Meghan Markle
-
ప్రిన్స్ హ్యారీ, భార్య మేఘన్ల మధ్య విభేదాలు తలెత్తాయా?
బ్రిటన్ రాజు చార్లెస్ III చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మర్క్లేల మధ్య విభేదాలు తలెత్తాయా? అందుకే వారిద్దరి మధ్య దూరం ఏర్పడిందా? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు.అందుకు ఊతం ఇచ్చేలా మేఘన్ తన జీవితం ‘తాను అనుకున్నట్లుగా లేదని’, కాబట్టే ఆమె ఆందోళన చెందుతోందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ప్రముఖ ఆథర్ టామ్ క్విన్ ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మార్క్లేల మధ్య దూరం పెరిగిపోతుంది. మేఘన్ తాను కోరుకున్నట్లు తన జీవితం లేదని బాధపడుతోంది. ఎందుకంటే తనకు మీడియా అటెన్షన్ అంటే బాగా ఇష్టం. అయితే ఇటీవల కాలంలో పలు సర్వేలు హ్యారీని,మేఘన్ను పెద్దగా పట్టించుకోవడం లేదనే రిపోర్ట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీనికి తోడు 2020లో హ్యారీ దంపతులు రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుని అమెరికాలో కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ మొదట్లో కాలిఫోర్నియాలో హ్యారీ దంపతులకు అపూర్వ ఆదరణ లభించిందని, సినీరంగానికి చెందిన (హాలీవుడ్) ప్రముఖులు వారితో స్నేహం కోసం క్యూకట్టినట్లు పలు మీడియా రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ, వారి ప్రజాదరణ తగ్గుముఖం పట్టిందని సర్వేలు హైలెట్ చేశాయి. మేఘనా మార్క్లే ‘అమెరికాలో రివేరా ఆర్చర్డ్’ అనే ఆహార ఉత్పత్తుల బ్రాండ్ను లాంచ్ చేశారు. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతరమయ్యారు. ఎందుకంటే ఆమె రివే ఆర్చర్డ్స్ ఆహార ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. కానీ వాటిల్లో అంత నాణ్యత లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శల్ని తాను తట్టుకోలేకపోయారు. అమెరికాలో మేఘన్ విలాసవంతమైన జీవనశైలిపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. ఈ అంశం ఆమెకు అస్సలు మింగుడు పడడం లేదు. ఈ వరుస పరిణామాలు తాను అనుకున్నట్లు తన జీవితం లేదని మేఘన బాధపడుతుందని ఆథర్ టామ్ క్విన్ చెప్పారు. దీనికి తోడు ప్రిన్స్ హ్యారీని మేఘన్ను విసిగిస్తుందనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యారీకి యూకేలోని తన స్నేహితులు అంటే చాలా ఇష్టం. వారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండేవారు. కానీ హ్యారీ వారిని కలుసుకోవడం మేఘన్కు అస్సలు ఇష్టం ఉండదు. బహుశా ఈ తరహా వ్యక్తిగత భేదాభిప్రాయాల కారణంగా ప్రిన్స్ హ్యారీ అతడి భార్య మేఘన్ మర్క్లేల మధ్య దూరం పెరిగిపోతుందని పరోక్షంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. -
హాట్టాపిక్గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
బ్రిటన్ రాజు చార్లెస్ III చిన కుమారుడు ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ మర్క్లే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ జంట 2020లో రాజకుంటుంబ సభ్యలు హోదాను వదులుకుంటున్నట్లు ప్రకటించి ఈ జంట వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత అడపాదడపా కార్యక్రమాల్లో కెమెరా కంట చిక్కుతూ వార్తల్లో నిలవడం జరిగింది. ఈ సారి ఏకంగా రాజ కుటుంబానికి రాయల్టీ లుక్ని ఇచ్చే గౌనుని ధరించడం హాట్టాపిక్గా మారింది. రీజన్ ఏంటంటే..డచెస్ ఆఫ్ సస్సెక్స్గా పేరుగాంచిన మేఘన్ ఈ లేత గోధుమ రంగు గౌనుని డిజైనర్ హెడీ మెరిక్ చేత డిజైన్ చేయించుకుంది. డిజైనర్ ప్రకారం ఈ గౌను పేరు విండ్సర్ గౌన్ బ్లష్. విండర్స్ అనేది రాజ కుటుంబం చివరి పేరు. మేఘన్ మార్క్లే ప్రిన్స్ హ్యారీ శుక్రవారం నైజీరియా చేరుకున్నారు. దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆహ్వానం నేపథ్యంలో అక్కడ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆ దేశంలోని తమ మొదటి పర్యటన నిమిత్తం ఇలా మేఘన్ మార్క్లే ఈ గౌనులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రాజరికం హోదాను వదులుకున్నప్పుడూ మళ్లీ రాజరకిపు దుస్తులు ధరించడం ఏంటని సర్వత చర్చలు మొదలయ్యాయి. కాగా, ఈ జంట 2018లో హ్యారీ అమ్మమ్మ దివంగత క్వీన్ ఎలిజబెత్II వివాహ కానుకగా ఇచ్చిన బకింగ్హామ్ ప్యాలెస్లోని విండ్సర్ ఎస్టేట్లో నివశించేవారు. గతేడాది జూన్లోనే ఈ ఇంటిని ఖాళీ చేశారు. అయితే కింగ్ చార్లెస్ మేఘన్కి అత్యున్నత గౌరవం ఇద్దా అనుకుంటున్న కొద్ది క్షణాల ముందే ఈ దంపతులు రాజకుటుంబ విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.(చదవండి: 101 ఏళ్ల ఫ్రెంచ్ యోగా టీచర్! 50 ఏళ్ల వయసులో..!) -
గొంతును ఏమార్చారు, ఒరిజినల్గా నమ్మించారు
బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ అతని భార్య మేఘన్ మార్కెల్లు ప్రముఖ పాడ్కాస్ట్ సంస్థ స్పాటిఫై నుంచి వైదొలగిన విషయం విదితమే. అయితే, ఆ తదనంతరం వారు ప్రారంభించిన ‘ఆర్కిటైప్స్’ పాడ్కాస్ట్ కోసం మేఘన్ చేసినట్టు చెబుతున్న ఇంటర్వ్యూలు ఆమె చేసినవి కాదని ఒక రిపోర్టులో వెల్లడయ్యింది. షోలోని కొన్ని ఇంటర్వ్యూలను డచెస్ సిబ్బంది చేశారని పాడ్న్యూస్ తెలిపింది. ప్రశ్నలు అడుగుతున్న ఆమె వాయిస్ ఆడియోను ఇంటర్య్యూ మధ్యలో క్లిప్ చేశారని ఆరోపించారు. కాగా స్పాటిఫై, ఆర్కివెల్ పరస్పరం విడిపోవడానికి అంగీకరించాక వారు కలిసి చేసిన సిరీస్ గురించి గర్వపడుతున్నామని ఆ సంస్థలు సంయుక్త ప్రకటన చేసిన కొద్దిసేపటికే మేఘన్పై ఆరోపణలతో కూడిన ఈ వార్త వెలువడింది. హ్యారీ, మేఘన్ ప్రారంభించిన ఆర్కివెల్ మీడియా సంస్థ 2020లో $20 మిలియన్ల డీల్కు సంబంధించిన పూర్తి చెల్లింపును అందుకునేందుకు తగినంత కంటెంట్ను ఉత్పత్తి చేయలేదని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే మేఘన్ మరొక ప్లాట్ఫారమ్లో ‘ఆర్కిటైప్స్’ ప్రేక్షకుల కోసం మరింత కంటెంట్ను అందిస్తున్నారని ఆర్కివెల్ ప్రొడక్షన్స్ ప్రతినిధి వాల్స్ట్రీట్ జర్నల్కు తెలిపారు. ఈ విషయంలో స్పోర్ట్స్ రైటర్, పాడ్కాస్టర్ బిల్ సిమన్స్ ఈ జంటపై విరుచుకుపడ్డాడు. తాను ఒకసారి హ్యారీని పాడ్కాస్ట్ విషయమై కలిశానని తెలిపాడు. ఈ పాడ్కాస్ట్ ఆడియోలో డచెస్ ఆఫ్ సస్సెక్స్ నుండి వచ్చిన వ్యాఖ్యల మధ్య యారో వివరణలు, వ్యాఖ్యలు జతచేశారు. అవి అల్లినవి, డైలీ మెయిల్ నవంబర్లో నివేదించినవని తేలింది. రాజ దంపతులు రెండు సంవత్సరాల క్రితం స్పాటిఫైతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత బయటకు వచ్చేశారు. అప్పటికి కేవలం 12 ఎపిసోడ్లు మాత్రమే రూపొందాయి. జమీలా జమీల్, సెరెనా విలియమ్స్, ప్యారిస్ హిల్టన్, మిండీ కాలింగ్తో సహా పలువురు అతిథులతో సంభాషణలతో పాటు నిర్దిష్ట అంశాల గురించి మాట్లాడే నిపుణులు, విద్యావేత్తలు, రచయితల క్లిప్లు ఉన్నాయి. నిపుణుల ఆడియో క్లిప్లు మేఘన్ ఆడియో మధ్య జత చేసి ఉన్నాయి. దీంతో ఆమె స్వయంగా కొందరితోనైనా మాట్లాడారా? లేదా అందరితో మాట్లాడారా అనేది స్పష్టంగా వెల్లడికాలేదు. ఇది కూడా చదవండి: లాలాజలంతో ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్ -
ప్రిన్స్ హ్యారీ దంపతుల్ని వేటాడిన కెమెరాలు!.. కొద్దిలో తప్పిన ప్రమాదం
న్యూయార్క్: అమెరికాలో ఓ దాతృత్వ కార్యక్రమానికి వెళ్లొస్తున్న బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, భార్య మెఘాన్, అత్త డోరియా రాగ్లాండ్లను మీడియా ఫొటోగ్రాఫర్లు ఫొటోల కోసం వెంబడించారు. ఇది పాతికేళ్ల క్రితం హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానాను పారిస్లో కెమెరామెన్లు వాహనాల్లో వెంబడించడం అది విషాదాంతమవడాన్ని గుర్తుచేసింది. ‘ఆరు వాహనాల్లో మీడియా వ్యక్తులు ఏకంగా రెండు గంటలపాటు హ్యారీ వాహనాన్ని వెంబడించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలు వాహనాలు దాదాపు గుద్దుకున్నంత పని జరిగింది. ఈ ఘటనలో పలు వాహనాలు, పాదచారులు, ఇద్దరు న్యూయార్క్ పోలీసు అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు’ అని హ్యారీ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. ఘటన తర్వాత పోలీస్ రక్షణలో వారు వెళ్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే అధికారికంగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని న్యూయార్క్ పోలీసు విభాగం ప్రకటించింది. లండన్లో బ్రిటన్ రాజుగా చార్లెస్ పట్టాభిషేకÙకం తర్వాత దాదాపు నెలరోజుల తర్వాత తొలిసారిగా ఈ జంట మీడియా కంటపడటంతో మీడియా అత్యుత్సాహం చూపి ఉంటుందని వార్తలొచ్చాయి. చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి -
రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై కీలక ప్రకటన
లండన్: బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే, చార్లెస్–3 పట్టాభిషేకం సందర్బంగా అందరి ఫోకస్ రాజకుటుంబం మీదే ఉంది. ఈ నేపథ్యంలో, రాచరికాన్ని వదులుకున్న చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ ఈ కార్యక్రమానికి వస్తారా..? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది. పట్టాభిషేక మహోత్సవానికి హ్యారీ వస్తున్నట్లు తెలిపింది. అయితే మేఘన్ మాత్రం హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించింది. ‘రాజు పట్టాభిషేక మహోత్సవానికి డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ హాజరవుతారు.. కానీ, ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు అని ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది’. ఇదిలా ఉండగా.. మేఘన్-హ్యారీ దంపతులకు ఇద్దరు సంతానం. ఆర్కీ, లిలిబెట్. అయితే, రాజు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేండ్లు పూర్తవుతాయి. ఇక, రాజకుటుంబంతో విభేధాల కారణంగా చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజరికాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీకి విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ బ్రిటన్ రాజకుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. మరోవైపు.. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు శుక్రవారం లండన్కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. Prince Harry will be attending the #coronation today, but Meghan Markle has remained in California with their children.https://t.co/LfDJkI6e7i pic.twitter.com/PQYLkr68tI — Newsweek (@Newsweek) May 6, 2023 ఇది కూడా చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్ల వర్షం -
నా భార్యకు రాజకుటుంబం క్షమాపణ చెప్పాలి
లండన్: బ్రిటన్ రాజకుటుంబం నుంచి క్షమాపణకు తన భార్య మేఘన్ మెర్కెల్ అర్హురాలని ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ తేల్చిచెప్పారు. తన భార్యను మానసికంగా వేధింపులకు గురిచేశారని, ఆమెకు క్షమాపణ చెప్పాలని రాజకుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఆయన తాజాగా డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. బ్రిటిష్ మీడియా తన భార్య మెర్కెల్ను అనవసరంగా ట్రోల్ చేస్తోందని విమర్శించారు. తన వదిన కేట్ మిడిల్టన్ పట్ల జనంలో సానుకూలత పెంచాలన్నదే మీడియా యత్నమని ఆరోపించారు. రాజకుటుంబాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. రెండు పుస్తకాలకు సరిపడా సమాచారం తన వద్ద ఉందని, అదంతా బయటపెట్టి తన తండ్రిని, సోదరుడిని ఇబ్బంది పెట్టాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు. తనకు, తండ్రికి, సోదరుడికి మధ్య జరిగిన విషయాలన్నీ బయటపెడితే వారు తనను ఎప్పటికీ క్షమించబోరని అన్నారు. తండ్రి, సోదరుడు తన పట్ల దారుణంగా వ్యవహరించారని, అయినప్పటికీ వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వారితో కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను వారి నుంచి కేవలం జవాబుదారీతనం, తన భార్యకు క్షమాపణను మాత్రమే కోరుకుంటున్నానని ప్రిన్స్ హ్యారీ స్పష్టం చేశారు. ఆయన ఇటీవలే తన ఆత్మకథ ‘స్పేర్’ను విడుదల చేశారు. ఇందులో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. రాజకుటుంబంలో తనకు ఎదురైన చాలా అవమానాలను ‘స్పేర్’ పుస్తకంలో చేర్చలేదని ప్రిన్స్ హ్యారీ చెప్పారు. -
నా అన్న కాలర్ పట్టి కొట్టాడు: ప్రిన్స్ హ్యారీ
శాక్రమెంటో: బ్రిటన్ రాజకుటుంబంలో కుటుంబ కలహాలు సమసిపోయి అంతా సర్దుకుంటుందనుకుంటున్న సమయంలో.. మరో పరిణామం చోటు చేసుకుంది. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, ప్రిన్స్ హ్యారీ సంచలనాలకు తెర తీశాడు. తన ఆత్మకథ ‘స్పేర్’ ద్వారా బయటి ప్రపంచానికి రాజ‘కుటుంబ’ కలహాలను పూసగుచ్ఛినట్లు వివరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన అన్న, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన విలియమ్ తనపై భౌతిక దాడికి దిగాడని, అందుకు తన భార్య మేఘన్ మార్కెల్ కారణమని చెబుతూ పెద్ద షాకే ఇచ్చాడు. ది గార్డియన్ కథనం ప్రకారం.. స్పేర్ ఆత్మకథలోని ఆరో పేజీలో ప్రిన్స్ హ్యారీ ఈ విషయాన్ని తెలియజేశాడు. మేఘన్ మార్కెల్ విషయంలో తన అన్నతో తనకు వాగ్వాదం జరిగిందని, పట్టరాని కోపంతో విలియమ్ తనపై దాడికి దిగాడని హ్యారీ అందులో పేర్కొన్నాడు. మేఘన్ స్వభావాన్ని ఉద్దేశించి విలియమ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే.. తన భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆమెకు మద్దతుగా హ్యారీ ఏదో సర్ది చెప్పబోయాడట. ఈ క్రమంలో సహనం కోల్పోయిన విలియమ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. హ్యారీ గల్లా పట్టుకుని.. మరో చేత్తో మెడలో గొలసును లాగిపడేశాడు. హ్యారీని నేలకేసి కొట్టాడు. కింద.. కుక్కకు భోజనం పెట్టే పాత్ర తగిలి హ్యారీ వీపుకు గాయమైంది. కష్టంగానే పైకి లేచిన ప్రిన్స్ హ్యారీ.. బయటకు వెళ్లిపోమని విలియమ్ మీదకు అరిచాడు. కోపంగానే విలియమ్ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ పరిణామంతా చాలా వేగంగానే జరిగింది. ఈ ఘటనలో హ్యారీ వీపునకు అయిన గాయం మానడానికి నెలలు పట్టింది అని ఆ కథనం ఆ పేజీ సారాంశాన్ని తెలిపింది. ఇంకా ఈ బుక్.. ఎన్నో ఆసక్తికరమైన, రాజకుటుంబం నుంచి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తేనుందని గార్డియన్ కథనం పేర్కొంది. జనవరి 10వ తేదీన స్పేర్ మార్కెట్లోకి రీలీజ్ కానుంది. గత సెప్టెంబర్లో తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం, ఈ మే నెలలో తండ్రి కింగ్ ఛార్లెస్-3కి పట్టాభిషేకం దరిమిలా.. మధ్యలో ఈ అన్నదమ్ముల ఘర్షణ గురించి వెలుగులోకి రావడం, అదీ హ్యారీ ఆత్మకథ ద్వారా కావడం ఇక్కడ గమనార్హం. కలిసిపోతారనుకున్న అన్నదమ్ములను.. ఆ ఆత్మకథ మరింత దూరం చేసేలా కనిపిస్తోంది!. 2020లో రాజరికాన్ని, బ్రిటన్ వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. ఆ సమయం నుంచే ఆ అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే.. 2021లో ఈ ఆలుమగలు ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించడం ద్వారా రాజకుటుంబంలోని అన్నదమ్ములు, వాళ్ల వాళ్ల భార్యల మధ్య కలహాలు వెలుగులోకి రావడం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి కూడా. -
ప్లీజ్.. ఒక్కసారి కలవాలి: కింగ్ ఛార్లెస్కు మేఘన్ లేఖ
లండన్: క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత.. అంత్యక్రియల సమయంలో జరిగిన ఆసక్తికర చర్చల్లో డచ్చెస్ ఆఫ్ సస్సెక్స్ మేఘన్ మార్కెల్ ఎపిసోడ్ కూడా హైలైట్ అయ్యింది. క్వీన్ ఎలిజబెత్-2 రెండో మనవడు ప్రిన్స్ హ్యారీ తన భార్య మేఘన్తో కలసి రాయల్ డ్యూటీస్కు దూరంగా కాలిఫోర్నియాలో స్థిరపడిన విషయం తెలిసిందే. అయితే.. రాణి-మేఘన్కు, ప్రిన్స్ సోదరుడు విలియం భార్య క్యాథరిన్ ఎలిజబెత్ మిడిల్టన్-మేఘన్కు మధ్య గిట్టని పరిస్థితుల్లోనే ప్రిన్స్హ్యారీ రాజహోదాకు దూరమైనట్లు ఒక ప్రచారం ఉంది. అంతేకాదు.. బ్రిటన్ను వీడాక.. బకింగ్హమ్ ప్యాలెస్లో తమకు ఎదురైన పరిస్థితులపై సంచలన ఆరోపణలే చేశారు ఆ భార్యాభర్తలు. ఈ నేపథ్యంలో.. క్వీన్ అంత్యక్రియలకు మేఘన్ దూరంగా ఉంటుందని, అసలు రాజకుటుంబం ఆమెను ఆహ్వానించకపోవచ్చని అంతా భావించారు. అయితే ఆ అంచనాలు తలకిందులు చేస్తూ.. మేఘన్ మార్కెల్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరైంది కూడా. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ కలహాలకు పుల్స్టాప్ పడాలని మేఘన్ భావిస్తోంది. అందుకే ఆమె బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3(ప్రిన్స్ హ్యారీ తండ్రి)ని ప్రైవేట్గా కలిసి చర్చించాలని ఓ లేఖ రాసింది. కాలిఫోర్నియాకు వెళ్లే ముందు.. రాజకుటుంబానికి చెందిన కీలక విషయాలు చర్చించాల్సి ఉందని కింగ్ ఛార్లెస్-3 అపాయింట్మెంట్ కోరుతూ ఆమె రాజప్రసాదానికి అభ్యర్థన లేఖ రాసిందని, ఇది అభినందించదగ్గ సాహసోపేత నిర్ణయమంటూ రాజకుటుంబ వ్యవహరాల విశ్లేషకుడు నెయిల్ సీన్ తన యూట్యూబ్లో ఓ వీడియో అప్లోడ్ చేశాడు. రాజకుటుంబంలోని పొరపచ్చాల్ని తొలగించుకునేందుకు ఇదే మంచి సందర్భమని ఆమె అనుకుంటున్నట్లు అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్-2తో పాటు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేథరిన్ మిడెల్టన్(ప్రిన్స్ విలియం భార్య)పై మేఘన్ ఆరోపణలు గుప్పించింది గతంలో. కానీ, కింగ్ ఛార్లెస్తో పాటు ఆయన సతీమణి క్యామిల్లాకు, మేఘన్కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ ఇద్దరూ తనను ఒక కూతురిలా భావిస్తారని తరచూ మేఘన్ చెప్తుండేవారు. అంతెందుకు రాజప్రసాదంపై విమర్శల తర్వాత.. కొడుకుకొడలిని మన్నిస్తానని కింగ్ ఛార్లెస్ ఒక ఇంటర్వ్యూలో సైతం తెలిపారు కూడా. ఈ తరుణంలో.. తమ మధ్య చర్చల ద్వారా కుటుంబ కలహాలకు చెక్ పెట్టాలని మేఘన్ భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదీ చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
Queen Elizabeth 2: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్సోర్ కాస్టిల్కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్, మరో మనవడు ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్ కలిసి ఈ కోటకు వెళ్లారు. రాణికి సంతాపం తెలిపేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు. అయితే హ్యారీ భార్య మేఘన్.. కోట బయట ఏడుస్తున్న ఓ టీనేజర్ను ఆప్యాయంగా పలకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ బాలికతో మేఘన్ మాట్లాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియోలో ప్రిన్స్ హ్యారీ కోట బయట ఉన్నవారితో మాట్లాడుతుండగా.. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న అతని భార్య మేఘన్ ఓ టీనేజర్ దగ్గరకు వెళ్లింది. ఏడుస్తున్న ఆ చిన్నారిని నీ పేరేంటని అడిగింది. అందుకు ఆ బాలిక అమెల్కా అని బదులిచ్చింది. నీపేరు చాలా బాగుందని చెప్పిన మేఘన్.. రాణికి నివాళులు అర్పించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. మూడు గంటలుగా వారంతా వేచి చూస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఏడుస్తున్న అమెల్కాను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి మొదట టిక్టాక్లో షేర్ చేశాడు. ఆ తర్వాత అది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by MEMEZAR • Comedy and Culture (@memezar) 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్న హ్యారీ, మేఘన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2021 మార్చి నుంచి వీరు రాజకుటుంబానికి దూరంగా అమెరికాలోని నివసిస్తున్నారు. రాణి మరణానికి ముందు అనుకోకుండా వారు బ్రిటన్లోనే ఉన్నారు. దీంతో కుటంబసభ్యులతో వెళ్లి రాణికి నివాళులు అర్పించారు. రాణి మరణంతో హ్యారీ, మేఘన్ మళ్లీ రాజకుటుంబానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్ -
రాణి కడసారి చూపునకు... మెగన్ను రానివ్వలేదు!
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు రాణి ఎలిజబెత్–2 అస్తమయం సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్ మార్కెల్ను హ్యారీ పెళ్లాడటంతో విభేదాలు బాగా ముదిరాయి. తర్వాతి పరిణామాల నేపథ్యంలో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గురువారం స్కాట్లండ్లోని బాల్మోరల్ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మెగన్ రావడానికి వీల్లేదని చార్లెస్ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్లోనే ఉన్నారు. రాణి కడసారి చూపుకు వారిద్దరూ బాల్మోరల్ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్ నేరుగా హ్యారీకి ఫోన్ చేసి, ‘‘అతి కొద్దిమంది రక్త సంబంధీకులం తప్ప ఎవరూ రావడం లేదు. కేట్ మిడిల్టన్ (విలియం భార్య) కూడా రావడం లేదు. కాబట్టి మెగన్ రాక అస్సలు సరికాదు’’ అని చెప్పినట్టు సమాచారం. దాంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు. గురువారమే మొదటిసారిగా కొత్త స్కూల్కు వెళ్తున్న తన ఇద్దరు పిల్లల కోసం మిడిల్టన్ లండన్లోనే ఉండిపోయారు. ముందునుంచీ విభేదాలే విలియం, హ్యారీ సోదరుల మధ్య ఏనాడూ పెద్దగా సఖ్యత లేదు. తండ్రితో, అన్నతో మనస్ఫర్ధలను పలుమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో హ్యారీ బాహాటంగానే వెల్లడించారు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అమెరికా నటి అయిన మెగన్తో తన ప్రేమాయణం వారికి నచ్చకపోయినా పట్టించుకోలేదు. గొడవల నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదాను వదులుకుని రెండేళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 2021లో ప్రఖ్యాత అమెరికా టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను సంచలనం సృష్టించింది. రాజ కుటుంబీకుల జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రవర్తన తననెంతగానో గాయపరిచాయంటూ మెగన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో మిడిల్డన్ నన్ను సూదుల్లాంటి మాటలతో తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా’’ అంటూ దుయ్యబట్టింది. ఈ ఆరోపణలు, మొత్తంగా బ్రిటన్ రాచరిక వ్యవస్థపైనే ఆమె ఎక్కుపెట్టిన పదునైన విమర్శలు అప్పట్లో పెను దుమారం రేపాయి. రాజ కుటుంబానికి మాయని మచ్చగా మిగల్చడమే గాక వారి హృదయాల్లో మంటలు రేపాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలను మరింత పెంచాయి. తల్లిదండ్రులుగా చార్లెస్, కెమిల్లా పూర్తిగా విఫలమయ్యారంటూ హ్యారీ కూడా దుయ్యబట్టారు. తండ్రి అయితే తన ఫోన్ కూడా ఎత్తడం మానుకున్నారని ఆరోపించారు. ఒకవైపు రాణి ఎలిజబెత్ భర్త ఫిలిప్ మరణించిన దుఃఖంలో ఉన్న రాజ కుటుంబాన్ని ఈ ఆరోపణలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలో నిండుచూలాలిగా ఉన్న మెగన్ ఫిలిప్ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. అయితే హ్యారీతో పాటు మెగన్ను కూడా రాణి ఎంతో ఇష్టపడేవారనే చెబుతారు. మెగన్ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్ తిరిగొస్తారని సమాచారం. దూరమైన కుటుంబీకులను విషాద సమయాలు దగ్గర చేస్తాయంటారు. బ్రిటిష్ రాజ కుటుంబం విషయంలో అది నిజమవుతుందో లేదో అంత్యక్రియల నాటికి స్పష్టత వస్తుంది. -
ప్రముఖ నటితో నిద్రించానని చెప్తే రూ.50 లక్షలు ఇస్తామని ఆఫర్!
Simon Rex: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుంటుంబంలో జాతి వివక్షను ఎదుర్కొంది నటి మేఘన్ మార్కెల్. వివాహం తరువాత రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయి. దీనికితోడు బ్రిటన్లోని ఓ వర్గం మీడియా కూడా ఈ జంటకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో మానసిక వేదనను భరించలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మేఘన్. అయితే పెళ్లికి ముందు కూడా ఆమెను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రిన్స్ హ్యారీని పెళ్లాడటానికి ముందు ఆమె ప్రతిష్టను దెబ్బతీయడానికి బ్రిటన్లోని ఓ వర్గం మీడియా దిగజారి ప్రవర్తించిందని నటుడు సిమన్ రెక్స్ వెల్లడించాడు. ఆమెతో ఒక రాత్రంతా ఉన్నట్లు చెప్తే రూ.50 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని తెలిపాడు. నిజానికి తనకు ఆ సమయంలో డబ్బులు చాలా అవసరం ఉన్నాయని, కానీ అందుకోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయలేనని సదరు ఆఫర్ను తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. చదవండి: The Kashmir Files: అప్పుడే వంద కోట్లు, అవాక్కవుతున్న బాలీవుడ్! ఈ విషయం తెలుసుకున్న మేఘన్.. 'ఇంకా మంచి మనుషులు ఉన్నారని తెలిసినందుకు సంతోషంగా ఉంది' అంటూ అతడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ పంపిందట. దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నానని చెప్పాడు సిమన్. కాగా మేఘన్, సిమన్ 2005లో వచ్చిన కట్స్ బ్యాక్ సిరీస్లో ఒక్క ఎపిసోడ్లోనే కలిసి నటించారు. నటిగా విశేషాదరణ సంపాదించుకున్న మేఘన్ 2018లో ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు గుడ్బై చెప్పింది. ఆ తర్వాత కుటుంబంతో విభేదాల కారణంగా ప్రిన్స్ హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే! వీరికి కొడుకు ఆర్చీ, కూతురు లిల్లీ డయానా సంతానం. చదవండి: వ్యాపారవేత్తకు కారు అమ్మిన స్టార్ హీరోయిన్! -
Shilpa Yarlagadda: పింక్ రింగ్ శిల్ప!
తాజాగా టైమ్ మ్యాగజీన్ కవర్ ఫోటో మీద ప్రిన్స్ హారీ మేఘనా మెర్కెల్ జంట ఆకర్షణీయంగా కనిపించింది. అయితే వీరిద్దరూ ధరించిన డ్రెస్లు, ఆభరణాలలో ముఖ్యంగా మెర్కెల్ వేలికి తొడిగిన ‘డ్యూయెట్ పింక్ డైమండ్ రింగు’ ప్రత్యేకంగా ఉండడంతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తోంది అని చెప్పే ‘పింక్ వాగ్దానం’కు గుర్తుగా ఈ రింగును రూపొందించినట్లుగా ఆ ఉంగరాన్ని డిజైన్ చేసిన సంస్థ ‘శిఫాన్’ చెబుతోంది. రింగు బాగా పాపులర్ అవ్వడంతో రింగును రూపొందించిన డిజైనర్ శిల్పా యార్లగడ్డ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. శిల్ప పేరు తెరమీదకు రావడానికి ఒక పింక్ డైమండ్ రింగేగాక, చిన్న వయసులోనే డైమండ్ జ్యూవెలరీ స్టార్టప్ను ప్రారంభించి విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్గా రాణిస్తూ, తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి వినియోగించడం మరో కారణం. ఒక పక్క తన చదువు ఇంకా పూర్తికాలేదు. కానీ తను ఒక సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్గా రాణిస్తూ.. తనలాంటి ఎంతోమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది శిల్పా యార్లగడ్డ. శిఫాన్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పెరిగిన శిల్పా యార్లగడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. శిల్ప హైస్కూల్లో ఉన్నప్పుడు నాసా, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్లలో ఇంటర్న్షిప్ చేసింది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంది. ఈ క్రమంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్ఐటీ మొదటి ఏడాది చదివేటప్పుడు.. తన చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ సంస్థలన్నీ పురుషులే నిర్వహించడం చూసేది. ఈ రంగంలోకి మహిళలు కూడా అడుగుపెట్టాలి అని భావించి... వివిధ రకాల ఆభరణాలను ఎలా తయారు చేయాలి? తక్కువ ఖర్చులో మన్నిక కలిగిన ఆభరణాల తయారీ ఎలా... అనే అంశాలపై గూగుల్లో త్రీవంగా వెతికేది. త్రీడీ ప్రింటింగ్ ద్వారా తక్కువ ఖర్చులో అందమైన జ్యూవెలరీ తయారు చేయవచ్చని తెలుసుకుని స్నేహితులతో కలిసి 2017లో డైమండ్స్కు బాగా పేరున్న న్యూయార్క్లో ‘శిఫాన్’ పేరిట జ్యూవెలరీ స్టార్టప్ను ప్రారంభించింది. శిఫాన్ ప్రారంభానికి ‘అన్కట్ జెమ్స్’ సినిమా కూడా శిల్పకు ప్రేరణ కలిగించింది. వజ్రాలతో తయారు చేసిన సింగిల్ పీస్ జ్యూవెలరీని విక్రయించడం ప్రారంభించింది. 2 018లో ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో స్టైలిస్ట్ నికోల్ కిడ్మ్యాన్స్ క్లైంట్ శిఫాన్ సంస్థ రూపొందించిన రింగ్ ధరించి రెడ్ కార్పెట్పై నడవడంతో అప్పుడు శిఫాన్కు మంచి గుర్తింపు వచి్చంది. అప్పటి నుంచి శిఫాన్ డైమండ్ జ్యూవెలరీ విక్రయాలు పెరిగాయి. డ్యూయెట్ హూప్స్.. గతేడాది నవంబర్లో ‘డ్యూయెట్ హూప్స్’ పేరుమీద రెండో జ్యూవెలరీని ప్రారంభించింది శిల్పా యార్లగడ్డ. ఆదర్శవంతమైన దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్ డైమండ్ రింగును అందుబాటులోకి తీసుకొచ్చారు. పింక్ డైమండ్ రింగు స్పైరల్ ఆకారంలో అడ్జెస్టబుల్గా ఉంటుంది. మొదట ఒక పెద్ద సైజులో డైమండ్, దాని తరువాత చిన్న డైమండ్ ఉండడం ఈ రింగు ప్రత్యేకత. ఈ మోడల్ రింగును ఆమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ధరించడంతో ఆ మోడల్ బాగా పాపులర్ అయింది. అయితే ఈ పింక్ రింగును అమ్మగా వచ్చే ఆదాయంలో యాభై శాతం డబ్బును ‘స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్’కు శిల్ప అందిస్తోంది. ఇప్పటికే పెప్పర్, ఇటెర్నెవా, కిన్షిప్, సీ స్టార్ వంటి కంపెనీలకు నిధులు సమకూర్చింది. కాగా పింక్ రింగ్ ధర 155 డాలర్ల నుంచి 780 డాలర్లు ఉండడం విశేషం. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫైనలియర్ చదువుతోన్న శిల్ప తన చదువు పూర్తయ్యాక పూర్తి సమయాన్ని శిఫాన్ కోసం కేటాయించనుంది. కాలం తిరిగి రాదు జ్యూవెలరీ తయారీ పరిశ్రమ మహిళలకు సంబంధించినది. కానీ ఈ పరిశ్రమలన్నీ పురుషులే నిర్వహిస్తున్నారు. అందుకే ఈ రంగంలో ఎక్కువమంది మహిళలు రావాలనుకున్నాను. ఈ క్రమంలోనే స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్లకు నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తున్నాను. ఒక పక్క చదువుకూంటూ మరోపక్క ఒక కంపెనీ స్థాపించి దాని ఎదుగుదలకు కృషిచేయడం సవాలుతో కూడుకున్నది. కానీ ‘జీవితంలో ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు గానీ కరిగిపోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోలేం’ అని ఒకరిచి్చన సలహా నా మనస్సుకు హత్తుకోవడంతో ఈ రెండూ చేయగలుగుతున్నాను. చదవండి: Mystery: న్యోస్ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి! -
తల్లిదండ్రులైన హ్యారీ దంపతులు.. బుజ్జాయి పేరేమిటంటే!
కాలిఫోర్నియా: రాచరికాన్ని వదులుకుని సామాన్య జీవితం గడుపుతున్న ప్రిన్స్ హ్యారీస్, మేఘన్ మార్కెల్ దంపతులు ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. చుట్టుముట్టిన కష్టాల నడుమ వారింట్లో బోసి నవ్వులు విరబూశాయి. మేఘన్-హ్యారీ దంపతులు ముద్దులొలికే పసిపాపకి తల్లిదండ్రులయ్యారు . జూన్ 4న కాలిఫోర్నియాలోని శాంట బార్బరా కాటేజ్ హాస్పటిల్లో మేఘన్ మార్కెట్ ప్రసవించింది. అప్పుడు హ్యరీ కూడా అక్కడే ఉన్నారు. వారి పేర్ల కలయికతో హ్యారీ, మేఘన్ జీవితాల్లోకి వచ్చిన చిన్నారికి లిల్లీ డయానా అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు వెనక పెద్ద కథే ఉంది. ప్రస్తుతం బ్రిటిష్ రాజకుటుంబ మహారాణి ఎలిజబెత్ చిన్నప్పటి ముద్దుపేరు లిల్లీబెట్. అలాగే రాచరికపు ఆంక్షలను ఎదిరించి చనిపోయిన తన హ్యారీ తల్లి పేరు డయానా. వీరిద్దరి గౌరవార్థం తన కూతురికి లిల్లీబెట్ డయాన మౌంట్బాటెన్ విండ్సర్ గా పేరు పెట్టారు. హ్యారీ- మేఘన్లకు ఇంతకు ముందు ఆర్చీ అనే కొడుకు 2019లో జన్మించాడు. -
అమ్మను చంపేశారు.. తనను కూడా వదలరా?: హ్యారీ
లండన్: ‘‘అమ్మ అంత్యక్రియల నాడు నాకు వినిపించిన గుర్రాల గిట్టల శబ్దం నుంచి.. కారులో నేను అమ్మతో ప్రయాణిస్తుండగా.. మమ్మల్ని వెంటాడిన ఫోటోగ్రాఫర్ల వరకు ప్రతి జ్ఞాపకం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది.. అమ్మను కోల్పోయిన బాధ ఇప్పటికి నన్ను కలచివేస్తూనే ఉంది’’ అంటూ ప్రిన్స్ హ్యారీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక అమ్మలాగే.. నా భార్యను కూడా కోల్పోతాననే భయంతోనే రాచకుంటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లానని తెలిపాడు హ్యారీ. ఒక కొత్త టీవీ డాక్యుమెంటరీ సిరీస్ ది మీ యూ కాన్ట్ సీలో తన మనోవేదనను వెల్లడించారు హ్యారీ. హ్యారీ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ తెల్ల జాతీయుడు కానీ మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్న నాటి నుంచి.. ఆమె మరణం వరకు ఫోటోగ్రాఫర్లు తనను వెంబడిస్తూనే ఉన్నారు. చివరకు ఏం జరిగిందో అందరికి తెలుసు. ఆమె మరణించిన తర్వాత కూడా వదల్లేదు. ఇప్పుడు తను(మేఫన్) చనిపోయే వరకు కూడా ఆగరు.. చరిత్ర పునరావృతం చేయాలని మీరు భావిస్తున్నారా’’ అంటూ ఆవేదనకు గురయ్యాడు. ఇది ఇలానే కొనసాగితే.. నా జీవితంలో మరో స్త్రీని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చాను’’ అన్నాడు హ్యారీ. హ్యారీ, అతని అమెరికన్ భార్య మేఘన్ మార్కెల్ గురించి బ్రిటిష్ పత్రికలలో జాత్యహంకార వార్తలు వెలువడ్డాయి. అలానే సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి తప్పుడు ప్రచారం జరిగింది. ఇక మేఘన్ మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు బ్రిటన్లో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని తెలిపాడు హ్యారీ. ఈజిప్టుకు చెందిన తన ప్రియుడు డోడి ఫయేద్తో కలిసి ప్రయాణిస్తున్న కారును ఛాయాచిత్రకారులు వెంబడించడంతో పారిస్లో జరిగిన ప్రమాదంలో యువరాణి డయానా 1997 లో 36 ఏళ్ళ వయసులో మరణించింది. ఆ సమయంలో హ్యారీకి 12 సంవత్సరాలు. ఈ డాక్యుమెంటరీలో, హ్యారీ తన సోదరుడు విలియం, తండ్రి ప్రిన్స్ చార్లెస్, మామ చార్లెస్ స్పెన్సర్తో కలిసి లండన్ వీధుల గుండా డయానా శవపేటిక వెనుక నడుస్తున్న నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘‘నేను ఆ దారి వెంబడి నడుస్తున్నాను.. నాకు గుర్రాల గిట్టల శబ్దం వినిపిస్తుంది.. నేను నా శరీరాన్ని విడిచిపెట్టి.. బయటకు వచ్చినట్లు అనిపించింది. ఉక్కిరిబిక్కిరి అయ్యాను’’ అంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు హ్యారీ. ‘‘ఈ బాధను నేను దాదాపు 20 ఏళ్ల పాటు అణిచిపెట్టుకున్నాను.. తాగుడుకు అలవాటు పడ్డాను. కెమరాలు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వీరు ఓ నిస్సహాయ మహిళను ఆమె తన కారు వెనక సీటులో మరణించే వరకు వెంటాడారు. ఆ సమయంలో నేను నా తల్లికి సాయం చేయలేకపోయాను.. మా అమ్మకు న్యాయం జరగలేదు.. నా బాల్యంలో మా అమ్మ విషయంలో ఏదైతే జరిగిందో.. దాని గురించి నాకు ఇప్పటికి కోపం వస్తుంది. ఇప్పుడు నాకు 36 ఏళ్లు.. కానీ ఇప్పుడు కెమరాలు చూసినా.. వారు నన్ను వెంటాడుతున్నట్లు ఆందోళనకు గురవుతాను. కెమరాల క్లిక్, ఫ్లాష్ చూస్తే.. నా రక్తం మరిగిపోతుంది’’ అన్నాడు హ్యారీ. ‘‘మేఘన్ను కలిసే వరకు నేను ఈ బాధ అనుభవించాను. ఆ తర్వాతే నేను థెరపీ తీసుకోవడం ప్రారంభించాను. ఇక మా బంధం కొనసాగితేనే.. నేను నా గతాన్ని ఎదుర్కోగలనని అనిపించింది. అందుకే తనను వివాహం చేసుకున్నాను అన్నాడు. ఈ విషయాలన్నింటిని హ్యారీ తన మీ యూ కాన్ట్ సీ సిరీస్లో తెలిపారు. అమెరికన్ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో కలిసి హ్యారీ నిర్మించిన "మీ యూ కాన్ట్ సీ" సిరీస్ ఆపిల్ టీవీ + లో శుక్రవారం విడుదలైంది. చదవండి: మేఘన్ జాతివివక్ష ప్రకంపనలు -
ప్రిన్స్ ఫిలిప్ మృతి: అంత్యక్రియలకైనా వస్తాడా.. లేదా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శుక్రవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రిన్స్ ఫిలిప్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో ప్రస్తుతం బ్రిటన్ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజకుంటుంబాన్ని అభిమానించే వారి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది. ప్రిన్స్ ఫిలిప్ మనవడు ప్రిన్స్ హ్యారి తాతను కడసారి చూడటానికి అయినా వస్తాడా.. లేదా అనే దాని మీదే చర్చ జరుగుతోంది. అంతరంగిక విబేధాల వల్ల ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు గత కొద్ది కాలంగా రాచ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే టాక్ షోలో ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు తాము అంతఃపురంలో అనుభవించిన కష్ట నష్టాల గురించి ప్రపంచానికి వెల్లడించారు. జాతి వివక్షను ఎదుర్కొన్నానని.. మీడియా తనపై తప్పుడు కథల ప్రచారం చేసిందని.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మేఘన్ తెలిపారు. ఇక వీరి ఇంటర్వ్యూ ప్రసారానికి ముందే ప్రిన్స్ ఫిలిప్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాతను పరామర్శించాల్సిందిగా బకింగ్హామ్ ప్యాలేస్ హ్యారీకి సందేశం పంపింది. కారణాలు తెలియదు కానీ ప్రిన్స్ హ్యారీ మాత్రం తాతగారిని చూడటానికి రాలేదని సమాచారం. మరి ఇప్పుడు అంత్యక్రియలకు అయినా హాజరవుతాడా లేదా అనే ప్రశ్న బ్రిటన్ జనాలను తొలచివేస్తుంది. అయితే దీని గురించి రెండు నెలల క్రితమే ది రాయల్ అజ్బర్వర్ అనే పత్రిక ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ప్రచురించడం గమనార్హం. ప్రస్తుతం హ్యారీ-మేఘన్ మార్కెల్లు అమెరికాలో నివాసం ఉంటున్నారు. చదవండి: వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ -
వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ
తమను వేధింపులకు గురిచేశారని మేఘన్, హ్యారీలు చేసిన ఆరోపణపై అమెరికా, బ్రిటన్ దేశాల్లోని ఛాందసవాదులు మూసపోసిన రీతిలో స్పందించారు. ఒకప్పటి బ్రిటిష్ సామ్రాజ్య పౌరులుగా భారతీయులం బ్రిటిష్ రాజరికంతో ప్రేమ-ద్వేషంతో కూడిన సంబంధంతో ఉంటాం. హ్యారీ, మేఘన్ వంటి గాథలను టీవీ తెరలపై ఆసక్తికరంగా తిలకించడానికి సిద్ధపడతాం కానీ ఈ దంపతులిరువురూ ఎదుర్కొన్న వివక్ష, కపటత్వం వంటివాటిని ఏమాత్రం పట్టించుకోం. అయితే జాత్యహంకారం, స్త్రీ ద్వేషం, వర్గాధిక్యత, చర్మపురంగు వంటి వాటిపట్ల ఆత్రుత వంటివి మన ఇళ్లను కూడా ఇప్పుడు సమీపిస్తున్నాయి. మనలోని ఇదే అలవాట్లను మనం గుర్తించకపోతే, మారకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నవారిమవుతాం. బ్రిటన్ రాజరికం జాతివివక్షా భావాలతో నిండిపోయి ఉందంటూ ప్రముఖ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వూ్యలో మేఘన్ మర్కెల్, హ్యారీ విండ్సార్ ఆరోపించడంతో బ్రిటిష్ రాజరికంపై బాంబు పేలినట్లయింది. ఆ ఇంటర్వూ్యపై వెంటనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే, స్త్రీ ద్వేషం, జాతి వివక్ష బ్రిటిష్ రాజరికంతో ముడిపడి ఉన్నాయి. ఈ వాస్తవాన్ని బ్రిటిష్ మీడియా మరింత సంక్లిష్టం చేసిపడేస్తోంది. హ్యారీ, మేఘన్లు నిష్కపటమైన, స్వచ్ఛమైన రీతిలో ఓప్రాకు ఇచ్చిన ఆ ఇంటర్వూ్య మనందరి కళ్లు తెరిపించింది. అది బ్రిటిష్ మీడియాను, పవిత్రమైనదిగా భావించే బ్రిటిష్ రాజ రికాన్ని ప్రకంపింపచేసిందన్నది వాస్తవం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మొత్తం వివాదం నుంచి బ్రిటిష్ రాణిని జాగ్రత్తగా తప్పించి వేయడమే. రాణి సలహాదారులూ రాచరిక వ్యవస్థే దీనంతటికీ కారణమని మీడియా తేల్చేసింది. యువరాణులు, యువరాజుల జిగేల్మనిపించే ఆహార్యం, ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేసేటటువంటి డిజైనర్ దుస్తులు, డైమండ్లు, పాపరాజీ వర్ణించే అద్భుతమైన వారి వివాహ గాథలను దాటి ముందుకు చూస్తే, జాతులను, సహజ వనరులను, ప్రపంచవ్యాప్తంగా స్థానికులను కొల్లగొట్టి మరీ సముపార్జించుకున్న క్రూరమైన స్వీయ సంపద విభ్రమ విలాసాలు బ్రిటిష్ రాచరికం సొత్తుగా ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇప్పుడంటే ఆధునిక రాజరికం వాస్తవాధికారం లేని ముదివగ్గును తలపిస్తోంది కానీ ఎలిజబెత్ రాణి పట్ల చెరగని అనుకూలత కారణంగా ఆ గత వైభవాన్ని జనం గుర్తు చేసుకుంటూ ఉంటారు. 1979లో, బ్రిటిష్-జమైకన్ సాంస్కృతిక సిద్ధాంతకర్త స్టూవర్ట్ హాల్ కాకతాళీయంగా ఇదే బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో బ్రిటిష్ టెలివిజన్ ప్రసారాల్లో జాతి వివక్ష కొనసాగింపు గురించి మొత్తుకున్నారు. బ్రిటన్లో నివసిస్తున్న నల్లజాతి, ఆసియన్ కమ్యూనిటీ ప్రజల పట్ల జాతివివక్షా వైఖరిని సాధారణీకరించేలా వీరి వ్యాఖ్యలు ఉండేవి. బహుళ జాతి జనాభాతో పెరుగుతూ వచ్చిన బ్రిటన్లో జాతి వివక్షా ధోరణులను వ్యాప్తి చేయడానికి హాస్యాన్ని ఎక్కువగా వినియోగించేవారని రచయిత, పరిశోధకురాలు రైనా జేడ్ పార్కర్ తెలిపారు. మీడియా పాక్షిక దృష్టి కారణంగా కలిగిన ప్రభావాలను పరీక్షించడానికి ప్రయత్నించిన స్టూవర్ట్ హాల్ ఇలాంటి ప్రభావం వ్యక్తిగత దాడికిందే పరిగణించాలి తప్ప దీన్ని ఒక వ్యవస్థాగత సమస్యగా భావించవద్దని అప్పట్లోనే చెవ్పేవారన్నారు. వ్యవస్థలో సంస్థాగతంగా జాత్యహంకారం, స్త్రీ ద్వేషం ఉనికిలో ఉన్న విషయాన్ని అంగీకరించడాన్ని తిరస్కరించడానికి ఇది ఒక ప్రామాణిక వంచనాత్మకమైన ఎత్తుగడ అని హాల్ చెప్పారు. మిశ్రమజాతికి చెందిన మేఘన్ మర్కెల్ బ్రిటన్ యువరాజును అద్భుత గాథలోలాగా పెళ్లాడి, బ్రిటిష్ రాజవంశంలో భాగమైనప్పుడు బ్రిటిష్ టాబ్లాయిడ్లు, ప్రెస్, సామాజిక మీడియా ఫోరంలు ఇదే వివక్షను ప్రదర్శించడం గమనార్హం. పైగా యునైటెడ్ కింగ్డమ్ లోని టాబ్లాయిడ్లు, శ్వేత జాతి మీడియా పండితులు, విశ్లేషకులు ఒక పద్ధతి ప్రకారం ఆమెను పొట్టచీల్చి మరీ పేగులు బయటకు లాగేవిధంగా వ్యవహరించారు. మేఘన్ తోటి కోడలు కేట్ను ఏడిపించింది! మేఘన్ రాణిమందిరం సిబ్బందిని వేధింపులకు గురిచేసింది! వేధించే పెళ్లికూతురు మేఘన్... ఇలాంటి ఎన్నెన్నో ఆరోపణలతో బ్రిటిష్ మీడియా యువరాణితో ఆటాడుకుంది. అమెరికన్ టెలివిజన్ దివా విన్ ప్రేకి ఇచ్చిన ఆ సంచలనాత్మక ఇంటర్వూ్యలో మేఘన్, హ్యారీలు ప్రధానారోపణ చేశారు. మేఘన్పట్ల అన్యాయంగా ప్రవర్తించింది బ్రిటిష్ మీడియా మాత్రమే కాదనీ, ఆమె నివసించే విండ్సార్ మందిరం కూడా ఆమెకు ఏమాత్రం సహాయం చేయలేదని వీరు చెప్పారు. పైగా ఈ వేధింపులో హౌస్ ఆఫ్ విండ్సార్ కూడా అస్పష్టరీతిలో పాల్గొన్నదని మేఘన్ దంపతులు చెప్పారు. ఈ ఆరోపణ బాంబులాగా పేలింది. డయానా గాథలో వెల్లడైన అంశాలు కూడా దీనిముందు సరిపోవని చెప్పాల్సి ఉంటుంది. చరిత్ర తనకు తానే పునరావృతం చేసుకుంటుంది అని హ్యారీ సరిగ్గానే వర్ణించారు. తమ మాతృమూర్తి డయానా తనకు ఎదురైన చేదు అనుభవాల ఫలితంగా ఒంటరితనంలో కూరుకుపోవలసి వస్తే తాము మాత్రం కలిసికట్టుగా తమ సమస్యను పరిష్కరించుకోగలిగినందుకు తామెంతో అదృష్టవంతులమని అందుకు తానెంతో సంతోషపడుతున్నానని హ్యారీ చెప్పారు. ప్రజల అభిమానం చూరగొన్న యువరాణి డయానాను అప్పట్లో వేటాడారు, వెంటాడారు, ఒంటరిని చేసిపడేశారు. అదే సమయంలో ఆమెను ఆరాధించారు, ఆదర్శమూర్తిని చేశారు. అయితే మేఘన్ కూడా డయానా ఎదుర్కొన్న సవాళ్ల బారిన పడినప్పటికీ, అదనంగా తమపై మోపిన జాతివివక్ష, వర్ణవివక్షకు సంబంధించిన భారాలను కూడా మేఘన్ ఎదుర్కొన్నారు. మధ్యతరగతిలో పుట్టి పెరిగిన మేఘన్ తర్వాత తన సొంత కృషితో, హక్కుతో నటిగా, సోషల్ మీడియా స్టార్గా, సెలబ్రిటీగా తన్ను తాను మలుచుకుంది. తన యువరాజుతో కలిసి మరుగుజ్జు శ్వేతజాతి కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు ఈ వివక్షలన్నింటినీ ఆమె అనుభవించింది. మేఘన్ ఎదుర్కొన్న సమస్య సరిగ్గా తన మాతృమూర్తిని వేధించిన పరిస్థితితో సమానమైందని హ్యారీ పేర్కొన్నాడు. అమెరికా, బ్రిటన్ మీడియా ఈ ఉదంతంపై ఊహించిన వైఖరులనే చేపట్టాయి. తమకుతాముగా ప్రవాసంలోకి వెళ్లిన దంపతులపై అమెరికా మీడియా కేంద్రీకరించగా, బ్రిటన్ ప్రెస్ కొన్ని మినహాయింపులను పక్కనబెడితే, తమకెంతో ప్రేమాస్పదమైన రాజకుటుంబంపై ఇన్ని ఆరోపణలు చేస్తారా అంటూ రెచ్చిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికాలోని ఛాందసవాద వ్యాఖ్యాతలు సైతం మోర్గన్ వంటి రాజరికం సానుభూతిపరులతో జట్టు కలవడమే. రాజమందిరంలోకి ప్రవేశించాక తనకు ఒనగూరేది ఏమిటనేది మేఘన్కు కచ్చితంగా ముందే తెలుసని, రాజమందిరంలో ప్రవేశించినందుకు ఆమెకు లభ్యమైన సౌకర్యాలపై, హక్కులపై ఆరోపణలు చేయడానికే వీల్లేదని వీరు వాదిస్తున్నారు. సాధారణీకరించి చెప్పాలంటే, జాతివివక్ష, లైంగిక దోపిడీ, జాతిఆధిక్యతా భావం వంటి అంశాలతో వ్యవహరించడంలో సంస్థాగత మార్పులను చేయాల్సిన అవసరముందని ఉదారవాదులు చేస్తున్న వాదనను అమెరికా, బ్రిటన్లోని ఛాందసవాదులు తోసిపుచ్చుతున్నారు. తమను వేధింపులకు గురిచేశారని మేఘన్, హ్యారీలు చేసిన ఆరోపణపై రెండుదేశాల్లోని ఛాందసవాదులు మూసిపోసిన రీతిలో స్పందించడం గమనార్హం. ఘనత వహించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన ఒకప్పటి పౌరులుగా భారతీయులం బ్రిటిష్ రాజరికంతో ప్రేమ–ద్వేషంతో కూడిన సంబంధంతో ఉంటాం. ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యం కొల్లగొట్టిన కోహినూర్ వజ్రం వంటి భారతీయ విలువైన సంపదలను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాం. మరోవైపు ఆ రాజవంశంనుంచి ఎవరైనా సభ్యుడు భారత్ సందర్శిస్తే వారి పాదాలు తాకి పూజిస్తాం. రాజరికం వైభవాన్ని ప్రదర్శించే అన్ని కార్యక్రమాలను కళ్లప్పగించి చూస్తుంటాం. హ్యారీ, మేఘన్ వంటి గాథలను టీవీ తెరలపై ఆసక్తికరంగా తిలకించడానికి సిద్ధపడతాం కానీ ఈ దంపతులిరువురూ ఎదుర్కొన్న వివక్ష, కపటత్వం వంటివాటిని ఏమాత్రం పట్టించుకోం. అయితే జాత్యహంకారం, స్త్రీ ద్వేషం, వర్గాధిక్యత, చర్మపురంగు వంటి వాటిపట్ల ఆత్రుత వంటివి మన ఇళ్లను కూడా ఇప్పుడు సమీపిస్తున్నాయి. మనలోని ఈ అలవాట్లను మనం గుర్తించి, మారకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. ఒక్కమాటలో చెప్పాలంటే మనం కూర్చుని ఉన్న అద్దాలమేడను మనం తిరిగి చూడాల్సి ఉంది. సుమన కస్తూరి వ్యాసకర్త రచయిత, పరిశోధకురాలు (ది వైర్ సౌజన్యంతో) -
ప్రిన్సెస్ గౌరమ్మ
స్వేచ్ఛను కోరుకునే మనసు ప్రేమలోనైనా బందీగా ఉండలేదు. బ్రిటన్ కుటుంబంలో రాణిలానూ ఉండిపోలేదు. భర్త నుంచి డయానా, బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి మేఘన్.. ఇద్దరూ స్వేచ్ఛను కోరుకున్న వాళ్లే. ఆ స్వేచ్ఛ కోసమే వాళ్లు తమ రెక్కల్ని తెంపుకున్నారు! వాళ్లిద్దరికంటే ముందు ఆ అంతఃపురంలో గౌరమ్మ అనే బాలిక.. ‘ప్రిన్సెస్’ గా స్వేచ్ఛ కోసం పెనుగులాడింది. తన కన్నా ముప్పై ఏళ్లు పెద్దవాడైన భర్తలోని తండ్రి ప్రేమను భరించలేక, క్వీన్ విక్టోరియా కనురెప్పల కింద భద్రంగా జీవించలేక పారిపోవాలని అనుకుంది. సాధ్యం కాలేదు. ప్రేమకు, భద్రతకు బందీగా 23 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది! ఎవరీ ప్రిన్సెస్ గౌరమ్మ? ప్యాలెస్లోకి ఎలా దారి తప్పింది? మేఘన్ రాణివాస జీవితానికి పూర్వఛాయలా అనిపిస్తున్న గౌరమ్మ అసలు ఏ ఊరి చిన్నారి?! ఎవరి పొన్నారి? అన్నమూ నీళ్లూ లేకున్నా మనుషులు కొన్నాళ్లు జీవించి ఉండగలరు. ప్రేమ లేని చోట ఒక్కక్షణం కూడా ఉండలేరు. అది పూరిల్లు అయినా, అంతఃపురం అయినా! లేడీ డయానాకు బకింగ్ హామ్ ప్యాలెస్లో ప్రేమ లభించలేదు. ఆమె కోరుకున్న ప్రేమ.. ప్యాలెస్ నుంచి కాదు. భర్త నుంచి. చివరికి మానసికంగా భర్తకు, ప్యాలెస్కు కూడా దూరం అయ్యారు డయానా. ప్రేమ లేని జీవితం భారమై, దుర్భరమై ప్రేమ కోసం పరుగులు తీస్తూ బతుకునే పోగొట్టుకున్నారు. 1997 ఆగస్టు 31న ప్యారిస్ లో ఆమె ప్రయాణిస్తున్న కారు టన్నెల్ రోడ్డుకు ఢీకొని మరణించారు. బ్రిటన్ ప్యాలెస్ ఎన్నటికీ మరువలేని విషాదం అది. విషాదం కన్నా కూడా విపత్తు. రాజవంశానికి అప్రతిష్టగా మాత్రమే ఆ దుర్ఘటనను ప్యాలెస్ ఆనాడు పరిగణించింది! ∙∙ బ్రిటన్ రాజప్రాసాదం దృష్టిలో అలాంటి అప్రతిష్టనే ఇప్పుడు మేఘన్ మార్కెల్ తెచ్చిపెట్టారు. క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెరికన్ యువతి మేఘన్. భర్త నుంచి దొరికిన ప్రేమ ఆమెకు అతడి కుటుంబ సభ్యుల నుంచి మాత్రం లభించలేదు. ఉన్నన్నాళ్లు గుట్టుగా ఉన్నారు. ఇంక ఉండలేను అనుకోగానే ప్యాలెస్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రిన్స్ హ్యారీ ఆమె వైపు గట్టిగా నిలబడ్డారు కనుకే ఆమె స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోగలిగారు. ప్యాలñ స్ నుంచి మేఘన్ వెళ్లిపోవడాన్ని పెద్ద విషయంగా లెక్కలోకి తీసుకోని రాణిగారు, తామెందుకని రాచకుటుంబంతో తెగతెంపులు చేసుకుని బయటికి వచ్చారో ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో ఆమె చెప్పడాన్ని మాత్రం తలవంపులుగా భావించారు. ఇప్పుడిక ప్రిన్సెస్ గౌరమ్మ వార్తల్లోకి వచ్చారు. అయితే బ్రిటన్ వార్తల్లోకి కాదు. భారతీయ పత్రికల్లోకి. ‘‘పెళ్లితో ఆ రాజ కుటుంబంలోకి అడుగుపెట్టి నిరాదరణకు గురైన మహిళల్లో డయానా, మేఘన్ మాత్రమే తొలి వ్యక్తులు కారు. పందొమ్మిదో శతాబ్దంలోనే క్వీన్ విక్టోరియా హయాంలో గౌరమ్మ అనే బాలిక ‘ప్రిన్సెస్’గా ఆ బంగారు పంజరంలో చిక్కుకుని బయటికి వచ్చే దారిలేక పారిపోయేందుకు ఆలోచనలు చేసిందని చరిత్రకారులు నాటి సంగతుల్ని మళ్లీ తవ్వి తీస్తున్నారు. ప్రిన్సెస్ గౌరమ్మతో ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ని పోల్చి చూస్తున్నారు. ఎవరీ గౌరమ్మ?! నిజంగానే బ్రిటన్ రాచ కుటుంబం గౌరమ్మ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందా? అది దయలేకపోవడమా లేక కట్టుబాట్లను శిరసావహించమని ఆదేశించడమా? ∙∙ డయానాను పక్కన పెడితే.. బ్రిటన్ రాజకుటుంబంలో వివక్షకు గురైన గోధుమవర్ణ చర్మం గల రెండో మహిళ మేఘన్ మార్కెల్. మొదటి మహిళ ప్రిన్స్ గౌరమ్మ. పదేళ్ల వయసు లో గౌరమ్మ అంతఃపురానికి వచ్చేనాటికి బ్రిటన్ ను క్వీన్ విక్టోరియా పరిపాలిస్తూ ఉన్నారు. గౌరమ్మ తండ్రి కూర్గ్ రాజు చిక్కా వీర రాజేంద్ర. ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు అతడిని పదవీచ్యుతుడిని చేసి, సంపదను కొల్లగొట్టారు. అందులో కొంత భాగాన్నయినా తిరిగి తనకు దక్కులా చేయమని విన్నవించుకోడానికీ, తన ముద్దుల కూతురు గౌరమ్మను ఆమె రక్షణ కోసం రాణిగారికి దత్తత ఇవ్వడానికి.. ఆ రెండు కారణాలతో.. ఆయన గౌరమ్మను వెంటబెట్టుకుని వెళ్లి రాణిగారిని కలిశారు. అది 1852వ సంవత్సర ఆరం¿¶ కాలం. మొదటి పని కాలేదు. రెండో పని అయింది. విక్టోరియా రాణి గౌరమ్మను దత్తత తీసుకున్నారు. ‘‘నా తల్లి ఇక మీది. తనని మీలో కలిపేసుకున్నా (బాప్తిజం) అభ్యంతరం లేదు’’ అని కూతుర్ని రాణిగారి చేతుల్లో పెట్టి వెనుదిరిగారు వీర రాజేంద్ర. గౌరమ్మ అందంగా ఉంది. ఇకపై మరింత అందంగా మారబోతోంది. అందం మాత్రమే కాదు అలవాట్లు, ఆచారాలు కూడా. 1852 జూన్లో విండ్సర్ క్యాజిల్లో (మరొక రాజసౌధం) గౌరమ్మకు రాచ కుటుంబం బాప్తిజం ఇప్పించడం ఆనాటి పత్రికల్లో విశేష ప్రచారానికి నోచుకుంది. రాణిగారితో కలిసి ఉన్న గౌరమ్మ ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఆనాటి నుంచి గౌరమ్మ ‘ప్రిన్సెస్ గౌరమ్మ’ అయింది. అయితే అది రాణిగారి సంతోషమే కానీ గౌరవ సంతోషం కాదు. ఆ చిన్నారి తన కొత్త పాత్రలో, కొత్త మనుషుల మధ్య, కొత్త ఆచారాల వ్యవహారాలలో ఇమడలేకపోయింది. క్వీన్ విక్టోరియా ఆమెను అమితంగా ఇష్టపడేవారు. అదే ఆ పసిదానికి కష్టాలను తెచ్చిపెట్టింది. చుట్టూ పరిచారకులు ఉండేవారు. తన ఇష్టానుసారం కాలూ చెయ్యి ఆడనిచ్చేవారు కాదు. రాణిగారితో మాటొస్తుందని వారి భయం. అసలు కష్టం ప్రిన్స్ గౌరమ్మకు తన 16వ యేట వచ్చింది. గౌరమ్మను మహారాజా దులీప్ సింగ్కు ఇచ్చి చేయాలని రాణి గారు తలపోయడమే ఆ కష్టం. గౌరమ్మ కన్నా పదహారేళ్లు పెద్దవాడు దులీప్సింగ్. గౌరమ్మకూ పెళ్లంటే ఇష్టం లేదు. ఎప్పుడు ఆ బంధనాల్లోంచి పారిపోదామా అన్నట్లు ఉండేదా అమ్మాయి. అది గమనించాడు దులీప్సింగ్. తనకు ఆమెతో పెళ్లి ఇష్టం లేదన్నాడు. అలా ఆ కష్టాన్ని అతడే తప్పించాడు. అయితే గౌరమ్మకు నిజమైన కష్టం తండ్రిని కలవనివ్వకుండా కట్టడి చెయ్యడం! కలిస్తే మళ్లీ పాతబుద్ధులే వస్తాయని రాణిగారు ఆందోళన చెందేవారట. ‘‘ఎక్కడికైనా పారిపోయి, పనిమనిషిగానైనా బతికేందుకు గౌరమ్మ సిద్ధపడింది’’ అని క్వీన్ విక్టోరియా ఆంతరంగిక కార్యదర్శి ఆ తర్వాతి కాలంలో బహిర్గతం చేసినట్లు చరిత్రకారులు రాశారు. మొత్తానికి ఇప్పుడు మేఘన్కు అయినట్లే, అప్పుడు గౌరమ్మ కు అయింది. ఒక్కరైనా ఆమెను పట్టించుకోలేదు. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న ఆ మనసును తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. ఏ ప్రయత్నమూ లేకుండా తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి కల్నల్ జాన్ కాంప్బెల్. ప్రిన్స్ గౌరమ్మ కొత్త పరిచారిక లేడీ లోజిన్ సోదరుడే జాన్ కాంప్బెల్. ∙∙ కాంప్బెల్.. గౌరమ్మ కన్నా 30 ఏళ్లు పెద్ద. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు అక్కడికి రాకపోకలు సాగిస్తుండే దులీప్ సింగ్ గమనించి, రాణిగారికి ఆ విషయాన్ని చేరవేయడంతో క్షణమైనా ఆలస్యం చేయకుండా ఇద్దరికీ వివాహం జరిపించారు. లేడీ లోజిన్ నిర్ఘాంతపోయారు. గౌరమ్మ తమ ఆడపడుచు అవడం లోజిన్కు ఇష్టం లేదు. కానీ రాణిగారి నిర్ణయం! 1861లో ప్రిన్స్ గౌరమ్మకు ఇరవై ఏళ్ల వయసులో ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు ఎడిత్ విక్టోరియా కాంప్బెల్ అని పేరు పెట్టారు. తర్వాత మూడేళ్లకు ప్రిన్స్ గౌరమ్మ 1864లో తన ఇరవై మూడవ యేట చనిపోయింది. ఆమె మరణానికి కారణం ఏమిటన్నది మాత్రం చరిత్రలో నమోదు అవలేదు! కుటుంబ సభ్యుల ప్రేమ కోసం, స్వేచ్ఛ కోసం పెనుగులాడిన లేడీ డయానా, మేఘన్ మార్కెల్ల జీవితంలోనూ నమోదు కానీ, నమోదు అయ్యే అవకాశం లేని వ్యక్తిగత విషయాలు ఉంటే ఉండొచ్చు. ఓప్రా విన్ ఫ్రేకు ఇచ్చిన ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్ -
మేఘన్ జాతివివక్ష ప్రకంపనలు
లండన్: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో జాతి వివక్షని ఎదుర్కొంటూ ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నటి మేఘన్ మార్కెల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మేఘన్ వెల్లడించిన విషయాలు బ్రిటన్ రాచకుటుంబాన్నే సంక్షోభంలో పడేశాయి. ఈ సంక్షోభ నివారణకు రాణి ఎలిజెబెత్–2 ఒక ప్రకటన కూడా సిద్ధం చేశారని , కానీ ఇంకా దానిని విడుదల చేయడానికి ముందు వెనుక ఆలోచిస్తున్నారంటూ బ్రిటన్లో ఓ వర్గం మీడియా కథనాలు ప్రసారం చేసింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఆ ఇంటర్వ్యూలో తమకి పుట్టబోయే బిడ్డపై కూడా రాచకుటుంబం చర్చించుకుందని, ఆ బిడ్డ నల్లగా పుడతాడని, అందుకే ప్రిన్స్ హోదా, భద్రత కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకుందని వెల్లడించారు. మేఘన్ జాతి వివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ను అడగ్గా ‘‘నాకు రాణి పట్ల అమితమైన గౌరవ భావం ఉంది. కామన్వెల్త్ దేశాలన్నింటినీ ఏకం చేసి ఉంచినందుకు ఆమెను ఎప్పటికీ ఆరాధిస్తాను’’అని జాన్సన్ పేర్కొన్నారు. ‘‘రాచకుటుంబ విషయాలపై తాను ఎప్పుడూ వ్యాఖ్యానించనని, ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉంటాను’’అని జాన్సన్ మాట్లాడేందుకు నిరాకరించారు. మరోవైపు ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు సర్ కేర్ స్టార్మర్ ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని అన్నారు. తూర్పు లండన్లో ఒక పాఠశాలని దర్శించడానికి వచ్చిన ఆయన దగ్గర మీడియా ఈ అంశాన్ని ప్రస్తావించగా ‘‘రాచకుటుంబం ఇలాంటి సంక్షోభంలో చిక్కుకోవడం అత్యంత విచారకరం. మేఘన్ చెప్పిన జాతివివక్ష, ఆమె మానసిక ఆరోగ్యమనేవి అత్యంత తీవ్రమైన అంశాలు. రాచకుటుంబం కంటే ఇవి పెద్ద విషయాలు. 21వ శతాబ్దాంలో బ్రిటన్లో జాతివివక్షకు సంబంధించిన ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి’’అని స్టార్మర్ వ్యాఖ్యానించారు. మరోవైపు మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ కొన్ని సంవత్సరాల తర్వాత తన కుమార్తె ఇలా మాట్లాడడం చూస్తున్నానని అన్నారు. స్పందించిన బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకంపనలకు కారణమైన ప్రిన్స్ హ్యారీ దంపతుల ఇంటర్వ్యూపై బిట్రన్ రాణి ఎలిజబెత్ ఎట్టకేలకు మౌనం వీడారు. హ్యారీ, మేఘన్ దంపతులు గడిచిన రెండేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసి ఆవేదన చెందుతున్నామనీ, వీటిని వ్యక్తిగతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొంటూ బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి మంగళవారం ఒక ప్రకటన విడుదలయింది. ముఖ్యంగా వర్ణ వివక్షపై వ్యక్త పరిచిన అంశాలు తీవ్రమైనవని పేర్కొంది. తమ కుటుంబానికి హ్యారీ, మేఘన్ దంపతులు ఎప్పటికీ అత్యంత ప్రియమైన వారిగానే ఉంటారని తెలిపింది. చదవండి: (ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా) -
రాజవంశం అసలు ‘రంగు’
ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఒరవడినందించిన బ్రిటన్... ఫ్యూడల్ ధోరణులకు ప్రతీకగా వుండే రాచరిక వ్యవస్థను ఇప్పటికీ భద్రంగా పరిరక్షించుకుంటూ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటుంది. రాజ కుటుంబమంటే ఆ దేశ పౌరుల్లో ఇప్పటికీ అంతో ఇంతో భక్తిప్రపత్తులుంటాయి. అక్కడ ఏం జరిగినా అది పెద్ద వార్తే. ఆ కుటుంబంలో చోటుచేసుకునే ఏ ఘటనైనా పతాకశీర్షికే. ఎందుకంటే బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఆ దేశాధినేత. కామన్వెల్త్ దేశాల్లోని చాలా దేశాలకు సైతం ఇప్పటికీ ఆమె అధిపతి. అలాగని ప్రభుత్వ వ్యవహారాల్లో ఆ కుటుంబం పాత్రేమీ వుండదు. వారిని సంప్రదించే వారూ వుండరు. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన రాజకుటుంబం ప్రస్తుతం గత కాలపు అవశేషం మాత్రమే. ఇన్నాళ్లూ ఆ కుటుంబంలోని ప్రేమ పురాణాలు, కోపతాపాలు అందరిలోనూ ఆసక్తిని రేపాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఆ రాజకుటుంబంలోని వ్యక్తుల నేలబారు తనం బజారునపడింది. ఆ కుటుంబంలో తనకెదురైన వేధింపుల పర్యవసానంగా ఆత్మహత్య ఆలోచనలు సైతం తనను చుట్టుముట్టాయని రాజకుటుంబంలోని చిన్న కోడలు మేఘన్ ఒక టీవీ ఇంటర్వూ్యలో చెప్పడం బ్రిటన్లో మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసూయ, ద్వేషం వగైరాలకు బ్రిటన్ రాజకుటుంబం సైతం మినహాయింపు కాదని గతంలో చాలాసార్లు రుజువైంది. కానీ ఇప్పుడు మేఘన్ అంతకన్నా దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడించారు. రాణి ఎలిజబెత్-2 తనతో బాగానే వ్యవహరించినా రాజకుటుంబంలోని ఇతరులు ఎప్పుడూ తనతో సక్రమంగా లేరని ఆమె చెప్పటం, ముఖ్యంగా తాను ఆఫ్రికన్-అమెరికన్ను గనుక తన రంగు గురించి, పుట్టబోయే బిడ్డ రంగు గురించి చర్చించుకోవటం... ఆ బిడ్డకు రాచరిక హోదా ఇవ్వాలా వద్దా అంటూ తర్కించుకోవటం తనను తీవ్రంగా కుంగదీశాయని ఆమె చెప్పటం సంచలనమైంది. వాస్తవానికి రాజవంశంలో అంతర్లీనంగావుండే అహంభావ ధోరణి, వర్ణ వివక్ష ప్రపంచానికి తెలియనివేమీ కాదు. మేఘన్కు ముందు ఆ కుటుంబంలో ప్రేమ వివాహాలున్నాయి. కానీ ఏ ఒక్కరూ శ్వేతజాతేతరుల్ని పెళ్లాడలేదు. అందుకే ప్రిన్స్ హ్యారీ మేఘన్ను వివాహం చేసుకోబోతున్న సంగతి వెల్లడైనప్పుడు అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆ విషయంలో వచ్చిన కలతల గురించి బ్రిటన్ టాబ్లాయిడ్లలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావటం తప్ప ఎవరూ తమకై తాము ధ్రువీకరించలేదు. అందుకే కొందరు ఆ కుటుంబం మారిందనుకున్నారు. కానీ అదంతా ఉత్త భ్రమగా తేలిపోయింది. మేఘన్ తమలో ఒకరిగా మారినా ఆ కుటుంబం దాన్ని జీర్ణించుకోలేక పోయిందని తాజాగా వెల్లడైన అంశాలు చెబుతున్నాయి. రాజకుటుంబం పట్ల సాధారణ పౌరుల్లో వుండే వినయవిధేయతలు, గౌరవప్రపత్తులకు తగినట్టు వారి వ్యవహార శైలి వుండటం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో వున్నాయి. హ్యారీ తల్లి లేడీ డయానా, తండ్రి ప్రిన్స్ చార్లెస్ల మధ్య కలతలు ఏర్పడినప్పుడు, వారు విడిపోయినప్పుడు అందరూ నోళ్లు నొక్కుకున్నారు. ఆదర్శప్రాయంగా వుండాల్సిన కుటుంబం ఇలా సమస్యల్లో చిక్కుకున్నదని నొచ్చుకున్నవారు కూడా వున్నారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఆ కుటుంబం మారిందని, కాలానుగుణంగా పద్ధతులు మార్చుకుందని భావించారు. అదంతా నిజంకాదని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. వర్తమానంలో జీవిస్తూ గతం చూరుపట్టుకు వేలాడేవారు ఎంతటి ఉన్నత స్థానాల్లో వున్నా భంగపాటు తప్పదని చరిత్ర రుజువు చేసింది. రాజకుటుంబ సభ్యుల్లో ఎవరూ దీన్ని గ్రహించిన దాఖలాలు లేవు. తమకు ఇకపై రాచరిక హోదాలు వద్దని హ్యారీ, మేఘన్ దంపతులు ప్రకటించినప్పుడే ఆ కుటుంబంలో ఏదో అవుతున్నదని అందరూ అనుకున్నారు. ఏం జరిగివుంటుందన్న ఊహాగానాలు అప్పటినుంచీ జోరుగానే సాగుతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా నామమాత్రావశిష్టంగా మారినా... బ్రిటన్ రాజకుటుంబానికి వుండే సౌకర్యాలు, ఆ హోదా వల్ల లభించే గౌరవ ప్రతిష్టలూ సామాన్యమైనవి కాదు. వాటిని వదులు కోవటం చిన్న విషయం కాదు. ప్రజాస్వామ్య భావజాలం శరవేగంతో ప్రపంచమంతా విస్తరించడంతో రాజులు పోయారు... రాజరికాలూ అంతరించాయి. కానీ వాటి తాలూకు అవశేషాలు మానవాళిని ఇంకా పట్టిపీడిస్తున్నాయి. మన దేశంలో వున్న కుల వ్యవస్థలాంటిదే పాశ్చాత్య దేశాల్లో అడుగడుగునా కనబడే వర్ణ వివక్ష. ఇక్కడ అణగారిన వర్గాలవారు జీవితపర్యంతమూ నిత్యం ఎదుర్కొనవలసి వచ్చే కుల వివక్షవంటిది అక్కడ జాత్యహంకారం రూపంలో నల్లజాతివారిని బాధిస్తుంటుంది. ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదువుకునే రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ వంటివారు ఈ వివక్ష భరించలేక ప్రాణాలు పోగొట్టుకుంటే... అక్కడ రాజ కుటుంబీకుణ్ణి పెళ్లాడిన మేఘన్ సైతం అదే కోవలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. వివక్ష ఒక మనిషిని మానసికంగా ఎంత కుంగ దీస్తుందో, ఎలాంటి దుష్ఫలితాలకు దారితీస్తుందో మేఘన్ ఉదంతం మరోసారి చాటింది. ప్రేమాభిమానాలు అడుగంటి, రంగు తప్ప మరేమీ ముఖ్యం కాదనుకుంటున్న రాజకుటుంబం నుంచి నిష్క్రమించి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు ఆ కుటుంబానికి ఒకరకంగా మేలు చేశారని చెప్పాలి. రాచరిక దర్పం కనీసం నామమాత్రంగానైనా మిగలాలంటే ముందు మనుషులుగా ప్రవర్తించటం నేర్చుకోవాలని వారు తెలియజెప్పారు. అది గ్రహించగలిగితే బ్రిటన్ రాజకుటుంబానికే మేలు చేకూరుతుంది. -
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
-
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
లాస్ ఏంజెలిస్/లండన్: ప్రిన్స్ హ్యారీతో వివాహమయ్యాక బ్రిటన్ రాచకుటుంబంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలను అనుభవించానని ఆఫ్రికన్ అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ వెల్లడించారు. చాలా ఒంటరితనం అనుభవించానని, తన మానసిక వేదనకు పరిష్కారం లేదనిపించిందని, ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించానని వెల్లడించారు. ఇక జీవించాలనుకోవడం లేదని హ్యారీతో కూడా చెప్పానన్నారు. ఈ విషయంలో వైద్య సహాయం పొందేందుకు కూడా అవకాశం కల్పించలేదని, దానివల్ల రాజకుటుంబ పరువుప్రతిష్టలకు భంగం కలుగుతుందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చాట్ షోలో పలు సంచలన విషయాలను ఆమె ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో పంచుకున్నారు. అమెరికాలో సీబీఎస్ నెట్వర్క్ చానల్లో ఆదివారం ఆ కార్యక్రమం ప్రసారమైంది. కుటుంబంతో విభేదాల కారణంగా గత సంవత్సరం మార్చిలో ప్రిన్స్ హ్యారీ దంపతులు, తమ ఏడాది కుమారుడు ఆర్చీతో కలిసి రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. ఓప్రా విన్ఫ్రే కార్యక్రమంలో మేఘన్ భర్త ప్రిన్స్ హ్యారీ కూడా పాల్గొని, పలు రాచకుటుంబ రహస్యాలను వెల్లడించారు. వివాహం తరువాత కొత్తగా రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు కొద్ది రోజుల తరువాత ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ ఎదురయ్యాయని మేఘన్ తెలిపారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఊహించని స్థాయిలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానన్నారు. నలుపురంగులో పుడితే ఎలా..? ‘పుట్టబోయే చిన్నారి రంగు గురించి రాచకుటుంబం మాట్లాడుకుంది. నేను నలుపు కనుక బిడ్డ కూడా నలుపు రంగులోనే పుడితే ఎలా?’అని వారు ఆలోచించారని తెలిపారు. పుట్టబోయే బిడ్డకు రాజకుటుంబం నుంచి లభించే ‘ప్రిన్స్’హోదా ఇవ్వకూడదని నిర్ణయించారని, అందువల్ల రాజకుటుంబ సభ్యులకు లభించే భద్రత కూడా అందదని తేల్చేశారని వివరించారు. ఈ విషయాలను హ్యారీ తనతో పంచుకున్నారని, వాటిని జీర్ణించుకోవడం తమకు కొన్నాళ్ల పాటు సాధ్యం కాలేదని తెలిపారు. అయితే, బిడ్డ రంగు గురించిన వ్యాఖ్యలు ఎవరు చేశారన్న విషయాన్ని మేఘన్ వెల్లడించలేదు. వారి పేరు చెబితే.. వారి ప్రతిష్టకు భారీగా భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఆ విషయమై తనతో రాజకుటుంబ సభ్యులు జరిపిన సంభాషణను తాను కూడా బయట పెట్టాలనుకోవడం లేదని హ్యారీ కూడా స్పష్టం చేశారు. కుటుంబం నుంచి దూరంగా వచ్చేసిన తరువాత తన ఫోన్ కాల్స్ను కూడా తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ స్వీకరించలేదని హ్యారీ తెలిపారు. అంతకుముందు, నానమ్మ ఎలిజబెత్ రాణితో మూడు సార్లు, తండ్రి ప్రిన్స్ చార్లెస్తో రెండు సార్లు మాత్రం మాట్లాడానన్నారు. ‘నా కుటుంబం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమే. కానీ తప్పదు. నేను, నా భార్య మేఘన్, కుమారుడు ఆర్చీల మానసిక ఆరోగ్యం కోసం రాజ కుటుంబానికి దూరం కావాలన్న నిర్ణయం తీసుకున్నాను’అని హ్యారీ వివరించారు. అవన్నీ అవాస్తవాలు.. బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయిందని హ్యారీ వివరించారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్ డయానా తన కోసం దాచిన ఆస్తులే తమను ఆదుకున్నాయన్నారు. తమ వివాహం తరువాత రాజకుటుంబం తనకు, తన భర్తకు సరైన భద్రతను కూడా కల్పించలేదని మేఘన్ ఆరోపించారు. రాయల్ వెడ్డింగ్ సందర్భంగా ఫ్లవర్ గర్ల్ డ్రెసెస్ విషయంలో తన తోటి కోడలు, ప్రిన్స్ విలియం భార్య, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేథరిన్(కేట్) మిడిల్టన్ తన కారణంగా కన్నీళ్లు పెట్టుకున్నారన్న వార్తలను ఓప్రా విన్ఫ్రే ప్రస్తావించగా.. అవన్నీ అవాస్తవాలని మేఘన్ తెలిపారు. ‘నిజానికి జరిగింది వేరే. ఆ ఘటనతో నేనే ఏడ్చాను. ఆ తరువాత కేట్ నన్ను క్షమాపణలు కూడా కోరింది’అని వెల్లడించారు. ‘నిజానికి రాయల్ వెడ్డింగ్కు మూడు రోజుల ముందే మాకు వివాహం జరిగింది. అది మాకు మాత్రమే ప్రత్యేకమైన ప్రైవేట్ విషయం’అని మేఘన్ పేర్కొన్నారు. వివాహమైన మొదట్లో బాగానే చూసుకున్నారని, ఆ తరువాతే వారిలో మార్పు వచ్చిందని మేఘన్ వివరించారు. ‘మొదట్లో నేనేం చేయాలో, ఎలా ప్రవర్తించాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు’అన్నారు. ఎలిజబెత్ రాణితో తనకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల అస్వస్థతకు గురైనప్పుడు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడానని వివరించారు. ‘రాజకుటుంబ క్రియాశీల బాధ్యతల నుంచి తప్పుకుని ఎలిజబెత్ రాణిని బాధపెట్టారా?, ఆమెకు చెప్పకుండా ఆ నిర్ణయం తీసుకున్నారా?’అన్న ప్రశ్నకు.. ఈ విషయమై నానమ్మకు, తనకు మధ్య పలుమార్లు చర్చ జరిగిందని హ్యారీ వెల్లడించారు. నానమ్మ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. పాప పుట్టబోతోంది రెండో సంతానంగా తమకు పాప పుట్టబోతోందని ప్రిన్స్ హ్యారీ, మేఘన్లు వెల్లడించారు. ‘ఫస్ట్ కుమారుడు. ఇప్పుడు పాప. ఇంతకన్నా ఏం కావాలి? మేం నలుగురం. మాతో పాటు రెండు కుక్కలు. ఇదే మా కుటుంబం’అని హ్యారీ ఆనందంగా వివరించారు. టాక్షోలో ఓప్రా విన్ఫ్రే మొదట మేఘన్తో కాసేపు మాట్లాడిన తరువాత, వారితో హ్యారీ జతకలిశారు. -
ప్యాలెస్లో ఉండగా చనిపోవాలనిపించింది: మేఘన్
వాషింగ్టన్: అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే నిర్వహించే ఇంటర్వ్యూలంటే ప్రపంచ వ్యాప్తంగా జనాలు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూలు సాధరణంగా ఉండవు.. వచ్చిన అతిథులు మనసు విప్పి మాట్లాడేలా చేసే శక్తి ఓప్రా సొంతం. ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం శనివారం ప్రసారం అయిన ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు జనాలు. ముఖ్యంగా బ్రిటన్ ప్రజలు. ఎందుకంటే ఈ సారి ఓప్రా ఇంటర్వ్యూ చేసింది.. రాజకుటుంబం నుంచి వేరు పడిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ని. కనుక ఈ ఇంటర్వ్యూ పట్ల అధిక ఆసక్తి కనబరిచారు. ఇక యువరాజు హ్యారీ దంపతులు ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూ శనివారం ప్రసారమయ్యింది. తన క్యారక్టర్పై మీడియా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడి మేఘన్ మార్కెల్.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమ వివాహం జరిగిన తీరు, ఆ సమయంలో జరిగిన సంఘటనలను మేఘన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకుటుంబం అధికారికంగా వివాహం నిర్వహించడానికి మూడు రోజుల ముందే తాము రహస్యంగా పెళ్లిచేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, కానీ, ఆర్చ్బిషప్ను పిలిచి తామే ఆయనతో చెప్పామన్నారు మేఘన్. ‘‘ఈ విషయం, ఈ దృశ్యం ప్రపంచం కోసం, కానీ మా ఇద్దరి మధ్య బంధం ముడిపడిపోయింది’’ అని ఆర్చ్బిషప్తో చెప్పినట్టు వివరించారు. హ్యారీ, మేఘన్ మార్కెల్కు అధికారికంగా 2018 మే 19న బెర్క్షైర్ కౌంటీలోని విన్సర్ పట్టణంలోని రాజ భవనం విన్సర్ క్యాజిల్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. గాసిప్లతో సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సి వచ్చిందని, ఇదే రాజకుటుంబంతో సంబంధాల్లో మలుపు తిప్పిందని అన్నారు. ఇది నిజం కాదని అక్కడ ప్రతి ఒక్కరికీ తెలుసు, కానీ ప్రచారం మాత్రం రివర్స్లో జరిగిందన్నారు. ఇంటర్వ్యూలోని ఆసక్తికర అంశాలు.... మేఘన్-హ్యారీకి తొలుత కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే పుట్టిన బిడ్డ విషయంలో రాజ కుటుంబం దారుణంగా ప్రవర్తించిందని.. ప్రొటోకాల్ ప్రకారం తమ బిడ్డకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని.. పైగా బిడ్డ రంగు గురించి మాట్లాడుకున్నారని తెలిపారు మేఘన్. ప్యాలెస్లో ఉన్నప్పుడు చాలా సార్లు తాను ఒంటిరిగా ఫీలయ్యానని.. చాలా సార్లు చనిపోవాలనిపించింది అన్నారు మేఘన్. తమ వివాహ సమయంలో తోటి కోడలు కేట్ ఏడ్చిందనే వార్తలను మేఘన్ ఖండించారు. ఈ విషయంలో రివర్స్లో ప్రచారం జరిగిందని.. వాస్తవానికి ఏడ్చింది తాను అన్నారు మేఘన్. తన డ్రెస్ విషయంలో కేట్ తనపై కేకలు వేసిందని.. అది తనను చాలా బాధించిందని తెలిపారు. ఈ పరిణామం తర్వాత మీడియాతో తన సంబంధాలు పూర్తిగా మారిపోయాయి అన్నారు. తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం ప్యాలెస్లోని వారు ఎన్ని అబద్దాలు ఐనా చెప్తారన్నారే మేఘన్. తాము రాజ కుటంబం నుంచి విడిపోయి.. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి విడిగా బతకాలని వెల్లడించినప్పటి నుంచి ప్యాలెస్ నుంచి తమకు డబ్బు రావడం ఆగిపోయిందని తెలిపారు హ్యారీ. తన తల్లి డయానా తన కోసం దాచిన సొమ్ముతోనే ప్రస్తుతం కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపారు. సెక్యూరిటీని కూడా తొలగించారన్నారు. మేఘన్ వల్లనే తాను కుటుంబం నుంచి విడిపోయాననే వార్తల్ని హ్యారీ ఖండించారు. మేఘన్ నా జీవితంలోకి రాక ముందు నుంచే నేను ఈ చట్రం నుంచి బయటపడాలని భావించాను. ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రాప్ చేయబడ్డారు. నా తండ్రి, సోదరుడు అందరు ట్రాప్ చేయబడ్డారు.. కానీ వారు బయటపడలేరు.. వారిని చూస్తే నాకు జాలేస్తుంది’’ అన్నారు. అన్నదమ్ములిద్దరి మధ్య ప్రస్తుతం గ్యాప్ వచ్చిందని.. కానీ కాలమే అన్నింటిని నయం చేస్తుందని తెలిపారు హ్యారీ. ‘‘విలియమ్ అంటే నాకు చాల ప్రేమ.. తను నా సోదరుడు. మేం మా అభిప్రాయలను ఒకరితో ఒకరం పంచుకుంటాము. కానీ మేం ఇద్దరం వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నాం’’ అన్నారు. అంతేకాక త్వరలోనే తమకు ఆడపిల్ల పుట్టబోతుంది అని తెలిపారు. చదవండి: ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా -
మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా
లండన్: బ్రిటన్ రాచరిక కుటుంబాన్ని వీడి రావడానికి మీడియా పెట్టిన ఒత్తిడే కారణమని ప్రిన్స్ హ్యారీ నిందించారు. బ్రిటన్ మీడియా తమ కుటుంబాన్ని ఊపిరాడనివ్వకుండా చేసిందని, దీని వల్ల ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని వెల్లడించారు. అమెరికాలోని సీబీఎస్ చానెల్లో జేమ్స్ కార్డన్ హోస్ట్గా నిర్వహించే లేట్ లేట్ షో కార్యక్రమంలో హ్యారీ పాల్గొన్నారు. ప్రజా సేవ నుంచి తానేమీ దూరంగా పారిపోలేదని స్పష్టం చేశారు. ‘‘‘నేను ఎప్పుడూ ప్రజల నుంచి దూరంగా పారిపోవాలని అనుకోలేదు. కానీ బ్రిటన్ మీడియా వల్ల ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నా మానసిక ఆరోగ్యం దెబ్బ తింది. అలాంటప్పుడు ప్రతీ భర్త, ప్రతీ తండ్రి ఏం చేద్దామనుకుంటారో నేనూ అదే చేశాను. ఇది బాధ్యతల్ని విడిచిపెట్టడం కాదు. ఒక్క అడుగు వెనక్కి వేయడమే. బ్రిటన్ మీడియా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే’’అని అన్నారు. ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘన్ మెర్కల్ గత ఏడాది జనవరిలో రాచ కుటుంబాన్ని వీడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జంట ఇప్పడు ఇక పూర్తిగా రాచ కుటుంబానికి దూరమయ్యారని గత వారమే బకింగ్çహామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చడానికి ముందు బ్రిటన్లోని టాబ్లాయిడ్లు తమపై జాతి వివక్షని ప్రదర్శించాయంటూ హ్యారీ దంపతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మెఘన్ తండ్రి శ్వేతజాతీయుడు కాగా,తల్లి ఆఫ్రికన్ అమెరికన్ కావడంతో బ్రిటన్ పత్రికల రాతలు తమను బాధించాయని హ్యారీ చెప్పారు. ఆ సిరీస్ అంతా కట్టుకథే రాచకుటుంబాన్ని వీడిన తర్వాత హ్యారీ ఒక చానెల్కి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. రాణి ఎలిజెబెత్పై నెట్ఫ్లిక్స్లో వచ్చిన ది క్రౌన్ సిరీస్లో వాస్తవాలేవీ చూపించలేదని ధ్వజమెత్తారు. నిజజీవితంలో తమ కుటుంబం ఎదుర్కొన్న ఒత్తిళ్ల కంటే, మీడియా కథనాల వల్ల ఎక్కువ ఒత్తిళ్లు ఎదురవుతున్నాయంటూ హ్యారీ వ్యాఖ్యానించారు. -
ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు
లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘన్ మార్కెల్ బ్రిటన్ రాజ కుటుంబంలోకి క్రియాశీల సభ్యులుగా తిరిగి రారని బకింగ్ హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. హ్యారీ నానమ్మ, రాణి ఎలిజబెత్–2(94) తరఫున విడుదల చేసిన ఆ ప్రకటనలో..‘డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ(36), ఆయన భార్య డచెస్ ఆఫ్ సస్సెక్స్ మెఘన్ మార్కెల్(39) ఏడాదిలోగా తిరిగి క్రియాశీల విధుల్లోకి చేరతామంటూ చేసిన ప్రకటన గడువు పూర్తి కావస్తోంది. దీంతో నిర్ణయం తెలపాల్సిందిగా రాణి వారికి లేఖ రాశారు. తాము తిరిగి రామంటూ హ్యారీ దంపతులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ విధులన్నీ తిరిగి రాణికే దఖలు పడ్డాయి. వాటిని ఆమె కుటుంబంలోని ఇతరులు తిరిగి పంపిణీ చేయనున్నారు’అని ఆమె వివరించింది. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్న ప్రిన్స్ హ్యారీ దంపతులు గత ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిప్పుడు అమెరికాలో నివాసం ఉంటున్నారు. -
శుభవార్త చెప్పిన మేఘన్ మార్కెల్
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి తొందర్లోనే మరో వారసుడు రానున్నాడు. బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని బంకింగ్ హమ్ ప్యాలెస్ ప్రతినిధి వాలెంటైన్స్డే రోజున ప్రకటించారు. కాగా, 2018 పెళ్లి బంధంతో ఒక్కటైన హ్యారీ, మార్కెల్ దంపతులకు ఇప్పటికే ఆర్చి జన్మించాడు. కాగా, రాజకుటుంబానికి చెందిన కొన్ని ఆంక్షలు, విభేదాల కారణంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఈ జంట ఉత్తర అమెరికాలోని నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట కాలిఫోర్నియాలోని శాంటా బార్బారాలో ఒక ఇల్లును కూడా కొనుగొలు చేశారు. ఇదిలా ఉండగా.. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా 2020లో మార్కెల్కు గర్భస్రావం అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. తండ్రితో ఉన్న విభేదాల కారణంగా మార్కెల్ తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నారని, ఆ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం దెబ్బతిని గర్భస్రావానికి దారి తీసినట్టు తెలిసింది. -
వైరల్ అవుతున్న క్రిస్మస్ కార్డు
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ యువరాజు హారి, మేగన్ మార్కెల్ దంపతులు క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన శుభాకాంక్షల కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమ పెంపుడు శునకాల సమక్షంలో రాజ దంపతులు తమ పుత్రరత్నం ఆర్కీతో ముచ్చటిస్తున్న దశ్యంతో ఆ కార్డు విశేషంగా ఆకర్షిస్తోంది. బ్రిటిష్ రాజ కోటల నుంచి ఆ రాజదంపతులు కాలిఫోర్నియాలోని మాంటెసిటి భవనానికి మారిన తర్వాత వారు విడుదల చేసిన తొలి క్రిస్మస్ కార్డు ఇదే కావడం ఓ విశేషం. అయితే తమ తోటలోని చిన్న కుటీరం ముందు పెంపుడు కుక్కలు పూల, గైల సమక్షంలో ఓ చిన్ని క్రిస్మస్ టీ వద్ద వారు ఆర్కీతో ముచ్చటిస్తున్న దశ్యం కూడా చూపరులను ఆకట్టుకుంటోంది. ఆ దశ్యం ఓ అద్భుతమైన పెయింటింగ్లా కనిపిస్తున్నప్పటికీ అది పెయింటింగ్ ఎంత మాత్రం కాదు. అది ఫొటో. దాన్ని మార్కెల్ తల్లి స్వయంగా కెమేరాతో తీయగా, దాన్ని ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా ఓ పెయింటింగ్లా మార్చారు. క్రిస్మస్ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయంగా పలు చారిటీ సంస్థలకు తాము విరాళాలు పంపించినట్లు ఆ క్రిస్మస్ కార్డు ద్వారా మార్కెల్ తెలియజేశారు. ఆ రాజా దంపతులు 18 నెలల క్రితం మాంటెసిటీకి మారారు. అక్కడ 15 మిలియన్ డాలర్లతో (దాదాపు 110 కోట్ల రూపాయల డాలర్లు) ఓ భవనం కొనుగోలు చేసి అందులో ఉంటున్నారు. -
నువ్వు బాగున్నావు కదా?
‘ఆర్యూ ఓకే’ అనే భావం భర్త చూపుల్లో మేఘన్కు కనిపించింది! హాస్పిటల్ బెడ్పైన ఉంది మేఘన్. భర్త అలా చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. గుండె పగిలి ఒక్కసారిగా ఏడ్చేసింది. మాతృత్వం! ఆ భావనలోనే అమృతం దాగుంది. దేవుడు స్త్రీకిచ్చిన వరం మాతృత్వం అని అంటుంటారు. అందుకే ఎన్నిసార్లు తల్లయినా, మళ్లీ మరో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ అమ్మదనాన్ని స్త్రీ కొత్తగా కోరుకుంటుంది. గర్భంలో అప్పుడే ప్రాణం పోసుకుంటున్న జీవిని కంటికి రెప్పలా కాచుకుంటుంది. అయిన వారందరికీ చెప్పుకొని మురిసిపోతుంది. పుట్టబోయే బిడ్డని అందనంత ఎత్తులో చూడాలని కలలు కంటుంది. కానీ.. ఆ కలలు అర్ధంతరంగా కల్లలైపోతే! రేపో మాపో పుడుతుందనుకున్న నలుసు కడుపులోనే కరిగి, అందని లోకాలకు వెళ్లిపోతే! ఆ బాధను భరించడం ఏ తల్లికీ తరం కాదు. ఆ తల్లి కన్నీటిని తుడవడం ఏ ఒక్కరికీ వశం కాదు. 2020 జూలై. అప్పుడే రోజు మొదలవుతోంది. గర్భంతో ఉన్న మేఘన్ మార్కెల్ తన మొదటి కొడుకు డైపర్ మార్చుతోంది. అకస్మాత్తుగా తెలీని నిస్సత్తువ ఏదో ఆవరించినట్లు ఆమె శరీరమంతా తిమ్మిర్లు మొదలయ్యాయి. చేతుల్లో ఒక బిడ్డ, కడుపులో మరో బిడ్డ. చేతుల్లోని ఏడాది బిడ్డను ఉన్నఫళంగా వదిలేయలేదు. వదిలేయకుంటే తనలో ప్రాణం పోసుకుంటున్న మరో బిడ్డపై ఆ క్షణాన పడుతున్న ఒత్తిడి ఏమిటో తెలుసుకోలేదు. మనసేదో కీడు శంకిస్తోంది. ఏమిటది? ఆలోచించే లోపే తనకు తెలీకుండానే చేతుల్లో ఉన్న బాబుతో సహా కింద పడిపోయింది. కళ్లు తెరిచి చూసేసరికి ఆసుపత్రి పడకపై ఉంది! పక్కన భర్త హ్యారీ ఓదార్పుగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కళ్లు తెరిచాక, ‘నువ్వు బాగున్నావ్ కదా?!’ అనే భావం అతడి చూపుల్లో ఆమెకు కనిపించింది. ఆమె చెయ్యి విడువకుండా, దుఃఖాన్ని దిగమింగుకొని, కడుపులోని జీవం కడుపులోనే పోయిందని చెప్పలేకపోతున్నాడు. కడుపు కోతంటే కేవలం తల్లిది మాత్రమే కాదు తండ్రిది కూడా. విషయం ఆమె గ్రహించింది! ఒక్కసారిగా ఆమె గుండె పగిలి పోయింది. తట్టుకోలేక పోయింది. భోరున ఏడ్చేసింది. ∙∙ ప్రిన్స్ హ్యారీని ప్రేమించి, పెళ్లాడి బ్రిటన్ రాజవంశంలోకి అడుగుపెట్టిన మేఘన్ మార్కెల్ను ఈ చేదు ఘటన ఒక్కసారిగా తలకిందులు చేసింది. భర్త హ్యారీ, ముద్దులొలికే తమ చిన్నారి కుమారుడు ఆర్చీ మాత్రమే లోకంగా జీవిస్తూ వస్తోంది ఆమె ఇంతవరకూ. ‘మొదటి బిడ్డను పుట్టగానే నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించానో.. రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపుగా బాధపడ్డాను’ అని తాజాగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు రాసిన వ్యాసంతో ఆమె తన వ్యధను దిగమింగుకోలేకపోయారు. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో పంచుకోవడం ఇదే ప్రథమం కాకపోవచ్చు. కానీ ఎంతో ఆవేదనా భరితంగా ‘ది లాసెస్ వియ్ షేర్’ అనే ఆ వ్యాసం కొనసాగింది. కొద్దికాలం క్రితమే బ్రిటన్ రాజప్రాసాదాన్ని వీడిన ఈ దంపతులు ప్రస్తుతం లాస్ ఏజెలిస్లో ఉంటున్నారు. తన వ్యాసంలోనే ఇంకో మాట కూడా రాశారు మేఘన్. గత ఏడాది ప్రిన్స్ హ్యారీ, తను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు.. ‘ఆర్యూ ఓకే’ అని మేఘన్ను అడిగారట. అది మామూలు ప్రశ్నే అయినా అలాంటి పలకరింపు ప్రతి మహిⶠకూ అవసరం అని మేఘన్ అన్నారు. బహుశా తనను వద్దనుకున్న రాజప్రాసాద బాంధవ్యాలను తలచుకుని అలా రాసి ఉండవచ్చు. ఏమైనా భర్త తన పక్కన ఉన్నాడు. ‘ఆర్యూ ఓకే’ అని అతడు తనని అడుగుతున్నట్లే ఉంది ఆమెకు ప్రతి క్షణం. – జ్యోతి అలిశెట్టి, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం -
కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను
లండన్: అమ్మవ్వడంలో ఉండే ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిస్తేనే తమ జీవితానికి ఓ అర్థం అని భావించే ఆడవారు కొకొల్లలు. బిడ్డను కనడం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో.. అలానే కడుపులోని ప్రాణి బయటకు రాకముందే కన్నుమూస్తే.. ఆ బాధ వర్ణణాతీతం. అనుభవించడం తప్ప మాటల్లో చెప్పడం కష్టం. ఈ క్రమంలో డచెస్ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సంచలన విషయాలు వెల్లడించారు. రెండవ సారి గర్భవతి అయ్యాక తనకు అబార్షన్ అయ్యిందని.. పుట్టకముందే ఓ బిడ్డను పొగొట్టుకున్నానని తెలిపారు. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో మాట్లాడటం ఇదే ప్రథమం. దాంతో ప్రస్తుతం మేఘన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. (చదవండి: ‘ప్రపంచం మొత్తం మీద నా మీదే ఎక్కువ ట్రోలింగ్’) మేఘన్ మార్కెల్ న్యూయార్క్ టైమ్స్తో మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లడించారు. విషాదం గురించి మాట్లాడుతూ.. ‘మొదటి బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించాను రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపు బాధపడ్డాను. బిడ్డను కొల్పోవడం అంటే భరించలేని బాధను మోయడం. ఎందరో అనుభవిస్తారు.. కొందరు మాత్రమే బయటకు వెల్లడిస్తారు. గుండెని పిండే ఈ వార్త నాకు తెలిసినప్పడు నేను ఆస్పత్రి బెడ్ మీద ఉన్నాను.. నా భర్త నా పక్కనే ఉన్నాడు. కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను. ఆ తర్వాత నేను, నా భర్త నాలానే అబార్షన్ అయ్యి బిడ్డను కోల్పోయిన కొందరిని కలుసుకున్నాము. బాధలో తేడా లేదు. కానీ వీరిలో కొందరు తమకు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడ్డారు. ఒంటరిగా బాధను భరించారు’ అని తెలిపారు. ఇక ఈ ఆర్టికల్లో మేఘన్ అనేక సన్నిహిత వివరాలను వెల్లడించారు. మేఘన్, హ్యారీ దంపతులకు కుమారుడు ఆర్చీ ఉన్నారు. (చదవండి: అభద్రతకు గురైన మేఘన్ మార్కెల్) బ్రిటీష్ రాజకుటుంబంలోని సీనియర్ సభ్యుల వ్యవహార శైలికి భిన్నంగా మేఘన్ వ్యక్తిగత వివరాలు తెలిపారు. ఇక 68 ఏళ్ల పాలనాకాలంలో క్వీన్ ఎలిజబెత్ ఎన్నడు ఏ మీడియా సమావేశంలో కూడా తన వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయలేదు. ఇక హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియం, అతడి భార్య కేట్ ఇప్పటి వరకు ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. ప్రతిసారీ పుట్టిన బిడ్డతో కలిసి దంపతులు మీడియాకు ఫోజులిచ్చేవారు. విలియం-కేట్ దంపతులు కూడా తమ వ్యక్తిగత జీవితం గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. -
‘ప్రపంచం మొత్తం మీద నా మీదే ఎక్కువ ట్రోలింగ్’
లాస్ఏంజెల్స్: మేఘన్ మార్కెల్.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ నటిగా తనను తాను నిరూపించుకున్నారు. సెలబ్రిటీ హోదాను అనుభవించారు. ప్రిన్స్ హ్యారీని ప్రేమించి, పెళ్లాడి బ్రిటన్ రాజవంశ కోడలిగా ప్యాలెస్లో అడుగుపెట్టిన తర్వాత ఆమె ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. అయితే రాచ కుటుంబ సభ్యురాలైనంత మాత్రాన ఎన్నడూ తనకున్న ప్రత్యేక గుర్తింపును, అస్థిత్వాన్ని మేఘన్ కోల్పోలేదు. ప్రాణంగా ప్రేమించే భర్త హ్యారీ, ముద్దులొలికే తమ చిన్నారి కుమారుడు ఆర్చీ మాత్రమే లోకంగా బతకాలనుకున్నారు. అందుకోసం రాజ కుటుంబం నుంచి విడిపోయేందుకు కూడా ఆమె వెనుకాడలేదు. భర్తతో కలిసి ధైర్యంగా ముందడుగు వేసి రాజప్రాసాదాన్ని వీడి అమెరికాలో సెటిలయ్యారు. రాచ మర్యాదలు, కట్టుదిట్టమైన భద్రత వంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా జీవితం గడుపుతున్నారు. తన ఉనికిని చాటుకుంటూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న మేఘన్ మార్కెల్ ఒక విషయంలో మాత్రం తీవ్రంగా వేదన చెందారట. గర్భవతిగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ ఆమెపై తీవ్ర ప్రభావం చూపిందట. (చదవండి: జోకొట్టే పాపాయి) అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘టీనేజ్ థెరపీ’ పోడ్కాస్ట్లో భాగంగా మేఘన్ మార్కెల్ తన మనసులోని భావాలు పంచుకున్నారు. కాలిఫోర్నియా హై స్కూలుకు చెందిన సీనియర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. ‘‘ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోవడానికి, ప్రపంచంతో అనుసంధానం కావడానికి సోషల్ మీడియా ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో వ్యతిరేక ప్రభావం కూడా చూపుతుంది. నాకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడతాను. మీకు తెలుసా! 2019లో ప్రపంచం మొత్తం మీద విపరీతంగా ట్రోలింగ్ బారిన పడిన వ్యక్తిని నేనే. అప్పుడు ఆర్చీ నా పొట్టలో ఉన్నాడు. ఆ సమయంలో ఆన్లైన్ ద్వారా నా మీద తీవ్ర స్థాయిలో విద్వేషపూరిత కథనాలు వెలువడ్డాయి. అలాంటి అనుభవాలు ఎదుర్కోవడం కాస్త కష్టం. కానీ నేను వాటిని అధిమించాను. అయితే మన గురించి అసత్యాలు ప్రచారమవుతున్నాయని తెలిసినప్పుడు భావోద్వేగానికి లోనవుతాం. అంతిమంగా ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పదిహేనేళ్ల టీనేజర్లు అయినా, 25 ఏళ్ల యువత అయినా.. ఎవరైనా సరే అలాంటి సమయంలో ఒకే రకమైన ఉద్వేగానికి గురవుతారు. ప్రపంచం తమను వేరుచేసినట్లు భావిస్తారు’’అని చెప్పుకొచ్చారు. అయితే వీలైనంత తొందరగా ఇలాంటి ప్రతికూల భావనల నుంచి బయటపడి, మానసిక స్థైర్యంతో ముందుకు సాగితే జీవితాన్ని మళ్లీ సంతోషమయం చేసుకోవచ్చని సూచించారు. View this post on Instagram Thanks Cape Town for another impactful and memorable day! A few more highlights of this very special visit with Archbishop Desmond Tutu #RoyalVisitSouthAfrica Video ©️SussexRoyal A post shared by The Duke and Duchess of Sussex (@sussexroyal) on Sep 25, 2019 at 12:06pm PDT -
అభద్రతకు గురైన మేఘన్ మార్కెల్
లండన్: డచెస్ ఆఫ్ ససెక్స్, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ గర్భవతిగా ఉన్న సమయంలో రాయల్ ఫ్యామిలీ నుంచి రక్షణ లేదనే భావానికి లోనయ్యారట. ఓ టాబ్లాయిడ్ న్యూస్పేపర్పై వేసిన దావా కేసులో మేఘన్ తరఫు లాయర్లు కోర్టుకు అందజేసిన పత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. (టిక్టాక్ బ్యాన్: చైనాకు ఎంత నష్టమో తెలుసా?) 2018 ఆగస్టులో మేఘన్ తన తండ్రి థామస్ మార్కెల్కు రాసిన ఉత్తరాలు ఇవేనంటూ అసోసియేటెడ్ న్యూస్ పేపర్స్ అనే పబ్లిషర్కు చెందిన ‘ది మెయిల్’ట్యాబ్లాయిడ్లో ప్రచురించింది. మేఘన్, ఆమె తండ్రికి మధ్య చానాళ్లుగా విభేదాలు ఉన్నాయి. థామస్, మేఘన్ పెళ్లికి హార్ట్ సర్జరీ వల్ల హాజరుకాలేకపోయారు. (ఈ వార్త చదివితే జన్మలో బీరు తాగరు) మేఘన్కు అతి సన్నిహితులైన ఐదుగురు స్నేహితులు చెప్పారంటూ లేఖల్లోని సారాంశాన్ని ది మెయిల్ టాబ్లాయిడ్లో రాసుకొచ్చింది. దీనిపై మేఘన్ మానసిక సంఘర్షణకు గురయ్యారని, మెంటల్ హెల్త్ దెబ్బతిందని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు దాఖలు చేసిన దావా పత్రాల్లో పేర్కొన్నారు. మేఘన్, హ్యారీ దంపతులకు కుమారుడు ఆర్చీ ఉన్నారు. -
ట్రంప్కు ప్రిన్స్హ్యారీ, మార్కెల్ కౌంటర్
వాషింగ్టన్ : ప్రిన్స్హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులకు తాము భద్రత ఖర్చులను చెల్లించలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్పై హ్యారీ దంపతులు స్పందించారు. తమకు ట్రంప్ ఏమాత్రం సహాయం చెయాల్సిన అవసరం లేదని, తమ వ్యక్తిగత భద్రత ఖర్చులను తామే భరిస్తామని ట్రంప్కు ట్విటర్ వేదికగా బదులిచ్చారు. కాగా బ్రిటన్ రాజకుటుంబ నుంచి విడిపోయిన అనంతరం ప్రిన్స్హ్యారీ, మార్కెల్ జంట తొలుత కెనడా స్థిరపడిన విషయం తెలిసిందే. అనంతరం అమెరికాలోని లాక్ఏంజెల్స్కు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో వారికి తమ ప్రభుత్వం భద్రత కల్పించే ప్రసక్తేలేదంటూ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్కు వ్యతిరేకంగా హ్యారీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వారి భద్రతకు ట్రంప్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ‘నేను.. యునైటెడ్ కింగ్డమ్, ఆదేశ రాణికి మంచి స్నేహితుడిని. రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చిన హ్యారీ, మేఘన్.. కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని తెలిసింది. ఇప్పుడు వారు కెనడా నుంచి యుఎస్కు వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారి భద్రతా ఖర్చులు మా ప్రభుత్వం చెల్లించదు. వారే స్వయంగా చెల్లించాలి’ అని అంతకుముందు ట్రంప్ ట్విటర్లో పేర్కొన్నారు. -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్లకు ట్రంప్ ఝలక్
వాషింగ్టన్ : ప్రస్తుతం కెనడాలో నివశిస్తున్న ప్రిన్స్హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు అమెరికాకు వస్తే వారి భద్రతా ఖర్చులను తమ ప్రభుత్వం చెల్లించే ప్రసక్తేలేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘నేను.. యునైటెడ్ కింగ్డమ్, ఆదేశ రాణికి మంచి స్నేహితుడిని. వారిపై నాకు ఎంతో అభిమానం ఉంది. రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చిన హ్యారీ, మేఘన్.. కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని తెలిసింది. ఇప్పుడు వారు కెనడా నుంచి యుఎస్కు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హ్యారీ దంపతులు యూఎస్ వస్తే వారి భద్రతా ఖర్చులు మా ప్రభుత్వం చెల్లించదు. వారే స్వయంగా చెల్లించాలి’ అని ట్రంప్ పేర్కొన్నాడు. (కరోనా కరాళ నృత్యం) కాగా గతేడాది క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యరీ, మేఘన్ దంపతులు జనవరిలో రాచరిక హోదాను, బ్రిటీష్ రాజ కుటుంబం నుంచి వేరుపడ్డ విషయం తెలిసిందే. స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకున్న వీరు కెనడాలోని వాంకోవర్ ద్వీపం వద్ద విలాసవంతమైన భవంతిలో తమ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రాజ కుటుంబం నుంచి వైదొలిగిన నాటి నుంచి వారి భద్రతకు అయ్యే ఖర్చులను చెల్లించడం మానేస్తామని గత నెలలో కెనడియన్ అధికారులు వెల్లడించారు. ఈ దంపతులు ప్రస్తుతం కాలిఫోర్నియాకు మకాం మార్చాతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించారు. (ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’) -
వాయిస్ ఓవర్
రాజకుటుంబంలో సభ్యురాలు (క్వీన్ ఎలిజిబెత్–2 మనవడు ప్రిన్స్ హ్యారీని వివాహం చేసుకున్నారు) కావడంతో సినిమాలకు దూరమయ్యారు హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్. అయితే ఇటీవలే రాజకుటుంబం నుంచి తప్పుకుని స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నట్టు ప్రకటించారు. వెంటనే డిస్నీ సంస్థ వాళ్లు మేఘన్ మార్కెల్తో ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చున్నారు. ఏనుగుల మీద డిస్నీ సంస్థ ఓ సినిమా తెరకెక్కించింది. ఈ సినిమాలో వచ్చే వాయిస్ ఓవర్ను మేఘన్ మార్కెల్ చెప్పనున్నారు. ఆమె పారితోషికం ఏనుగుల పరిరక్షణకి విరాళంగా వెళ్తుందట. -
మీ భార్యను కౌగిలించుకున్నా.. సారీ!..
లండన్ : ఓ చిన్న కౌగిలితో ఆ కుర్రాడు సోషల్ మీడియా ఫేమస్ అయ్యాడు. అతడు కౌగిలించుకున్నది కూడా ఆశామాషీ వ్యక్తిని కాదులెండి! ఓ యువరాణిని. తను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతూ ఆమెభర్తకు లేఖరాయటంతో ఆ కుర్రాడు మరింత పాపులర్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ ఉమెన్స్డేను పురష్కరించుకుని గత శుక్రవారం లండన్లోని ఓ స్కూల్ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడకుండా.. ‘ విద్యార్థుల్లోనుంచి ఎవరైనా వచ్చి ఇంటర్ నేషనల్ ఉమెన్స్ డే ప్రాధాన్యత గురించి మాట్లాడితే బాగుంటుంద’ని అన్నారు. కొద్దిసేపు ఎవరూ పైకి లేయలేదు. ఆ తర్వాత ఎకర్ ఒకోయి అనే విద్యార్థి ధైర్యంగా స్టేజిమీదకు వెళ్లాడు. మైక్ దగ్గరకు వెళ్లిన తర్వాత మేఘన్ మార్కెల్ ఎంతో అందంగా ఉందంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. మాట్లాడుతున్న ఎకర్, పక్కన మేఘన్ మార్కెల్ ఎకర్ మాట్లాడటం ముగించిన తర్వాత మేఘన్ ప్రొటోకాల్ను పక్కన పెట్టిమరీ అతడ్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంది. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ సంఘటనపై ఎకర్.. మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీకి ఆదివారం లేఖ రాశాడు.. ‘‘ డియర్ హ్యారీ అండ్ మేఘన్ మార్కెల్. హ్యారీ నేను మీ భార్యను కౌగిలించుకున్నందుకు మీరేమీ అనుకోరు కదా! దయచేసి నన్ను క్షమించండి. ఆమెను చూడగానే భావోద్వేగానికి లోనయ్యాను, ఒకింత షాకింగ్గానూ ఉండింది. ఆమె మాటలు వినటం.. ఆమె ముందు మాట్లాడటం నాకెంతో సంతోషాన్నిచ్చింద’ ని పేర్కొన్నాడు. చదవండి : మార్చి 31 నుంచి వారు సామాన్యులు.. ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’ -
మార్చి 31 నుంచి వారు సామాన్యులు..
లండన్ : బ్రిటన్ రాజు ప్రిన్స్ హ్యారీ ఆయన భార్య మేఘన్ మార్కెల్ మార్చి 31 నుంచి రాజ కుటుంబంతో సంబంధాలు అధికారికంగా పూర్తిగా తెగతెంపులవుతాయని దంపతుల కార్యాలయం వెల్లడించింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్లు రాజరిక విధుల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న తరువాత బకింగ్హామ్ ప్యాలెస్ డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ యొక్క "సస్సెక్స్ రాయల్" హోదాను సమీక్షించే క్రమంలో ప్రిన్స్ కపుల్ ఈ విషయం వెల్లడించడం గమనార్హం. రాజకుటుంబం నుంచి తాము దూరమవుతామని ఈ ఏడాది జనవరిలో ప్రిన్స్ దంపతులు ప్రకటించడం బ్రిటన్లో కలకలం రేపింది. ప్రశాంత జీవనం గడిపేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రిన్స్హ్యారీ అప్పట్లో ప్రకటించారు. తాను పుట్టినప్పటి నుంచి తాను ఎక్కడికి వెళ్లినా తనను ఫోటోగ్రాఫర్లు వెంబడించడం, కెమెరాలలో బంధించడం, తన గురించి జర్నలిస్టులు రాయడంతో విసిగిపోయానని చెప్పుకొచ్చారు. మరోవైపు రాజప్రాసాదాన్ని వీడటంతో వారు ఇక రాయల్ హైనెస్ హోదాను కోల్పోతారని, వారు మనసు మార్చుకుని భవిష్యత్లో రాజప్రాసాదంలోకి అడుగుపెడితే ఆ హోదాలు తిరిగి వర్తించే అవకాశం ఉందని బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కొంది. హ్యారీస్ దివంగత ల్లి డయానా ప్రిన్స్ చార్లెస్తో విడాకులు పొందినపుడు ఆమె రాయల్ హైనెస్ హోదాను తొలగించారు. చదవండి : ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’ -
మేఘన్ మార్కెల్ రాయని డైరీ
సంతోషంగా ఉంది. ఈ సమ్మర్కి లాస్ ఏంజెలిస్కి షిఫ్ట్ అయిపోతున్నాం నేనూ, ప్రిన్స్ హ్యారీ, ఆర్చీ. మే ఆరుకు ఏడాది నిండుతుంది ఆర్చికి. పెద్ద రెడ్ కార్పెట్ పరిచి లాస్ ఏంజెలిస్ లోనే ఆస్కార్ వేడుకలంత ఘనంగా చేయాలి ఆర్చి ఫస్ట్ బర్త్డేని.‘‘చేద్దామా అలా.. హ్యారీ’’ అని అడిగాను. నవ్వాడు. ‘‘వేడుక అంటే ముందొచ్చి కూర్చుం టాయి మీడియా దెయ్యాలు. ఆర్చి జడుసు కుంటాడు. ఏకాంతంగా ఏ దీవి లోనికైనా వెళ్లిపోదాం. నువ్వు, నేను, ఆర్చి..’’ అన్నాడు. అతడి కళ్లలోకి చూశాను. మీడియా తన తల్లి ప్రిన్సెస్ డయానాను మింగేసిన కోపం, ఆ కళ్లలో నేటికీ కనిపిస్తూనే ఉంది. నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచేవాడు. ‘ఏమైంది హ్యారీ?’ అని దగ్గరకు తీసుకునే దాన్ని. ‘మా అమ్మ.. మా అమ్మ.. దెయ్యాలు తరుముకుంటుంటే వాటి నుంచి తప్పించుకోడానికి పరుగులు తీస్తోంది. హ్యారీ నువ్వు జాగ్రత్త.. హ్యారీ నువ్వు జాగ్రత్త అని అరుస్తూ నేనెక్కడున్నానా అని నన్ను వెతుక్కుంటోంది. దెయ్యాలు తరుము కుంటుంటే తను కదా జాగ్రత్తగా ఉండాల్సింది. నన్ను జాగ్రత్తగా ఉండమంటోంది..’ అని చెప్పేవాడు. ఆమే బతికి ఉంటే నా భర్త హ్యారీ కూడా ఆమె తర్వాతే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యేవాడు. ఒక ఆడపిల్ల ఆశలు ఎలా ఉంటాయో ఆమెకు తెలుసు. ఒక ఆడపిల్ల కోరుకునే స్వేచ్ఛకు ఎలాంటి పంజరాలు తయారవుతూ ఉంటాయో ఆమెకు తెలుసు.ప్రిన్సెస్ డయానా చనిపోయారన్న వార్త విన్నప్పుడు.. నేను టీనేజ్లో ఉన్నాను. అయ్యో అనిపించింది. నా వ్యక్తిత్వానికి ఆమె ఒక అభౌతిక స్వరూపం. ప్రిన్సెస్ డయానా ఎంత అందంగా, ఎంత సహజంగా, ఎంత చలాకీగా ఉండేవారు! ఫొటోల్లో చూస్తుండేదాన్ని. లోపల ఉన్న ఏ బాధనో బయటికి రానివ్వని ఆమె హృదయపు లావణ్యాన్ని చాలాసార్లు పట్టుకున్నాను ఆ ఫొటోల్లో. ‘‘సరే హ్యారీ, లాస్ ఏంజెలిస్లోని మన కొత్త ఇంటినే ఏకాంత దీవిలా మార్చు కుందాం’’ అని చెప్పాను. హ్యారీకి కెనడా నచ్చింది కానీ, నేను పుట్టి పెరిగిన లాస్ ఏంజెలిస్ ఇంకా బాగా నచ్చుతుందని చెప్పి ఒప్పించాను. మా పెళ్లయ్యాక రెండు సమ్మర్లు రాణి గారి భవంతిలో ఎలా గడిచాయో తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నేనేనా అక్కడుంది! నేనేనా కాలిపై కాలు వేసుకుని కూర్చోకుండా, మోకాళ్లు రెండూ కలిపి ఒద్దికగా కూర్చోవాలన్న రాణి గారి ఆదేశాన్ని పాటించింది! నేనేనా నా తోడికోడలు కేట్ మిడిల్టన్ మాటలకు రాని నవ్వు నవ్వింది! నేనేనా నా భర్త హ్యారీతో రాజమాత ముభావంగా ఉంటే ‘ఏంటలా ఉన్నారు? నా భర్త చేసిన తప్పేమిటి?’ అని అడక్కుండా ఉండగలిగింది! నేనేనా నేను వేసే ప్రతి అడుగుకూ సమ్మతి తీసుకుని, నేను వేసిన ప్రతి అడుగుకూ సంజాయిషీ ఇచ్చుకుంది! బ్రిటన్లో ఏడాదికి ఒకే సమ్మర్ ఉంటుంది. రాణిగారింట్లో ఏడాదంతా సమ్మరే!! ‘‘ప్రిన్స్ హ్యారీ, ఇకనుంచీ మీరు మీ అభీష్టానుసారం ఇక్కడ ఉండొచ్చు. ఈ రాజ్యానికి మీరే రాజు’’ అన్నాను.. లాస్ ఏంజెలిస్లో ఫ్లయిట్ దిగగానే. పెద్దగా నవ్వాడు హ్యారీ. ‘‘లాస్ ఏంజెలిస్కి రాణి గారు కదా ఉంటారు. రాణీ మేఘన్ మార్కల్’’ అన్నాడు! ఆర్చిని హ్యారీ చేతికి అందించి, హ్యారీ ఛాతీకి నా తలను ఆన్చాను. నా కోసం తన సింహాసన వారసత్వాన్ని వదలుకుని వచ్చాడు. తన తర్వాత వచ్చే ఆర్చి స్థానాన్ని కూడా వదిలేసి వచ్చాడు.‘‘యు ఆర్ మై క్రౌన్’’ అన్నాను. గిలిగింతలు పెట్టినప్పుడు అచ్చు ఆర్చి నవ్వినట్లే నవ్వాడు హ్యారీ. మాధవ్ శింగరాజు -
ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకు ‘నో’
బ్రిటీష్ రాజ కుటుంబానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పి బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలోని కెనడాలో ఓ విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసి అందులో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెన్ దంపతులు తమ కుమారుడితో సహా నివసిస్తున్న విషయం తెల్సిందే. వారు కెనడాకు వచ్చి మకాం పెట్టినప్పటి నుంచి వారి భద్రతకయ్యే ఖర్చును ఎవరి భరిస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఖర్చులను కెనడా ప్రభుత్వం భరిస్తుందని వార్తలు తొలుత వెలువడగా, అందుకు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వ ఖజానా నుంచి ఎలా సొమ్మును వృధా చేస్తారంటూ పలు వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. (రాజదంపతుల కొత్త జీవితం!) ఈ నేపథ్యంలో సీటీవీ కోసం ‘నానోస్ రిసెర్చ్ సెంటర్’ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతకయ్యే ఖర్చును కెనడా ప్రభుత్వం భరించడానికి వీల్లేదంటూ 77 శాతం మంది అభ్యంతం వ్యక్తం చేశారు. 19 శాతం మంది అనుకూలంగా స్పందించారు. మిగతా వారు తటస్థంగా ఉన్నారు. బ్రిటీష్ రాణి వారసులుగా తమ దేశంలో నివసించడం లేదన్న కారణంగానే 77 శాతం మంది ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. (కోటను విడిచినా వారు మా కుటుంబ సభ్యులే..) బ్రిటీష్ రాజ కుటుంబంతో ఎలాంటి తెగతెంపులు చేసుకోకుండా వారంతట వారొచ్చి తమ దేశంలో ఉన్నట్లయితే వారి భద్రతకయ్యే ఖర్చును భరించేందుకు అభ్యంతరం లేదన్నారు. అసలు రాజకుటుంబం వారసులుగా వారు కెనడాలో ఉన్నట్లయితే రాజ కుటుంబమే ఆ ఖర్చులను భరించేది. ఏదేమైనా హ్యారీ దంపతుల భద్రతకు ఏటా మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. (భార్య మేఘన్ ఫొటోలపై హ్యారీ ఆగ్రహం) చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే! -
భార్య మేఘన్ ఫొటోలపై హ్యారీ ఆగ్రహం
లండన్ : బ్రిటీష్ రాజకుటుంబం బాధ్యతల నుంచి తప్పుకున్న హ్యారీ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యక్తిగత జీవన ప్రయాణాన్ని పబ్లిక్ చేస్తున్నారని అన్నారు. తన భార్య మేఘన్ మోర్కెల్, 8 నెలల కుమారుడు ఆర్కీ ఫొటోలను ప్రచురించిన సన్, డెయిలీ మెయిల్ దినపత్రికలపై న్యాయపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు హ్యారీ తరపు న్యాయవాది సదరు వార్తా పత్రికలకు నోటీసులు జారీ చేశారు. కాగా, కుమారుడు ఆర్కీతో కలిసి మోర్కెల్ కెనడాలోని వాంకోవర్ దీవిలోని రీజనల్ పార్క్లోకి అడుగుపెట్టారు. రాజ సంరక్షకులు చివరిసారిగా తోడు రాగా.. భుజానేసుకున్న జోలిలో ఆర్కీ, ముందు రెండు పెంపుడు కుక్కలతో కలిసి మోర్కెల్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే ఇంటికి చేరుకున్నారు. అయితే, ఈ ఫొటోలన్నీ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. (చదవండి : రాజదంపతుల కొత్త జీవితం!) మోర్కెల్ అనుమతి లేకుండా.. సదరు ఫొటోగ్రాఫర్లు దొంగచాటుగా ఫొటోలు తీశారని హ్యారీ చెప్పుకొచ్చారు. కెమెరాలకు, మీడియాకు దూరంగా ఉండాలనే రాజ కుటుంబం నుంచి తప్పుకున్నామని హ్యారీ మరోసారి స్పష్టం చేశాడు. తమ అనుమతి లేకుండా వాంకోవర్ దీవిలోని తమ ఇంటిని ఫొటోలు తీసిన వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కెమెరా ‘క్లిక్’మన్నప్పుడల్లా.. తన తల్లి చావే గుర్తుకు వస్తుందని ఈ సందర్భంగా హ్యారీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రిన్స్ హ్యారీ తల్లి, వేల్స్ యువరాణి డయానా 1997లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. మీడియా కంటబడకుండా తప్పించుకునే క్రమంలో ఆమె ప్రమాదం బారిన పడ్డారు. (చదవండి : మేఘన్ రాజ వంశాన్ని చులకన చేసింది) -
రాజదంపతుల కొత్త జీవితం!
వాంకోవర్: భుజానేసుకున్న జోలిలో సంటోడు, కుడి వైపున నల్లటి లాబ్రడార్ పెంపుడు కుక్క ఓజ్, ఎడమ పక్క మరో జాతికి చెందిన పెంపుడు కుక్క బీగల్ గై వెంట నడుస్తుండగా, వెన్నంటి బ్రిటన్ రాజ రక్షకులు తోడుగా, ముఖాన చెరగని చిరునవ్వుతో మేఘన్ మార్కెల్ రీజనల్ పార్క్లో సామాన్యుల లోకంలోకి ప్రయాణం. ఆమె బ్రిటన్ రాచరికపు వ్యవస్థకు శాశ్వతంగా తిలోదకాలిచ్చి సోమవారం ఉదయమే కెనడా, వాంకోవర్ దీవిలోని రీజనల్ పార్క్లోకి అడుగుపెట్టారు. అక్కడికి సమీపంలో ఉన్న దాదాపు 99 కోట్ల రూపాయల విలువైన భవంతి వరకు మాత్రమే బ్రిటన్ రాజ రక్షకులు ఆఖరి సారిగా వెంట వచ్చారు. ఆమెను సురక్షితంగా భవంతి వద్ద దింపి ఆమె నుంచి శాశ్వతంగా సెలవు తీసుకొకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి మేఘన్ మార్కెల్, ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ రక్షణ బాధ్యతలు కెనడా ప్రభుత్వం స్వీకరించింది. ఇందుకోసం కెనడా ప్రభుత్వం ఏటా మూడు కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రిన్స్ హ్యారీ ఆఖరిసారి అధికారిక హోదాలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తోపాటు ఇతర ప్రభుత్వ పెద్దలను కలుసుకొని మంగళవారం వాంకోవర్లోని కొత్త భవంతికి చేరుకుని మార్కెల్ను కలుసుకున్నారు. వారిద్దరు తమ ఎనిమిది నెలల కుమారుడు ఆర్కీతో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులను అదే భవంతిలో జరపుకున్నారు. రాచరికానికి గుడ్బై చెప్పి ఆ దంపతులు శాశ్వతంగా అక్కడే ఉండబోతున్నారు. చదవండి: మేఘన్ మార్కెల్ కొత్త భవంతి ఇదే! మేఘన్ రాజ వంశాన్ని చులకన చేసింది కోటను విడిచినా వారు మా కుటుంబ సభ్యులే.. -
మేఘన్ మార్కెల్పై తండ్రి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజకుటుంబం నుంచి అధికారికంగా తప్పుకున్నారు. తమకున్న రాయల్ గుర్తింపుని వదులుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందంపై హ్యారీ దంపతులు సంతకాలు చేశారు. ఇకపై వారిద్దరి పేర్లకు ముందు రాచరికాన్ని ప్రతిబింబించే గౌరవ సూచకాలు ఉండవు. అంతేకాదు బ్రిటన్ రాజ కుటుంబం వారసులుగా వారు నిర్వహించే బాధ్యతలకుగాను పన్ను రూపంలో బ్రిటన్ వాసులు చెల్లించే ఆదాయం కూడా ఇకపై వారికి అందదు. కొద్ది రోజుల క్రితమే హ్యారీ దంపతులు రాయల్ ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్లనున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియకు బ్రెగ్జిట్ను తలపించేలా మెగ్జిట్ అన్న హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ‘హ్యారీ, మేఘన ఇక రాయల్ కుటుంబ సభ్యులు కాదు. వారి పేర్లకు ముందు గౌరవసూచకంగా వాడే టైటిల్స్ను (హెచ్ఆర్హెచ్) ఇకపై వాడకూడదు’’ అని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే! నెలల తరబడి నిర్మాణాత్మకంగా సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత హ్యారీ దంపతులు రాజభవనం వీడి వెళ్లడానికి తాము సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్టుగా రాణి ఎలిజబెత్ చెప్పారు. హ్యారీ, మేఘన్, వారి ముద్దుబిడ్డ ఆర్కీని రాజ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారని 93 ఏళ్ల వయసున్న రాణి తన వ్యక్తిగత ప్రకటనలో తెలిపారు. తన మనవడు, మనవరాలు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న నిర్ణయానికి తాను మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. హ్యారీ కుటుంబం ఇకపై కెనడాలో నివసించనుంది. అయితే అప్పుడప్పుడు బ్రిటన్లో కూడా కాలం గడుపుతారు. అందుకోసం హ్యారీ ఫ్రాగ్మోర్ కాటేజీని తన వద్దే ఉంచుకున్నారు. ఈ కాటేజీని తన సొంతానికి వినియోగించుకుంటున్నందుకు 24 లక్షల పౌండ్లు చెల్లించాలని హ్యారీ నిర్ణయించారు. చదవండి: ‘నా గుండెను ముక్కలు చేశావు.. నాన్నా!’ మేఘన్కు రాణి ప్రత్యేక సందేశం మేఘన్ మార్కెల్కు రాణి ఎలిజబెత్ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ‘‘మేఘన్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎంత త్వరగా ఆమె ఒక ఇంటిదైంది. ఈ రోజు జరిగిన ఒప్పందంతో ఆమె కొత్త జీవితం మరింత సంతోషంగా, శాంతిగా ముందుకు సాగాలని మా కుటుంబం ఆకాంక్షిస్తోంది’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. మిలటరీ అపాయింట్మెంట్లు సహా రాజకుటుంబం నిర్వర్తించే విధుల నుంచి కూడా వారిద్దరూ తప్పుకున్నట్టు బకింగ్హమ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. ఈ పరిణామాన్ని దిగమింగుకోవడం భరించలేని కష్టంగా ఉందంటూ రాజకుటుంబం అభిమానులు పెద్ద సంఖ్యలో పోస్టులు పెట్టారు. మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ బ్రిటిష్ రాజ వంశాన్ని తమ కుమార్తె చాలా చులకన చేసిందని మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ ఆరోపించారు. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కుమార్తె ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ప్రిన్స్ హారీ, ఆయన సతీమణి మేఘన్ ఇకపై రాజ వంశ సభ్యులుగా వ్యవహరించబోరని బకింగ్ హాం ప్యాలెస్ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు తమ జీవితాలను తమదైన రీతిలో జీవిస్తారని కూడా తెలిపింది. తాము రాజ వంశానికి సంబంధించిన విధులను తగ్గించుకుంటామని ప్రిన్స్ హారీ, మేఘన్ మార్కెల్ దంపతులు గత నెలలో ప్రకటించారు. దీంతో క్వీన్ ఎలిజబెత్, ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు చర్చలు జరిపి, ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. ఈ నేపథ్యంలో థామస్ను ఓ ఛానల్ ఇంటర్వ్యూలో.. ప్రతి అమ్మాయి యువరాణి కావాలని కోరుకుంటుందని థామస్ చెప్పారు. అలాంటి కల తన కుమార్తె మేఘన్కు సాకారమైందన్నారు. అటువంటి దానిని ఆమె వదులుకుంది. ఈ పరిణామం చాలా నిరాశ కలిగిస్తోందన్నారు. ఆమె డబ్బు కోసమే ఈ విధంగా చేసినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. బ్రిటిష్ రాజ వంశం సుదీర్ఘ కాలం మనగలుగుతున్న గొప్ప వ్యవస్థల్లో ఒకటని ఆయన అన్నారు. 2018లో హారీని మేఘన్ పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి, ఆ దంపతులు రాజ వంశంలో భాగమని.. వారు రాజ వంశానికి ప్రాతినిథ్యం వహించవలసి ఉంటుందని చెప్పారు. అటువంటి రాజ వంశాన్ని వీరిద్దరూ చులకన చేశారని, అగౌరవపరిచారని మండిపడ్డారు. -
కోటను విడిచినా వారు మా కుటుంబ సభ్యులే..
లండన్ : బ్రిటన్ రాజకుటుంబం నుంచి వేరుపడాలని ప్రిన్స్ హ్యారీ మేఘన్ మార్కెల్ దంపతుల నిర్ణయానికి సాండ్రింగ్హామ్ ఎస్టేట్లో జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం క్వీన్ ఎలిజబెత్ ’టూ)వారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ రాజకుటుంబంలో ఈ జంట పాత్రకు సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆమె నొక్కి చెప్పారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం శనివారం రాత్రి క్వీన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇక రాజకుటుంబం నుంచి విడిపోవాలని వారు నిర్ణయించిన క్రమంలో రాయల్ ఫ్యామిలీలో సభ్యులు కానందున సస్సెక్స్ వారి హెచ్ఆర్హెచ్ శీర్షికలను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. అయితే, నివేదికల ప్రకారం వారిని డ్యూక్ మరియు డచెస్ ఆఫ్ సస్సెక్స్ అని పిలుస్తారు. మరోవైపు వారి బ్రటిన్ కుటుంబ ఇల్లుగా కొనసాగే ఫ్రాగ్మోర్ కాటేజ్ పునరుద్ధరణపై ప్రభుత్వం వెచ్చించిన సొమ్మును వారు తిరిగి చెల్లించాలని ప్యాలెస్ ప్రకటించింది. వార్తాకథనాల ప్రకారం ఇంటి పునరుద్ధరణకు వెచ్చించిన రూ 22.2 కోట్లను వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాజకుటుంబం నుంచి వేరుపడాలని వారు నిర్ణయం తీసుకున్నా హ్యారీ, మేఘన్, ఆర్చీ తమ కుటుంబ సభ్యుల్లో భాగంగానే ఉంటారని, గత రెండేళ్లుగా వారిపై కొనసాగుతున్న నిఘాతో వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్టు తాను గుర్తించానని ఆమె వ్యాఖ్యానించారు. నెలల తరబడి సాగిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. రాజకుటుంబం నుంచి వెనుదిరుగుతూ వారు సకల సౌకర్యాలను కాలదన్నడంతో పాటు హ్యారీ తాను నిర్వర్తించే అధికారిక సైనిక నియామకాల నుంచి కూడా వైదొలగనున్నారు. కాగా మేఘన్ ప్రస్తుతం తన కుమారుడు అర్చీతో కలిసి కెనడాలో ఉన్నారు. కాగా 2018 మేలో తనకంటే మూడేళ్లు పెద్దదైన మేఘన్తో ప్రిన్స్ హ్యారీ వివాహ బంధంతో ఒక్కటవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కల్గించింది. ప్రిన్స్ హ్యారీది రాజకుటుంబం అయితే.. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మేఘన్ మార్కెల్తో కామన్ ఫ్రెండ్ ద్వారా కలిగిన పరిచయం పరిణయానికి దారితీసింది. ప్రిన్స్ పెళ్లాడిన మేఘన్కు ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. చదవండి : మేఘన్ మార్కెల్ కొత్త అవతారం చదవండి :ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే! -
మేఘన్ మార్కెల్ కొత్త అవతారం
లండన్ : ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రటిన్ రాజకుమారుడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మార్కెల్ అప్పుడే ఆ పనిలో పడినట్టు కనిపిస్తోంది. పెళ్లికి ముందు వదిలేసిన వృత్తిని మేఘన్ తిరిగి చేపట్టారు. ఇందుకోసం డిస్నీ లండన్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సీనియర్ రాయల్స్ పదవి నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని వెల్లడించిన మేఘన్ డిస్నీ లండన్తో వాయిస్ ఓవర్ చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరు వారాల విరామం కోసం కెనడాకు బయలుదేరే ముందే నవంబర్లో ఆమె వాయిస్ఓవర్ను రికార్డ్ చేశారట. 2017లో హ్యారీతో నిశ్చితార్థం తరువాత నటనకు గుడ్ బై చెప్పిన మాజీ నటి మేఘన్ తాజాగా డిస్నీతో ఒప్పందం చేసుకున్నారు. ఎనుగుల పరిరక్షణకు, వేటగాళ్ల బారి నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన పరిరక్షణా బృందం ‘ఎలిఫెంట్ వితౌట్ బోర్డర్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేందుకు బదులుగా స్టూడియోతో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టైమ్స్ పేర్కొంది. కాగా బ్రిటన్ రాజకుటుంబ 'సీనియర్ సభ్యుల' బాధ్యతల నుంచి వైదొలగుతామని, బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండే విధంగా సమతూకంతో సమయం కేటాయించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అదే సమయంలో రాణికి (ఎలిజిబెత్-2)సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అలాగే రాజకుటుంబ సంప్రదాయాల పట్ల తమ కుమారుడు ఆర్చీ హారిసన్కు అవగాహన కల్పించడంతోపాటు, కొత్తగా సేవాసంస్థ ఏర్పాటు సహా జీవితంలోని తదుపరి అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించే వీలవుతుందని చెప్పారు. మరోవైపు హ్యారీ-మేఘన్ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించిందని రాజప్రాసాదం బకింగ్హాం ప్యాలస్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఆయన 20 కోట్లు వదులుకుంటారా!?
బ్రిటీష్ రాచరిక వ్యవస్థ నుంచి తప్పుకొని ఆర్థికంగా స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన ప్రిన్స్ హ్యారీ దంపతులు అందుకు కట్టుబడి జీవిస్తారా? అన్న సంశయం ఇప్పుడు ప్రిన్స్ విలియమ్స్ దగ్గరి నుంచి సామాన్య మానవుడి వరకు కలుగుతోంది. ఇప్పటి వరకు హ్యారీ దంపతుల కోసం ఏటా 8.3 కోట్ల రూపాయలను, వారి ప్రయాణాలకు 5.5 కోట్ల రూపాయలను, వారి వసతులకు 16.5 కోట్ల రూపాయలను ఎస్టేట్ చెల్లిస్తోంది. అంటే ఏటా వారికి 20 కోట్ల రూపాయలపైనే ఖర్చు అవుతోంది. ఇవి కాకుండా దుస్తులు, ఇతర అవసరాల కోసం చేస్తే ఖర్చులు కూడా రాచరిక వ్యవస్థ నుంచే వస్తాయి. ఇదంతా కూడా బ్రిటీష్ పౌరులు పన్నుల పేరిట రాచరిక వ్యవస్థకు చెల్లిస్తున్న సొమ్మే. (చదవండి: ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!) ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆర్థికంగా స్వతంత్రంగా బతకడం అంటే ఈ సొమ్మును పూర్తిగా వదులు కోవాల్సి ఉంటోంది. ఆ దేశ పౌరులు ప్రిన్స్ హ్యారీ దంపతుల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ప్రజల పన్ను డబ్బులను వదులుకోవాలని కోరుతున్నారు. ప్రిన్స్ విలియమ్స్ మాత్రం హ్యారీ దంపతులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. రాచరిక హోదాను వదులు కోవడం వల్ల హ్యారీ తల్లి డయానా, కారు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యిందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి తల్లి చేసిన తప్పు చేయరాదంటూ నచ్చ చెబుతున్నారు. అన్నా వదినల కారణంగా రాచరిక కుటుంబానికి హ్యారీ దంపతులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారుకానీ, డబ్బులు తెచ్చే హోదాకు దూరంగా ఉండాలని కాదని హ్యారీ సన్నిహితులు చెబుతున్నారు. హ్యారీ రాచరిక పదవులను వదులుకుంటున్నట్లు చెప్పారుకానీ, రాచరిక హోదాను కాదని వారంటున్నారు. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఉండే బంగ్లా ఇదే!
బ్రిటీష్ రాచరిక కుటుంబం జీవితం నుంచి విడిపోయి తాము స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నట్లు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కే ప్రకటించి సంచలనం సష్టించిన విషయం తెల్సిందే. హ్యారీ దంపతులు తమ కుమారుడితో కలిసి క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను బ్రిటీష్ కొలంబియాలోని విక్టోరియాలో నీటి ఒడ్డునున్న ప్యాలెస్ లాంటి బంగ్లాలో గడిపారు. ఇక ముందు జీవితం ఆ బంగ్లాలోనే గడపాలని నిర్ణయించుకున్నట్లు తెల్సింది. దాదాపు 18 మిలియన్ డాలర్లు విలువచేసే ఆ బంగ్లాను వారు రష్యాకు చెందిన ఓ బిలియనీర్ నుంచి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి హ్యారీ దంపతులు, వారి ప్రతినిధి నిరాకరించారు. ఆ రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్లో షేర్ హోల్డర్ అవడం వల్ల కంట్రీ క్లబ్ పేరుతో ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. బ్రిటన్లో కొత్త చట్టం ప్రకారం ఆస్తులు అమ్మినప్పుడు కచ్చితంగా దాని వెల ఎంతో ప్రకటించి అంత మొత్తానికి పన్ను చెల్లించాలి. ఆ పన్నును తప్పించుకునేందుకే రష్యా వ్యాపారి కంట్రీ క్లబ్ ద్వారా ఆ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. మొత్తం 11,416 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ప్రధాన బంగ్లాలో ఐదు బెడ్ రూమ్లు, ఎనిమిది బాత్ రూమ్లు, ఓ హాలు, కిచెన్ ఉన్నాయి. దానికి వెలుపల అతిథుల కోసం 2,349 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బెడ్ రూమ్లు, రెండు బాత్ రూములు గల చిన్న భవనం ఒకటి ఉంది. చదవండి: తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు.. -
తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు..
ఇరాన్లో యుద్ధ మేఘాలు. ఇండియాలో పౌరసత్వ నిరసనలు. అగ్రరాజ్యాల్లో పర్యావరణ ఉద్యమాలు. ఒక్కోదేశం ఒక్కో సమస్యతో సతమతమౌతోందిప్పుడు. బ్రిటన్ ప్రజలు మాత్రం వీటన్నిటికీ భిన్నమైన ఒక హటాత్పరిణామంతో నివ్వెర పోయి రెండు రోజులుగా రాజప్రాసాదం వైపే చూస్తున్నారు. మనవడు ప్రిన్స్ హ్యారీ తన నానమ్మ క్వీన్ ఎలిజబెత్తో ఓ మాటైనా చెప్పకుండా భార్యతో కలిసి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. స్వాతంత్య్రం కోసం ఎన్నో దేశాలు బ్రిటన్పై పోరాడి స్వేచ్ఛను సాధించుకు న్నట్లే.. స్వతంత్రంగా జీవించడం కోసం ప్రిన్స్ హ్యారీ.. రాయల్ ఫ్యామిలీ నుంచి వెళ్లిపోతున్నారా?! ఊరంతా తెలిశాక మనకు తెలిసే విషయం ఒకటి ఉంటుంది. మన ఇంటి విషయం! అబ్బాయి బయటేదో ఘనకార్యం చేసి ఉంటాడు. కాలనీ అంతా తెలిశాకే మనకు తెలుస్తుంది. అమ్మాయి ఎవర్నో ప్రేమిస్తుంటుంది. పొరుగూళ్లో బంధువులందరికీ తెలిశాకే, ఆ కబురు మన ఊళ్లో బస్ దిగి, మన ఇంటికి వస్తుంది. నమ్మకం మనకు మన అబ్బాయి మీద, అమ్మాయి మీద. ఆ నమ్మకాన్ని నమ్మకంగా ఉంచడానికి కావచ్చు.. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు విషయాన్ని దాచి ఉంచీ ఉంచీ ఇక చెప్పకపోతే నమ్మకద్రోహం చేసినట్లవుతుందని మనకు చెప్పేస్తుంటారు. ఇళ్లన్నీ ఒక్కటే. రాజుగారి ఇల్లయినా, పేదవాడి ఇల్లయినా! మనుషులంతా ఒక్కటే. గ్రేట్ బ్రిటన్లో ఉన్నా, పూర్ కంట్రీలో ఉన్నా! అందుకే.. మనవడు హ్యారీ, అతడి భార్య.. ఇల్లొదిలి వెళ్లిపోతున్నారనే విషయం అందరికీ తెలిశాక ఆఖర్న గానీ ఎలిజబెత్ రాణిగారికి తెలియలేదు. అప్పట్నుంచీ ఆమె మనసు మనసులో లేదు. నేనేం తక్కువ చేశాను అని ఆమె విలపిస్తున్నారు తప్పితే, వాళ్లేం ఎక్కువ కోరుకుంటున్నారోనని ఆలోచించడానికి కూడా ఆమెకు మనస్కరించడం లేదు. వెళ్లిపోతున్నారు.. వెళ్లిపోతున్నారు.. ఇదే ఆమె హృదయాన్ని పిండేస్తోంది. బుధవారం సాయంత్రం వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. క్రిస్మస్ వేడుకల కోసం వారం ముందే శాండ్రింగ్ హామ్ ఎస్టేట్కి వెళ్లిన రాణిగారు మూడు వారాలు గడిచిపోతున్నా అక్కడే ఉండిపోడానికి కారణాలు ఏమైనా.. ఇప్పుడామె హుటాహుటిన బకింగ్హామ్ రాజప్రాసాదానికి తిరిగి వచ్చే ఏర్పాట్లలో ఉన్నారు. రాయల్ ఫ్యామిలీలోంచి వెళ్లిపోవాలని మనవడు హ్యారీ, అతడి భార్య కలిసి తీసుకున్న నిర్ణయంగా బ్రిటన్ పత్రికల్లో వస్తున్న వార్తలు.. తిరుగు ముఖానికి ఆమెను తొందర పెడుతున్నాయి. ‘కనీసం వాళ్లు రాణిగారికి చెప్పనైనా లేదు’ (దే డిడిన్ట్ ఈవెన్ టెల్ ద క్వీన్) అని ‘డైలీ మిర్రర్’ తన మొదటి పేజీ నిండా పెట్టిన హెడ్డింగ్ ఆమెను మరింతగా బాధిస్తుండవచ్చు. ప్యాలెస్ తలుపులు తెరుచుకోగానే గుమ్మం ముందు పడి కనిపించే అనేక తుంటరి పత్రికల్లో అదీ ఒకటి. ఈ భార్యాభర్తలిద్దరూ తాము ఇల్లొదిలి వెళ్లిపోతున్నట్లు రాణిగారికి మాట మాత్రంగానైనా చెప్పకపోవడం నిజమే. పైగా ఆ విషయాన్ని వాళ్లు తామిద్దరూ కొత్తగా ప్రారంభించిన వెబ్సైట్ లో బహిరంగ పరచడం ఆ వృద్ధ ప్రాణాన్ని మరింత అలసటకు గురి చేసినట్లు కనిపిస్తోంది. ‘హ్యారీ మొన్న క్రిస్మస్కి కూడా పొడిపొడిగానే మాట్లాడాడు. అది కూడా ఫోన్లో. అప్పుడైనా నేను అతడి అంతరంగాన్ని గ్రహించ వలసింది’’ అని రాణిగారు పొడి బారుతున్న గొంతుతో అన్నట్లు.. ఎప్పుడూ ఆమెను కనిపెట్టుకుని ఉండే వ్యక్తిగత సంరక్షకులు ఒకరు.. తనను పట్టి పీడిస్తున్న మీడియా ప్రతినిధులకు తప్పనిసరై వెల్లడించారు. భార్య మేఘన్ మార్కెల్తో ప్రిన్స్ హ్యారీ ‘‘మా కాళ్లపై మేము నిలబడాలని భావిస్తున్నాం. స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్నాం. మాకొక గుర్తింపు కోసం ఆశపడుతున్నాం. మేము బయటికి రావడం వల్ల రాచ కుటుంబం నుంచి వారసత్వంగా మాకు సంక్రమించవలసిన వాటన్నిటినీ కోల్పోతామని తెలుసు. అయినా అందుకు సిద్ధపడుతున్నాం’’ అని ప్రిన్స్ హ్యారీ, మేఘన్ కలసి చేసిన ఆ ప్రకటన ఎలిజబెత్ రాణి మనసులోనే కాదు, బ్రిటన్ ప్రజల్లోనూ కలవరం రేపుతోంది. ‘కలిసి ఉన్న ఒక గొప్ప కుటుంబం ముక్కలు కాబోతోందే! ఈ విలయాన్ని, విపత్తును నివారించలేకపోతున్నామే.. ఎలా దేవుడా..’ అని ఆ కుటుంబాన్ని తరతరాలుగా అభిమానించే వారు విలవిలలాడుతున్నారు. వారిలో కొందరైతే తమ మనసులో ఉన్న దానిని ఏమాత్రం దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ‘‘ఈ దుస్థితికి మూల కారణం హ్యారీ భార్య మేఘన్. ఆ మహాతల్లి వల్లే ఇదంతా జరుగుతోంది. హ్యారీ భార్యా విధేయుడైపోయి, కుటుంబాన్ని కాదనుకున్నాడు. కనీసం రాణి గారికి కూడా చెప్పి చేయడం లేదంటే ఏమనుకోవాలి?’’ అని తప్పంతా మేఘన్ మీదకు నెడుతున్నారు. ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం తప్పయినా ఒప్పయినా.. ఇంటికి పెద్దయిన రాణిగారికి చెప్పకపోవడం మాత్రం తప్పే. ప్రస్తుతం రాణిగారు, రాణిగారి భర్త; రాణిగారి కొడుకు, కూతురు; కొడుకు సంతానం, కూతురి సంతానం; వారి జీవిత భాగస్వాములు; వారి సంతానంలో కొందరు.. మొత్తం 24 మంది ‘రాయల్’ టైటిల్ ఉన్నవాళ్లున్నారు. మిగతా ఇంకా ఉన్నారు కానీ, వాళ్లంతా టైటిల్స్ లేనివాళ్లు. ఇప్పుడు బయటికి వెళ్లిపోతున్న హ్యారీ, మేఘన్ సొంతంగా బతకడం కోసం రాయల్ టైటిల్ని కూడా వదులుకోబోతున్నారు. బ్రిటన్లోని విండ్సర్లో ఫ్రాగ్మోర్ కాటేజ్ హ్యారీ పేరు మీద ఉంది. దాన్ని మాత్రం ఉంచుకుంటారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి పోతుండటానికి. ఇకనుంచీ ఈ దంపతులు ఉండటమైతే బ్రిటన్ కాదు. కెనడా. 2018 మే లో హ్యారీ, మేఘన్ల వివాహం జరిగింది. వారికిప్పుడు ఎనిమిది నెలల కొడుకు. పేరు మౌంట్బ్యాటన్. సింహాసనాన్ని అధిష్టించే వారసత్వపు వరసలో అతడిది ఏడవ స్థానం. అంతఃపురంలో తమ స్థానాలన్నిటినీ వదులుకుని వెళ్తున్న ప్రిన్స్ హ్యారీ దంపతులకు ఆ కుటుంబ సభ్యుల హృదయాలలో మాత్రం స్థానం ఎప్పటికీ ఉంటుంది. అది కాదనుకున్నా పోయేది కాదు. కాదని వెళ్లిపోయినా విడిచి పెట్టేదీ కాదు. గతంలో! కింగ్ ఎడ్వర్డ్ VIII వాలిస్ సింప్సన్తో ఎనిమిదవ ఎడ్వర్డ్ ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ బయటికి వెళ్తున్నట్లే.. బ్రిటన్ రాజ కుటుంబపు పూర్వీకుడైన ఎనిమిదవ ఎడ్వర్డ్ మహారాజు కూడా తను ప్రేమించిన యువతి కోసం ప్యాలెస్ను వదులుకున్నవారే! ప్యాలెస్తో పాటు తన సింహాసనాన్ని కూడా! అమెరికన్ వితంతువు అయిన వాలిస్ సింప్సన్ను ప్రేమించిన ఎడ్వర్డ్.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నందుకు కిరీటాన్ని సైతం కాదనుకున్నారు. ‘‘నేనీ భారాన్ని మోయలేకపోతున్నాను. నేను ప్రేమించిన వ్యక్తి సహాయం, సహకారం లేకుండా ఈ రాజ్యాధికారానికి న్యాయం చేకూర్చలేను’’ అని రాజైన కొద్ది నెలలకే బహిరంగంగా ప్రకటించి పక్కకు తప్పుకున్నారు. ఆ మర్నాడే ఎడ్వర్డ్ తమ్ముడు ప్రిన్స్ ఆల్బర్ట్ బ్రిటన్కు రాజయ్యాడు. ప్రిన్స్ ఫిలిప్ ఎలిజబెత్ (ప్రస్తుత రాణి)తో ప్రిన్స్ ఫిలిప్ రెండవ ఎలిజబెత్ రాణి (హ్యారీ నానమ్మ) భర్త ఫిలిప్ది కూడా ఇలాంటి పరిత్యాగ ప్రేమ కథే. అయితే రివర్స్లో. అతడిది గ్రీసు, డెన్మార్క్ల రాచ కుటుంబం. ఎలిజబెత్ను చేసుకోవడం కోసం తన సొంత రాజ్యాన్ని వదులుకుని బ్రిటన్ కుటుంబంలో సభ్యుడు అయ్యారు. -
బ్రిటన్ రాజ దంపతుల ‘న్యూక్లియర్ బాంబు’ ట్విటర్ గగ్గోలు
లండన్ బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ రాజ దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ రాయల్స్ హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్కు ఓ లేఖ రాశారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, తాము నార్త్ అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు హ్యారీ భార్య మేఘన్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. విరామం కోసం ఆరు వారాల పాటు కెనడా వెళ్లి తిరిగి వచ్చిన జంటఈ ప్రకటన చేయడం విశేషం డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ నిర్ణయంపై సోషల్మీడియాలో దుమారం రేగింది. ఎవరితో సంప్రదించకుండా, ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారనీ, తద్వారా బ్రిటిష్ రాజ కుటుంబంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ట్విటర్లో, ఇన్స్టాగ్రామ్లో వ్యాఖ్యానించారు. గతరాత్రి వారిద్దరూ న్యూక్లియర్ బాంబు పేల్చారని మరొకరు కమెంట్ చేశారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నాను. అయినా...వారు భరించగలరా ట్వీట్లు, హాస్యోక్తులు, వ్యంగ్యచిత్రాల వరద పారుతోంది. మరోవైపు ఇది రాచకుటుంబానికి చెందినవ్యవహారమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. కాగా గతేడాది బ్రిటీష్ రాచకుటుంబంలో ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని అభిప్రాయం ప్రధానంగా వినిపిస్తోంది. ప్రిన్స్ హ్యారీ దంపతులు రాచకుటుంబంలో పెద్దలను ఎవర్నీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కొంది. ఈ పరిణామంపట్ల క్వీన్ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్ నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. హ్యారీ ప్రకటనపై స్పందించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-2..ఇది చాలా కఠినతరమైన సమస్యన్నారు. స్వతంత్రంగా జీవించాలనే వారి కోరికను అర్ధం చేసుకున్నానని..కానీ దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. View this post on Instagram “After many months of reflection and internal discussions, we have chosen to make a transition this year in starting to carve out a progressive new role within this institution. We intend to step back as ‘senior’ members of the Royal Family and work to become financially independent, while continuing to fully support Her Majesty The Queen. It is with your encouragement, particularly over the last few years, that we feel prepared to make this adjustment. We now plan to balance our time between the United Kingdom and North America, continuing to honour our duty to The Queen, the Commonwealth, and our patronages. This geographic balance will enable us to raise our son with an appreciation for the royal tradition into which he was born, while also providing our family with the space to focus on the next chapter, including the launch of our new charitable entity. We look forward to sharing the full details of this exciting next step in due course, as we continue to collaborate with Her Majesty The Queen, The Prince of Wales, The Duke of Cambridge and all relevant parties. Until then, please accept our deepest thanks for your continued support.” - The Duke and Duchess of Sussex For more information, please visit sussexroyal.com (link in bio) Image © PA A post shared by The Duke and Duchess of Sussex (@sussexroyal) on Jan 8, 2020 at 10:33am PST -
వేర్వేరు దారుల్లో నడుస్తున్నాం: ప్రిన్స్ హ్యారీ
లండన్ : తామిద్దరం ప్రస్తుతం వేర్వేరు దారుల్లో నడుస్తున్నటికీ.. ఎల్లప్పుడూ అన్నదమ్ముల బంధం కొనసాగుతుందని ప్రిన్స్ హ్యారీ అన్నారు. ప్రతీ బంధంలో చిన్న చిన్న గొడవలు సహజమని.. నేటికీ తాను అన్నయ్యను అమితంగా ప్రేమిస్తున్నానని పేర్కొన్నారు. బ్రిటీష్ రాజవంశ సోదరులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని గత కొంతకాలంగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం.. భార్య మేఘన్ మార్కెల్తో కలిసి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ ఈ విషయాలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ క్షణం మేము కచ్చితంగా వేర్వేరు దారుల్లోనే ఉన్నాం. అయితే అత్యవసర సమయాల్లో మేము ఒకరికరం అండగా ఉంటాము. ప్రతిరోజూ నేరుగా కలుసుకోలేకపోవచ్చు కానీ ఆయనను అమితంగా ప్రేమిస్తూనే ఉంటాను. అన్నదమ్ముల మధ్య ప్రేమలు, చిన్న చిన్న గొడవలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతమాత్రాన మా గురించి అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు’ అని చెప్పుకొచ్చారు. ఇక దక్షిణాఫ్రికా దేశాల పర్యటన గురించి చెబుతూ ఇది తన మనసుకు సాంత్వన చేకూరుస్తుందని అన్నారు. తన తల్లి ప్రిన్సెస్ డయానాను గుర్తు చేసుకునేందుకు.. ఆమె అడుగుజాడల్లో నడిచేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఒక రాజకుటుంబీకుడిగా తాను ప్రతీ క్షణం కెమెరా ముందే ఉంటున్నానని, ప్రతి క్షణం తన ఫొటోలు తీస్తున్నారని.. అయితే ఇదంతా తనను ఒక్కసారిగా గతంలోకి తీసుకువెళ్తుందని పేర్కొన్నారు. తన తల్లి జీవితంపై ఇలాంటివి దుష్ప్రభావం చూపాయని.. తన మరణాన్ని కూడా చెడుగా గుర్తుపెట్టుకునేలా చేశాయని విచారం వ్యక్తం చేశారు. ఆ గాయం తనను నేటికీ వెంటాడుతుందని.. తన జీవితంలో అతిపెద్ద విషాదం అని ఉద్వేగానికి గురయ్యారు. కాగా 1997లో బ్రిటన్ యువరాణి డయానా ఫ్రాన్సులో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ... స్కాట్లాండ్లో వేసవి సెలవల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్లో ఉండడంపై సందేహాలు రేకెత్తాయి. కారు ప్రమాదంలో డయానాతో పాటు సంపన్న వ్యాపారి కుమారుడు డోడీ అల్ ఫయేద్ కూడా ఉండడంతో మీడియా ఊహాలకు అంతేలేకుండా పోయింది. ఇరవైయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానాను తన ప్రియుడితో విహరిస్తున్న సమయంలో పాపరాట్సీ(ప్రముఖ వ్యక్తుల ఫొటోలను వారి అనుమతి లేకుండా తీసే ప్రయత్నం చేసేవారు) వెంటపడటంతో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైందంటూ వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. -
అది నిజం కాదు!
ముంబై: బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ తారగా ఎదిగిన ప్రియాంక చోప్రా- బ్రిటన్ రాజకుటుంబం కోడలు మేఘన్ మర్కెల్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరు కలిసి గతంలో పలుసార్లు దర్శనమిచ్చారు. అయితే, వీరిమధ్య గతకొంతకాలంగా పొసగడం లేదని, ఇద్దరూ మిత్రుల మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ప్రియాంక-నిక్ జోనస్ పెళ్లికి మేఘన్ మర్కెల్ రాలేదని ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్కు చెందిన ‘ద సన్’ టాబ్లాయిడ్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్కు వచ్చిన ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్తో కలిసి ససెక్స్ డ్యూచెస్ అయిన మేఘన్ను కలిశారని, ఈ సందర్భంగా మేఘన్ కొడుకు, రాయల్ బేబీ ఆర్చీకి పలు ఖరీదైన కానుకలు కూడా ఇచ్చారని పేర్కొంది. ఈ కథనాలపై ప్రియాంక స్పందిస్తూ.. ఇది నిజంకాదని తేల్చింది. ‘కానుకలు ఇవ్వడం అనేది గొప్ప ఐడియానే. కానీ, ఈ కథనం నిజం కాదు. నేను ఓ పని నిమిత్తం టౌన్లో ఉన్నా. ఈ ‘విశ్వసనీయ వర్గాలు’ ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి నిజాలు సరిచూసుకుంటే బాగుంటుంది’ అని పీసీ ట్వీట్ చేశారు. -
వైరల్ అవుతున్న రాయల్ బేబీ ఫోటోస్
ఎప్పటినుంచో అభిమానులు ఎదురు చూస్తున్న రాయల్ బేబీ ఫోటోలు వచ్చేసాయి. స్వయంగా బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు తమ తొలి సంతానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. దీంతో ఈఫోటోలు వైరల్ గా మారాయి. మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల తరువాత బుధవారం ఉదయం ఈ కొత్త తల్లిదండ్రులు హ్యారీ, మేఘన్ బుధవారం ఉదయం విండ్సోర్ కాసిల్ లోని సెయింట్ జార్జ్ హాల్ లో తొలిసారి మీడియాతో మాట్లాడారు. ‘‘అద్భుతంగా ఉంది. ఈ ప్రపంచంలో ఇద్దరు బెస్ట్ గైస్ నా జీవితంలోకి వచ్చారు’’ అంటూ మేఘన్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. కాగా సోమవారం(మే-6,2019) ఉదయం 05:26 గంటలకు (స్థానిక సమయం) మేఘన్ మార్కెల్ మగబిడ్డకు జన్మనిచ్చిందని ప్రిన్స్ హ్యారీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గతేడాది మే-19,2018న బ్రిటన్లోని బెర్క్ షైర్ కౌంటీ విండ్సర్ లోని సెయింట్ జార్జి చర్చిలో హ్యారీ, మేఘన్ మార్కెల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. -
బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడు
లండన్: బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడొచ్చాడు. యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించేందుకు ఇప్పటికే ఆరుగురు క్యూలో ఉండగా, ఈ కొత్త వారసుడు ఏడో వాడయ్యాడు. బ్రిటిష్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.26 గంటలకు మేఘన్ ఈ బిడ్డకు జన్మనిచ్చారు. బాబు 3.2 కేజీల బరువు ఉన్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రిన్స్ హ్యారీ విలేకరులకు చెప్పారు. ‘నాకు ఇంతకంటే గొప్ప విషయం ఇప్పటివరకు ఏదీ లేదు. నా భార్యను చూస్తే చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పుడు చంద్రుడిపై ఉన్నంత సంతోషంగా ఉంది’ అని హ్యారీ తెలిపారు. -
రాయల్ బేబీ వచ్చేసింది...ప్రిన్స్ హ్యారీ ప్రకటన
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ లభించింది. మేఘన్ మార్కెల్ సోమవారం ఉదయం 05:26 గంటకు (స్థానిక సమయం) బాలుడికి జన్మనిచ్చారు. మార్కెల్ పురిటి నొప్పులతో ఈ తెల్లవారుఝామున ఆసుపత్రిలో చేరారని బకింగ్ హాం ప్యాలస్ సోమవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఆ తరువాత ఈ శుభవార్తను స్వయంగా ప్రిన్స్ హ్యారీ ఇన్వెస్టాగ్రామ్లో వెల్లడించారు. చాలా థ్రిల్లింగా వుందనీ, తల్లి బిడ్డ క్షేమంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు మద్దతు అందించిన అందరికీ ప్రిన్స్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఇంకా తాము బిడ్డ పేర్ల గురించే ఆలోచిస్తున్నామంటూ సంతోషాన్ని వెలిబుచ్చారు. దీంతో ఇన్స్టాగ్రామ్లో అభినందనల వెల్లువ కురుస్తోంది. ఈ పోస్ట్కు కేవలం 30 నిమిషాల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్లు రావడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ -2 ఏడవ ముని మనవడు అవతరించాడు. యువరాజు చార్లెస్, ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీతోపాటు విలియం ముగ్గురు సంతానం తరువాత ప్రిన్స్ హ్యారీ మార్కెల్ తొలి బిడ్డ బ్రిటిస్ రాజ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు రాయల్ బేబీ ఫోటోను చూడడానికి ఈ రాజదంపతులు హితులు, సన్నిహితులతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. కాగా ప్రముఖ హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ను గత ఏడాది మే 19న ప్రిన్స్ హ్యారీ వివాహం చేసుకున్నారు. బ్రిటన్లోని బెర్క్షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో అత్యంత వైభవంగా ఈ వివాహ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram We are pleased to announce that Their Royal Highnesses The Duke and Duchess of Sussex welcomed their firstborn child in the early morning on May 6th, 2019. Their Royal Highnesses’ son weighs 7lbs. 3oz. The Duchess and baby are both healthy and well, and the couple thank members of the public for their shared excitement and support during this very special time in their lives. More details will be shared in the forthcoming days. A post shared by The Duke and Duchess of Sussex (@sussexroyal) on May 6, 2019 at 6:37am PDT -
రికార్డు తిరగరాసిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే సోషల్ మీడియాలో రికార్డు మోత మోగించారు. ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తెరిచిన నిమిషాల వ్యవధిలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయిని ఛేదించారు.దీంతో అతివేగంగా గరిష్ట ఫాలోవర్స్ను సాధించిన ఇన్స్టాగ్రామ్ యూజర్గా వీరి ఖాతా గిన్నిస్ రికార్డుల కెక్కింది. ఏప్రిల్ 2వ తేదీన ససెక్స్ రాయల్ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా మిలియన్లకొద్దీ ఫాలోవర్లు, లైక్లతో దూసుకుపోతోంది. మొదటి 5గంటల్లో పది లక్షమంది ఫాలోవర్స్ను నమోదు చేసింది. అనంతరం ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఇప్పటికే 9లక్షలకు పైగా లైక్స్ను పొందింది. ప్రస్తుతం 2. 6 మిలియన్లతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అతి తక్కువ సంయంలో మిలియన్ల ఫోలోవర్స్ సాధించిన రికార్డు పోప్ ఫాన్సిస్ పేరుతో వుంది. అనంతరం దక్షిణ కొరియా పాప్ సింగర్ కాంగ్ డేనియల్ (11గంటలు) ఈ ఘనతను సాధించారు. ప్రిన్సెస్ యుజెనీ మొదలుకొని డేవిడ్ బెక్హాం, బ్లేక్ లైవ్లీ, గ్వినేత్ పాల్ట్రో, మిండీ కాలింగ్ లాంటి సెలబ్రిటీలు వీరి ఫాలోవర్స్గా ఉన్నారు. ఇంకా మేఘన్ క్లోజ్ ఫ్రెండ్, నటి ప్రియాంకా చోప్రా, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, జెస్సికా ముల్రనీ ఈ ఖాతాలోని మొదటి అనుచరుల జాబితాలో ఉన్నారు. కాగా కేవలం 23మంది ఫాలోవర్స్ మాత్రమే ససెక్స్రాయల్ అకౌంట్లో ఉన్నారు. కాగా మరో నెలరోజుల్లోనే మేఘన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇక పుట్టిన బిడ్డ ఫోటో పోస్ట్ చేస్తే ఇంకెన్ని రికార్డు ల మోత మోగనుందోనని భావిస్తున్నారు. -
‘నా గుండెను ముక్కలు చేశావు.. నాన్నా!’
లండన్ : డచెస్ ఆఫ్ ససెక్స్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ తనకు రాసిన భావోద్వేగ లేఖను ఆమె తండ్రి థామస్ మార్కెల్ బహిర్గతం చేశారు. యువరాణి హోదా పొందిన నాటి నుంచి తనకీ, తన కూతురికీ మధ్య బంధం పూర్తిగా తెగిపోయిందంటూ అనేకమార్లు థామస్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె నుంచి స్పందన రాలేదని, ఈ విషయంలో కలగజేసుకోవాల్సిందిగా బ్రిటన్ మహారాణి ఎలిజబెత్కు కూడా అభ్యర్థించారు. ఈ క్రమంలో గత వారం ఓ మ్యాగజీన్ ఇచ్చిన ఇంటర్య్యూలో భాగంగా మేఘన్ స్నేహితులు.. థామస్ ఎప్పుడూ మేఘన్ను సంప్రదించే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో మేఘన్ తనకు రాసిన లేఖను థామస్ ఆదివారం బయటపెట్టారు. తన మెసేజ్లకు స్పందనగానే మేఘన్ ఈ లేఖ రాసిందని పేర్కొన్నారు. నా గుండె ముక్కలు చేశావు నాన్నా! ‘నాన్నా.. బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నా. నువ్వింత గుడ్డిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. నన్ను బాధ పెట్టడానికి ఈ దారి ఎందుకు ఎంచుకున్నావు. నువ్వు నా గుండెను పది లక్షల ముక్కలు చేశావు. నువ్విలా ఎందుకు చేస్తున్నావు. మీడియాతో చెప్పినట్లుగా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే.. ఇలాంటి ఆరోపణలు ఆపెయ్. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వు. ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నా. అబద్ధాలు చెప్పడం మానెయ్. నాకు బాధ కలిగించడం మానెయ్. నా భర్తతో నాకు ఉన్న అనుబంధాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించకు. నా పెళ్లికి రాలేకపోయావెందుకు’ అని మేఘన్ పేరిట ఉన్న ఉత్తరాన్ని థామస్ మీడియా ‘డెయిలీ మెయిల్’ ద్వారా బహిర్గతం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ లేఖ నన్ను చాలా బాధించింది. నేను కుంగిపోయాను. ఈ లేఖను ఎవ్వరికీ చూపించలేదు. కానీ లేఖ రావడం మంచి విషయమే కదా. తను ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇదంతా ముగిసిపోతుంది. నా కూతురు ఏదో ఒకరోజు దగ్గరవుతుందనే నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించారు. కాగా హాలీవుడ్ నటి మేఘన్.. బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మే నెలలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆమె తండ్రి హాజరుకాలేదు. ఇక అప్పటి నుంచి మేఘన్ను మారిపోయిందంటూ ఆమె తండ్రి ఆరోపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. -
‘దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి’
లండన్ : తనకి, తన కూతురికి మధ్య ఏర్పడిన ‘అగాథాన్ని’పూడ్చేందుకు బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ చొరవ తీసుకోవాలని మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ అభ్యర్థించారు. హాలీవుడ్ నటి మేఘన్.. బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆమె తండ్రి హాజరుకాలేదు. ఈ క్రమంలో మేఘన్ పెళ్లైన నాటి నుంచి ఆమెతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేఘన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. తను నాకోసం క్రిస్మస్ కార్డులు పంపుతుందని ఇన్నాళ్లూ ఎదురుచూశాను. తనకు ఎన్నోసార్లు మెసేజ్ కూడా చేశాను. కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందనా లేదు. దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి. త్వరలోనే బుల్లి మేఘన్ లేదా బుల్లి హ్యారీ రాబోతున్నారు. కాబట్టి ఇటువంటి సంతోష సమయంలో నేను తనని కలవాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే రాణీగారు. కుటుంబంలో తలెత్తిన సమస్యలను క్వీన్ ఎలిజబెత్ పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. రాజ కుటుంబంలోనైనా, సాధారణ కుటుంబాల్లోనైనా కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటేనే సంతోషం కదా. నా బాధను అర్థం చేసుకోండి’ అంటూ థామస్ మార్కెల్ సోమవారం ఎలిజబెత్కు విన్నవించారు. కాగా యువరాణి హోదా పొందిన నాటి నుంచి తన కూతురి మోముపై చిరునవ్వు మాయమైందంటూ థామస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘నా కూతురి నవ్వు ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనం నుంచి తన నవ్వుని చూస్తున్నాను. ఇప్పుడు ఆమె మొహంలో కనిపించే చిరునవ్వు నిజమైనది కాదు. ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధ ఉంది’ అది నాకు స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక ‘మేఘన్కు వివాహం అయిన నాటి నుంచి ఆమెతో మాట్లాడలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. స్వయంగా కలుద్దామంటే ఆమె చిరునామ నా దగ్గర లేదు’ అని ఆయన కంటతడి పెట్టారు. ఇక ఈ విషయంపై క్వీన్ ఎలిజబెత్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
ఇట్టే కలిసిపోయారు!!
బుధవారం ఎవరి పనిమీద వాళ్లు బైటికొచ్చారు మేఘన్ మార్కెల్, కేట్ మిడిల్టన్. మేఘన్.. ప్రిన్స్ హ్యారీ భార్య. కేట్.. ప్రిన్స్ విలియమ్స్ భార్య. ఇద్దరూ తోడికోడళ్లు. అయితే ఒకరికొకరు తోడుగా ఏమీ వాళ్లు బయటికి రాలేదు. ఎవరికి వారుగా వెళ్లిపోయారు. మేఘన్ వెళ్లింది ఒక వంటల ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా. కేట్ Ðð ళ్లింది.. లండన్ యూనివర్సిటీ కాలేజ్లోని న్యూరోసైన్స్ యూనిట్కి. లండన్లో ‘హబ్’ అనే ముస్లిం కమ్యూనిటీ ఉంది. వాళ్లు చేసే వంటలకు పబ్లిసిటీ ఇచ్చేందుకు వెళ్లారు మేఘన్. న్యూరోసైన్స్ యూనిట్లో.. పిల్లల బ్రెయిన్ వికసించే పరిణామక్రమంలో లెక్చర్ వినేందుకు వెళ్లారు కేట్. ఇక్కడి వరకు విశేషం ఏమీ లేదు. అనుకోకుండా ఇద్దరూ ఒకే డ్రెస్లో లండన్ వీధుల్లోకి వచ్చారు. అదీ విశేషం. మేఘన్ మెరూన్ డ్రెస్తో వచ్చారు. సేమ్ అలాంటిదే వేస్కుని, బ్లాక్ కాంబినేషన్తో కేట్ ప్రత్యక్షం అయ్యారు. డ్రెస్ మాత్రమే ‘సేమ్ పించ్’ కాదు. ‘లో పోనీ టైల్’ కూడా సేమ్. ప్లాన్ చేసుకునే వచ్చారా ఏంటి? పెద్ద నవ్వు. ఇద్దరిదీ! దానర్థం ‘నో ప్లానింగ్’ అని. కేట్ డ్రెస్ ‘పాల్కా’ బ్రాండ్. ప్యారిస్ నుంచి ఇంపోర్ట్ అయింది. 2012 నుంచి సేమ్ డ్రెస్ను రిపీట్ చేస్తున్నారు కేట్. మేఘన్ వేసుకున్న బ్రాండ్ ‘క్లబ్ మొనాకో’. యు.ఎస్. కంపెనీ. కొంచెం ఖరీదైంది. చిరునవ్వు ఇద్దరు అపరిచితులను కలుపుతుంది. సేమ్ పించ్ రెండు చిరునవ్వులను వెలిగిస్తుంది. ఒకే విధమైన డ్రెస్ వేసుకొచ్చిన ఇద్దరు నార్మల్ పర్సన్స్ ఆ పూటకి సెలబ్రిటీలు! ఒకే డ్రెస్లో కనిపించిన ఇద్దరు సెలబ్రిటీలు.. ఆ పూటకు సామాన్యులు. ఆ సామాన్యతే ఈ ఇద్దరు కోడళ్లకు ఎప్పటికప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ఇస్తోంది. సేమ్ పించ్ -
మేఘన్కు కష్టాలు.. కన్నతండ్రి కన్నీటిపర్యంతం!
వివాహం అయిన తర్వాత ప్రతి మహిళ జీవితంలో కొన్ని సర్దుబాట్లు తప్పవు. అత్తింటి ఆచారాలకు తగ్గట్టు తనను తాను మార్చుకోవడానికి కాస్తా సమయం పడుతుంది. సాధరణ కుటుంబాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఇక రాయల్ ఫ్యామిలిలో కోడలిగా అడుగుపెట్టిన వారి పరిస్థితి ఇంకాస్తా కష్టంగానే ఉంటుంది. రాజ కుటుంబం అంటే కట్టుబాట్లు, కష్టమైన నియమాలు తప్పవు. ఏం తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎలా మాట్లాడాలి... ఇలా ప్రతి విషయంలోనూ ఆచారం, వ్యవహారం ఉంటుంది. అవన్ని ఆకళింపు చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. అన్నింటి కంటే ముఖ్యమైనది వాటన్నింటికి అనుగుణంగా తమని తాము మార్చుకునే క్రమంలో వారిలో చెలరేగే సంఘర్షన. కొందరు దీనిని తట్టుకోగలరు, మరి కొందరు వీటన్నింటిని భరించడం మా వల్ల కాదు అనుకుని ఆ బంధం నుంచి బయటపడతారు. ప్రస్తుతం మేఘన్ మార్కల్ కూడా ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారంట. నలుగురిలో చిరునవ్వుతో కనిపించే మేఘన్ తన మనసులో అపారమైన బాధను భరిస్తున్నారంట. ఆమె మోముపై ఉన్న చిరునవ్వు నిజం కాదంట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. స్వయంగా మేఘన్ తండ్రే. ఒకప్పటి ఈ నటి ప్రిన్స్ హారీని వివాహం చేసుకుని రాజకుటుంబంలో అడుగుపెట్టారు. ఇన్నాళ్లు సాధారణ జీవితం గడిపిన మేఘన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా రాయల్ ఫ్యామిలీలో ఒదిగిపోవడం అంటే కష్టమే. కొత్త వాతవారణం, కొత్త మనుషులు అన్నింటికి మించి ఇన్నాళ్లు అందరిలానే చేసిన కొన్ని పనులను కూడా ప్రత్యేక పద్దతిలో చేయాల్సి రావడం కాస్తా కష్టమే. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు మేఘన్ మార్కల్. ఇప్పటికే పలు సందర్భాల్లో రాయల్ ఫ్యామిలీ నియమాలను మర్చిపోతూ మీడియా వారికి పని కల్పిస్తున్నారు. దాంతో సామన్యులు కూడా పాపం మేఘన్కు రాజకుటుంబం బరువు బాధ్యతలు మోయడం ఇబ్బందిగా ఉన్నట్లుంది అనుకుంటున్నారు. ఇలా అనుకునే వారిలో మేఘన్ మార్కేల్ తండ్రి కూడా ఉన్నారు. ఈ విషయం గురించి థామస్ ‘ఇప్పుడు నా కూతురు ప్రారంభించిన కొత్త జీవితం ఆమెను భయపెడుతుందనుకుంటున్నాను. ఆమె కళ్లల్లో, మొహంలో, చివరికి ఆమె నవ్వులో కూడా ఆ భయం నాకు స్పష్టంగా తెలుస్తుంది’ అని తెలిపారు. మేఘన్ మార్కల్ బహిరంగ సమావేశాలకు హాజరయిన ప్రతిసారి ఆమె మొము మీద చిరునవ్వు ఉంటుంది. కానీ ఆమె తండ్రి థామస్ మాత్రం అది నిజం చిరునవ్వు కాదంటున్నారు. ‘నా కూతురి నవ్వు ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనం నుంచి తన నవ్వుని చూస్తున్నాను. ఇప్పుడు ఆమె మొహంలో కనిపించే చిరునవ్వు నిజమైనది కాదు. ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధ ఉంది’ అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. అంతేకాక ‘మేఘన్కు వివాహం అయిన నాటి నుంచి నేటి వరకూ నేము ఆమెతో మాట్లాడలేదు. నేను ఎన్నిసార్లు ఆమెకు ఫోన్ చేసిన తను ఫోన్ ఎత్తడం లేదు. స్వయంగా కలుద్దామంటే ఆమె చిరునామ నా దగ్గర లేదు’ అని ఆయన కంటతడి పెట్టారు. -
మర్యాద మర్యాద
బ్రిటన్ రాచకుటుంబంలోకి కొత్తగా ఎవరు అడుగు పెట్టినా అంతఃపుర సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవలసిందే. ఏం తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎలా మాట్లాడాలి... ఇలా ప్రతి విషయంలోనూ ఆచారం, వ్యవహారం ఉంటుంది. ఇవి కాకుండా మరికొన్ని నిబంధనల్ని స్వయంగా బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ విధిస్తారు. మొదటిది వస్త్రధారణ. అందుకు తగ్గట్లుగా మహారాణి దగ్గరకు వెళ్లేటప్పుడు ఆ కుటుంబంలోకి కొత్తగా వెళ్లిన మేఘన్ మార్కల్ (ప్రిన్స్ హ్యారీ భార్య) ఇప్పుడు ఎత్తు చెప్పులు ధరించడం లేదు. మార్కల్కు ఎత్తు చెప్పులంటే ఇష్టం అయినప్పటికీ రాణి గారికి ఇష్టం లేదు. అందుకే అధికార కార్యక్రమాలలో రాణిగారు లేని సమయంలో మాత్రమే తోడికోడళ్లిద్దరూ ఎత్తుచెప్పులు వేసుకుంటున్నారు. గత మే నెలలో మేఘన్ రాజప్రాసాదంలోకి ప్రవేశించాక, ఎత్తు చెప్పులతో ఫొటోలకు చిక్కలేదు కానీ ఇటీవల తన తెలియనితనంతో రాయల్ ఫ్యామిలీ ఆగ్రహానికి గురికావలసి వచ్చింది! బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన ఒక కార్యక్రమంలో మేఘన్ రెండు తప్పులు చేసినట్లుగా గుర్తించారు. ఆ కార్యక్రమంలో రాణిగారు ఆసీనులై ఉన్న వరుసలోనే కూర్చున్న మేఘన్ కాలు మీద కాలు వేసుకోవడం ఒక తప్పు. అయితే చాలా త్వరగానే ఆమె తన తప్పును సరిచేసుకున్నారు. ఇంకో తప్పేమిటంటే.. రాణి గారు ఉండగానే ప్రిన్స్ హ్యారీ చేతిని తన చేతిలోకి తీసుకోవడం. దీనిపై ఇప్పుడు బ్రిటన్లో పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ, ‘తెలియని పిల్ల’ అని రాణిగారు సరిపెట్టుకున్నట్లున్నారు. మేఘన్ రాజకుటుంబంలో కొత్త సభ్యురాలయ్యాక తెలుసుకున్న ఇంకో సంగతి ఏంటంటే.. భోజనంలో వెల్లుల్లి తీసుకోకూడదు. నలుగురితో కలిసి తింటున్నప్పుడు వెల్లుల్లి వాసన రాకూడదనే ఈ నిషేధం విధించారు. అయితే మేఘన్ తాను ఒంటరిగా భోజనం చేసేటప్పుడు కావలసినంత వెల్లుల్లి తినడానికి అనుమతి ఉంది. ఇలాంటి వాటన్నిటికీ ఇప్పుడిప్పుడే మేఘన్ అలవాటుపడుతున్నారు. – రోహిణి -
రాణిగారికీ రూల్స్ ఉన్నాయి!
బ్రిటన్ యువరాజు హ్యారీని హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ ఇటీవల వివాహమాడిన విషయం తెలిసిందే. యువరాజుని పెళ్లాడటంతో యువరాణి అయిపోయారు మేఘన్. సకల సౌకర్యాలు లభిస్తాయి అనుకోవడంలో ఎటువంటి సందేహాలు లేవు. వాటితో పాటుగా రాజ వంశీకులుగా కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయట ఈ యువరాణిగారికి. రాజకుటుంబంలో సభ్యురాలు అయ్యారు కాబట్టి మేఘన్ మార్కెల్ ఇక మీదట ఇంతకుముందులా మామూలు సిటిజన్ కాదు. రాజకుటుంబీకుల లైఫ్ స్టైల్కు, వాళ్ల పద్ధతులకు అలవాటు పడాలి. అందులో కొన్ని రూల్స్ ఈ విధంగా ఉంటాయని సమాచారం. సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్లు ఇవ్వడం చేయకూడదు. సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండకూడదు. డ్రెస్సింగ్ విషయానికి వస్తే మినీ–స్కర్ట్స్కు దూరంగా ఉండాలి. షెల్ ఫిష్ తినకూడదు. డిన్నర్ను రాత్రి 8.30 నుంచి 10లోపు ముగించేయాలి. మహారాణి కంటే ముందే నిద్రపోకూడదు. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు హస్బెండ్ హ్యారీ పక్కనే కూర్చోవాలి. కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోకూడదు. కావాలంటే ఒకవైపు వాలుగా కాళ్లు పెట్టుకోవచ్చు. తన కంటే పై స్థాయిలోని వాళ్లు రూమ్లోకి రాగానే మర్యాదపూర్వకంగా గౌరవించాలి. ఇలాంటి కొన్ని నియమాలను రాజకుటుంబంలోకి వెళ్తున్నందుకు మార్కెల్ పాటించాలట. సో.. మార్కెల్ ఇక మీదట పాత మార్కెల్లా ఉండబోరన్నమాట. -
ఆమె చెప్పుల ధర వింటే షాకవుతారు!
బెర్క్షైర్: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బ్రిటన్లోని బెర్క్షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ప్రియాంక ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. బ్రిటన్ మహారాణి ఇంట జరుగుతున్న వివాహం కాబట్టి దానికి తగ్గట్టే ప్రియాంక కూడా రాయల్ లుక్లో ఆమె అదిరిపోయారు. డ్రస్ నుంచి ఆమె వేసుకున్న హీల్స్ వరకు ప్రతీది ఆకట్టుకునే రీతిలోనే ఉన్నాయి. ఈ వెడ్డింగ్లో ప్రియాంక వేసుకున్న హీల్స్ ఖరీదు వింటే మీకు మాటే రాకపోవచ్చు. స్వరోక్సి క్రిస్టల్స్తో ఇవి రూపొందిన ప్రియాంక చెప్పుల ఖరీదు రూ.1.35 లక్షలని తెలిసింది. ఆమె వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నట్టు తెలిసింది. మేఘన్, ప్రియాంకకు మంచి స్నేహితురాలు. ఈ వివాహంతో మేఘన్ జీవితం మారిపోతుందని, మేఘన్ చాలా తెలివైన నటి అని ప్రియాంక పేర్కొంది. -
రాకుమారుడికి కుర్తా...రాణిగారికి చీర
ముంబై : బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బ్రిటన్లోని బెర్క్షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో మనదేశానికి చెందిన బాలీవుడ్ నటి ప్రియాంరా చోప్రాతో పాటు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘మైనా మహిళా ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా కూడా హాజరయ్యారు. వివాహ వేడుక సందర్భంగా ఈ జంటకు వివిధ దేశాల నుంచి బహుమతులు అందుతుండగా, వాటిలో మన దేశానికి చెందినవి కూడా ఉన్నాయ. ఈ రాయల్ వెడ్డింగ్కు మన దేశం నుంచి ముంబైకి చెందిన డబ్బావాలాలు, భారతీయ ‘పెటా’ సంస్థ బహుమతులు పంపారు. చీరను పంపిన డబ్బా వాలాలు.... ముంబైకి చెందిన డబ్బావాలలతో బ్రిటన్ రాజ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. 2003 భారతదేశ పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్కు తొలిసారి డబ్బావాలలతో పరిచయం ఏర్పడింది. డబ్బావాలాల పనితీరు, సమయ పాలన, నిబద్థత ప్రిన్స్ చార్లెస్ను ఎంతో ఆకట్టుకున్నాయి. వారి పనితీరును మెచ్చుకోవడమే కాక తన వివాహ వేడుకకు డబ్బావాలాలను కూడా ఆహ్వానించాడు చార్లెస్. నాటినుంచి డబ్బావాలాలకు రాజకుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అయితే ప్రస్తుతం జరిగిన మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి వీరిని ఆహ్వానించలేదు. అయినప్పటికీ ప్రిన్స్ చార్లెస్తో ఉన్న అనుబంధం దృష్ట్యా నిన్న జరిగిన ప్రిన్స్ హ్యారీ వివాహానికి డబ్బావాలాల తరుపున వీరు ప్రత్యేక బహుమతులు పంపారు. రాకుమారుడు హ్యారీ కోసం కుర్తా, తలపాగాను, మేఘనా మార్కల్ కోసం పసుపు, ఆకుపచ్చ రంగుల కలయికలో ఉన్న ‘పైథానీ’ చీరను బహుమతిగా పంపారు. అంతేకాక వివాహ వేడుక సందర్భంగా ముంబై ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగుల కుటుంబాలకు మిఠాయిలు పంచారు. ఈ విషయం గురించి డబ్బావాలా అసోసియేషన్ ప్రతినిధి సుభాష్ తాలేకర్ ‘గతంలో ప్రిన్స్ చార్లెస్ వివాహానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఆ వేడకకు హాజరయిన మమ్మల్ని సాదరంగా ఆదరించిడమే కాక మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అందుకే ప్రిన్స్ హ్యారీ వివాహా వేడుకకు మమ్మల్ని ఆహ్వానించనప్పటికి, మేము మా సంతోషాన్ని తెలపాలనుకున్నాం. అందుకే ఇలా మా తరఫున బహుమతులు పంపామ’న్నారు. పెటా బహుమతి ‘మెర్రి’... డబ్బావాలాలతో పాటు ‘పెటా’(పిపుల్ ఫర్ ద ఎథికల్ ట్రిట్మెంట్ ఆఫ్ ద అనిమల్స్) కూడా మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి బహుమతి పంపింది. వీరి వివాహానికి గుర్తుగా ‘పెటా’ ఒక ఎద్దుకు వీరిద్దరి పేర్లు కలిసేలా ‘మెర్రి’(మేఘన్లో మె, హ్యారీలో రి కలిపి మెర్రి) అనే పేరును పెట్టి, ఆ ఎద్దు ఫోటో తీసి దానితో పాటు ఒక సందేశాన్ని కూడా పంపారు. ‘మెర్’రి(ఎద్దు) ని పూలమాలతో అలంకరించి ఫోటో తీసారు. ఫోటోతో పాటు పంపిన సందేశంలో మెర్రి కథను తెలియజేసారు. ఆ సందేశంలో ‘కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలో గాయలతో, ఒంటరితనంతో బాధపడుతున్న మెర్రిని చూడటం జరిగింది. పాపం అది తన జీవిత కాలమంతా బరువులను మోస్తూ సేవ చేసింది. వయసు పైబడి, అనారోగ్యంతో బాధపడుతున్న మెర్రిని ఇప్పుడిలా ఒంటరిగా వదిలేసారు. మేము ‘మెర్రి’ బాధ్యతను తీసుకుని, దానికి వైద్యం చేయించి ఒక సంరక్షణా కేంద్రానికి తరలించాము. ప్రస్తుతం ‘మెర్రి’ సంరక్షణా కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటూ తన మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంద’ని తెలిపారు. ‘ఈ రాయల్ వెడ్డింగ్ సందర్భంగా జనాలకు మూగ జీవుల పట్ల దయగా వ్యవహరించాలనే సందేశాన్ని ప్రచారం చేయాలని భావించాము...అందుకే మెర్రి(ఎద్దు) ఫొటోను బహుకరించామ’ని పెటా అసోసియేట్ డైరెక్టర్ సచిన్ బంగోరా తెలిపారు. -
అంగరంగ వైభవంగా..
బెర్క్షైర్: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం ఘనంగా జరిగింది. బ్రిటన్లోని బెర్క్షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. మరో 2,640 మంది విండ్సర్ మైదానం నుంచి, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అంతకుముందు, సంప్రదాయ పద్ధతిలో మార్కల్ను హ్యారీ తండ్రి చార్లెస్ చర్చిలోకి తీసుకొచ్చారు. అనారోగ్యంతో మార్కల్ తండ్రి రాలేకపోవడంతో చార్లెస్ ఆమెకు తండ్రి స్థానంలో నిలిచారు. మార్కల్ కుటుంబం నుంచి ఆమె తల్లి డోరియా రాగ్లాండ్ హాజరయ్యారు. హ్యారీ అన్న విలియం కూతురు చార్లెట్ తోడి పెళ్లికూతురిలా వెంట వచ్చింది. విలియం కొడుకు జార్జి, కూతురు చార్లెట్లు వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేక ఆకర్షణగా మార్కల్ గౌను.. బ్రిటిష్ డిజైనర్ క్లారె వైట్ కెల్లర్ రూపొందించిన తెలుపు రంగు పట్టు గౌనులో మార్కల్ మెరిసిపోయారు. ఆ డ్రెస్పై తామరతో పాటు 53 దేశాలకు చెందిన పుష్పాల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ ప్రమాణాల బదులు 2000 నాటి మ్యారేజ్ సర్వీసును పాటించారు. కష్టమైనా, సుఖమైనా, ఆరోగ్యఅనారోగ్యాల్లో కడదాకా ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేశారు. మార్కల్కు హ్యారీ బంగారు ఉంగరం తొడగ్గా, హ్యారీకి మార్కల్ ప్లాటినం ఉంగరం తొడిగారు. వివాహం అనంతరం దంపతులు గుర్రపు బగ్గీలో విండ్సర్ ప్రాంతమంతా కలియతిరిగారు. వారిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లో నిలబడ్డారు. కొత్త జంట ప్రిన్స్ హ్యారీ–మేఘన్ మార్కల్కు రాణి ఎలిజబెత్ 2 సస్సెక్స్ డ్యూక్, సస్సెక్స్ డచెస్ బిరుదులు ప్రదానం చేశారు. హాజరైన ప్రియాంక చోప్రా.. వివాహానికి హాజరైన ప్రముఖుల్లో భారత నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ, సాకర్ ఆటగాడు డేవిడ్ బెక్హామ్ తదితరులు కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్ సభ్యులతో హాజరయ్యారు. వివాహం తర్వాత గుర్రపు బగ్గీలో వెళుతున్న హ్యారీ దంపతులు వివాహానికి హాజరైన సుహానీ జలోటా(ఎడమ), ఫౌండేషన్ సభ్యులు, ప్రియాంక చోప్రా వివాహ వేదిక వద్దకు వస్తున్న హ్యారీ, మార్కల్లను చూసేందుకు బారులుతీరిన ప్రజలు -
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ల వివాహ వేడుక
-
రాయల్ వెడ్డింగ్ : ఒక్కటైన వధూవరులు
ఎన్నో రోజులుగా ప్రపంచవ్యాప్త అభిమానులను ఊరిస్తున్న రాయల్ వెడ్డింగ్ విండ్సర్ క్యాజిల్లో కన్నుల పండువగా జరిగింది. వరుడు ప్రిన్స్ హ్యారీ, వధువు మేఘన్ మార్కెల్లు ముసిముసి నవ్వులతో రింగులు మార్చుకుని ఒక్కటయ్యారు. మేఘన్, ప్రిన్స్లను భార్యభర్తలుగా జస్టిన్ వెల్బీ అధికారికంగా ప్రకటించారు.వీరి వివాహ వార్త అధికారికంగా ప్రకటించగానే చాపెల్ వెలుపల సంబురాలు ప్రారంభయ్యాయి. వేడుకకు ముందు.... ప్రిన్స్ను మనువాడేందుకు మేఘన్ చర్చిలోకి రాగానే వివాహానికి వచ్చిన అతిథులందరూ లేచి నిల్చున్నారు. రాయల్ వెడ్డింగ్కు వధువు తండ్రి థామస్ రాలేకపోవడంతో, వరుడు తండ్రి ప్రిన్స్ ఛార్లెస్ ఆమెకు తండ్రిగా విండ్సర్ క్యాజిల్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ వివాహానికి భారీ ఎత్తున్న అతిథులు హజరయ్యారు. ఈ వేడుకలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా, డేవిడ్, విక్టోరియా బెక్హాం, జార్జ్, అమల్, టెన్నీస్ స్టార్ సెరెనా విలియమ్స్లు కూడా పాల్గొన్నారు. వివాహ వేడుకతో విండ్సర్ క్యాజిల్ చర్చి వీధులన్నీ గానా బజానాలతో, అతిథులతో కిటకిటలాడాయి. మేఘన్ మార్కెల్, బ్రిటీష్ డిజైనర్ క్లేర్ వెయిట్ కెల్లర్ డిజైన్ చేసిన డ్రెస్ను ధరించారు. ప్రిన్స్ హ్యారీ రింగ్ ప్లాటినం బాండ్తో ఉండగా... మార్కెల్ వెడ్డింగ్ రింగ్ వెల్ష్ గోల్డ్తో రూపొందినట్టు కెన్సింగ్టన్ ప్యాలెస్ చెప్పింది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్లకు బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా.. బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్ తన చిన్న మనవడు ప్రిన్స్ హ్యారీ వివాహానికి సమ్మతించారహో..’ బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి మొన్న శనివారమే ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుక నేడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. -
రాయల్ వెడ్డింగ్లో మేఘన్కు లోటు...
లాస్ ఏంజెల్స్ : బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలకు ఎంతో ప్రత్యేకమైన ఈ వేడుకలో మేఘన్ను మాత్రం ఓ లోటు వెంటాడనుంది. ఈ నెల(మే) 19న లండన్లో అత్యంత వైభవంగా జరిగే పెళ్లి వేడుకకు మేఘన్ తండ్రి థామస్ మార్కెల్ హాజరుకావడం లేదని ఓ వెబ్సైట్ పేర్కొంది. గత వారం గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన మేఘన్ తండ్రి థామస్ను ప్రస్తుతం డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. 74 ఏళ్ల థామస్కు బుధవారం హార్ట్ సర్జరీ జరగనున్న నేపథ్యంలో ఆస్పత్రి నుంచి కదలకూడదని వైద్యులు చెప్పడంతో కూతురు పెళ్లికి హాజరుకాలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన మెక్సికోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం మేఘన్ సవతి సోదరుడు రాసిన లేఖ మరోసారి చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు. ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు కూడా చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. నటి అయ్యాక కుటుంబం కష్టాలు తీర్చాల్సిన బాధ్యతలను గాలికొదిలేసిన మేఘన్.. ఉన్నత కుటుంబంలో వ్యక్తి అయ్యాక ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదని’ అతడు లేఖలో పేర్కొన్నాడు. -
పెళ్లి ఆపేయ్.. రాయల్ ఫ్యామిలీ చారిత్రక తప్పిదం!
లండన్: ఓవైపు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ల వివాహానికి రాజకుటుంబీకులు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు పెళ్లి ఆపేయాలంటూ వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ప్రిన్స్ హ్యారీకి ఆ లేఖ రాసింది మరెవరో కాదు.. మేఘన్ మార్కెల్ సవతి సోదరుడు థామస్ మార్కెల్. ఇప్పటికీ మించి పోయిందేంలేదు.. పెళ్లి ఆపేస్తే మీ కుటుంబానికి మంచిదంటూ హ్యారీని థామస్ హెచ్చరించాడు. ఈ నెల 19న లండన్లోని విండ్సర్ క్యాజిల్లో జరగబోయే రాయల్ వెడ్డింగ్కు ఇప్పటికే ఆహ్వానాలు అందజేశారు. కానీ ఈ నేపథ్యంలో మేఘన్ సోదరుడు రాసిన లేఖ చర్చనీయాంశమైంది. 'మేఘన్ మార్కెల్ మీకు తగిన వధువు కాదు. ఆమె నిజ స్వరూపం మీకు తెలియదు. ఆమె మా నాన్నను ఒంటరిగా మెక్సికోలో వదిలేసి వెళ్లిపోయింది. మేఘన్ను నటిని చేసేందుకు నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. అప్పులు చేశారు. ఆమె నటి అయిన తర్వాత కూడా నాన్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెళ్లికి రావాలంటూ తెలియని వారికి కూడా ఆహ్వానాలు పంపుతోంది. కానీ మా కుటుంబంలో ఒక్కరికీ కూడా వివాహ ఆహ్వానం అందలేదు. ఒక వేళ ఆమెను మీ ఇంటి సభ్యురాలిగా చేసుకుంటే రాజకుటుంబం గౌరవ, మర్యాదలు మంటకలిసిపోతాయి. పెళ్లితో రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. మా కుటుంబానికి మేఘన్ చాలా దూరంగా ఉంటోంది. ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిందో మేఘన్ మరిచి పోయింది. ఆమె ఎప్పటికీ నాకు చెల్లెలే. కానీ తన కుటుంబాన్ని, సన్నిహితులను వదిలేసుకుంది. ఎందుకంటే.. మేం సినిమా నిర్మాతలం కాదు. నటి అయ్యాక కుటుంబం కష్టాలు తీర్చాల్సిన బాధ్యతలను గాలికొదిలేసిన మేఘన్.. ఉన్నత కుటుంబంలో వ్యక్తి అయ్యాక ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలని' అని మేఘన్ సోదరుడు థామస్ ప్రిన్స్ హ్యారీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
బ్రిటీష్ ప్రిన్స్ పెళ్లికి ప్రియాంక
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రిటీష్ రాయల్ వెడ్డింగ్కి హాజరు కానున్నారు. తన హాలీవుడ్ స్నేహితురాలు మేఘన్ మార్కెల్- బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీల వివాహ మహోత్సవంలో పాల్గొనాలని ఆమెకు పిలుపు అందింది. ఈ నెల 19న లండన్లోని విండ్సర్ క్యాజిల్లో జరగబోయే పెళ్లి వేడుకకు ప్రియాంక హాజరు కానున్నారు. తన స్నేహితురాలి పెళ్లి వేడుకకు ఆహ్వానం అందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పెళ్లి కూతురు మేఘన్తో తన మూడేళ్ల స్నేహ బంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘మార్కెల్ మాటతీరు, నడవడిక ఎంతో బాగుంటాయి. ఆమె తన కొత్త జీవితంలో చక్కగా ఒదిగిపోతుంద’ని ప్రియాంక అన్నారు. ప్రియాంక సన్నిహితురాలు రేచల్ రే దీనిపై స్పందించారు. ‘ఏమో మేఘన్ సాధారణ గృహిణి మాత్రమే కావచ్చునేమో’నని వ్యాఖ్యానించగా.. ‘ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనేంత చక్కని చుక్క నా ఫ్రెండ్. అమ్మాయిలకు మార్గదర్శిగా నిలిచే గొప్ప వ్యక్తిత్వం గల ముద్దుగుమ్మ మేఘన్’ అని ప్రియాంక తన స్నేహితురాలిపై అభిమానాన్ని చాటుకున్నారు. మార్కెల్తో మూడేళ్ల ప్రయాణంలో తాను ఎంతో నేర్చుకున్నానని ప్రియాంక అన్నారు. ఆమె గొప్పింటికి కోడలుగా వెళ్లబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, ప్రియాంక తన పాపులర్ షో ‘క్వాంటీకో’ మూడో సీజన్ను ఈ వారం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి
‘పెళ్లయ్యాక నువ్వు మొత్తం మారిపోయావు!’ అనే మాటలు బాగా వినిపిస్తుంటాయి స్నేహితుల మధ్య. నిజమే మరి! పెళ్లైపోతే ప్రియారిటీలు, ప్రపంచాలూ మారిపోతాయి. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మేఘన్ మార్కెల్ పెళ్లి చేసుకోబోతోంది. మే 19న పెళ్లి. అదీ ప్రిన్స్ హ్యారీతో. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో పెళ్లంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ దేశాల పెద్దలంతా ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాల్లో సూపర్స్టార్డమ్ అనుభవించిన మేఘన్, పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నట్టు చెప్పింది. దీంతో ఆమెను ఫ్యాన్స్ ఇప్పట్నుంచే మిస్ అవుతూంటే, బెస్ట్ఫ్రెండ్ ప్రియాంక చోప్రా కూడా అంతే మిస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇండియన్ సినిమాలో సూపర్స్టార్ అనిపించుకొని ఇప్పుడు హాలీవుడ్లోనూ మెప్పిస్తోన్న ప్రియాంకా చోప్రా, మేఘన్ మార్కెల్ ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్స్. ‘నాకు బెస్ట్ఫ్రెండ్ లాంటిది మేఘన్’ అని చెప్తుంది ప్రియాంక. తాజాగా మేఘన్ పెళ్లి చేసుకోబోతోందంటే ప్రియాంక కూడా ఎమోషనల్ అయిపోతోంది. ఆమెకు స్వయంగా ఒక లెటర్ కూడా రాసి పంపింది. ‘ ‘బిర్యానీ, పౌటిన్లు తింటూ లెక్కలేనని కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఈ మధ్యలోనే తనేంటో తెలుసుకోవడం ఎంత బాగుండేదో! ప్రపంచం గురించి, మనుషుల గురించి, చాలా విషయాల గురించి ఆలోచిస్తుంది మేఘన్. ఈ ప్రిన్సెస్కి ఇప్పుడు ప్రిన్స్ దొరికేశాడు. తన ప్రేమ జీవితం, పెళ్లి జీవితం అద్భుతంగా ఉండాలి. తనెప్పుడూ హ్యాపీగా ఉండాలి.’’ అంటూ ప్రియాంక రాసిన ఈ లెటర్ వాళ్లిద్దరి క్యూట్ ఫ్రెండ్షిప్ను చెప్పకనే బలంగా చెప్పేస్తోంది. ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్, మేఘన్ పెళ్లి తర్వాత కూడా ఇంతే క్యూట్గా ఉండిపోవాలని, మనమూ కాస్త సరదాగా, ఇంకాస్త ఇష్టంగా కోరుకుందాం!! -
నలుపు.. తెలుపు.. నేను
మెఘన్ 2011లో టెలివిజన్ సిరీస్ నిర్మాత ట్రెవర్ ఇంజెల్సన్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే విడాకులతో ఆ ఇద్దరూ ఆ బంధం నుంచి బయటకు వచ్చారు. 1992 అనుకుంటా... ఎలిమెంటరీ స్కూల్ అమ్మాయి. పదకొండేళ్లుంటాయి. స్కూల్ ఇంటర్వెల్ బ్రేక్లో టీవీ చూస్తోంది. కమర్షియల్ వస్తోంది ఆ టైమ్కి. రకరకాల వర్గాల్లోని ఆడవాళ్లు అంట్లుతోమడానికి గిన్నెలతో కుస్తీ పడుతున్నారు. అదే ట్యాగ్లైన్ ఆ యాడ్ కింద.. ‘‘అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డోడుతున్న పాత్రలతో ఫైటింగ్ చేస్తున్నారు’’ అని! ఆ యాడే చూస్తున్న ఆమె క్లాస్మేట్స్ అబ్బాయిలిద్దరూ ‘‘ఆడవాళ్లు అంట్లతో కాక దేనితో కుస్తీ పడ్తారు?’’ అంటూ నవ్వారు హేళనగా. అమ్మాయి షాక్ అయింది. కోపమొచ్చింది. బాధా కలిగింది. అంట్లు తోమడం ఆడవాళ్ల పనేనా? ప్రశ్న ఆ చిన్న మెదడులో. మధ్యాహ్నం ఇంటికెళ్లే సరికి అది రొదలా మారింది. ఇంట్లో... నాన్నతో చెప్పింది పొద్దున తను చూసిన టీవీ కమర్షియల్.. క్లాస్మేట్స్ పాస్ చేసిన కామెంట్స్ గురించి. అంట్లు ఆడవాళ్లు మాత్రమే ఎందుకు తోమాలి? ఆ కమర్షియల్ను ఎందుకలా తీశారు? అన్నం అందరం తింటున్నప్పుడు అంట్లు తోమే బాధ్యతను కూడా అందరూ షేర్ చేసుకోవాలి కదా.. అది కేవలం ఆడవాళ్ల పనే అన్నట్లుగా ఎందుకు చూపిస్తున్నారు? అలా ప్రమోట్ చేయబట్టే కదా నా క్లాస్మేట్స్ ఆడవాళ్లను అంత తేలికగా చూశారు? ఎందుకు నాన్నా ఇలా? దీన్ని మార్చాలి.. ఏదైనా చేయాలి?’’ అంది చిన్న పిడికిలిని అంతే చిన్న అరచేతిలో నూరుతూ! తన బుజ్జి కూతురి గొప్ప ఆలోచనకు, ఆరాటానికి ముచ్చటపడ్డాడు. గర్వపడ్డాడు తండ్రి. ‘‘ఏదైనా చెయ్ మరి! పెద్దవాళ్లకు ఉత్తరం రాయు’’అని సలహా ఇచ్చాడు. ‘‘ రాస్తాను డాడ్’’ అంటూ తండ్రి మెడను రెండుచేతులతో చుట్టేసింది. ఆ క్షణం నుంచే పెద్దవాళ్లు ఎవరా అని ఆలోచించసాగింది అమ్మాయి. ఆ సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ బిల్క్లింటన్. వెంటనే ఆ పిల్లకు ఫస్ట్లేడీ హిల్లరీ క్లింటన్ గుర్తొచ్చింది. అప్పుడు కిడ్స్ న్యూస్ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్న లిండా ఎల్లర్బీ, పవర్హౌజ్ అటార్ని గ్లోరియా ఆల్రెడ్లూ మనసులో మెదిలారు. ఆ ముగ్గురితోపాటు ఆ కమర్షియల్లో కనిపించిన అంట్లుతోమే లిక్విడ్ తయారు చేసే కంపెనీకీ రాసింది. నెల తర్వాత.. మళ్లీ ఆ కమర్షియల్ ప్రసారం అయింది. అయితే ఈసారి.. ‘‘అమెరికా ప్రజలంతా జిడ్డు, జిగురోడుతున్న అంట్లగిన్నెలతో కుస్తీపడుతున్నారు’’ అనే ట్యాగ్లైన్తో! పదకొండేళ్ల అమ్మాయి మొహంలో నవ్వు! విజయంతో కూడిన నవ్వు! కిడ్స్ న్యూస్ ప్రోగ్రామ్ చానల్ యాంకర్ ఆ చిన్నారి ఇంటి తలుపు తట్టింది చేతిలో మైక్, కెమెరా క్య్రూతో. ఆ పిల్ల ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం! ఆ అమ్మాయి.. హిల్లరీ, లిండా, గ్లోరియా, అంట్లుతోమే లిక్విడ్ సోప్ తయారుదారు ప్రాక్టర్ అండ్ గ్రాంబుల్కి.. థాంక్స్ చెప్పుకుంది! సమానత్వం అంటే ఓ మాట కాదు. స్త్రీ,పురుషులు ఇద్దరూ కలిసి సాధించే చేత! ఇది చర్చలకే పరిమితం కాకూడదు. కార్యాచరణకు రావాలి. ఓ పదకొండేళ్ల అమ్మాయి చేయగలిగింది ప్రపంచంలోని ఇంతమంది ప్రజలు చేయలేరా? ఈ భూమ్మీద స్త్రీ, పురుషులిద్దరూ సమానమనే ఆలోచనాధోరణిని అలవర్చుకోలేరా? సమానత్వం మీద మాటలు ఆపి యాక్షన్లోకి దిగుదాం అని ప్రపంచాన్ని కోరుతోంది నాటి పదకొండేళ్ల పిల్ల.. నేటి 36 ఏళ్ల యువతిగా! ఆమె... టెలివిజన్ నటి.. బ్రిటిష్ యువరాజు హ్యారీకి కాబోయే సతీమణి.. మెఘన్ మార్కల్! మెఘన్ బయోగ్రఫీ.. మెఘన్ మార్కల్ పుట్టిపెరిగింది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, లాస్ఏంజెల్స్లో. తల్లి డోరియా.. ఆఫ్రికన్ అమెరికన్. క్లినికల్ థెరపిస్ట్, యోగా ఇన్స్ట్రక్టర్. తండ్రి టామ్..తెల్లజాతీయుడు. సినిమాటోగ్రాఫర్. టామ్ ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్లో ఉన్నప్పుడు డోరియాను చూసి ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరి ప్రతిరూపంగా ఉంటుంది మెఘన్. తన పదకొండేళ్ల వయసులోనే జెండర్ ఇన్ ఈక్వాలిటీ మీద స్పందించి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ కమర్షియల్ యాడ్ను, ట్యాగ్లైన్నూ మార్చేసి అమెరికా దృష్టిని ఆకర్షించింది. అలా బాల్యంనుంచే పోరాటస్ఫూర్తితో ఉన్న మెఘన్ నార్త్వెస్ట్రన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్లో థియేటర్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గ్రాడ్యూయేషన్ చేసింది. టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. జనరల్ హాస్పిటల్ అనే షోలో గెస్ట్రోల్తో బుల్లితెరంగేట్రం చేసింది. కట్స్, ది వార్ ఎట్ హోమ్, ఎన్వై అండ్ 90210 వంటి సిరీస్లో నటించింది. సూట్స్ అనే సిరీస్లో రాచెల్ జేన్తో ప్రపచమంతా సుపరిచితమైంది. గెట్ హిమ్ టు ద గ్రీక్, హారిబుల్ బాసెస్, యాంటీ సోషల్ వంటి సినిమాల్లోనూ నటించింది. బ్లాక్ అండ్ వైట్.. తల్లి బ్లాక్, తండ్రి వైట్ కావడం, సంప్రదాయవాదులున్న చోట బాల్యం గడవడం వల్ల ఆ వివక్షను చాలానే ఎదుర్కొంది మెఘన్. అది నటనా రంగంలోకి అడుగుపెట్టాక కూడా వెంటాడింది. అయితే ఎక్కడా తన ఐడెంటీటీ కల్పోలేదు. దీనికి కారణం చిన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన ధైర్యమే అంటుంది ఆమె. సెవెంత్గ్రేడ్లో ఉన్నప్పుడు ఒకసారి.. ఇంగ్లిష్ క్లాస్లో తప్పక జవాబు చెప్పాల్సిన సెషన్ జరుగుతోంది. టీచర్ ఓ కాగితం ఇచ్చింది. విద్యార్థుల వివరాలను ఆ కాగితంలోని కాలమ్స్ను అనుసరించి నింపాలి. అందులో నలుపు, తెలుపు, లాటిన్ అమెరికన్, ఏషియన్ అని విద్యార్థుల గుర్తింపును సూచించే గడి కూడా ఉంది. ఆ నాలిగింట్లో పిల్లలు తాము ఏ ఉనికికి చెందిన వారైతే ఆ గడి దగ్గర టిక్ పెట్టాలి. మెఘన్ అన్నీ వివరాలు నింపి ఆ కాలమ్ దగ్గర ఆగిపోయింది. తల్లిలాంటి ఉంగరాల జుత్తు, తండ్రిలాంటి పాలిపోయిన తెలుపు ఒంటి రంగుతో ఉన్న తను ఆ మిశ్రమాన్ని ఏ గడిలో పెట్టాలో తెలియక ఏమీరాయకుండా లాగే ఉండిపోయింది. మెఘన్ అవస్థ గమనించిన టీచర్.. తెల్లగా ఉన్నావు కాబట్టి వైట్ దగ్గర టిక్ పెట్టు అని సలహా ఇచ్చింది. మరి అమ్మ పోలికలూ ఉన్నాయి కదా! వైట్ను తన ఉనికిగా చెప్పుకోవడానికి ఆ పిల్ల మనసు అంగీకరించలేదు. దాంతో ఆ కాలమ్ను ఖాళీగా వదిలేసింది. దిగులు మొహంతో ఇంటికెళ్లింది. తండ్రి అడిగాడు ఏమైంది అని. చెప్పింది. ఈసారి అలాంటి సంకటం వస్తే.. సందేహపడకుండా.. నీ సొంత ఐడెంటీనే చెప్పు అన్నాడు దగ్గరకు తీసుకొని. ఆ మాటంటున్నప్పుడు తన కూతురి చిన్నమెదడు ఎంత అయోమయాన్ని అనుభవించిందో అర్థం చేసుకున్నాడు. అది సృష్టించిన వ్యవస్థ పట్ల కోపం అతని మొహాన్ని ఎర్రబర్చడం ఆ బిడ్డ దృష్టిలో పడకపోలేదు. సొంత ఐడెంటిటీ గురించి తండ్రి చెప్పిన మాట ఆ రోజు నుంచి మైండ్లో అచ్చేసుకుంది. జ్ఞానాన్ని మించిన శక్తి లేదు.. సాధికారతను మించిన ఐడెంటిటీ లేదని తెలుసుకుంది. తర్వాత సాధికారతనే తన గుర్తింపుగా మార్చుకుంది మెఘన్.అందుకే ‘నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే వివరం చెప్పాల్సి వస్తే... స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ మిక్స్డ్ రేస్ ఉమన్’’ అని గర్వంగా చెప్తాను అంటుంది. నటన నుంచి రచన దాకా.. మెఘన్.. తన తల్లిలా యోగానిపుణరాలు. మంచి కుక్. ఎల్లే యూకే మ్యాగజైన్కు వ్యాసాలూ రాస్తుంది. తన లైఫ్స్టయిల్ బ్రాండ్ అయిన ‘ది టిగ్’కు ఎడిటర్ ఇన్ చీఫ్గా వ్యవహరించింది. సంఘసేవిక. యూఎన్ విమెన్స్ అడ్వకేట్. వరల్డ్ విజన్ కెనడాకు గ్లోబల్ అంబాసిడర్. కాలీగ్రాఫర్ కూడా. నటనలోకి వచ్చేముందు కాలిగ్రఫే ఆమెకు ఆదాయమార్గం. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ రాసేది. జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి యూఎన్ఓతో కలిసి జెండర్ ఈక్వాలిటీ మీద ఎంతో కృషి చేసింది. పని పట్ల ఆమెకున్న అంకితభావానికి, నిబద్ధతకు అదే ప్రతీక. 2015, ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు మెఘన్ ప్రసంగం ప్రేక్షకులతో సహా యూఎన్ సెక్రటరీ జెనరల్ బాన్ కీ మూన్నూ అమితంగా ఆకట్టుకుంది. ఆయనతో సహా ఆ సభంతా ఇచ్చిన స్టాడింగ్ ఒవేషనే అందుకు నిదర్శనం. ప్రిన్స్ హ్యారీతో.. కెనడాలోని టొరంటోలో.. ఇన్విక్టస్ గేమ్స్ జరుగుతున్నాయి. హాజరుకావడానికి వచ్చాడు ప్రిన్స్ హ్యారీ. మెఘన్ నటించిన ‘సూట్స్’ షూటింగ్ అయిందీ అక్కడే. అలా ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. డేటింగ్ స్టార్ట్ అయింది. ప్రేమ ఫిక్స్ అయింది. వీరి రొమాన్స్ ఆన్లైన్లో షికారూ చేసింది. 2017, నవంబర్ తొలినాళ్లలో తమ నిశ్చితార్థం జరిగిపోయినట్లు’ నవంబర్ నెల ఆఖరున ప్రకటించారు ప్రిన్స్ హ్యారీ, మెఘన్ మార్కల్. ఆ తర్వాత కొన్ని వారాలకు.. ‘‘2018, మే 19న ప్రిన్స్ హ్యారీకి, మెఘన్ మార్కల్కు వివాహం జరగనున్నట్టు కెన్సింగ్టన్ ప్యాలేస్ అనౌన్స్ చేసింది. విండ్సర్ కేసిల్లోని సెయింట్ జార్జెస్ చాపెల్ ఈ పెళ్లికి వేదికకానుంది. ‘‘రెఫ్యూజీ క్యాంప్స్ నుంచి రెడ్ కార్పెట్కి షిఫ్ట్ అయింది నా జీవితం. ఈ రెండు దశలనూ గౌరవిస్తాను. ఎందుకంటే ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. ఈ రెండూ నాకు ముఖ్యమే. నిజానికి అవసరం కూడా!’’ అంటుంది స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ మిక్స్డ్ రేస్ ఉమన్ మెఘన్ మార్కల్. – శరాది మేఘన్ మార్కల్ -
ట్రంప్ను పిలువకుంటే.. ‘టైమ్బాంబ్’ పేలినట్టే!
త్వరలో జరగనున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ల రాచరిక వివాహం బ్రిటన్, అమెరికా మధ్య దౌత్య వివాదానికి తెరతీసేలా కనిపిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఈ వేడుకకు ఆహ్వానించి.. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను పిలువకపోతే.. ‘డిప్లమాటిక్ టైమ్బాంబ్’ బద్దలయ్యే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత బ్రిటన్-అమెరికా దౌత్యబంధం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు ఎదురుకాకుండా రాచకుటుంబం రంగంలోకి దిగింది. హ్యారీ పెళ్లి సందర్భంగా వివాదం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పెళ్లిపీటలు ఎక్కబోతున్న ప్రిన్స్ హ్యారీ బరాక్ ఒబామాను స్నేహితుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆయనను పెళ్లికి అతిథిగా ఆహ్వానించే అవకాశముందని కథనాలు వచ్చాయి. అదే సమయంలో ఈ వివాహం బ్రిటన్ అధికారిక వేడుక కాకపోవడంతో ట్రంప్ను పిలిచే అవకాశం లేదని సన్నిహితులు తెలిపారు. అయితే, ఒబామాను పిలిచి తనను పిలువకపోవడం ట్రంప్ అవమానంగా భావించే అవకాశముందని, తనకు ఆహ్వానం అందని నేపథ్యంలో ఆయన తాజా బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్రిటన్లో పర్యటించాలని గతంలో ట్రంప్ భావించారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో హ్యారీ పెళ్లి జరుగుతుండటం, తనకు ఆహ్వానం అందకపోవడం ట్రంప్ తలవంపులుగా భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒబామాను ఈ పెళ్లికి ఆహ్వానిస్తే.. దౌత్యవివాదం మరింత తీవ్రమయ్యే అవకాశముందని, అందుకే ఒబామాను కూడా పిలువకూడదని నిర్ణయించినట్టు బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
రాయల్ పెళ్లికి మేఘన్ రెడీ!
మే 19, 2018. ప్రపంచాన్ని ఆకర్షించే ఓ వేడుక జరగబోతోంది. అది ఏ అవార్డు వేడుకో, ఫుట్బాల్ వరల్డ్కప్పో, మరింకోటో కాదు. పెళ్లి. అంత స్పెషల్ ఎందుకంటే.. అది బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ పెళ్లి మరి! అంగరంగ వైభవంగా రాయల్ ఫ్యామిలీ రేంజ్కి తగ్గట్టుగా జరుగుతుంది ఈ పెళ్లి. హ్యారీ.. మేఘన్ మార్కెల్ను కాకుండా ఇంకెవరినో చేసుకుంటే ఈ పేపర్లోకి ఎక్కేవాడు కాదేమో.! మేఘన్ను చేసుకుంటున్నాడు కాబట్టి వచ్చేశాడు. మేఘన్ హాలీవుడ్లో పాపులర్ స్టార్ కావడంతో ఇటు సినీ పరిశ్రమ, అటు రాజకీయ వర్గాలు ఈ పెళ్లికోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పట్నుంచే మొదలైపోయాయి. ముఖ్యంగా రాయల్ ఫ్యామిలీకి కాబోయే కోడలు వేసుకునే వెడ్డింగ్ డ్రెస్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కొన్ని నెలల పాటు శ్రమించి ఈ డ్రెస్ను డిజైన్ చేస్తారు డిజైనర్స్. డ్రెస్ అణువణువూ రాయల్ కళ ఉట్టిపడేలా చూసుకుంటారు. మేఘన్ కూడా ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటోంది. ఇప్పటికే ఓ డిజైనర్ను కూడా రిక్రూట్ చేసుకుంది. ఇంకెవరో ఎందుకు అని చెప్పి, తన ఫ్రెండ్ జెస్సికా మల్రోనిని డిజైనర్గా ఎంపిక చేసుకుంది మేఘన్. మేఘన్ కోసం టొరంటో నుంచి లండన్కు వెళ్లిపోయి జెస్సికా ఇప్పటికే డ్రెస్ డిజైన్ పనులు మొదలుపెట్టేసిందట. పెళ్లి తర్వాత మేఘన్ సినిమాలకు దూరం కావాలనుకోవడంతో ఆమె అభిమానులు ఈ పెళ్లినే ఓ సినిమాగా చూసుకుంటున్నారు. ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు!! -
అసలు విషయం అప్పుడు చెప్పింది!!
హాలీవుడ్ స్టార్ మేఘన్ మార్కల్ ఇంకో ఐదు నెలల్లో ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకొని బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ మెంబర్ కానుంది. నవంబర్ 27న హ్యారీ ఉంగరం తొడిగి ప్రపోజ్ చేశాక మేఘన్ నటనకు దూరమైపోయింది. అప్పటికే బాగా పాపులర్ అయిన ‘సూట్స్’ టీవీ సిరీస్ నుంచి బయటకొచ్చేసింది. ఇకపై సినిమాలు చేయనని మాట కూడా ఇచ్చేసింది. అలాగే అదేమీ కష్టంగా తీసుకుంటున్న నిర్ణయం కాదని, సినిమాలకు దూరమవ్వడం ఒక కొత్త జీవితం మొదలుపెట్టడానికే అని చెప్పుకొచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, హ్యారీతో మేఘన్ ప్రేమలో ఉన్న విషయం తెలియని రోజుల్లో జేమ్స్బాండ్ 25వ సినిమాకు ఆమెను హీరోయిన్గా అనుకున్నారట. అనుకోవడమేంటీ? ఆమెనే బాండ్ భామ అని ఫిక్స్ చేసుకొని, అడిగేసారట! సరిగ్గా అప్పుడు చెప్పింది మేఘన్.. అసలు విషయం. ఇంకేముంది.. ‘బాండ్ 25’ టీమ్ వేరొకర్ని ఎంపిక చేసే పనిలో పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని మూవీ సిరీస్లో ఒకటైన జేమ్స్బాండ్ సిరీస్లో వస్తోన్న 25వ సినిమా కావడంతో ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ అవ్వని బాండ్ 25పై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. డేనియల్ క్రెయిగ్ జేమ్స్బాండ్గా నటిస్తోన్న ఈ సినిమా 2019 నవంబర్లో విడుదలవుతుంది. -
ఇవాంక ట్రంప్పై నెటిజన్లు ఫైర్
హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష తనయ, సలహాదారు ఇవాంక ట్రంప్పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇందుకు కారణం త్వరలో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీలకు ఆమె శుభాకాంక్షలు తెలపడమే. వచ్చే ఏడాది మే నెల 19వ తేదీన మార్కెల్, హ్యరీల వివాహా వేడుక సెయింట్ జార్జి చాపెల్ చర్చిలో పెళ్లి చేసుకోనున్నారు. గత నెలలో ఇరువురికి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం ఇవాంక ట్విట్టర్ వేదికగా దంపతులు కానున్న జంటకు శుభాకాంక్షలు చెప్పడంపై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పెళ్లి పిలుపు కోసమే ఇవాంక శుభాకాంక్షలు చెప్పారంటూ పలువురు రీట్వీట్లు చేశారు. రాయల్ ఫ్యామిలీ.. ట్రంప్ క్రైమ్ ఫ్యామిలీని ఆహ్వానించబోదు అని వ్యాఖ్యానించారు. 1:2 Wishing Meghan and Prince Harry a lifetime of love, laughter and happiness together. https://t.co/fgjJhCfYnr https://t.co/8YP3Nzef5I — Ivanka Trump (@IvankaTrump) 15 December 2017 2:2 I have no doubt that this couple will do extraordinary things, both individually and collectively. Congratulations! — Ivanka Trump (@IvankaTrump) 15 December 2017 -
మే 19న పెళ్లి చేసుకోనున్న హ్యారీ, మేఘన్
-
రాచరిక వైభవం: పెళ్లి ముహూర్తం ఇదే!
ఇప్పుడు హైప్రొఫైల్ పెళ్లిల సీజన్ కొనసాగుతున్నట్టుంది. నిన్నటికి నిన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మల పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా.. తాజాగా ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మర్కెల్ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మే 19న వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. విండ్సర్ క్యాస్టల్లోని సెయింట్ జార్జ్స్ చాపెల్లో వీరి వివాహం రాచరిక వైభవంతో జరగనుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిపించామని హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ ఇప్పటికే వెల్లడించారు. మేఘన్ మార్కెల్ (36), ప్రిన్స్ హ్యారీ(33)లు కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. బ్రిటన్ యువరాజు హ్యారీతో ప్రేమ వ్యవహారం నటి మేఘన్కు భలే పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎంతగా అంటే.. ఏకంగా మోస్ట్ సెర్చ్డ్ నటిగా 2016 ఏడాదికి గానూ మేఘన్ తన పేరు లిఖించుకుంది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్ తో డేటింగ్ చేస్తున్నట్లు హ్యారీ బహిరంగంగానే తెలిపాడు. 'మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ' తమ ప్రేమ విషయాన్ని నటి మేఘన్ కూడా ఇటీవల పెదవి విప్పింది. గతేడాది జూలై నెలలో 'సూట్స్' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అప్పటినుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో సాన్నిహిత్యం పెరిగిపోయింది. నిర్మాత ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో యువరాజు హ్యారీతో పరిచయం పరిణయానికి దారితీసింది. His Royal Highness Prince Henry of Wales and Ms. Meghan Markle will marry on 19th May 2018. Today's announcement follows earlier confirmation of the month of the wedding and its location at St George's Chapel, Windsor Castle. pic.twitter.com/7pgdRM90Na — Kensington Palace (@KensingtonRoyal) 15 December 2017 -
హాలీవుడ్ నటితో యువరాజు వివాహం..
లండన్: అందరూ అనుకున్నదే జరిగింది. హాలీవుడ్ నటి, యువరాజుల ప్రేమ త్వరలో ఫలించనుంది. బ్రిటన్ యువరాజు హ్యారీ వివాహం వచ్చే ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రిన్స్ హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల నటి మేఘన్ మార్కెల్, తన కుమారుడు హ్యారీల నిశ్చితార్థం జరిపించామని చార్లెస్ పేర్కొన్నారు. నటి మార్కెల్ తల్లిదండ్రుల అంగీకారం తెలపడంతో పాటు హ్యారీని ఆశీర్వదించారని వివరించారు. మేఘన్ మార్కెల్ (36), ప్రిన్స్ హ్యారీ(33)లు కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. బ్రిటన్ యువరాజు హ్యారీతో ప్రేమ వ్యవహారం నటి మేఘన్కు భలే పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎంతగా అంటే.. ఏకంగా మోస్ట్ సెర్చ్డ్ నటిగా 2016 ఏడాదికి గానూ మేఘన్ తన పేరు లిఖించుకుంది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్ తో డేటింగ్ చేస్తున్నట్లు హ్యారీ బహిరంగంగానే తెలిపాడు. 'మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ' తమ ప్రేమ విషయాన్ని నటి మేఘన్ కూడా ఇటీవల పెదవి విప్పింది. గతేడాది జూలై నెలలో 'సూట్స్' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అక్కడి నుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. నిర్మాణ ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో యువరాజు హ్యారీతో తన పరిచయాన్ని ప్రేమగా మలుచుకుని పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధంగా ఇటీవల ప్రచారమైన వదంతులు 2018లో వీరి వివాహంతో నిజం కానున్నాయి. -
యువరాజు పబ్లిక్గా ముద్దు పెట్టేశాడు
లండన్ : తెలిసిన విషయమే అయినా ఇప్పటి వరకు కొద్దోగొప్పో ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. ప్రముఖ మోడల్ మేఘన్ మార్క్లే, ప్రిన్స్ హ్యారీల ప్రేమ మరోసారి అందరికీ తెలిసిపోయింది. ఓ గేమ్ను చూస్తూ ప్రిన్స్ హ్యారీ మార్క్లేకు పబ్లిక్గా ముద్దుపెట్టేశారు. అందరూ చూస్తుండగానే ఆమెతో మరింత చనువుగా ఉంటూ ఒకరి చేతులు ఒకరిపై మెలేసుకుంటూ తమ ప్రేమను ఖరారు చేశారు. ఈ దృశ్యం ఇన్విక్టస్ క్రీడల ముగింపు సందర్భంగా చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు వార్తలు, గాసిప్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. మార్క్లే, ఆమె తల్లితో కలిసి హ్యారీ గేమ్స్ ముగింపు వేడుకలు చూసేందుకు వచ్చారు. తొలుత ఓ ప్రైవేట్ రూమ్లో కూర్చుని వీక్షించిన వారు చనువుగా కనిపించారు. గేమ్స్ పూర్తయి వెళ్లే క్రమంలో మార్క్లే తల్లి ముందు నడుస్తుండగానే వెనుకాలే ఉన్న హ్యారీ టక్కున మార్క్లేను దగ్గరకు లాగేసుకొని అందరూ చూస్తుండగా ముద్దు పెట్టేశాడు. అతడి ప్రేమను కూడా మరింత బలంగా అంగీకరించినట్లుగా మార్క్లే తెగ నవ్వుతూ మురిసిపోయింది. -
యువరాజుతో డేటింగ్లో ఉన్నా: నటి
లండన్: బ్రిటన్ యువరాజుతో ప్రేమలో పడిపోయిందన్న ప్రచారం నటి మేఘన్ మార్కెల్కు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎంతగా అంటే.. ఏకంగా మోస్ట్ సెర్చ్డ్ నటిగా 2016 ఏడాదికి గానూ మేఘన్ తన పేరు లిఖించుకుంది. బ్రిటన్ యువరాజు హ్యారీతో ఆమె ప్రేమ వ్యవహారంతో ఒక్కసారిగా పాపులర్ సెలబ్రిటీగా మారిపోయింది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన నటి మేఘన్ తో ప్రిన్స్ డేటింగ్ చేస్తున్నట్లు ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. అయితే తొలిసారిగా నటి మేఘన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను యువరాజు హ్యారీని ప్రేమిస్తున్నట్లు తొలిసారిగా చెప్పారు. ప్రస్తుతం మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ తమ ప్రేమ విషయాన్ని షేర్ చేసుకున్నారు. గతేడాది జూలై నెలలో 'సూట్స్' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అక్కడి నుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయిందని వదంతులు వ్యాపించాయి. అయితే ప్రిన్స్ హ్యారీగానీ, నటిగానీ ఈ విషయంపై స్పందించలేదు. 'మేం అందరిలాగే ప్రేమలో ఉన్నటువంటి ఇద్దరు సాధారణ వ్యక్తులం. గత ఆరు నెలలుగా గాఢమైన ప్రేమలో ఉన్నాం. ఇతరులతో రిలేషన్ షిప్ ద్వారా నన్ను నేను పలానా వ్యక్తిని అంటూ చెప్పుకోవడం ఇష్టముండదంటూ' నటి మేఘన్ మార్కెల్ వివరించారు. ప్రొడ్యూసర్ ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఆమె గత కొంతకాలం నుంచి హ్యారితో అనుబంధం కొనసాగిస్తున్నారు. మరోవైపు హ్యారీ, మార్కెల్ త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్నారని ప్రచారం జరుగుతోంది. -
గూగుల్ సెర్చ్లో టాప్ నటి ఎవరో తెలుసా?
వాషింగ్టన్: గడిచిన 2016 ఏడాదికిగారూ గూగుల్ లో అత్యధిక మంది సెర్చ్ చేసిన నటి అమెరికన్ టీవీ స్టార్ మేఘన్ మార్కెల్. ఈ విషయాన్ని గూగుల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. సూట్స్ టీవీ డ్రామాతో మేఘన్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దాంతోపాటుగా అమెరికన్ నెట్వర్స్ షోలో విజేతగా నిలిచింది. అంతమాత్రాన ఆమె మోస్ట్ సెర్చ్డ్ నటి కాలేదండోయ్.. బ్రిటన్ యువరాజు హ్యారీతో ఆమె ప్రేమ వ్యవహారంతో ఒక్కసారిగా పాపులర్ సెలబ్రిటీగా మారిపోయింది. తనకంటే వయసులో మూడేళ్లు పెద్దదైన టీవీ నటి మేఘన్ మార్కెల్తో ప్రిన్స్ డేటింగ్ చేస్తున్నట్లు గతేడాది చాలా కథనాలు వచ్చాయి. దీంతో ఆమె పేరు మార్మోగిపోయింది. ప్రిన్స్ హ్యారిస్తో ప్రేమలో పడిపోయిందన్న వార్తలు గుప్పమన్న తర్వాత ఆమెకు ఎక్కడలేని క్రేజ్ వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏకంగా మోస్ట్ సెర్చ్డ్ నటిగా 2016 ఏడాదికి గానూ తన పేరు లిఖించుకుంది. యువరాజుతో రిలేషన్ లో ఆమె ఎవరు అని తెలుకునేందుకు 'హూ ఈజ్ మెఘన్ మార్కెల్' అని, మరికొన్ని కీ వర్డ్స్ తో నెటిజన్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టీవీ నటి కోసం వెతికారు. గతేడాది మే నెలలో 'సూట్స్' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అక్కడి నుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. ప్రొడ్యూసర్ ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఆపై హ్యారితో అనుబంధం కారణంగానే ఆమె మోస్ట్ సెర్చ్డ్ నటిగా నిలిచిందని వదంతులు ప్రచారం అవుతున్నాయి. -
ఆ నటితో డేటింగ్ చేస్తున్న ప్రిన్స్!
లండన్: బ్రిటన్ యువరాజు హ్యారీ ప్రేమలో మునిగితేలుతున్నాడు. తన కన్నా మూడేళ్లు పెద్దదైన అమెరికన్ టీవీ నటి మేఘన్ మార్కెల్తో ఆయన డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘సూట్స్’ టీవీ డ్రామాతో పాపులర్ అయిన మేఘన్తో సానిహిత్యంతో పెరిగాక ప్రిన్స్ హ్యారీ చాలా ఆనందంగా ఉంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ’ద సన్డే ఎక్స్ప్రెస్’ పత్రిక తెలిపింది. 35 ఏళ్ల మేఘన్ అందం చూసి హ్యారీ ఫిదా అయ్యాడని, అయితే, వారిద్దరూ తమ రిలేషన్షిప్ను నెమ్మదిగా ముందుకుతీసుకెళుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ’కొన్నివారాలుగా వారు సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరినొకరు చూడటాన్ని ఇష్టపడుతున్నారు. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది’ అని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, ’తమ మధ్య కొనసాగుతున్న బంధాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాలని హ్యారీ ప్రయత్నిస్తున్నాడు. తమ రొమాన్స్ గురించి బయటకు తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో హ్యారీకి తెలుసు. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టడం కూడా కష్టమని ఆయన భావిస్తున్నారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ’సూట్స్’ షూటింగ్ సందర్భంగా టొరంటోలో తొలిసారి హ్యారీ (32), మేఘన్ మధ్య చూపులు కలిశాయట. ఆ తర్వాత తరచూ కలుసుకున్న ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడిందని, అయితే ఇది దీర్ఘకాలం కొనసాగుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేమని ఆ వర్గాలు అంటున్నాయి.