelled in small towns & villages. Or Mumbai locals. First, same sex marriage is not a concept. It’s a need. It’s a right. And in a progressive,… https://t.co/M4S3o5InXI — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 18, 2023 -
రాహుల్ గాంధీపై డైరెక్టర్ సంచలన ట్వీట్.. అదే రుజువైందంటూ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్లో రాహుల్పై అనర్హత వేటుపై వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందో చూద్దాం. రాహుల్ గాంధీపై దాఖలైన పిటిషన్పై సూరత్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కోలార్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రెండేళ్ల జైలు శిక్షపడింది. ఈ నేపథ్యంలో లోక్సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోదీ ఇంటి పేరు ఉన్న వారందరూ దొంగలు అని రాహుల్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. తాజాగా వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తోంది. ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేస్తూ.. 'రాజకీయాల్లో అర్హత లేని నేత రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం అది అధికారికంగా రుజువైంది.' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతే కాకుండా గతంలో ఇందిరాగాంధీపై కూడా అనర్హత వేటు పడిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఆమె నిజాయితీ గల నేత కాబట్టి తిరిగి అగ్రనేతగా నిలదొక్కుకున్నారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. అయితే ఇందిరా గాంధీ కనక కశ్మీర్ను కాపాడి ఉంటే.. తాను కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసేవాడిని కాదు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. Rahul Gandhi was always unqualified. It’s just that now it’s been made official. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 27, 2023 When Indira Gandhi was disqualified at that time also Congressis had thrown tantrums. but she was a genuine leader so she bounced back. In the absence of any leader with mass base, what will congress do, is to be seen. — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 27, 2023 -
కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదం ఇంకా ముగిసిపోలేదు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం మరింత రాజుకుంటోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్కు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. తన జీవితమంతా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాతానని ఆయన చెప్పారు. కొంతమంది అబద్ధాలతో తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారని ప్రకాశ్ రాజ్ను ఉద్దేశించి మాట్లాడారు. అనుపమ్ ఖేర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ' కొందరు మనుషులు తమ స్థాయిని తగ్గట్లు మాట్లాడతారు. కొంతమంది మాత్రం తమ జీవితమంతా అబద్ధం చెబుతారు. మరికొందరు నిజాలే మాట్లాడతారు. నా జీవితమంతా నిజం మాట్లాడిన వారిలో నేనూ ఒకడిని. అబద్ధాలు చెబుతూ జీవించాలనుకోవడం అది వారి కోరిక.' అంటూ ప్రకాశ్ రాజ్కు గట్టిగా కౌంటరిచ్చారు. కాగా.. గతేడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ 1990లలో కశ్మీరీ హిందువుల వలసలను ఈ చిత్రంలో చూపించారు.వివేక్ అగ్నిహౌత్రి దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రంలో అనుపమ్ ప్రధాన పాత్రలో పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. -
కశ్మీరీ ఫైల్స్ సినిమా.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలుపై దుమారం
-
ప్రకాశ్ రాజ్ కామెంట్స్పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
విలక్షణ నటడు ప్రకాశ్ రాజ్ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ, ఆ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నహోత్రిపై చేసిన సంచలన కామెంట్స్ హాట్టాపిక్గా నిలిచాయి. ఇటీవ కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘కశ్మీర్ ఫైల్స్ ఓ చెత్త సినిమా అని, ఆ సినిమాపై ఇంటర్నేషనల జ్యూరీ ఉమ్మివేసిందంటూ వివాదాస్పదంగా స్పందించాడు. దీంతో ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. దీంతో తాజాగా ఆయన కామెంట్స్ కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ స్పందించాడు. చదవండి: బాలుని చూడటానికి వెళ్లలేదు.. నన్ను రావద్దన్నారు: పి సుశీల ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ను అంధకార్ రాజ్ అంటూ ప్రస్తావించాడు ఆయన. ఈ మేరకు వివేక్ అగ్ని హోత్రి ప్రకాశ్ రాజ్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఆయన ట్వీట్ చేస్తూ.. “జనాలు ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ అర్బన్ నక్సల్స్కు నిద్రలేకుండా చేసింది. అలాంటిది వీక్షకులను మొరిగే కుక్కలు.. అని పిలుస్తూ సినిమా రిలీజైన ఏడాది తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిస్టర్ ‘అంధకార్ రాజ’.. భాస్కర్ ఎప్పటికీ మీదే అయినప్పుడు నేనెలా పొందుతాను” అంటూ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. చదవండి: హీరో అవుదామని ఆశగా మద్రాస్ వెళితే హేళనగా మాట్లాడారు..మానసిక క్షోభకు గురయ్యా: మెగాస్టార్ ప్రస్తుతం వివేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఈవెంట్లో ప్రకాశ్ రాజ్ మాట్టాడుతూ.. పఠాన్ మూవీ ప్రశంసిస్తూ.. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. ది కశ్మీర్ ఫైల్స్ అనేది ఓ చెత్త సినిమా. దాన్ని సినిమా ఎవరు నిర్మించారో తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. A small, people’s film #TheKashmirFiles has given sleepless nights to #UrbanNaxals so much that one of their Pidi is troubled even after one year, calling its viewer’s barking dogs. And Mr. Andhkaar Raj, how can I get Bhaskar, she/he is all yours. Forever. pic.twitter.com/BbUMadCN8F — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 9, 2023 -
ఆ సినిమాపై ఉమ్మేసినా సిగ్గురాలేదు.. ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్
వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రకాశ్ రాజ్.. అప్పుడప్పుడు తన కాంట్రవర్సీ మాటలతో వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ పఠాన్ను ప్రశంసలతో మంచెత్తుతూ.. వివేక్ అగ్నిహోత్రి మూవీ ది కశ్మీర్ ఫైల్స్పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో ప్రకాశ్ రాజ్.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై విమర్శలు చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి కేవలం మొరగడానికే పనికొస్తారుగానీ.. కాటువేసే దమ్ము వీరికి లేదన్నారు. కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్లో ఆయన మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ' ది కశ్మీర్ ఫైల్స్ నాన్సెన్స్ చిత్రాల్లో ఒకటి. ఆ సినిమా ఎవరు నిర్మించారో మాకు తెలుసు. ఆయనకు ఎలాంటి సిగ్గులేదు. అంతర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు. వారు చేసేది కేవలం సౌండ్ పొల్యూషన్. బాలీవుడ్ బాయ్ కాట్ అన్నవారికి పఠాన్ 700 కోట్లు వసూలు రాబట్టింది. వాళ్లకు తెలిసింది కేవలం మొరగడమే. వారితో ఏం కాదు. ఎందుకంటే బయట చాలా సెన్సిటివ్ మీడియా ఉంది. అందుకే నేను చెప్తున్నా. నాకు తెలిసి ఇలాంటి మూవీలు చేయడానికే వాళ్లు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ప్రతిసారి కూడా ప్రజలను ఫూల్ చేయలేరు' అని అన్నారు. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ 2022లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటి. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం 1990లలో కాశ్మీరీ హిందువుల వలసలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు. “They needed to ban #Pathaan. It's going 700Cr. These idiots, who needed to #BanPathaan, didn’t run Modi’s movie for 30Cr. They’re simply barking, they do not chew. Don’t fret. Sound air pollution!” says Actor #PrakashRaj at #MBIFL2023 in #Kerala.#PathaanMovie #BoycottGang pic.twitter.com/CismuRxJ4k — Hate Detector 🔍 (@HateDetectors) February 6, 2023 -
షూటింగ్లో ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు
ది కశ్మీర్ ఫైల్స్ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషికి తీవ్ర గాయాలయ్యాయి. కార్ ఛేజింగ్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న 'వ్యాక్సిన్ వార్' సినిమా షూటింగ్లో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. -
ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా
ఆస్కార్ నామినేషన్స్లోకి మన సినిమా వెళ్తే ఆ కిక్కే వేరు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా కూడా ఆస్కార్ పోటీలోకి వచ్చింది. రెండు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుంది. కేవలం రూ. 16కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డులకు కాంతార క్వాలిఫై అయ్యింది.ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాంతార చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్కి అర్హత లభించింనందుకు సంతోషంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం కాంతార, ఆర్ఆర్ఆర్లతో పాటు ది కశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ కతియావాడి చిత్రాలు కూడా ఆస్కార్ రిమైండర్ రేసులో ఉన్నాయి. మార్చ్12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. మరి క్వాలిఫైకి అర్హత సాధించిన మన ఇండియన్ సినిమాల ఆస్కార్ కల తీరుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. BIG ANNOUNCEMENT: #TheKashmirFiles has been shortlisted for #Oscars2023 in the first list of @TheAcademy. It’s one of the 5 films from India. I wish all of them very best. A great year for Indian cinema. 🙏🙏🙏 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 10, 2023 We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms — Hombale Films (@hombalefilms) January 10, 2023 -
ఈ ఏడాది బాక్సాఫీస్ను బద్దలు కొట్టిన చిత్రాలివే..!
ఈ ఏడాది చిత్ర పరిశ్రమ కలిసొచ్చిందనే చెప్పాలి. 2022లో విడుదలైన పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ను బద్దలుకొట్టాయి. చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ జాబితాలో ది కశ్మీర్ ఫైల్స్, కాంతార ముందు వరుసలో ఉంటాయి. ఇక టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన చాలా చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించాయి. అలాగే వీటితో పాటు బాలీవుడ్ చిత్రాలు సైతం ఈ మార్క్ను చేరుకున్నాయి. ఈ ఏడాది వంద కోట్ల వసూళ్లు దాటిన సినిమాలేవో ఓసారి రివైండ్ చేసుకుందాం. ఈ ఏడాది వంద కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలివే.. టాలీవుడ్ చిత్రాలు: ఆర్ఆర్ఆర్, సర్కారువారిపాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, కార్తికేయ, గాడ్ఫాదర్ బాలీవుడ్ చిత్రాలు: ది కశ్మీర్ ఫైల్స్, బ్రహ్మస్త్ర, దృశ్యం-2, భూల్ భూలయ్యా-2, గంగూభాయ్ కతియావాడి, విక్రమ్ వేద, లాల్సింగ్ చద్దా, జగ్జగ్ జీయో తమిళ చిత్రాలు: పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, బీస్ట్, డాన్, తిరుచిత్రాంబలం, సర్దార్, వలిమై కన్నడ చిత్రాలు: కేజీఎఫ్-2, కాంతార, విక్రాంత్ రోణ, 777 ఛార్లీ, జేమ్స్ -
ది కశ్మీర్ ఫైల్స్కు ప్రతిష్ఠాత్మక అవార్డ్.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయం సాధించిన హిందీ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఇండియన్ టెలివిజన్ అకాడమీ-2022 అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం గోల్డెన్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ అవార్డును చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ అవార్డు ఉగ్రవాద బాధితులందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. This award for #TheKashmirFiles being honoured as the Golden Film of Indian cinema is dedicated to all the victims of religious terrorism. @TheITA_Official #KashmirHinduGenocide pic.twitter.com/Uc6RpREPbm — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 12, 2022 -
విమర్శను ఆహ్వానించే స్ఫూర్తి లేదా?
గోవా చలన చిత్రోత్సవం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తించబడాలని మనం కోరుకుంటున్నాం. అలా జరగాలంటే ఆ చిత్రోత్సవంలో ప్రద ర్శించే సినిమాలు అత్యున్నత కళాత్మక, సౌందర్యాత్మక నాణ్యతను కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి. అయినా ముతకగా, పరిణతి లేకుండా చిత్రించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ను ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? దాని ప్రతిభ కారణంగానేనా? లేదా అది మన ప్రభుత్వం మొగ్గుచూపే సైద్ధాంతిక దృక్పథాన్ని సమర్థిస్తోందనా? ఇలాంటి సినిమాను జ్యూరీకి చూపిస్తున్నప్పుడు వాళ్లు వేరేరకంగా వ్యవహరించాలని జ్యూరీని బలవంతపెడుతున్నట్టు అని జ్యూరీ అధ్యక్షుడు నదావ్ లపీద్ సరిగ్గానే చెప్పారు. కానీ ఈ ఇజ్రాయిల్ దర్శకుడి నిజాయితీతో కూడిన విమర్శను సహించే నైతిక స్ఫూర్తి మనకు లేకపోయింది. ఇప్పుడు కాస్త సమయం గడిచిపోయింది, అలాగే భావో ద్వేగాలు కూడా కాస్త చల్లబడి ఉంటాయి. అందుకే ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఇజ్రాయిల్ చిత్ర దర్శకుడు నదావ్ లపీద్ చేసిన విమర్శ చుట్టూ రేగిన ఆగ్రహా వేశాలపై నేను స్పందించాలనుకుంటున్నాను. అది కొంత ఇబ్బంది కలిగించే, చె΄్పాలంటే ఆందోళన కలి గించే మన సమాజ ముఖచిత్రాన్ని బయటపెట్టింది. ఇదే బహుశా మనం పిలుచుకునే జాతీయ స్వభావం. మొదటగా ఇలా ప్రారంభిద్దాం. ప్రపంచ ప్రఖ్యాత చిత్ర దర్శకుల్లో ఒకరిని, లొకార్నోలో ప్రత్యేక జ్యూరీ ప్రైజ్, బెర్లిన్లో గోల్డెన్ బేర్ను గెలుచుకున్న విజేతను మన అంతర్జాతీయ చలన చిత్రోత్సవ జ్యూరీకి అధ్యక్షత వహించడానికి ఆహ్వానించాం. కానీ ఒక భారతీయ సినిమాపై ఆయన చేసిన నిజాయితీతో కూడిన విమర్శను మనం అంగీకరించలేక ΄ోయాం. దానిపై లపీద్ ఇలా అన్నారు: ‘‘చెప్పాలంటే ఒకరకంగా అది నా కర్తవ్యం, నా విధి కూడా. నేను వ్యర్థ సంభాషణ చేయడం కాకుండా నిజాయితీగా ఉండటానికే ఇక్కడికి ఆహ్వానించారు.’’ ఆ దాపరికం లేని నిష్కల్మష ప్రవర్తన మనల్ని నివ్వెరపర్చి ఉండ వచ్చు, పైగా గాయపర్చి ఉండవచ్చు కూడా. కానీ ఆయన చేసిన విమ ర్శను సంతోషంగా ఆహ్వానించే శక్తి, నైతిక స్ఫూర్తి మనకు లేవు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే– లపీద్ చెప్పినదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడాన్నే మనం ఉద్దేశపూర్వకంగా ఎంచు కున్నాం. ఆ సినిమా మార్చి నెలలో విడుదలైనప్పుడు నేను కావాలనే చూడకూడదని భావించాను. కానీ ఈ వివాదం చెలరేగిన తర్వాత ఆ సినిమాను చూడాలనుకున్నాను. ఒక విషాద ఘటన పట్ల ఆలోచనా త్మకంగానూ, సున్నితంగానూ తీయవలసిన దానికి బదులుగా ఆ సినిమా ఒక ముతక చిత్రీకరణగా నాకు కనిపించింది. ఈ చిత్రాన్ని నడిపిన తీరులో సూక్ష్మత, గాఢత లోపించాయి. నటన ఏకపక్షంగా ఉంది. ఈ సినిమాలోని ఏ ఒక్క పాత్రపట్ల కూడా మనకు సహాను భూతి కలగదు. ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ సరిగ్గా ఆ విషయాన్నే వెల్లడించారు. కానీ ఆయన వ్యాఖ్యలను మనం ఉద్దేశ పూర్వకంగానే తప్పుగా వ్యాఖ్యానించుకున్నాం. వాటిని కశ్మీర్ పండిట్లకు జరిగిన ఘటనల పట్ల తిరస్కరణగానూ, చని΄ోయిన వారి స్మృతిని అవమానించడంగానూ అర్థం చేసుకున్నాం. ఒక్క క్షణకాలం పాటు మనం ఆలోచించడం కోసం ఆగినట్లయితే, ఆయన వ్యాఖ్యలను మనం ఎంత తప్పుగా భావిం చామో మనకు తెలిసేది. కానీ మనం అలా చేయలేక ΄ోయాం. ఒక అధమ స్థాయి సినిమాను సమర్థించుకునే మార్గం అదన్నమాట! ఒకసారి లపీద్ విమర్శ మన ఆత్మాభిమానాన్ని గాయపర్చాక, ఆయన విమర్శను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడానికి పూనుకున్నాం. పైగా అది మన జాతీయవాదంపై దాడిగానూ, ఇంకా చె΄్పాలంటే ఏకంగా మనపైనే చేసిన దాడిగానూ చూడటానికి పూనుకున్నాం. కానీ లపీద్ దీనిపై స్పష్టంగా ఆయన అభిప్రాయం వివరించారు: ‘‘ఒక సినిమాను విమర్శించడం అంటే భారతదేశాన్ని విమర్శించడం కాదు లేదా కశ్మీర్లో జరిగినదాన్ని విమర్శించడం అంతకంటే కాదు’’. నన్ను మరికాస్త ముందుకెళ్లి చెప్పనివ్వండి. గోవా చిత్రోత్సవం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తించబడాలని మనం కోరు కుంటున్నాం. అలా జరగాలంటే ఆ చిత్రోత్సవంలో ప్రదర్శించే సినిమాలు అత్యున్నత కళాత్మక, సౌందర్యాత్మక నాణ్యతను కలిగి ఉండేలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ చిత్రో త్సవంలో ప్రదర్శించడానికి ‘కశ్మీర్ ఫైల్స్’ను ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? దాని ప్రతిభ కారణంగానేనా? లేదా అది మన ప్రభుత్వం మొగ్గుచూపే సైద్ధాంతిక దృక్పథాన్ని సమర్థిస్తోందనా? విస్మరణకు గురైన ఒక విషాదం వైపు ప్రపంచానికి కిటికీ తెరవడానికి– ముతకగానూ, పరిణతి లేకుండానూ చిత్రించినది; ఇది మన చిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యుత్తమ సినిమా కాదు అనే వాస్తవాన్ని కూడా విస్మరించారా? నదావ్ లపీద్ దాన్ని ఇలా చూశారు: ‘‘ద కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు చిత్రోత్సవాల్లో ΄ోటీ విభా గంలో భాగం కాకూడదు. డజన్లకొద్దీ చిత్రోత్సవాల్లో నేను జ్యూరీలో భాగమయ్యాను. బెర్లిన్, కాన్, లొకార్నో, వెనిస్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా నేను ΄ాలు పంచుకున్నాను. ఏ చిత్రోత్సవంలోనూ కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాను నేను చూడలేదు. మీరు ఇలాంటి సినిమాను జ్యూరీకి చూపిస్తున్నప్పుడు వేరే రకంగా వ్యవహరించాలని జ్యూరీని బలవంత పెడు తున్నట్టు.’’ ఇదేమీ ఒప్పుకోలేని వాదన కాదు కదా! చివరగా, మీడియా గురించి నన్ను చెప్పనివ్వండి. అది మనకోసం మాట్లాడుతున్నట్లు ప్రకటించు కుంటుంది. తాను ప్రజావాణిని అని మీడియా నమ్ముతుంటుంది. కానీ ఈ సినిమాను సమర్థించడానికి అది చేస్తున్న ప్రయత్నాలు మాత్రం తెలివిలేనివి, పైగా అసమర్థమైనవి కూడా! ఈ సినిమా గురించి తనకు కలిగిన అభిప్రాయాలనే జ్యూరీ సభ్యులు కూడా పంచుకున్నారని లపీద్ చెప్పినప్పుడు దాన్ని నిరూపించాలని టెలివిజన్ యాంకర్లు సవాలు చేశారు. ఓ రకంగా ఇది ఆయన అబద్ధ మాడుతున్నాడని సూచించే వెర్రి ప్రయత్నం మాత్రమే అవుతుంది. పైగా, లపీద్కు తమ మద్దతును బహిరంగంగా నిర్ధారించేలా అది ఇతర జ్యూరీ సభ్యులను రెచ్చగొట్టింది. మరోవైపున, ఒక వార్తాపత్రిక ఏకంగా అబద్ధమాడింది. లపీద్ తన మనస్సు మార్చుకున్నారనీ, ఆ సినిమా మేధోవంతంగా ఉందనీ చె΄్పారని ఆ పత్రిక నివేదించింది. నిజానికి ఆయన తన మనస్సు మార్చుకోలేదు. ఆయన అలా చేస్తాడ నుకోవడం కూడా బుద్ధిహీనతే అనాలి. సాధారణమైన ఆలోచనతో దీన్ని ముగిస్తాను. ఫిల్మోత్సవ్ అవార్డు కార్యక్రమంలో ఒక నిర్దిష్ట సినిమాను విమర్శించే హక్కు లపీద్కు›ఉందా లేదా అనేది న్యాయమైన ప్రశ్న. ఇది చాలా చిన్న విషయం కూడా. దీనికంటే మన ప్రవర్తనే మరింత పెద్ద సమస్యగా ఉంటోంది. చిత్రోత్సవం కోసం మనం ఎంపిక చేసుకున్న సినిమా, దానికి లభించిన విమర్శకు మనం స్పందించిన తీరు మనల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. కాబట్టి ఇది ఒక విషాదకరమైన, బాధాకరమైన గాథ! కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కళకూ ప్రచారానికీ మధ్య...
భావాలను వ్యాప్తి చేయడంలో, ప్రజలను చైతన్య పర్చడంలో రచనల స్థానాన్ని సినిమా దురాక్రమించిందని రాశారు జాకబ్ డ్రకెర్. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించడానికి లేదా చారిత్రక దృక్పథాన్ని వక్రమార్గం పట్టించడానికి కూడా సినిమా సాధనంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో చూస్తే ‘ద కశ్మీర్ ఫైల్స్’ మీద ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ వ్యాఖ్యలు మరింత బాగా అర్థమవుతాయి. అంతర్జాతీయ ఘటనలపై తమ దృక్పథాన్ని వివరిస్తూ అన్ని దేశాలూ సినిమాలు తీస్తుంటాయి. అయితే ప్రచారం నుంచి కళను వేరు చేసే; రెచ్చగొట్టే మెజారిటీ వాదం నుంచి ఉదారవాద ప్రజాస్వామ్య విలువలను వేరు చేసే విభజన రేఖ తప్పకుండా ఉండాలి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఆ రేఖను ఉల్లంఘించింది. గోవాలో ఇటీవల ముగిసిన 53వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవంలో జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ ‘ద కశ్మీర్ ఫైల్స్’పై చేసిన అవమానకర వ్యాఖ్యలు ఇప్పటికీ దేశంలో ప్రతి ధ్వనిస్తూనే ఉన్నాయి. వివాదం రేగిన తర్వాత ఆయన క్షమాపణను ‘ఎన్డీటీవీ’ పతాక వార్తగా ప్రసారం చేయగా, మరోవైపున ‘ద వైర్’ కోసం నదావ్ లపీద్ ఇంటర్వ్యూ చేసిన పాత్రికేయుడు కరణ్ థాపర్ ఆ వార్తను ఖండించారు. తన వ్యాఖ్యను వెనక్కు తీసుకోవడానికి లేదా విరమించుకోవడానికి తిరస్కరించిన ఇజ్రాయిల్ దర్శకుడు ఆ ఇంటర్వ్యూలో తానెందుకలా అనవలసి వచ్చిందో స్పష్టం చేశారు. ‘‘అది నా కర్తవ్యం, నా విధి కూడా. వ్యర్థ ప్రసంగం చేయకుండా నిజా యితీగా ఉండటానికి నన్ను జ్యూరీకి ఆహ్వానించారు.’’ అయితే భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నష్టనివారణకు ప్రయత్నించారు. కశ్మీర్ పండిట్లు కశ్మీర్లోని తమ నివాసాలను బలవంతంగా వదిలివేయ వలసి వచ్చిన అంశంపై దృక్పథానికి సంబంధించినంత వరకూ, ఈ సినిమా బీజేపీకి ఒక పాక్షిక అధికారిక స్వరంగా ఉపయోగపడిందని ఇజ్రాయిల్ రాయబారి గుర్తించారు కనుకే తమ దేశస్థుడైన దర్శకుడి వ్యాఖ్యలను ఖండించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాను చిత్రోత్సవంలో వీక్షించిన జ్యురీ సభ్యు లను అది ఇబ్బంది పెట్టిందనీ, షాక్కు గురిచేసిందనీ నదావ్ లపీద్ పేర్కొన్నారు. ఈ చిత్రం అసభ్యకరంగా ఉందనీ, వట్టి ప్రచార సినిమాలా ఉందనీ అన్నారు. కశ్మీర్ ఫైల్స్ చిత్ర రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఒక సున్నితమైన విషయాన్ని మలిచిన విధానంపై లపీద్ చేసిన వ్యాఖ్యలు అసలు జరిగిన విషాదం వెనుక వాస్తవాలకు సంబంధించి గందరగోళాన్ని రేకెత్తించాయి. రాజీవ్ గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన కాలంలో – 1990ల మొదట్లో గవర్నర్ జగ్మోహన్ జమ్మూ కశ్మీర్ పాలనలో భాగమ య్యారు. అది కశ్మీర్ నుంచి ఉన్నట్లుండి హిందూ వలసలు ప్రారంభ మైన కాలం. శతాబ్దాలుగా తమతో కలిసి మెలిసి జీవిస్తున్న ఇరుగు పొరుగు హిందువులతో సంబంధాలను తెంచుకోవాలని మిలిటెంట్లు ముస్లిం మెజారిటీని ఒత్తిడికి గురిచేశారు. కశ్మీర్ నుంచి వలసల వెల్లువ మొదలైన ఇతివృత్తంతో తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీ కల్పించాయి. ఆ రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు థియేటర్లలో సినిమా విడుదల కాకముందే ప్రశంసలు గుప్పిం చడం, ప్రజలను విభజించే అభిప్రాయాలు వెల్లడించడం మొదలు పెట్టారు. సుప్రసిద్ధ ‘టైమ్ మ్యాగజైన్’ ఒక విశేష కథనాన్ని ప్రచురిస్తూ– ‘ద కశ్మీర్ ఫైల్స్: బాలీవుడ్ కొత్త సినిమా భారత్ని మరింతగా మత దురభిమానంలోకి ఎలా నెడుతోంది?’ అనే శీర్షిక పెట్టింది. ‘న్యూయార్క్ టైమ్స్’ సైతం ‘కశ్మీర్ హిందువుల బహిష్కరణపై వచ్చిన సినిమా భారత్ను వేరుచేస్తూ ప్రజాదరణ పొందుతోందా?’ అనే శీర్షికతో తన ఆలోచనలను ప్రతిధ్వనించింది. ఇక సింగపూర్ అయితే రెచ్చగొట్టేలా ముస్లింల గురించి ఏకపక్షంగా చిత్రించిందని పేర్కొంటూ సినిమా విడుదలపై నిషేధం విధించింది. వివిధ మతాల మధ్య ఇది శత్రుత్వాన్ని ప్రేరేపించేలా ఉందని పేర్కొంది. ఇదే ప్రాతిపదికన భారతదేశంలో అనేక చోట్ల ఎఫ్ఐఆర్లు నమోద య్యాయి. ఈ సినిమా ప్రకటించే భావాలు స్వల్ప స్థాయిలో అయినా సరే దాడులకు ప్రేరేపించే అవకాశమిస్తున్నప్పుడు, బీజేపీ, దాని భక్తులు దీన్ని ఎందుకు పనిగట్టుకుని ప్రోత్సహించినట్లు? కాబట్టి ఇప్పుడు ఈ సినిమాపై ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ వ్యాఖ్యల్లో కొత్త విషయమూ లేదు, ఆశ్చర్యం కలిగించేదీ లేదు. అలాంటప్పుడు దీంట్లో సమస్య ఏంటి? చర్చ పాతదే. సాహిత్యం లేదా సినిమా ప్రజలకు వినోదం కలిగించాలా, చైతన్యం కలిగించాలా లేదా ఒకే సమయంలో రెండింటికీ అవకాశం కల్పించాలా? ‘ద హార్వర్డ్ క్రిమ్సన్’ పుస్తకంలో జాకబ్ ఆర్ డ్రకెర్... భావాలను వ్యాప్తి చేసే, ప్రజలను చైతన్య పర్చే రచనల స్థానాన్ని సినిమా దురాక్రమించిందని రాశారు. కాబట్టి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించడానికి లేదా చారిత్రక దృక్పథాన్ని వక్రమార్గం పట్టించడానికి కూడా సినిమాలు సాధనంగా మారవచ్చు. ఈ కోణంలో చూస్తే చారిత్రక దిద్దుబాటు పట్ల బీజేపీ జాగ్రత్తగా ఉన్నట్టు కనిపించదు. ‘టైటానిక్’ మునకను మరోసారి గుర్తు చేయడానికి లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ నటించిన లాంటి మానవ జ్ఞాపకాన్ని తిరిగి మల్చగలిగిన చిత్రాల ఉదాహరణలు మనకు అనేకం ఉన్నాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన ‘లింకన్’ లేదా కెనడీపై అలివర్ స్టోన్ తీసిన ‘జేకేఎఫ్’ వంటివి వీక్షకుల దృష్టికోణంలోంచి గతంలోని చారిత్రక ఘటనలు, వ్యక్తులను సినిమా రూపంలో మలిచినవి. విషాదకరమైన ఉపద్రవాలతో కూడిన ఘటనలను ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు వాటి చిత్రీకరణ నిజంగానే సవాలు విసురుతుంది. ప్రత్యేకించి వీక్షకులు అలాంటి ఘటనలకు మరీ దూరమైన కాలంలో లేనప్పుడు, వాటిపట్ల నిర్మమకారంతో తమ అభిప్రాయాలు పంచు కోలేనప్పుడు ఇది మరింత సవాలుగా ఉంటుంది. అందుకే, కశ్మీర్ ఫైల్స్ సినిమాను విడుదల చేసి ఉండకూడదని శరద్ పవార్ వంటి సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. ఎందుకు చేయకూడదని చాలా మంది ప్రశ్నిస్తారు. దీనికి సమాధానంగా కౌంటర్ ప్రశ్నను సంధిం చాల్సిన అవసరం ఉంది. గోధ్రా అల్లర్లు లేదా బాబ్రీ మసీదు విధ్వంసం వంటి ఘటనలపై అన్ని కోణాల్లో సత్యాన్ని చిత్రించే సినిమా తీసినట్లయితే దాని విడుదలకు బీజేపీ అనుమతిస్తుందా? అంతర్జాతీయ ఘటనలపై తమ దృక్పథాన్ని, లేదా ప్రపంచంలో తమ పాత్ర గురించి వివరిస్తూ అన్ని దేశాలూ సినిమాలు తీస్తుంటా యన్నది నిజం. 1968లో వియత్నాం యుద్ధంపై అమెరికాలో యుద్ధ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్న కాలంలో, నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ‘ద గ్రీన్ బెరెట్స్’ సినిమాను జాన్ వేయిన్ తీశారు. అమెరికా అసాధారణ వాదం నుంచి, అంతర్జాతీయ సుస్థిరతకు హామీ ఇవ్వడానికి, ప్రపంచ ఆధిపత్య శక్తిగా స్వీయ ప్రకటిత పాత్ర పోషించే నేపథ్యంలోంచి అనేక సూపర్ హీరో సినిమాలు వెల్లువెత్తాయి. అయితే ప్రచారం నుంచి కళను వేరు చేసే, రెచ్చగొట్టే మెజారిటీ వాదం నుంచి ఉదారవాద ప్రజాస్వామ్య విలువలను వేరు చేసే విభజన రేఖ తప్పకుండా ఉంటుంది. ఈ లక్ష్మణ రేఖను ‘ద కశ్మీర్ ఫైల్స్’ స్పష్టంగా మీరింది. ఇజ్రాయిల్ దర్శకుడు నదావ్ లపీద్ ఒక మూడో ప్రపంచ దేశాన్ని అవమానపర్చడంలో భాగంగా ఈ ‘ఈకలు పీకలేదు’. ఇదే రకమైన విమర్శలను ఆయన తన స్వదేశంలో కూడా చేశారు. వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయిల్ సెటిలర్లకు విరాళాలను పొడిగించడానికి లేదా వారి ఆక్రమణను సమర్థించే చిత్రాలను ప్రోత్సహిస్తున్న షోమ్రోన్ ఫిల్మ్ ఫండ్ను ఖండించడానికి ఆయన 250 మంది ఇజ్రాయిలీ ఫిలింమేకర్స్తో చేతులు కలిపారు. ఘటనల యధార్థాన్ని ప్రశ్నించ కుండానే కశ్మీర్ ఫైల్స్ చిత్రించిన తరహా విషాదాన్ని విమర్శించవచ్చని లపీద్ అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ నోరు విప్పి మాట్లాడటానికి భయపడుతున్న చోట నివసించడానికి ఎవరైనా ఇష్టపడతారా అని ఆయన ప్రశ్నించారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వ సామర్థ్యాలు లేదా సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలోని ఉన్మాద ప్రకటనలు లేక ప్రభుత్వ ప్రతినిధి వెర్రి చేష్టల కంటే మనం చూడాల్సిన నిజమైన సమస్య ఇదే మరి. నిజాలను నిర్ధారించడానికీ, లేదా ప్రభుత్వం నిర్దేశిస్తున్న వాస్తవికతను ప్రశ్నించడానికీ భారతదేశంలో ఇప్పటికీ చోటుందా? కేసీ సింగ్ వ్యాసకర్త మాజీ కార్యదర్శి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
గూగుల్ సెర్చ్లో ఆ సినిమానే టాప్.. ఆర్ఆర్ఆర్ ఎక్కడంటే?
బాలీవుడ్ జంట అలియా భట్, రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మస్త్ర-పార్ట్ 1'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజువల్ వండర్గా ఈ సినిమా పలు రికార్డులు సాధించింది. అయితే ఈ ఏడాది అత్యధికంగా గూగుల్లో వెతికిన చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్- 2, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారను వెనక్కినెట్టి 2022లో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022'ని ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న జాబితాను ప్రకటించింది. అధిక బడ్జెట్తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ జాబితాలో రెండోస్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్ గతేడాది విడుదలైనప్పటికీ 2022లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. -
చిత్రమా? ప్రచార విచిత్రమా?
ఉరుము లేని పిడుగు! గోవాలో 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) ముగింపు వేడుకల వేదికపై అవార్డ్ జ్యూరీ ఛైర్మన్ – ఇజ్రాయిలీ దర్శకుడు నదవ్ లపిద్ అందరి ముందూ చేసిన వ్యాఖ్య అలాంటిదే! ఇఫీలోని అంతర్జాతీయ పోటీ విభాగంలో ఇతర దేశాల చిత్రాలతో పాటు భారత్ నుంచి ఒక ఎంట్రీ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసిన ఆయన దాన్ని ‘అసభ్య ప్రచార చిత్రం. ఈ ఉత్సవంలో ప్రదర్శనకు తగదు’ అన్నారు. ఈ హఠాత్ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని హతాశులను చేస్తే, మరో వర్గంలో హర్షం నింపాయి. అతిథిగా పిలిచి, అవార్డుల జ్యూరీ పెత్తనమిస్తే ఇంత మాట అంటారా? కశ్మీర్లోని మైనారిటీ హిందువుల బాధల్ని తొలిసారి ఇంతగా తెరపై చూపిస్తే, సినిమా బాలేదనడమేమిటి? ఆస్కార్లు వచ్చిన స్పీల్బర్గ్ ‘షిండ్లర్స్ లిస్ట్’ మాటేమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు చర్చ రేపుతున్నాయి. 1990ల నుంచి ఇప్పటికీ ఆగని కశ్మీరీ పండిట్ల విషాదగాథ కట్టెదుటి నిజం. ఎవరూ కాదనలేని సత్యం. అయితే, ఆ సత్యాన్ని ఏ రకంగా తెరపై చూపారన్నదే వివాదం. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ఈ 170 నిమిషాల చిత్రం వాణిజ్య విజయం అందుకుంది. అంతే వివాదాస్పదమూ అయింది. 1990ల కాలఘట్టాన్ని మనసును కదిలించేలా తెరపై చూపారనే ప్రశంసతో పాటు పలు వాస్తవాలను తమకు అనుకూలమైన మేరకే చూపి, మతోద్వేగాన్ని రెచ్చగొట్టారనే విమర్శలూ వెల్లువెత్తాయి. మోదీ, అమిత్ షా తదితర పాలకవర్గ అగ్రనేతలు స్వయంగా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు, నేతాగణం వినోదపు పన్ను మినహాయింపు నుంచి ఉచితంగా టికెట్ల పంపిణీ దాకా ఈ చిత్రాన్ని పూర్తిగా భుజానికెత్తుకున్నాయి. అలా సహజంగానే ఈ సినిమాకు రాజకీయ రంగు, విభజన – విద్వేషవాదమనే పొంగు వచ్చాయి. ‘సెకనుకు 24 ఫ్రేముల చొప్పున చెప్పే సత్యం సినిమా’ అన్నారు దర్శక దిగ్గజం గొడార్డ్. కానీ, ఇవాళ విప్లవ వీరుడు అల్లూరి సైతం బ్రిటీషు వారి దగ్గర పనిచేసినట్టు సినిమాటిక్ కల్పనతో ఆస్కార్ గురిగా మన చిత్రాలు బరిలోకి దిగుతున్నప్పుడు సినిమా ఎంత సత్యమనే సందేహం కలుగుతుంది. స్వప్నలోక విహారంగా మారిన నేటి సినిమాలో సైతం కళ్ళెదుటి జీవితానికి కల్పన చేర్చి కదిలించేలా చెబితే చాలు. విలువలెలా ఉన్నా వసూళ్ళవర్షం కురుస్తుంది. అది బాక్సాఫీస్ నిరూపిత సత్యం. వ్యాపారంలో అది ఓకేనేమో కానీ, కళాత్మక విలువలెన్నో చూసి కిరీటం పెట్టాల్సిన అవార్డ్స్కు అది పనికొస్తుందా? ఇఫీలో అంతర్జాతీయ చిత్రాలతో పోటీకి మనోళ్ళు దింపిన ‘కశ్మీర్ ఫైల్స్’తో సమస్య ఇదే. కశ్మీర్పై కన్నీరుపెట్టేవారూ కథనంలో నిజాయతీపై భిన్నాభిప్రాయంతో ఉంటే తప్పు పట్టలేం. కరోనా తర్వాత రూ. 330 కోట్లు సంపాదించి, ఈ ఏటి మేటి బాలీవుడ్ హిట్గా నిలిచిన ‘కశ్మీర్ ఫైల్స్’ ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. లాల్బహదూర్ మరణం మిస్టరీపై ‘తాష్కెంట్ ఫైల్స్’ తీసి, పెద్దగా ఆకర్షించలేని దర్శక– రచయిత వివేక్ అగ్నిహోత్రి దీనికి మాత్రం సీక్వెల్ తీస్తానని ప్రకటించారు. ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రేరణగా అదే తరహాలో అనేకులు రకరకాల ‘ఫైల్స్’తో వెండితెర వ్యాపారం మొదలెట్టారు. ఈ పరిస్థితుల్లో ‘ఇఫీ’ జ్యూరీ ఛైర్మన్∙వ్యాఖ్య దౌత్యపరంగానూ కలకలం రేపింది. ఇజ్రాయిల్ రాయబారి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తోటి ఇజ్రాయిలీ వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. భారత ఆతిథ్యాన్ని దుర్వినియోగం చేసినందుకు క్షమాపణ కోరాలంటూ బహిరంగ లేఖ రాశారు. ‘భారత్కు వచ్చి వెళ్ళిపోతున్న నీకేం! ఇక్కడే ఉండాల్సినవాళ్ళ పరిస్థితి ఏమి’టంటూ మందలిస్తూనే, మనసులోని భయం బయటపెట్టారు. నిజానికి, నదవ్కు ఇలాంటివి కొత్తేమీకాదు. కాన్, బెర్లిన్ లాంటి ప్రఖ్యాత చిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యుడిగా అనుభవం, ఘాటుగా మాట్లాడతాడనే ముద్ర ఆయనకున్నాయి. ఆ నిష్కర్ష వైఖరి వల్లే ఇఫీకి పిలిచి, జ్యూరీ బాధ్యతలిచ్చారనుకోవచ్చు. అయితే, ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసే దేశంలో, ప్రభుత్వం వారి ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవంలో, పాలకపక్ష అండదండలున్న కళాకృషిని విమర్శించడం జీర్ణించుకోవడం కష్టమే. అలాగే, గెల్చిన చిత్రాలను ప్రస్తావించే వేదికపై అవార్డ్ రాని ఎంట్రీపై వ్యాఖ్యలు చేయడమూ విచిత్రమే. అంత మాత్రానికే సినిమాను విమర్శించిన వారందరినీ అర్బన్ నక్సల్స్, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తుకడే గ్యాంగ్ అనేయచ్చా? నదవ్ పండిట్లకు మద్దతునిస్తూనే, ‘హింసాద్వేషాల్ని ప్రేరేపించేలా మసిపూసి మారేడుకాయలా ఆ చిత్రం తీశారు. ఫాసిస్ట్ కోణం ఉంద’ని వివరణనిచ్చారు. ఇది తనొక్కరి అభిప్రాయం కాదనీ, బయట పెదవి విప్పకున్నా సినిమా చూడగానే జ్యూరీ మొత్తం ఇదే అభిప్రాయపడిందనీ తేల్చారు. సిన్మా సహా ఏ కళాకృషీ విమర్శకు అతీతం కాదు. ఆత్మాశ్రయమే అయినా అవార్డ్ నిర్ణేతల పని అదే! విధాన నిర్ణయాలతో బాధితులకు సాంత్వన చేకూర్చాల్సినవారు అది గాలి కొదిలి, ప్రచార కళతో వెండితెర వెనక దాగుందామనుకుంటేనే దారుణం. గత ఎనిమిదేళ్ళలో పాలకులు ఎందరు పండిట్లకు కశ్మీర్లో పునరావాసం కల్పించగలిగారు? మిగిలిన కొద్ది కుటుంబాలు నేటికీ తూటాలకు బలవుతుంటే ఏ మేరకు రక్షణ కల్పించారు? వీటిని వదిలేసి, నిర్దిష్ట రాజకీయ లక్ష్యాలతో తీసిన వ్యాపారాత్మక చిత్రం బాగోగులపై ఎవరో, ఏదో అన్నారని విరుచుకుపడితే ఉపయోగమేంటి? బాధిత కశ్మీరీలకు కావాల్సింది పెదాల మీది ప్రేమ కాదు... పాలకుల చేతల్లో చేవ. సినిమాలు అందుకు ప్రేరేపిస్తే మంచిదే. వెనకుండి నడిపే రాజకీయుల కోసం విద్వేషాలకు ఆజ్యం పోసి, విభజన పెంచితేనే కష్టం. తాజా ఘటనతో ‘ఇఫీ’ జ్యూరీలను సజాతీయులతో నింపేస్తే మరీ నష్టం! -
కశ్మీర్ ఫైల్స్పై... మాటలు.. మంటలు
ముంబై: విడుదలైనప్పుడే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇఫీ ఉదంతం పుణ్యమా అని మరోసారి దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. అదో చెత్త సినిమా అంటూ సోమవారం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు వేడుకల్లో ఇజ్రాయెల్కు చెందిన జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చకు తెర తీసింది. నదవ్ వ్యాఖ్యలను భారత్లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. ‘‘అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. ఇఫీ జడ్జీల ప్యానల్కు సారథ్య స్థానంలో కూచోబెట్టిన ఆతిథ్య దేశాన్ని నదవ్ తన వ్యాఖ్యలతో దారుణంగా అవమానించారు’’ అంటూ మంగళవారం బహిరంగ లేఖలో దుయ్యబట్టారు. ‘‘హిట్లర్ సారథ్యంలోని నాజీల చేతుల్లో లక్షలాది మంది యూదులు హోలోకాస్ట్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిస్సహాయంగా ఊచకోతకు గురయ్యారు. అదృష్టం కొద్దీ ఆ మారణహోమం నుంచి తప్పించుకున్న వారి వారసున్ని నేను. నీ వ్యాఖ్యలనే గీటురాయిగా తీసుకునే పక్షంలో హోలోకాస్ట్ దారుణాలపై హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ కూడా చెత్త సినిమాయేనా అని భారతీయులు ప్రశ్నిస్తుంటే నా మనసెంతో గాయపడుతోంది. కశ్మీర్ ఫైల్స్పై నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వాటిని నువ్వు ఏ విధంగానూ సమర్థించుకోలేవు’’ అంటూ తూర్పారబట్టారు. నదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్ల మండిపాటు బీజేపీతో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నదవ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘‘భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఉగ్రవాదుల వాదనకు మద్దతిచ్చేందుకు వాడుకున్న తీరు ఆశ్చర్యకరం. కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసం తీసిందని, అందులో ఒక్క సీన్ గానీ, డైలాగ్ గానీ అవాస్తవమని నిరూపించినా ఇకపై సినిమాలే తీయను. నదవ్తో పాటు ప్రపంచ మేధావులకు, అర్బన్ నక్సల్స్కు ఇది నా సవాలు’’ అని అగ్నిహోత్రి అన్నారు. నవద్ను తక్షణం భారత్ నుంచి పంపించేయాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ కాన్సులర్ జనరల్ కొబ్బీ షొషానీ కూడా నదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. -
Kashmir Files: 'కశ్మీర్ ఫైల్స్ తర్వాతే అక్కడ హత్యలు బాగా పెరిగాయ్'
ముంబై: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్ నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందించారు. నడవ్ లాపిడ్కే మద్దతుగా నిలిచారు. ది కశ్మీర్ ఫైల్స్ దురుద్దేశంతో తీసిన సినిమా అనడంలో వాస్తవం ఉందని రౌత్ పేర్కొన్నారు. ఈ సినిమాలో కావాలనే ఒక వర్గం వారిని తప్పుగా చూపించారని చెప్పారు. దీని పబ్లిసిటీలో ఒక పార్టీ, ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యాకే జమ్ముకశ్మీర్లో హత్యలు విపరీతంగా పెరిగాయని రౌత్ చెప్పుకొచ్చారు. 'కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్న వారు అప్పుడేమయ్యారు. కశ్మీరీ పండిట్ల పిల్లలు ఆందోళనలు చేసినప్పుడు వీళ్లు ఎక్కడున్నారు. వాళ్ల కోసం ఎవరూ ముందుకు రాలేదు. కశ్మీర్ పైల్స్ 2.0 తీయాలనుకుంటే అది కూడా పూర్తి చేయండి' అని రౌత్ వ్యాఖ్యానించారు. గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని' ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ అసభ్యంగా ఉందని, ప్రచారం కోసమే ఈ సినిమా తీశారని విమర్శలు గుప్పించాడు. అసలు దీన్ని ఈ వేడుకలో ఎలా ప్రదర్శించారో అర్థం కావడం లేదన్నారు. ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించిన 15 చిత్రాల్లో 14 బాగున్నాయని, ది కశ్మీర్ ఫైల్స్ మాత్రమే చెత్తగా ఉందన్నారు. నడవ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. కశ్మీర్ పండిట్ల బాధ పట్ల ఆయనకు విచారం లేదని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం నడవ్ వాఖ్యల్లో వాస్తవం కూడా ఉందని మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ -
కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు
-
‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్
గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించడపై జ్యూరీ అధినేత ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అతడి కామెంట్స్పై పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రెటీల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీరీ పండిట్ల బాధల పట్ల ఆయనకు ఎలాంటి విచారం లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘గుడ్ మార్నింగ్.. నిజాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి వ్యక్తుల చేత అబద్ధాలు చెప్పిస్తుంది’ అంటూ తనదైన శైలిలో నడవ్ లాపిడ్ చురక అట్టించారు. చదవండి: హీరోల క్యారవాన్ కల్చర్పై దిల్రాజు షాకింగ్ కామెంట్స్ అంతేకాదు తన ట్వీట్కి క్రియేటివ్ కాన్షియస్నెస్(#CreativeConsciousness) అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. కాగా నడవ్ లాపిడ్ వ్యాఖ్యలపై ఇప్పటికే నటుడు అనుపమ్ ఖేర్ స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నాడు యూదులపై నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. GM. Truth is the most dangerous thing. It can make people lie. #CreativeConsciousness — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 29, 2022 ‘कश्मीर फ़ाइल्स’ का सच कुछ लोगो के गले में एक काँटे की तरह अटक गया है।वो ना उसे निगल पा रहे है ना उगल! इस सच को झूठा साबित करने के लिए उनकी आत्मा,जो मर चुकी है, बुरी तरह से छटपटा रही है।पर हमारी ये फ़िल्म अब एक आंदोलन है फ़िल्म नहीं।तुच्छ #Toolkit गैंग वाले लाख कोशिश करते रहें।🙏 pic.twitter.com/ysKwCraejt — Anupam Kher (@AnupamPKher) November 29, 2022 -
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ‘అదో చెత్త సినిమా’
పణజీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్ ఫైల్స్ చూసి మేమంతా షాకయ్యాం. చాలా డిస్టర్బయ్యాం. ఫక్తు ప్రచారం కోసం తీసిన చెత్త సినిమా అది’’ అంటూ సోమవారం ముగింపు వేడుకల సందర్భంగా వేదికపైనే కడిగి పారేశారు. అసలా సినిమాను ఇఫీ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శనకు ఎలా అనుమతించారంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరుల సమక్షంలోనే నిర్వాహకులను నిలదీశారు. ‘‘ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 చాలా బావున్నాయి. కానీ 15వ సినిమా కశ్మీర్ ఫైల్స్ చూసి అక్షరాలా షాకయ్యాం. కళాత్మక స్పర్థకు వేదిక కావాల్సిన ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అలాంటి చౌకబారు సినిమాను ప్రదర్శించడం అస్సలు సరికాదు. అందుకే నా అభ్యంతరాలను, అభిప్రాయాలను వేదికపై ఉన్న అందరి ముందే వ్యక్తం చేస్తున్నా’’ అన్నారు. 1990ల్లో కశ్మీర్ హిందూ పండిట్ల మూకుమ్మడి హత్యాకాండ, ఫలితంగా లోయనుంచి వారి భారీ వలసలు నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన కశ్మీర్ ఫైల్స్ ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో నిలిచింది. అయితే పలు వివాదాలకూ ఇది కేంద్ర బిందువుగా నిలిచింది. వాస్తవాలను వక్రీకరించారంటూ సినిమాపై విమర్శలు వెల్లువెత్తాయి. లపిడ్ ఇజ్రాయెల్కు చెందిన సినీ దర్శకుడు. పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినీ అవార్డుల గ్రహీత. కేన్స్ వంటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో జ్యూరీ సభ్యునిగా చేశారు. -
‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సంచలన మూవీ, టైటిల్, ఫస్ట్లుక్ అవుట్
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన హిందీ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్లు వసూళు చేసి రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీతో ఒక్కసారిగా సంచలనంగా మారిన ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ మరో యథార్థ సంఘటనతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ టీం రెడీ అయింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దీనికి సంబంధించిన ప్రకటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను ట్విటర్ వేదికగా రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు ‘ది వ్యాక్సిన్ వార్’ అని టైటిల్ను ఖారారు చేసి ఈ సినిమా దాదాపు 11 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించాడు. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పోస్ట్కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ANNOUNCEMENT: Presenting ‘THE VACCINE WAR’ - an incredible true story of a war that you didn’t know India fought. And won with its science, courage & great Indian values. It will release on Independence Day, 2023. In 11 languages. Please bless us.#TheVaccineWar pic.twitter.com/T4MGQwKBMg — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 10, 2022 -
గ్రామాన్ని దత్తత తీసుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాల దర్శకుడు అభిషేక్ అగర్వాల్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. కోవిడ్ సమయంలో చాలా మంది పేదలకు సహాయం చేసిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేశాడు.గత రెండు బ్లాక్బస్టర్లతో మంచి లాభాలను ఆర్జించిన ఈ యువ నిర్మాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. ఈ గ్రామం కేంద్రమంత్రి కిషన్రెడ్డి జన్మస్థలం కావడం గమనార్హం. అభిషేక్ అగర్వాల్- మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. వివిధ ఈవెంట్లు , ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
ఇఫీకి అంతా సిద్ధం
ఈ ఏడాది జరగనున్న ‘ది ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ)కి రంగం సిద్ధం అయింది. 53వ ఇఫీ వేడుకలు గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. పన్నెండుమంది సభ్యులున్న జ్యూరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 25 సినిమాలను, ఆరుగురు సభ్యుల జ్యూరీ నాన్ – ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 20 సినిమాలను ఎంపిక చేసింది. ఇండియన్ పనోరమ సెక్షన్ కింద ఈ 45 చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఇందులో పది హిందీ చిత్రాలు, ఐదు మరాఠీ చిత్రాలు, నాలుగేసి చొప్పన తెలుగు, తమిళ సినిమాలు, ఇంకా ఇతర భాషల చిత్రాలు ఉన్నాయి. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం), బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’, హిందీ నుంచి అడివి శేష్ ‘మేజర్’, అనుపమ్ ఖేర్ – పల్లవీ జోషి భాగమైన ‘ది కశ్మీరీ ఫైల్స్’, ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ చిత్రం ‘కిడ’ వంటివి ఉన్నాయి. నాన్–ఫీచర్ విభాగంలో ‘టాంగ్’, ‘రే– ఆర్ట్ ఆఫ్ సత్యజిత్ రే’, ‘క్లింటన్ అండ్ ఫాతిమా’ వంటి సినిమాలు ఉన్నాయి. కాగా మెయిన్స్ట్రీమ్ సెక్షన్లో ‘ది కశ్మీరీ ఫైల్స్’ (హిందీ), ‘ఆర్ఆర్ఆర్’ (తెలుగు), ‘అఖండ’ (తెలుగు), ‘టానిక్’ (బెంగాలీ), ‘ధర్మవీర్: ముక్కమ్ పోస్ట్’ (మరాఠీ) చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇండియన్ పనోరమ సెక్షన్లో తెలుగు చిత్రాలు ‘సినిమా బండి’ (దర్శకుడు కంద్రేగుల ప్రవీణ్), ‘ఖుదీరామ్ బోస్’ (దర్శకుడు విద్యాసాగర్ రాజు) ఉన్నాయి. -
పొన్నియిన్ సెల్వన్ మరో రికార్డ్.. బాలీవుడ్ సినిమాను దాటేసిన కలెక్షన్స్!
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ వసూళ్లను అధిగమించింది. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?) కేవలం విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.355 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరల్డ్వైడ్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సాధించిన రూ.340 కోట్ల మార్కును దాటేసింది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న 'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కమర్షియల్గానూ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధించిందీ సినిమా. ఒక్క సినిమాతో డైరెక్టర్ ఇమేజ్ కూడా ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీ కామెంట్స్తోనూ వార్తల్లో నిలుస్తున్న వివేక్ అగ్నిహోత్రి తాజాగా ముంబైలో ఖరీధైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. 3258 చదరపు అడుగుల విస్తీర్ణంలో అంధేరిలోని వెర్సీవాలోని 30వ ఫ్లోర్లోని అపార్ట్మెంట్ను సుమారు 17.92 కోట్లకు ఆయన కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక మరో విశేషం ఏమిటంటే.. అగ్నిహోత్రి కొనుగోలు చేసిన ఈ అపార్ట్మెంట్కి పై అంతస్తులోనే బాలీవుడ్ బిగ్బి అమితాబ్ కూడా ఓ ఇంటని కొనుగోలు చేశారు. కొన్నిరోజుల క్రితమే ఆయన దీన్ని కొన్నట్లు సమాచారం. -
'ఛెల్లో షో' ఇండియా సినిమానే కాదు.. ఆస్కార్ ఎంపికపై అభ్యంతరం
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ నామినేషన్స్కు ఎంపికైన గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్'( ఉత్తమ అంతర్జాతీయ చిత్రం) విభాగంలో పోటీకి ఎంపికైంది ఈ చిత్రం. ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్తో పోటీపడి మరీ రేసులో నిలిచింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరిచూపు ఈ సినిమావైపు మళ్లింది. ఆస్కార్కు భారత అధికారిక ఎంట్రీగా 'ఛెల్లో షో'ను పంపాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఈ చిత్రం భారతీయ చిత్రమే కాదని ఆరోపించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) తన నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించింది. ఛెల్లో షో హాలీవుడ్లో 'లాస్ట్ ఫిల్మ్ షో'గా విడుదలైందని తెలిపింది. విదేశీ చిత్రం కావడం వల్ల ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి ఎలా అర్హత సాధిస్తుందని ప్రశ్నించింది. ఈ అంశంపై ఎఫ్డబ్ల్యూఐసీఈ ప్రెసిడెంట్ బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఛెల్లో షో భారతీయ సినిమానే కాదు.. ఈ ఎంపిక సరైంది కాదు. పోటీలో ఇంకా ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ లాంటి భారతీయ చిత్రాలు ఉన్నాయి. సిద్ధార్థ్ రాయ్ కపూర్ కొనుగోలు చేసిన విదేశీ చిత్రం కావడం వల్లే జ్యూరీ ఎంపిక చేసింది. మేము ప్రస్తుత జ్యూరీని రద్దు చేయాలని కోరుతున్నాం. జ్యూరీ సభ్యుల్లో సగం మంది ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. వారిలో చాలా వరకు సినిమా చూడకుండానే ఓటేశారు.'లాస్ట్ ఫిల్మ్ షో'ఆస్కార్కు పంపితే, భారతీయ చిత్ర పరిశ్రమకే చెడ్డపేరు. దీనిపై కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్కు లేఖ రాస్తాం' అని తెలిపారు. ఆస్కార్ల ఎంపిక కమిటీకి గతంలో అధ్యక్షునిగా పనిచేసిన దర్శకుడు టీఎస్ నాగభరణ ఈ అంశంపై మాట్లాడారు. 'మార్కెటింగ్, వినోదం విలువ, మాస్, కలెక్షన్స్ మాత్రమే ప్రమాణాలు కాదు ఆస్కార్లో గుర్తింపు తెచ్చేది. నేను కూడా భారతీయుడ్నే. సినిమా కేవలం అనేది ప్రజాదరణ మాత్రమే కాదు. మీ హృదయాన్ని హత్తుకుంటే చాలు' అన్నారు. ఛెల్లో షో గుజరాత్లోని సౌరాష్ట్రలో ఉన్న గలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు కథతో తెరకెక్కించారు. పాన్ నలిన్ దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావెల్ ప్రధానపాత్రల్లో నటించారు. -
సిసోడియా ‘రాజ్పుత్’ వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఫైర్!
న్యూఢిల్లీ: బీజేపీలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామని తనకు సందేశాలు వచ్చాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను రాజ్పుత్ కమ్యూనిటీకి చెందిన వాడనని.. ఎవరి ముందు తలవంచనని తెలిపారు. మనీష్ సిసోడియా ‘రాజ్పుత్’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. రాజ్పుత్లు మినహా ఇతర కులాల వారు ఎదుటివారి ముందు తలవంచుతారని మనీష్ సిసోడియా ఉద్దేశమా? ఇది ఎలాంటి కులవాదం? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘దీనర్థం ఆయన రాజ్పుత్ కాకపోతే లొంగిపోయేవారా? ఢిల్లీలోని బ్రాహ్మణులు, యాదవులు, గుజ్జార్లు, జాట్స్, సిక్కులు వంటి వారి సంగతేంటి? వారంతా ఇతరులకు లొంగిపోయే స్వభావం కలిగి ఉన్నారా? ముస్లింలు, క్రిస్టియన్లు, దళితుల సంగతేంటి?’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. మనీష్ సిసోడియా చేసిన ప్రకటనను తన ట్వీట్కు జోడించారు డైరెక్టర్. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఇటీవల మనీష్ సిసోడియా నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రధాన ప్రత్యర్థి కేజ్రీవాల్ కానున్నారనే కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరితే కేసులు ఎత్తివేస్తామంటూ బీజేపీ నుంచి తనకు సందేశాలు వచ్చాయని బాంబు పేల్చారు సిసోడియా. ఆ సందేశాలకు ప్రతిస్పందనగా మాట్లాడుతూ తాను రాజ్పుత్నని, మహారాణా ప్రతాప్ వంశస్థుడినని, అవసరమైతే తల నరుక్కుంటా కానీ, ఎవరి ముందు తల వంచనంటూ వ్యాఖ్యానించారు. यह कैसा जातिवादी तर्क है? यानी अगर जनाब @msisodia जो राजपूत नहीं होते तो झुक जाते, कट जाते। यानी दिल्ली में जो ब्राह्मण,, यादव, गुज्जर, जाट, सिख इत्यादि रहते हैं वो सब झुकने वाले लोग हैं? मुस्लिम, ईसाई, दलित… क्या यह सब झुकने वाली क़ौम हैं? https://t.co/sahqNzcRM2 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 22, 2022 ఇదీ చదవండి: Manish Sisodia: ‘ఆప్ని వదిలేసి బీజేపీలో చేరమని మెసేజ్ పంపారు’ -
వ్యాఖ్యల దుమారం.. వివరణ ఇచ్చిన సాయిపల్లవి
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన హింస, గోరక్షక దళాలు చేస్తున్న దాడుల మధ్య తేడా ఏముందని, మానవత్వం గురించి ఆలోచించాలని ఆమె అన్నారు. సాయి పల్లవి వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై సాయి పల్లవి స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవ్వరినీ కించపరిచే విధంగా తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. (చదవండి: ‘విరాట పర్వం’ సినిమాను బ్యాన్ చేయాలి.. సుల్తాన్బజార్ పీఎస్లో ఫిర్యాదు) ‘నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్ప. ఏ మతంలోనైనా హింస మంచిది కాదని గతంలోనే చెప్పాను. కానీ నా మాటల్నీ కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ఏవోవో ప్రచారం చేశారు. ఒక డాక్టర్గా ప్రాణం విలువ ఏంటో నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు’అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. -
రక్తపు కూడు తినమనడం ఏంటి? ఏం సినిమాలివి?
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్ధుల్లా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల పేరిట దేశంలో మత ద్వేషాల్ని మరింత పెంచుతున్నారని, ఇలాంటి సినిమాలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని ఉద్దేశిస్తూ ఆయన మండిపడ్డారు. ఇలాంటి మతోన్మాద జాడ్యానికి ముగింపు పడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 1990లో కశ్మీరీ పండిట్ల ఊచకోత ప్రధానాంశంగా వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా జమ్ము కశ్మీర్లో కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ను ఉగ్రవాదులు కాల్చి చంపడం, కశ్మీరీ పండిట్లు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేడం, వాళ్లను కట్టడి చేసేందుకు బలగాలు కఠిన చర్యలు చేపట్టడం లాంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో కశ్మీరి పండిట్లకు మద్ధతుగా జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు ఫరూక్ అబ్దుల్లా. ‘‘ఎల్జీ వద్ద కశ్మీర్ ఫైల్స్ ప్రస్తావన కూడా వచ్చింది. ఇలాంటి సినిమాలు దేశంలో ద్వేషాలను పెంచుతున్నాయి. ఒక ముస్లిం హిందువును చంపి.. అతని రక్తపు కూడును భార్యతో తినమనడం ఏంటి? ఇలాగ జరుగుతుందా? అసలు.. సినిమా పేరుతో ఇష్టమొచ్చినట్లు చూపించి.. మనుషుల మధ్య చిచ్చు పెడతారా? ఇలాంటి వాటికి ముగింపు పడాల్సిన అవసరం ఉంది’’ అని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్ధుల్లా అభిప్రాయపడ్డారు. #WATCH We met LG Manoj Sinha to raise the issue of the law & order situation in J&K. During the meeting, I told him that the film 'The Kashmir Files' has given birth to hate in the country. Such things (films) should be banned: Dr Farooq Abdullah, National Conference pic.twitter.com/Z1BkoNijRO — ANI (@ANI) May 16, 2022 కొందరు ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారు. వాళ్ల చర్యలు మంచివి కావు. కశ్మీరీలోని ముస్లిం యువత ఈ తీరుతో ఊగిపోతుంది అంటూ చెప్పుకొచ్చారాయన. అలాగే భద్రత కోరుతున్న కశ్మీరీ పండిట్లపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జీ ప్రయోగించడం ఏంటి? ఆ అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు. ‘‘వాళ్లు(కశ్మీరీ పండిట్లు) రాళ్లు రువ్వారని భద్రతా సిబ్బంది చెప్తోంది. కానీ, ఈనాటికీ ఈ గడ్డపై కశ్మీరీ పండిట్లు రాళ్లు విసరడం నేను చూసింది లేదు’’ అని ఫరూఖ్ చెప్పారు. కశ్మీర్ పండిట్లతో కలిసిపోవాలనే మేం అనుకుంటాం. ఒకటి కలిసి బతకాలనే అనుకుంటున్నాం. బుద్గంలో నిరసనలు చెబుతున్న కశ్మీర్ పండిట్లకు సానుభూతి తెలిపేందుకు మమ్మల్ని అనుమతించడం లేదు. అనుమతించకపోతే.. అసలు వాళ్లకు దగ్గర అయ్యే అవకాశం మాకు ఎక్కడ దొరుకుతుందని ఫరూఖ్ అన్నారు. చదవండి: చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా?.. నిరసనలకు కశ్మీరీ ముస్లింల మద్దతు -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్సిరీస్లు ఏంటో చూసేయండి.. సర్కారు వారి పాట సూపర్ స్టార్ మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్ను షేక్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. జయేశ్ భాయ్ జోర్దార్ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయేశ్ భాయ్ జోర్దార్. డైరెక్టర్ దివ్యాంగ్ ఠక్కర్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 13న విడుదలకు సిద్దమైంది. భ్రూణహత్యల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ, రత్నాపాఠక్ షాలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. యశ్రాజ్ ఫిలింస్ పతాకాంపై ఆదిత్య చోప్రా, మనీశ్ శర్మలు ఈ సినిమాను నిర్మించారు. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు: దీ కశ్మీర్ ఫైల్స్ చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు మేకర్స్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్ ఫైల్స్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విజయ్ ‘బీస్ట్’ మూవీ దళపతి విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించాడు. పూజా హెగ్డే కథానాయిక. భారీ అంచనాలతో ఏప్రిల్ 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. పైగా ఈ సినిమా రిలీజైన మరునాడే కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కావడంతో బీస్ట్ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా బీస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ నెక్స్ట్తో పాటు నెట్ఫ్లిక్స్లో మే11 నుంచి బీస్ట్ ప్రసారం కానుంది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలు మే 12: ది మాట్రిక్స్ రెసరెక్షన్స్ మోడర్స్ లవ్(తెలుగు) మే 13: మోడర్న్ లవ్ ముంబై(హిందీ సిరీస్) డిస్నీ ప్లస్ హాట్స్టార్ మే 13: స్నీకరెల్లా ఆహా మే 13: కుతుకు పత్తు(తమిళం) నెట్ఫ్లిక్స్ మే 12: సేవేజ్ బ్యూటీ వెబ్ సిరీస్ -
ఇట్స్ అఫీషియల్: కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. తాజాగా కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్రయూనిట్. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్ ఫైల్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపిం. మొత్తానికి ఈ సినిమాను మరోసారి చూసే ఛాన్స్ దొరికిందంటూ సంబరపడిపోతున్నారు సినీప్రియులు. Bringing the story of the Kashmiri Pandits straight to you. If you missed it, this is your chance to watch the truth unfold.#TheKashmirFiles premiering 13th May on #ZEE5#TheKashmirFilesOnZEE5 pic.twitter.com/uAFFEp3O0u — ZEE5 (@ZEE5India) April 25, 2022 చదవండి: పోలీసులు ఘోరంగా అవమానించారు, కాలర్ పట్టుకుని.. Shahid Kapoor: నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే ఆసహ్యం -
OTT: దక్షిణాది భాషల్లోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే
The Kashmir Files OTT Streaming In South Languages: ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 10 కోట్ల బడ్జెట్తో ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలికిందులు చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. చెప్పాలంటే పాన్ ఇండియా వంటి సినిమాలకు ఈ మూవీ పోటీ ఇచ్చింది. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని తెరకెక్కించారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్! ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రధానీ మోదీ సైతం ప్రశంసించిన ఈ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ది కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకుంటే థియేటర్లో కేవలం హిందీలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందట. ఇప్పటికే ఓటీటీ రైట్స్ను ప్రముఖ జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: భారీ ఆఫర్ను తిరస్కరించిన అల్లు అర్జున్!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్ త్వరలోనే ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ‘ది కశ్మీర్ ఫైల్స్’ స్ట్రీమింగ్ డేట్పై జీ5 అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా జీ5 చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీశ్ కల్రా ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించినట్లు ఓ నేషనల్ వెబ్సైట్ పేర్కొంది. దీని ప్రకారం ఈ మూవీ అతికొద్ది రోజుల్లోనే అంటే మే మొదటి వారంలో జీ5లో విడుదల కానుందని సదరు మీడియాతో మనీశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ది కశ్మీర్ ఫైల్స్కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. అందుకే జీ5లో కశ్మీర్ ఫైల్స్ను ఎక్స్క్లూసివ్గా స్ట్రీమింగ్ చేయబోతున్నాం’ స్పష్టం చేశారు. -
'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ తర్వాతి చిత్రం ఇదే..
The Kashmir Files Director Vivek Agnihotri Announces The Delhi Files: 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందిందిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పలు ప్రభుత్వాలు వినోదపు పన్నును సైతం మినహాయింపుని ఇచ్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కేవలం మౌత్ టాక్తోనే సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్సకత్వం వహించిన విషయం తెలిసిందే. I thank all the people who owned #TheKashmirFiles. For last 4 yrs we worked very hard with utmost honesty & sincerity. I may have spammed your TL but it’s important to make people aware of the GENOCIDE & injustice done to Kashmiri Hindus. It’s time for me to work on a new film. pic.twitter.com/ruSdnzRRmP — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022 చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్ దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఆయన ఇదివరకు 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టారు. ఇక ఇటీవల వచ్చిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో మరో విజయం సాధించారు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఏంటి ? అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తెరదింపుతూ తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ అగ్రిహోత్రి. ఆయన 'ది ఢిల్లీ ఫైల్స్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సినిమా చిత్రీకరణకు ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఈ 3 సినిమాల కోసం ఓటీటీల్లో ఫ్యాన్స్ వెయిటింగ్..
Movie Audience Waiting For These 3 Movie Release In OTT: కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్కు సరైన వేదికలుగా మారాయి ఓటీటీలు. మహామ్మారి కారణంగా థియేటర్లు మూతపడటంతో డిఫరెంట్ కాన్సెప్ట్లతో మూవీ లవర్స్కు ఎంతో చేరువయ్యాయి. ఓటీటీల్లో స్ట్రీమ్ అయిన చిన్న సినిమాలు, వెబ్ సిరీస్లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అద్భుతంగా నటించే పర భాష హీరోలను దేశవ్యాప్తంగా పరిచయం చేశాయి. క్రమక్రమంగా పెద్ద హీరోలు కూడా వారి సినిమాలను ఓటీటీలో విడుదల చేసే స్థాయికి ఎదిగాయి. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులు అనుకూలించిన తర్వాత కూడా థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే థియేటర్లలో రిలీజైన పుష్ప, రాధేశ్యామ్, అఖండ వంటి భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ వేదికగా అలరించాయి. మరికొన్ని సినిమాలు వచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. ఓటీటీల్లో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ముచ్చటగా 3 సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవేంటో ఓ లుక్కేద్దామా ! 1. ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం) మూవీ లవర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఓటీటీ రిలీజ్ల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది 'ఆర్ఆర్ఆర్'. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. వెయ్యి కోట్లు సాధించింది. ఇంకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' మేనియా ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమా కోసం ఓటీటీ లవర్స్ ఎప్పుడు విడుదల చేస్తారా అని కాచుకు కూర్చున్నారు. థియేటర్లలో వీక్షించిన వారు కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తే మరిన్ని సార్లు చూడొచ్చని భావిస్తున్నారు. 2. గంగూబాయి కతియావాడి 'ఆర్ఆర్ఆర్'లో సీతగా అలరించింది బాలీవుడ్ క్యూటీ అలియా భట్. ఈ సినిమాకు ముందే విడుదలైంది అలియా లీడ్ రోల్ చేసిన 'గంగూబాయి కతియావాడి' సినిమా. ముంబై మాఫియా క్వీన్గా పేరు తెచ్చుకున్న గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్టర్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అలియా భట్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. 'ఆర్ఆర్ఆర్'తో అలియా భట్ తెలుగు ఆడియన్స్కు చేరువకావడంతో 'గంగూబాయి కతియావాడి' మూవీ ఓటీటీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. 3. ది కశ్మీర్ ఫైల్స్ ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి రికార్డులు సృష్టిస్తాయి కొన్ని సినిమాలు. అలాంటి కోవకు చెందినదే 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో 1990 సంవత్సరంలో కశ్మీర్ పండిట్స్పై జరిగిన మారణకాండ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వివాదాస్పద కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ కోసం కూడా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. -
రెండు సినిమాలు అనౌన్స్ చేసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్
ఈ ఏడాది మార్చిలో రిలీజైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్, పల్లవి జోషి ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం వివేక్ అగ్నహోత్రి దర్శకత్వంలోనే రెండు సినిమాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం (మార్చి 11) అభిషేక్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాలను ప్రకటించారు. ‘నిజాయితీతో కూడిన రెండు కొత్త కథలతో సినిమాలు నిర్మించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాలను తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మిస్తారు. ‘‘ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. -
ఆ సినిమాతో పోలిస్తే ఆర్ఆర్ఆర్ గేమ్ చేంజర్ కాదు: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
Ram Gopal Varma Shocking Comments On RRR Movie: జక్కన్న రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈమూవీపై మొదట్లో ప్రశసంలు కురిపించిన వర్మ తాజాగా ఆర్ఆర్ఆర్ సక్సెస్పై స్పందించాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’తో పోలిస్తే ఆర్ఆర్ఆర్ మూవీ గేమ్ చేంజర్ కాదని అభిప్రాయపడ్డాడు. కాగా ఆయన తాజా చిత్రం మా ఇష్టం(డేంజరస్) మూవీ రిలీజ్ నేపథ్యంలో ఇటీవల ఆర్జీవీ ఓ జాతీయ మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ గ్రాండ్ సక్సెస్పై ఆయనకు ప్రశ్న ఎదురైంది. చదవండి: సలార్ షూటింగ్ మరింత ఆలస్యం?, మరో నెల విశ్రాంతి మోడ్లోనే ప్రభాస్! ఈ మేరకు ఆర్జీవీ స్పందిస్తూ.. ‘నా ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ పెద్ద చిత్రమే అయినప్పటికీ అది గేమ్ చేంజర్ కాదు. ఎందుకంటే ఇది సమాజంలో మార్పు తీసుకువస్తుందని నేను అనుకోను. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్తో నిర్మించి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓ రకమైన చిత్రం. ఇలాంటి సినిమాలను తెరకెక్కించాలంటే మీకు రాజమౌళి లాంటి గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు కావాలి’ అన్నారు. అనంతరం ‘అదే ది కశ్మీర్ఫైల్స్ను చూస్తే. ఇది నిజమైన గేమ్ చేంజింగ్ సినిమా. ఇలాంటి సినిమాలే దర్శక-నిర్మాతలకు కావాల్సిన నమ్మకాన్ని ఇస్తాయి. అంటే రూ. 10 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా రూ. 250 కోట్లు వసూలు చేస్తే ఎలా ఉంటుంది? చదవండి: చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో అదే ది కశ్మీర్ ఫైల్స్ చేసింది. ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ రెండూ భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి. కానీ నిజమైన గేమ్ చేంజర్ సినిమా మాత్రం ది కశ్మీర్ ఫైల్సే అవుతుంది. ఎందుకంటే కశ్మీర్ ఫైల్స్ తక్కువ బడ్జెట్తో చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా వంటి సినిమాలకు పోటీ ఇచ్చింది. ఇలాంటి సినిమాలను నిర్మించడం చాలా సులభం. కానీ ఆర్ఆర్ఆర్ అలా కాదు. దీనికి ఎక్కువ బడ్జెట్ అవసరం. ప్రతి నిర్మాత రూ. 500 కోట్లు పెట్టకపోవచ్చు. కానీ, రూ.10 కోట్లు అయితే వెచ్చించగలడు కదా’ అంటూ ఆర్జీవీ వివరణ ఇచ్చాడు. కాగా లెస్బియన్ నేపథ్యంలో రూపొందించిన ఆర్జీవీ మా ఇష్టం(డేంజరస్) మూవీ ఏప్రిల్ 8న విడుదల కావాల్సి ఉండగా పలు వివాదాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
‘ది కశ్మీర్ ఫైల్స్’ పై అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు
Twinkle Khanna Shocking Comments On The Kashmir Files: చిన్న సినిమాగా వచ్చి పెను సంచలన విజయం సాధించింది ది కశ్మీర్ ఫైల్స్. మార్చి 11న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ప్రపంచ్యాప్తంగా రూ. 301 కోట్ల గ్రాస్ అందుకుంది. అంతగా ప్రజాదారణ పొందిన కశ్మీర్ ఫైల్స్ ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఏకంగా ప్రధానీ సైతం స్పందిస్తూ కశ్మీర్ ఫైల్స్ను కొడియాడారు. అలాంటి సినిమాపై బాలీవుడ్ నటి, రైటర్ ట్వింకిల్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా ట్వింకిల్ ఖన్నా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య అనే విషయం తెలిసిందే. ఆమె వార్త పత్రికలకు స్పెషల్ కాలమ్ అర్టికల్స్ రాస్తుంటుంది. చదవండి: వైరల్ అవుతున్న రామ్ చరణ్ షాకింగ్ లుక్, పంచెకట్టుతో సైకిల్పై ఇలా ఈ నేపథ్యంలో ఇటీవల తను రాసిన ఓ ఆర్టికల్లో కశ్మీర్ ఫైల్స్ గురించి ప్రస్తావించింది. ‘ఓ నిర్మాత ఆఫీసులో సమావేశం సందర్భంగా కశ్మీర్ ఫైల్స్ గురించి, ఈ మూవీ క్రేజ్ గురించి మాట్లాడారు. కశ్మీర్ ఫైల్స్ స్ఫూర్తితో చాలా మంది ‘అంధేరీ ఫైల్స్’, ‘ఖర్ దందా ఫైల్స్’, ‘సౌత్ బాంబే ఫైల్స్’ వంటి పేర్లను నిర్మాతలు నమోదు చేసుకుంటున్నారని ఆయన చెప్పినట్లు పేర్కొంది. ఇలాంటి వాళ్లందరు దర్శక-నిర్మాతలని చెప్పుకుంటున్నారు. వీరిని కూడా దర్శక-నిర్మాతలు అనాలా? అంటూ మండిపడింది. అలా అయితే తాను కూడా మానిక్యూర్(చేతి గోళ్లు, వేళ్లు శుభ్రం చేయడం)పై ఓ సినిమా తీస్తానని, దీనికి ‘నెయిల్ ఫైల్స్’ అనే టైటిల్ పెడతానంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. అనంతరం తాను ఓ నేషనలిస్ట్ అని చెప్పుకునే మనోజ్ కుమార్ లాగే అందరూ క్లర్కులుగా మారుతారా? అంటూ ఎద్దేవా చేసింది. చదవండి: ఈ కమర్షియల్ యాడ్కు చిరు పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా? కశ్మీర్ ఫైల్స్పై ఆమె చేసిన వ్యాఖ్యల పంట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రకారకాల కామెంట్స్ చేస్తూ ట్వింకిల్ ఖన్నాను ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కశ్మీర్ ఫైల్స్పై ఆమె భర్త, హీరో అక్షయ్ కుమార్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. 'వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విచిత్రమేంటంటే దీని ఎఫెక్ట్ నా సినిమాపై కూడా పడింది. నేను నటించిన బచ్చన్ పాండే కలెక్షన్లను కశ్మీర్ ఫైల్స్ దెబ్బకొట్టింది' అని చెప్పుకొచ్చాడు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీలో 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన ఆకృత్యాలను తెరపై చూపించారు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు. -
కశ్మీరీ పండిట్ల గాథ...
భూతల స్వర్గమైన కశ్మీర్ లోయలో 32 ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణాలు లక్షలాది మంది గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. నిత్య భయోత్పాతానికి, సామూహిక హత్యాకాండకు జడిసి కట్టుబట్టలతో లోయను వీడి వచ్చిన నాటినుంచీ వాళ్లు న్యాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. సొంత నేలకు దూరంగా, ఏ సదుపాయాలూ లేని శరణార్థి శిబిరాల్లో ఎవరికీ పట్టని అనాథల్లా నిస్సహాయంగా బతుకీడుస్తున్నారు. వాళ్లే... కశ్మీరీ పండిట్లు. ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకుంటున్న వారే లేరన్న వారి ఆక్రందన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కశ్మీర్ ఫైల్స్ సినిమా సృష్టించిన వివాదంతో పండిట్ల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది... కశ్మీరీ పండిట్ల ఊచకోతకు, తదనంతర సామూహిక వలసలకు మూగ సాక్షిగా 1990 సంవత్సరం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఆ అల్లర్ల అనంతరం 1990 జనవరి–మార్చి మధ్య లక్షన్నర మంది కశ్మీరీ పండిట్లలో కనీసం లక్ష మందికి పైగా లోయను వీడినట్టు పలు నివేదికలు తేల్చాయి. మహా అయితే 3,000 కుటుంబాలు అక్కడ మిగిలాయని అంచనా. అవి కూడా 2010 నాటికి 800కు తగ్గాయి. కశ్మీర్ ప్రభుత్వ పునరావాస కమిషన్ (శరణార్థుల) అధికారిక వెబ్సైట్ ప్రకారమే 60 వేల కుటుంబాలు లోయను వీడాయి. వీరిలో చాలామంది 30 ఏళ్లుగా జమ్మూ, పరిసరాల్లోని శరణార్థి శిబిరాల్లో దయనీయ పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. మరో 23 వేల కుటుంబాలు దేశ నలుమూలల్లోనూ విదేశాల్లోనూ స్థిరపడ్డాయి. లోయలో ఇంతటి కల్లోలానికి కారణమైన హిందూ, ముస్లిం ఘర్షణలు 1980ల నుంచే పెరుగుతూ వచ్చాయి. నిజానికి లోయలో 1950ల నుంచి చూసినా హిందూ పండిట్ల సంఖ్య 4 నుంచి 5 శాతం మించి లేదని గణాంకాలు చెప్తున్నాయి. 94 శాతం దాకా ముస్లిం జనాభాయే. అయినా లోయను సంపూర్ణంగా ఇస్లామీకరించే ప్రయత్నాలు 1980ల్లో ఊపందుకున్నాయి. ఫలితంగా స్థానిక ముస్లింలలో హిందువులపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. వారి నివాసాలపై దాడులతో మొదలై హిందూ నేతలను హతమార్చడం దాకా వెళ్లింది. వేర్పాటువాదమే సిద్ధాంతంగా జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటివి పుట్టుకు రావడంతో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడింది. 1990 జనవరి హింసాకాండకు ఇదంతా ఓ భయానక నేపథ్యంగా అమరింది. ఆ మూడు నెలలూ... 1990 జనవరి తొలి రోజులు కశ్మీరీ పండిట్ల గుండెల్లో ఆరని మంటలు రగిల్చాయి. అప్పటికే తారస్థాయికి చేరిన మత అసహనం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. హిందువులు మతం మారడమో, లోయను వీడటమో, మరణించడమో తేల్చుకోవాలంటూ తీవ్రవాద మూకలు పండిట్ల ఇండ్లపై పడి మారణహోమం సృష్టించారు. కనిపించిన వారినల్లా కాల్చి చంపుతూ నరమేధానికి దిగారు. ఆ క్రమంలో అంతులేని దారుణ అత్యాచారాలకు, చెప్పుకోలేని ఘోరాలకు పాల్పడ్డారు. దాంతో పండిట్ల కుటుంబాలు కట్టుబట్టలతో లోయ ను వీడాయి. ఈ హింసాకాండలో మరణించిన హిందువులు 100 లోపేనని అధికారిక గణాంకాలు చెప్తున్నా వాస్తవ సంఖ్య వేలల్లో ఉంటుందంటారు. పట్టించుకున్న వాళ్లే లేరు... జమ్మూ, పరిసరాల్లోని శిబిరాల్లో తలదాచుకున్న పండిట్లు, కొద్ది నెలల్లో లోయకు తిరిగి వెళ్తామన్న ఆశలు క్రమంగా ఆవిరవడంతో దశాబ్దాలుగా అక్కడే బతుకీడుస్తున్నారు. ప్రభుత్వపరంగా వీరికి పెద్దగా సాయం కూడా అందడం లేదు. 2004లో యూపీఏ ప్రభుత్వం పండిట్ల కోసం టౌన్షిప్ల్లోని చిన్న ఫ్లాట్లను కొందరు కొనుక్కోగా ఆ స్తోమతలేని చాలామంది ఇప్పటికీ దయనీయంగానే గడుపుతున్నారు. ఆర్థిక కష్టాలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా. అయినా నాటి గాయాలు వీరిలో ఎంత తాజాగా ఉన్నాయంటే... ఇప్పటికీ చాలామంది తమ అవస్థలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు! 2008లో ప్రధాని పునరావాస ప్యాకేజీ కింద పండిట్లకు కొన్ని ఉద్యోగాలివ్వడంతో సరిపెట్టారు. వారికి ఉద్యోగాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షల దాకా ఆర్థిక సాయం ఇస్తామని 2021లో కేంద్రం ప్రతిపాదించినా ముందడుగు పడలేదు. దాంతో మోదీ ప్రభుత్వం కూడా తమకోసం చేసిందేమీ లేదంటూ పండిట్లు వాపోతున్నారు. కశ్మీరీ పండిట్ల డిమాండ్లు ► కనీసం రూ.25 వేల పై చిలుకు నెలవారీ పరిహారం ► కేంద్రపాలిత ప్రాంత హోదాతో కూడిన ప్రత్యేక హోమ్లాండ్ ► మైనారిటీ హోదా, తదనుగుణమైన హక్కులు, ప్రయోజనాలు ► నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలు తేల్చాలి. అన్నివిధాలా న్యాయం చేయాలి ► తమ నివాసాలు, భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి వెనక్కి ఇప్పించాలి ఒక విజయం, వంద వివాదాలు కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.15 కోట్లతో రూపొందిన ఈ సినిమా 20 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల పై చిలుకు కలెక్షన్లు రాబట్టి రికార్డుల మోత మోగించింది. మార్చి 11న కేవలం 600 థియేటర్లలో పెద్దగా హడావుడి లేకుండా విడుదలైనా, చూస్తుండగానే టాక్ ఆఫ్ ద కంట్రీగా మారిపోయింది. ప్రధాని మోదీ మొదలుకుని అమిత్ షా తదితర కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులంతా సినిమాను ప్రశంసలతో ముంచెత్తడమే గాక అందరూ తప్పక చూడాలంటూ పిలుపునిచ్చారు. ఇందుకు విపరీతమైన మౌత్ పబ్లిసిటీ తోడై చూస్తుండగానే 4,000కు పైగా థియేటర్లకు విస్తరించింది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ఉచితంగా షోలు వేశాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్ను మినహాయింపులిచ్చాయి. యూఏఈ, సింగపూర్ వంటి దేశాల్లో కూడా నిషేధం తొలగి త్వరలో విడుదలవుతుండటంతో కలెక్షన్లు ఇంకా కొనసాగేలా ఉన్నాయి. అయితే సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పైగా దీన్ని బీజేపీ ప్రమోట్ చేస్తోందన్న అభిప్రాయంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. సినిమాకు అనుకూలంగా, వ్యతిరేకంగా విమర్శలు, ప్రతి విమర్శలు హోరెత్తుతున్నాయి. సినిమా అవాస్తవాలమయమని ఆప్ వంటి పార్టీలు అంటున్నాయి. మరో వర్గం మాత్రం సినిమాలో నిజాలు చూపించారని, పండిట్ల గుండెకోత ఇప్పటికైనా వెలుగులోకి వచ్చిందని అంటోంది. బెదిరింపుల నేపథ్యంలో అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రత కల్పించాల్సి వచ్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
సూపర్ డూపర్ హిట్, రూ. 300 కోట్ల క్లబ్బులోకి కశ్మీర్ ఫైల్స్!
సినిమాలో కంటెంట్ లేకపోతే ఉట్టి ప్రచారాలతో ప్రేక్షకులను థియేటర్కు రప్పించడం చాలా కష్టం. కానీ మూవీలో కనెక్ట్ అయ్యే పాయింట్, కట్టిపడేసే కథనం ఉంటే మాత్రం ఏ ప్రచారం చేయకపోయినా జనాలు వాళ్లంతట వాళ్లే థియేటర్వైపు వడివడిగా అడుగులు వేస్తారు. అందుకు కశ్మీర్ ఫైల్స్ మూవీయే అతి పెద్ద నిదర్శనం. సైలెంట్గా థియేటర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్లో మూడు వారాల్లోనే రూ.234.03 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్లను కూడా కలుపుకుంటే ప్రపంచ్యాప్తంగా రూ.301 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ లెక్కన కశ్మీర్ ఫైల్స్.. సల్మాన్ ఖాన్ 'రేస్ 3'(రూ.294.98 కోట్లు), అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' (రూ.294.17 కోట్లు) చిత్రాలను సైతం వెనక్కినెట్టి రికార్డులు తిరగరాస్తోంది. ఈ దూకుడు చూస్తుంటే త్వరలోనే అక్షయ్ కుమార్ 'టాయ్లెట్: ఏక్ ప్రేమ కథ' (రూ.308 కోట్లు) వసూళ్లను కూడా అధిగమించనున్నట్లు కనిపిస్తోంది. #TheKashmirFiles [Week 3] Fri 4.50 cr, Sat 7.60 cr, Sun 8.75 cr, Mon 3.10 cr, Tue 2.75 cr. Total: ₹ 234.03 cr. #India biz. ALL TIME BLOCKBUSTER. pic.twitter.com/KCgOAZd0R9 — taran adarsh (@taran_adarsh) March 30, 2022 చదవండి: రాజకీయాల్లోకి వెళ్లి ఆమెతో నటించే చాన్స్ మిస్సయ్యాను: చిరంజీవి -
కశ్మీర్ ఫైల్స్.. కేజ్రీవాల్కు స్ట్రాంగ్ కౌంటర్
ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర విషయంలో బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కౌంటర్ పడింది. ఇంతకీ ఢిల్లీ ప్రభుత్వం తరపున ట్యాక్స్ ఫ్రీ ఉందా? లేదా? అని నిలదీశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. ‘మమ్మల్ని అవమానించడమో, కించపర్చడమో చేసే హక్కు మీకు లేదు. ఇంతకీ మీ రాష్ట్రం తరపున కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు సీఎం హిమంత. ‘‘ఏం చేయాలనుకుంటున్నారో చేయండి.. అంతేకానీ హిందూ వ్యతిరేకిగా మారకండి’’ అంటూ కేజ్రీవాల్కు హితవు పలికారు హిమంత. మన హిందూ సమాజం (సమాజం) ఈ స్థితిలో ఉందంటే.. హిందూ కుటుంబంలో ఎక్కువ హిందూ వ్యతిరేకులుగా ఉండడమే కారణం. లేకుంటే.. ఒకప్పటిలా హిందూ నాగరికత.. ప్రపంచానికి మార్గాన్ని చూపేదే అంటూ పేర్కొన్నారు హిమంత. గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఎన్నో సినిమాలకు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించింది. ఆ టైంలో మరి ఆయన ఆ సినిమాలను యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేయమని అడగలేదు? కేవలం కశ్మీర్ ఫైల్స్ విషయంలోనే ఆయన అక్కసు ఎందుకు? అంటూ నిలదీశారు అస్సాం సీఎం హిమంత. సంబంధిత వార్త: కశ్మీర్ ఫైల్స్ను యూట్యూబ్లో పెట్టండి -
కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్.. ఢిల్లీలో ఆసక్తికర ఘటన
సాక్షి, న్యూఢిల్లీ: ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శకులను సైతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కారణంగా తాజాగా మరో ఆకస్తికర ఘటన చోటుచేసుకుంది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎఫెక్ట్తో ఢిల్లీలో ఓ పాఠశాల పేరును మార్చివేశారు. వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో టీకా లాల్ తాప్లూ పేరుతో ఓ పాఠశాల ఉంది. కాగా, ఇటీవల విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో టికా లాల్ తాప్లూ పేరును ప్రస్తావిస్తూ.. కాశ్మీర్లో జరిగిన మారణహోమంలో అతడు మృతి చెందినట్టు చూపించారు. ఈ నేపథ్యంలో అతడి గౌరవార్ధం పాఠశాల పేరును 'షహీద్ టీకా లాల్ తాప్లూ'గా మార్చారు. కాగా, పాఠశాల పేరు మార్పు సందర్బంగా ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "తాప్లూ జీ భారతీయ జనతా పార్టీ సభ్యుడు, జమ్మూకశ్మీర్ హైకోర్టులో న్యాయవాది" అని అన్నారు. అతనో గొప్ప దేశభక్తుడంటూ ప్రశంసించారు. సెప్టెంబరు 14, 1989న తీవ్రవాదుల చేతిలో హతమార్చబడిన కాశ్మీరీ పండిట్ల గొప్ప నాయకుడని కీర్తించారు. దేశ విభజన తర్వాత, కాశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం దేశంలోని ప్రజలలో కాశ్మీరీ హిందువులపై "మారణహోమం" గురించి అవగాహన కల్పించిందని తెలిపారు. -
కశ్మీర్ ఫైల్స్ నా సినిమాను దెబ్బకొట్టింది: అక్షయ్ కుమార్
చిన్న సినిమాగా వచ్చి పెను సంచలన విజయం సాధించింది ది కశ్మీర్ ఫైల్స్. మార్చి 11న రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ సినిమాపై ఎందరో ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను అభినందించాడు. భోపాల్లోని ఓ కార్యక్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. 'వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విచిత్రమేంటంటే దీని ఎఫెక్ట్ నా సినిమాపై కూడా పడింది. నేను నటించిన బచ్చన్ పాండే కలెక్షన్లను కశ్మీర్ ఫైల్స్ దెబ్బకొట్టింది' అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా వివేక్ అగ్నిహోత్రి దాన్ని ట్విటర్లో షేర్ చేశాడు. తన సినిమాపై ప్రశంసలు కురిపించిన అక్షయ్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా కశ్మీర్ ఫైల్స్లో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్, చిన్మయి, భాషా సుంబ్లి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్, గోవా, త్రిపుర, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించారు. త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబ్ చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. కశ్మీర్ ఫైల్స్ నా సినిమాను దెబ్బకొట్టింది. Thanks @akshaykumar for your appreciation for #TheKashmirFiles. 🙏🙏🙏 pic.twitter.com/9fMnisdDzR — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 25, 2022 చదవండి: మీటూపై అనుచిత వ్యాఖ్యలు, సారీ చెప్పిన నటుడు -
కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు!
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో భోపాలీలంటే స్వలింగ సంపర్కులంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కామెంట్లు చేయడంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే డిగ్గీ రాజా సీరియస్ అయ్యారు. వివేక్ అగ్నిహోత్రి గారు.. ఇది మీ వ్యక్తిగత అనుభవం కావచ్చు. అంతేగానీ భోపాల్ ప్రజలది కాదు. నేను 77 ఏళ్ల నుంచి భోపాల్, అక్కడి ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నా. కానీ నాకు ఏనాడూ అలాంటి అనుభవం ఎదురు కాలేదు. ఎక్కడున్నా.. మీ పక్కన ఉండేవాళ్ల ప్రభావమే దానికి కారణమై ఉంటుందని గుర్తించండి అంటూ ట్వీట్తో దిగ్విజయ్ సింగ్, వివేక్ అగ్నిహోత్రికి చురకలు అంటించారు. ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ‘‘నేను భోపాల్లో పెరిగినా, అనుబంధం ఉన్నా.. భోపాలీ అని పిలుచుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే.. ఆ పదానికి ఒక నిర్దిష్ట అర్థం జనాల మైండ్లో ఫిక్స్ అయిపోయింది. భోపాలీలు స్వలింగ సంపర్కులుగా భావించబడుతున్నారని, అందుకు బోఫాల్ నవాబీ నగరం కావడం, వాళ్ల కోరికలే కారణం అయి ఉండొచ్చు’ అని వివేక్ అగ్నిహోత్రి వెకిలి వ్యాఖ్యలు చేశాడు. इस दोयम दर्जे की मान्यता के लिए मेरी ओर से..#I_M_Sorry_Bhopal भोपाली होना होमोसेक्सुअल होना कैसे हो सकता है..? लखनऊ,हैदराबाद,मैसूर भी तो नवाबी शहर हैं..तो क्या वहां भी..! छि: अगर हम भी कहते फिरें कि तनु श्री दत्त आपको लेकर ऐसा बोलती है तो क्या आप मान लेंगे.!@vivekagnihotri pic.twitter.com/teh5fmixZ0 — Govind ਗੋਵਿੰਦ گووند गोविंद गुर्जर (@govindtimes) March 25, 2022 ఇదిలా ఉండగా.. ఈ కామెంట్లపై మీడియా వివేక్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ అగ్నిహోత్రిని మీడియా ప్రతినిధులు ‘హెమోసెక్సువల్స్’ కామెంట్లపై వివరణ అడగ్గా మౌనంగా వెళ్లిపోయారు. ఆయన వెంట ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వరిగ్యాను మీడియా అడ్డుకుని ‘నేను ఇండోర్వాసిని. అదేదో ఆయన్నే(వివేక్ అగ్నిహోత్రి) అడగొచ్చుగా’ అంటూ తప్పించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా ఈ వ్యవహారం ఆధారంగా బీజేపీపై సెటైర్లు సంధించారు. అగ్నిహోత్రి వ్యాఖ్యలపై నేనేం మాట్లాడను. కానీ, రాఘవ్ జీ భాయ్, ఆరెస్సెస్ ప్రచారక్ ప్రదీప్ జోషి వ్యవహారాలు(స్వలింగ సంపర్కులనే విషయం) వెలుగులోకి వచ్చాకే ఆయన(వివేక్ అగ్నిహోత్రి) స్పందించాడా? వాటి ఆధారంగానే భోపాల్ మొత్తాన్ని హోమోసెక్సువల్స్ అంటున్నాడా? ఇంతకీ అగ్నిహోత్రిపై వాళ్లు తీసుకోబోయే చర్యలేంటి? అంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రిని ట్యాగ్ చేస్తూ మరీ ఓ సెటైరిక్ ట్వీట్ చేశాడు కేకే మిశ్రా. राघवजी भाई या संघ प्रचारक प्रदीप जोशी आदि के सामने आए प्रकरणों के बाद विवेक अग्निहोत्री ने कुछ कहा हो तो मैं खामोश हूं! पर समूचे भोपाल को समलैंगिकों का शहर बताना उचित है? @drnarottammisra जी,क्या अन्य फ़िल्म निर्माताओं के अनुरूप कार्यवाही होगी या हम सभी??कथित हिंदूवादी भी चुप? pic.twitter.com/6rFJXV2PEC — KK Mishra (@KKMishraINC) March 25, 2022 అంతేకాదు వివేక్పై చర్యలు తీసుకోలేని రాజకీయ నంపుసకత్వం అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మరో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలపై భోపాల్కు చెందిన జర్నలిస్టులు, ఉద్యమకారులు సోషల్ మీడియాలో అసంతృప్త నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘కశ్మీర్ ఫైల్స్’ ను యూట్యూబ్లో పెట్టమని అడగండి’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పలు రాష్ట్రాలు ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీలో కూడా ఈ మూవీని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై గురువారం ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కశ్మీర్ ఫైల్స్ మూవీని పలు రాష్ట్రాల్లో ఎందుకు ట్యాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటిస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలంతా కలిసి ఆ సినిమా దర్శకుడైన వివేక్ అగ్నిహోత్రిని.. కశ్మీర్ ఫైల్స్ మూవీనే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని అడిగితే బాగుంటుందని కదా అని ఎద్దేవా చేశారు. అలా చేస్తే అందరూ ఉచితంగానే కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూస్తారని తెలిపారు. కొంతమంది కశ్మీర్ పండిట్ల పేరుతో కూడా కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు(బీజేపీ నేతలు) కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లను గోడలకు అంట్టించడమే మిగిలి ఉందని విమర్శించారు. మరోవైపు హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లతో సహా పలు రాష్ట్రాలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన విషయం తెలిసిందే. RT if you want @vivekagnihotri to upload #TheKashmirFiles on YouTube for FREE 🙏🏻pic.twitter.com/gXsxLmIZ09 https://t.co/OCTJs1Bvly — AAP (@AamAadmiParty) March 24, 2022 -
యోగి ప్రమాణ స్వీకారానికి ‘కశ్మీర్ ఫైల్స్’ టీం
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడమే కాదు.. ఉత్తర ప్రదేశ్కు రెండో దఫా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు యోగి ఆదిత్యానాథ్. మార్చి 25 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నారు. మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, మరికొందరు బీజేపీ కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేజ్పై ప్రధాని మోదీ, నడ్డా, రాజ్నాథ్ సింగ్, యోగి ఫొటోలతో భారీ బ్యానర్ను ఏర్పాటు చేయనున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు సైతం యోగి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, బోనీ కపూర్లకు ఆహ్వానం అందాయి. అంతేకాదు.. తాజాగా భారీ హిట్ సాధించిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్కు ప్రత్యేక ఆహ్వానం పంపింది యూపీ బీజేపీ యూనిట్. నటుడు అనుపమ్ ఖేర్తోపాటు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం 200 కోట్ల రూపాయల క్లబ్లోకి అడుగుపెట్టింది కూడా. #TheKashmirFiles crosses ₹ 200 cr mark 🔥🔥🔥... Also crosses *lifetime biz* of #Sooryavanshi... Becomes HIGHEST GROSSING *HINDI* FILM [pandemic era]... [Week 2] Fri 19.15 cr, Sat 24.80 cr, Sun 26.20 cr, Mon 12.40 cr, Tue 10.25 cr, Wed 10.03 cr. Total: ₹ 200.13 cr. #India biz. pic.twitter.com/snBVBMcIpm — taran adarsh (@taran_adarsh) March 24, 2022 స్టేడియంలో అదనంగా 20వేల కుర్చీలను వేయించారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో బీజేపీ అభిమానగణం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీలో దాదాపు 37 ఏళ్ల తర్వాత.. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకుని తిరిగి సీఎం పదవిని చేపడుతున్న ఘనత యోగి ఆదిత్యానాథ్కు దక్కింది. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో 255 సీట్లు గెల్చుకుని, 41.29 శాతం ఓటింగ్ షేర్ దక్కించుకుంది బీజేపీ. -
గుడిలో దళితుడికి ఘోర అవమానం
జైపూర్: రాజస్తాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలోని బెహ్రార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హిందూ దేవుళ్లను విమర్శించాడని గుడిలో ఓ దళితుడితో ముక్కు నేలకు రాయించారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనకు బాధ్యులైన 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విమర్శిస్తూ రాజేశ్ కుమార్ మేఘవాల్ అనే దళిత వ్యక్తి మూడు రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దీనిపై కొందరు కామెంట్లు చేయగా, ప్రతిస్పందనగా హిందూ దేవుళ్లను(రాముడు, కృష్ణుడు) కించపరుస్తూ మళ్లీ పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు వ్యక్తులు మంగళవారం రాజేశ్ కుమార్ను గుడికి రప్పించారు. క్షమాపణలు చెప్పించారు. తప్పు ఒప్పుకోవాలంటూ బలవంతంగా ముక్కు నేలకు రాయించారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనాత్మకంగా మారాయి. బాధితుడు రాజేశ్ కుమార్ మేఘవాల్ ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. -
‘ది కశ్మీర్ ఫైల్స్’ను ఉద్దేశిస్తూ బాలీవుడ్పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
‘ది కశ్మీర్ ఫైల్స్’.. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. రూ. 12 కోట్లు బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్ల వసూలు చేసి రూ. 200 కోట్ల క్లబ్లోకి చేరింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీలో 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన ఆకృత్యాలను తెరపై చూపించారు. ఈ మూవీ ప్రధాని మోదీతో సహా పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: కారులో సీక్రెట్ ఫ్రెండ్తో స్టార్ హీరో కూతురు, ఫొటోలు వైరల్ ఇప్పటికే ఈ మూవీపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి తాజా మరోసారి కశ్మీర్ ఫైల్స్ను ఉద్దేశిస్తూ బాలీవుడ్పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేస్తూ.. ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’బాలీవుడ్ చరిత్రను మార్చేసింది. బాలీవుడ్కు చెందిన 7 బడా ప్రొడక్షన్ హౌజ్లు టాప్లో ఉండటానికి పోటీపడుతూ ఉంటాయి. కానీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు ఎప్పుడు ఎలా వచ్చి టాప్ చైర్లో కూర్చుంటాయో చెప్పలేం. ది కాశ్మీర్ ఫైల్స్ కిల్లర్ విజయం బాలీవుడ్లో ఉన్న అపోహలను చేరిపేసింది’అంటూ వర్మ రాసుకొచ్చారు. అంతేగాక ఆ అపోహలు ఏంటో కూడా వివరించాడు. చదవండి: తల్లి కాబోతోన్న నయనతార? Top 7 production houses of Bollywood will cease to be at the top and will lose their control on the film industry because #kashmirifiles proved that anyone from anywhere can come to sit on top which is ultimate democratisation of cinema . check link https://t.co/GdXBhXMYMy — Ram Gopal Varma (@RGVzoomin) March 21, 2022 ⇔ హిట్ సాధించాలంటే పెద్ద స్టార్లు కావాలి (కాశ్మీర్ ఫైల్స్లో స్టార్లు లేకపోవడమే కాదు, సినిమా డిసైడింగ్ స్టార్ను కూడా కలిగి లేదు) ⇔ హిట్ సాధించడానికి మీకు మెగా బడ్జెట్లు అవసరం ( కాశ్మీర్ ఫైల్స్ చాలా తక్కువ బడ్జెట్తో రూపొందింది) ⇔ హిట్ కావాలంటే మీకు సూపర్ హిట్ పాటలు కావాలి (కాశ్మీర్ ఫైల్స్ లో ఒక్క థీమ్ తప్ప మరేమీ లేదు) ⇔ హిట్ చేయడానికి మీకు మసాలా వినోదం అవసరం (కాశ్మీర్ ఫైల్స్లో మీరు ఒక్కసారి కూడా నవ్వలేరు) ⇔ హిట్ చేయడానికి మీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి (మూవీకి ముందు నిర్మాత గురించి ఎవరు పెద్దగా విని ఉండరు) ⇔ మీరు హిట్ చేయడానికి అనేక కోట్ల ప్రమోషన్స్ కావాలి (రాధే శ్యామ్ 25 కోట్లతో పోలిస్తే కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు కేవలం 2.5 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేశారు) ⇔ ప్రేక్షకులు లాజిక్స్ లేని సినిమాలే చూస్తారని అనుకోవద్దు (ప్రేక్షకులు తీవ్రమైన సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారని కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత గ్రాంట్గా తీసుకున్నారు) ⇔ ఛార్ట్ బస్టర్ పాటలను చూపించాల్సి ఉంటుంది (కాశ్మీర్ ఫైల్స్లో ఎటువంటి ప్రయత్నం లేదు. హమ్ దేఖేంగే అనే బ్యాక్ గ్రౌండ్ థీమ్ మాత్రమే ఉంటుంది) ఇలా చాలా పాయింట్స్ ను ఆర్జీవీ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. -
కశ్మీర్ ఫైల్స్.. అదే నిజమైతే ఉరి తీయండి
ది కశ్మీర్ ఫైల్స్ The Kashmir Files సినిమా దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది. పనిలో పనిగా వివాదాలను, విమర్శలను సైతం మూటగట్టుకుంటోంది ఈ చిత్రం. ఈ తరుణంలో జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా(84) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నాటి పరిస్థితులకు తాను కారణం అని నిరూపిస్తే.. ఉరి తీయండంటూ వ్యాఖ్యానించాడాయన. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఒక ఉద్దేశపూర్వక కుట్రగా వర్ణించిన ఆయన.. కొందరు తమ రాజకీయాల కోసం కోసం చిత్రాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. అలాగే కశ్మీర్ పండిట్ల వలసలకు ఫరూఖ్ అబ్దుల్లానే కారణం అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారాయన. అదే నిజమని రుజువైతే ఉరికైనా తాను సిద్ధమని అన్నారు. ‘‘నిజాయితీ ఉన్న న్యాయమూర్తి లేదంటే కమిటీని నియమిస్తే.. నిజం ఏంటో వెలుగు చూస్తుంది. కశ్మీర్ పండిట్ల వలసలకు, ఆనాటి ఘర్షణకు కారణం ఎవరో బయటపడుతుంది. దేశంలో ఎక్కడైనా ఉరి కంబం ఎక్కడానికి ఫరూఖ్ అబ్దుల్లా(తనని తాను ఉద్దేశించుకుంటూ..) సిద్ధంగా ఉంటాడు. విచారణకు నేను సిద్ధం. కానీ, సంబంధం లేని వాళ్లపై నిందలు వేయడం నాకు చేత కాదు’’ అంటూ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారాయన. ‘‘ఆనాటి పరిస్థితులకు కారణం నేను కాదనే అనుకుంటున్నా. నిజం తెలుసుకోవాలనుకునేవాళ్లు.. ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్నుగానీ, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరిఫ్ మహమ్మద్(ప్రస్తుత కేరళ గవర్నర్)నుగానీ సంప్రదించ్చొచ్చు. అలాగే విచారణ కోసం నియమించే కమిటీ ఏదైతే ఉందో అది కేవలం కశ్మీర్ పండిట్ల కోసమే కాకుండా సిక్కులకు, ముస్లింలకు ఏం జరిగిందో కూడా విచారణ చేపడితే మంచిద’’ని వ్యాఖ్యానించారాయన. సినిమాను కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న వాళ్లు.. ఆనాటి పరిస్థితులకు కారణం ఎవరనేది కూడా గుర్తిస్తే మంచిదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆమోదించిన చట్టం.. కాశ్మీరీ పండిట్ల వలసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినట్లు రుజువు చేస్తోందని ఓ జాతీయ మీడియా తాజాగా సంచలన కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు. చదవండి: కశ్మీర్ ఫైల్స్.. ది పొలిటికల్ హీట్! -
'ది కశ్మీర్ ఫైల్స్' మూవీపై ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్ ఫైల్స్' ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే 100 కోట్ల మైలురాయిని అధిగమించిన ఈ చిన్న చిత్రం రూ.150 కోట్లు అందుకునే దిశగా పరుగులు తీస్తోంది. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ఓ వేడుకకు ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను వీక్షించారా? అన్న ప్రశ్నకు ఆమిర్ స్పందిస్తూ ఇప్పటివరకు ఈ సినిమాను చూడలేదు కానీ తప్పకుండా చూసి తీరతానన్నాడు. ఇది మన చరిత్రకు నిదర్శనమని కితాబిచ్చాడు. కశ్మీర్ పండిట్లకు అలా జరగడం నిజంగా బాధాకరమని విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్క భారతీయుడు చూసి తీరాలని పేర్కొన్నాడు. కశ్మీర్ ఫైల్స్ విజయవంతం అయినందుకు సంతోషంగా ఉందన్నాడు. చదవండి: ఇది నేను కాదంటున్న వర్మ, అబద్ధాలు చెప్పడం కూడా రావట్లేదా? అంటున్న నెటిజన్లు -
'ది కశ్మీర్ ఫైల్స్'.. కక్కుర్తి పడి ఆ లింక్స్ ఓపెన్ చేయకండి
Download The Kashmir Files: For Free Police Warn Against Free Links: ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఉచితంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మీకు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఫ్రీగా సినిమా చూడొచ్చని కక్కుర్తి పడి లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలోని డబ్బులన్నీ ఖాళీ అయినట్లే. ఎందుకంటే సైబర్ నేరగాళ్ల దృష్టి ఇప్పుడు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై పడింది. ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్ఫోన్ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఫ్రీలింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో హ్యాకర్లు ఇదే పనిగా సైబర్ క్రైమ్కు పాల్పుడుతున్నారని పోలీసులు తెలిపారు. ది కశ్మీర్ ఫైల్స్ను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్లు చెప్పారు. ఒకవేళ మీకు ఇలాంటి లింకులు వస్తే 1920 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు సూచించారు. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించి సత్తా చాటుతోంది. ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
కనీసం చనిపోయినవారికైనా గౌరవం ఇవ్వండి: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ ఆమోదం తెలపలేదంటూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)లో ఒక సభ్యుడు కాబట్టే సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా యధాతథంగా రిలీజ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనిపై వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. 'దయచేసి ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని ఆపేయండి. కాస్త విరామం తీసుకోండి. కనీసం చనిపోయిన వారికైనా గౌరవమివ్వండి' అని ట్వీట్ చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మార్చి 11న విడుదలైంది. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. బాలీవుడ్ నటీనటులు అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. Please stop spreading fake news, like always. Take a little break. At least to respect the dead. https://t.co/hZflsTUbOk pic.twitter.com/yvOKhGieDX — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 20, 2022 చదవండి: ఆల్టైం బ్లాక్బస్టర్: వంద కోట్ల క్లబ్బులో 'కశ్మీర్ ఫైల్స్' -
ఆల్టైం బ్లాక్బస్టర్: వంద కోట్ల క్లబ్బులో 'కశ్మీర్ ఫైల్స్'
ది కశ్మీర్ ఫైల్స్.. ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఇదివరకే చూసినవాళ్లు వన్స్మోర్ అంటూ మరోసారి థియేటర్ వైపు అడుగులేస్తుంటే చూడనివాళ్లమే వీలు చేసుకుని మరీ కశ్మీర్ ఫైల్స్ చూసేయాలని తహతహలాడుతున్నారు. అసలు ప్రచారమే చేయకపోయినా కేవలం మౌత్ టాక్తోనే జనాలను థియేటర్కు రప్పిస్తోందీ మూవీ. ఈ సినిమా చూసిన కశ్మీర్ పండిట్లు గతాన్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అలా ఎంతోమందిని కదిలిస్తోందీ చిన్న చిత్రం. మార్చి 11న విడుదలైన ఈ సినిమా నిన్నటితో వందకోట్ల మైలు రాయిని దాటేసింది. వారంరోజుల తర్వాత కూడా (ఎనిమిదో రోజు) 19 కోట్లకు పైగా రాబట్టి బాహుబలి 2 రికార్డుతో సరిసమానంగా తులతూగింది. ఈ విషయాన్ని ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'ది కశ్మీర్ ఫైల్స్ చరిత్ర సృష్టించింది. ఎనిమిదో రోజు అత్యధికంగా రూ.19.15 కోట్లు రాబట్టి దంగల్(రూ.18.59) రికార్డును బద్ధలు కొట్టడమే కాకుండా బాహుబలి 2(రూ.19.75) సరసన నిలిచింది. మొత్తంగా రూ.116.45 కోట్లు రాబట్టి ఆల్టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచింది' అని ట్వీట్ చేశాడు. చదవండి: బిగ్బీ ట్వీట్పై నెటిజన్ల ట్రోలింగ్, కశ్మీర్ ఫైల్స్ గురించేనా? #TheKashmirFiles creates HISTORY… *Day 8* of #TKF [₹ 19.15 cr] is AT PAR with #Baahubali2 [₹ 19.75 cr] and HIGHER THAN #Dangal [₹ 18.59 cr], the two ICONIC HITS… #TKF is now in august company of ALL TIME BLOCKBUSTERS… [Week 2] Fri 19.15 cr. Total: ₹ 116.45 cr. #India biz. pic.twitter.com/sjLWXV78J9 — taran adarsh (@taran_adarsh) March 19, 2022 అంతేకాదు, రెండో వారంలో రూ. 150 కోట్ల మార్క్ను కూడా అవలీలగా అందుకుంటుందని జోస్యం పలికాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా డబ్ అవుతోందని చెప్పాడు. కాగా కశ్మీర్ ఫైల్స్లో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్, చిన్మయి, భాషా సుంబ్లి తదితులు నటించారు. ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్, గోవా, త్రిపుర, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించారు. చదవండి: #TheKashmirFiles highlights... ⭐ Records its HIGHEST *single day total* on [second] Fri [₹ 19.15 cr] ⭐ Will comfortably cross ₹ 150 cr in Weekend 2 ⭐ Advance bookings for [second] Sat and Sun are PHENOMENAL ⭐ Being dubbed in #Tamil, #Telugu, #Kannada and #Malayalam pic.twitter.com/QIfBj7kmcB — taran adarsh (@taran_adarsh) March 19, 2022 -
‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్, ట్వీట్ వైరల్
Prakash Raj Comments On The Kashmir Files Movie: నిజ సంఘటనల ఆధారం బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్రి హోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనూహ్య స్పందన వస్తోంది. జమ్మూకశ్మీర్లో 1990లలో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలను ఈ చిత్రంలో చూపించారు. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ సంచలనం సృష్టిస్తోంది. ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్ తొలి ట్వీట్, నెటిజన్ల అసహనం 'కశ్మీర్ ఫైల్స్ చిత్రం పాత గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొట్టేలా చేస్తుందా? లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా? జస్ట్ ఆస్కింగ్' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రకాశ్ రాజ్ ట్వీట్ హాట్టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే ఈ మూవీ మాత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ప్రధాని మోదీ నుంచి ఎందరో బీజేపీ నేతలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి కొన్ని రాష్ట్రాలు బెనెఫిట్స్ షోలను కూడా ప్రకటించాయి. కాగా ఈ మూవీ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి కేంద్ర హోంశాఖ 'వై' కేటగిరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: Vidya Balan: నాతో దారుణంగా ప్రవర్తించారు, 6 నెలలు అద్ధంలో చూసుకోలేదు #kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA — Prakash Raj (@prakashraaj) March 18, 2022 -
The Kashmir Files: అందుకే పబ్లిసిటీ చేయలేదు.. నిర్మాత అభిషేక్ అగర్వాల్
‘సినిమా అనేది కమర్షియల్. కానీ ఐదు లక్షల మంది కశ్మీర్ పండిట్ల బాధలు, సమస్యలను 32 ఏళ్ల తర్వాత ‘ది కశ్మీర్ ఫైల్స్’మూవీతో బయటకు తెచ్చాం. ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు చేస్తున్నాను’అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. పెను సంచలనంగా మారింది. విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. ఆ విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ► సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్కు వచ్చింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుంచి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది. అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ ల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. రెండు వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. ►ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్ చేశాం.. మూడు నెలలపాటు అమెరికా, కెనడ, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ► ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్లనుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు. కశ్మీర్ పండితులకు ఈ సినిమా అంకితం చేస్తున్నాం. ► ప్రధాని నరేంద్రమోదీని కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. ► ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకుముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగాను ప్రిపేర్ అయ్యాను. ► నిజాయితీగా ఈ సినిమాను తెరకెక్కించాం. అందుకే ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు. ► త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం. ► మా సినిమాకు అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం 9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది. ►ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలమంది నటీనటులు ఫీల్ అయి చేశారు. రాత్రి పూటా ఆ పాత్రలో మమేకం అయి నిద్ర సరిగ్గా పట్టేదికాదు. ► షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి. ►ఈ సినిమాను అందరూ పర్సనల్ గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు. ►కొత్త సినిమాలు: రవితేజ తో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్తో ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా ఆలోచనలో వుంది. -
The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సంచలన ఆరోపణలు
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనాలతో పాటు రాజకీయ పరమైన చర్చలకూ నెలవైంది ఇప్పుడు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, సినిమా కలెక్షన్లు సంగతి పక్కనపెడితే.. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా కశ్మీర్ ఫైల్స్ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక విమర్శలకతీతంగా.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసలు గుప్పిస్తున్నారంతా. మరోపక్క విపక్షాలు సినిమాపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా The Kashmir Files అబద్ధాలు చూపించిందని సెటైర్లు గుప్పించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. నటుడు ప్రకాశ్రాజ్ కూడా ఈ అంశంపై వీడియో పోస్ట్తో ఓ ట్వీట్ చేశారు. #kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA — Prakash Raj (@prakashraaj) March 18, 2022 ఇదిలా ఉండగా.. ఎన్డీఏ భాగస్వామి నేత ఒకరు కశ్మీర్ ఫైల్స్పై సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన Hindustani Awam Morcha వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ సంచలన ఆరోపణలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మేకర్లకు ఉగ్రవాద సంబంధిత గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు ఆయన. फिल्म के नाम पर जो माहौल बनाया जा रहा है, उससे हिन्दु-मुस्लिम सहित विभिन्न धर्मों के बीच खाई और बढ़ेगी, जो किसी भी प्रकार से देशहित में नहीं है। — Ashok Gehlot (@ashokgehlot51) March 17, 2022 ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీహార్లో ట్యాక్స్ మినహాయింపు ప్రకటించింది ప్రభుత్వం. ఆ మరునాడే జితన్ మాంఝీ విమర్శలు గుప్పించడం విశేషం. ‘‘ఈ మూవీ కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్కు తిరిగి రాకుండా వారిలో భయాందోళనలు రేకెత్తించేందుకు ఉగ్రవాద సంస్థల కుట్రగా కనిపిస్తుంద’’ని ట్వీట్ చేశారు మాంఝీ. అంతేకాదు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో సహా కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండొచ్చన్న మాంఝీ.. ఈ విషయంపై సీరియస్గా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. “द कश्मीर फाइल्स”आतंकवादियों की एक गहरी साजिश भी हो सकती है,जिसे दिखाकर आतंकी संगठन कश्मीरी ब्राम्हण मे खौफ एवं डर का माहौल बना रहें हैं ताकि डर से कश्मीरी ब्राम्हण पुनः कश्मीर ना जा पाएं। “द कश्मीर फाइल्स”फिल्म यूनिट सदस्यों के आतंकी कनेक्शन की जांच होनी चाहिए। .@AnupamPKher — Jitan Ram Manjhi (@jitanrmanjhi) March 18, 2022 इबादतों और बख्शीश की रात शब-ए-बारात की दिली मुबारकबाद। अल्लाह से दुआ है कि वह हम सभी की गलतियों को माफ कर हमारी अर्जियां कबूल फरमाएं। — Jitan Ram Manjhi (@jitanrmanjhi) March 18, 2022 ఇదిలా ఉండగా.. ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను అందించింది కేంద్రం. కశ్మీర్ ఫైల్స్ విడుదల అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఏడు నుంచి ఎనిమిది సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద్రత కల్పించనున్నారు. -
ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్కు 'వై' కేటగిరీ భద్రత
కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా మార్చి 11న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ బజ్తో దూసుకుపోతోంది. కేవలం మౌత్టాక్తోనే జనాలను థియేటర్లకు రప్పిస్తూ ఇప్పటివరకు మొత్తంగా రూ.97 కోట్లు రాబట్టింది. ఈరోజు వచ్చే కలెక్షన్లతో కశ్మీర్ ఫైల్స్ వందకోట్లు రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోవడం ఖాయం. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే అతడికి ఏదైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉండటంతో కేంద్రం వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను కేటాయించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. కాగా ఈ సినిమాకు పలు రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించిన విషయం తెలిసిందే! చదవండి: The Kashmir Files: ఓటీటీలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
కశ్మీర్ ఫైల్స్: పిరికిపందలా తయారయ్యారేంటి బిగ్బీ?
The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్.. మార్చి 11న రిలీజైందీ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.97.30 కోట్లు రాబట్టింది. కంగనా రనౌత్, వరుణ్ ధావన్, యామీ గౌతమ్ వంటి పలువురు సెలబ్రిటీలు కశ్మీర్ ఫైల్స్ సినిమా మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ ఈ సినిమా పేరెత్తకుండా దాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. 'T 4222 - అంతకుముందు తెలియనిది ఇప్పుడు తెలిసింది' అంటూ బిగ్బీ ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు మీకు సినిమా పేరును ప్రస్తావించే ధైర్యం కూడా లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 'కశ్మీర్ ఫైల్స్ అని టైప్ చేయడానికి ఇంతలా భయపడుతున్నారా?', 'మరీ పిరికిపందలా మాట్లాడుతున్నారు బచ్చన్ సార్, డైరెక్ట్గా పొగడవచ్చు కదా, దేనికీ దాగుడుమూతలు?', 'మీరు ఇప్పుడు ఏదైతే తెలిసింది అంటున్నారో, దాన్ని ఎప్పుడూ తెలుసుకోవాలని అనుకోలేదు' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఆడేసుకుంటున్నారు. T 4222 - .. we know now , what we never knew then .. — Amitabh Bachchan (@SrBachchan) March 16, 2022 చదవండి: ఇది నా జీవితంలో జరిగింది, అర్ధరాత్రి కశ్మీర్ను వీడాం: నటి ఎమోషనల్ -
అర్ధరాత్రి ట్రక్కులో నక్కి కశ్మీర్ను వదిలి వెళ్లాం: నటి భావోద్వేగం
ది కశ్మీర్ ఫైల్స్.. 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన హింసాకాండకు వెండితెర రూపమే ఈ సినిమా! ఇది రిలీజైన నాటి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుండగా చప్పట్లతో పాటు చీదరింపులు కూడా ఎక్కువయ్యాయి. థియేటర్లో సినిమా చూసిన ఎంతోమంది కంటనీరుతో బయటకు వస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా చూసిన బాలీవుడ్ నటి సందీప ధర్ గత స్మృతులలోకి వెళ్లింది. ముప్పై ఏళ్ల క్రితం తన కుటుంబం కూడా కశ్మీర్ నుంచి వలసపోయిందని గుర్తు చేసుకుంది. 'కశ్మీర్ పండిట్లు కశ్మీర్ను వదిలి వెళ్లిపోవాలని ప్రకటించిన రోజది.. అప్పుడే నా కుటుంబం సొంత గడ్డను వదిలేయాలని నిర్ణయించుకుంది. అలా మేము కశ్మీర్ను వదిలి వెళ్లేందుకు ట్రక్కు వెనకభాగంలో దూరిపోయాం. నా కజిన్ మా నాన్న కాళ్ల దగ్గర ఉన్న ఒక సీటుకింద దాక్కుంది... సరిగ్గా ఇదే సన్నివేశం కశ్మీర్ ఫైల్స్లో ఉండటంతో నేను షాకయ్యాను. నా కథే నేను మళ్లీ చూసుకున్నట్లనిపించింది. మా అమ్మానాన్నల పరిస్థితి అయితే మరీ ఘోరం. సినిమా చూసిన తర్వాత వారు అత్యంత బాధాకరమైన జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. మా నానమ్మ చనిపోయింది. కానీ ఆమె పుట్టిపెరిగిన గడ్డ మాత్రం కశ్మీరే.' చదవండి: 'ది కశ్మీర్ ఫైల్స్' ప్రభంజనం, ఎన్ని కోట్లు సాధించిందంటే? 'ఈ ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి నాకు చాలా కాలమే పట్టింది. కానీ ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రపంచానికి నిజాన్ని పరిచయం చేసినందుకు వివేక్ అగ్నిహోత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనుపమ్ ఖేర్తో సహా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ నా హ్యాట్సాఫ్' అని రాసుకొచ్చింది సందీప. కాగా సందీప శ్రీనగర్లోని కశ్మీర్ పండిట్ కుటుంబంలో జన్మించింది. అక్కడ చెలరేగిన హింసాకాండతో ఆమె కుటుంబం కశ్మీర్ నుంచి వలస వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే సందీప 'దబాంగ్ 2', 'హీరోపంతి' చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Sandeepa Dhar (@iamsandeepadhar) చదవండి: సినిమా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్డే లీవ్ -
‘కశ్మీర్ ఫైల్స్’ను ఆయుధంగా మార్చుతున్నారు: మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేత మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇటీవల విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని కేంద్ర ప్రభుత్వం కావాలని అధికంగా ప్రమోట్ చేస్తోందని దుయ్యబట్టారు. కశ్మీర్ పండిట్ల బాధను కూడా తమకు అనుకూలంగా ఓ ఆయుధంగా మార్చుకుంటుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆ సినిమాను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తీరును గమనిస్తే.. వారి(బీజేపీ) దురుద్దేశం ఏంటో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా పేరులో రెండు వర్గాలను ఉద్దేశపూర్వకంగా చీల్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాత గాయాలను మాన్పి, రెండు వర్గాల మధ్య అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి బదులు వాటిని చీల్చడానికే తెరలేపుతోందని మండిపడ్డారు. అంతకు ముందు ఈ సినిమాపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. కశ్మీరీ పండిట్ల వలసలకు కారణమైన దోషులను గుర్తించడానికి.. ఆ సంఘటన ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి నిజాయితీగా దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఆ సమయంలో గవర్నర్గా ఉన్న జగ్మోహన్ బతికి ఉంటే వాస్తవాన్ని చెప్పేవారని అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రతి సినిమా.. కథను ఒక ప్రత్యేకమైన రీతిలో చిత్రీకరిస్తుందని, సినిమా ఖచ్చితమైన సత్యాన్ని చిత్రీకరించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఇదిలా ఉండగా, కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీ ద్వేషాన్ని పెంచుతూ లాభం పొందుతోందని మండిపడుతోంది. 1990లో కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్ల వలసల నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన విషయం తెలిసిందే. అదే విధంగా సినిమా సత్యాన్ని సరైన రూపంలోకి తెచ్చిందని, చరిత్రను ఎప్పటికప్పుడు సరైన సందర్భంలో అందించాలని ప్రధాని మోదీ తెలిపారు. -
'ది కశ్మీర్ ఫైల్స్' ప్రభంజనం, ఎన్ని కోట్లు సాధించిందంటే?
ది కశ్మీర్ ఫైల్స్.. చిన్న సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా బాక్సాఫీస్పై వసూళ్లతో విరుచుకుపడుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు అక్షరాలా రూ.60 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని ట్రేడ్ గురు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ సునామీగా, బ్లాక్బస్టర్గా నిలిచింది. రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. సినిమా రిలీజైన తొలి(మార్చి 11) రోజు మూడున్నర కోట్లు వచ్చాయి. రెండో రోజు రూ.8.50 కోట్లు, మూడో రోజు రూ.15.10 కోట్లు, నాలుగో రోజు రూ.15.05 కోట్లు వచ్చాయి. ఇక ఐదో రోజు(మంగళవారం నాడు) ఏకంగా రూ.18 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ.60.20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి' అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కలెక్షన్ల స్పీడ్ చూస్తుంటే త్వరలోనే వందకోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించడగా దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. #TheKashmirFiles is a TSUNAMI at the #BO… FANTASTIC TRENDING, as footfalls, occupancy, numbers continue to soar… Day 5 higher than *all* previous days… BLOCKBUSTER... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr, Mon 15.05 cr, Tue 18 cr. Total: ₹ 60.20 cr. #India biz. pic.twitter.com/uaDH3ooVsO — taran adarsh (@taran_adarsh) March 16, 2022 చదవండి: ఓటీటీలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
The Kashmir Files: ఓటీటీలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ.. పెను సంచలనంగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు అడగకుండానే వినోదపు పన్నును మినహాయించాయి. అస్సాం ప్రభుత్వం అయితే ఈ సినిమా కోసం ఏకంగా తమ ఉద్యోగులకు హాప్డే సెలవునే ప్రకటించింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకెళ్తోంది. రూ. 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 50 కోట్లను కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. ఈ వారాంతంలో ఈ మూవీ కచ్చితంగా రూ.100 కోట్లు వసూళ్లను రాబడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీల విడుదలవుతుందా అని సీనీ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ మూవీ విడుదలైన (మార్చి 11) నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. ఈ మేరకు ఒప్పద్దం కూడా కుదుర్చుకున్నారు అయితే ఇప్పుడు ఈ చిత్రానికి వచ్చి క్రేజ్ దృష్ట్యా ఓటీటీ విడుదల తేదిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో కాకుండా.. మేలో ఈ చిత్రాన్ని ఓటీటీ విడుదల చేయాలని భావిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం మే 6 నుంచి జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం విషయానికొస్తే.. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. -
సినిమా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్డే లీవ్
Assam Govt Employees To Get Half-Day Leave To Watch The Movie: ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఇటీవల తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. సీనీ, రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ఈ సినిమాని ప్రశంసించారు. ఇటీవల జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఈ సినిమా చూడాలంటూ ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించాడు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘ది కశ్మీర్ ఫైల్స్’పై వినోదపు పన్నును తొలగించింది. ఇదిలా ఉంటే తాజాగా..ఈ సినిమా చూడడం కోసం అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు ప్రకటించి ఆశ్చరపరిచింది. ఈ సినిమా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్డే లీవ్ ప్రకటించింది. సినిమా చూసిన తదుపరి రోజు పై అధికారికి సినిమా టికెట్ చూపించి, లీవ్ అప్లై చేస్తే హాప్డే లీవ్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఒక సినిమా కోసం ప్రభుత్వమే స్వయంగా సెలవును ప్రకటించడం విశేషం. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వికేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. -
ఐదేళ్లుగా సినీ ఇండస్ట్రీ ఐసీయూ బెడ్పై ఉంది.. ఈ సినిమాతోనే ఆక్సిజన్ దొరికింది
Swara Bhasker Brutally Trolled For Allegedly Dig At Vivek Agnihotri: బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సినిమాలో విభిన్నమైన పాత్రలు చేసే స్వరా వాస్తవ జీవితంలో కూడా విభిన్నంగా ఉంటుంది. సినిమాలపై స్పందన నుంచి సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంది స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజన్ల మనోభావాలు దెబ్బతినే పోస్టులు, ట్వీట్లు పెట్టి ట్రోలింగ్కు గురవుతూ ఉంటుంది. తాజాగా మరొసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంది స్వరా భాస్కర్. 'మీ కష్టంతో వచ్చిన విజయాన్ని చూసి మిమ్మల్ని ఎవరైనా అభినందించాలని అనుకుంటే.. గత ఐదేళ్లుగా తలలో చెత్త పెట్టుకుని గడపరనుకుంటా.' అని ట్వీట్ చేసింది ఈ కాంట్రవర్సీ బ్యూటీ. అయితే ఈ ట్వీట్ 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ఉద్దేశించి చేసిందని నెటిజన్స్ స్వరాపై మండిపడుతున్నారు. ట్వీట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. వరుసగా ట్రోలింగ్ చేస్తున్నారు. 'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటా స్వరా. ప్రజలు అడుగుతున్నారు.. తాము ఆదరిస్తున్న సినిమాను ఎందుకు ప్రముఖ బాలీవుడ్ తారలు మెచ్చుకునేలా ఒక్క పదం కూడా మాట్లాడట్లేదని. అంటే కేవలం ప్రముఖమైన వారు మాత్రమే. మీరు చిల్ అవ్వండి.' అని నెటిజన్ కామెంట్ చేశాడు. మరో యూజర్ 'స్వరా చాలా తెలివైనది. ఒకరి కష్టంపై పేరు సంపాందించుకోవడం ఎలానో తనకు చాలా బాగా తెలుసు. కానీ జనం పిచ్చోళ్లు కాదు. నిన్ను నమ్మడానికి. ఇది నీ కెరీర్కు సహాయపడదు.' అని రాసుకొచ్చాడు. If you want someone to congratulate you for the ‘success’ of your efforts.. maybe don’t spend the last five years shitting on their heads.. 💁🏾♀️ #justsaying — Swara Bhasker (@ReallySwara) March 13, 2022 మరొకరైతే 'అతను అభినందించడానికి అర్హుడు స్వరా. ఐదేళ్ల నుంచి బాలీవుడ్ దాదాపు ఐసీయూ బెడ్పై ఉంది. ఈరోజు బాలీవుడ్కు అతనే ఆక్సిజన్ అందించాడు. ప్రజలు మర్చిపోయిన మిమ్మల్ని అతనే గుర్తు చేశాడు.' అని రాశారు. కాగా మార్చి 11న విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ తారలు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, యామీ గౌతమ్, హన్సల్ మెహతా, ఆదిత్య ధర్ తదితరులు ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చిన ఈ చిత్రానికి హర్యాణా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కల్పించాయి. He deserve to be Congratulated @ReallySwara Since 5 years Bollywood has almost in ICU Bed, Today he gave Oxygen for Bollywood.. You were deleted from people brain, he reminded.. If you not support him by thinking he's not Terrorists gang, then read comments@vivekagnihotri https://t.co/EOSyiB3jc3 — RaMesh Chauhan #BJP_Only (@RameshChauhanM) March 14, 2022 People are talking about big Bollywood stars .. U can chill..Nobody is expecting anything from you.. #TheKashmiriFiles https://t.co/WtX3whFLjn — Upadhya Dr 🇮🇳 (@LonelyStranger_) March 14, 2022 -
ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత
Pranitha Subhash Gets Tears After Watching The Kashmir Files Movie: గుండ్రని కళ్లతో, చక్కని చిరునవ్వుతో కుర్రకారు మనసు దోచిన చిన్నది ప్రణీత సుభాష్. 'ఏం పిల్లో.. ఏం పిల్లడో; సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బాపుబొమ్మ సిద్ధార్థ్ సరసన హీరోయిన్గా 'బావ' మూవీలో నటించి మెప్పించింది. తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్బస్టర్ హిట్ 'అత్తారింటింకి దారేది' సినిమాతో సెకండ్ హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అనంతరం తెలుగులో అవకాశాలు లేక కనుమరుగైంది. సినిమాల మాట ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ప్రణీత. ఈ సోషల్ మీడియా వేదికగా తను, ఆమె భర్త ఓ సినిమా చూసి ఏడ్చేశాం అని చెప్పుకొచ్చింది. చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ప్రణీత తన ఇన్స్టా గ్రామ్ హ్యాండిల్లో ''మేము 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా వీక్షించాం. ఈ చిత్రం పూర్తయ్యేసరికి నేనూ, నా భర్త ఏడ్చేశాం. సుమారు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు చూపించారు.'' అని పోస్ట్ పెట్టింది. అలాగే ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడాలని కోరింది. కాగా 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా తెరకెక్కిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. ఈ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు. హర్యాణా, మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కూడా ప్రకటించాయి. ఈ చిత్రాన్ని వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో -
ప్రధాని మెచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై కంగనా కామెంట్స్
దర్శకుడు వివేక్ అగ్రి హోత్రి ఇటీవల తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’కపై సినీ, రాజకీయ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు కలేక్షన్ల పరంగా కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ని ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఈ మూవీ మరింత పాపులరిటీ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా చూసిన బాలీవుడ్ ఫ్రైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన రివ్యూ ఇచ్చింది. ఆమె హోస్ట్ వస్తున్న కాంట్రవర్సల్ రియాలిటీ షో లాక్అప్ నిన్నటి ఎపిసోడ్లో కంగనా ఈ మూవీ గురించి ప్రస్తావించింది. చదవండి: యాంకర్ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్ రికార్డు ఇంకా ఉంది ఈ మేరకు ఆమె ‘‘ఈ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రితో పాటు నిర్మాతలకు, మూవీ టీంకు అభినందనలు. సినిమా పరిశ్రమ పాపాలను వారు కడిగేశారు. బాలీవుడ్ చేసిన పాపాలను కూడా ప్రక్షాళన చేశారు. కశ్మీర్ ఫైల్స్ను గొప్పగా చూపించారు. పరిశ్రమలో ఎలుకల్లా దాగిన వారు బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాలి. పనికిరాని సినిమాలను ప్రోత్సహించే వారందరూ సినిమాకు మద్దతుగా నిలవాలి’’ అని కంగనా పిలుపునిచ్చింది. కాగా గతవారం కూడా కంగనా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ ఏడాది వచ్చిన వాటిల్లో ఎంతో విజయవంతమైన, లాభదాయకమైన చిత్రంగా ఆమె దీన్ని పేర్కొంటూ, కేస్ స్టడీగా తీసుకోవాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ఆర్జీవీ రివ్యూ, ఏమన్నాడంటే.. -
‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ఆర్జీవీ రివ్యూ, ఏమన్నాడంటే..
నిజ సంఘటన ఆధారం బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్రి హోత్రి ఇటీవల తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్స్కు మంచి స్పందన వస్తోంది. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు కలేక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు అంటే ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఈ మూవీ మరింత పాపులరిటీ తెచ్చుకుంది. ప్రధాని మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా ట్వీట్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. చదవండి: యాంకర్ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్ రికార్డు ఇంకా ఉంది ఈ సినిమా చూసిన ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే ఎక్కువగా ఫైర్ అయ్యారు. ఈ సినిమాతో బాలీవుడ్ని తొక్కేసి కొత్తగా వివేక్ వుడ్ని స్థాపించినట్టే. కొత్త సినిమా దర్శక నిర్మాతలకి స్ఫూర్తిగా నిలిచాడు వివేక్. ది కశ్మీర్ ఫైల్స్ కమర్షియల్ సక్సెస్ని పక్కన పెడితే అంతకంటే కూడా భారీ విజయం సాధించింది’ అంటూ ఆర్జీవీ ప్రశంసలు కురించిపించాడు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ సినిమాపై ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కాగా హిందువులపై, 1980-90 దశకంలో కాశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండని ఆధారంగా తీసుకొని ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాని తెరకెక్కించారు. జీ స్టూడియోస్, తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. చదవండి: ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ అసహనం Apart from the EXPLOSIVE material he so DARINGLY exposed , #VivekRanjanAgnihotri TRAMPLED BOLLYWOOD by CREATING his own VIVEKWOOD which will inspire a new BREED of revolutionary film makers and that’s the ULTIMATE victory more than #KashmirFiles humongous commercial success — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2022 -
రాధేశ్యామ్కు పోటీ ఇవ్వనున్న చిత్రం ఇదేనా !
Radhe Shyam Vs The Kashmir Files Box Office Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్'. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. 'రాధేశ్యామ్' ఇండియాలో మొదటి వారంలో సుమారు రూ. 94.50 కోట్లు కొల్లగొట్టింది. అందులో ఒక్క తెలుగు రాష్టాల (తెలంగాణ/ఏపీ) నుంచి రూ. 78.64 కోట్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసింది 'రాధేశ్యామ్'. చదవండి: అప్పుడే ఓటీటీకి రాధేశ్యామ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. కాకపోతే ప్రభాస్ పాపులారిటీ, సినిమా ప్రమోషన్స్తో విడుదలైన తొలిరోజు రూ. 46 కోట్లు కొల్లగొట్టింది 'రాధేశ్యామ్'. తర్వాత మిక్స్డ్ పబ్లిక్ టాక్తో రోజురోజూకీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గుతున్నాయి. శనివారం (మార్చి 12) రూ. 24. 50 కోట్లు వసూలు చేయగా ఆదివారం (మార్చి 13) రూ. 24 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లలో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.85 కోట్లతో విడుదలైన రోజు ప్రారంభం కాగా శనివారం రూ. 21.48 కోట్లు, ఆదివారం 19.31 కోట్లు వసూళ్లు సాధించింది. నిజానికి పెద్ద హీరోలంటే విడుదలైన రోజు కంటే తర్వాత రోజుల్లో కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ రాధేశ్యామ్ మాత్రం మిక్స్డ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. #RadheShyam AP/TS Box Office Biz stays STRONG despite mixed response. Day 1 - ₹ 37.85 cr Day 2 - ₹ 21.48 cr Day 3 - ₹ 19.31 cr Total - ₹ 78.64 cr#Prabhas — Manobala Vijayabalan (@ManobalaV) March 14, 2022 చదవండి: ప్రధాని మోదీ మెచ్చిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'.. సినిమాలో ఏముంది ? ఇక అనేక వివాదాలు, బెదిరింపులు ఎదుర్కొని విడుదలైన హిందీ చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ చిత్రానికి సామాజిక అంశాలను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించే డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి పాపులర్ యాక్టర్స్ నటించిన ఈ చిత్రం 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణకాండకు అద్దం పడుతుంది. అదే మార్చి 11న విడుదలైన ఈ మూవీ సాధారణ కలెక్షన్లతో ప్రారంభమైంది. తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురుపించడంతో మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది. దీంతో రోజు రోజుకీ ఈ సినిమా వసూళ్లు పెరిగిపోతున్నాయి. శుక్రవారం విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' మొదటి రోజు రూ. 3.55 కోట్లు రాబట్టగా, శనివారం రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత ఆదివారం ఒకేసారి భారీగా రూ. 15.10 కోట్లు వసూళ్లు చేసింది. మొత్తంగా మొదటి వారంలో ఈ మూవీ వసూళ్లు రూ. 27.15 కోట్లకు చేరుకున్నాయి. #TheKashmirFiles shows PHENOMENAL GROWTH… Grows 325.35% on Day 3 [vis-à-vis Day 1], NEW RECORD… Metros + mass belt, multiplexes + single screens, the *opening weekend biz* is TERRIFIC across the board... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr. Total: ₹ 27.15 cr. #India biz. pic.twitter.com/FsKN36sDCp — taran adarsh (@taran_adarsh) March 14, 2022 కలెక్షన్లతో పోల్చుకుంటే 'రాధేశ్యామ్'కు చాలా వెనకంజలో 'ది కశ్మీర్ ఫైల్స్' ఉంది. కానీ రెండు సినిమాలపై ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం 'రాధేశ్యామ్'ను 'ది కశ్మీర్ ఫైల్స్' కొద్దివరకైనా చేరుకునే అవకాశాలు లేకపోలేదని మూవీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా రెండు సినిమా కథలను మాత్రం పోల్చి చూడలేం. ఒకటి రొమాంటిక్ లవ్స్టోరీ అయితే మరొకటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అయితే ప్రభాస్ స్టార్డమ్, వరల్డ్వైడ్గా డార్లింగ్ ఉన్న పాపులారిటీని 'ది కశ్మీర్ ఫైల్స్' రీచ్ అవుతుందా ?.. లేదా బీట్ చేస్తుందా ? చూడాలి. చదవండి: డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో