Kidari Sarveswara Rao
-
కిడారి హత్యకేసులో సప్లిమెంటరీ చార్జిషీట్
విజయవాడ లీగల్: విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యకేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం విజయవాడ నగర మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేసింది. 2018లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్ఐఏ 59 మందిని నిందితులుగా పేర్కొంది. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలులో ఉన్నారు. ఈ కేసులో 59వ నిందితురాలైన సాకే కళావతి అలియాస్ భవానీపై సప్లిమెంటరీ చార్జిషీటును దాఖలు చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకూరి పెద్దన్న భార్య, మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలైన కళావతి హత్య చేసిన సమయంలో ఇన్సాస్ రైఫిల్తో పాటు పలు మారణాయుధాలను కళావతి ధరించిందని, కిడారి, సివిరి హత్యలకు పదిహేను రోజుల ముందు డుంబ్రిగూడలో రెక్కీ, బస చేసారని ఎన్ఐఏ తెలిపింది. చదవండి: ఇసుక రీచ్ల సబ్ లీజుల పేరిట భారీ మోసం -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్
సాక్షి, విశాఖసిటీ: పార్టీపై నమ్మకంతో గెలిపిస్తే ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గారు. ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతూ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన నేతల తలరాతల్ని ఓటర్లు మార్చారు. విశ్వాసఘాతుకానికి పాల్పడితే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఓటర్లు బుద్ధి చెప్పారు. ఫిరాయింపుదారులు మళ్లీ తలెత్తుకోనివ్వకుండా గుర్తుండిపోయే ఓటమిని రుచిచూపించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించి అధికార టీడీపీకి అమ్ముడు పోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని ఘెర పరాజయాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. 2014లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గిడ్డిని ఓడించి బుద్ధి చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన భాగ్యలక్ష్మి చేతిలో 40,900 ఓట్ల తేడాతో గిడ్డి ఈశ్వరి ఓటమి పాలైంది. అదే విధంగా అరకులో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2014లో విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సర్వేశ్వరరావు స్థానంలో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్కుమార్కు మంత్రి పదవి కట్టబెట్టి.. 2019 అరకు ఎమ్మెల్యే టికెట్ను టీడీపీ అప్పగించింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శెట్టి ఫాల్గుణ ఫిరాయింపు ఎమ్మెల్యే కుమారుడు, తాజా మాజీ మంత్రి శ్రావణ్కుమార్ని 33,172 ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. ఎలాంటి సానుభూతి చూపకుండా అరకు ప్రజలు కిడారిని ఇంటికి సాగనంపారు. ఇక అరకు ఎంపీగా వైఎస్సార్సీపీ విజయం సాధించిన కొత్తపల్లి గీత.. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచింది. టీడీపీ, బీజేపీ వైపు చూసిన గీత.. చివరికి జనజాగృతి పార్టీని స్థాపించి విశాఖ ఎంపీగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీకి గీత చేసిన అన్యాయాన్ని గుర్తించుకున్న ప్రజలు.. డిపాజిట్ రాకుండా చేశారు. 12 లక్షల పై చిలుకు ఓట్లు పోలైన విశాఖ ఎంపీ స్థానంలో ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీతకు కేవలం 1,127 ఓట్లు మాత్రమే పోలవ్వడం హాస్యాస్పదం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. -
టీడీపీ నేతలకు మావోల హెచ్చరిక!
అల్లిపురం (విశాఖ దక్షిణం): టీడీపీ మంత్రులు, నాయకులను హెచ్చరిస్తూ సీపీఐ మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం గురువారం రాత్రి ఒక లేఖ విడుదల చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్, గిడ్డి ఈశ్వరిలతో పాటు మండల నాయకులు కొర్ర బలరాం, మామిడి బాలయ్య, ముక్కల మహేష్, వండలం బాలయ్య, నళినిలను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో మన్యంలో నడుస్తోన్న పోలీసు నిర్భందాన్ని ఎత్తివేయకపోతే టీడీపీ నాయకులపై ప్రజలు, సీపీఐ మావోయిస్టు పార్టీ తీసుకునే చర్యలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. విశాఖ మన్యంలో 2017 మే నుండి ‘సమాధాన్’ దాడిలో భాగంగా రాజ్యనిర్బంధం అమలవుతోందని, గ్రామాలపై నిత్యం పోలీసులు దాడులు, అక్రమ అరెస్ట్లు, వేధింపులతో మన్యంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. గత సంవత్సరం ఆర్వీ నగర్, చాపగట్ట, సిరిబాల ఎస్టేట్ చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజలు ఏపీఎఫ్డీసీ వద్ద కూలీలుగా పని చేయబోమని, కాఫీ తోటలపై హక్కు తమదేనని గొత్తెత్తినందుకు వారిపై మావోయిస్టు సానుభూతిపరులుగా ముద్రవేసి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని కైలాసం పేర్కొన్నారు. మే 1వ తేదీ నాడు వంచుల పంచాయితీ పనసలొద్ది, కొత్తవాదురుపల్లి గ్రామాలపై పోలీసులు దాడులు చేసి ఆరుగురు రైతులను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని, వారి విడుదల కోసం ఆ గ్రామాల ప్రజలు రెండు రోజులు పాటు పోలీసుల చుట్టు తిరిగినా వాళ్లని పట్టించుకున్న వాళ్లే లేరన్నారు. -
మంత్రి పదవికి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా
-
పదవికి రాజీనామా చేసిన మంత్రి
అమరావతి: మంత్రి పదవికి టీడీపీ నేత కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేశారు. సీఎంవోకు తన రాజీనామా లేఖను శ్రవణ్ అందజేశారు. సీఎంఓ ద్వారా రాజీనామాను గవర్నర్కు పంపారు. సుమారు 8 నెలల క్రితం మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును కిడ్నాప్ చేసి హత్య చేసిన సంగతి తెల్సిందే. హత్య జరిగిన తర్వాత 6 నెలల్లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేకపోవడంతో ఉప ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సర్వేశ్వర రావు కుమారుడు శ్రవణ్ కుమార్కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మంత్రి పదవి చేపట్టి 6 గడిచిపోయినా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిబంధనలకు లోబడే రాజీనామా: కిడారి రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాజీనామా చేసినట్లు కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు. మంత్రిగా ఆరు నెలల పదవీకాలంలో 3 నెలలు ఎన్నికల కోడ్కే పోయిందని చెప్పారు. గిరిజనుడిగా తనకు మంత్రి పదవి దక్కటం సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తనను కుటుంబసభ్యుడిగా చూసుకున్నారని వాఖ్యానించారు. తన శాఖ ద్వారా గిరిజనుల కోసం ఫుడ్ బాస్కెట్ పథకాన్ని తీసుకురావడం సంతోషకరంగా ఉందని తెలియజేశారు. 6 నెలలే పదవిలో ఉండడంపై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. -
మావోయిస్టు కామేశ్వరి ఎన్కౌంటర్
పశ్చిమగోదావరి ,జంగారెడ్డిగూడెం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మావోయిస్టు, భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, అలియాస్ చంద్రి, అలియాస్ సింద్రి, అలియాస్ రింకీ పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందింది. బుధవారం ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లా పడువా పోలీస్స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, పోలీసు బలగాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూపు(ఎస్ఓజీ) మధ్య పెద్దెత్తున ఎదురు కాల్పులు జరిగాయి. కోరాపుట్ జిల్లా ఎస్పీ కేవీ సింగ్ తెలిపిన వివరాలు ప్రకారం కోరాపుట్ జిల్లా నందాపూర్ బ్లాక్ పరిధిలో గల హతీబరి పంచాయతీ సమీపంలో కిటువాకమీ అడవుల్లో 15 మందికి పైగా మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు, ఎస్వోజీ బలగాలతో దాడులు నిర్వహించామన్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు, ఎస్వోజీ, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయని, ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆయన ధృవీకరించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ రింకీ ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈమె తల్లితండ్రులు శ్రీకాకుళంలో ఉండగా కామేశ్వరిని భీమవరంలో ఒక వ్యక్తికి చ్చి వివాహం చేశారు. కొంతకాలం కామేశ్వరి భర్తతో కాపురం చేయగా, వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తరువాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోలో కామేశ్వరి కండక్టర్గా పనిచేసింది. ఈ సమయంలోనే మావోయిస్టులపై ఆకర్షితురాలై 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ యాక్షన్ టీమ్ సభ్యురాలిగా మారింది. కిడారి, సోమ హత్యోదంతం అనంతరం వీటి వెనుక భీమవరానికి చెందిన కామేశ్వరి అనే మావోయిస్టు పాత్ర ఉందని పోలీసులు పేర్కొన్నప్పుడు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో మావోయిస్టుల వైపు ఎక్కువగా గిరిజనులు ఆకర్షితులై చేరుతుంటారు. అయితే మైదాన ప్రాంతం నుంచి మావోయిస్టుల్లో చేరడం అరుదు. జిల్లా నుంచి భీమవరంలో కొంత కాలం నివాసం ఉన్న కామేశ్వరి మావోయిస్టుల్లో చేరడం, క్రియాశీలకంగా మారి మావోయిస్టుల్లో ప్రధాన వ్యక్తిగా రూపాంతరం చెందింది. ఈ నేపధ్యంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె హతమైంది. జిల్లా నుంచి ఇలా మావోయిస్టుల్లో చేరి ఎన్కౌంట్లో హతమైన ఘటనలు గతంలోనూ జరిగాయి. -
మంత్రి పదవి కోల్పోనున్న కిడారి శ్రవణ్ కుమార్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు నెలల్లోగా ఏదో చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలి. ఈ నెల 10వ తేదీతో ఆరు నెలల గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు రాజ్భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్కు సమాచారం అందించింది. కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
‘కిడారికి పట్టిన గతే నీకూ పడుతుంది’
సాక్షి, గుంటూరు : పల్నాడులో మరోసారి మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కిడారి సర్వేశ్వర రావుకు పట్టిన గతే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు పడుతుందని హెచ్చరించారు మావోయిస్టులు. యరపతినేనితో పాటు పలువురు టీడీపీ నేతలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేశారు. ఈ లేఖలు దాచేపల్లి మోడ్రన్ స్కూల్ దగ్గర వెలిశాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు దర్శనమివ్వడం చర్చనీయంశంగా మారింది. -
ఎన్ఐఏ కస్టడీకి కిడారి హత్యకేసు నిందితులు
సాక్షి, విజయవాడ : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితులు సుబ్బారావు, ఈశ్వరి, శోభన్లను నాలుగు రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులకు ఈ నెల 31 వరకు ఎన్ఐఎ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితులను విశాఖపట్నం జైలుకు తరలించారు. కాగా గతేడాది సెప్టెంబర్ 23న కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా డుంబ్రిగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది నవంబర్ 30న ఎన్ఐఏను అదేశించింది. -
కేంద్ర దర్యాప్తు సంస్థకు ఎమ్మెల్యే కిడారి హత్య కేసు
సాక్షి, అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు బదిలీ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విశాఖ జిల్లా డుంబ్రిగుడ పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది నవంబర్ 30న ఎన్ఐఏను అదేశించింది. ఈనెల 6వ తేదీన కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హైదరాబాద్ యూనిట్కు అప్పగించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టినట్టు అయ్యింది. -
ఆ రోజు పోలీస్స్టేషన్లపై దాడులు..పచ్చ నేతల ప్రకోపమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామంలో సెప్టెంబర్ 23న మావోయిస్టులు మాటు వేసి కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను దారుణంగా కాల్చి చంపారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఘటన జరిగితే సాయంత్రం వరకు లివిటిపుట్టుకు పోలీసులు వెళ్లలేకపోవడం, డుంబ్రిగుడ ఎస్సై అమ్మనరావు వివాదాస్పద వ్యవహారశైలి నేపథ్యంలో అప్పటికే వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో కిడారి, సివేరిల మృతదేహాలను డుంబ్రిగుడ, అరకు పోలీస్స్టేషన్ల సమీపంలోకి తీసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. వందలాదిమంది పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. కంప్యూటర్లు, రికార్డులు సహా ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఖాకీ చొక్కాలు కనిపిస్తే చాలు.. ముందూవెనుకా చూడకుండా చితక్కొట్టేశారు. ఎస్సై సురేష్ సహా మొత్తం 16మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత రెండు పోలీస్స్టేషన్లకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యోదంతంతో భావోద్వేగానికి, ఆవేశానికి లోనైన గిరిజనులే ఇదంతా చేసి ఉంటారని అందరూ భావించారు. అయితే హత్యోదంతంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. కిడారి, సివేరిల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మావోలకు చేరవేసి టీడీపీ నేతలే వారి హత్యకు సహకరించారని బయటపడగా.. హత్యోదంతం తర్వాత పరిస్థితిని అదుపు చేయాల్సిన టీడీపీ నేతలే అమాయకులను రెచ్చగొట్టి దగ్గరుండి అరాచకాలు చేయించారని కూడా తేలింది. అరాచకం సృష్టించింది వీరే.. పోలీస్స్టేషన్లపై దాడి, ధ్వంసం, దహనం కేసుకు సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న మొత్తం 111మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితులు టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే కావడం గమనార్హం. కేసులో ఏ–2గా టీడీపీకి చెందిన అరకు జెడ్పీటీసీ కూన వనజ, ఏ–3గా ఆమె భర్త, టీడీపీ నాయకుడు కూన రమేష్, ఏ–4గా టీడీపీ ఎంపీటీసీ పి.అమ్మన్న, ఏ–5గా టీడీపీ ఎంపీటీసీ కిల్లో సాయిరాం, ఏ–6గా శెట్టి బాబూరావు, ఏ–8 గా సర్పంచ్ కిల్లో రఘునా«థ్, ఏ–9గా అరకు ఎంపీపీ శెట్టి అప్పాలు.. ఇలా 111 మంది నిందితుల్లో అత్యధిక శాతం టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే ఉన్నారు. మాపై పెట్రోలు పోసి కాల్చేయాలని చూశారు.. డుంబ్రిగుడ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ‘ఆ రోజు పోలీస్స్టేషన్లో విధుల్లో ఉన్న నన్ను, సహచర కానిస్టేబుల్ భాస్కరరావును పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. బండబూతులు తిట్టారు. వీరిద్దరినీ చంపేయండి.. అని కేకలు వేస్తూ పెట్రోలు క్యాన్లు ఓపెన్ చేసి... పెట్రోలు చల్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి అతి కష్టం మీద బయటపడ్డాం. మమ్మల్ని పెట్రోలు పోసి కాల్చేందుకు ప్రయత్నించిన వాళ్ళను గుర్తుపడతాం,. ఘటనా స్థలంలో టీడీపీ జెడ్పీటీసీ సహా మొత్తం టీడీపీ నేతలే ఉన్నారు. పోలీస్స్టేషన్లకు నిప్పంటించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, మమ్మల్ని కాల్చి చంపాలని చూసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి’.. అని డుంబ్రిగుడ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్.సత్యనారాయణ అదే పోలీస్స్టేషన్ ఎస్సైతో పాటు అరకు ఎస్సైకి ఫిర్యాదు చేశారు. అసలు దోషులు టీడీపీ నేతలని తేలడంతో కేసును తొక్కిపెట్టిన పోలీసు అధికారులు గిరిజనులే ఆవేశంలో ఇదంతా చేసి ఉంటారని తొలుత పోలీసులు కూడా భావించారు. అయితే విచారణలో ఫొటోలు, వీడియో ఫుటేజీల సాక్ష్యంగా మొత్తం టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించారని తేలడంతో పోలీసులు అధికారులు నివేదికను తొట్టిపెట్టేశారు. ఇప్పటివరకు అరెస్టుల్లేకుండా కేసు విచారణను నిలిపివేశారు. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్ హోం మంత్రి చినరాజప్పను కలిసి పోలీస్స్టేషన్పై దాడి, దహనం కేసులో అరెస్టుల్లేకుండా చూడాలని కోరారు. బాధ్యత గల అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించిన వైనం బట్టబయలు కావడంతో ప్రభుత్వం ఏమేరకు వ్యవహరిస్తుందో చూడాల్సిఉంది. -
తూతూ‘మంత్రం’గా
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ, ఎస్టీ వర్గాల నుంచి ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధమైంది! ఈమేరకు శాసనమండలి చైర్మన్ ఫరూక్, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్లకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందచేసినట్లు తెలిసింది. ఆదివారం రోజు ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వారిద్దరికీ సమా చారం ఇచ్చినట్లు తెలిసింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలో చూసినా మైనారిటీలు, గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. ఈ వర్గాలకు ప్రాతినిథ్యం లేకుండా మంత్రివర్గ ఏర్పాటు ఎన్నడూ జరగలేదు. ఈ నేపథ్యంలో నాలుగున్నరేళ్లు గడిచిపోయిన తరువాత ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు వెళ్లే ముందు మైనారిటీ, ఎస్టీలను మంత్రివర్గంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం ఆ వర్గాలకు సన్మానమా? అవమానమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఓ వ్యక్తిని తెచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే తమను ఎలా గౌరవించినట్లు అవుతుందని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఆయా వర్గాలను గౌరవించడం కాదు అవమానించినట్లుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పదవిస్తే అవమానం మాసిపోతుందా? రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన గిరిజన సలహా మండలి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండటంతో గిరిజన సలహా మండలిని నియమించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేసింది. దీనిపై పోరాడిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత పోరాటంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం ఎట్టకేలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన వారిని మంత్రి పదవిలోకి తీసుకున్నా ఇన్నేళ్లుగా గిరిజన వర్గానికి సర్కారు చేసిన అన్యాయం, అవమానం మాసిపోదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నిక కాకుండానే మంత్రిగా శ్రవణ్! మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నందున కిడారి శ్రవణ్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సభకూ ఎన్నిక కాకుండానే శ్రవణ్ మంత్రిగా కొనసాగుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ కోడెల ఆఖరి ప్రయత్నం.. విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్న క్యాంటీన్ కోసం రూ.5 లక్షల విరాళాన్ని అందించేందుకు వచ్చిన కోడెల శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వలేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలిసింది. రెండు బెర్తులే ఖాళీగా ఉన్నాయని, వాటిని ముస్లిం, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు తన వద్దే ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను ఎవరికి ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆ శాఖ తీసుకోవాలని యనమల రామకృష్ణుడికి సూచించినా వివాదాలున్నాయనే కారణంతో ఆయన నిరాకరించారు. రేపు గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం 11.45 గంటలకు ముహూర్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం పక్కన గ్రీవెన్స్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ)ను ఆదేశించింది. ఫరూక్, కిడారి శ్రవణ్లను కేబినెట్లోకి తీసుకోవడంతోపాటు కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కిడారి, సోమను అందుకే హతమార్చాం
విశాఖ సిటీ: బహుళ జాతి సంస్థలకు ఏజెంట్లుగా మారి కోట్లాది రూపాయల ఆదివాసీల సహజ సంపదను కొల్లగొడుతున్నందునే ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చామని మావోయిస్టులు ప్రకటించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ(ఏఓబీఎస్జెడ్సీ) లెటర్ హెడ్పై అధికార ప్రతినిధి జగబంధు పేరుతో శుక్రవారం రెండు పేజీల లేఖను విడుదల చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు కూడా లేటరైట్ పేరుతో బాౖక్సైట్ను దోచుకుంటున్నారని, ఆపకపోతే తర్వాతి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కిడారి, సోమ హత్య జరిగిన వారం రోజుల తర్వాత ఆ హత్యల గురించి ఎర్ర సిరా అక్షరాలతో వచ్చిన లేఖ అబద్ధమని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో లేఖ బయటకు వచ్చినా అందులో కిడారి, సోమ హత్యల గురించి మావోలు చెప్పలేదు. తాజాగా విడుదలైన లేఖలో మాత్రం హతమార్చడానికి దారితీసిన పరిస్థి తులు, జరుగుతున్న మోసాల గురించి వివరిస్తూ.. కమిటీ లెటర్హెడ్పై లేఖ రావడంతో విశ్వసనీయత చేకూరింది. లేఖలోని సారాంశం.. వారు ఆదివాసీ ద్రోహులు ‘‘కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు ఆదివాసీ నేతలు కానే కాదు. వారు ద్రోహులు. ప్రజాసేవ ముసుగులో మామూలు స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తారు. క్వారీ యజమానులుగా, అరకు, అనంతగిరి, పాడేరు, విశాఖలో ఆస్తుల్ని, భూముల్ని అక్రమంగా గడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తూ, బాక్సైట్ వెలికితీత కోసం జిందాల్, రస్అల్ఖైమా, అన్రాక్లకు ఏజెంట్లుగా వ్యవహరించి అక్రమంగా డబ్బు వెనకేసు కున్నారు. సివేరి సోమ ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో ఇలాంటి దళారీ పాత్రలు నిర్వహించి నందుకుగాను, చైనా క్లే తీసేందుకు ప్రయత్నించిన సందర్భంలో డుంబ్రిగూడ మండలం కండ్రుం గ్రామాల ప్రజలంతా ఏకమై వెంటపడి తరి మారు. ప్రజాగ్రహానికి గురైనా తన తీరు మార్చు కోకుండా జిందాల్కు ఏజెంటుగా వ్యవహరించ డమే కాకుండా బాౖక్సైట్ విషయంలో ప్రజా వ్యతిరేకిగా వ్యవహరించాడు. సర్వేశ్వరరావు రోజుకో పార్టీని మారుస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా అర్రులు చాచాడు. ఆయన కొన సాగిస్తున్న క్వారీని మూసెయ్యాలనే డిమాండ్తో హుకుంపేట మండలం గూడ గ్రామ ప్రజలు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా అధికార అండతో ఏమాత్రం ఖాతరు చెయ్యలేదు. సొంత పార్టీలోనే వాటికి వ్యతిరేకంగా బహిరంగంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. వీరిద్దరూ మెజార్టీ ప్రజల ఆగ్రహానికి గురైన కార ణంగా ప్రజావ్యతిరేకుల్ని, ద్రోహులను అంతం చెయ్యాలనే నిర్ణయంతోనే తమ పార్టీ పీఎల్జీఏ ఆధ్వర్యంలో తీర్పుని అమలు చేశాము’’ అని జగబంధు లేఖలో స్పష్టం చేశారు. అయ్యన్నా.. మైనింగ్ మానుకో తెలుగుదేశం ప్రభుత్వ అండదండలతో తూర్పు కనుమల్లో అటవీ సంపదను బినామీ పేర్లతోనూ, ఆదివాసీ దళారులుగా పుట్టకొకరు తయారై, క్వారీలు, గనుల్ని తెరుస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని తరలిస్తున్నారనీ, దీని వెనుక మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్లున్నారని తెలిపారు. మన్యం ప్రాంత సంపద అక్రమ తరలింపుని తక్షణమే నిలిపెయ్యా లనీ, లేకపోతే.. జరిగే తీవ్ర పరిణామాలకు తామే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని దళారీలను, ప్రజా వ్యతిరేక నాయకుల్ని జగబంధు హెచ్చరించారు. ఇకనైనా తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ వెలికితీత కోసం జారీ చేసిన జీవో నం.97ని పూర్తిగా రద్దు చెయ్యడమే కాకుండా, అటవీ సంపదని అక్రమంగా దోచుకునే కార్యక్రమాల్ని మానుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. -
మావోల లేఖ: వారు ఆదివాసీలు కాదు.. ద్రోహులు!
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ సమీపంలోని లివిటిపుట్టు వద్ద దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు ఆ హత్యాకాండపై బహిరంగలేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి జగబందు పేరుతో మావోలు లేఖలు విడుదల చేశారు. రాజకీయ నేతలకు, దళారీలను ఆ లేఖలో గట్టిగా హెచ్చరించారు. బాక్సైట్ పేరుతో మంత్రి పబ్బం గడుపుకుంటున్నారు ‘మైనింగ్ మాఫియాగా మారి, ఆదివాసీల ప్రాకృతిక సంపదను అప్పన్నంగా కొల్లగొడుతున్నందుకే అరకు ఎమ్మెల్మే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను హతమార్చాం. కిడారి, సోమాలు ఆదివాసీలు కాదు.. ద్రోహులు, సామ్రాజ్యవాద బహుళ జాతీ కంపెనీలకు దళారులు. కిడారి రోజుకో పార్టీ మారుతూ సంపాదనే ధ్యేయంగా బరితెగించారు. నాతవరం మండలంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు, కొడుకు విజయ్లు వాటాలతో పబ్బం గడుపుకుంటున్నారు. మన్య ప్రాంత సంపద అక్రమ తరలింపు ఆపకపోతే జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే’అంటూ మావోలు లేఖలో పేర్కొన్నారు. ఇక గత కొద్ది నెలలుగా ఆంధ్రా-ఒడిశా బార్డర్ (ఏవోబీ) వద్ద మావోయిస్టులు కదలికలు ఏపీ పోలీసులకు చాలెంజ్గా మారింది. -
కుట్ర చేసింది టీడీపీ నేతలే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యాకాండకు కుట్రదారులు అధికార టీడీపీ నేతలేనని తేలిపోయింది. మావోయిస్టులకు ఉప్పొందించడమేకాదు.. ఆశ్రయమిచ్చి.. భోజనం పెట్టి వారికి సపర్యలు చేసినట్టుగా విచారణలో స్పష్టమైంది. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే ఈ హత్యాకాండ వెనుక ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందంటూ టీడీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ వారి ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదని సిట్ తేల్చేసింది. పైగా అవన్నీ కుట్రపూరిత ఆరోపణలేనని కుండ బద్దలు కొట్టింది. డుంబ్రిగుడ మండలం సర్రాయి గ్రామదర్శినికి వెళుతున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు చుట్టు ముట్టి హతమార్చడం సంచలనమైంది. అనంతరం వారి అనుచరులు, టీడీపీ శ్రేణులు అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. జంట హత్యలు, హింసాకాండలపై విచారణకు విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ బృందం గడిచిన 22 రోజులుగా లోతైన విచారణ జరిపింది. మరోపక్క ఈ ఘటన వెనుక విపక్ష నేతల హస్తం ఉందేమోనంటూ అధికార టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. స్వయంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షాలనుద్దేశించి అన్యాపదేశంగా మాట్లాడితే ఇక విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్కుమార్ నోటికొచ్చిన రీతిలో విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కానీ ఈ హత్యాకాండ వెనుక విపక్ష పార్టీల పాత్ర ఏమాత్రం లేదని..అధికార టీడీపీ నేతల హస్తం ఉన్నట్టుగా సిట్ విచారణలో తేలడంతో వారి పేర్లు బయటకు రానీయకుండా ఒత్తిడి తీసుకొచ్చేందుకు విఫలయత్నం చేశారు. కానీ పక్కా ఆధారాలతో టీడీపీ నేతలు అడ్డంగా సిట్కి దొరికిపోవడంతో అధికార టీడీపీ నేతల వాదనలో పసలేదని తేలిపోయింది. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చిన మావోయిస్టులకు సహకంచారంటూ డుంబ్రిగుడ మండల టీడీపీ మండలాధ్యక్షుడు, తూటంగి మాజీ ఎంపీటీసీ సభ్యుడు యేడెల సుబ్బారావు, అతని భార్య ఈశ్వరితో పాటు డుంబ్రిగుడ మండలం ఆంత్రగుడ గ్రామానికి చెందిన గెమ్మిలి శోభన్, గుంటసీమ పంచాయతీ తడ్డ గ్రామానికి చెందిన కొర్రా కమలలు అరెస్ట్ చేసి ఆదివారం కోర్టులో హాజరు పరిచారు. టీడీపీలో క్రియాశీలకంగానే వ్యవహరించిన ఈ నలుగురు గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటక్షన్ గిరిజన రైట్స్ (ఓపీజీఆర్)లో పనిచేశారని గుర్తించారు. కానీ ఈ నలుగురు ఓపీజీఆర్లో పనిచేశారని చెప్పిన సిట్ చీఫ్ ఫకీరప్ప, ఎస్పీ రాహుల్ దేవ్శర్మలు ఎక్కడా వారు టీడీపీతో వారికున్న అనుబంధాన్ని మాత్రం చెప్పలేదు. ఎందుకు చంపారో... సమాధానం లేని ప్రశ్నలెన్నో.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను చంపేందుకు టీడీపీ నేతలు సుబ్బారావు తదితరులే ఉప్పొందించారని చెబుతున్న పోలీసులు ఎందుకు ఆ పని చేసారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. మావోలతో వాళ్లకు సంబం«ధాలున్నాయని చెబుతున్న పోలీసుల వాదనలు కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. వాస్తవానికి సుబ్బారావు ఒక్కడే గతంలో ఓపీజీఆర్లో పనిచేశాడు. మిగిలిన వారెవరూ ఈ సంస్థలో పనిచేసిన దాఖలాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికప్పుడు వారు మావోలతో కలిసి కిడారి, సోమలను మట్టుపెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. రాజకీయ విభేదాలా? వ్యాపార కారణాలా? మరే ఇతర కారణాలున్నాయా? అనే అంశాలపై పోలీసులు పెదవి విప్పడం లేదు. కేవలం ఉప్పొందించారన్న మాటే తప్ప ఎందుకు చేశారన్న విషయాన్ని మాత్రం పోలీసులు బయటపెట్టలేకపోతున్నారు. సుబ్బారావు ఇంట్లోనే మావోయిస్టుల మకాం టీడీపీ మండల పార్టీ ఉపాధ్యక్షుడు సుబ్బారావు ఇంటికి మావోయిస్టులు దాసు, జోగేష్, కిషోర్లు కొద్దిరోజుల క్రితం సివిల్ దుస్తుల్లో వచ్చి బస చేశారని, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రకటించడం చూస్తుంటే ఈ జంట హత్యల వెనుక అధికార టీడీపీ నేతల హస్తం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమైంది. 21వ తేదీన సర్రాయి గ్రామదర్శిని ఖరారు కాగానే ఆ సమాచారం మావోయిస్టులకు చేరవేసింది సుబ్బారావేనని తేల్చారు. అంతేకాదు ఘటన జరిగిన రోజు పెద్దసంఖ్యలో లివిటిపుట్టు చేరుకున్న మావోయిస్టులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించింది కూడా సుబ్బారావు దంపతులేనని సిట్ తేల్చింది. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై వారి సానుభూతిపరులుగా ఉంటూ తాము వారు నిర్వహించే సమావేశాలకు హాజరవడమే కాదు..పరిసర గ్రామాలకు వచ్చినపుడల్లా వారికి ఆశ్రయమిస్తూ, భోజన వసతి కల్పించేవారమని విచారణలో సుబ్బారావు అంగీకరించినట్టు సిట్ స్పష్టం చేసింది.అంతే కాదు కిడారి, సోమలను హతమార్చిన రోజున వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ను క్రమబద్దీకరిం చింది కూడా సుబ్బారావేనని విచారణలో తేలింది. ఇలా రకాలుగా మావోయిస్టులకు పూర్తి సహాయసహకారాలు అందించింది అధికార టీడీపీ నేతలేనని తేలిపోయింది. వీరితో పాటు మరో ఇరువురు పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది. ఘటనలో పాల్గొన్నది 53 మంది.. ఇప్పటి వరకు 300 మందికిపైగా అనుమానితులను విచారించిన పోలీసులు ఈ ఘటనలో 53 మంది పాల్గొన్నట్టుగా గుర్తించి వారిపై హత్యానేరంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం అరెస్ట్ చేసిన సుబ్బారావు తదితరుల నుంచి 8 కరపత్రాలు, రెండు ఎరుపు రంగు బ్యానర్లు స్వాధీనం చేసుకోగా, మధ్యవర్తుల సమక్షంలో పదికిలోల సామర్థ్యం కల్గిన ఓ మందు పాతర, 20మీటర్లు పొడవు గల ఎలక్ట్రికల్ వైరును స్వాధీనం చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం ఏఒబీ సరిహద్దు లోని ఆండ్రపల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృత్యువాత పడిన మావో అగ్రనేత గాజర్ల రవి భార్య నిడిగొండ ప్రమీల అలియాస్ జిలానీ బేగం అలియాస్ మీనా ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యాకాండలో 21వ నిందితునిగా గుర్తించారు. ఘటనా స్థలంలో ఉన్న మావోయిస్టు నేతలు చలపతి, అరుణ స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించినట్టు వెల్లడించారు. సుబ్బారావు ఇచ్చిన సమాచారంతో లివిటిపుట్టు ఘటన వెనుక మరింతమంది టీడీపీ నేతల హస్తం లేకపోలేదని భావిస్తున్నారు. -
మీనాది హత్యే!
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ కటాఫ్ ఏరియా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మీనా మృతి చెందలేదని, ఇరు రాష్ట్రాల పోలీసులు కాల్చి చంపారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు భవానీ, నిరసన నేతలు బషీద్ ఆరోపించారు. మీనాను పోలీసులు ఈ నెల 11వ తేదీన అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసినా లొంగకపోవడంతో 12వ తేదీన కాల్చి చంపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతంలో అక్రమంగా బాక్సైట్ తవ్వకాలు చేపడుతున్నారన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమను మావోయిస్టులు చంపారని అన్నారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఒడిశా పోలీసులు సంయుక్తంగా కొరాపుట్, మల్కన్గిరి అడవుల్లో కూంబింగ్ నిర్వహించి, మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా చేసుకుని మీనాని చంపారని తెలిపారు. 303 సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ జిల్లాలోని పొచ్చన్నపేటలో మీనాకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ జోహార్లు తెలుపుతూ అంతిమ సంస్కారాలు జరిపారు. ఈ అంతిమయాత్రలో వరంగల్ పౌరహక్కుల కార్యకర్త రంజిత్, తెలంగాణ రాష్ట్ర ఎస్ఎల్సీ అధ్యక్షుడు లక్ష్మణ్, మీనా కుటుంబ సభ్యులు సత్యం, భాస్కర్, గాజర్ల రవి, అశోక్, అనిత తదితరులు పాల్గొన్నారు. నలుగురు మావోయిస్టులను కోర్టుకు తరలింపు అలాగే మల్కన్గిరి పోలీసుల అదుపులో ఉన్న సుమారు నలుగురు మావోయిస్టులను ఆదివారం కోర్టుకు తరలించినట్టు ఎస్పీ జోగ్గా మోహన్ తెలిపారు. వీరిలో జయంతి అలియాస్ అంజన, గ్లోరి, రాధిక, సుమ అలియాస్ గీత, రాజేష్ కోరా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్! -
సూత్రధారులు టీడీపీ నేతలే
సాక్షి, విశాఖపట్నం/ పెదవాల్తేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మట్టుబెట్టడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉన్నట్టుగా తేటతెల్లమైంది. లివిటిపుట్టు ఘటన వెనుక వైఎస్సార్సీపీ హస్తం ఉందంటూ అధికార టీడీపీ నేతలు చేసిన ఆరోపణల్లో పసలేదని తేలిపోయింది. ఈ హత్యోదంతంలో మావోలకు సహకరించిన నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ ఫకీరప్ప, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఆదివారం విశాఖలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు దర్యాప్తు వివరాలను మీడియాకు వివరించారు. టీడీపీ డుంబ్రిగుడ మండల ఉపాధ్యక్షుడు యేడెల సుబ్బారావు–ఈశ్వరి దంపతులతోపాటు గెమ్మిలి శోభన్, కొర్ర కమలలు ఈ ఘటనలో కీలక సూత్రధారులని దర్యాప్తులో తేలిందని వారు తెలిపారు. వీరి సహకారంతోనే మావోయిస్టు పార్టీ కోరాపుట్ డివిజన్ దళం పక్కా వ్యూహంతో ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు గత నెల 23న సర్రాయి వద్ద గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు చుట్టుముట్టి హతమార్చిన విషయం తెలిసిందే. 300 మందిని విచారించిన సిట్: ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి 20 రోజులపాటు సుమారు 300 మందిని సిట్ విచారించింది. కిడారి, సోమలను హతమార్చడంలో మావోలకు ప్రత్యక్షంగా సహకరించినట్టుగా పేర్కొంటూ టీడీపీ నాయకుడు యేడెల సుబ్బారావు, యేడెల ఈశ్వరిలతోపాటు గెమ్మిలి శోభన్, కొర్రా కమలను అరెస్టు చేసిన సిట్ బృందం వారిని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అరెస్టయిన నలుగురూ గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటక్షన్ గిరిజన రైట్స్ (ఓపీజీఆర్) గ్రూపులో పనిచేసినట్టు సిట్ చీఫ్ ఫకీరప్ప వెల్లడించారు. రెండేళ్లుగా వరుస ఎదురు కాల్పులు, లొంగుబాట్లు కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినందున ఉనికి చాటుకోవడంతోపాటు ఏజెన్సీలో అలజడిని సృష్టించాలనే ఉద్దేశంతోనే ప్రముఖ వ్యక్తుల రాకపోకల గురించి సమాచారం ఇవ్వాలని మావోయిస్టులు వీరిపై ఒత్తిడి తెచ్చారన్నారు. మందుపాతర స్వాధీనం: నిందితుల నుంచి మావోయిస్టులు ముద్రించిన 8 కరపత్రాలు, రెండు ఎరుపు రంగు బ్యానర్లు స్వాధీనం చేసుకున్నామని సిట్ చీఫ్ తెలిపారు. 10 కిలోల సామర్థ్యం కలిగిన ఓ మందుపాతర, ఎలక్ట్రికల్ వైరును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మావో అగ్రనేతలు చలపతి, అతని భార్య అరుణ ఈ ఆపరేషన్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా తేలిందన్నారు. మీనా 21వ ముద్దాయే ఏవోబీ సరిహద్దులోని ఆండ్రపల్లి వద్ద ఈ నెల 12న జరిగిన ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడిన మావో అగ్రనేత గాజర్ల రవి భార్య నిడిగొండ ప్రమీల అలియాస్ జిలానీ బేగం అలియాస్ మీనాను కిడారి, సోమల హత్యాకాండలో 21వ ముద్దాయిగా గుర్తించామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ పేరిట మావోలు విడుదల చేసిన లేఖపై సందేహాలు వస్తున్నందున ఆ లేఖ అసలుదా? లేక నకిలీదా? అని విచారిస్తున్నామన్నారు. -
ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, పెదబయలు/మల్కన్గిరి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మరోసారి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. మల్కన్గిరి జిల్లా చిత్రకొండ పోలీస్స్టేషన్ పరిధి బెజ్జంగి–ఆండ్రపల్లి మధ్య అటవీ ప్రాం తంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు– మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాం డర్ మీనా మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు ఓ మిలీషియా సభ్యు డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత నెల 23న విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చాక మావోల కోసం ఒడిశాలోని మల్కన్గిరి ఎస్వోజీ, డీఓబీ జవాన్లతోపాటు ఆంధ్రా గ్రేహౌండ్స్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగం గా ఈ నెల 7న ఏవోబీ పరిధిలోని సుంకి అటవీ ప్రాం తంలో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో మావో అగ్రనేతలు తప్పించుకున్నప్పటికీ పెద్ద ఎత్తున మావోయిస్టు డంప్ను కోరాపుట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి పోలీసు లు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో శుక్ర వారం తెల్లవారుజామున చిత్రకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆండ్రపల్లి–బెజ్జంగి మధ్య అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. పంచాయతీ కేంద్రమైన ఆండ్రపల్లి సమీపంలో ఇరు వర్గాల మధ్య రెండు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల నుంచి కాల్పులు నిలిచిపోయినప్పటికీ పోలీసులు మాత్రం కాల్పులు కొనసాగించారు. అనంతరం ఘటనా స్థలంలో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మృతురాలు మావోయిస్టు పార్టీ డిప్యూటీ దళ కమాండర్/డివిజన్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్న మీనా అలియాస్ జిలానీ బేగం అలియాస్ నిడిగొండ ప్రమీలగా నిర్ధారించారు. మృతురాలు మావోయిస్టు కీలక నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ భార్యగా గుర్తించారు. కిడారి, సోమ జంట హత్య కేసులో మీనా 21 వ ముద్దాయిగా ఉన్నట్టుగా నిర్ధారించారు. గ్రామస్తుల అడ్డగింత మహిళా మావో మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న మావోలను గ్రేహౌండ్స్ పోలీసులు మల్కన్గిరికి తరలిస్తుండగా బెజ్జంగి జంక్షన్ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆండ్రపల్లి, పనసపట్టు, జూడం పంచాయతీల్లోని 60 పల్లెలకు చెందిన సుమారు వెయ్యి మందికిపైగా గిరిజనులు మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చారు. గ్రేహౌండ్స్ పోలీసులను తరిమికొట్టే ప్రయత్నం చేశా రు. పోలీసుల వాహనాలను వెంబడించారు. అదుపులో తీసుకున్నవారిని విడిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రేహౌండ్స్ దళాలను చుట్టుముట్టారు. రామగుడ ఎన్కౌంటర్, లివిటిపుట్టు ఘటనల తర్వాత ఆంధ్రా గ్రేహౌండ్స్ బలగాలే తమ ప్రాంతాల్లోకి వచ్చి గాలింపు చర్యల పేరిట తమను వేధిస్తున్నాయని మండిపడ్డారు. గ్రామాల్లోకి చొరబడి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అకారణంగా గ్రామస్తులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారని, సమాచారం చెప్పడం లేదంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుం దని భావించిన గ్రేహౌండ్స్ బలగాలు గాల్లో కాల్పులు జరిపాయి. దీంతో గిరిజనులు చెదురుమదురు కావడంతో పోలీసు వాహనాలు ముందుకు వెళ్లాయి. అగ్రనేతలు తప్పించుకున్నారు: విశాఖ ఎస్పీ ఏవోబీలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ వెల్లడించారు. మృతి చెందిన మహిళా మావోయిస్టు మీనా.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలని, ఆ రోజు ఆపరేషన్లో ఆమె కీలకంగా పాల్గొన్నారని చెప్పారు. ఎదురుకాల్పుల ఘటన మల్కన్గిరి పోలీస్స్టేషన్ పరిధిలోది కావడంతో ఆమె మృతదేహంతోపాటు అదుపులోకి తీసుకున్న నలుగురిని అక్కడకు తరలించామని చెప్పారు. ఏవోబీలో నిరంతరాయంగా కూంబింగ్ చేస్తున్నామన్నారు. 50 ఘటనల్లో మీనా: మల్కన్గిరి ఎస్పీ మీనా గత 20 ఏళ్లుగా ఏవోబీలో డిప్యూటీ దళ కమాండర్గా పనిచేస్తోందని మల్కన్గిరి ఎస్పీ జోగ్గా మోహన్ మిన్నా చెప్పారు. జిల్లాలోని రామగుడ ఎన్కౌంటర్, ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ అపహరణ, ఇన్ఫార్మర్స్ నెపంతో హత్యలు ఇలా సుమారు 50 ఘటనల్లో ఆమె ప్రమేయం ఉందన్నారు. మీనాపై ఆంధ్రా ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించిందని తెలిపారు. మల్కన్గిరికి తరలింపు ఘటనా స్థలంలో మహిళా మావోలు.. జయంతి అలియాస్ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్ కర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మహిళా మావోయిస్టులూ కటాఫ్ ఏరియా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురితోపాటు మీనా మృతదేహాన్ని ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. తప్పించుకున్న మావోల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. -
ఎన్కౌంటర్: కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు హతం
-
కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్!
సాక్షి, విశాఖ ఏజెన్సీ : ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన మీనా గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
హంతకులెవరైనా శిక్ష తప్పదు : నారా లోకేష్
పాడేరు/అరకులోయ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యకు కారణమైన వారిని విడిచిపెట్టేది లేదని, ఎవరైనా శిక్ష తప్పదని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం ఆయన పాడేరులోని కిడారి, అరకులో సీవేరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ నెల 14న అరకులో నిర్వహించనున్న కిడారి, సోమల స్మారక సం తాప కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిడారి, సోమ ల హత్యల వెనుక ఎవరున్నారో బయటకు వస్తుందని, దీనిపై సిట్ విచారణ కొనసాగుతోందన్నారు. సొంత పార్టీలోని వ్యక్తులే ఈ హత్యలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనివల్లే సిట్ నివేదిక బయటకు రాకుండా చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సొంత ఎమ్మెల్యేను చంపుతారా.. అంటూ నివేదిక రాకుండా మాట్లాడడం, అర్థంపర్థం లేని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నివేదిక రాకుండా దీనిపై మాట్లాడటం సబబు కాదన్నారు. హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నక్కా ఆనందబాబు పాడేరు, అరకు ప్రాంతాల్లో రోడ్డు మార్గంలో పర్యటించారు. -
చలపతే.. యాక్షన్ దళపతి!
ఆపరేషన్ లివిటిపుట్టులో మావోయిస్టు కీలకనేత చలపతి పాల్గొన్నారా?.. ఆయనే స్వయంగా ఆపరేషన్ను పర్యవేక్షించారా??.. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యకు నిర్వహించిన ఈ ఆపరేషన్పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో దీనికి అవుననే సమాధానం లభిస్తోంది. గత నెల 23న జరిగిన ఈ హత్యాకాండలో మహిళా మావోయిస్టు నేత అరుణ ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించారని.. మిలటరీ కమిషన్ ఆధ్వర్యంలో చలపతి వ్యూహం రచించినట్లు ప్రాథమిక సమాచారం వచ్చింది. అయితే లోతుగా జరిగిన సిట్ విచారణలో చలపతి పాత్ర స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా హత్యాకాండలో పాల్గొనకపోయినా.. దళంతో కలిసి వచ్చి కాస్త దూరంగా ఉండి పర్యవేక్షించారని సమాచారం. మరోవైపు మీడియాను వెంట తీసుకెళితే మావోయిస్టులు దాడికి పాల్పడరన్న వ్యూహంతోనే కిడారి తన కాన్వాయ్ వెంట మీడియా ప్రతినిధులను తీసుకెళ్లినా.. అది ఫలించలేదు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యోదంతంపై సిట్ జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో గత నెల 23న మావో యిస్టులు వారిద్దరినీ దారుణంగా కాల్చిచంపిన ఘటనలోమావోయిస్టు మహిళా నేత అరుణ కీలకంగా వ్యవహరించినట్టు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాజాగా ఆమె భర్త, మావోయిస్టు కీలక నేత చలపతి కూడా ఆ ఆపరేషన్లో పాల్గొన్నట్టు సిట్ అధికారులు తేల్చారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతో చలపతి దగ్గరుండి ఆపరేషన్ విజయవంతం చేసినట్టు తెలుస్తోంది. కాల్పుల పనిని మహిళా మావోలకు అప్పజెప్పి చలపతి మాత్రం కాస్త దూరంలోనే నిలబడినట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. చలపతి, అరుణల నాయకత్వంలో ఆ రోజు ఉదయమే నందాపూర్ కమిటీకి చెందిన సుమారు 30మంది మావోయిస్టులు లివిటిపుట్టు చేరుకున్నారు. అక్కడకు మరో ముప్పై మంది మిలీషియా సభ్యులు చేరుకున్న తర్వాత ఆపరేషన్కు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఏజెన్సీ టీడీపీ నేతలే ఉప్పందించారు.. కిడారికి సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలే మావోలకు ఉప్పందించారని సిట్ అధికారులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చినట్టు తెలుస్తోంది. అయితే కిడారి వెన్నంటి తిరిగిన టీడీపీ నేతలు ఒక్కసారిగా మావోలతో కుమ్మక్కై ఎందుకు పక్కాగా సమాచారం అందించారన్న దానిపై మాత్రం సిట్ అధికారులకు స్పష్టత రాలేదు. వ్యాపార లావాదేవీల్లో అంతర్గత విభేదాలా.. పార్టీ ఫిరాయించిన తర్వాత టీడీపీలోని ఓ వర్గంతో వచ్చిన అంతరాలా.. అన్నది ఇప్పటికీ తేలలేదని అంటున్నారు. మొత్తానికి ఏజెన్సీకి చెందిన, కిడారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన టీడీపీ నేతలే మావోలకు ఎప్పటికప్పుడు ఆయన కదలికలపై సమాచారం ఇచ్చినట్టు మాత్రం సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మీడియా ప్రతినిధుల సాక్షిగానే... ఆ రోజు కిడారి మీడియా వారిని తన వెంట తీసుకువెళ్లడం వాస్తవమేనని సిట్ తేల్చింది. మీడియా ప్రతినిధులు ఉంటే దాడికి మావోయిస్టులు వెనుకంజ వేస్తారన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా కిడారి వారిని వెంటబెట్టుకు వెళ్లారని అంటున్నారు. ఓ ప్రధాన పత్రిక విలేకరితోపాటు ముగ్గురు స్థానిక విలేకరులు ఆయన్ను అనుసరించారని తెలుస్తోంది. ఆయన కారుకు ముందు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు విలేకరులు, కారు వెనుక మరో టూవీలర్పై ఇద్దరు విలేకరులు అనుసరించారు. కిడారి వాహనానికి ముందున్న విలేకరులు అక్కడ మావోలు కాపుకాయడం చూసి తమ బండి ఆపకుండా వెళ్ళిపోయారు. కిడారి వాహనం వెనుక అనుసరిస్తున్న ఇద్దరు మీడియా విలేకరులను మాత్రం మావోలు అడ్డగించినట్టు తెలిసింది. తమ ఆపరేషన్ పూర్తయ్యే వరకు వారిని అక్కడే కూర్చోబెట్టి ఆ తర్వాతే వదిలిపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో సిట్ అధికారులు సదరు విలేకరులను విచారించినట్టు తెలిసింది. కాగా, ఆ రోజు ఆపరేషన్లో లివిటిపుట్టు గ్రామస్తుల పాత్ర ఏమీ లేదని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు. సిట్ నివేదికను సర్కారు బయటపెడుతుందా? స్వయంగా అధికార తెలుగుదేశం నేతలే దగ్గరుండి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిలను కాల్చి చంపించిన వ్యవహారాన్ని ఎలా బయటపెట్టాలో తెలియక సిట్ అధికారులు మధనపడుతున్నారు. కారణాలు ఏమైనా కానీ టీడీపీ నేతలు అందించిన సమాచారంతోనే మావోలు పక్కా వ్యూహంతో మెరపుదాడి చేయగలిగారు. సిట్ దర్యాప్తులో ఈ విషయం స్పష్టమైంది. అయితే వాస్తవ నివేదిక బయటపెడితే సర్కారు తీరు ఎలా ఉంటుందోనన్న ఆందోళన విచారణ అధికారులను వెంటాడుతోంది. అందుకే మరింత లోతైన దర్యాప్తు కోసం విచారణ కొనసాగిస్తామని, ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో సిట్ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి. -
ఏవోబీలో రెండు మావో దళాలు!
సాక్షి,అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మావోయిస్టులు విసిరిన పంజాకు ఘోరంగా అభాసుపాలైన పోలీసులు సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏకంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోయిస్టులు పేల్చిన తూట పోలీసు శాఖకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ మావోయిస్టుల అణచివేతకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒడిశా డీజీపీ శర్మతో సమావేశమైన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నా రు. దీనిలో భాగంగానే కోరాçపుట్ జిల్లా చిక్కల్ములి వద్ద శని, ఆదివారాల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు సం యుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు గాయపడినట్టు పోలీసులు చెబుతున్నప్పటికీ ఎవరనేది నిర్ధారణకు రాలేదు. ఆంధ్రలో దాడులు.. ఒడిశాలో షెల్టర్.. ఒడిశాలో షెల్టర్ తీసుకుని ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లోకి వచ్చి లక్ష్యాలు నిర్దేశించుకుని మావోయిస్టులు దాడులు చేసేలా కదులుతున్నారు. ఇందుకు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, చలపతి తదితర కీలక నేతలు నేతృత్వం వహిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఏకంగా మిలటరీ బెటాలియన్ ఉన్నట్టు గుర్తించారు. టెక్నాలజీని ఆశ్రయించిన పోలీసులు మావోయిస్టుల కదలికలను గుర్తించేలా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. అన్ మాన్డ్ ఏరియల్స్(యుఏవీ), డ్రోన్లను వాడుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏవోబీలో స్కానింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రేడియో ట్రాన్సిస్టర్ మాదిరిగా ఉండే పరికరాన్ని ఎతైన ప్రదేశంలో అమర్చి దాని యాంటేనా ద్వారా స్కానింగ్ పద్ధతిని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం మావోయిస్టులు వినియోగించే వైర్లెస్సెట్, మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే సంభాషణలను రికార్డు చేయడంతోపాటు వారు ఏ ప్రాంతంలో, ఎంత దూరంలో ఉన్నారో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు చిక్కిన మావోయిస్టు కీలక నేత చత్తీస్గఢ్, ఆంధ్ర సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్ డెప్యూటీ కమాండర్ పోడియం ముడా సోమవారం పోలీసులకు చిక్కాడు. అతని అరెస్టుతో తూర్పు మన్యంలో మావోలకు ఎదురు దెబ్బ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. 2014లో చత్తీస్గఢ్ మంత్రి మహేందర్ కర్మా సహా అనేక దాడుల్లో 116 మంది పోలీసుల మృతికి కూడా కారకుడని పోలీసులు చెబుతున్నారు. ఏవోబీలోనే ఆర్కే.. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోనే ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆయనతో సహా ఏవోబీలో తలదాచుకున్న మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగానే కూంబింగ్ జరుగుతోందని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే ఆఫ్ ది రికార్డ్గా అంగీకరిస్తున్నారు. -
ట్రాఫిక్ను ఆపి.. కాపు కాసి..
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చేందుకు మావోయిస్టులకు స్థానిక టీడీపీ నేతలు ఏ స్థాయిలో సహాయ సహకారాలు అందించారో విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. టీడీపీ నేతల సహకారంతోనే మావోలు పక్కా స్కెచ్ అమలు చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల కదలికలు ఎప్పటికప్పుడు టీడీపీ నేతల ద్వారా తెలుసుకుని, మాటు వేసి మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్లో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు వై.సుబ్బారావు కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మావోల ఉచ్చులో పడేలా చేయడంలో సుబ్బారావు దంపతులు క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సిట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఘటన జరిగిన గత నెల 23వ తేదీ ఉదయం సర్రాయిలో గ్రామ వికాస్ కార్యక్రమానికి కిడారి, సోమలు అరకు నుంచి బయల్దేరారని తెలియగానే, మావోలు మాటు వేసిన లివిటిపుట్టు వద్ద ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంలో కూడా సుబ్బారావు మరికొంతమంది సహకారంతో క్రియాశీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. వై జంక్షన్లో ట్రాఫిక్ మళ్లింపు ఘటన జరిగిన రోజు ఉదయం నుంచే వై జంక్షన్గా పిలువబడే డుంబ్రిగుడ– గుంటచీమ– లివిటిపుట్టు రోడ్డులో సుబ్బారావు సివిల్ దుస్తుల్లో ఉన్న మావోలతో కలసి ట్రాఫిక్ మళ్లించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు. ఆ రోజంతా ఆ జంక్షన్లోనే ఆయన హల్చల్ చేశారని, నిత్యం వందలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే ఈ వై జంక్షన్ వద్ద ఘటన జరిగిన రోజున జనసంచారం లేకుండా చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో మావోల నుంచి తప్పించుకునేందుకు కారును మళ్లించేందుకు యత్నించగా.. గుర్తుతెలియని లారీ ఒకటి తమ వాహనాన్ని అడ్డుకుందంటూ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కారు డ్రైవర్ చిట్టిబాబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించిన విషయం తెలిసిందే. అంతమంది మావోలు అక్కడ మాటు వేసి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను అడ్డగించి ముట్టడించిన సమయంలో ఆ లారీ అటువైపుగా ఎలా వచ్చింది? సోమ కారును ఎందుకు అడ్డగించింది? ముందే ఆ ప్రాంతంలో ఉంచారా? అసలు ఆ లారీ ఎవరిది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న సుబ్బారావు భార్య మరికొంతమంది స్థానికులతో కలిసి మావోలకు ఆ రోజు భోజనాలు పెట్టినట్టు సిట్ గుర్తించింది. హెచ్ఎం చెండా ఏలియా అడ్డగింపు నిషేధిత ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ గిరిజన్ రైట్స్ (ఓపీజీఆర్) వ్యవస్థాపకుడు, ప్రస్తుతం గూడా హైస్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న చెండా ఏలియాను బుధవారం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించడం కలకలం రేపింది. హుకుంపేట మండలం గూడ రోడ్డులో కారులో వెళ్తున్న తనను ముందుగా ఓ వ్యక్తి ఆపి కారు దింపారని, తర్వాత మరో ముగ్గురు తన వద్దకు రాగా.. తృటిలో తప్పించుకున్నట్టు ఏలియా స్థానిక మీడియాకు వివరించారు. వాస్తవానికి ఏలియా నుంచి కొంత సమాచారం రాబట్టేందుకు పోలీస్స్టేషన్కు రావాల్సిందిగా మంగళవారం అరకు పోలీసులు కోరారు. అయితే ఆయన తనకు ఆరోగ్యం బాగోలేదు.. రేపు వస్తానని చెప్పినట్లు తెలిసింది. -
మావోలకు టీడీపీ నేతల సహకారం.. నిఘా వైఫల్యం
ఇద్దరు ప్రముఖుల హత్యకు స్కెచ్ వేశారు.. పలుమార్లు మాటేశారు.. ఇంకెన్నోసార్లు రెక్కీలు చేశారు.. అయినా పోలీస్ వ్యవస్థ పసిగట్టలేకపోయింది.. నిఘా వ్యవస్థ నిద్రపోయింది.. సొంత పార్టీ నేతలే ఉప్పందిస్తున్న విషయాన్ని ఆ పార్టీ శ్రేణులూ పట్టుకోలేకపోయాయి.. ఇన్ని వైఫల్యాల ఫలితమే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యాకాండ.. సిట్ విచారణలో ఇవే అంశాలు ఒక్కొక్కటిగా నిర్థారణ అవుతున్నాయి.. హత్యాకాండ అనంతరం అరకు, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్ల విధ్వంసంలోనూ పలువురు మావోయిస్టులు పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటన్నింటికీ మించి.. ఒత్తిడితోనో, బెదిరింపులవల్లో.. ఏ కారణాలతోనో.. టీడీపీ కిందిస్థాయి నేతలే మావోలకు వేగులుగా, ఇన్ఫార్మర్లుగా మారి.. తమ అగ్రనేతల కదలికల సమాచారాన్ని మావోలకు చేరవేయడం.. హత్యాకాండ కోసం వచ్చిన దళ సభ్యులకు భోజన, వసతి కల్పించినట్లు తేటతెల్లడం కావడం కలకలం రేపుతోంది.ఈ హత్యల్లో ప్రతిపక్షం కుట్ర ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలను రాజకీయ లబ్ధికోసం చేసినవిగా తేల్చేస్తున్నాయి. విశాఖపట్నం : అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యకు మావోలు పలుమార్లు ప్రయత్నించినా పోలీసులు పసిగట్టలేకపోయారన్న వాదన తెరపైకి వచ్చింది. నాలుగైదుసార్లు ప్రయత్నించిన వారు.. చివరికి లివిటిపుట్టు వద్ద సెప్టెంబర్ 23న సాధించగలిగారని అంటున్నారు. అక్కడికి సరిగ్గా రెండు రోజుల ముందు సెప్టెంబర్ 21న పెదబయలు మండలం పెదగూడ పంచాయతీలోని కోయాపల్లిలో కిడారి, సోమలను హతమార్చేందుకు మావోలు మాటు వేశారని.. ఆరోజు కిడారి వచ్చినా, సోమ రాకపోవడంతో వెనక్కి తగ్గారని చెబుతున్నారు. అంతకు ముందు బొంగరం సమీపంలోని కుంటమామిడి వద్ద కూడా ప్రయత్నించి విఫలమయ్యారంటున్నారు. బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉందని గొప్పగా చెప్పుకునే పోలీసులు వీటిలో ఏ ఒక్కదాన్నీ పసిగట్టలేకపోవడం తలదించుకునేలా చేసింది. టీడీపీ నేతల సహకారంతోనే స్కెచ్ టీడీపీ సీనియర్ నాయకుడు, తూటంగి మాజీ ఎంపీటీసీ యేడెల సుబ్బారావు, అతని భార్యతోపాటు కొందరు కిడారి, సోమ అనుచరులు సహకరించడంతో మావోల పని సులువైంది. వారి సహకారంతోనే స్కెచ్ వేసి కిడారి, సోమలను రప్పించేలా లివిటిపుట్టు వద్ద ఉచ్చు పన్ని, మాటు వేశారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ బృందం ఇదే నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. సుబ్బారావు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. పోతంగి పంచాయతీ అంత్రిగుడకు చెందిన కమల, శోభన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఘటనకు ముందురోజు(శనివారం) రాత్రి సాధారణ దుస్తుల్లో ఉన్న ఇద్దరు మావోలకు అన్నం పెట్టినట్లు విచారణలో కమల అంగీకరించినట్టు తెలుస్తోంది. శోభన్ కూడా ఇదే విషయం విచారణలో చెప్పినట్లు సమాచారం. వీరితో పాటు తాజాగా మాజీ మావోయిస్టు కామరాజు సోదరుడు, టీడీపీ నాయకుడైన బిసోయి మూర్తి, టీడీపీకే చెందిన తూటంగి దతూర్ గ్రామ మాజీ సర్పంచ్ కుంతర్ల సుబ్బారావులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. టీడీపీ మాజీ ఎంపీపీ ధనేరావును ఇప్పటికే విచారిస్తున్న పోలీసులు.. మరింత సమాచార సేకరణలో భాగంగా వ్యూహాత్మకంగా అతడ్ని మంగళవారం బయటకు పంపినట్లు చెబుతున్నారు. మరో వైపు లివిటిపుట్టు పరిసర గ్రామాలకు చెందిన సుమారు పదిమందిని అదుపులోకి తీసుకొని విలువైన సమాచారం రాబట్టినట్లు తెలిసింది. వీరిందరిపై కేసులు నమోదు చేసే అవకాశాలుండగా.. అంతా టీడీపీకీ చెందినవారే కావడంతో కేసులు నమోదు చేస్తే ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయోనన్న ఆందోళన సిట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ హత్యాకాండ వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందన్న టీడీపీ నేతల ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నవేనని తేల్చేస్తున్నాయి. విధ్వంసంలోనూ మావోలు? లివిటిపుట్టులో హత్యాకాండ అనంతరం డుంబ్రిగుడ, అరుకు పోలీస్ స్టేషన్లపై జరిగిన దాడి, దహనంలోనూ మావోల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ దుస్తుల్లో కొంతమంది మావోలు ఆందోళనకారులతో కలిసిపోయి పోలీస్స్టేçషన్లపై దాడికి ఆజ్యం పోశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూతవేటు దూరంలోనే అరుకు పోలీసులు, ఏపీఎస్పీ బలగాలు ఉన్నప్పటికీ ఆందోళనకారుల్లో కలిసి ఉన్నారన్న భయంతోనే ముందడుగు వేయలేకపోయారంటునారు. విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మావోలు కాల్పులకు దిగడం లేదా బాంబులు వేసే ప్రమాదముందని, అదే జరిగితే భారీగా ప్రాణనష్టం వాటిల్లే ముప్పును గుర్తించే వెనకడుకు వేయాల్సి వచ్చిందని ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోపక్క కిడారి, సోమలు హత్యకు గురైన విషయం క్షణాల్లోనే మీడియా ద్వారా పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ వారు సకాలంలో స్పందించకపోవడం వల్లే మావోలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి నలువైపుల నుంచి కూంబింగ్ చేపట్టి ఉంటే కొంతమందైనా మావోలు చిక్కేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కిడారి హత్య.. స్థానికుల ప్రమేయం!
-
కిడారి హత్య.. స్థానికుల ప్రమేయం!
సాక్షి, విశాఖపట్నం : డుంబ్రిగూడా పరిసర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు, సోమల హత్య వెనుక స్థానికులు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యలో మావోయిస్టులకు సహకరించారన్న అనుమానంతో టీడీపీ మాజీ ఎంపీటీసీ సుబ్బారావు, అతని భార్యను విచారిస్తున్నారు. వీరితో పాటు అంత్రిగూడకు చెందిన కమల, శోభన్ అనే ఇద్దరు గిరిజనులు ఆదివారం అదుపులోని తీసుకుని అప్పటినుంచి విచారిస్తున్నారు. కిడారి హత్యకు వీరు సహకరించారని పోలీసులు నిర్ధారించుకున్న తరువాత రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డుంబ్రిగూడకు చెందిన నలుగురు విలేకర్లను కూడా పోలీసులు విచారించి విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో లివిటిపుట్టలో మావోయిస్టులు లేఖ ఇచ్చారన్న విషయంపై పోలీసులు ఆరా తీసున్నారు. కాగా ఒక వైపు సిట్ విచారణ జరుగుతున్నా.. మరోవైపు పోలీసు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏక్షణం ఏ అధికారిపై వేటు పడుతోందనని ఏజెన్సీలో పనిచేస్తున్న పోలీసులు ఆందోళన చెందుతున్నారు. -
అధికారుల్లో గుబులు
సాక్షి, విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యోదంతానికి బాధ్యులను చేస్తూ ఒకరి తర్వాత మరొకరిపై చర్యలు తీసుకుంటుండడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. లివిటిపుట్టు ఘటనతో ఎగసిన భావోద్వేగాల నడుమ చెలరేగిన హింసాకాండ కొద్ది గంటల్లోనే సద్దుమణిగినప్పటికీ ఆ దుర్ఘటన మాత్రం అధికారులను వెన్నాడుతోంది. పోలీసుల నిఘా వైçఫల్యాన్ని ఆసరాగా చేసుకుని లివిటిపుట్టు వద్ద మాటు వేసి మావోయిస్టులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మట్టుపెట్టారు. ఆ ఘటనకు పోలీస్ బాస్గా తానే బాధ్యత వహిస్తానంటూ సాక్షాత్తు డీజీపీ ఆర్పీ ఠాకూర్ చేసిన ప్రకటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. లివిటిపుట్టు ఘటన తర్వాత చెలరేగిన హింసాకాండను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ ఇప్పటికే డుంబ్రిగుడ ఎస్సై అమ్మనరావుపై సంఘటన జరిగిన మర్నాడే సస్పెన్షన్ వేటు వేశారు. అరకు సీఐ వెంకునాయుడ్ని రేంజ్ వీఆర్కు పంపుతూ రూరల్ ఎస్పీ రాహుల్దేవ్శర్మ సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావుకు అరకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. మరోవైపు అందుబాటులో బలగాలున్నా అరకు, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్లపై దాడిని అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ ఏపీఎస్పీ ఆఫీస్ కమాండర్ సమర్పణరావు, ఆర్ఎస్ఐ సాంబశివరావులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఏపీఎస్పీ ఐజీ ఆర్పీ మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లివిటిపుట్టు ఘటనతోపాటు అరకు, డుంబ్రిగుడలలో చెలరేగిన హింసాకాండను విచారించడానికి వేసిన సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. సిట్ సిఫార్సు మేరకే సోమవారం పోలీసు అధికారులపై చర్య తీసుకున్నారు. కాగా మరికొంతమందిపై వేటుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలకు కారణమైన నిఘా వైఫల్యానికి బాధ్యులైన ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేస్తున్న క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకోనవడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. ఘటన జరిగిన రోజున ప్రజలు తీవ్ర భావోద్వేగాలతో ఉన్నారని.. ఆ సమయంలో ఎవరు కన్పించినా దాడులు తప్పవని.. బలగాలున్నా వాటిని అదుపు చేయడం కష్టసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మరికొంతమందిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తుండడంపై ఏజెన్సీలో పనిచేస్తున్న పోలీస్ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అరకులోయ: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చేందుకు మాటు వేసిన మావోయిస్టులకు వంటలు చేశారనే ఆరోపణలపై అంత్రిగుడ గ్రామంలో ఇద్దరు గిరిజనులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన శోభన్, కమల అనే ఇద్దరు గిరిజనులను ఆదివారం అదుపులోకి తీసుకొని, అరకులోయ స్టేషన్కు తరలించామని వారు తెలిపారు. సిట్ బృందంలోని పోలీసు అధికారులు ఈ ఇద్దరు గిరిజనులను స్థానిక పోలీసు అతిథి గృహంలో విచారిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన శోభన్, కమలలు అమాయకులని, వారిని విడిచిపెట్టాలని పోలీసు అధికారులను కోరేందుకు అంత్రిగుడ గ్రామంలోని గిరిజనులంతా అధిక సంఖ్యలో సోమవారం పోలీసు అతిథి గృహానికి చేరుకున్నారు. కొంతమందికి మాత్రమే పోలీసు అధికారులు అనుమతి ఇచ్చి శోభన్తో మాట్లాడించారు. కమలతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అంత్రిగుడ గిరిజనులు వాపోయారు. వారిని వెంటనే విడిచిపెట్టాలని అంత్రిగుడ గిరిజనులు పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. -
కిడారి కారులో రూ.3 కోట్లు?
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యోదంతం కొత్తమలువు తిరుగుతోంది. ఘటన జరిగిన రోజు కిడారి ప్రయాణిస్తున్న కారులో రూ.3 కోట్ల నగదు ఉన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. ఈ ఘటన జరిగిన తర్వాత చెలరేగిన హింసాకాండను అదుపుచేయడంలో విఫలమయ్యారంటూ ఇప్పటికే డుంబ్రిగుడ ఎస్సైని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు తాజాగా ఏపీఎస్పీ ఆఫీస్ కమాండర్, ఆర్ఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. అరకు సీఐని వీఆర్లో పెడుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద గత నెల 23న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోలు మట్టుబెట్టడం, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ చీఫ్ ఫకీరప్ప ఏజెన్సీలోనే మకాం వేసి దర్యాప్తును మమ్మరం చేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోల ఉచ్చులో పడేలా చేసినట్టుగా భావిస్తున్న వారి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డుంబ్రిగుడ మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ వై.సుబ్బారావుతో పాటు టీడీపీకే చెందిన మాజీ ఎంపీపీ ధనీరావు, కొండబాబు, త్రినాథరావు, ఆంత్రిగూడ గ్రామానికి చెందిన శోభన్, కొర్రా కమల, పాంగి దాసు, లివిటిపుట్టు పరిసర గ్రామాలకు చెందిన 10 మందిని సిట్ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. సుబ్బారావు పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చిన సిట్ బృందం మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఆయన్ని పాడేరు తీసుకెళ్లినట్టు తెలిసింది. మరో వైపు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, అతని అనుచరగణం ఘటన తర్వాత మన్యంలో కన్పించక పోవడంతో ఈ ఘటనలో వారి హస్తం ఏమైనా ఉందా? అని సిట్ బృందం ఆరాతీస్తోంది. ఆ మూడు కోట్లు ఏమైనట్టు? కిడారి కారులో ఉన్నట్టుగా భావిస్తున్న రూ.3 కోట్లను ఏదైనా సెటిల్మెంట్ కోసం పట్టుకెళ్తున్నారా? లేక మావోలకు ఇచ్చేందుకు పట్టుకెళ్తున్నారా? అనే విషయాలపై సిట్ దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. సర్రాయి వద్ద మైనింగ్ సెటిల్మెంట్ కోసం ఆ డబ్బులు పట్టుకెళ్తున్నారన్న మరో వాదన కూడా బలంగా విన్పిస్తోంది. కాగా ఘటన జరిగిన తర్వాత ఆ సొమ్ము కారు నుంచి మాయమైనట్టు సమాచారం. -
కిడారి హత్యకు టీడీపీ నేతలే కారణం: భూమన
సాక్షి, విశాఖపట్నం : అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు టీడీపీ నేతలే కారణమని స్పష్టమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకుల సాయంతోనే కిడారి హత్యకు మావోయిస్టులు ప్రణాళిక రచించారని టీడీపీ అనుబంధ పత్రికల్లోనే వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు ఈ హత్యలకు వైఎస్సార్సీపీకి ముడిపెట్టాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ టీడీపీ నాయకులే ఈ హత్యకు కారణమయ్యారని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులను తుది ముట్టించడంలో ఆరితేరారన్నారు. గతంలో వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని హరిరామ జోగయ్య స్పష్టం చేశారని గుర్తు చేశారు. రాఘవేంద్ర రావు అనే అధికారి, పరిటాల రవి హత్యల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారని తెలిపారు. తమ పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కిడారి.. తన మరణ వాంగ్మూలంలో పార్టీ మారినందుకు రూ. 12 కోట్లు తీసుకున్నట్లు చెప్పారని ఆయన గన్మెన్లే చెబుతున్నారని, ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టు కొన్నారనేదానికి ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలన్నారు. మైనింగ్ కోసమే సర్వేశ్వరావు టీడీపీలో చేరాడని అనడానికి చాలా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. మైనింగ్ గొడవల వల్లనే టీడీపీ స్థానిక నేతలు మావోయిస్టులతో చేతులు కలిపారని తేలిందన్నారు. రాజధాని పొలాలను తగల పెట్టినప్పుడు, తుని రైలు ఘటన సందర్భంలో వైస్సార్సీపీపై బురద చల్లారని, తునిలో రైల్ను చంద్రబాబే తగల బెట్టించి, తనపై కేసు పెట్టించాలని చూసారని మండిపడ్డారు. ఈ ఘటనలో నిజాలు తేలుతాయనే భయంతోనే సీఐడీ విచారణను నిలిపివేశారని ఆరోపించారు. కిడారి హత్యలో కూడా టీడీపీ నేతలు బయటపడ్డారు కాబట్టి ఈ కేసు విచారణను కూడా ఆపేస్తారని చెప్పారు. చంద్రబాబు నిఘా వ్యవస్థ నిద్రలో ఉందని, తెలంగాణలో టీడీపీని గెలిపించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నిఘా వ్యవస్థ దారి మళ్లించడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందేమో అని సందేహం వ్యక్తం చేశారు. ఈ హత్యలకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. -
వైఎస్ జగన్ను ఎదుర్కోలేక దుర్మార్గమైన ఆరోపణలు
-
కిడారి,సోమా కుటుంబీకులను ఆదుకుంటాం
-
కిడారి కుటుంబానికి రూ.కోటి సాయం
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యంలో హింసకు తావుండదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మావోయిస్టుల చేతిలో మృత్యువాతపడిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబసభ్యులను పాడేరులో, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను అరకులో శుక్రవారం సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో బాౖMð్సట్ గనులను తవ్వబోమని తాము స్పష్టమైన హామీ ఇచ్చినా మావోయిస్టులు దీన్ని నెపంగా చూపడం సముచితం కాదని చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకులను దారుణంగా చంపారంటే జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. మావోలకు ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. కిడారి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. కిడారి రెండో కుమారుడు సందీప్కుమార్కు ప్రభుత్వశాఖలో గ్రూప్–1 ఉద్యోగం ఇస్తామన్నారు. కుటుంబంలోని నలుగురికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పార్టీపరంగా సహాయం చేస్తామన్నారు. పాడేరులో కిడారి మెమోరియల్ నిర్మిస్తామన్నారు. కిడారి పెద కుమారుడు విషయంలో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కిడారి కుటుంబానికి విశాఖలో ఇంటిస్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తామన్నారు. అదేవిధంగా సివేరి సోమ కుటుంబంలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఏడుగురికి రూ.70 లక్షలు ప్రభుత్వపరంగా అందజేయడంతోపాటు పార్టీపరంగా తలో రూ.5 లక్షలు చొప్పున ఇస్తామని తెలిపారు. సోమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతోపాటు విశాఖలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. అరకులో మధ్యలో నిలిచిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి పట్టా మంజూరు చేస్తామని తెలిపారు. లోతైన పరిశీలన జరపాల్సి ఉంది..: నిఘా వైఫల్యంపై తొందరపడి మాట్లాడడం సరికాదని సీఎం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో చూస్తామని, ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. వాళ్లు(మావోయిస్టులు) వచ్చిన విధానం.. హతమార్చిన తీరుపై లోతైన పరిశీలన జరపాల్సిన అవసరముందన్నారు. జరిగిన ఘటనపై సమీక్షించుకుంటామని చెప్పారు. మంత్రులు చినరాజప్ప, ఆనందబాబు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పంచకర్ల రమేష్బాబు, కలెక్టర్ ప్రవీణ్కుమార్, డీజీపీ ఠాకూర్, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ పాల్గొన్నారు. -
30 మంది మావోయిస్టులు.. ఏవోబీలో ఎన్కౌంటర్..!
ఒడిషా : ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని (ఏవోబీ) కోరాపుట్ జిల్లా కుడుబు వద్ద పోలీసులు, మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఎన్కౌంటర్లో సుమారు 30 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియల్సి ఉంది. కాగా, గత ఆదివారం ఉదయం ఏవోబీలోని అరకులోయలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. (చదవండి : ఎమ్మెల్యే హత్య ఇదే తొలిసారి) -
మావోయిస్టుల కట్టడికి ఐదు రకాల డ్రోన్లు!
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తర్వాత పోలీసులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దట్టమైన అడవిలో అణువణువు తెలిసిన మావోయిస్టుల్లా వెళ్లడం సాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో డ్రోన్లను వినియోగించి మావోయిస్టుల కదలికలను పసిగట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించారు. పది రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం దేశవ్యాప్తంగా తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాలతోపాటు వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో ఐదు రకాల డ్రోన్లను వాడనున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలను అనుసరించి వాటిని అందుబాటులోకి తేనున్నారు. 250 గ్రాముల బరువు ఉండే నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు ఉండే మైక్రో డ్రోన్, 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండే స్మాల్ డ్రోన్, 25 కిలోల నుంచి 150 కిలోలుండే మీడియం డ్రోన్, 150 కిలోలకు పైబడి బరువుండే లార్జ్ డ్రోన్లను ఉపయోగించాలని ప్రతిపాదించారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ బలగాల చేతికి.. కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ప్రతి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి నాలుగు డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఢిల్లీ వరకు అనుసంధానం చేసేలా సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరే శక్తి ఉంటుంది. వీటి ద్వారా పగటి పూట హెచ్డీ క్వాలిటీ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం సులువని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అడవుల్లోనూ వినియోగించేలా.. ఆంధ్రప్రదేశ్తోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని అడవుల్లో సంచరించే మావోయిస్టులను గుర్తించేలా డ్రోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనికోసం శిక్షణ పొందిన పోలీసులను ఉపయోగించుకోనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేస్తారు. మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేసే ప్రత్యేక పోలీసు బలగాలకు దారి చూపించడానికి కూడా వీటిని వినియోగిస్తారు. అవసరమైతే మావోయిస్టులను కాల్చిచంపేలా వాటిని ఉపయోగిస్తారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి నేరుగా బాంబులు ఉన్న డ్రోన్ (సూసైడ్ డ్రోన్)లను పంపి పేలుళ్లు చేయాలని భావిస్తున్నారు. -
కిడారి హత్య రోజు ఏం జరిగిందంటే..
సాక్షి, విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య జరిగిన రోజు ఏం జరిగిందనే దానిపై ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టులో 30 కుటుంబాల్లో 200 మంది నివశిస్తున్నారు. గ్రామస్తుల్లో చాలామంది క్రైస్తవులు. వీరిలో కొంతమంది ప్రతి ఆదివారం ఉదయం సమీపంలోని భల్లుగూడ, స్వర్ణాయిగూడ, కొరంజుగూడల్లో ప్రార్థనలకు వెళ్లి సాయంత్రానికి తిరిగివస్తారు. మిగిలిన వారు పశువుల పెంపకం, వ్యవసాయ పనులు, అటవీ పనులకు వెళ్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు గత ఆదివారం (23న) డుంబ్రిగూడ మండలం కూండ్రం పంచాయతీ సర్రాయి గ్రామంలో గ్రామవికాసంలో పాల్గొనాలని కార్యకర్తలు ఆహ్వానించడంతో ఎమ్మెల్యే కిడారి వారం రోజుల క్రితమే అంగీకరించారు. ఎప్పటి నుంచో వేచిచూస్తున్న మావోయిస్టులకు ఈ సమాచారం చేరింది. అప్పట్నుంచి వారు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ గ్రామానికి డుంబ్రిగూడ నుంచి వచ్చే ఏకైక మార్గం లివిటిపుట్టే. దీంతోపాటు గ్రామానికి చుట్టూ ఉన్న మూడు దట్టమైన కొండలు అనువుగా మారాయి. అంతేకాకుండా డుంబ్రిగూడ మండలం వైపు పోలీసులు దృష్టి సారించడం లేదన్న నమ్మకంతో వీరు ముందుగా అక్కడకు చేరుకుని ఆ దారిలో వచ్చే కిడారిని మట్టుబెట్టవచ్చని వ్యూహరచన చేశారు. కిడారి వచ్చే రూటు, గ్రామ పరిసరాలు, రాకపోకలు సాగించే దారులను క్షుణ్నంగా పరిశీలించారు. ముందురోజు గ్రామానికి 250 మీటర్ల ముందు రోడ్డుపై ఒక మందుపాతరను అమర్చారు. అక్కడ కొంతమంది మావోయిస్టులు పహరా కాశారు. గ్రామం దాటాక 250 మీటర్ల దూరంలో గుంటసీమ రోడ్డులో మరో మందుపాతరను పెట్టారు. అక్కడికి సమీపంలో మరికొందరిని పెట్టారు. ఇంకొందరు మావోయిస్టులు ఊరికి ఆనుకుని ఉన్న కొండల్లో మాటు వేశారు. గ్రామస్తులు కొందరు చర్చిలకు వెళ్లిపోగా మిగిలిన వారిని తమ అదుపులోకి తీసుకున్నారు. కిడారి బృందం బయలుదేరిందని పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు కిడారి, సోమల వాహనాలు ఊర్లోకి చేరగానే అడ్డంగా నిలబడ్డారు. ఆ సమయంలో డుంబ్రిగూడ–లివిటిపుట్టు, లివిటిపుట్టు–గుంటసీమ రోడ్డులో గంటకు పైగా రాకపోకలను నిలిపేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను కొద్ది దూరం తీసుకెళ్లిన అనంతరం పలు ప్రశ్నలు వేసి కాల్చి చంపారు. తర్వాత ‘ఆపరేషన్ సక్సెస్’ అంటూ తమ వద్ద ఉన్న వాకీటాకీల్లో సహచరులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులంతా అడవుల్లోకి వెళ్లిపోయారు. ఒకవేళ తమ నుంచి ఎలాగైనా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు తప్పించుకున్నా, పోలీసులు ప్రవేశించినా తప్పించుకునే వీలు లేకుండా పేల్చేయడానికి ఊరి మొదలు, చివర్లలో మందుపాతర్లను పెట్టినట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో పాల్గొన్న మావోయిస్టులు 100 నుంచి 120 మంది వరకు ఉండొచ్చని తెలుస్తోంది. నిస్సహాయ స్థితిలో గన్మెన్లు ప్రజాప్రతినిధులకు రక్షణ కవచంలా ఉండేందుకు ప్రభుత్వం వారికి గన్మెన్లను నియమిస్తుంది. అలాంటి అంగరక్షకులే ఆపదలో చిక్కుకున్నారు. ఒక్కసారిగా 100 నుంచి 120 మంది మావోయిస్టులు ఏకే–47 తుపాకులు చేతపట్టి నలువైపులా చుట్టుముట్టడంతో ఉన్న ముగ్గురు గన్మెన్లు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయారు. కిడారికి ఇద్దరు గన్మెన్లు, సివేరికి ఒక గన్మెన్ ఉన్నారు. మాకేం తెలియదు.. గత ఆదివారం ఏం జరిగిందో తమకేమీ తెలియదని లివిటిపుట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ‘ఎప్పటిలాగే భల్లుగూడ, స్వర్ణాయిగూడ, కొరంజుగూడల్లోని చర్చిలకు ఉదయాన్నే వెళ్లిపోయా.. సాయంత్రం వచ్చేటప్పటికి ఊళ్లో జనం మూగి ఉన్నారు. ఎమ్మెల్యే గారిని చంపేశారని చెబితే షాకయ్యాం’ అని శెట్టి లక్ష్మి చెప్పింది. ‘మావోయిస్టులకి మేం ఏనాడూ అంబలైనా పెట్టలేదు.. కానీ మేం ఆదరించామని పోలీసులు మా మొగోళ్లను అన్యాయంగా తీసుకుపోయేరు’ అని రాజేశ్వరి అనే యువతి వాపోయింది. తమవాళ్లను తీసుకెళ్లడంపై ఆందోళన విచారణ పేరిట పోలీసులు లివిటిపుట్టుకు చెందిన 20 మంది పురుషులను బుధవారం తెల్లవారుజామున తీసుకెళ్లారు. దీంతో తమ వారిని ఏంచేస్తారోనంటూ భార్యలు, పిల్లలు ఇళ్ల వద్దనే వంటా వార్పూ లేకుండా గడిపారు. మధ్యాహ్నం పాడేరు ఏఎస్పీ అమిత్ బర్దర్ లివిటిపుట్టును సందర్శించారు. ఆ గ్రామ మహిళలు తమకే పాపం తెలియదని, తమ వారిని విడిచిపెట్టాలని ఆయన కాళ్లపై పడి రోదించారు. సాయంత్రానికి వారిని విడిచిపెట్టడంతో గ్రామస్తులు ఊరట చెందారు. కాగా, కిడారి, సివేరిల హత్యలో ప్రత్యక్ష సాక్షులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు గన్మెన్లతోపాటు ఇద్దరు డ్రైవర్లు, కిడారి పీఏ అప్పారావు, మరికొందరు టీడీపీ నాయకులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారిచ్చే సమాధానం, సమాచారం ఆధారంగా ఓ నిర్ధారణకు రానున్నారు. -
రణక్షేత్రంలా మన్యం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం యుద్ధభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా ఉద్రిక్త పరిస్థితే. మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన నేపథ్యంలో ఏజెన్సీలో భారీ ఎత్తున సాయుధ బలగాలు మోహరించాయి. అంతటా గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్ బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. ఈ దళాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ)తో పాటు విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే కూంబింగ్ను ప్రారంభించాయి. అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. పాడేరు, అరకు, చింతపల్లి, సీలేరు మార్గాల్లో వీరు కనిపిస్తున్నారు. కేంద్ర పారామిలటరీ దళాలను కూడా పంపడానికి కేంద్ర హోంశాఖ సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీలోని రోడ్ల వెంబడి సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నారు. మన్యంలోని పలు ప్రాంతాల్లో డాగ్స్క్వాడ్లు, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు మంచి పట్టుంది. దీంతో ఒకపక్క కూంబింగ్, మరోపక్క మావోయిస్టుల స్థావరాలపై పోలీసులు మరింత దృష్టి సారిస్తున్నారు.వివిధ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సానుభూతిపరులు, అనుమానితులను ఆరా తీస్తున్నారు. మరోపక్క పోలీసులను ఎదుర్కోడానికి మావోయిస్టులూ సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో పోలీసులు మరింతగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మట్టుబెట్టిన తర్వాత మావోయిస్టులు ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇది కూడా వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు. తాము హతమార్చింది అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెలను కావడంతో అది తమ గొప్ప విజయంగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఏవోబీలో కూంబింగ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మందుపాతర్లను అమర్చినట్టు సమచారం. తామున్న ప్రాంతానికి వచ్చే సాయుధ దళాలను మట్టుబెట్టే వ్యూహంగా పేర్కొంటున్నారు. ఈనెల 21 నుంచి మావోయిస్టు విలీన వారోత్సవాల సందర్భంగా చత్తీస్గఢ్కు చెందిన గుత్తికోయలు, కోందు దళాలను ఇప్పటికే ఏవోబీలోకి తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు ఎన్కౌంటర్లకు సైతం వెరవకుండా దాడులకు పాల్పడతారన్న పేరుంది. ఇరు వర్గాలు పగ, ప్రతీకారాలతో ఉన్నందున ఏజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో విశాఖ మన్యం వాసులు భయం గుప్పెట కాలం గడుపుతున్నారు. అనుమానితుల పేరిట ప్రశ్నించడానికి పోలీసులు ఎవరిని ఎప్పుడు తీసుకుపోతారోన్న భయం వీరిని వెంటాడుతోంది. ఎక్కడ ఎలాంటి ఘటన జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు. లివిటిపుట్టులో డీజీపీ డుంబ్రిగుడ(అరకులోయ): ప్రజల కోసం పని చేసే మంచి గిరిజన ప్రజాప్రతినిధులను కోల్పోవడం దురదృష్టకరమని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన మండలంలోని లివిటిపుట్టు గ్రామాన్ని, సంఘటన స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం నిశితంగా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నామన్నారు. ఏజెన్సీ గ్రామాలు ఒడిశాకు సరిహద్దుగా ఉండటంతో తరచూ మావోయిస్టుల కదలికలు ఉంటున్నాయన్నారు. మున్ముందు ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీడియో క్లిప్పింగ్లు, ప్రత్యక్ష సాక్షులు, ఫొటోల ఆధారంగా విచారణ చేపడుతున్నామన్నారు. ఆయన వెంట ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, ఓఎస్డీ సిద్ధార్థకౌశల్, ఏఎస్పీ అమిత్బర్దర్, డీసీపీ ఫకీరప్ప ఉన్నారు. సోమ కుటుంబానికి పరామర్శ అరకులోయ: మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాన్ని డీజీïపీ ఆర్పీ ఠాకూర్ పరామర్శించారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయన ముందుగా సోమ ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోమ భార్య బిచ్చావతి, కుమారులు అబ్రహం,సురేష్,ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు. అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు.. ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు తన భర్తను అన్యాయంగా మావోయిస్టులు పొట్టనపెట్టుకుని,తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని సోమ భార్య బిచ్చావతి డీజీపీ ఎదుట రోదించారు. తమను వీధిపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ హత్యగా విచారణ చేపట్టాలి.. తన తండ్రిని మావోయిస్టులు అన్యాయంగా చంపారని,రాజకీయ హత్య కోణంలో విచారణ చేపట్టాలని సోమ కుమారులు అబ్రహం, సురేష్లు డీజీపీకి విన్నవించారు. పోలీసులు కూడా రక్షణ కల్పించలేక పోయారని, డుంబ్రిగుడ ఎస్ఐ విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని ఫిర్యాదు చేశారు. అన్ని విధాల న్యాయం చేస్తాం.. మావోయిస్టులు ఇద్దరు నాయకులను హత్య చేయడం బాధాకరమని, మీ కుటుంబానికి అన్ని విధాల సాయం చేస్తామని డీజీపీ ఠాకూర్, సోమ భార్య, కుమారులకు హమీ ఇచ్చారు. సిట్ దర్యాప్తుతో అన్నీ వెలుగులోకి.. పాడేరు: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన ఘటనపై సిట్తో విచారణ చేపడుతున్నందున అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని డీజీపీ ఆర్.పి. ఠాకూర్ అన్నారు. బుధవారం రాత్రి పాడేరులోని కిడారి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కిడారి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం కిడారి భార్య పరమేశ్వరి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుమారు గంటసేపు కిడారి భార్య పరమేశ్వరితో పలు విషయాలపై ఆంతరంగికంగా చర్చించారు. తమకు జరిగిన అన్యాయం గురించి, కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆమె డీజీపీకి వివరించారు. తమకు అన్ని విధాల న్యాయం చేయాలని కోరారు. కిడారి సర్వేశ్వరరావు వద్ద పనిచేస్తున్న సిబ్బంది పనితీరు, అనుచరుల వ్యవహార శైలి, తదితర వాటిపై డీజీపీ కుటుంబ సభ్యుల్ని ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు డీజీపీ వెంట పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఏఎస్పీ అమిత్ బర్దర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఉన్నారు. -
కిడారి హత్యలో ఆ ఇద్దరూ ఉన్నారా?
సాక్షి, అమరావతి/ఏలూరు, సాక్షి ప్రతినిధి: ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి హత్యలో మావోయిస్టులు రైను, స్వరూప ఉన్నారా? లేదా అనేదానిపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని జంత్రి వద్ద 2016, అక్టోబర్ 24న జరిగిన కోవర్టు దాడిలో రైను, స్వరూపలతోపాటు 27మంది కామ్రేడ్స్ అమరులయ్యారంటూ 2016, అక్టోబర్ 26న సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే పోలీసులు మాత్రం రైను, స్వరూపలు ఈ నెల 23న లివిటిపుట్టు ఆపరేషన్కు నేతృత్వం వహించారని వారి ఫొటోలతో సహా అధికారిక ప్రకటన చేశారు. అటు జగన్ ప్రకటన, ఇటు పోలీసుల ప్రకటన అయోమయానికి గురిచేసేలా ఉండటం గమనార్హం. హత్యల్లో పాల్గొన్న మావోయిస్టుల్లో ముగ్గురిని గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. వారిలో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ సింద్రి అలియాస్ చంద్రి అలియాస్ రింకీ, తూర్పుగోదావరి జిల్లా దుబ్బపాలెంకు చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, అలియాస్ రైను, విశాఖ జిల్లా కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియాస్ అరుణల ఫొటోలు, వివరాలతో సహా పోలీసులు విడుదల చేశారు. 2016లో మావోయిస్టు జగన్.. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన 27 మంది కామ్రేడ్స్ను కోల్పోయామని వారి పేర్లతో సహా ప్రకటించారు. వీరిలో స్వరూప, రైను కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారు ఉన్నారో? లేదో? పోలీసులు లేదా మావోయిస్టులైనా నిర్ధారించాల్సి ఉంది. -
మావోయిస్టుల కట్టడికి ఐదు రకాల డ్రోన్లు!
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య తర్వాత పోలీసులు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దట్టమైన అడవిలో అణువణువు తెలిసిన మావోయిస్టుల్లా వెళ్లడం సాధ్యం కాబట్టి ప్రత్యామ్నాయాలపై దృష్టిసారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో డ్రోన్లను వినియోగించి మావోయిస్టుల కదలికలను పసిగట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించారు. పది రాష్ట్రాల్లో డ్రోన్ల వినియోగం దేశవ్యాప్తంగా తీవ్రవాద సమస్య ఉన్న ప్రాంతాలతోపాటు వామపక్ష తీవ్రవాదం ఉన్న పది రాష్ట్రాల్లో ఐదు రకాల డ్రోన్లను వాడనున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలను అనుసరించి వాటిని అందుబాటులోకి తేనున్నారు. 250 గ్రాముల బరువు ఉండే నానో డ్రోన్, 250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు ఉండే మైక్రో డ్రోన్, 2 కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండే స్మాల్ డ్రోన్, 25 కిలోల నుంచి 150 కిలోలుండే మీడియం డ్రోన్, 150 కిలోలకు పైబడి బరువుండే లార్జ్ డ్రోన్లను ఉపయోగించాలని ప్రతిపాదించారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ బలగాల చేతికి.. కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), కోబ్రా దళాలు, రాష్ట్రాల పరిధిలో ఉన్న గ్రేహౌండ్స్ బలగాలకు ఈ డ్రోన్లను అందించాలని భావిస్తున్నారు. ప్రతి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో రెండు నుంచి నాలుగు డ్రోన్లను ఏర్పాటు చేయడం, వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఢిల్లీ వరకు అనుసంధానం చేసేలా సీఆర్పీఎఫ్ కసరత్తు ప్రారంభించింది. ఈ ఐదు డ్రోన్లలో తక్కువ బరువున్న నానో, మైక్రో డ్రోన్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. 350 అడుగుల నుంచి 450 అడుగుల వరకు ఈ రెండు డ్రోన్లకు ఎగిరే శక్తి ఉంటుంది. వీటి ద్వారా పగటి పూట హెచ్డీ క్వాలిటీ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడం సులువని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అడవుల్లోనూ వినియోగించేలా.. ఆంధ్రప్రదేశ్తోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని అడవుల్లో సంచరించే మావోయిస్టులను గుర్తించేలా డ్రోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనికోసం శిక్షణ పొందిన పోలీసులను ఉపయోగించుకోనున్నారు. ఈ డ్రోన్ల సాయంతో మావోల కదలికలను ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేస్తారు. మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ చేసే ప్రత్యేక పోలీసు బలగాలకు దారి చూపించడానికి కూడా వీటిని వినియోగిస్తారు. అవసరమైతే మావోయిస్టులను కాల్చిచంపేలా వాటిని ఉపయోగిస్తారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి నేరుగా బాంబులు ఉన్న డ్రోన్ (సూసైడ్ డ్రోన్)లను పంపి పేలుళ్లు చేయాలని భావిస్తున్నారు. -
మంత్రి పదవి ఇస్తామన్నారు..రూ.12 కోట్లు ఇచ్చారు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పార్టీ మారితే గిరిజన కోటాలో మంత్రి పదవి ఇస్తామని అధికార తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని ఇటీవల విశాఖ మన్యంలో మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వెల్లడించినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. కాల్పుల కంటే ముందు కిడారిని మావోయిస్టులు లోతుగా ప్రశ్నించారని, ఆయన పలు సంచలనాత్మక విషయాలు బయటపెట్టారని ప్రత్యక్ష సాక్షులు స్పష్టం చేశారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... అధికార పార్టీలో చేరినందుకు రూ.12 కోట్లు ఇచ్చారని, విశాఖ మన్యంలో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించేందుకు మంత్రి నారా లోకేశ్ తనకు లైసెన్స్లు ఇప్పించారని కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల ఎదుట ఒప్పుకున్నారు. తాను కొన్ని తప్పులు చేశానని, మైనింగ్ ఆపేస్తానని, రాజకీయాలు కూడా మానేస్తానని, ఇందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ఆయన వేడుకున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను సైతం మావోలు ప్రశ్నించారు. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే కిడారితో కలిసి తిరగాలని ముఖ్యమంత్రి తనకు చెప్పారని సోమ అన్నారు. బాక్సైట్ క్వారీలతో ఎమ్మెల్యే తనకు 25 శాతం వాటా ఇచ్చారని, పెట్టుబడి ఆయనే పెడతామన్నారని, ఈ మేరకు తమ పార్టీ కూడా చెప్పిందని మావోయిస్టుల ఎదుట అంగీకరించారు. మావోయిస్టులు, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణ మావోలు: పార్టీ ఎందుకు మారావు? కిడారి: గిరిజనుల కోటాలో మంత్రి పదవి ఇస్తామన్నారు. మావోలు: పార్టీ మారినందుకు ఎంత డబ్బు తీసుకున్నావు? కిడారి: 12 కోట్లు. (తొలుత మౌనం. డ్రైవరుతో ఆరా. నాకు తెలియదన్నాక కిడారిని గట్టిగా గద్దించడంతో వెల్లడి) మావోలు: వద్దని చెప్పినా మైనింగ్ వ్యవహారాలు కొనసాగిస్తున్నావు. లైసెన్స్లు ఎలా వచ్చాయి? కిడారి: మంత్రి నారా లోకేశ్ ఇప్పించారు. అన్నీ ఆయనే చూసుకుంటామన్నారు. మావోలు: అయితే, వద్దనా మైనింగ్ చేస్తావా? కిడారి: కొన్ని తప్పులు చేశా. మైనింగ్ ఆపేస్తా. ఇక చేయను, ఈ మేరకు రాసిస్తా. రాజకీయాలు కూడా మానేస్తా. రెండు రోజులు సమయం ఇవ్వండి. మావోలు: ఇంకా ఏమేం ఒప్పందాలు ఉన్నాయి? కిడారి: ఇంకెప్పటికీ, ఇంకేమీ చేయను. మావోలు: చేసిందంతా ఒక ఎత్తయితే... ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నావు. కొత్తగా రెండు వాహనాలు కొన్నావు కదా! కిడారి: అవును. ట్రైకార్ సంస్థ ద్వారా రుణం తీసుకున్నా. 35 శాతం సబ్సిడీ, ఎమ్మెల్యే అలవెన్స్ ఉంది. మావోలు: అంత విలాసవంతమైన జీవితం కావాలా? కిడారి: మౌనం. సివేరి సోమతో మావోయిస్టుల సంభాషణ మావోలు: నువ్వు వాడితో(కిడారి) కలిసి ఎందుకు తిరుగుతున్నావు? సివేరి: ఎమ్మెల్యే పార్టీ మారి వచ్చినందున కలిసి తిరగమని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని కార్యక్రమాలు, ఫంక్షన్లకు కూడా కలిసే వెళ్లమన్నారు. మావోలు: క్వారీలు వద్దన్నాం, బాక్సైట్ తవ్వొద్దని చెప్పాం కదా! సివేరి: నాకు ఎమ్మెల్యే 25 శాతం వాటా ఇచ్చారు. పెట్టుబడి ఆయనే పెడతామన్నారు. ఈ మేరకు పార్టీ కూడా చెప్పింది. పాలకులతో కుమ్మక్కై మోసం చేస్తావా? మా వద్ద నీకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయంటూ ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు పలు అంశాలపై నిలదీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉన్నది ఉన్నట్లు అంగీకరించానని, ఇకపై ఎలాంటి తప్పులు చేయనని, తనను వదిలిపెట్టాలని, రెండు రోజులు అవకాశం ఇవ్వాలని కిడారి మొరపెట్టుకున్నారని చెప్పారు. గిరిజనులను బాగుచేస్తానని చెప్పి, బాక్సైట్కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఇప్పుడు వారి బతుకులనే దెబ్బతీసేలా అధికార పార్టీతో చేతులు కలుపుతావా? పాలకులతో కుమ్మక్కై ఇలా ఎంతకాలం మోసం చేస్తావు? నీలాంటి వాడు బతకడానికి వీల్లేదు, నీ ఖేల్ ఖతం అంటూ కిడారిపై తుపాకులు ఎక్కుపెట్టి గుళ్లవర్షం కురిపించినట్లు సమాచారం. ఉలిక్కిపడ్డ టీడీపీ పెద్దలు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య గురించి తెలియగానే అధికార పార్టీ ముఖ్య నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటన ఎలా జరిగిందనే అంశం కంటే ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ముందుగా ఆ సంగతులు తెలుసుకోండి అంటూ వారు ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నందున తక్షణమే నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ పనిపైనే దృష్టి పెట్టారు. మావోయిస్టులు, ఎమ్మెల్యే మధ్య జరిగిన సంభాషణ అప్పటికే బయటకు రావడంతో... ‘‘ప్రత్యక్ష సాక్షుల నుంచి ఒక్క విషయం కూడా బయటకు పొక్కకూడదు. ఎమ్మెల్యే కొనుగోలు సంగతిని బయటకు రానివ్వొద్దు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో తెలియదు. వాళ్ల నోళ్లు నొక్కేయండి. ఒక్క మాట బయటకొచ్చినా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త’’ అంటూ అధికార పార్టీ పెద్దల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు అత్యవసర ఆదేశాలు అందినట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షుల మాటలు మార్పించండి ప్రత్యక్ష సాక్షులు ఇప్పటివరకు చెప్పిన మాటలను స్వయంగా వారితోనే మార్చి చెప్పించాలనే పోలీసు ఉన్నతాధికారుల నుంచి స్థానిక అధికారులకు ఆదేశాలు అందుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అప్పుడు ఏదో ఆందోళనతో అలా చెప్పామనే కోణంలో మళ్లీ మాట్లాడించాలని సూచిస్తున్నట్లు సమాచారం. తప్పుడు ప్రచారం చేద్దాం.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, వారు చెప్పకుండా, తమ సూచనలు లెక్కచేయకుండా వెళ్లారని, మావోయిస్టులతో చర్చించి ఒప్పందాలు చేసుకోవడానికే వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వాలని, దాన్నే ఎక్కువగా ప్రచారం చేయాలనే సూచనలు ఉత్తరాంధ్రలోని టీడీపీ నేతలకు పార్టీ ముఖ్యుల నుంచి వెళ్లినట్లు తెలిసింది. తద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై చర్చ జరగకుండా చూడాలనేది టీడీపీ ఎత్తుగడగా తెలుస్తోంది. పోలీసుల చేతగానితనాన్ని కూడా ప్రత్యేకంగా ప్రచారం చేయాలని కూడా అంటున్నట్లు వినికిడి. మావోల వద్ద సమాచారం నిక్షిప్తం అధికార పార్టీ తన అనుకూల మీడియా ద్వారా తిమ్మినిబమ్మి చేస్తుందని మావోయిస్టులు గ్రహించినట్లు సమాచారం. అందుకే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలతో జరిగిన సంభాషణలను వ్యూహాత్మకంగా రికార్డు చేసినట్లు తెలిసింది. సాధారణంగా ఏదైనా సంఘటనకు పాల్పడిన తరువాత మావోయిస్టులు అధికారికంగా మీడియాకు లేఖలు విడుదల చేస్తారు. ఆ లేఖల్లో మరెన్ని వివరాలు ఉంటాయో, ఎలాంటి లోగుట్లు బయటకు వస్తాయో అనే ఆందోళన కూడా తమ పార్టీ ముఖ్య నేతల్లో ఉందని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. గిరిజన ద్రోహులైనందుకే... ఎమ్మెల్యే కిడారి వాహనాన్ని మావోయిస్టులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకునే ముందు ఆయన తీవ్ర భయాందోళనలతో తనతోపాటు వాహనంలో ఉన్న వారితో పలు అంశాలను ప్రస్తావించారు. డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు, అంగరక్షకులు, ఇతర నాయకులు ఎమ్మెల్యేతోపాటు ఉన్నారు. ఈ రోజు మావోయిస్టుల చేతిలో చచ్చాంరా... అని కిడారి వ్యాఖ్యానించినట్లు డ్రైవర్ రవి మీడియాకు చెప్పారు. ‘‘నన్ను బాక్సైట్ తవ్వకాల గురించి అడిగారు. వైకాపా నుంచి టీడీపీలోకి మారినందుకు ఎంత తీసుకున్నారో తెలుసా? అని ప్రశ్నించారు’’ అని రవి వివరించారు. కిడారి, సివేరిలు గిరిజన ద్రోహులైనందునే చంపుతున్నామని మావోయిస్టులు చెప్పినట్లు మాజీ ఎమ్మెల్యే గన్మెన్ స్వామి, కిడారి పీఏ అప్పారావు వెల్లడించారు. ‘‘ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని మాత్రం కొద్దిదూరం తీసుకెళ్లారు. స్థానికులతో కొంతమంది మావోయిస్టులు చెట్టు కింద సమావేశం నిర్వహించారు. ఆ తరువాత కాల్పులు జరిగాయి’’ అరకు మాజీ సర్పంచి చటారి వెంకటరాజు తెలిపారు. స్థానికుల సమక్షంలోనే ప్రశ్నించిన మావోలు వాహనాన్ని అడ్డగించి తమ అదుపులోకి తీసుకోబోయే సమయంలో వ్యూహంలో భాగంగానే పలువురు స్థానికులను మావోయిస్టులు వెంట పెట్టుకుని వెళ్లారు. ఆ సందర్భంగానూ మావోయిస్టులు, ఎమ్మెల్యే మధ్య మాటలు జరిగాయి. సివేరి సోమ విషయంలోనూ దాదాపు ఇదేవిధంగా జరిగింది. వీటికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండాలనే ఉద్దేశంతోనే స్థానికులను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ‘‘ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి గిరిజనులే. వారిని చంపేస్తే గిరిజనులు ఆగ్రహించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో సహకరించకపోవచ్చు. తమ కదలికలను పోలీసులకు తెలియజేయవచ్చు. వాటన్నింటి దృష్ట్యానే స్థానికులను వెంట తీసుకెళ్లారు. వారి సమక్షంలోనే అన్ని వివరాలు రాబట్టారు. ఆ తరువాతే కాల్చారు’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు విశ్లేషించారు. ఎమ్మెల్యే అమ్ముడుపోయిన విషయాన్ని గిరిజనుల మధ్య నిరూపించాలన్నదే మావోల ఎత్తుగడ అని పేర్కొన్నారు. తమ సమక్షంలోనే మావోయిస్టులు పలు ప్రశ్నలు అడిగినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. సంభాషణలు బట్టబయలు కిడారి, సివేరిల హత్యకు ముందు ముగ్గురు గన్మెన్లు, ఇద్దరు డ్రైవర్లు, కిడారి పీఏ అప్పారావు, అరకు మాజీ సర్పంచ్ వెంకట్రాజు, నాయకురాలు లావణ్య తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వీరితోపాటు తమకు నమ్మకస్తులైన వారిని కూడా మావోలు వెంట తీసుకెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత వేర్వేరుగా కాల్చి చంపారు. సంఘటన జరిగిన తరువాత దాదాపు ఆరేడు గంటలపాటు పోలీసుల జాడ లేదు. ఈలోగానే ప్రత్యక్ష సాక్షులు తమ కళ్లెదుట జరిగిన సంఘటనను హతుల కుటుంబీకులకు, మిత్రులు, బంధువులకు, పార్టీ ముఖ్య నాయకులకు చేరవేశారు. సంఘటనా స్థలం నుంచి అరకు పోలీసుస్టేషన్ వద్దకు మృతదేహాలను సొంత వాహనాల్లో తీసుకొచ్చేటప్పుడు మార్గమధ్యంలోని గ్రామాల్లో ప్రజల డిమాండ్ మేరకు ఆగారు. ఆ సమయంలో కూడా జరిగిన సంఘటనను వివరించారు. దీంతో సంభాషణల వ్యవహారం బట్టబయలైంది. -
అరకు దాడి ఆధారాలు దొరికాయ్ : డీజీపీ
సాక్షి విశాఖపట్నం : విశాఖ మన్యం, అరకు లోయలో మావోయిస్టుల కదలికలు తగ్గిపోయినట్టు పోలీసు వర్గాలు ఎప్పుడూ చెప్పలేదని ఆంద్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం డుంబ్రిగూడ మండలం లిపిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యకు గురైన ప్రదేశాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. కాల్పుల్లో పాల్లొన్న వారి ఆధారాలు దొరికాయనీ, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దు (ఏఓబీ)లో సమస్యలున్నాయనీ, ఈ ఘటనపై ఒడిషా డీజీపీ ఆర్పీ శర్మతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో డీజీపీ ఇంటలిజెన్స్, విశాఖ జిల్లా ఎస్పీ ఉన్నారు. -
అరకు హత్యాకాండలో కీలకపాత్రధారి కలకలం..
తూర్పుగోదావరి, అడ్డతీగల (రంపచోడవరం): అరకులో జరిగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యాకాండలో కీలకపాత్ర వహించింది అడ్డతీగల మండలం దబ్బపాలేనికి చెందిన జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, రైనో అని విశాఖ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో తూర్పు మన్యంలో కలకలం మొదలైంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఆదివారం మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో దర్యాప్తును విస్తృతం చేసిన పోలీసు అధికారులు ముగ్గురు మావోయిస్టులు ఈ హత్యాకాండలో కీలకపాత్ర వహించినట్లు పేర్లు, ఫొటోలను విడుదల చేశారు. హత్యల్లో ప్రత్యక్ష పాత్ర ఉందంటూ విడుదల చేసిన తొలి జాబితాలోనే జనుమూరి శ్రీనుబాబు పేరు చోటు చేసుకోవడంతో మన్యంలో వాతావరణం వేడెక్కింది. పేర్లు ప్రకటించిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు కావడంతో శ్రీను ఈ ఆపరేషన్కి నాయకత్వం వహించాడనే చర్చ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మేరకు పోలీసుశాఖ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందంటున్నారు. అడ్డతీగల మండలం వీరవరం పంచాయతీలోని దబ్బపాలెం మూడో వీధికి చెందిన సోమయ్య, పాపాయ్యమ్మల కుమారుడు శ్రీను. ముగ్గురు సోదరులు, ఒక సోదరి కాగా శ్రీను మరో సోదరుడు వెంకటేశులు ఆలియాస్ ఆనంద్ కూడా మావోయిస్టు ఉద్యమంలో ఉంటూ 2016లో విశాఖ జిల్లా మర్రిపాకలు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడైన శ్రీను 1998 నుంచి ఆ ఉద్యమంలో పనిచేస్తున్నాడు. గతంలో బలిమెల వద్ద పోలీసులపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడితో పాటు మరికొన్ని హింసాత్మక ఘటనల్లో కీలకంగా వ్యహరించిన శ్రీనుబాబుపై పలు కేసులు నమోదైనట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీలోని తూర్పు డివిజన్తో పాటు ఒడిశా మల్కన్గిరి డివిజన్లో శ్రీనుబాబు కీలకంగా వ్యవహిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. శ్రీనుబాబు దబ్బపాలెంలోనే ప్రాథమిక విద్యాభాస్యం చేసిన అనంతరం చదువు మానేశాడు. శ్రీను మరో సోదరుడు వీరవరం సర్పంచ్గా రెండు పర్యాయాలు పనిచేశారు. ‘ఆ ప్రాంతాల్లోకి వెళ్లవద్దు’ చింతూరు (రంపచోడవరం): ఓ వైపు అరకు ఘటన.. మరోవైపు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చింతూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా అరకులో ప్రజా ప్రతినిధులను హతమార్చిన మావోయిస్టులు దండకారణ్య సరిహద్దుల్లో కూడా అలాంటి ఘటనలకు పాల్పడవచ్చనే అనుమానంతో పోలీసులు చింతూరు, ఎటపాక సర్కిల్ పరిధిలోని డొంకరాయి, మోతుగూడెం, చింతూరు, ఏడుగురాళ్లపల్లి, ఎటపాక, కూనవరం, వీఆర్పురం పోలీస్స్టేషన్ల పరిధిలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా ప్రధాన రహదారుల వెంబడి వాహనాలు ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు అనుమానితులను పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి విడిచి పెడుతున్నారు. దీంతోపాటు ప్రధాన రహదారుల వెంబడి ఉన్న కల్వర్టులను కూడా బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అరకు ఘటన అనంతరం దండకారణ్యంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అదనపు బలగాలతో అటవీ ప్రాంతంలో కూంబింగ్ను ముమ్మరం చేశారు. ప్రధానంగా ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దుమ్ముగూడెం, చర్ల, గొల్లపల్లి, కిష్టారం, కుంట, ఏడుగురాళ్లపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సరిహద్దు ప్రాంతాలను అణువణువూ జల్లెడ పడుతున్నారు. త్వరలోనే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు అదనపు భద్రత కల్పిస్తున్నారు. ప్రచారం కోసం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టార్గెట్లకు నోటీసులు అరకు ఘటన నేపథ్యంలో చింతూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లతో పాటు మావోయిస్టుల టార్గెట్లో ఉన్న వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నందున మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అత్యవసర పనులపై వెళ్లాల్సి వస్తే తమకు సమాచారం ఇచ్చి వెళ్లాలని పోలీసులు నోటీసుల్లో సూచించారు. విస్తృత తనిఖీలు..మరో వైపు కూంబింగ్ పొరుగున ఉన్న విశాఖ జిల్లాలో మావోయిస్టుల హత్యాకాండ నేపథ్యంలో తూర్పున ప్రధాన రహదారుల వెంబడి కూడళ్లలో పోలీసులు వాహన తనిఖీలు విస్తృతంగా చేస్తున్నారు. అలాగే అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. -
ఏవోబీలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్తో గిరిజన ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఓ వైపు పోలీసుల గాలింపు, మరోవైపు మావోయిస్టుల వారోత్సవాలతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరగుతుందోనన్న భయంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య అనంతరం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కిడారి హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గిరిజనులను విచారిస్తున్నారు. ప్రత్యక బృందం (సిట్) అధికారి ఫకీరప్ప నేతృత్వంలో స్థానికులను విచారిస్తూ.. ఏజెన్సీలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కిడారి డ్రైవర్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. డీజీపీ ఠాకుర్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి.. దర్యాప్తుపై వివరాలు సేకరించనున్నారు. కిడారి హత్య అనంతరం మావోయిస్టులు ఎటు వైపుకు వెళ్లారు.. హత్యలో స్థానికుల ప్రేమేయం ఎమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హత్యలో ఇప్పటికే పలువురు మావోయిస్టులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు. -
కూంబింగ్ నిలిపివేయడంతోనే..
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా, ఒడిశా బోర్డర్ (ఏవోబీ) మావోయిస్టులకు సురక్షిత స్థావరం. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, అసలు ఇక్కడ మావోల సంచారమే లేదంటూ రాష్ట్ర హోం మంత్రి నుంచి కిందిస్థాయి పోలీసు అధికారులు ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. అడపాదడపా చిన్న ఘటనలు జరిగినపుడు.. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మావోలు చేసిన పని అని పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. 2016 అక్టోబర్లో రామ్గుడా ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మున్నాతో పాటు 32 మంది కీలక మావో నేతలు నేలకొరిగారు. ఆ తర్వాత కొంతకాలం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించిన పోలీసులు ఇక మావోల జాడలేదని నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంగానే గత ఏడాదిన్నరగా విశాఖ మన్యంలోనే కాదు.. ఏవోబీలోనే కూంబింగ్ ఆపరేషన్లు క్రమేపీ తగ్గించేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఎక్కడైనా ఒకరిద్దర్ని మావోలు మట్టుబెట్టినా, లేదా ఎక్కడైనా వాహనాలకు నిప్పుపెట్టినా ఒకటి రెండు పార్టీలతో గాలింపు చర్యలు చేపట్టడం.. ఆ తర్వాత మానివేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఏడాదిగా ఎలాంటి ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్స్ చేయలేదు. ఇదే మావోలకు కలిసొచ్చిందని చెబుతున్నారు. విశాఖలో ప్రత్యేక బలగాలు.. విశాఖలో గ్రేహౌండ్స్ దళాలు, ప్రత్యేక పోలీస్ బలగాలు ఉన్నాయి. పైగా 16వ ఏపీఎస్పీ బెటాలియన్ కూడా ఉంది. బెటాలియన్లో ఏ నుంచి హెచ్ వరకు కంపెనీకి 128 మంది చొప్పున ఎనిమిది కంపెనీల ప్రత్యేక పోలీసు బలగాలున్నాయి. అలాగే గ్రే హౌండ్స్లో 1ఏ,1బీ,1సీ,1డీ నుంచి 4ఏ,4బీ,4సీ,4డీ చొçప్పున యూనిట్కు 30 మంది చొప్పున 16 యూనిట్లు ఉన్నాయి. యాంటీనక్సల్స్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) కంపెనీ (128 మందితో) ఉంది. పాడేరులో ఏఎస్పీ, నర్సీపట్నంలో ఓఎస్డీ, విశాఖలో ఎస్పీ, ఏఎస్పీ (అడ్మిన్), ఏఎస్పీ (ఆపరేషన్), డీఐజీ, ఇంటిలిజెన్స్ ఎస్పీ, గ్రేహౌండ్స్ ఎస్పీ విశాఖ కేంద్రంగానే పనిచేస్తుంటారు. ఇంతమంది పోలీసు ఉన్నతాధికారులు.. ఇన్ని బలగాలు ఉన్నా విశాఖ ఏజెన్సీలో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. పైగా ఇటీవల మావో అగ్రనేత చలపతి ఏవోబీలోనే ఉన్నాడని సమాచారం ఉందని పోలీసులు ప్రకటన కూడా చేశారు. అయినా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మావో అగ్రనేత కదిలికలు ఉన్నప్పుడు కూంబింగ్ ఆపరేషన్ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు పట్టపగలు సులువుగా హతమార్చారని చెబుతున్నారు. విశాఖ మన్యంలోనే కాదు ఏవోబీలో కూడా మావోల కదలికలులేవని, రామ్గుడ ఎన్కౌంటర్ తర్వాత మావోలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయారని హోంమంత్రి, కిందిస్థాయి పోలీసుల అధికారి వరకూ ప్రకటనలు చేశారు. ప్రభుత్వ ప్రకటనలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావించిన మావోలు.. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్న ఆలోచనతోనే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం వాడుకోలేదా? ఉరుములు, పిడుగులను ముందుగానే గుర్తిస్తాం. ప్రజలను అప్రమత్తం చేస్తాం. ప్రాణాపాయం నుంచి రక్షిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాల్లో కూర్చుని మన రాష్ట్రంలో ఎవరితోనైనా ముచ్చటిస్తారు. మారుమూల ప్రాంతాల్లోని జనం యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వీధి దీపం వెలిగిందో లేదో ముఖ్యమంత్రి కోర్ డ్యాష్బోర్డులో వెంటనే తెలుసుకోవచ్చు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం వాడకంపై సందర్భం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలవీ.. సాక్షి, అమరావతి: ప్రపంచస్థాయి అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నామని ఊదరగొడుతున్న టీడీపీ ప్రభుత్వం 50 మంది సాయుధ మావోయిస్టుల కదలికలను ఏమాత్రం గుర్తించలేకపోయింది. శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యేను చుట్టుముట్టి తీసుకెళ్లి మట్టుబెట్టినా ప్రభుత్వానికి తెలియలేదు. అదేదో అత్యంత మారుమూల ప్రాంతమేమీ కాదు. మండల కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జనసంచారం ఉన్నచోటే ఘాతుకం చోటుచేసుకుంది. మన్యంలో మావోయిస్టుల తాజా దుశ్చర్య వెనుక ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. తమ నాయకులను మావోయిస్టులు మట్టుబెట్టిన తీరును, ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని అరకు, పాడేరు ప్రాంత వాసులు తూర్పారపడుతున్నారు. సమాచారం అందినా నిర్లక్ష్యమేనా? అత్యాధునిక టెక్నాలజీని వాడుకోవడంలో మనం మొదటి స్థానంలో ఉన్నామని ప్రభుత్వం నిత్యం చెప్పుకుంటోంది. అయితే, విశాఖ మన్యంలో మావోయిస్టుల రాకను ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పదేళ్ల కిందటే రాష్ట్రంలో తీవ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నప్పుడు పోలీసులు హైదరాబాద్ కేంద్రంగా ఒక శాటిలైట్ నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అడవుల్లో బృందాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి? ఎంతెంతమంది తిరుగుతున్నారు? వారి వద్ద ఏ ఆయుధాలు ఉన్నాయనేది ఆ నెట్వర్క్ ద్వారా గుర్తించి ప్రతిదాడులు నిర్వహించారు. ఈ టెక్నాలజీ ఆధారంగానే మావోయిస్టుల కదలికలను గుర్తించి, పలు ఎన్కౌంటర్లు చేశారు. ఇప్పుడు అంతకంటే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం పోలీసుల వద్ద ఉంది. అరకు ప్రాంతంలోని దాదాపు అన్ని గిరిజన గూడేల్లో సెల్ఫోన్ టవర్లు ఏర్పాటు చేశారు. పైగా గిరిజన ప్రాంతాలపై పోలీసుల నిఘా ఎక్కువగా ఉంది. అయినా మావోయిస్టుల వ్యూహాలను పసిగట్టడంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయి. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో పోలీసులకు, మావోయిస్టులకు నిత్యం అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయని, మూడు నెలలుగా అరకు కేంద్రంగా వారి కార్యకలాపాలు పెరిగాయని సమాచారమున్నా పోలీసు విభాగం పెడచెవిన పెట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో పలువురికి నోటీసులు గుంటూరు : మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు మృతి చెందిన నేపథ్యంలో గంటూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా గతంలో మావోయిస్టు షెల్టర్ జోన్లుగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అధికంగా ఉన్న పెదకూరపాడు, మాచర్ల, వినుకొండ, గురజాల నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు అచ్చంపేట మండలంలో చేçపట్టనున్న పాదయాత్రను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ముగించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. -
పోలీసుల చేతికి ‘మావోల ఆపరేషన్’ కీలక వీడియో!
సాక్షి, అమరావతి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేసిన మన్యంలో డీజీపీ పర్యటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే మావోల ముప్పు పొంచి ఉంటుందనే ఆందోళనలో పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ పర్యటనకు ఇంకా గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్తోపాటు నిఘా వర్గాలు మావోల కదలికలపై అంచనా వేస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులకు సంబంధించిన తాజా సమాచారం సేకరించిన అనంతరం బుధవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి డీజీపీ మన్యం పర్యటనపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలో మావోయిస్టులు నిర్వహించిన ఆపరేషన్కు సంబంధించిన వీడియో పోలీసులకు చిక్కినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గన్మెన్, డ్రైవర్, పార్టీ నాయకుల నుంచి సెల్ఫోన్ను మావోయిస్టులు ముందే తీసుకుని, వారిని దూరంగా ఉండాలంటూ గన్లతో కాపలా ఉన్నారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో రోడ్డుపై బైక్పై వెళుతున్న వారిని మావోయిస్టులు అడ్డగించినట్టు చెబుతున్నారు. వారిలో ఒకరు మావోయిస్టుల కన్నుగప్పి సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించినట్టు తెలిసింది. అందులో మావోయిస్టులు దారి అడ్డగించడం, ఘటన తర్వాత పారిపోతున్న క్లిప్పింగ్ను పోలీసులు వ్యూహాత్మకంగానే మంగళవారం విడుదల చేసినట్టు తెలిసింది. ఇంకా కీలక ఆధారాలతో ఉన్న వీడియో పోలీసుల వద్ద ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేని పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపిన మావోయిస్టుల్లో కొందరిని వీడియో ద్వారా గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. స్తంభించిన మన్యం.. స్వచ్ఛందంగా బంద్ అరకు/పాడేరు: అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ హత్యకాండకు నిరసనగా సోమవారం మన్యంలో స్వచ్ఛందంగా బంద్ జరిగింది. అరకు పట్టణంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. బంద్ వల్ల అరకు పర్యాటక కేంద్రం బోసిపోయింది. పలు రాష్ట్రాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు స్థానికంగా రిజర్వ్ చేసుకున్న అతిథి గృహాలు, ప్రైవేట్ రిసార్ట్స్, టూరిజం, పలు లాడ్జీల గదులన్నింటినీ ఆన్లైన్లోనే రద్దు చేసుకున్నారు. దీంతో మూడ్రోజుల నుంచి అరకులోయ ప్రాంతంలోని అతిథి గృహాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఉన్న పర్యాటకులు కూడా భయంతో గదుల నుంచి బయటకు రాలేదు. పాడేరులో కిడారి, సోమకు ఐటీడీఏ అధికారులు, సిబ్బంది మంగళవారం సంతాపాన్ని తెలియజేశారు. అరకు అంటే బెరుకు! విశాఖపట్నం : అరకు ఈ పేరు వింటేనే పర్యాటకులు అక్కడి అందాలు చూడడానికి పరుగులు పెడతారు. ప్రకృతి సోయగాలు, అందాల లోయలు, మంచుకమ్మిన పర్వతాలు, మెలికలు తిరుగుతూ కనిపించే రహదారులు, జలజల జాలువారే జలపాతాలు.. ఇలా ఒకటేమిటి? ఎన్నో సౌందర్యాల సమాహారం విశాఖ మన్యం! అలాంటి రమణీయతలో అలరారే ఏజెన్సీ ఇప్పుడు పర్యాటక ప్రియులను భయపెడుతోంది. మూడు రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యం వణుకుతోంది. ఇప్పుడు ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టుల కోసం భారీ సంఖ్యలో పోలీసులు కూంబిగ్ చేపట్టారు. సాయుధ భద్రతా దళాలు అడవుల్లోనూ, మారుమూల పల్లెలు, గూడేల్లోనూ అణువణువునా జల్లెడ పడుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పర్యాటకులు విశాఖ ఏజెన్సీకి వెళ్లడానికి సాహసించలేక పోతున్నారు. అరకులోని పద్మావతి గార్డెన్స్, డుంబ్రిగుడ మండలం చాపరాయి, అనంతగిరి మండలం బొర్రా గుహలు, టైడా, ఇంకా పలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అటు వైపు పర్యాటకులెవరూ తొంగి చూడడం లేదు. నిత్యం వేలాది మందితో కిక్కిరిసే బొర్రా గుహలు బోసిపోతూ కనిపిస్తున్నాయి. విశాఖ నుంచి పర్యాటకశాఖ నడిపే టూర్ ప్యాకేజీ బస్సులను కూడా సోమ, మంగళవారాలు రద్దు చేసింది. మరోవైపు అరకు పరిధిలో ఉన్న 180 పర్యాటకశాఖ గదులు ఆక్యుపెన్సీ 40 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక అనంతగిరిలోని పర్యాటక గదుల పరిస్థితి కూడా అదే. పక్షుల కిలకిలరావాలతో అలరించే టైడా జంగిల్బెల్స్ కూడా జనంలేక వెలవెలబోతోంది. విశాఖ మన్యంలో సామాన్య పరిస్థితులు నెలకొనడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా బుధవారం నుంచి పర్యాటక ప్యాకేజీ బస్సులను నడపనున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ ప్రసాదరెడ్డి మంగళవారం రాత్రి సాక్షి’కి చెప్పారు. -
నివురుగప్పిన నిప్పు.. లివిటిపుట్టు
కొద్ది వారాలుగా రెక్కీ.. రెండు మూడు రోజులపాటు మకాం.. గిరిజనుల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహణ.. కాల్పులతో అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ పూర్తి.. ఆపైన తాపీగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిన మావోయిస్టులు.. సంచలనానికి వేదికైన లివిటిపుట్టు ఆదివారంనాటి దారుణ ఘటనకు మౌనసాక్షి. మావోలు బలహీనపడ్డారని, పోలీసులు పైచేయి సాధించారని భావిస్తున్న తరుణంలో ఉరుములేని పిడుగులా సంభవించిన ఈ సంఘటన దేనికి సంకేతం? గిరిజనులను ప్రేరేపించిన.. మావోయిస్టులకు పరోక్షంగా సహాయపడిన అంశాలేమిటి? సర్కారు దోపిడీ విధానంపై మన్య ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహానికీ, అసహనానికీ దీనిని ఓ ఉదాహరణగా భావించవచ్చా? ప్రజల్లోనూ, ప్రభుత్వ పెద్దల్లోనూ ఇప్పుడిదే హాట్ టాపిక్.. సాక్షి, విశాఖపట్నం : ఏదైనా ఆపరేషన్లో పాతిక మందో.. ముప్ఫైమందో మావోయిస్టులు పాల్గొంటారు. తమ ఇన్ఫార్మర్ల ద్వారా పక్కా సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పని ముగించుకుని వెళ్లిపోతుంటారు. అంతేకాని గ్రామాల్లో మాటు వేసిన సందర్భాలు చాలా అరుదు. ఎక్కడైనా మారుమూల అటవీ ప్రాంతంలో ఏ మీటింగ్ పెట్టినా గిరిజనులందరినీ తమ వద్దకు రప్పించుకుంటారే తప్ప మావోలు గ్రామాలకు వెళ్లి ఆశ్రయం పొందడం ఉండదు. కానీ నిన్నటి లివిటిపుట్టు ఘటనలో 60–70 మంది పాల్గొనగా.. చుట్టుపక్కల వివిధ బృందాలుగా ఏర్పడి మరో 70 మందికి పైగా పహారా కాశారని చెబుతున్నారు. ఈ విధంగా సుమారు 150 మంది మావోలు ఈ ఆపరేషన్లో పాల్గొనడం చిన్న విషయం కాదు. పైగా డుంబ్రిగుడ మండలం కోండ్రుం పంచాయతీ సోరాయి గ్రామానికి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వెళ్తున్నారన్న సమాచారం నాలుగైదు రోజుల ముందే ఇన్ఫార్మర్ల ద్వారా తెలియడంతో పక్కా ప్లానింగ్తో ఈ ఆపరేషన్కు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి మావోయిస్టులపై గిరిజనులకు గురి కుదిరిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల, ప్రభుత్వ, దోపిడీ విధానాలతో విసిగి వేసారడం వలనే గిరిజనులు మావోలను మళ్లీ విశ్వసిస్తున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. ఇందుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యోదంతం బలం చేకూరుస్తుంది. మావోయిస్టులు బృందాలుగా ఏర్పడి రెండ్రోజులు ముందుగానే లివిటిపుట్టు పరిసర గ్రామాలకు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఇన్ఫార్మర్లు, మిలిషీయా సభ్యుల ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో సురక్షిత ప్రాంతాల్లో మకాం వేసినట్టు తెలియవచ్చింది. కనీసం ఒకటి రెండ్రోజుల ముందు ఈ ప్రాంతానికి చేరుకున్నారని భావించినా వారికి ఆశ్రయం ఇచ్చే విషయంలో గిరిజనులు ఎంతో కొంత సహకారం అందించి ఉంటారని భావిస్తున్నారు. వీరు ఆశ్రయం ఉన్న గ్రామాలు చాలా వరకు సెల్ నెట్వర్కు పనిచేసే గ్రామాలే. పైగా మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్లు, అరుకులోయకు 17 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. నిజంగా పోలీసులకు సమాచారం చేరవేయాలన్నా.. స్వయంగా చెప్పాలన్నా ఏమంత కష్టమైన పనికాదు. ఏ మార్గంలో వెళ్లినా ఒకటి రెండు గంటల్లోనే సమాచారాన్ని చేరవేయొచ్చు. కానీ ఆశ్రయం ఇచ్చిన గిరిజనులు, మిలిషీయా సభ్యులు ఎక్కడా ఏ రూపంలోనూ ఎవరికి సమాచారం చెప్పలేదు. సమాచారం చేరవేయలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వంపైన, అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధుల పైన నమ్మకం పూర్తిగా సడలడమే అంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల దోపిడీ విధానాల వల్లే గిరిజన యువతకు మళ్లీ మావోలపై గురికుదిరిందన్న వాదన బలంగా విన్పిస్తుంది. గడిచిన నాలుగేళ్లుగా టీడీపీ నేతలు గిరి సంపదను అడ్డగోలుగా దోచుకోవడమే కాకుండా తమను అన్ని విధాలుగా దోపిడికి గురిచేయడం వలనే వారి పట్ల గిరిజనులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఇటీవల బాక్సైట్ తవ్వకాలకు కేంద్రానికి రాష్ట్రం ద్వారా ప్రతిపాదనలు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల గిరిజన ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గిరిజన మనోభావాలకు విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలు జరపనీయమని చెప్పినా గిరిజనుల విశ్వసించడం లేదు. మరోవైపు ఫిరాయించిన పార్టీ నేతలు గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం అడ్డుకట్టవేయలేకపోవడం.. తమకు కేటాయించే కోట్లాది రూపాయల నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టడం.. తమ సమస్యలను పట్టించుకోకపోవడం వంటి విషయాల్లో గిరిజనులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఈ కారణంగానే నిన్నటి ఘటనలో వలనేనన్న భావన బలంగా విన్పిస్తుంది. ఈ కారణంగానే తమ చెంతనే మావోలు ఉన్నçప్పటికీ వారు నోరు మెదపలేదంటున్నారు. మావోలు ఇంత పెద్ద ఎత్తున మోహరించి ఉండడంతో ఆయా గ్రామాల్లోని పోలీస్ ఇన్ఫార్మర్లను నోరుమెదిపే సాహసం చేయలేకపోయారని సమాచారం. -
ఆ క్వారీ వెనుక టీడీపీ పెద్దల హస్తం?
విశాఖ సిటీ: అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు కారణమైన గూడ నల్లరాయి క్వారీ నిర్వహణ వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్వారీ కిడారి సమీప బంధువుకు కేటాయించుకొని తవ్వకాలు జరపడాన్ని కొన్నాళ్లుగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మావోలు పలుమార్లు హెచ్చరించినా.. ఇంతటి వ్యతిరేకతలోనూ కిడారి ఈ క్వారీ నడపడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు ముందు మావోయిస్టులు జరిపిన చర్చల్లో ప్రధానమైన అంశం క్వారీ. గిరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. క్వారీ ఎందుకు కొనసాగిస్తున్నావంటూ మావోలు గద్దించి మరీ కిడారిని నిలదీశారు. పలుమార్లు హెచ్చరించినా.. క్వారీ కొనసాగించడాన్ని జీర్ణించుకోలేకపోయిన మావోలు.. సర్వేశ్వరరావుని ఇదే కారణంతో దారుణంగా హత్య చేశారు. అయితే.. నియోజకవర్గంలో ఇంతగా వ్యతిరేకత వస్తున్నా.. మావోయిస్టుల నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నా.. ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముందని తెలిసినా.. క్వారీని ఆపేందుకు కిడారి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు.? ఎవరి ప్రోద్బలంతో గూడ క్వారీని కొనసాగించి.. ఇప్పుడు విగత జీవులయ్యారు.? ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కిడారి సర్వేశ్వరరావు క్వారీ జోలికి పోలేదు. ప్రజలతో మమేకమవుతూ.. మైనింగ్ జోలికి వెళ్లలేదు. అయితే.. అధికార పార్టీలోకి వెళ్లిన తర్వాత రెండున్నరేళ్ల నుంచి క్వారీ నడపడం ప్రారంభించారు. హుకుంపేట మండలం జోగులపుట్టు, గూడ గ్రామాల సరిహద్దులోని నల్లరాయి (బ్లాక్స్టోన్స్) క్వారీలో మైనింగ్ వ్యవహారాలు జరిపేవారు. దీనిపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అయినా.. కిడారి చలించలేదు. మావోయిస్టులు పలుమార్లు గూడ క్వారీలో తవ్వకాలు నిలిపెయ్యాలనీ, ప్రజా ఉద్యమాలకు విలువ ఇవ్వాలంటూ హెచ్చరించారు. అయినా.. కిడారి వినకపోవడానికి కారణం టీడీపీని తమ సొంతమనుకొనే బెజవాడకు చెందిన కొందరు పార్టీ నేతలే కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఈక్వారీ వల్ల చెడ్డ పేరు వస్తోందని పలుమార్లు వారితో కిడారి చెప్పినా.. సదరు బెజవాడ నేతలు చెవికెక్కించుకోలేదు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన కిడారి.. తప్పనిసరి పరిస్థితిలో గూడ క్వారీని కొనసాగించారు. మావోలు హెచ్చరించినా.. టీడీపీ పెద్దల మాట కాదనలేక యథేచ్ఛగా క్వారీ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. దీంతో.. తాము చెప్పినా వినిపించుకోలేదనీ, ప్రజలు ప్రత్యక్ష ఉద్యమాలు చేపడుతున్నా.. చెవికెక్కించుకోలేదనే కారణాలు... ఇవన్నీ కలిసి.. కిడారిని మావోల తూటాలకు బలిచేశాయి. తెరవెనుక ఉండి టీడీపీ నాయకులు గూడ క్వారీ నుంచి లబ్ధి పొందితే.. శిక్ష మాత్రం కిడారి సర్వేశ్వరరావే పొందాల్సిన పరిస్థితి ఎదురైంది. నాన్న.. క్వారీని ఆపేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ.. విజయవాడకు చెందిన టీడీపీ నేతలు కొందరు కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అందువల్లనే క్వారీ నడిపించారు. దానివల్లే.. ఇవాళ నాన్న మా మధ్య లేకుండా పోయారంటూ సన్నిహితుల వద్ద కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కన్నీటిపర్యంతమయ్యారని తెలుస్తోంది. -
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి భద్రత పెంపు
మన్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివారి సోమను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో మన్యంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీసు బలగాలు మన్యంలో అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల సమాచారం రాబట్టే పనిలో నిమగ్నమవడంతో గిరిజనులు వణికి పోతున్నారు. లివిటిపుట్టు గ్రామం భయం గుప్పెట్లో ఉంది. గిరిజనులు ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం, డుంబ్రిగుడ (అరకు): డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ లివిటిపుట్టు సమీపంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యంలో నెలకొన్న ఉద్రిక్తత కొనసాగుతోంది. సంఘటన జరిగిన ఆదివారం నుంచి లివిటిపుట్టుతోపాటు పరిసర గ్రామాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రశ్నిస్తే.. ఏం చెప్పాలి..? సుమారు 300 జనాభా గల ఈ గ్రామంలో 30 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కరవ మంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వీరి పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఎవరొచ్చి ప్రశ్నిస్తే.. ఏమి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో వీరున్నారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇంటికి వెళ్లిపోయినట్టు సమాచారం. సాయంత్రం ఆరు గంటలు దాటితో ఇళ్లల్లోంచి బయటకు రావడం లేదు. మండల కేంద్రం డుంబ్రిగుడలో.. మండల కేంద్రం డుంబ్రిగుడలో కూడా ఇదే పరిస్థితి. రాత్రి ఏడు గంటలకే దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో సెంటర్తోపాటు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పగటి వేళల్లో కూడా బితుకుబితుకు మంటూ కాలం గడుపుతున్నారు. బూట్ల చప్పుడుతో గజగజ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత మార్చిన ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక్ష సాక్షుల ద్వారా ముగ్గురు మావోయిస్టుల వివరాలను సేకరించిన పోలీసులు మీడియాకు విడుదల చేయడంతో గిరిజనులు మరింత భయంతో వణికిపోతున్నారు. ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. లివిటిపుట్టుతో పాటు మారుమూల ప్రాంతాలను గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్పీఎప్ బలగాలు జల్లెడపడుతున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. ఒక పక్క మావోయిస్టులు, మరోపక్క పోలీసుల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారు. మండల కేంద్రంలో పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. మూడు రోజుల నుంచి గిరిజన ప్రాంత గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన గ్రామాల్లో కనిపిస్తోంది. భయం గుపెట్లో నాయకులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో మన్యంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు భయంతో వణికిపోతున్నారు. మైదాన ప్రాంతానికి తరలిపోవాలని పోలీసులు హెచ్చరించడంతో వారిలో మరింత ఆందోళన నెలకొంది. ఆర్కే, చలపతి మళ్లీ తెరపైకిగాలింపు ముమ్మరం చేసిన పోలీసు బలగాలు సీలేరు (పాడేరు): ఆంధ్రా, ఒడిశా, తూర్పుగోదావరి, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్న అగ్రనేతలు ఆర్కే, చలపతి రెండేళ్ల తర్వాత మళ్లీ ఉద్యమాన్ని బలోపేతం చేశారనడానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యే ఉదాహరణ. గతం వరకు వారిద్దరిని మట్టుబెడితే సరిపోతుందని బలగాలు వారికోసం వెంటాడాయి. అయితే రెండేళ్లుగా ప్రశాంతంగా ఉండి పోలీసుల నుంచి వచ్చిన ఘటనలను ఎదుర్కొంటున్న అగ్రనేతలంతా వ్యూహా రచనతో పెద్ద సంచలనాన్ని సృష్టించడంతో పోలీసుశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అరకు సంఘటనకు పదిరోజుల ముందే ఆర్కే, చలపతి విశాఖ ఏజెన్సీలోకి వచ్చారని ఇంటలిజెన్స్ సమాచారం ఉంది. ఈ సంఘటన అనంతరం వారిద్దరిని పట్టుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. అడవుల్లో అణువణువు గాలింపులు చేపడుతున్నారు. తూర్పుగోదావరి, ఒడిశా పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఏ క్షణంలోనైనా మావో యిస్టులు, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయాం పాడేరు: నాన్న దూరమవడంతో పెద్దదిక్కును కోల్పోయాం. మా కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వమే మాకు దారి చూపాలని కిడారి సర్వేశ్వరరావు కుమారులు శ్రావణ్ కుమార్, సందీప్ కుమార్ కోరారు. మంగళవారం ఇక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి హత్యోదంతంపై కన్నీరు పెడుతూ తమకు ఎంతో అన్యాయం జరిగిందని, మా జీవనం అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. మావోయిస్టులు మా తండ్రిని దారుణంగా చంపారని, తప్పు చేసి ఉంటే ఒక్కసారైనా హెచ్చరించి ఉంటే బాగుండునని, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా చంపడం అన్యాయమని అన్నారు. తనకు మావోయిస్టుల వల్ల ఇలాంటి ముప్పు ఉంటుందని ఏనాడూ మా నాన్న తమకు చెప్పలేదని అన్నారు. గతంలో ఎన్నడూ మా నాన్నను హెచ్చరికలు చేసిన సందర్భాలు కూడా లేవని, ఆకస్మికంగా హత్య చేయడం నమ్మలేకపోతున్నామని అన్నారు. ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నామని, చాలా అభివృద్ధి చేయగలిగానని నాన్న సర్వేశ్వరరావు చెప్పేవారని, తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అంటుండేవారని వారు వెల్లడించారు. నాన్న రాజకీయ వ్యవహారాల్లో తామెప్పుడు జోక్యం చేసుకోలేదని, నాన్న అప్పుడుప్పుడు మంచి కార్యక్రమాలు చేసినపుడు మాకు చెప్పేవారని, మమ్మల్ని మాత్రం ఎప్పుడు బాగా చదువుకోవాలని చెబుతుండేవారన్నారు. మా ఇద్దరితో పాటు చెల్లెలు తనిష్క కూడా చదువుకుంటోందన్నారు. తండ్రి మృతితో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వమే తమను అన్నివిధాలా ఆదుకోవాలని వారు కోరా>రు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికిభద్రత పెంపు పాడేరు: పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పోలీసులు భద్రత పెంచారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో పాడేరులోని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇంటివద్ద అదనంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటనలకు వెళ్లినపుడు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసుశాఖ ఆంక్షలు విధించింది. ఎమ్మెల్యేకు ఇప్పుడున్న గన్మెన్లతో పాటు అదనంగా గన్మెన్ ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ ఏర్పాటు చేసింది. మా కుటుంబాన్ని ఆదుకోవాలి :సివేరితనయుడు అబ్రహం డుంబ్రిగుడ (అరకు): ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మా వోయిస్టులు కాల్చి చం పేశారు. దీంతో మాకు పెద్ద దిక్కుగా ఉన్న మా తండ్రి మృతి చెందడంతో వీధిన పడ్డామని, తమ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఆదుకుని న్యాయం చేయాలని సివేరి సోమ కుమారుడు అబ్రహం కోరారు. లివిటిపుట్టు గ్రామ సమీపంలో తండ్రి సోమ మృతి చెందిన సంఘటన స్థలాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన కన్నీరు మున్నీరుగా విలపించారు. మావోయిస్టులు దారుణంగా మా తండ్రిని చంపడం ఎంతో బాధాకరమన్నారు. దీని వెనుక మావోయిస్టులతో పాటు రాజకీయ కుట్ర కూడా ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులను శిక్షించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. -
లివిటిపుట్టుకు భారీగా వచ్చిన మావోయిస్టు దళాలు
అరకులోయ: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును టార్గెట్గా చేసుకున్న మావోయిస్టులు మూడు రోజులుగా కండ్రూం పంచాయతీ సమీపంలోని అడవుల్లో మాటు వేసినట్టు తెలిసింది. కొందరు సాధారణ దుస్తులు ధరించి ఎలాంటి ఆయుధాలు లేకుండా ఈ ప్రాంతంలో సంచరించారని సమాచారం. కాలినడకన మూడు చోట్ల నుంచి.. ఆపరేషన్ లివిటిపుట్టులో పాల్గొనేందుకు ఏవోబీలోని మూడు ప్రాంతాల నుంచి మావోయిస్టులు భారీగా చేరుకున్నారు. ఏజెన్సీలో కీలకమైన పెదబయలు దళంతోపాటు ఒడిశా కటాఫ్ ఏరియాలోని ఏరియా కమిటీ, కొరాపుట్ జిల్లా నందపూర్ దళానికి చెందిన మావోయిస్టులంతా కాలినడకనే లివిటిపుట్టుకి ముందుగానే చేరుకున్నట్టు తెలిసింది. సాధారణంగా ప్రతి దళంలోనూ 20 మందికి మించి మావోయిస్టులు ఉండరు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల వాహనాలను చుట్టుముట్టినపప్పుడు మావోయిస్టులు భారీగా ఉన్నారు. కొందరు ఘటనా స్థలంలో ఉండగా మరికొందరు సమీపంలోని అటవీ ప్రాంతంలో మాటు వేసినట్టు చెబుతున్నారు. వీరిని హతమార్చిన తర్వాత మళ్లీ అడవి మార్గంలోనే ఒడిశా ప్రాంతానికి తరలి వెళ్లినట్టు గిరిజనులు పేర్కొంటున్నారు. వెంటనే స్పందించని యంత్రాంగం డుంబ్రిగుడ మండలంలోని మారుమూల ప్రాంతం గుంటసీమ తరువాత ఒడిశా గ్రామాలే అధికంగా ఉన్నాయి. ఒడిశా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం కావడంతో సులభంగా తప్పించుకునే అవకాశం కలిగింది. ఘటన తరువాత ఒడిశాలోని కోరాపుట్, విశాఖ జిల్లాల్లోని పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించలేదు. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో హత్యలు జరిగిన తరువాత మావోయిస్టులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు కొంత సమయం పట్టింది. అయితే పోలీసు యంత్రాంగం నుంచి ప్రతిస్పందన లేకపోవడం మావోయిస్టులకు కలిసొచ్చింది. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రాహుల్దేవ్శర్మ ప్రకటించినప్పటికీ డుంబ్రిగుడ, ఒడిశా సరిహద్దులో పోలీసుల సంచారం కనిపించడం లేదు. ఎమ్మెల్యే కదలికలపై వివరాల సేకరణ... లివిటిపుట్టు ప్రాంతంలో కొన్నిచోట్ల సెల్ఫోన్ సంకేతాలు అందుబాటులో ఉన్నాయి. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కూండ్రం పంచాయతీ సర్రాయి గ్రామానికి వస్తున్న సమాచారాన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా తెలుసున్నారు. జవాన్ పోస్టుల రాత పరీక్షలో పోలీసులు బిజీ జవాన్ పోస్టుల భర్తీకి సంబంధించి గిరిజన అభ్యర్ధుల కోసం పోలీసుశాఖ ఆదివారం అరకులోయలో మెరిట్ టెస్ట్ ఏర్పాటు చేసింది. పోలీసులు ఈ పనుల్లో నిమగ్నమవుతారని, డుంబ్రిగుడ వైపు రాలేరని మావోలు లివిటి అపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. కాగా, మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ మాటు వేశారనే సమాచారం బయటకు పొక్కకపోవడం గమనార్హం. -
ఉప్పందించింది గంజాయి వ్యాపారులే?
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యోదంతం వెనుక గంజాయి వ్యాపారుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిచ్చిన సమాచారంతోనే మావోయిస్టులు పక్కా వ్యూహంతో దాడికి దిగి హతమార్చినట్లు భావిస్తున్నారు. గంజాయి వ్యాపారులు, ఎమ్మెల్యే కిడారి మధ్య ఇటీవల విబేధాలు తలెత్తినట్లు చెబుతున్నారు. అందువల్లే ఎమ్మెల్యే కదలికలను వారు ఎప్పటికప్పుడు మావోయిస్టు ఇన్ఫార్మర్లకు చేరవేసినట్లు తెలిసింది. ఈ సమాచారంతోనే మావోయిస్టులు దాడి జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. చర్చికి వెళ్లాలని బయల్దేరి... అరకులో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ శనివారం రాత్రి విజయవాడ నుంచి అరకు చేరుకున్నారు. ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ నెల 23వతేదీన కుటుంబంతో కలసి స్వగ్రామం బత్తివలసలోని చర్చికు వెళ్లేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అదే సమయంలో తనతోపాటు రావాలని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కోరడంతో కాదనలేక ఆయన వెంట వాహనంలో బయల్దేరారు. ఎమ్మెల్యేతోపాటు వెళ్తున్నట్లు డుంబ్రిగుడ ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో.. ‘మీరు వెళ్లండి ఏం పర్వాలేదు.. నేను మీ వెనక తర్వాత వస్తా..’ అని చెప్పారని సోమ అనుచరులు పేర్కొంటున్నారు. సోమ అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న గంజాయి వ్యాపారులు మావోయిస్టు ఇన్ఫార్మర్లకు ఉప్పందించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ బందోబస్తు లేకుండా కిడారి, సోమ ఒంటరిగా వçస్తున్నట్లు నిర్ధారించుకున్న అనంతరం మావోయిస్టులు కార్యాచరణకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన రోజు ప్రజా ప్రతినిధుల అనుచరులు ఫోన్లలో ఎవరెవరితో మాట్లాడారు..? ఏం మాట్లాడారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ ఫోన్లు పనిచేయలేదా? ఘటన అనంతరం ఎస్పీ రాహుల్దేవ్శర్మ మీడియాతో మాట్లాడుతూ లివిటిపుట్టులో సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల పూర్తి సమాచారం రాలేదని చెప్పగా.. హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు ఫోన్లో తెలియజేశామని కిడారి, సోమ అనుచరులు పేర్కొనడం గమనార్హం. మన్యంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు.. విశాఖ మన్యంలో సుమారు పాతిక వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానిక గిరిజనులను అడ్డం పెట్టుకుని పెద్దఎత్తున గంజాయి సాగు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. గంజాయి సాగు నిల్వ, రవాణా విషయంలో అడ్డంకులు సృష్టించకుండా ఉండేందుకు పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది, అధికార పార్టీ నేతలకు వ్యాపారులు నెలవారీ మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. సిట్ దర్యాప్తు ప్రారంభం కిడారి, సోమ డ్రైవర్లను విచారించిన అధికారులు పాడేరు: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనపై సిట్ అధికారులు అరకులో దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరి వాహనాల డ్రైవర్లు రవి, చిట్టిబాబులను విచారించిన సిట్ అధికారులు సంఘటన జరిగిన తీరుపై పలు విషయాలను సేకరించారు. అనంతరం లివిటిపుట్టు వద్ద సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మరోవైపు యూనిఫైడ్, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలను మన్యానికి తరలించారు. మంగళవారం ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకున్న పోలీసు బలగాలు అరకు, డుంబ్రిగుడ మండలాల పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గన్ను పట్టిన మహిళా దండు సాక్షి, విశాఖపట్నం/అరకులోయ: ఏవోబీ మావోయిస్టు పార్టీ ఉద్యమంలో మహిళలు కీలకంగా మారారు. మావోయిస్టు పార్టీలో గతంలో మహిళల సంఖ్య తక్కువగా ఉండేది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో 32 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మహిళలు కూడా అధికంగానే ఉన్నారు. ఎన్కౌంటర్లో కీలక నేతలతో పాటు, తన కుమారుడు మున్నాను కూడా పొగొట్టుకున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే.. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న తర్వాత మళ్లీ ఏవోబీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేశారనే విషయం ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలతో తెలుస్తోంది. దీనికి మహిళా మావోలను ఆయన సన్నద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాలతో పాటు, సరిహద్దులోని ఒడిశా పల్లెల్లో మావోయిస్టు ఉద్యమంపై అగ్రనేతలు ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి అనేక గ్రామాల గిరిజన యువత ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. వీరిలో 17 ఏళ్లు దాటిన గిరిజన యువతులే అధికంగా ఉన్నట్టు సమాచారం. విశాఖ ఏజెన్సీ, ఒడిశా గ్రామాలకు చెందిన గిరిజన యువతులు వందల సంఖ్యలో మావోయిస్టు పార్టీలో చేరినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు క్యాడర్లో మహిళలు కీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏవోబీలో యువతకు పెద్దఎత్తున శిక్షణ ఇచ్చారని, ఈ శిక్షణలో గిరిజన యువతులు కూడా ఎక్కువగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత నెలలో ఏవోబీలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరిగాయి. ఒడిశాతో పాటు, విశాఖ ఏజెన్సీ మారుమూల గ్రామాలలోను గిరిజనులతో సమావేశాలు నిర్వహించిన సమయంలో మహిళా మావోయిస్టులే కీలకపాత్ర వహించారు. ఆయుధాలు చేతబూనిన మహిళా దండును చూసినట్లు గిరిజనులు చెబుతున్నారు. విశాఖ ఏజెన్సీ కోరుకొండ, పెదబయలు దళాలతో పాటు, ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల్లో పలు దళాలలో మహిళలు అధికంగా ఉన్నట్లు సమాచారం. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామంలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల వాహనాలను ముట్టడించిన వారిలో మహిళా మావోయిస్టులే అధికంగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మహిళా మావోయిస్టులే వారిని తుపాకులతో కాల్చి చంపారు.ఇది మహిళా మావోయిస్టులతో చేపట్టిన తొలి ఆపరేషన్గా ఏజెన్సీలో ప్రచారం జరుగుతుంది. రెండేళ్లుగా భారీగా రిక్రూట్మెంట్ ఏవోబీలో మావోలు బలపడుతున్నారని లివిటిపుట్టు ఘటనతో తేటతెల్ల మవుతోంది. గత రెండేళ్లలో భారీగా రిక్రూట్మెంట్ జరిగిందన్నది నిన్నటి ఘటనలో పాల్గొన్న మావోల వయసును బట్టి స్పష్టమవుతోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం లివిటిపుట్టు ఆపరేషన్లో పాల్గొన్న వారిలో అత్యధికులు 18–20 ఏళ్ల లోపు వారే ఎక్కువ. దీంతో రిక్రూట్మెంట్ జరగడం లేదన్న పోలీసుల వాదన తప్పని రుజువైంది. సాక్షుల చెప్పిన సమాచారాన్ని బట్టి కాల్పుల్లో పాల్గొన్న వారు గుత్తుకోయల, కొందూస్ తెగకు చెందిన వారిగా భావిస్తున్నారు. గుత్తుకోయల తెగకు చెందిన వారు తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటారు. ఇక కొందూస్ తెగకు చెందిన వారు ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉంటారు. కిడారి ఆపరేషన్లో పాల్గొన్న వారు తెలుగు మాట్లాడుతుండటంతో వీరంతా తెలంగాణ, ఏపీకి చెందిన వారేనని భావిస్తున్నారు. ఎక్కువ మంది తెలంగాణ యాసలో మాట్లాడారని సాక్షులు చెబుతున్నారు. -
‘అప్పుడు దండగన్నాడు.. ఇప్పుడేమంటాడో’
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. క్యాబినెట్ హోదా కలిగిన ఎమ్మెల్యేకే రక్షణ లేనిచోట ఇక ప్రజలకు రక్షణ ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికి రక్షణ లేదనీ, మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కాగా, అరుకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు ఆదివారం ఉదయం కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇక వ్యవసాయం దండగన్న చంద్రబాబు ఇప్పుడు అమెరికాలో వ్యవసాయంపై మాట్లాడతాననడం విడ్డూరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. ప్రజాభిమానం జగన్కు జై అంటోంది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోందని ఎమ్మెల్యే రోజా ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అడుగులో అడుగేసి లక్షలాది జనం కదం తొక్కడంతో కృష్ణా బ్యారేజీ గడగడలాడిందనీ, గోదారి తీరం ఉప్పొంగిందనీ, విశాఖ తీరం పోటెత్తిందని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల ప్రజలు వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతుగా విజయపురం మండలంలో మంగళవారం రోజా పాదయాత్ర చేశారు. కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర సోమవారం విజయనగరం జిల్లాలోని కొత్త వలసలో 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. -
మావో హత్యాకాండలో భీమవరం మహిళ!
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: విశాఖజిల్లా దుంబ్రిగూడ మండలం లిపిట్టిపుట్ట వద్ద మావోయిస్టు హత్యాకాండలో పాల్గొన్న మావోయిస్టులలో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, అలియాస్ సింద్రి, అలియాస్ చంద్రి, అలియాస్ రింకీ ఉ న్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈమె భీమవరంలో కేవలం కొంతకాలం మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారిలో ముగ్గురిని గుర్తించినట్లు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ప్రకటించారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా దుబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, అలియాస్ రైనో, విశాఖ జిల్లా కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియాస్ అరుణలతో పాటు జిల్లాలోని భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, అలియాస్ సింద్రి, అలియాస్ చంద్రి, అలియాస్ రింకీ ఉన్నట్లు ఎస్పీ ప్రకటించారు. మావోయిస్టు హత్యాకాండలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు గుర్తుపట్టిన వారిలో వీరు ఉన్నట్లు ప్రకటించారు. కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినట్లు తెలిసింది. ఈమె తల్లితండ్రులు శ్రీకాకుళంలో ఉండగా, కామేశ్వరిని భీమవరంలో ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేసినట్లు తె లుస్తోంది. అయితే కొంతకాలం కామేశ్వరి భర్తతో ఉండగా, వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం డిపోలో కామేశ్వరి కండక్టర్గా పనిచేసినట్లు సమాచారం. ఆ సమయంలోనే తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతానికి విధులు నిమిత్తం వెళ్లడం, అక్కడ మావోయిస్టులు తారసపడటం తదితర ఘటనల నేపథ్యంలో ఈమె మావోయిస్టుల వైపు ఆకర్షితులైనట్లు తెలిసింది. దీంతో 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. మావోయిస్టుల్లో ప్రస్తుతం ఈమె యాక్షన్ టీమ్ సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం. అయితే కామేశ్వరిది భీమవరం అని ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. ఎవరీ కామేశ్వరి అంటూ అటు పోలీసు వర్గాలు, ప్రజలు చర్చించుకున్నారు. గతంలోనూ జిల్లా నుంచి మావోయిస్టులు ఆంధ్రా ఒడిసా సరిహద్దులో 2016 అక్టోబర్లో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం ఏఓబీలో వరుస ఎన్కౌంటర్లతో 30 మంది మావోయిస్టులు మృ తిచెందగా, ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ మృతి చె దారు. మృతిచెందిన మావోయిస్టులో ఇద్దరు జిలê్లవాసులు ఉన్నారు. దేవరపల్లి మండలం పల్లంట్లకు చెందిన దాసు, తాళ్లపూడికి చెందిన దాసు బా వమరిది అయిన కిరణ్ మృతి చెందారు. దీంతో అప్పట్లో జిల్లా పోలీసు యంత్రాంగం ఆశ్చర్యానికి గురైంది. జిల్లాలోని సహజంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి మావోయిస్టుల వైపు గిరిజన యువత ఆకర్షితులవుతుంటారు. అయితే మైదాన ప్రాంతం నుంచి ఆకర్షితులై, ఈ రాష్ట్రంలో కాకుండా ఏఓబీ లో మాయిస్టులలో జిల్లావాసులు ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. తాజాగా భీమవరంలో కొంత కాలం ఉన్న కామేశ్వరి మావోయిస్టుల్లో కీలక పాత్ర పోషించడంతో, అసలు జిల్లా నుంచి మావోయిస్టుల్లో చేరిన వారు ఎంతమంది ఉంటా రనేది పోలీసు యంత్రాంగం అంచనా వేస్తోంది. -
ఉనికి కోసమే దుశ్చర్య
విశాఖపట్నం, పాడేరు: మావోయిస్టుల చేతిలో హతమైన ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ కుటుంబాల్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. పాడేరులో కిడారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుల్ని మావోయిస్టులు చంపడం విచారకరమన్నారు. తమ ఉనికిని చాటుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సంఘటనతో ప్రజల్లో అశాంతిని తొలగించి, శాంతి భద్రతలకు చర్యలు తీసుకున్నామన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సంఘటనలో పోలీసుల వైఫల్యాలను, లోపాల్ని గుర్తించేందుకు విచారణ చేపడతామన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుల్ని కోల్పోవడం పార్టీకి, ప్రజలకు నష్టమన్నారు. ఈ లోటు తీర్చలేదని అన్నారు. పార్టీ పరంగా ఆయా కుటుంబాలను ఆదుకోడానికి సీఎంతో చర్చిస్తామన్నారు. మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గిరిజన సంక్షేమమే తమ సిద్ధాంతమని చెప్పుకునే మావోయిస్టులు వారి కోసం పనిచేస్తున్న నాయకుల్ని హతమార్చడం ఏమి సిద్ధాంతమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యవాదులంతా దీనిని ఖండించాలన్నారు. వీరి అంత్యక్రియలు జరిగిన చోట స్థూపాల్ని నిర్మించి, స్మృతి వనాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కిడారి,సీవేరి సోమల కుటుంబాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి ఆహర్నిశలు పాటుపడుతున్న కిడారిని మావోయిస్టులు హతమార్చడం బాధకరమని అన్నారు. ఎక్సైజ్శాఖ మంత్రి ఎస్.జవహర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం పనిచేస్తున్న నాయకుల్ని చంపడం దారుణమన్నారు. తప్పు చేస్తే ప్రజలే తీర్పు ఇస్తారని, దీనిపై పౌరహక్కుల సంఘాలు కూడా స్పందించాలని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు కిడారి పార్థ్దివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. స్వచ్ఛంద బంద్ పాడేరు: కిడారి మృతికి సంతాపంగా పాడేరుతోపాటు మన్యంలోని అన్ని ప్రాంతాల వర్తకులు తమ దుకాణాలు, షాపులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. సాయంత్రం అంత్యక్రియలు జరిగే వరకు పాడేరులో బంద్ వాతావరణం ఏర్పడింది. పట్టణ ప్రజలంతా కిడారి పార్థ్దివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ప్రముఖుల నివాళి.. మావోయిస్టు కాల్పుల్లో మృతి చెందిన తమ అభిమాన నేత కిడారి సర్వేశ్వరరావు పార్థ్దివ దేహాన్ని సోమవారం పాడేరులో పలువురు ప్రముఖులు, ప్రజలు సందర్శించి నివాళి అర్పించారు. అరకులో శవ పరీక్షలు ముగిసిన అనంతరం కిడారి భౌతికకాయాన్ని పాడేరులోని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలించారు. కడసారి చూపు కోసం మన్యం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, బంధువులు, అధికారులు, ఉద్యోగ వర్గాలు, రాజకీయ పార్టీల నేతలు తరలి వచ్చారు. నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు మంత్రుల పరామర్శ.. కిడారి భార్య పరమేశ్వరి, పిల్లలు నాని, సందీప్, తనిష్క, కుటుంబ సభ్యుల్ని రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, జవహర్, నక్కా ఆనందబాబు పరామర్శించి ఓదార్చారు. మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, మణికుమారి, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, అనకాపల్లి ఎంపీ ఎం.శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ పీజీవీఆర్ నాయుడు, ఎమ్మెల్సీలు మాధవ్, గుమ్మడి సంధ్యరాణి, పప్పల చలపతిరావు, గాదె శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్బాబు, అనిత, గిడ్డి ఈశ్వరి, బండారు సత్యనారాయణ, పీలా గోవింద సత్యనారాయణ, వాసుపల్లి గణేష్కుమార్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్, జాయింట్ కలెక్టర్ సృజన, జీసీసీ ఎండీ బాబురావు నాయుడు, ఐటీడీఏ పీవో డి.కె. బాలాజీ, అడిషనల్ డిజిలు హరిష్రావు గుప్తా, వెంకటేశ్వర్లు, డిఐజి శ్రీకాంత్, శ్రీకాకుళం ఎస్పీ త్రివిక్రమ్ వర్మ, పాడేరు, నర్సీపట్నం ఏఎస్పీలు అమిత్బర్దర్, ఆరిఫ్ హఫీజ్లు కిడారి పార్థ్దివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం, వైఎస్ఆర్పార్టీ, బీజేపీల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, అధిక సంఖ్యలో హజరయ్యారు. సివేరి సోమకు కన్నీటి వీడ్కోలు అరకులోయ: అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల మృతదేహాలకు స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో సోమవారం ఉదయాన్నే పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమ మృతదేహాన్ని అరకులోయ పట్టణంలోని క్యాంపు కార్యాలయానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, అధికారులు మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భౌతికకాయాన్ని వీధుల్లో ఊరేగించి ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. బొర్రా గుహలు మూత అనంతగిరి(అరకులోయ): ప్రముఖ పర్యాటక కేందం బొర్రాగుహలు సోమవారం మూతపడ్డాయి. అనంతగిరి, కాశీపట్నం, డముకు, ములియగుడ ప్రాంతాలల్లో స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లోని వారంతా అభిమాన నాయకుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెద్దఎత్తున అరకులోయ, పాడేరు తరలి వెళ్లారు. -
మహిళా మావోయిస్టు నాయకత్వంలో తొలి ఆపరేషన్!
సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పూర్తిగా ఓ మహిళ నాయకత్వంలో ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గతంలో ఎక్కడ ఏ ఆపరేషన్ నిర్వహించాలన్నా కేంద్ర కమిటీ లేదా జోనల్, ఏరియా కమిటీ బాధ్యుల నాయకత్వంలోనే జరిగేవి. అందులో పాల్గొనే మావోయిస్టుల్లో కూడా ఎక్కువమంది పురుషులే ఉండేవారు. మహిళా మావోయిస్టులు ఉన్నా నేరుగా వారే ఆపరేషన్లో పాల్గొన్న ఘటనలు లేవనే చెప్పాలి. మావోయిస్టు ఆపరేషన్లో 150 మంది! తాజా ఘటనలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది మహిళా మావోయిస్టులేనని ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. ఘటనలో 60 నుంచి 70 మంది పాల్గొన్నట్టు చెబుతున్నప్పటికీ ఈ ఆపరేషన్లో సుమారు 150 మందికి ఉన్నట్టు సమాచారం. వీరంతా గ్రూపులుగా విడిపోయి కదలికలను పసిగట్టేందుకు వేర్వేరు ప్రాంతాల్లో మోహరించినట్టు సమాచారం. ఆజాద్ సోదరి అరుణ నేతృత్వం 2015లో కొయ్యూరు ఎన్కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్ సోదరి అరుణ అలియాస్ వెంకట రవి చైతన్య ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావిస్తున్నారు. అరుణ ఈ ఘటనలో క్రియాశీలకంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్లో పాల్గొన్నప్పటికీ నేరుగా ఆపరేషన్కు నాయకత్వం వహించింది మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు. -
సీఎం సారూ.. నాకు మావోలతో ముప్పుంది
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సార్.. ! నాకు మావోయిస్టులతో థ్రెట్ (ముప్పు) ఉంది. ఏవోబీలో వారి ప్రభావం ఎక్కువగా ఉంది. నా నియోజకవర్గంలోని గ్రామాలన్నీ మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ‘గ్రామదర్శిని’కి వెళ్లలేను సారూ... ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాలకు వెళ్లడం ఇబ్బందికరమే. మమ్మల్ని మినహాయించండి సార్....!’ సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల చేతిలో బలైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వేడుకోలు ఇదీ. మినహాయించాలంటూ అభ్యర్థన... గ్రామదర్శిని కార్యక్రమం నుంచి తన నియోజకవర్గాన్ని మినహాయించాలంటూ గత నెలలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వేడుకున్నారు. అయితే ‘అలాంటిదేమీ కుదరదు.. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు ప్రతి గ్రామానికీ వెళ్లాల్సిందే. గ్రామ కార్యదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందేనని సీఎం చెప్పటంతో కిడారి చేసేదేమీ లేక భయంభయంగానే మారుమూల ప్రాంతానికి వెళ్లి మావోయిస్టుల చేతిలో మృత్యువాత పడ్డారు. ఎంత మొత్తుకున్నా వినలేదు... కిడారి అభ్యర్థనను ముఖ్యమంత్రి మన్నించి ఉంటే ఇప్పుడిలా మావోయిస్టుల తూటాలకు బలయ్యే పరిస్థితి వచ్చేది కాదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతి గ్రామానికీ వెళ్లాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. కిడారి ఎంత మొత్తుకున్నా వినలేదని విశాఖ జిల్లాకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేత పేర్కొన్నారు. ఆ లేఖ నిజమేనా...? ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గ్రామదర్శినికి కార్యక్రమానికి వెళ్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లొద్దంటూ ఈనెల 21న ఎమ్మెల్యేకు అరకు పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ఐ) లిఖిత పూర్వకంగా నోటీసు జారీ చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే కిడారి పీఏ అప్పారావు ఆదివారం ఘటనా స్థలం వద్ద ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో అరకు సీఐ వెంకునాయుడు మాట్లాడుతూ నోటీసు ఇచ్చిందీ లేనిదీ తనకు తెలియదని చెప్పారు. కానీ ఎమ్మెల్యే తమ మాటను పట్టించుకోకుండా, తమకు చెప్పకుండా వెళ్లారని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యే చెప్పకపోయినా ప్రాణహాని ఉన్నందున ఆయన కదలికలపై నిఘా ఉంచాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
అరకు ఘటనతో అప్రమత్తం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఉద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు, వారి కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై మళ్లీ నిఘా ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ ఉద్యమాలకు ఒకప్పుడు గుండెకాయలాంటి ఉత్తర తెలంగాణలో పూర్వవైభవం కోసం మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే కమిటీల పునర్వ్యవస్థీకరణ, కొత్త కమిటీలకు శ్రీకారం చుట్టిందని ఇంటెలిజెన్స్ తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖపట్నం జిల్లా దుంబ్రిగూడ మండలం పోతంగి గ్రామ పంచాయతీ లివిటిపుట్టులో ఆదివారం మధ్యా హ్నం మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేసింది. పాత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు బాస్ మహేందర్రెడ్డి కూడా ఈ జిల్లాల పోలీసు అధికారులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది. కొత్తగా కమిటీలు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీలను పునరుద్ధరించిన సంగతిని కూడా ఇంటెలిజెన్స్ సంబంధిత అధికారులకు సూచించింది. పూర్వ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లాలను కలుపుకొని ఈ కమిటీలు వేసినట్లు పోలీసువర్గాలు నిర్ధారించాయి. పెద్దపల్లి–కరీంనగర్–భూపాలపల్లి జయశంకర్–వరంగల్ జిల్లాలు కలిపి ఓ డివిజన్ కమిటీ కాగా, ఆ కమిటీకి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ కింద ఏటూరునాగారం–మహదేవ్పూర్ ఏరియా కమిటీ, ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీలు వేయగా, ఆ కమిటీలు సుధాకర్, కూసం మంగు అలియాస్ లచ్చన్నలు ఏరియా కమిటీ కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల– కొమురంభీం (ఎం.కె.బి.) డివిజనల్ కమిటీకి ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్కు నాయకత్వం అప్పగించారు. ఇంద్రవల్లి ఏరియా కమిటీ, మంగి ఏరియా కమిటీ, చెన్నూర్–సిర్పూర్ ఏరియా కమిటీలు ఏర్పాటైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం– తూర్పుగోదావరి డివిజనల్ కమిటీ కొత్తగా ఏర్పడగా, ఈ కమిటీకి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ కింద చర్ల–శబరి ఏరియా కమిటీ, లోకే సారమ్మ అలియాస్ సుజాత నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, కుంజా లక్ష్మణ్ అలియాస్ లచ్చన్న నేతృత్వంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే చర్ల–శబరి ఏరియా కమిటీ కింద మడకం కోసీ అలియాస్ రజిత నేతృత్వంలో చర్ల లోకల్ ఆర్గనైజింగ్ స్క్వాడ్, ఉబ్బ మోహన్ అలియాస్ సునిల్ నేతృత్వంలో శబరి లోకల్ ఆర్గనైజిగ్ స్క్వాడ్లు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలం గాణలోనూ దాడుల కోసం మావోయిస్టులు అదను కోసం చూసే అవకాశం లేకపోలేదని, గతంలో హిట్లిస్టులో ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. గతంలో హెచ్చరికలు ఉన్న ప్రజాప్రతినిధులు ఒంటరిగా తిరగొద్దని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని, గతంలో టార్గెట్లుగా ప్రకటించిన వారిని అప్రమత్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో జల్లెడ సాక్షి, కొత్తగూడెం: ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమను మావోయిస్టులు కాల్చి చంపడంతో సరిహద్దుల్లో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దండకారణ్యాన్ని అణువణువూ జల్లెడ పట్టేందుకు హైదరాబాద్ నుంచి భారీగా అదనపు బలగాలను దించారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో నుంచి ఈ బలగాలు దండకారణ్యంలోకి చేరుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం, పినపాక, ములుగు, మంథని భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన రాజకీయ నాయకులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మావోయిస్టులు పలువురు నేతలపై రెక్కీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం మంథని ఎమ్మెల్యే పుట్టా మధుకు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరకు దాడి! ఆంధ్రా ఒడిశా సరిహద్దు రాష్ట్ర కమిటీ నేతృత్వంలో అరకు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న, రాష్ట్ర మిలటరీ కార్యదర్శి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, బెల్లి నారాయణస్వామి, చెల్లూరి నారాయణస్వామి అలియాస్ సోమన్న, అరుణల ఆధ్వర్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
మావోయిస్టులను గుర్తించిన పోలీసులు
-
కిడారి, సోమల అంత్యక్రియలు పూర్తి
-
అరకు దాడిలో పాల్గొన్న మావోయిస్టులు వీరే..
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన మావోయిస్టులలో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు సోమవారం వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కిడారి, సోమలపై దాడిలో పాల్గొన్న వారు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికుల సాయంతో ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీసులు వారికి సంబంధించిన వివరాలతో పాటు ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అంతేకాకుండా జిల్లా పోలీసులు, ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ తెలియజేశారు. కాగా, డుంబ్రిగుడ మండలం తొట్టంగి వద్ద కిడారి, సోమలపై దాడి జరిపిన వారిలో సాయుధులైన మహిళా మావోయిస్టులే ఎక్కువగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలు: 1. వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ, గ్రామం కరకవానిపాలెం, మండలం పెందుర్తి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 2. కామేశ్వరి అలియాస్ స్వరూప, సీంద్రి చంద్రి, రింకీ- భీమవరం టౌన్, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ 3. జలమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, రైనో - గ్రామం దబ్బపాలెం, అడ్డతీగల పోలీసు స్టేషన్ పరిధి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్ -
కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి
పాడేరు/అరకులోయ/పాడేరు/డుంబ్రిగుడ/పెదవాల్తేరు: విశాఖ మన్యంలో మావోయిస్టులు కాల్చి చంపిన ప్రభుత్వ విప్, అరుకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ అంత్యక్రియలు సోమవారం అధికార లాంఛనాలతో ముగిశాయి. అరకులోని ప్రాంతీయ ఆస్పత్రిలో సోమవారం ఉదయం వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. పాడేరులో కిడారి సర్వేశ్వరరావుకు, అరకులో సోమకు అనుచరులు, బంధువులు కన్నీటి మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. తొలుత కిడారి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి పాడేరు వీధుల్లో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, మణికుమారి, ఎంపీ శ్రీనివాసరావు, జిల్లా ఎమ్మెల్యేలు, మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో పట్టుపరిశ్రమశాఖ ప్రదర్శన క్షేత్రం వద్ద ప్రభుత్వ స్థలంలో కిడారి భౌతికకాయానికి పోలీసులు గౌరవవందనం చేశారు. మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సుజయకృష్ణ రంగారావు, జవహర్, నక్కా ఆనందబాబు, కళావెంకటరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిడారి భార్య పరమేశ్వరి, పిల్లలు నాని, సందీప్, తనిష్క, ఇతర కుటుంబ సభ్యులను మంత్రులు ఓదార్చారు. అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్, వైఎస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ నేతలు పాల్గొని కిడారి మృతదేహానికి నివాళులు అర్పించారు. సోమకు తుది వీడ్కోలు పోస్టుమార్టం అనంతరం సోమ మృతదేహాన్ని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలించారు. తొలుత హెలికాప్టర్లో అరకు చేరుకున్న మంత్రులు సోమ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సోమ కుటుంబసభ్యులను పరామర్శించారు. మందకృష్ణ మాదిగ, కారెం శివాజి, అరకులోయ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శెట్టి పాల్గుణ తదితరులు సోమ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని పురవీధుల్లో ఊరేగించి స్థానిక ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. భద్రతా వైఫల్యాలపై విచారణ: చినరాజప్ప ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనలో భద్రతాపరమైన వైఫల్యాలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. పాడేరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన నాయకుల్ని మావోయిస్టులు చంపడం విచారకరమని, ఉనికిని చాటుకోవడానికే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. నాయకుల్ని కాపాడే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద కిడారి, సోమలను మావోలు చంపిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, ఇంటిలిజెన్స్ డీసీపీ ఫకీరప్ప సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉనికిని చాటుకోవడానికి, పోలీసులపై ప్రతీకార చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు చంపారన్నారు. ఒడిశా రాష్ట్రం నందపూర్ కమిటీ దళ సభ్యులు ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. కూంబింగ్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కాగా, శర్మ, ఫకీరప్ప అరకులోయ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘటన స్థలానికి బైక్పై వెళ్లారు. ఎస్సై సస్పెన్షన్.. విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ సబ్ఇన్స్పెక్టర్ వై.అమ్మనరావుని సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో వైఫల్యం కారణంగా ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ముగ్గురు మావోల గుర్తింపు సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను కాల్చి చంపిన మావోయిస్టుల్లోని ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్షులు గుర్తుపట్టిన ఆ ముగ్గురు మావోల ఫొటోలు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ మీడియాకు విడుదల చేశారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల పోలీస్స్టేషన్ పరిధి దబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప అలియాస్ సింద్రి, అలియాస్ రింకి, విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకటరవి చైతన్య అలియాస్ అరుణ ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఈ ముగ్గుర్ని గుర్తుపట్టారని, ఈ ఘటనలో పాల్గొన్న మిగిలిన వారిని కూడా త్వరలోనే గుర్తిస్తామని ఎస్పీ తెలిపారు. పోలీసులకు సమాచారం లేకుండా ఏజెన్సీలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు బయటకు వెళ్లరాదని, ముఖ్యంగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే భీమవరానికి చెందిన కామేశ్వరి ఈ కాల్పుల్లో పాల్గొనడం జిల్లాలో చర్చనీయాంశమైంది. నిజానికి కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, భీమవరానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. వారు విడిపోయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం బస్ డిపోలో కండక్టర్గా పనిచేసింది. 2008–09 సమయంలో మావోలతో పరిచయం అయ్యి వారితో కలసి వెళ్లినట్లు సమాచారం. -
మావోయిస్టుల కుట్ర భగ్నం..!
రాయ్పూర్ : అరకు టీడీపీ నేతలపై కాల్పులు జరిగిన 24 గంటలు గడవకముందే మావోయిస్టులు మరో భారీ పేలుళ్లకు సిద్దపడ్డారు. ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేసిన మందుపాతర్లను పోలీసులు భగ్నం చేశారు. అరకు ఘటన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కూంబింగ్ చేపట్టిన బలగాలు మందుపాతర్లను గుర్తించారు. నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురు మవోయిస్టులను పొలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా టీడీపీ నేతల హత్య అనంతరం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మవోయిస్టులు ప్రాబల్య ప్రాంతాల్లో అదనపు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాల ఆధ్వర్యంలో పోలీసులు జల్లడపడుతున్నారు. చదవండి : తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం -
ఉలికిపాటు
ఆత్మకూరు (కర్నూలు): విశాఖపట్నం జిల్లా అరకు లోయలో మావోయిస్టులు ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం కాల్చిచంపడంతో జిల్లా ప్రజలు సైతం ఉలికిపాటుకు గురయ్యారు. గతంలో జిల్లాలో..మరీ ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆత్మకూరు ప్రాంతంలో ‘పీపుల్స్వార్ బవనాసి’ పేరుతో నక్సల్స్ కార్యకలాపాలు నిర్వహించారు. వారి ఉనికి ఎంతో బలంగా ఉండేది. 1999లో అప్పటి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళæరెడ్డిని పీపుల్స్వార్ బవనాసి దళ సభ్యులు పట్టణంలోని పాత డీఎస్పీ బంగ్లా అతిథిగృహంలో కాల్చి చంపారు. పోలీస్ దుస్తులను ధరించిన వ్యక్తులు బుడ్డా వెంగళరెడ్డి దగ్గరకు వెళ్లి మాట్లాడుతూ ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. వాస్తవానికి 1995–96 ప్రాంతంలో అప్పటి పీపుల్స్ వార్ సభ్యులు (ప్రస్తుతం మావోయిస్ట్లు) తెలంగాణ ప్రాంతం నుంచి నల్ల మల అభయారణ్యం సమీపంలోని కొత్తపల్లి మండలం జానాల గూడెం చేరుకుని ఈ ప్రాంతాన్ని షెల్టర్జోన్గా ఉపయోగించుకున్నారు. నాలుగేళ్లలోనే అటవీ సమీప గ్రామాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని తమ కార్యకలాపాలను కొనసాగించారు. అప్పటి దళం కృష్ణ నాయకత్వంలో పనిచేసింది. అయితే..అతను పుట్టిలో కృష్ణానదిని దాటే క్రమంలో ప్రమాదవశాత్తు మరణించాడు. అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన శ్యామ్ కర్నూలు జిల్లాలో నాయకత్వ బాధ్యతలు చేపట్టి.. పార్టీని మరింత బలోపేతం చేశారు. అప్పçట్లో పీపుల్స్వార్ సభ్యులు పలు సంఘటనలకు పాల్పడి ఉనికిని బలంగా చాటారు. మరీ ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో వీరి కదలికలు అధికంగా ఉండేవి. వడ్ల రామాపురం, వేంపెంట, నల్లకాలవ, బండి ఆత్మకూరు మండలం నారాయణపురం, సంతజూటూరు, మహానంది మండలం గాజులపల్లెతో పాటు ఆళ్లగడ్డ మండలంలోనూ చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించారు. 2003 సంవత్సరంలో బైర్లూటీ, వెలుగోడు తదితర ప్రాంతాలలో అటవీశాఖ భవనాలను పేల్చేశారు. అదే ఏడాది ఇందిరేశ్వరం గ్రామంలో కరువు దాడి నిర్వహించారు. 2004లో సున్నిపెంట పోలీస్స్టేషన్ను పేల్చివేయడం సంచలనమైంది. 2005 జనవరి 15న బైర్లూటీ వద్ద కొవ్వూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును తగులబెట్టారు. అదే ఏడాది మార్చి ఒకటో తేదీన వేంపెంట ఊచకోత ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలా పలు ఘటనలతో బలంగా ఉనికిని చాటుతూ వచ్చిన నక్సల్స్ ప్రభావం ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ వచ్చింది. గత కొన్నేళ్లుగా జిల్లాలో వారి కార్యకలాపాలేవీ లేవు. అయితే..ఆదివారం అరకు ఎమ్మెల్యే హత్యతో మళ్లీ అలజడి రేగింది. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. మావోల కదలికలు లేవు ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా మావోయిస్టుల కదలికలు లేవు. ఈ విషయంపై మేం సమగ్రంగా విచారణ చేశాం. ఎక్కడా వారి ఉనికి బయటపడలేదు. – మాధవరెడ్డి, ఏఎస్పీ -
మన్యంలో పేలిన మావో గన్స్
-
అరకులో ఉద్రిక్తత.. ఎస్ఐపై వేటు..!
సాక్షి, విశాఖపట్నం, అరకు : అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా కాల్చివేత నేపథ్యంలో అధికారులు స్థానిక డుంబ్రిగుడ ఎస్ఐపై వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్ఐ అమ్మనరావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నిన్న జరిగిన కాల్పుల్లో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమాలు మృతిచెందిన విషయం తెలిసిందే. మావోయిస్టుల చర్యకు నిరసనగా ప్రజాసంఘాలు నేడు ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో అరకులో వాహనాల రాకపోకలు నలిచిపోగా.. దుకాణాలు మూతపడ్డాయి. టీడీపీ నేతల హత్యతో అరకులో పోలీసులు 144 సెక్షన్ను అమలు చేసి.. భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యకర్తలను, అభిమానులను నిలువరించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను దింపుతున్నట్లు అధికారులు వెల్లంచారు. పోస్టుమార్టం పూర్తి... కిడారి సర్వేశ్వరరావు, సోమాల మృతదేహలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించన్నారు. ఈ నేపథ్యంలో భారీగా అదనపు బలగాలను మోహరించారు. అంత్యక్రియల్లో మంత్రులు, ప్రజానిధులు, ఆయన అభిమానులు పాల్గొననున్నారు. మంత్రుల కోసం ప్రత్యేక హెలికాఫ్టర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అంత్యక్రియల నేపథ్యంలో అరకులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి : అట్టుడికిన మన్యం తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం మంటలు రేపిన మారణకాండ భయోత్పాతం.. భీతావహం -
పోలీస్ హై అలర్ట్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఒకప్పటి మావో యిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోయిస్టులు హత్య చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆపద్ధర్మ మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రచారం చేస్తున్నందున భద్రత పెంచాలని రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రజాప్రతినిధులు తమ పర్యటనల వివరాలు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ రాష్ట్రాలను ఆనుకొని ఉమ్మడి ఆదిలాబాద్ ఉండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏకంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను ఇద్దర్ని ఒకేసారి హత్య చేసిన మావోయిస్టులు ఉనికిని చాటుకునేందుకు తెలంగాణలో సైతం దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్ ఎస్పీలు, రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల డీసీపీ తమ పరిధిలోని పోలీస్ యంత్రాంగానికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 21న మావోయిస్టు పార్టీ ఆవిర్భావం – వారం పాటు ఉత్సవాలు దేశంలో విప్లవ పంథాలో సాగే పార్టీలన్నీ కలిసి 2004 జనవరి 21న భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)గా ఏర్పాటయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వరకు విప్లవ పోరాట పంథా సాగించిన పీపుల్స్వార్ పార్టీ కూడా సీపీఐ(మావోయిస్టు)లో భాగమైంది. ఈ నేపథ్యంలో 21వ తేదీ నుంచి 27 వరకు పార్టీ 14వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు అన్ని స్థాయిల్లోని నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, పాటల ద్వారా ప్రచారం చేసి, సభలు, సమావేశాల ద్వారా కళా ప్రదర్శనలు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చారు. ఈ మేరకు కుమురంభీం–మంచిర్యాల డివిజన్ కమిటీ తరఫున మావోయిస్టు నేత చార్లెస్ ఈ నెల 19న ఐదు పేజీల పత్రికా ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ ఉత్సవాలకు పిలుపునిచ్చిన రోజుల్లోనే ఏజెన్సీ ప్రాంతంలో ప్రజాప్రతినిధులను మావోలు హత్య చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాల్లో హై అలర్ట్ ప్రకటించారు. -
మంటలు రేపిన మారణకాండ
ఒక ప్రతీకారేచ్ఛ మారణకాండ సృష్టించింది.. ఆ మారణకాండకు నిరసనగా ఆగ్రహజ్వాల రగిలింది. అందాల అరకును అట్టుడికించింది.. మొత్తం మన్యాన్ని భయం గుప్పిట్లోకి నెట్టింది.నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మావోయిస్టులు పంజా విసిరారు. అరకు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోల తూటాలకు నేలకొరిగారు. స్థానికులు, నేతల అనుచరుల్లో అలజడిని, ఆగ్రహాన్ని రేపిన ఈ ఘటన.. అరకు, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్లపై దాడికి, దహనానికి పురిగొల్పింది. అనూహ్యంగా జరిగిన మారణకాండ, దాడులు, విధ్వంసాలతో అరుకులోయ చివురుటాకులా వణికిపోయింది. ఈ మొత్తం ఘటనలో కిడారి, సివేరిల మృతదేహాలు నాలుగు గంటల పాటు సంఘటన స్థలంలోనూ.. మరో నాలుగు గంటలు వారి వాహనాల్లోనూ అనాథల్లా మిగిలిపోవడం స్థానికులను కలచివేసింది. సాక్షి విశాఖపట్నం/పాడేరు రూరల్/అరుకులోయ: విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. అధికారపార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ప్రజాప్రతినిధి సీవేరిసోమను కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టులో జరిగిన ఈ ఘటనతో ఏవోబీ ఉలిక్కిపడింది. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం మధ్యాహ్నం 12.20గంటల సమయంలో మావోయిస్టులు దారుణంగా కాల్చిచంపారు. వీరిద్దరినీ అతి దగ్గరగా కాల్చిచంపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. డుంబ్రిగుడ మండలం లివిటి పుట్టు వద్ద మావోలు ఈ దాడికి పాల్పడ్డారు. అరకు నుంచి డుంబ్రిగుడ, గుంటసీమ రోడ్డు మీదుగా కండ్రుం పంచాయతీకి కార్యకర్తలు, అనుచరులు సహా మూడు వాహనాల్లో బయలు దేరిన కిడారివాహనాల్ని ముందుగానే మాటువేసిన40 మంది మహిళలు సహా 70 మంది సాయుధదళం కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అడ్డగించి మార్గమధ్యంలోనే మట్టుబెట్టారు. ఉదయం 11 గంటలక వరకూ అరకులోనే ఉన్న కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి లివిటి పుట్టు గ్రామానికి క్షేత్ర స్థాయి పరిశీలనకు బయలుదేరి వెళ్లారు. గ్రామ సమీపంలో మార్గమధ్యంలో వాహనాలపై ఒక్కసారిగా మావోలు అడ్డగించారు. ఎమ్మెల్యే గన్మెన్ల వద్ద నుంచి తుపాకీలు, సెల్ఫోన్లు లాక్కొని వారిని దూరంగా పంపించేశారు. అనంతరం వారంతా చూస్తుండగానే చూస్తుండగానే ఎమ్మెల్యే కిడారిని, మాజీ ఎమ్మెల్యే సోమకు చేతులు కట్టికొద్ది దూరం ముందుకు తీసుకువెళ్ళి అరమ–గుంటసీమ జంక్షన్ వద్ద నిలిపివేశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు అంశాలపై ఎమ్మెల్యే కిడారితో కొద్ది సేపు చర్చించారు. గూడ క్వారీ పర్యావరణాన్ని దెబ్బదీస్తున్నందున మూసెయ్యాలని గతంలో పలు మార్లు హెచ్చరించినా ఎందుకు నడిపిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భయంతో వణికిపోయిన కిడారి.. ఈ ఒక్కసారికీ క్షమించాలంటూ వేడుకున్నా.. మావోలు వినిపించుకోకుండా కాల్చిచంపారు. పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే సోమ ఈ దృశ్యాన్ని చూసి భీతావహుడై పారిపోయేందుకు ప్రయత్నించగా ఆయన్ని కూడా మట్టు బెట్టారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి మావోయిస్టులు వెళ్లిపోయారు. అట్టుడికిన అరకు ఘటనతో అభిమానులు, కుటుంబ సభ్యులు, అనుచరుల ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు తరలివచ్చారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘాతుకం అంటూ సీఐపై మండిపడ్డారు. మూడు రోజుల నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నా ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వాహనాలకు, స్టేషన్లకు నిప్పుపెట్టారు. పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. పోలీసుల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతదేహాల తరలింపులోనూ కొద్దిసేపు హైడ్రామా నడిచింది. దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, కిడారి, సోమ అభిమానులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. అంతటా విషాదం పాడేరు: అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మావోయిస్టుల తూటాలకు బలవ్వడంతో మన్యమంతటా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ వార్త అంతటా దావానంలా వ్యాపించింది. వారి బంధువులు, అభిమానులు, వివిధ గిరిజన వర్గాలు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనూహ్య మరణం పట్ల తీవ్ర దిగ్రాంతిని వ్యక్తం చేశారు. టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన, అలజడి వ్యక్తమవుతోంది. పాడేరులోని సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద, సతీమణి పరమేశ్వరి స్వగ్రామమైన పట్టణంలోని గొందూరు కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద ఆయన చిత్రపటం ఉంచి బంధువులు నివాళి అర్పించారు. పలువురు మహిళలు కంటతడి పెట్టుకున్నారు. కొందరు సంఘటన స్థలానికి తరలివెళ్లారు. కుగ్రామం నుంచి ప్రభుత్వ విప్ వరకు పాడేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుది ఓ కుగ్రామం. పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ నడిమివాడలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. జి.మాడుగుల మండలం కిల్లంకోటలో ఉండేవారు. చిన్నప్పుడే పెళ్లయింది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యాపారం పట్ల మక్కువ చూపేవారు.1990లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి మంత్రి కొణతాల రామకృష్ణకు మంచి నమ్మకస్తుడిగా ఉండేవారు. వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్సీ పదవి వరించింది. రెండేళ్లపాటు పదవిలో కొనసాగారు. వైఎస్సార్ మరణం తరువాత వైఎస్సార్సీపీ అరకు సమన్వయకర్తగా వ్యవహరించి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2016 ఏప్రిల్ 28న టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ విప్గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి మావోయిస్టుల హిట్లిస్ట్లో ఉన్నారు. పోలీస్స్టేషన్లకు నిప్పు.. అరకులోయ: ఇదే సమయంలో రెండు మృతదేహాలు వాహనాల్లో ఈ స్టేషన్ల వద్దకు వచ్చేసరికి వారి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఒక్కసారిగా పక్కపక్కనే ఉన్న అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. వీరంతా రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఈ రెండు స్టేషన్లకు పక్కనే విద్యుత్ ట్రాన్స్పార్మర్లు ఉండడంతో ముందుస్తుగా ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగుతున్న విషయాన్ని తెలుసుకున్న కొందరు పోలీసులు వెనుక నుంచి వచ్చి ఒక భవనంలో ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్కు చెందిన బ్యాగులు, తుపాకులను తీసుకుని బయటకు వచ్చారు. లేకుంటే తుపాకులు కూడా కాలిపోయే పరిస్థితి ఉండేది. సీఆర్పీఎఫ్ ముట్టడిలో అరకు.. రూరల్ ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు అంత అరకులోయలోని పరిస్థితిని సమీక్షించారు. దీంతో జిల్లాలోని అందుబాటులో ఉన్న సీఎర్పీఎఫ్ బలగాలను అరకులోయ ప్రాంతానికి హుటాహుటిన తరలించారు. బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. అరకులోయలో పలు ప్రధాన జంక్షన్ల వద్ద సీఆర్పీఎఫ్ దళాలు పహరా కాస్తున్నాయి. అరకులోయలోనే పోస్టుమార్టం డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతదేహాల పోస్టుమార్టానికి అరకులోయ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏర్పాట్లు చేస్తున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తెలిపారు. పోస్టుమార్టానికి మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మెయిన్ గేట్ నుంచి మార్చురీ వరకు అడుగడుగునా పోలీసులు మోహరించారు. మధ్యాహ్నాం 3 గంటలకే పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. వారితో పాటు సీఎస్ఆర్ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేశారు. అయితే మృతదేహాలను అక్కడి నుంచి తీసుకురానివ్వకుండా అభిమానులు, ప్రజలు అడ్డుకోవడంతో అరకులోయ ఏరియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని డాక్టర్ అర్జున్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఎమ్మెల్యే హత్య ఇదే తొలిసారి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా చరిత్రలో మావోయిస్టులు శాసనసభ్యుడిని మట్టుబెట్టడం ఇదే ప్రథమం. ఆంధ్ర –ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో విశాఖ జిల్లా కూడా ఉంది. దీంతో వారి ప్రాబల్యం జిల్లాలో అధికంగానే కనిపిస్తుంది. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అనుమానించిన వారిని దళసభ్యులు హతమారుస్తున్నారు. వీరిలో ఇన్ఫార్మర్ల నెపంతో కొందరిని, తమకు ప్రత్యర్థులుగా భావిస్తున్న పోలీసులు, మావోయిస్టులను, ప్రభుత్వానికి అనుకూలంగా, గిరిజనులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ప్రజాప్రతినిధులను వీరు చంపుతున్నారు. 1990లో అప్పటి చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజు, ఐటీడీఏ పీవో దాసరి శ్రీనివాసులు, తదితరులను పీపుల్స్వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. జైలులో ఉన్న నక్సలైట్ నేత క్రాంతి రణదేవ్ను విడుదల చేయాలన్న డిమాండ్తో ఈ కిడ్నాప్నకు అప్పట్లో పాల్పడ్డారు. దాదాపు నెల రోజుల అనంతరం ప్రభుత్వం క్రాంతి రణదేవ్ను విడుదలతో నక్సలైట్లు బాలరాజు, తదితరులను విడిచిపెట్టారు. అప్పట్లో నక్సల్స్ చెరలో ఉన్న వీరందరినీ హతమారుస్తారని అంతా ఆందోళన చెందారు. తాజాగా ఇప్పుడు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అదే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారు. ఇలా ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చడం విశాఖ చరిత్రలో ఇదే తొలిసారి! కళ్లెదుట చంపేశారు.. ఎమ్మెల్యే కిడారి వద్ద కొంతకాలంగా పీఏగా పని చేస్తున్నాను. ఆదివారం కండ్రుం పంచాయతీ సర్రాయిలో పార్టీ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు అడ్డగించారు. వాహనంలో ఉన్న ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు గన్మేన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, డ్రైవర్, నన్ను కిందకు దింపారు. ఎమ్మెల్యేతో మాట్లాడే పనుందంటూ కొంతదూరం తీసుకువెళ్ళారు. మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలితే చంపేస్తామని తుపాకులు ఎక్కుపెట్టారు. కొంత సమయం తర్వాత అంతా చూస్తుండగానే ఎమ్మెల్యేను తుపాకితో కాల్చిచంపారు.– అప్పారావు, కిడారి పీఏ ఎస్ఐ బాధ్యత రాహిత్యం వల్లే..టీడీపీ కార్యకర్తల ఆరోపణ డుంబ్రిగుడ(అరకులోయ): తనిఖీల పేరిట అరకు రోడ్డులో హడావుడి చేసే డుంబ్రిగుడ ఎస్ఐ అమ్మనరావు మండలం శాంతి భద్రతలను పట్టించుకోక పోవడం దారుణం అంటూ టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఎస్ఐ బాధ్యత రాహిత్యం వల్లే సంఘటన చోటుచేసుకుందన్నారు. డుంబ్రిగుడ పోలీసు స్టేషన్పై దాడి చేసి ఆందోళన చేపట్టారు. ఎస్ఐను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అయ్యన్న దిగ్భ్రాంతి నర్సీపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోయిస్టులు దారుణంగా హత్య చేయటంపై రోడ్లు భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటనపై ఆయన స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి హత్యలు సరికాదన్నారు. ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భంలో ప్రజలు సంయమనం పాటించాలన్నారు. కిడారి, సోమ హత్యలను ఖండించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎప్పటికప్పుడు సీఎంకు సమాచారం : కలెక్టర్ ప్రవీణ్కుమార్ బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంలో ఏజెన్సీ అంతటా అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే భారీ స్థాయిలో భద్రతా బలగాలను ఏజెన్సీకి పంపించామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచారన్ని ఎప్పటికప్పుడు సీఎం, సీఎస్తో మాట్లాడుతున్నామని సమాచారాన్ని వాళ్లికి అందిస్తున్నామని తెలిపారు. కాల్పులపై విచారణ చేపట్టునున్నట్లు విలేకరులకు తెలిపారు. కేడీపేటలో కొవ్వొత్తుల ర్యాలీ గొలుగొండ(నర్సీపట్నం): మావోయిస్టుల చర్యకు నిరసనగా కొయ్యూరు సీఐ ఉదయకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్తులు కృష్ణదేవిపేటలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చట్టాలను చేతుల్లో తీసుకొని హింసకు పాల్పడుతున్న మావోయిస్టులకు తగిన గుణపాఠం తప్పదని సీఐ పేర్కొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జీవో 97 వల్లే.. సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీల్లో బాక్సైట్ తవ్వకాలు వీలు కల్పించే 97వ నంబరు జీవోను విడుదల చేయడం వల్లే మన్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య నేపథ్యంలో ఈ జీవో అంశం చర్చనీయాంశంగా మారింది. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 97వ నంబరు జీవోను జారీ చేశారు. ఈ జీవో ద్వారా మన్యంలో లేటరైట్ పేరిట లోపాయకారీగా బాక్సైట్ తవ్వకాలకు మార్గం సుగమమైంది. ఈ జీవో రద్దు కోరుతూ గిరిజనులు, ప్రజా సంఘాలు ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం కరువవడమే కాక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బలికావలసి వస్తోందన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. -
కిడారి, సోమ మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి
-
విశాఖ జిల్లాలో..మావోగన్స్ ఘాతుకం
-
‘మానవత్వానికి మాయని మచ్చ’
సాక్షి, అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చని, ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి.. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మావోయిస్టుల దాడి పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతి చెందడం పట్ల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
భయోత్పాతం.. భీతావహం
లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. రామ్గుడ ఎన్కౌంటర్కు ప్రతీకారంగా, మన్యంలో తమ ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు తెగబడ్డారు. అందరూ చూస్తుండగానే ఓ ప్రజాప్రతినిధితో పాటు, మాజీ ప్రజాప్రతినిధిని కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. మావోయిస్టులకు విశాఖ మన్యం పెట్టనికోట. ఖాకీ చొక్కా అటువైపు తొంగి చూడలేదనే మాటలు వినిపించేవి. అయితే రామ్గుడ పరిసరాల్లో 2016 అక్టోబర్ 24న మావోయిస్టులపై ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు 30 మంది నక్సల్స్ను హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు కీలక నేతలు సైతం ప్రాణాలు కోల్పోవడంతో.. ఏవోబీపై పూర్తి ఆధిపత్యం సాధించామని పోలీసులు భావించారు. దేశచరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్గా పేర్కొనే.. పోలీసుల ఏకపక్ష యుద్ధంలో కీలక నేతలు నేలకొరగడం మావోలకు మింగుడు పడలేదు. ప్రతీకారంతో రగిలిపోయారు. అదనుకోసం ఎదురుచూశారు. ఏజెన్సీలో అడపాదడపా ఉనికి చాటుతూనే వచ్చారు. ఒకవైపు గ్రేహౌండ్స్ దళాలు, పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేసినా.. పలు హింసాత్మక చర్యలకు పాల్పడడమేగాక వారోత్సవాలు జరపడం, పోస్టర్లు వేయడం వంటి చర్యల ద్వారా వారు తమ ఉనికి చాటుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కేబినెట్ హోదా ఉన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపి భయోత్పాతాన్ని సృష్టించారు. మన్యంపై తమ పట్టు కోల్పోలేదని చాటడంతోపాటు భయం పుట్టించేందుకే ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధిపై విరుచుకుపడి హతమార్చినట్టు తెలుస్తోంది. రామ్గుడ ఎన్కౌంటర్ సమయంలో 11 మంది మహిళా మావోయిస్టులు మరణించారు. ఈ కారణంగానే ఈ జంట హత్యల వ్యవహారంలో సింహభాగం మహిళా యాక్షన్ టీమ్ సభ్యులే పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన్యంలో భయంభయం ఓ ఎమ్మెల్యేను చంపడం మన్యంలో ఇదే తొలిసారి కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయోత్పాతం నెలకొంది. తమ బలం నిరూపించేందుకు మావోయిస్టులు తెగబడిన ఈ ఘటన మన్యంలో కలకలం రేపింది. ఈ ఘటనతో గిరిసీమలు వణికిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలతో గ్రామస్తులు బితుకుబితుకుమంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చిన దరిమిలా ఏజెన్సీలోని గిరి గ్రామాల్లో పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో.. ఎప్పుడెలా ఉంటుందోననే భయంతో మారుమూల గూడేల్లోని ప్రజలు హడలిపోతున్నారు. ఆదివాసీలు ఇళ్లు వదిలి బయటకు రావట్లేదు. పొలం పనులకు వెళ్లేందుకూ జంకుతున్నారు. డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరికొన్ని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. 2014లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలపై మావోయిస్టులు ప్రధానంగా దృష్టి సారించారు. సుకుమా జిల్లాలో జరిపిన దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు చనిపోయారు. మహారాష్ట్ర గడ్చిరోలిలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరలో ఏడుగురు పోలీసులు చనిపోయారు. మొత్తం సంఘటనలు – 155 చనిపోయిన పౌరులు – 128 మరణించిన భద్రతాసిబ్బంది – 87 2015లో ఛత్తీస్గఢ్ మందు పాతరలు, ఎన్కౌంటర్లతో దద్దరిల్లింది. మొత్తం సంఘటనలు – 118 చనిపోయిన పౌరులు – 93 చనిపోయిన భద్రతాసిబ్బంది – 57 2016లో ఛత్తీస్గఢ్లో దాడులు జరిగినప్పటికీ గతంతో పోలిస్తే తక్కువ ఘటనలు జరిగాయి. మొత్తం సంఘటనలు – 69 మొత్తం చనిపోయిన పౌరులు – 123 మొత్తం చనిపోయిన భద్రతాసిబ్బంది – 66 -
అట్టుడికిన మన్యం
సాక్షి విశాఖపట్నం/ పాడేరు రూరల్/అరుకులోయ/డుంబ్రిగుడ/ఎంవీపీకాలనీ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చడంతో అరకులోయ అట్టుడికిపోయింది. వారి అభిమానులు, అనుచరులు, కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. ఎమ్మెల్యే కార్యక్రమ వివరాలు శనివారం సాయంత్రం డుంబ్రిగుడ పోలీసులకు తెలియజేసినప్పటికీ ఆదివారం కిడారికి పోలీసులు రక్షణ కల్పించలేదని.. ఇది అదునుగా చూసి మావోలు వారిని చంపేశారని పోలీసులపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సీఐ వెంకునాయుడితో వాగ్వాదానికి దిగారు. రక్షణ కల్పించాలని సమాచారం ఇచ్చినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. మూడు రోజులుగా మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నాయని తెలిసినా తమ నేతలకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ ఎస్ఐ ఆమనరావును ఇక్కడకు తీసుకురావాలని, జరిగిన హత్యలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. మృతదేహాలను విశాఖ తరలించనివ్వం.. లివిటిపుట్టు నుంచి మృతదేహాలను తరలించేందుకు పోలీసులు రాకపోవడంతో నేతల అనుచరులు వారి వాహనాల్లోనే అరకుకు తరలించారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారు పోలీస్ స్టే్టషన్ సమీపానికి చేరుకోగానే అరకు సీఐ వచ్చి.. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించాలని, అక్కడే పోస్టుమార్టం చేస్తారని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కిడారి, సోమ అభిమానులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. మృత దేహాలను విశాఖకు తరలించడానికి అంగీకరించబోమని మృతదేహాలతో తీసుకుని రోడ్డుపై గంటకుపైగా బైఠాయించారు. ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే వరకు మృతదేహాలను కదలనిచ్చేది లేదంటూ నినాదాలు చేశారు. బందోబస్తును పట్టించుకోని పోలీసులు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన తరువాత ఎమ్మెల్యే కిడారి ఏజెన్సీకి రావడం తగ్గించేశారు. అరకు నియోజకవర్గంలో కూడా పెద్దగా తిరగడం లేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ గ్రామదర్శిని, గ్రామ వికాస్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడంతో కొద్ది రోజులుగా అరకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మావోల ముప్పు ముందు నుంచి ఊహిస్తున్న కిడారి... బందోబస్తు కోసం శనివారం రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు ఆయన పీఏ అప్పారావు చెప్పారు. తనతో ఎస్ఐ అమ్మనరావుకు ఫోన్ చేయించారని, అయినా సరే పోలీసులు ఆదివారం నాటి పర్యటనకు బందోబస్తు కల్పించలేదని వివరించారు. పోలీసులురూట్ వాచ్ కూడా చేయలేదన్నారు.రూరల్ ఏస్పీ, పోలీసు ఉన్నతాధికారులు అరకులోయలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో టీడీపీ నేతలకు, ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరికలతో వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నేడు హోంమంత్రి రాక.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మృతదేహాలను ఆదివారం రాత్రి అరకులోయలోని వారి క్యాంపు కార్యాలయాలకు తరలించారు. ఏపీ సీఎం అమెరికా పర్యటనలో ఉండటంతో హోంమంత్రి చినరాజప్ప సోమవారం ఉదయం అరకులోయకు చేరుకుంటారు. మంత్రి సమక్షంలో స్థానిక ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం తర్వాత ఎమ్మెల్యే కిడారి మృతదేహాన్ని పాడేరుకు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన మాదెల పంచాయతీ బట్టివలస గ్రామానికి తరలించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతితో విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీస్ స్టేషన్లకు నిప్పు.. పోలీసులతో వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే రెండు మృతదేహాలను స్టేషన్ల వద్దకు తీసుకువచ్చేసరికి వారి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పక్కపక్కనే ఉన్న అరకు, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టారు. కంప్యూటర్లు, ఇతర రికార్డులు, మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వాహనాలకు, స్టేషన్లకు నిప్పుపెట్టారు. దీంతో వాహనాలు, స్టేషన్ రికార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఆందోళనకారులు విధ్వంసానికి దిగడంతో పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఏపీఎస్పీ బెటాలియన్కు చెందిన బ్యాగులు, తుపాకులను బయటకు తీసుకెళ్లడంతో అవి మంటలబారిన పడలేదు. -
తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం
లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/డుంబ్రిగుడ: ఏటా జరిగే వారోత్సవాలకు ముందుగా మాటు వేసి పొంచిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను దారుణంగా కాల్చి చంపారు. ఏవోబీలో దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పథక రచన చేసి కొద్ది రోజులుగా రంగంలోకి దిగి సంచరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సర్వే చేసేందుకు తరలిం చడంతో ఈ ఘాతుకం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పోలీసులు రాకపోవడంతో చివరకు కిడారి అనుచరులే మృతదేహాలను వాహనాల్లో తరలించారు. అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే హత్య జరిగితే సాయంత్రం వరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే సోమ అనుచరులు అరకు, డుమ్రిగూడ పోలీస్స్టేషన్లపై దాడికి దిగి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. గ్రామదర్శిని, గ్రామవికాస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయల్దేరి... విశాఖ మన్యంలో మావోయిస్టులు ప్రతికారేచ్ఛతో మారణకాండకు పాల్పడ్డారు. క్యాబినేట్ హోదా కలిగిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను పట్టపగలే కాల్చి చంపారు. డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టులో ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కండ్రుం పంచాయతీ సార్రాయి గ్రామంలో టీడీపీ తలపెట్టిన గ్రామదర్శిని, గ్రామవికాస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కిడారి, సోమలు అరకు నుంచి ఉదయం 11 గంటల సమయంలో డుంబ్రిగుడ, గుంటసీమ మీదుగా కార్యకర్తలు, అనుచరులతో కలసి మూడు వాహనాల్లో బయలుదేరారు. లివిటిపుట్టు వద్ద అప్పటికే మాటువేసిన 40 మంది మహిళా మావోయిస్టులతో సహా 70 మంది సాయుధులు టీడీపీ నేతల వాహనాలను అడ్డగించారు. గన్మెన్ల నుంచి తుపాకులు, సెల్ఫోన్లు తీసుకుని దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే కిడారి వాహనంలో ఉన్న డ్రైవర్ చిట్టిబాబు, ఇద్దరు గన్మెన్లు, వ్యక్తిగత సహాయకుడు అప్పారావు, అరకు జెడ్పీటీసీ కూన వనజ భర్త రమేష్, అరకు మాజీ సర్పంచ్ ఛటారి వెంకటరాజులు దూరంగా వెళ్లి నిల్చున్నారు. మాజీ ఎమ్మెల్యే సోమ వాహనంలో ఉన్న గన్మెన్, డ్రైవర్లను కూడా మావోయిస్టులు దూరంగా పంపేశారు. అనంతరం కిడారి, సోమ చేతులు కట్టేసి కొంత దూరం తీసుకెళ్లి అరమ–గుంటసీమ జంక్షన్ వద్ద ఆగారు. ఓ దశలో మాజీ ఎమ్మెల్యే సోమ పారిపోయేందుకు ప్రయత్నించగా దారుణంగా చంపేస్తామని హెచ్చరించారు. మరో వాహనంలో ఉన్న ఎంపీటీసీ లావణ్య, ఆమె భర్త చంద్రశేఖర్, కించుమండ ఎంపీటీసీ ప్రమీల తదితరులను తాము చెప్పేవరకు అక్కడినుంచి వెళ్లవద్దని ఆదేశించారు. కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదు... ఎమ్మెల్యే కిడారిని కొద్ది దూరంలో ఉన్న చింతచెట్టు కిందకు తీసుకెళ్లిన మావోయిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. గూడ క్వారీని నిలిపివేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు ఏం చేశావని నిలదీశారు. ఈ విషయాలపై ఎన్నిసార్లు చెప్పినా ఆయన వైఖరిలో మార్పు రాలేదన్నారు. తనను నిలదీస్తున్న మహిళా మావోయిస్టులతో.. ‘మీ కాళ్లు పట్టుకుంటా క్షమించేయండి మేడం...!’ అంటూ కిడారి ముందుకు పడిపోయారు. నీకేమీ కాదంటూ ముందున్న మహిళా మావోలు ఆయన్ని నిల్చోబెట్టగా ఇంతలో ఓ మహిళా మావోయిస్టు వెనుక నుంచి అతిదగ్గరగా తుపాకీతో కాల్చింది. అనంతరం ముగ్గురు మహిళా మావోయిస్టులు నాలుగు రౌండ్లు కాల్చడంతో కిడారి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఏడు రౌండ్లు గాలిలోకి కాల్చారు. అదే సమయంలో మరికొందరు మావోయిస్టులు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను పది అడుగుల దూరంలో ఉన్న గుంటసీమ రోడ్డులోని పనసచెట్టు వద్దకు తీసుకువెళ్లారు. ‘నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా ఓ మావోయిస్టును దారుణంగా చంపించావు. మాదెల పంచాయతీ బట్టివలసలోని క్వారీని మూసేయమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.. పైగా పారిపోయేందుకు యత్నించావు...’ అంటూ ఆయనపై తూటాల వర్షం కురిపించడంతో కుప్పకూలిపోయారు. అనంతరం మావోయిస్టులు గుంటసీమ రోడ్డు నుంచి స్వర్ణయిగుడ అటవీ ప్రాంతం మీదుగా వెళ్లిపోయారు. మలుపులో మందుపాతర... వాస్తవానికి లివిటిపుట్టు గ్రామ సరిహద్దులోనే ఎమ్మెల్యే కిడారి వాహనాన్ని పేల్చి వేసేందుకు మావోయిస్టులు మలుపు వద్ద మందు పాతరలు అమర్చారు. అయితే కిడారి భారీ బందోబస్తు లేకుండా రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి వాహనాన్ని అడ్డుకున్నారు. ఘటన అనంతరం కొందరు మిలీషియా సభ్యులు మావోయిస్టులు అమర్చిన మందుపాతర్లను తవ్వి తీసుకెళ్లారు. బాంబులు పెట్టిన చోట పెద్ద పెద్ద బండరాళ్లు ఉంచారు. సాయంత్రం దాకా వెళ్లని పోలీసులు ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపగా పోలీసులు సాయంత్రం వరకు ఘటనా స్థలానికి వెళ్లేందుకు కూడా సాహసించలేదు. హత్య జరిగిన వెంటనే కిడారి పీఏ అప్పారావు డుంబ్రిగుడ ఎస్సై అమనరావుకు ఫోన్లో విషయం తెలియచేయగా వస్తున్నామని అన్నారే గానీ ఒక్క కానిస్టేబుల్ కూడా వెళ్లలేదు. నాలుగు గంటలు ఘటనా స్థలంలోనే మృతదేహాలు పోలీసులు రాకపోవడంతో సుమారు నాలుగు గంటలు వేచి చూసిన కిడారి అనుచరులు, కార్యకర్తలు చివరికి ఎమ్మెల్యే వాహనమైన ఇన్నోవాలోనే ఆయన మృతదేహాన్ని, సోమ మృతదేహాన్ని ఆయన స్కార్పియో వాహనంలో అరకు పోలీస్స్టేషన్కు తరలించారు. వణికిపోయిన లివిటిపుట్టు మావోయిస్టుల మారణకాండతో లివిటిపుట్టు, సమీప గ్రామాలైన కొత్తవలస, తోటవలస, వంతర్డ, స్వర్ణాయిగూడ, సింధిపుట్టులో గిరిజనులు భయకంపితులయ్యారు. ఘటన జరిగిన లివిటిపుట్టులోని 30 కుటుంబాల్లో చాలామంది పక్క గ్రామాలకు పరుగులు దీశారు. ఈ ఘటన గురించి ప్రశ్నించిన వారికి తాము ఊళ్లో లేమని సమాధానం చెబుతున్నారు. -
విభజన తర్వాత పేలిన తొలి తూటా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనానంతరం ఓ ఎమ్మెల్యేపై మావోయిస్టులు తొలితూటాను పేల్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యానికి ఈ ఘటన అద్దం పడుతోంది. సరిగ్గా 6 నెలల క్రితం మావోయిస్టుల కదలికలపై ‘సాక్షి’ ముందుగానే హెచ్చరించినా పరిస్థితులను గ్రహించటంలో ప్రభుత్వం విఫలం కావడంతోనే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. 2014లో వైఎస్సార్ సీపీ గుర్తుపై విశాఖ జిల్లా ఎస్టీ నియోజకవర్గమైన అరకు శాసనసభ్యుడిగా గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు అనంతరం పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలో చేరడం తెలిసిందే. ఆయనకు విప్ పదవి ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం మావోయిస్టుల నుంచి కాపాడకోలేకపోయింది. దాడికి ఆర్కే వ్యూహ రచన ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏఓబీ) జోన్లోని మల్కన్గిరి, కోరాపుట్, బస్తర్(ఎంకేబీ) ఏరియాకు చెందిన మావోయిస్టు కీలక దళం ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. 65 మందికిపైగా మావోయిస్టు మిలటరీ ప్లాటూన్ థర్డ్ సీఆర్సీ (సెంట్రల్ రివల్యూషనరీ కంపెనీ) సభ్యులు ఇందులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు చెబుతున్నారు. ఒడిశాలో సాకేత్ పేరుతో షెల్టర్ పొందుతున్న అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే వ్యూహ రచనతోనే ఈ దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. రెండో గిరిజన ఎమ్మెల్యే.. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన వారిలో ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. 17 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రాగ్యానాయక్ హత్యకు గురికాగా ఇప్పుడు కిడారిని మావోయిస్టులు హతమార్చారు. ఉమ్మడి ఏపీలో ప్రజాప్రతినిధుల హత్యలు, కిడ్నాప్లు.. 1990 వరంగల్లో మాజీ మంత్రి హయగ్రీవాచారిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. 1991 మలక్పేట్ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ కిడ్నాప్. మావోయిస్టు నేత నెమలూరి భాస్కర్రావు విడుదలకు డిమాండ్. 1993 పెనుగొండ ఎమ్మెల్యే చెన్నారెడ్డి హత్య, మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే రంగదాసును హత్య చేశారు. 1995 నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట సుబ్బరామిరెడ్డిని దారుణంగా చంపారు. 1999 మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు,ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే పురుషోత్తంరావు హత్య. 2000 మార్చి 7న అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని మందుపాతర అమర్చి చంపేశారు. 2001 డిసెంబర్ 30న దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్ను కాల్చి చంపారు. అప్పటి కొల్లాపూర్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావుపై నక్సలైట్లు దాడిచేయగా గన్మెన్తో పాటు ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. 2003 అక్టోబర్ 24న తిరుపతి అలిపిరిలో చంద్రబాబుపై క్లే్లమోర్ మైన్స్ పేల్చి దాడికి పాల్పడ్డారు. 2005 ఆగస్టు 15న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై కాల్పులు జరిపి చంపారు. 2007 సెప్టెంబర్ 17న మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్రెడ్డిపై మావోయిస్టు పార్టీ ల్యాండ్మైన్లతో దాడిచేసింది. జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి తృటిలో తప్పించుకున్నారు. -
మహిళా యాక్షన్ టీం పనేనా?
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను హతమార్చింది మావోయిస్టు మహిళా యాక్షన్ టీం పనేనని అనుమానిస్తున్నారు. డుంబ్రిగుడ మండలం తొట్టంగి వద్ద వారిని అటకాయించిన మావోల్లో 30 మందికిపైగా మహిళలే ఉన్నారని, వీరిలో సాయుధులైన మహిళా మావోయిస్టులే ఎక్కువగా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మావోయిస్టుల్లో మహిళా యాక్షన్ టీం సభ్యులు నిబద్ధతతో, చురుగ్గా ఉంటారని పేరు. వీరు ఎన్కౌంటర్లలో గాని, సాయుధ దాడుల్లో గాని వెనకడుగు వేయరని, అందుకే వీరికి దళంలో అధిక ప్రాధాన్యం ఉంటుందని చెబుతారు. ఈ మహిళా యాక్షన్ టీంలో ఏపీకంటే ఛత్తీస్గఢ్, ఒడిశాలకు చెందిన వారే అధికంగా ఉంటారని తెలుస్తోంది. కాల్పుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన మహిళా యాక్షన్ టీమ్ సభ్యులు పాల్గొని ఉంటారని పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. విలీన వారోత్సవాల ఆరంభంలోనే! సీపీఐ ఎంఎల్ పీపుల్స్వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ), మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ)లు విలీనమై 2004 సెప్టెంబర్ 21న సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించాయి. అప్పట్నుంచి ఏటా సెప్టెంబర్ 21 నుంచి వారం రోజులపాటు మావోయిస్టులు విలీన వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఏటా జూలై 28 నుంచి వారం పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కూడా జరుపుతుం టారు. అలాగే డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వారోత్సవాల సమయంలో తమ ఉనికిని చాటుకోవడానికి విధ్వంసాలకు పాల్పడటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇన్ఫార్మర్లను హతమార్చడం వంటి దుశ్చర్యలకు దిగుతుంటారు. అందువల్ల ఆయా సమయాల్లో పోలీసులు అప్రమత్తమవుతారు. ప్రజాప్రతినిధులను మన్యంలోకి వెళ్లవద్దని సూచిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ దళాలతో కూంబింగ్, గాలింపు చర్యలు వంటివి ఉధృతం చేస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న విలీన వారోత్సవాలను పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. ఇదే అదనుగా మవోలు వారిని చంపగలిగారని చెబుతున్నారు. ఏవోబీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ప్రజా కోర్టు పెట్టి కాల్చివేత లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి కిడారి సర్వేశ్వరరావు, సోమలతో పాటు వెళ్లిన అరకు మాజీ సర్పంచ్ చటారి వెంకటరాజు కళ్ల ముందే.. మావోయిస్టులు హతమార్చారు. మావోలను చూసి లివిటిపుట్టులోని ఓ ఇంటిలోకి వెంకటరాజు పరుగులు తీశారు. ఆయన్ని పట్టుకుని మావోయిస్టులు రోడ్డు మీదకు తీసుకువచ్చారు. దీంతో అతను విలవిల్లాడిపోయి తనను ఏమీ చేయొద్దని మావోలను శరణువేడాడు. కొద్ది నిమిషాలు ప్రజా కోర్టు పెట్టి ఆయన ఎదురుగా ఒకరి తరువాత ఒకరిని కాల్చి చంపారు. కిడారికి పలుమార్లు హెచ్చరికలు ఎమ్మెల్యే కిడారి కొంతకాలంగా ఏజెన్సీలో మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. హుకుంపేట మండలం గూడలో నల్లరాయి క్వారీని ఎమ్మెల్యే తన అనుచరుల చేత నడుపుతున్నారు. ఇక అనంతగిరి మండలంలోని నిమ్మల పాడు క్వారీలో ఆయనకు వాటాలున్నట్లు సమాచారం. గూడ క్వారీలోని పేలుళ్లతో తమ గ్రామానికి ప్రమాదం ఉందని, ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గత 3 నెలల నుంచి గూడ గిరిజనులు ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వారీ మూసివేయాలనే డిమాండ్తో ఉద్యమం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్వారీ వ్యాపారాన్ని మానుకోవాలని మావోయిస్టులు గత కొంతకాలంగా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. గ్రామదర్శినికి వెళ్లవద్దన్నా కిడారి వినలేదు విశాఖ క్రైం/సామర్లకోట(పెద్దాపురం): తమ ఉనికి కాపాడుకోవడం కోసమే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, సోమను మావోయిస్టులు హత్య చేశారని ఏపీ హోం మంత్రి చిన్నరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం ఆయన తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలున్న ప్పటికీ.. ఏపీలో మాత్రం ఇప్పటివరకూ లేవన్నారు. రాష్ట్రంలో కూడా ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ హత్యలు చేశారన్నారు. ఈ దాడిలో 50 మంది మావోలు పాల్గొన్నారని చెప్పారు. విస్తృతంగా కూంబింగ్ నిర్వ హిస్తున్నట్టు తెలిపారు. మావోల వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని.. గ్రామదర్శినికి వెళ్లవద్దని పోలీసులు సూచించినా వినకుండా ఆయన వెళ్లారన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేశ్వరరావు, సోమ మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం సోమవారం అరకులోయలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చినరాజప్ప తెలిపారు. అక్కడే స్థూపం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
కిడారి, సోమ హత్యలపై స్థానికుల్లో పెల్లుబికిన ఆగ్రహం
-
అరకు ఘటనపై సోమ గన్మెన్ ఏం చెప్పారంటే
సాక్షి, విశాఖపట్నం : వేల కోట్లు దోచుకుతింటున్నారు, ఎంత మంది వద్దని చెప్పినా వినరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపారని ప్రత్యేక్ష్య సాక్షి, సోమ గన్మెన్ స్వామి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిడారి, సివేరిలను చంపే ముందు 20 నిమిషాలు మావోయిస్టులు మీటింగ్ పెట్టారని తెలిపారు. ‘మావోయిస్టులు మా కార్లను అడ్డుకున్నారు. మా అందరిని రౌండప్ చేసి ఆయుధాలను లాక్కున్నారు. అనంతరం కొంచెం దూరంగా వెళ్లి 20 నిమిషాలు పాటు మీటీంగ్పెట్టారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారారని కిడారి, సివేరిలపై మావోయిస్టులు మండిపడ్డారు. ఏజెన్సీ భూముల్లో బాక్సైట్ తవ్వకాలకు ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతుతో మూడు క్వారీలు నడుపుతున్నారు, వేల కోట్లు దోచుకుంటున్నారు’ అని చెబుతూ ఇద్దరిపై ఒకేసారి కాల్పులు జరిపారని స్వామి పేర్కొన్నారు. -
కిడారి, సోమ హత్యలపై స్థానికులు ఆగ్రహం
-
పోలీస్ స్టేషన్లపై సోమ అనుచరుల దాడి
సాక్షి, విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి అనుచరులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. డుంబ్రి గూడ పోలీసుస్టేషన్కు నిప్పంటించారు. పోలీసుల నిర్లక్ష్యమే సోమ హత్యకు కారణమని నినాదాలు చేశారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ఈ దాడిలో పోలీస్టేషన్ల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసయ్యాయి. ఓ కానిస్టేబుల్పై సోము అనుచరులు భౌతికంగా దాడిచేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. -
మా అందరిని రౌండప్ చేసి ఆయుధాలను లాక్కున్నారు
-
అరకు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలపై ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను మావోయిస్టులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు, హత్యలకు తావు లేదన్నారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
గన్మెన్ల ఆయుధాలు తీసుకొని బెదిరించి..
-
మమ్మల్ని గన్స్తో రౌండప్ చేశారు: ఎమ్మెల్యే డ్రైవర్
సాక్షి, విశాఖపట్నం : తమని తుపాకులతో రౌండప్ చేసి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దూరంగా తీసుకెళ్లి మావోయిస్టుల కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము కారు డ్రైవర్ కే చిట్టిబాబు మీడియాకు తెలిపారు. తమ వాహనాలను అడ్డగించిన మావోయిస్టులు.. గన్మెన్ల ఆయుధాలు తీసుకొని తమని దూరంగా తీసుకెళ్లారన్నారు. అనంతరం కారుల్లో నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దింపి చేతులను వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ మరికొంత మంది మావోయిస్టులు దూరంగా తీసుకెళ్లారని తెలిపారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే కాల్చిపారేస్తామని మా దగ్గర కాపలా ఉన్నవారు బెదిరించినట్లు చిట్టిబాబు పేర్కొన్నారు. అనంతరం వారిపై జరిపిన కాల్పులు శబ్దం వినబడ్డాక మమ్మల్ని వదిలేసారని, వారెన్ని అక్రమాలు చేశారో తెలుసా అని తమను ప్రశ్నించారని చిట్టిబాబు చెప్పారు. -
గన్మెన్ల తుపాకులు లాక్కొని చంపారు : డీఐజీ
సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారని విశాఖ డీఐజీ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దాదాపు 20మంది మవోయిస్టులు ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు.ఎమ్మెల్యే గన్మెన్లను దూరంగా పంపి వారి వద్ద ఉన్న తుపాకులను లాక్కున్నారు. అనంతరం సర్వేశ్వరావు, సోమలను కిరాతంగా కాల్చి చంపారు. రెండు టీమ్లుగా ఏర్పాడ్డ మావోలు మొదటగా సోమను కాల్చి చంపారు. అనంతరం సర్వేశ్వరావును కాల్చారు. ఒడిశాకు 15 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఫైర్ తర్వాత మావోయిస్టులు పారిపోయారు.మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. దీనిపై పూర్తి విచారణ జరుపుతాం’ అని డీఐజీ శ్రీకాంత్ పేర్కొన్నారు. అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాల పోలీసులు అరకు ఘటనతో తెలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు రూరల్ ఏరియాల్లోకి వెల్లోద్దని సూచించారు. తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పర్యటనల వివరాలు ఇవ్వాలని తెలంగాణ పోలీసులు కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా పెంచారు. ఎజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు భద్రత పెంచతున్నట్లు ప్రకటించారు. -
‘మా నాన్నను ఎందుకు చంపారో తెలియదు’
ఢిల్లీ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడంపై ఆయన కుమారుడు నాని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన తండ్రిని మావోయిస్టులు ఎందుకు చంపారో తెలియదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మావోయిస్టుల నుంచి తమకు ఎప్పుడు హెచ్చరికలు రాలేదని, నాన్న కూడా ఎప్పుడూ ఈ ప్రస్తావన తీసుకురాలేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సర్వేశ్వరరావు కుమారుడు నాని..దాడి గురించి తెలుసుకున్న వెంటనే విశాఖకు బయల్దేరారు. ఆదివారం అరకు లోయలో కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం. -
క్వారీ వివాదమే ఎమ్మెల్యే హత్యకు కారణమా..?
సాక్షి, విశాఖపట్నం : ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఆదివారం ఉదయం దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే హత్యకు క్వారీ వివాదమే కారణమని తెలుస్తోంది. కిడారికి చెందిన గూడ క్వారీని మూసివేయాలని మావోయిస్టులు పలుమార్లు ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలనే డిమాండ్ స్థానికుల నుంచి కూడా వ్యక్తమైంది. ఈ విషయంలో ఎమ్మెల్యే మావోయిస్టులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో మావోయిస్టులు తన మైనింగ్ దగ్గరకు వెళ్తున్న ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరు సోముపై కాల్పులు జరిపారు. అయితే ఎమ్మెల్యే కిడారి పర్యటనపై తమకు సమాచారం లేదని స్థానికు పోలీసులు తెలిపారు. చదవండి: మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత -
అరకు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోయిస్టులు
-
మావోయిస్టుల ఘాతుకం: అరకు ఎమ్మెల్యే కాల్చివేత
సాక్షి, విశాఖపట్నం: అరకు లోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు (43) కన్నుమూశారు. ఆయనతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి అనంతరం టీడీపీలో చేరారు. కిడారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ నిర్ధారించారు. మావోయిస్టులు హిట్ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. తన క్వారీ మైనింగ్ వద్దకు వెళ్తున్న సమయంలో కిడారి, ఆయన అనుచరులపై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. గతంలోనూ పలుసార్లు కిడారిని మావోయిస్టులు బెదిరిస్తూ వచ్చారు. దాడి అనంతరం మావోయిస్టులు ఎటువెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. దాడి గురించి తెలియగానే బాధపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ ఓ ప్రకటననువిడుదల చేశారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యన్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను కొనియాడిన సీఎం.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలన్నారు. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్- కిడారి సర్వేశ్వరరావు
-
ప్రభుత్వ స్థలాలను అప్పనంగా కొట్టేస్తున్న ఎమ్మెల్యే
-
విప్ ఊరు.. ఉప్పు నీరు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, పెదబయలు : అరకు నియోజకవర్గం.. పెదబయలు మండలం.. గిన్నెలకోట పంచాయతీ నడిమివాడ గ్రామం... తొమ్మిది కుటుంబాలు, 55 మంది జనాభా ఉన్న మన్యంలోని అతి చిన్న పల్లెల్లో ఒకటి. ఒకప్పుడు 35కుటుంబాల వారు నివాసమున్నప్పటికీ అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న గుండాలగరువుకు వెళ్ళిపోయారు. కానీ ఆ 9 కుటుంబాల గిరిజనులు మాత్రం అక్కడే దశాబ్దాలుగా నివాసముంటున్నారు. ఇప్పుడు ఆ చిన్న పల్లె గురించి ప్రస్తావన ఎందుకుంటే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సొంతూరు అది. అక్కడే ఆయన పుట్టి పెరిగారు. ఆ తర్వాత కిడారి కుటుంబం జి.మాడుగుల మండలం కిల్లంకోట గ్రామానికి వలస వెళ్ళిపోయింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో ఎమ్మెల్సీ, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో అరకు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శాసనసభ్యుడైన తొలి నాళ్ళలోనే ఆయన తన సొంతూరు నడిమివాడకు వచ్చి పల్లె రూపురేఖలు మారుస్తానని హామీనిచ్చారు. ఇక్కడే నివాసముంటున్న గిరిజనులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. అప్పుడు ఆయన మాటలకేమో గానీ తమ పల్లె బిడ్డ ఎమ్మెల్యే అయినందుకు ఆ గ్రామస్తులు మురిసిపోయారు. సంబరం చేసుకున్నారు. అంతే... అక్కడితో కిడారి ఆ ఊరి సంగతే మరచిపోయారు. నాలుగేళ్ళుగా ఊరివైపు కన్నెత్తి చూడలేదు.. 2016లో కిడారి తన నయవంచన రూపాన్ని బయటపెట్టారు. రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ పంచన చేరారు. కేవలం అభివృద్ధి కోసమే ఫిరాయిస్తున్నట్టు చెప్పారు. ఆ సందర్భంలో మళ్ళీ ఊరి ప్రస్తావన తెచ్చారు. నడిమివాడను వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. కానీ షరా మామూలుగానే పట్టించుకోలేదు. ఇక ఆర్నెల్ల కిందట ప్రభుత్వ విప్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీకి ద్రోహం చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ ఆయనకు క్యాబినెట్ హోదాతో విప్ పదవిని ఇచ్చింది. కనీసం ఆ పదవిలోకి వచ్చిన తర్వాతైనా ఆ ఊరి గురించి పట్టించుకుంటారని భావించిన గ్రామస్తుల ఆశలు అడియాసలే అయ్యాయి. ఇంకా దారుణమేమిటంటే ఈ నాలుగేళ్ళలో మళ్ళీ ఆ ఊరివైపు ఆయన కన్నెత్తి చూడలేదు. ఎప్పుడైనా ఆయన అరకు అరుదెంచిన సందర్భాల్లో నడిమివాడ గ్రామస్తులు కలిసి మొరపెట్టుకున్నా కనీసంగా కూడా పట్టించుకోలేదు. గ్రామం పరిస్థితి ఎలా ఉందంటే.... ఒక్కోసారి వంటకు వర్షపు నీరే గతి. నడిమివాడలో గ్రామస్తులు తాగేందుకు మంచినీటి సరఫరా కూడా లేదు. రెండేళ్ల క్రితం వరకు పుట్టపర్తి సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి గ్రావిటీ పథకం ద్వారా నీరు వచ్చేది. కానీ ఆ పైపు లైన్లలో అవాంతరాలు రావడంతో ప్రస్తుతం ఆ నీరు కూడా సరిగ్గా రావడం లేదు. దీంతో గ్రామస్తులు ఊట గెడ్డ( వాగు) నీటిపైనే ఆధారపడుతున్నారు. ఆ నీరు ఉప్పగా ఉన్నా... ఎలా ఉన్నా... అదే వారికి దిక్కు. ఇక వర్షాకాలాల్లో ఊటగెడ్డకు బురద నీరు చేరితే... చివరికి ఇంటి పైకప్పు నుంచి పడిన వర్షం నీటితో వండుకుని తిన్న రోజులే ఎక్కువని గ్రామస్తులు చెబుతున్నారంటే అక్కడి దయనీయ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. నెలకు 20 రోజులు అంధకారమే గ్రామానికి పేరుకు మాత్రమే విద్యుత్ సౌకర్యం ఉంది గానీ... నెలలో 20రోజులు కరెంటు రాదు. ఇక వర్షాకాలంలో నెలల తరబడి రాత్రిళ్ళు చీకట్లోనే మగ్గాలి. గతంలో కిరోసిన్ సక్రమ సరఫరా వల్ల ఆ బుడ్డీలన్నీ వెలిగించుకునే వాళ్ళమని, ఇప్పుడు కిరోసిన్ కోటాలో కోతతో చాలా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రమిదల్లో రిఫైండ్ అయిల్ వేసి దీపంలో వెలుగులో ఉండాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. అర్హులు ఉన్నా... మంజూరు కాని పెన్షన్లు గ్రామంలో వృద్ధాప్య పింఛను, వికలాంగ పింఛన్ కోసం ఐదుగురు అర్హులు గడుతూరి రామూర్తిపడాల్, గడుతూరి దేవుడమ్మ,మ తమర్భ జంగంరాజు, గడుతూరి హరినాధ్ పడాల్, తమర్భ చంద్రమ్మలు ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా... నేటికీ మంజూరు కాలేదు. గ్రామంలో మహిళలు శ్రీకోరబమ్మ ఎస్హెచ్జీ ఏర్పాటు చేసుకుని పదేళ్ల నుంచి పొదుపు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తరఫున సాయం మాత్రం అందడం లేదు. మొత్తం గ్రామంలో 9 కుటుంబాలు ఉంటే.. మూడు కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. ఊరికి రోడ్డే లేదు.. నడిమివాడ వెళ్ళేందుకు కనీసం రోడ్డు లేదు. గ్రామస్తులు కష్టపడి ఏర్పాటు చేసుకున్న కాలిబాట వర్షాకాలంలో పనికిరాదు. బొయితిల పంచాయతీ చామగెడ్డ జంక్షన్ నుంచి 5 కిలో మీటర్ల మేర మట్టి రోడ్డు ఉంది. వాస్తవానికి ఆ మట్టి రోడ్డు కూడ అధ్వాన్నమే. ఆ మట్టిరోడ్డు నుంచి కిలో మీటర్ దూరం కాలిబాటలోనే నడిమివాడకు వెళ్ళాలి. ఇక ఊరికి ఆనుకుని ఉన్న గెడ్డపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో గెడ్డలు పొంగిన సందర్భాల్లో చుట్టు పక్కల గ్రామాలతో సంబంధాలు తెగిపోతుంటాయి. కనీస వసతులు కల్పించండి చాలు.. గ్రామానికి కనీస సౌకర్యాలైన రోడ్డు, తాగునీరు, పక్కా గృహాలు, అర్హులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, రేషన్కార్డులు మంజూరు చేయాలి. ఇవన్నీ ఎమ్మెల్యే తలచుకుంటే వెంటనే అయిపోతాయి.. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. – కిడారి వినాయక కృష్ణమూర్తి, రైతు, నడిమివాడ గ్రామం -
ఏపీ ప్రభుత్వం వింత పోకడ
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వింత పోకడలు పోతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన టీడీపీ సర్కారు మరోసారి అలాంటి పనే చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు అసెంబ్లీలో విప్ పదవి కట్టబెట్టింది. ఆయనతో పాటు విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే గణబాబును విప్గా నియమించింది. శాసనమండలిలో విప్లుగా బుద్ధా వెంకన్న, ఎంఎ షరీఫ్, రామసుబ్బారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్లను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన సర్వేశ్వరరావుకు విప్ పదవి ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు తీరును న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. విపక్ష ఎమ్మెల్యేకు ప్రభుత్వంలో పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ విమర్శించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్టు గుర్తు చేసింది. -
'ఆదిమ జాతి అంతరిస్తుంది'