pervez musharraf
-
లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్ తప్పే: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ భారత్తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్ డిక్లరేషన్’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి లాహోర్కు వచ్చారు. ఆయన మాతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్ పాక్ ఆర్మీకి ఫోర్ స్టార్ జనరల్గా ఉన్నారు. లడ్డాక్లోని కార్గీల్లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉన్నానని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. పాకిస్తాన్ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆనాడు పాక్.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్ డాలర్లను ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఉండి ఉంటే క్లింటన్ ఆఫర్కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్పై విమర్శలు గుప్పించారు.లాహోర్ డిక్లరేషన్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్లోని కార్గిల్లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్ షరీష్ మరోసారి పీఎంఎల్-ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
ఈ అధ్యక్షుడు ఓ వైరుద్ధ్యాల పుట్ట
ఇటీవల మరణించిన పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్లోని వైరుద్ధ్యాలను తేల్చడానికి చరిత్రకారులు గింజుకోవచ్చు. రెండుసార్లు పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఈ సైనిక నియంత అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను అనుమతించారు. మితవాద ముస్లిం అయిన ముషారఫ్, లష్కర్–ఎ–తోయిబాకు అతిపెద్ద మద్దతుదారునని చెప్పేవారు. కార్గిల్ యుద్ధ నిర్మాత అయిన సైనిక అధినేతగా ఉంటూనే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం విషయంలో పాక్ చరిత్రలో ఎన్నడూ లేనంత చేరువకు రాగలిగారు. ఇవి నిజంగానే చికాకు పెట్టే వైరుధ్యాలే మరి. జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఒక వైరుద్ధ్యాల పుట్ట. ఈ వైరుధ్యాల్లో కొన్ని సంతోషకర మైనవి. కొన్ని ఇబ్బందికరమైనవి. కానీ ఆయన మాత్రం వాటికి మించిన వ్యక్తిత్వంతో ఉండేవారు. ఆయన దుస్తులు ఎంత నీటుగా ఉండేవంటే అందరినీ అవి ఆకర్షించేవి. అలాగే ఆయన పదాలతో ఆడుకునేవారు. 2002 అధ్యక్ష ‘ఎన్నికల్లో’ ఆయన 98 శాతం ఆధిక్యత సాధించినప్పుడు ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రిక అభి నందించింది. దానికి ఆయన చెప్పిన సమాధానం ఆ పత్రిక రిపోర్టర్ను నివ్వెరపర్చింది. ‘‘మీరు వ్యంగ్యంగా చెప్పినట్లయితే, నేను మాట్లాడేది ఏమీ ఉండదు. మీరు నిజాయితీగా ఉన్నట్లయితే, మీకు థాంక్స్ చెబుతాను.’’ పాకిస్తాన్ ఆర్మీ జనరల్గా, ఆ తర్వాత పాక్ అధ్యక్షుడిగా వ్యవహ రించిన ముషారఫ్ లోని వైరుధ్యాలను తేల్చిచెప్పడానికి చరిత్రకారులు గింజుకోవచ్చు. రెండుసార్లు పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఈ సైనిక నియంత అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను అనుమతించారు. అలాగే ఇబ్బందికరమైన ఇంటర్వ్యూలను కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉండేవారు. ఒక గ్లాసెడు విస్కీతో ఖుషీ చేసుకుంటారని పేరొందిన ఈ మితవాద ముస్లిం తాను మిలిటెంట్ సంస్థ అయిన ‘లష్కర్–ఎ–తోయిబా’కు అతిపెద్ద మద్దతుదారును అని చెప్పేవారు. కార్గిల్ యుద్ధ నిర్మాత అయిన సైనిక అధిపతిగా ఉంటూనే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం కోసం పాక్ చరిత్రలో ఎన్నడూ లేనంత సామీప్యతకు ఆయన చేరుకున్నారు. ఈ దురాక్రమణదారు చేసిన రక్తపాత రహిత తిరుగుబాటును జనం ఆమోదించి స్వాగతించారు. కానీ అదే జనం దృష్టిలో హేయమైన అధ్య క్షుడిగా మారిపోయి, అభిశంసనను తప్పించడానికి ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించాల్సి వచ్చింది. ఇవి నిజంగానే చికాకు పెట్టే వైరుధ్యాలే మరి. మరో రెండు ఆహ్లాదకరమైన విషయాలను పంచుకోనివ్వండి. నేను జనరల్ ముషారఫ్ను 2000 సంవత్సరం ఫిబ్రవరిలో మొదటిసారి కలిశాను. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయిన కొంతకాలం తర్వాత మా సమావేశం జరిగింది. అది ఒక భార తీయ జర్నలిస్టుకు ఆయన ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ. పైగా దాన్ని దూర దర్శన్లో ప్రసారం చేస్తారు కనుక నేను ప్రత్యేకించి దూకుడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను పాకిస్తాన్ జనరల్ను నియంత అని పిలిచాను. తన నిజాయితీ, విశ్వసనీయత పూర్తిగా అనుమానించదగినవని ఆయనతో చెప్పాను. ఆయన మామూలుగా నవ్వేశారు. అయితే ఆయన ఏ మాత్రం కలవరపడే వ్యక్తి కాదని గుర్తించడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. వాణిజ్య ప్రకటనలకు విరామం ఏర్పడిన సమ యంలో, మా బంధం కొనసాగడానికి వీలుగా ఆయనతో చిన్న సంభాషణ చేయాల్సిన అవసరముందని భావించాను. దానికోసం ఆయన ధరించిన ‘టై’ గురించి ప్రశంసించాను. తర్వాత ఇంటర్వ్యూ తిరిగి ప్రారంభమైంది. అర్ధగంట తర్వాత ఇంటర్వ్యూ ముగిశాక, ఆ ఇంటర్వ్యూకు సహకరించిన సిబ్బందికి జనరల్ టీ, స్నాక్స్ ఆతిథ్యం ఇచ్చారు. కెమెరామన్కు ఆయన సిగరెట్ ఆఫర్ చేశారు. సౌండ్ రికార్డిస్టు భుజంపై తన చేయి వేశారు. అలాగే ఎలక్ట్రీషియన్ జోక్కు ఫకాలున నవ్వారు. నిమిషాల్లోనే ఆయన వాతావరణాన్ని స్నేహపూర్వకంగా మార్చేశారు. ఆ కాసేపట్లోనే నాతోటి సహచరులు ఆయన పట్ల ఆత్మీయతను పెంచుకుంటున్నట్లు గ్రహించాను. మేము వీడ్కోలు చెబుతుండగా, జనరల్ ముషారఫ్ తన టైని విప్పి, నాకు అందించారు. ‘‘దీన్ని మీరు ధరించాలని కోరుకుంటు న్నాను. దయచేసి దీన్ని మీకు ఇవ్వనివ్వండి’’ అన్నారు. ‘‘సర్, సర్, సర్’’, నేను నత్తులు పలికాను. ‘‘నేను చేసింది ఒక అమాయకపు వ్యాఖ్య. అంతకుమించి నేను మరేమీ సూచించలేదు’’ అన్నాను. ‘‘నాకు తెలుసు’’, ఆంటూ ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఇది మీ పట్ల నా సఖ్యతకు సంకేతం మాత్రమే’’ అన్నారు. ‘‘మీకు కృతజ్ఞతలు’’ అని నేను కదిలిపోయాను. తర్వాత, టైకి ఉన్న బంగారు పిన్నును, ఆయన చొక్కాకు వేలాడుతున్న బంగారు గొలుసును చూస్తూ నవ్వుతూ చెప్పాను. ‘‘నేను గోల్డ్ చెయిన్ గురించి ప్రశంసించి ఉండాల్సింది. అప్పుడు బహుశా దాన్ని కూడా మీరు నాకు ఇచ్చి ఉండేవారు.’’ అప్పుడు జనరల్ గట్టిగా నవ్వారు. ‘‘హా. ఔర్ అగర్ ఆప్ కో జూతీ పసంద్ ఆయీ హోతీ తో వో భీ మిల్ జాతీ (అవును. ఒకవేళ మీకు బూట్లు ఇష్టమైతే అవి కూడా దొరికేవి)’’ అంటూ హాస్య మాడారు. తదుపరి సంవత్సరాల్లో నేను జనరల్ను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. ఇస్లామాబాద్లోనే కాదు, లండన్, దుబాయిల్లో కూడా ఇంటర్వ్యూ చేశాను. వీటిల్లో 2009లో చేసిన ఇంటర్వ్యూ నాకు బాగా గుర్తుంది. పదవీ విరమణ చేశాక, తన అధ్యక్షత గురించి, ప్రత్యేకించి కశ్మీర్పై తెర వెనుక జరిగిన చర్చల గురించి, జనరల్ నిజాయితీగా మాట్లాడడానికి ఇష్టపడతారా అని నేను ప్రశ్న రాసి పంపించాను. ‘‘డియర్ కరణ్’’ అంటూ ఆయన నాకు ఈమెయిల్లో సమాధాన మిచ్చారు. ‘‘ఇప్పుడు నేను ఇంటర్నెట్ వాడకం నేర్చుకుంటున్నాను. నా సాంకేతిక పరాక్రమపు మొదటి లబ్ధిదారు మీరే.’’ అది నిజమే అని నేను కచ్చితంగా చెప్పలేను. అది అడగడానికి సమయం దొరకలేదు. కానీ జవాబివ్వడంలో అదొక మంచి ముఖస్తుతి విధానం. ఆ ఈమెయిల్ జవాబును నేను ఫ్రేము కట్టించాను. అది ఇప్పుడు నా స్టడీ రూములో వేలాడుతోంది. తర్వాత కొన్ని వారాలకు లండన్లో ఆయనతో మరో ఇంటర్వ్యూకు అవకాశం ఏర్పడింది. అప్పుడు పాక్ జనరల్ ఓపెన్ నెక్ షర్టుతో పౌడర్ బ్లూ జాకెట్ ధరించి ఉన్నారు. రివీయెరా హోటల్లో సెలవులు గడపడానికి వచ్చిన హాలీవుడ్ నటుడిలా కనిపించారు. సూటు, టైతో కావాలనే అతిగా డ్రెస్ చేసుకున్నట్టు నాకు అనిపించింది. ‘‘మీరు బో టైని ఎందుకు కట్టుకోలేదు?’’ అని ఆయన అడిగారు.‘‘టై ఎలా కట్టుకోవాలో నాకు మీరు నేర్పుతారని అనుకున్నాను.’’ అధికారం కోల్పోయి, చట్టం ముందు పలాయితుడుగా ఉన్న ప్పుడు కూడా జనరల్ తన హాస్య ప్రవృత్తిని కోల్పోలేదు. ఆయన చనిపోయిన వార్త రాగానే ఎక్కువగా ఆయన రాజకీ యాలపై దృష్టి పడింది. అందుకే ఆయన వ్యక్తిత్వంలో ఇబ్బంది కరమైన వైరుధ్యాలు కనిపించాయి. అవి నిజం కూడా. అదే సమయంలో ఆయనలోని ఆహ్లాదకరమైన విషయాలను కూడా మర్చిపోకూడదు. అవి కూడా సత్యంలో భాగమే. కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆ పాలన నేర్పిన పాఠాలెన్నో!
అధికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్ అని నానుడి. పాకిస్తాన్ సైనిక నాయకుడిగా, ఆ పైన పాలకుడిగా చక్రం తిప్పిన జనరల్ పర్వేజ్ ముషారఫ్కు ఇది అక్షరాలా వర్తిస్తుంది. అధికారం పోయాక పరాయి దేశానికి పలాయనమై, ఆఖరికి అరుదైన వ్యాధితో ఆదివారం నిస్సహాయంగా కన్నుమూయాల్సి వచ్చింది. సైనిక దిగ్గజాలు అయూబ్, జియాల బాటలో నడిచి, పాకిస్తాన్ను నేరుగా పాలించే స్థాయికి ఎదిగిన ఈ జనరల్ మూటగట్టుకున్న అప్రతిష్ఠ అపారం. ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ హఠాత్తుగా స్తంభించింది ఆయన వల్లే. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో అంత శక్తిమంతమైన అధినేత కూడా గద్దె దిగారు. అనేక వివాదాలు ముసిరిన ముషారఫ్ పాలన చిత్రమైన పరస్పర వైరుద్ధ్యాల గాథ. అవిభజిత భారతావనిలో ఢిల్లీలో పుట్టిన ఈ జనరల్ సైనికకుట్రకు పాల్పడినప్పుడు ప్రజా ప్రభుత్వాల అవి నీతితో విసిగిన పాక్ పౌరసమాజం సంతోషించింది. ఆ సంతోషం తొందరలోనే ఆవిరైంది. పాక్ భద్రతా పరిస్థితిని చిక్కుల్లో పడేసిన పాపం ముషారఫ్దే. తీవ్రవాదంపై పోరులో ఆయన ద్వంద్వ నీతి ఆ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తే, ఆ రాజకీయ దుశ్చర్యలో తానే దగ్ధమైన దుఃస్థితి. దాయాది దేశంలో మరణశిక్ష పడ్డ ఏకైక సైనిక పాలకుడనే దుష్కీర్తీ ఆయనదే. 2007లో రెండోసారి ఎమర్జెన్సీ విధించి, రాజద్రోహానికి పాల్పడ్డారన్న కారణంపై మరణశిక్ష పడింది. వైద్యచికిత్సకంటూ 2016లో దేశం విడిచి దుబాయ్ చేరి, అక్కడే స్వీయప్రవాసంలో తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ముషారఫ్ వ్యవహారమంతా ఓ నిగూఢ ప్రహేళిక. నిరంకుశ పాలన సాగిస్తూనే, ఉదారవాద సంస్కరణలూ తెచ్చారు. మీడియా వర్ధిల్లడానికి వీలు కల్పించిందీ ఆయనే. ఆనక అవి తనకు అడ్డం తిరిగాక వాటి నోరు మూయించేందుకు ప్రయత్నించి, భంగపడ్డదీ ఆయనే. 1999 మేలో సైనిక ప్రధానాధికారిగా దుందుడుకుగా కార్గిల్ యుద్ధానికి కారణమై, పాక్ పరువు తీసిందీ ఆయనే. అదే అక్టోబర్లో కరాచీలో తన విమానం దిగనివ్వని ప్రధాని నవాజ్ షరీఫ్ను సాగనంపి, ఎమర్జెన్సీ విధించి పగ్గాలు చేపట్టి, ఆనక 2001లో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ నుంచి దేశాధ్యక్షుడై, భారత్తో శాంతి ప్రయత్నాలు చేసిందీ ఆయనే. ఆ మాటకొస్తే ఆయన హయాంలోనే అయిదేళ్ళు భారత్, పాక్ల మధ్య శాంతి నెలకొంది. చిత్రంగా ఈ సైనిక నియంత ఏలుబడిలోనే 2003–04ల్లో సియాచిన్, కశ్మీర్ వివాదం దాదాపు పరిష్కారమయ్యే దాకా వెళ్ళింది. ఆఖరున ఆ అవకాశం చేజారింది. 1999 నుంచి తొమ్మిదేళ్ళు పాక్ను పాలించిన శక్తిమంతమైన దేశాధినేత ముషారఫ్. అధ్యక్షుడైన కొద్దినెలలకే ‘తీవ్రవాదంపై పోరు’ అంటూ దోస్తీ చేసిన అమెరికాని సైతం బురిడీ కొట్టించిన తంత్రం ఆయనది. అల్ఖాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కోసం అగ్రరాజ్యం జల్లెడ పడుతుంటే, అతణ్ణి పెరట్లోనే పెట్టుకొని కాలక్షేపం చేయగలిగారు. అలా ఇటు తీవ్రవాద విషనాగుతో, అటు 9/11 ఘటనతో తీవ్రవాదంపై శివాలెత్తుతున్న అమెరికాతో ఏకకాలంలో నెయ్యం నెరిపారు. ఈ కత్తి మీద సాము వికటించి, పాలు పోసిన పామే కాటేసింది. దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నాడంటూ తీవ్రవాద బృందాలు రెండుసార్లు ఆయన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాయి. దేశంలో రాజ్యాంగ వ్యవస్థను పట్టాలు తప్పేలా చేయడం సహా ఆయన ఘోర తప్పిదాలు అనేకం. రాజకీయ మనుగడ కోసం వివిధ మతతత్త్వ పార్టీలతోనూ జట్టు కట్టారు. ఆఖరికి 2006లో బలూచ్ నేత అక్బర్ ఖాన్ బుగ్తీని హతమార్చడంతో బలూచిస్తాన్లో దిగజారిన పరిస్థితి ఇప్పటికీ సాధారణ స్థితికి రానే లేదు. బుగ్తీ హత్యతో ఆరంభమైన ముషారఫ్ పతనం దేశ ప్రధాన న్యాయమూర్తిని పక్కకు తప్పించాలన్న విఫలయత్నంతో వేగవంతమైంది. 2008లో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ అభిశంసనకు సిద్ధమవడంతో అవమానకరమైన రీతిలో ముందుగానే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో మూడు నెలలకు 26/11 ముంబయ్ దాడులతో భారత్ కూడా పాఠం నేర్చుకుంది. సైనిక నియంతతోనో, సైనాధ్యక్షుడితోనో మాట్లాడినంత మాత్రాన దాయాదితో సంబంధాలు మెరుగవడానికి అన్ని వర్గాలూ కలిసొస్తాయనుకుంటే అంతకన్నా అవివేకం లేదన్న చేదు నిజం తెలిసొచ్చింది. ఇక, 2010లో ముషారఫ్ పెట్టిన ‘ఆల్ పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్’ సైతం అనేక ఇతర ఏకవ్యక్తి రాజకీయ పార్టీల లానే అచిరకాలంలోనే తెర మరుగైంది. దేశ సమస్యల్ని పరిష్కరించగల సత్తా సైన్యానికే ఉందని గుడ్డిగా నమ్మిన పాక్ సైనిక నేతల్లో కడగొట్టువాడైన ముషారఫ్ కష్టాలు కొనితెచ్చారు. ఇస్లామాబాద్లో అధికార కేంద్రంగా ఆనాటి నుంచి సైన్యం సాగిస్తున్న ఆటకు ఇప్పటికీ తెరపడనే లేదు. ఆయన హయాంలో జరిగిన అనేక నిర్ణయాలే ఇవాళ్టికీ పాక్ రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాల ముఖచిత్రం ఇలా మిగలడానికి కారణం. నేడు రాజకీయ అనిశ్చితి, తీవ్రవాదుల ఎదురుదాడి మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తానీ పాలక శిష్టవర్గం, పౌరులు, సైన్యం ముషారఫ్ శకం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం. ఆయన తప్పొప్పులు పాకిస్తానే కాదు.. పొరుగుదేశమైన మనతో సహా ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయాల్లో సైనిక జోక్యం దుష్పరిణామాలు అంత తొందరగా ఆగవు. -
తాజ్మహల్ని చూసి.. ముషారఫ్ ఏం అన్నారంటే..
పాక్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఆగ్రా సమ్మిట్ కోసం భారత్ని సందర్శించారు. అప్పుడు ఆయన తన సతీమణితో కలిసి ఆగ్రాలోని ప్రేమకు స్మారక చిహ్నం అయిన తాజ్మహల్ని సందర్శించారు. ముషారఫ్ తాజ్ మహల్ నిర్మాణ అద్భుతానికి ఎంతగానో మంత్ర ముగ్దులయ్యారు. ఆ స్మారక చిహ్నాన్ని చూసినప్పుడూ ఆయన అడిగిన మొదటి ప్రశ్న గురించి చెబుతూ.. నాటి సంఘటనను పురావస్తు శాస్తవేత్త కెకె మహ్మద్ గుర్తు చేసుకున్నారు. ముషారఫ్ తాజ్మహల్ సందర్శించడానికి వచ్చినప్పుడు మహ్మద్ పురావస్తు శాఖలోని ఆగ్రా సర్కిల్కు సూపరింటెండ్ ఆర్కియాలజిస్ట్గా ఉన్నారు. ముషారఫ్ తాజ్మహల్ని చూసిన వెంటనే దీన్ని ఎవరూ రూపొందించారు అని మహ్మద్ని ప్రశ్నించారు. బహుశా ఆయన నేను షాజహాన్ అని చెబుతానని అనుకుని ఉండోచ్చు, కానీ నేను ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అని చెప్పానన్నారు మహ్మద్. ఎందుకంటే ఉస్తాద్ లాహోర్కి చెందినవాడు. ముషారఫ్కి ఆ ప్రేమ స్మారక చిహ్నం విశిష్టత గురించి చెప్పేందుకు మహ్మద్ని టూరిస్ట్ గైడ్గా నియమించారు. ఈ స్మారక చిహ్నం ఆప్టికల ఇల్యూషన్ గురించి కూడా చెప్పినట్లు మహ్మద్ గుర్తు చేసుకున్నారు. అంతేగాదు ముషారఫ్ తనని తాజ్మహల్ని చూడటానికి ఉత్తమమైన సమయం ఎప్పుడూ అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. సూర్యుని కిరణాలు ఆ స్మారక కట్టడంపై పడగానే పాలరాతి మహల్ కాస్తా ధగధగ మెరుస్తుందని, అలాగే వర్షం కురిసినప్పుడూ బాధగా విలపిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అంతేగాదు తాను ముంతాజ్, షాజహాన్ల వివాహం లాహోర్ కోటలో జరిగిందని, మొఘల్ చక్రవర్తి జన్మస్థలం కూడా అదేనని చెప్పడంతో ముషారఫ్ ఒక్కసారిగా తాను తనవారి ఇంట్లో ఉన్నట్లు భావించారని చెప్పారు మహ్మద్. వాస్తవానికి మహ్మద్ ఆ తాజ్మహల్ని చూడటానికి 45 నిమిషాల సమయం ఇచ్చాం గానీ కానీ ఆయన తన భార్యతో కలిసి కాసేపు వ్యక్తిగతంగా గడిపేలా మరో 15 నిమిషాలు పొడిగించినట్లు మహ్మద్ నాటి సంఘటనను వివరించారు. కాగా, ముషారఫ్ సెప్టెంబర్ 25, 2006న తాను రచించిన ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ ఏ మెమోరియల్ పుస్తకంలో ఈ తాజ్మహల్ గురించి ప్రస్తావించారు. అందులో ..ఆగ్రా అనేది తాజ్మహల్ స్మారక ప్రదేశం. ఇది ప్రేమకు సంబంధించిన మొఘల్ స్మారక చిహ్నం. ఈ కట్టడం అతీతమైన అందం కారణంగానే ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలించింది అని ముషారఫ్ పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: జెలెన్స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? పుతిన్ ఏమన్నారంటే..) -
కరడుగట్టిన సైనిక నియంత.. ‘కార్గిల్’ విలన్
భారత గడ్డపై పుట్టి, కార్గిల్ యుద్ధంతో మనల్ని దొంగదెబ్బ తీసిన తెంపరి ముషారఫ్! కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా మార్చడానికే అందుకు తెగించినట్టు తన ఆత్మకథ ‘ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్’లో రాసుకున్నారు కూడా. నాటి ప్రధాని నవాజ్ షరీఫ్కు కూడా తెలియకుండా ముషారఫ్ స్వయంగా పథక రచన చేసిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కు ఘోర పరాభవం మిగిలింది. 1999 మే 3న మొదలైన యుద్ధం జూలై 26న ముగిసింది. భారత్ 527 మంది సైనికులను కోల్పోగా 4,000 మందికిపైగా పాక్ జవాన్లు హతమయ్యారు. ఢిల్లీలో పుట్టి... పర్వేజ్ ముషారఫ్ 1943 ఆగస్టు 11న నాటి ఉమ్మడి భారతదేశ రాజధాని ఢిల్లీలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. మాతృ భాష ఉర్దూ. 1947లో దేశ విభజనతో ఆయన కుటుంబం పాకిస్తాన్లోని కరాచీకి తరలివెళ్లింది. తండ్రి సయీద్ ముషారఫుద్దీన్ ఉద్యోగరీత్యా ముషారఫ్ 1956 దాకా టర్కీలో ఉన్నారు. తర్వాత కరాచీ, లాహోర్లలో చదువుకున్నారు. 1961లో పాకిస్తాన్ మిలటరీ అకాడమీలో చేరారు. 1964లో ఆర్టిలరీ రెజిమెంట్లో అడుగుపెట్టారు. 1971లో కంపెనీ కమాండర్గా భారత్–పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తర్వాత సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమించారు. ‘జాయింట్ చీఫ్స్ స్టాఫ్ కమిటీ’ చైర్మన్గా 1999 ఏప్రిల్ 9న అదనపు బాధ్యతలు సైతం అప్పగించారు. నియంత పాలన పాక్, భారత్ ప్రధాన మంత్రులు షరీఫ్, వాజ్పేయి మధ్య 1999 ఫిబ్రవరి 21న చరిత్రాత్మక లాహోర్ శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని నెలలకే కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ తెగబడ్డారు. దీనిపై ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్నారు. తనను తొలగించేందుకు నవాజ్ షరీఫ్ ప్రయత్నించడంతో 1999 అక్టోబర్లో సైనిక కుట్రతో ఆయన్ను గద్దె దింపారు. పాకిస్తాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ప్రకటించుకుని పాలకునిగా మారారు. 2001లో దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తొమ్మిదేళ్లపాటు పాలించారు. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట అమెరికాతో చేతులు కలిపారు. మితవాద, ప్రగతిశీల ఇమేజీ కోసం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలను నిషేధించి వాటి ఆగ్రహానికి గురయ్యారు. ముషార్రఫ్పై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. 2008లో తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎన్నికల తర్వాతి పరిణామాల్లో రాజీనామా చేసి దుబాయ్ పారిపోయారు. 2013 మార్చిలో తిరిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించినా అనర్హత వేటు పడింది. నవాజ్ గెలిచాక ముషార్రఫ్పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య సహా పలు కేసులు నమోదయ్యాయి. 2019లో ప్రత్యేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు ఆ దేశ వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు. కాగా ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపబడ్డాయి. రాజ్యాంగాన్ని రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 2019లో పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. కానీ తరువాత 2020లో అతని మరణశిక్షను నిలిపివేస్తూ లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది. గత 2018 నుంచి ముషారఫ్ ప్రాణాంతక వ్యాధి అమిలోయిడోసిస్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్లోని అమెరికన్ హస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. 2016 నుంచి ఆయన దుబాయ్లోనే ఉంటున్నారు. గత జూన్లో అతని కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. అనారోగ్యం కారణంగా మూడు వారాల క్రితం మాజీ ఆర్మీ చీఫ్ను ఆసుపత్రిలో చేర్చామని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కోలుకోవడం సాధ్యం కావడం లేదని, అతని అవయవాలు పనిచేయని దశలో ఉన్నాయని పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ ట్వీట్ చేశారు. అయితే సుదీర్ఘ కాలంగా ఆసుపత్రితో చికిత్స పొందుతూ ఆదివారం(జనవరి 5) మరణించారు. చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ నేత మోదీనే -
ధోని జులపాల జుట్టు; ముషారఫ్తో ప్రత్యేక అనుబంధం
సాక్షి, వెబ్డెస్క్: ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటగా అతను బాగా పాపులర్ అయింది హెయిర్స్టైల్తోనే. జులపాల జుట్టుతో మైదానంలో బరిలోకి దిగే ధోనిని చూస్తూ అప్పటి ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండేది కాదు. ధోని హెయిర్స్టైల్ ఎంతలా పాపులర్ అయిందంటే.. అతని హెయిర్స్టైల్ను యువతలో కూడా చాలామంది అనుకరించడానికి ప్రయత్నించారు. తన హెయిర్స్టైల్తో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ధోనికి పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ముచ్చట పడ్డాడు. ధోని హెయిర్స్టైల్ను అమితంగా ప్రేమించిన ముషారఫ్ జట్టు కట్ చేయించుకోవద్దంటూ రిక్వెస్ట్ చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. తాజాగా 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి శుభాకాంక్షలు తెలుపుతూ టీమిండియా ఫ్యాన్స్ మరోసారి దానికి సంబంధించిన వీడియోనూ తమ ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్ మారింది. మరోసారి ఆ విషయాలను గుర్తుచేసుకుందాం. 2005-2006లో పాకిస్థాన్ పర్యటనకి వెళ్లిన రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని భారత జట్టు.. ఐదు వన్డేల సిరీస్ని 4-1తో చేజిక్కించుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో వన్డేని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్రాగా.. ఆ మ్యాచ్లో కేవలం 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసిన ధోనీ.. ఛేదనలో భారత్ జట్టుని గెలిపించాడు. ఆ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా.. ధోనీ దూకుడుతో 47.4 ఓవర్లలో భారత్ 292/5తో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ని ధోనీ ఫినిష్ చేసిన తీరుకి ముచ్చటపడిన ముషారఫ్.. మ్యాచ్ అనంతరం ధోనీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘‘ధోనీ నువ్వు ఈ హెయిర్ కట్లో చాలా బాగున్నావు. ఒకవేళ నువ్వు నా ఒపీనియన్ తీసుకుంటే.. హెయిర్ కట్ చేయించుకోకు’’ అని రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా అదే హెయిర్ స్టయిల్ని కొనసాగించిన ధోనీ.. 2007 టీ20 వరల్డ్కప్ సాధించిన తర్వాత క్రమంగా తన హెయిర్స్టైల్ను మారుస్తూ వచ్చాడు. -
ముషారఫ్కు భారీ ఊరట
లాహోర్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు భారీ ఊరట లభించింది. ఆయనకు మరణ శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ముషారఫ్పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. అన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. 2013లో నాటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది. ఆరేళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి గత డిసెంబర్లో ముషారఫ్కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటును, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం లాహోర్ హైకోర్టులోని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహ్మద్ అమీర్ భట్టీ, జస్టిస్ చౌధరి మసూద్ జహంగీర్ల త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ముషారఫ్పై నమోదైన దేశద్రోహం కేసు కూడా చట్టప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కేసు నమోదు నుంచి ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం వరకు అన్నీ రాజ్యాంగ వ్యతిరేకమని లాహోర్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది’ అని పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ ఇష్తియాక్ ఖాన్ తెలిపారు. ఈ తీర్పుతో జనరల్ ముషారఫ్కు స్వేచ్ఛ లభించిందన్నారు. కాగా, లాహోర్ హైకోర్టు తీర్పుపై జనరల్ ముషారఫ్ హర్షం వ్యక్తం చేశారు. -
సరికొత్త చరిత్ర.. ఆయనకు ఉరిశిక్ష!
ఎన్నికల్లో కుట్ర లేదని ఈ ఏడాది ప్రారంభంలో క్లీన్చిట్ పొందిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అనూహ్యంగా ప్రతినిధుల సభలో అభిశంసనకు గురయ్యారు. గే వివాహాలను తైవాన్ చట్టబద్ధం చేయగా... స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని బ్రూనే నిర్ణయం తీసుకుంది. కెనడా పీఠంపై మరోసారి ట్రూడో కొలువుదీరగా.. బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతి పటేల్ కీలక బాధ్యతలు స్వీకరించారు. వీటితో పాటు ఈ ఏడాది చోటుచేసుకున్న మరెన్నో అంతర్జాతీయ పరిణామాలపై సాక్షిడాట్ కామ్ అందిస్తున్న సంక్షిప్త వార్తల సమాహారం. జనవరి 5 హౌజ్లో.. 181 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. కొత్తగా కొలువుదీరిన అమెరికా ప్రతినిధుల సభ(హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) 181 ఏళ్ల నిబంధనను తిరగరాస్తూ కొత్త చరిత్రను లిఖించింది. మత సంప్రదాయాలకు విలువనిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు తమ ఆచారం ప్రకారం తలపాగా(హిజాబ్, టర్బైన్) ధరించి సభకు హాజరయ్యేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. హౌజ్కు తొలిసారిగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా సరికొత్త రికార్డు సృష్టించిన రషిదా త్లాయిబ్, ఇల్హాన్ ఒమర్లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. జనవరి 5 అమెరికాకు.. చైనా సరికొత్త సవాల్! అమెరికా ప్రయోగించిన ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ అనే బాంబుకు దీటుగా.. చైనా కూడా అంతటి సామర్థ్యం గల బాంబును రూపొందించింది. హెచ్- 6కె అనే బాంబర్ సాయంతో దానికి పరీక్షించినట్లు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనా రక్షణ సంస్థ ఎన్ఓఆర్ఎన్సీఓ రూపొందించిన ఈ బాంబును అణు బాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. జనవరి 8 బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఆవామీ లీగ్ అధినేత షేక్ హసీనా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 24 మంది కేబినెట్ మంత్రులుగా, 19 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హసీనా కేబినెట్లో కేవలం ఆవామీ లీగ్కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు. అమెరికా దాడుల్లో అల్ ఖైదా బడావీ మృతి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా ముఖ్యనాయకుడు జమాల్ అల్ బడావీ అమెరికా వాయుసేన దాడుల్లో మరణించినట్లు ఆ దేశం వెల్లడించింది. అల్ఖైదా తరఫున యెమెన్లో కార్యకలాపాలు నిర్వహించే బడావీ.. 2000 సంవత్సరంలో అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బందిపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కీలకపాత్ర పోషించాడు. దీంతో బడావీ ఆచూకీ తెలిపిన వారికి 5 మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. జనవరి 11 వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. కాగా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. జనవరి 13 అమెరికా చరిత్రలో షట్డౌన్ రికార్డు అమెరికా-మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా మొదలైన అమెరికా షట్డౌన్ రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది. ఈ షట్డౌన్ కారణంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. గతంలో 1995–96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్డౌన్ రికార్డును ట్రంప్ ప్రభుత్వం అధిగమించింది. జనవరి 18 ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్లు ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ప్రస్తుతం గేట్వే ఫర్ యాక్సెలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (గెయిన్) డైరెక్టర్గా ఉన్న రీటా బరన్వాల్ను ఇంధన శాఖ (అణు ఇంధన) అసిస్టెంట్ సెక్రటరీగా, న్యాయవాద అధ్యాపకుడిగా ఉన్న ఆదిత్య బమ్జాయ్ని ప్రైవసీ అండ్ సివిల్ లిబర్టీస్ ఓవర్సైట్ బోర్డు సభ్యుడిగా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్సైట్ కౌన్సిల్లో డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న బిమల్ పటేల్ను ట్రెజరీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించేందుకు ట్రంప్ ప్రతిపాదించారు. జనవరి 29 పాకిస్తాన్లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ..!! సుమన్ కుమారి అనే మహిళ పాకిస్తాన్లోని ఓ కోర్టుకు సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. తద్వారా దాయాది దేశంలో జడ్జిగా నియమితులైన తొలి హిందూ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఖంబర్-షాదాద్కోట్ జిల్లాకు చెందిన కుమారి అదే జిల్లాకు జడ్జిగా నియమితులవడం విశేషం. జనవరి 31 అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు అమెరికాలో అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించి.. సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డవారిలో దాదాపు 200 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను తీసుకువచ్చారనే అభియోగాలతో ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 26 300 మంది ఉగ్రవాదుల హతం? పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్-200 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. సర్జికల్ స్ట్రైక్ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. మార్చి 26 అమెరికా ఎన్నికల్లో కుట్ర లేదు అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట లభించింది. 2016లో ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార బృందం రష్యాతో కలసి కుట్రకు పాల్పడిందనడానికి ఆధారాలు లేవని రాబర్ట్ ముల్లర్ విచారణ కమిటీ తేల్చింది. మార్చి 29 ఇకపై అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయడమే..! ఆసియా దేశం బ్రూనై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని, స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానించింది. అదే విధంగా.. దొంగతనానికి పాల్పడిన వారి చేతులు, పాదాలు నరికివేసే శిక్ష అమలు చేయనుంది. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు వేస్తారు. ఏప్రిల్ 21 బాంబు పేలుళ్లతో రక్తమోడిన కొలంబో శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 207 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలయ్యాయి. ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. మే 17 గే వివాహాలను చట్టబద్ధం చేసిన తైవాన్ స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ తైవాన్ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తద్వారా గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. దీంతో సామాన్య వివాహ చట్టంలో ఉండే అన్ని నిబంధనలు స్కలింగ సంపర్కులకు కూడా వర్తించనున్నాయి. తైవాన్ అధ్యక్షురాలు సా యింగ్-వెన్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(డీపీపీ) ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. జూన్ 6 థాయ్ ప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా థాయ్లాండ్ నూతన ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్ చాన్ ఓచా(65) ఎన్నికయ్యారు. 2014లో ఇంగ్లక్ షీనవ్రత ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్ ప్రయూత్ చాన్ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌర ప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా నిలిచారు. జూలై 01 ఉత్తర కొరియాలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్తో సమావేశమయ్యారు. ఉభయ కొరియాల సరిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్)లోని పన్మున్జొమ్ గ్రామంలో ఇరువురు నేతలు కలుసుకున్నారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి కావడంతో ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమైంది. జూలై 26 అమెరికాలో మళ్లీ మరణశిక్షల అమలు దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది. జూలై 26 బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతీ పటేల్ బ్రిటన్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్పై వివాదం నేపథ్యంలో కొత్త ప్రధానిగా ఎన్నికైన బోరిస్ జాన్సన్.. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్(హోం మంత్రి), రిషి సునక్(ఆర్థిక శాఖ సహాయ మంత్రి), అలోక్ శర్మ (ఇంటర్నేషనల్ డెవలప్మెంట్)లకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 15 భారత్ను హెచ్చరించిన ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడం ద్వారా భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ విమర్శించారు. ‘మోదీ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ నిర్ణయం మోదీకి, బీజేపీకి చాలా ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. ఎందుకంటే కశ్మీర్ సమస్యను వారు అంతర్జాతీయం చేసేశారు. భారత్లో కర్ఫ్యూ సందర్భంగా ఏమేం జరిగిందో మేం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతాం. ప్రతీ అంతర్జాతీయ వేదికపై కశ్మీరీలకు నేను రాయబారిగా నిలుస్తా’ అని వెల్లడించారు. సెప్టెంబరు 7 ఉక్కు మనిషి ముగాబే కన్నుమూత జింబాబ్వే మాజీ అధ్యక్షుడు, ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన రాబర్ట్ ముగాబే(95) కన్నుమూశారు. 37 ఏళ్ల పాటు జింబాబ్వేని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ముగాబే నియంతృత్వ పోకడల్ని భరించలేక చివరకు ఆయనకు అండదండగా ఉన్న సైన్యమే 2017లో ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ఆ అవమాన భారంతో కుంగిపోయిన ఆయన మంచం పట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సెప్టెంబరు 11 ఇమ్రాన్కు ఐరాస షాక్ జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై నానా రాద్ధాంతం చేస్తున్న పాకిస్తాన్కు ఐక్యరాజ్యసమితి (ఐరాస) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ వ్యవహారం భారత్-పాకిస్తాన్లకు సంబంధించిన అంశమని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గటరీస్ ఉద్దేశమని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ స్పష్టం చేశారు. సెప్టెంబరు 23 చరిత్రాత్మకంగా హౌడీ మోదీ! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో హ్యూస్టన్లో జరిగిన మెగా ఈవెంట్ హౌడీ మోదీలో ప్రధాని మోదీ.. ఇక ఉగ్రవాదంపై యుద్ధమే అని గర్జించారు. ఉగ్రవాదంపై, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న, ఆర్థిక మద్దతిస్తున్న దేశాలపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు. ఆ యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ కచ్చితంగా మద్దతిస్తారని, ఆయనే ముందుండి నడుపుతారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న ట్రంప్ను నిలుచుని చప్పట్లు కొడుతూ ప్రశంసించాలని ఆహూతులను కోరారు. అక్టోబరు 23 కెనడా పీఠంపై మళ్లీ ట్రూడో! కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అతికష్టం మీద పదవిని నిలుపుకొన్నారు. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్ డిస్ట్రిక్ట్స్కుగానూ 157 డిస్ట్రిక్ట్స్లో విజయం సాధించగా, ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ 121 డిస్ట్రిక్ట్స్లో గెలిచింది. దాంతో ఇతరుల మద్దతుతో లిబరల్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అక్టోబరు 29 ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం ఉగ్రమార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్న ఐసిస్ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ(48)ను అమెరికా సేనలు సిరియాలో అంతమొందించాయి. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు చేసిన ‘రహస్య దాడి’ సందర్భంగా బాగ్దాదీ చనిపోయాడని వాషింగ్టన్లోని వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. నవంబరు 9 కర్తార్పూర్ కారిడార్ ప్రారంభం భారత్, పాకిస్తాన్లను కలిపే కర్తార్పూర్ కారిడార్ ప్రారంభమైంది. సిక్కుల గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని.. పాక్లోని నరోవల్ జిల్లా కర్తార్పూర్లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను భారత్లోని డేరాబాబా నానక్ గురుద్వారాతో కలిపే కర్తార్పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. నవంబరు 19 పాక్ అణు క్షిపణి పరీక్ష భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ‘షహీన్-1’ను పాక్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి. గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది. నవంబరు 21 ట్రూడో మంత్రివర్గంలో తొలి హిందూమంత్రి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణలో అనితా ఇందిరా ఆనంద్ చోటుదక్కించుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న తొలి హిందూ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. శ్రీలంక కొత్త ప్రధాని మహిందా రాజపక్స శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్స తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మహిందా రాజపక్సను దేశ నూతన ప్రధానిగా బుధవారం ఎంపిక చేశారు. నవంబరు 26 హాంకాంగ్ ఎన్నికల్లో చైనాకు షాక్ హాంకాంగ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైనా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 జిల్లాల్లోని 452 స్థానాల్లో 388 మంది ప్రజాస్వామ్య అనుకూలవాదులు గెలిచారు. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కేవలం 59 మంది, మరో ఐదుగురు స్వతంత్రులు గెలిచారు. చైనా అనుకూల పార్టీకి చెందిన 155 మంది ఓడిపోయారు. నవంబరు 29 శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల సాయం శ్రీలంక అభివృద్ధికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక అభివృద్ధికి, ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు 450 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మోదీ ప్రకటించారు. డిసెంబరు 4 అనూహ్యం: కమలా హ్యారిస్ అవుట్! అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరుగనున్న ఎన్నికల అభ్యర్థిత్వ పోటీ నుంచి డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్(54) నిష్క్రమించారు. ఆర్థిక కారణాల వల్ల అగ్రరాజ్య అధ్యక్ష రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఈ కాలిఫోర్నియా సెనెటర్ ప్రకటన చేశారు. డిసెంబరు 9 మిస్ యూనివర్స్గా జోజిబినీ తుంజీ ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎంపికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. డిసెంబరు 12 ఫిన్ల్యాండ్ కేబినెట్లో 12 మంది మహిళలు ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ తన కేబినెట్లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30-35 ఏళ్ల మధ్య వయసున్నవారే. డిసెంబరు 15 మిస్ వరల్డ్గా జమైకా సుందరి జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్-2019 కిరీటం దక్కించుకున్నారు. గత ఏడాది మిస్ వరల్డ్గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్.. టోనీ–ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్గా ఫ్రాన్స్కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్ రన్నరప్గా భారత్కు చెందిన సుమన్ రావ్ నిలిచారు. డిసెంబరు 18 ముషారఫ్కు మరణశిక్ష సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. డిసెంబరు 20 ట్రంప్పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను దిగువ సభ అభిశంసించింది. అనంతరం సెనేట్లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్షపదవి నుంచి ట్రంప్ దిగిపోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాసపరీక్షలో ట్రంప్పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్ను అడ్డుకున్నారనేది రెండో ఆరోపణ. -
ముషారఫ్ శవాన్నైనా మూడ్రోజులు వేలాడదీయండి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే మరణిస్తే అతడి శరీరాన్ని అయినా మూడ్రోజులు ఉరికి వేలాడదీయాల్సిందేనని ఆ దేశ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టంచేసింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన 167 పేజీల తీర్పు కాపీలో ‘అతడు చేసిన ప్రతి దానికి ఉరికి వేలాడాల్సిందే. ఒకవేళ ఉరికి ముందే మరణించినా వేలాడదీయాల్సిందే’ అంటూ జస్టిస్ వఖార్ అహ్మద్ సేథ్ తీర్పు రాశారు. అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంటుతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలకు దగ్గరగా ఉండే డీ–చౌక్ (డెమోక్రసీ చౌక్) వద్ద అతడి మృతదేహం మూడు రోజుల పాటు వేలాడాలని చెప్పారు. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్లో ఉన్నారు. -
‘చచ్చినా అతన్ని వదలొద్దు.. శవాన్ని అయినా ఉరి తీయండి’
కరాచి : రాజద్రోహం కేసులో ఉరిశిక్ష పడిన మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్పై పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదేని కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన మృతదేహాన్నైనా ఉరితీయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజద్రోహం కేసు తీర్పు వివరాలను ముగ్గురు సభ్యుల బెంచ్ గురువారం సమగ్రంగా చదివి వినిపించింది. అనారోగ్య లేక మరేదైన కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన శవాన్ని ఇస్లామాబాద్లోని డీ-చౌక్లో మూడు రోజులపాటు వేలాడదీయాలని పేర్కొంది. ఈ మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక 2016లో దుబాయ్కి పారిపోయిన ముషారఫ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. (చదవండి : ముషారఫ్కు మరణశిక్ష) రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మంగళవారం ముషారఫ్కు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణకు పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వం వహించగా జస్టిస్ కరీం, జస్టిస్ నజారుల్లా అక్బర్ సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ వకార్ అహ్మద్, జస్టిస్ కరీం ముషారఫ్ ఉరిశిక్షకు అనుకూలంగా ఓటు వేయగా.. జస్టిస్ నజారుల్లా వ్యతిరేకంగా ఓటు వేశారు. (చదవండి : ముషారఫ్కు పాక్ ప్రభుత్వం మద్దతు) -
ముషారఫ్ ఎప్పటికీ ద్రోహి కాదన్న పాక్ ఆర్మీ
-
ముషారఫ్కు పాక్ ప్రభుత్వం మద్దతు
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు మద్దతివ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కోర్ కమిటీతో అత్యవసర సమావేశం అయ్యారు. ఆశ్చర్యమేంటంటే ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షంలో ఉండగా ముషారఫ్ రాజద్రోహం కేసుకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలపగా, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ముషారఫ్కు మద్దతుగా ఆర్మీ కూడా నిలుస్తోంది. మాజీ సైనికాధ్యక్షుడైన ముషారఫ్.. ఎప్పటికీ ద్రోహి కాదని, కోర్టు తీర్పును ఖండిస్తున్నట్లు ప్రకటించింది. -
పాక్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
-
ముషారఫ్కు మరణశిక్ష
ఇస్లామాబాద్: సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. 2014లో ముషారఫ్ పై ఈ కేసు నమోదైంది.పెష్వార్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వక్వార్ అహ్మద్ సేథ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల స్పెషల్ కోర్టు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నందుకుగాను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం పర్వేజ్ ముషారఫ్ను దోషిగా ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. నవంబర్ 19న రిజర్వులో ఉంచిన తీర్పుని సింద్ హైకోర్టు (ఎస్హెచ్సీ) జస్టిస్ నజర్ అక్బర్, లాహోర్ హై కోర్టు జస్టిస్ షాహీద్ కరీమ్ల బెంచ్ మంగళవారం వెల్లడించింది. కోర్టు తీర్పు పూర్తి వివరాలు వెల్లడించలేదు. కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ముషారఫ్ అందుబాటులో లేరు. అయితే ఫిర్యాదులను, రికార్డులను, వాదనలు, కేసులోని వాస్తవాలను పరిశీలించిన మీదట ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు ముషారఫ్కి వ్యతిరేకంగా మెజారిటీ తీర్పుని వెల్లడించారు. 2007లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, సైనిక పాలన విధించినప్పుడు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అత్యవసర పరిస్థితి విధించడంతో దేశంలో పౌరుల హక్కులు హరణకు గురయ్యాయి, మానవ హక్కులకు అర్థం లేకుండా పోయింది. 2007 నవంబర్ నుంచి 2008 ఫిబ్రవరి వరకు పాకిస్తాన్లో అత్యవసర పరిస్థితి కారణంగా ఎటువంటి ప్రజాస్వామిక పాలనకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షస్థానంలో ఉండి ముషారఫ్ సైనికాధిపతిగా వ్యవహరించడంతో ముషారఫ్ పాలనలో జనం విసిగిపోయారు. సుప్రీంకోర్టు జడ్జీలనూ ఆనాడు గృహ నిర్బంధంలో ఉంచారు. అనేక మంది జడ్జీలను విధుల నుంచి తొలగించారు. తర్వాత 2008లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ఓ రాజకీయ పార్టీ వైఫల్యంతో ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ముషారఫ్ విదేశాలకు పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ముషారఫ్కి ఈ శిక్ష అమలు చేయడం ఇప్పుడు సవాల్గా మారనుంది. దుబాయ్లోని ఆసుపత్రి పడకపై నుంచి ముషారఫ్ గత నెలలో ఓ వీడియో రికార్డింగ్ను విడుదల చేశారు. అందులో కేసులో తనపై న్యాయమైన విచారణ జరగడంలేదని ఆరోపించారు. అలాగే ‘జాతికి సేవ చేశాను. దేశ అభ్యున్నతి కోసమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను’ అని వీడియోలో ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుని ముషారఫ్ పై కోర్టులో చాలెంజ్ చేయొచ్చని న్యాయనిపుణులు వెల్లడించారు. అమెరికాపై నవంబర్ 9 న జరిగిన దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో ముషారఫ్ అమెరికా పక్షం వహించడం పట్ల మతపరమైన పార్టీలు విమర్శలు గుప్పించాయి. పాకిస్తాన్లో ఇస్లామిస్ట్ హింసకు దారితీశాయి. -
మాజీ నియంతకు మరణశిక్ష
పాకిస్తాన్ను ఒక అర్థరాత్రి చెరబట్టి, ఏ రకమైన ప్రజామోదమూ లేకుండా తొమ్మిదేళ్లపాటు పాలించి, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిన జనరల్ పర్వేజ్ ముషార్రఫ్కు అక్కడి ప్రత్యేక న్యాయ స్థానం దేశద్రోహ నేరంకింద మరణశిక్ష విధించడం ఆ దేశంలో మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది. సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్లినప్పుడు ఈ శిక్ష నిలబడుతుందా... పాక్ సైన్యం ఈ తీర్పును ఎలా పరిగణిస్తుందన్న అంశాలు పక్కనబెడితే పాకిస్తాన్ చరిత్రలో సైనిక కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న సైనికాధికారికి పౌర న్యాయస్థానంలో మరణశిక్ష పడటం ఇదే ప్రథమం. ఇప్పటికే అనారోగ్యంతో దుబాయ్ ఆసుపత్రిలో ఉన్న ముషార్రఫ్ తన వాదన వినకుండా తీర్పునిచ్చారని, తనను వేధిస్తున్నారని ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చుగానీ... ఆయన చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదు. 1999 అక్టోబర్లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ శ్రీలంక పర్యటనకెళ్లినప్పుడు రక్తరహిత కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న ముషార్రఫ్ ఆ తర్వాత వరసబెట్టి ప్రజా స్వామ్య వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ముందుగా మీడియా పీకనొక్కి, ఆ తర్వాత న్యాయవ్యవస్థ పనిపట్టారు. 2007లో దేశంలో రాజ్యాంగాన్ని రద్దుచేసి, కొత్తగా తాత్కాలిక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దానికింద ఎమర్జెన్సీ విధించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ మూర్తులంతా పదవుల్నించి తప్పుకుని కొత్త రాజ్యాంగం కింద ప్రమాణస్వీకారం చేయాలని హుకుం జారీచేశారు. ఈ తాత్కాలిక రాజ్యాంగాన్ని తక్షణం నిలిపేస్తున్నట్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ఉత్తర్వులిచ్చింది. వీరిని, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తెకర్ చౌధ్రితోసహా వంద మంది న్యాయమూర్తులను పదవులనుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచారు. వివిధ హైకోర్టులు, ఆ కిందిస్థాయి న్యాయస్థానాలకు చెందిన 76 మంది న్యాయమూర్తులు కొత్త రాజ్యాంగం ప్రకారం ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ నాయకులందరినీ ఖైదు చేశారు. ఈ చర్య తర్వాత పాకిస్తాన్ అంతటా ఆందోళనలు రాజుకోవడంతో ముషార్రఫ్ తన ప్రభుత్వాన్ని తానే రద్దు చేసుకుని నేరుగా పాలించడం మొదలుపెట్టారు. అటు సైనిక దళాల చీఫ్గా, ఇటు దేశాధ్యక్షుడిగా జోడు పదవుల్లో ఉన్న ముషార్రఫ్పై ఏదో ఒక పదవే ఉంచుకోవాలంటూ సైన్యం నుంచి కూడా ఒత్తిళ్లు రావడంతో సైనిక దళాల పదవికి స్వస్తి చెప్పి అధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించు కున్నారు. తనకు ఆప్తుడైన ఐఎస్ఐ చీఫ్ కయానీకి సైనిక దళాల చీఫ్ పదవి కట్టబెట్టారు. రాజ్యాం గాన్ని రద్దు చేసిన కేసులోనే ఇప్పుడు ముషార్రఫ్కు ఇప్పుడు మరణశిక్ష పడింది. తనను ఏరి కోరి తెచ్చుకున్న నవాజ్ షరీఫ్కు తాను ఎసరు పెట్టినట్టే... తాను తెచ్చుకున్న జనరల్ కయానీ తనకే ఎదురు తిరగడం ముషార్రఫ్కు అనుభవంలోకొచ్చింది. 2008 ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ముషార్రఫ్ కనుసన్నల్లో పనిచేసే పీఎంఎల్–క్యూ తుడిచిపెట్టుకుపోగా పీపీపీ ఘనవిజయం సాధించింది. తన టక్కుటమార విద్యలన్నీ విఫలమయ్యాయని గ్రహించాక ఇక అయిష్టంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. పౌర ప్రభుత్వాలను కబ్జా చేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైనికాధికారుల్లో ముషార్రఫ్ మొదటివారేమీ కాదు. ఆ దేశం దాదాపు 35 ఏళ్లపాటు సైనిక పదఘట్టనల్లోనే బతుకీడ్చింది. తమ పాలనలోని అవినీతి జనం కళ్లబడకుండా, పేదరికం, అవిద్య, నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాల జోలికి వారు పోకుండా ఇస్లామిక్ సిద్ధాంతం పేరు చెప్పి ప్రజలను బుజ్జగించడం సైనిక పాలకులు అనుసరిస్తూ వచ్చిన వ్యూహం. ఆ తానులో ముక్కగా ముషార్రఫ్ కూడా దాన్నే కొనసాగించారు. అటు అఫ్ఘాన్లో తాలిబన్లకు బహి రంగంగా సహాయసహకారాలిస్తూ, భారత్లో ఉగ్రవాద దాడులు చేసేందుకు ప్రోత్సహించారు. పాక్లో తన చెప్పుచేతల్లో ఉండే ప్రభుత్వం అవసరం గనుక అమెరికా ఈ కుట్రలన్నిటికీ సహక రిస్తూ వచ్చింది. 2001లో అమెరికాపై ఉగ్రవాదులు దాడులు చేశాక ఇదంతా మారక తప్పలేదు. ఆ తర్వాత చాటుమాటుగా ఉగ్రవాదులకు మద్దతు పలుకుతూ వచ్చారు. ఈ సంస్కృతిని ఇంకా పాక్ విడనాడలేదు. ఇప్పుడు తీర్పు వెలువరించిన ప్రత్యేక కోర్టుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టించిన వైనాన్ని గమనిస్తే, ముషార్రఫ్ను కాపాడటానికి అది ఎన్ని పాట్లు పడిందో అర్థమవుతుంది. ఈ పనంతా మొదట్లో ముషార్రఫ్ చేసుకోవాల్సి వచ్చింది. 2013నాటి ఈ కేసు విచారణలో అడుగు ముందుకు పడకుండా ఎప్పటికప్పుడు ఆయన ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూనే వచ్చారు. అవన్నీ వృధాయేనని అర్థమయ్యాక 2016లో ఆయన కొద్దిరోజుల్లో తిరిగొస్తానని నమ్మబలికి దేశం నుంచి నిష్క్రమించారు. ఈ మూడేళ్లూ చడీచప్పుడూ చేయని ఇమ్రాన్ సర్కార్ ఇక తీర్పు వెలువడటం తథ్యమని తెలిశాక ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించి ప్రత్యేక కోర్టు తీర్పునివ్వకుండా ఆపాలంటూ పిటిషన్ వేసింది. అలా నెలరోజులు గడిచిపోయింది. ఆ అడ్డంకి కూడా అధిగమించి ఈ నెల 17న తీర్పునిస్తామని ఈ నెల 5న ప్రకటించాక ముషార్రఫ్తో పాటు అప్పటి ప్రధాని షౌకత్ అజీజ్, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ హమీద్ దోగర్, అప్పటి న్యాయమంత్రి జహీద్ హమీద్లను కూడా నిందితులుగా చేర్చాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వీరందరినీ చేర్చి కొత్తగా విచారించాలని కోరింది. ఇన్నేళ్లపాటు ఏం చేశారంటూ ప్రభుత్వాన్ని మందలించి, పిటిషన్ను కొట్టేసి ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరిం చింది. తుది అప్పీల్పై నిర్ణయం వెలువడే వరకూ ఈ తీర్పును ఎటూ సుప్రీంకోర్టు నిలిపివేస్తుంది. ఆ నిర్ణయం ఇప్పట్లో రాదనే చెప్పాలి. అక్కడ కూడా చుక్కెదురయ్యాక దేశాధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టొచ్చు. కానీ ఆ దేశ రాజకీయాలపై ఇంకా సైన్యం పట్టుసడలని వర్తమానంలో ఈ తీర్పు ప్రతీ కాత్మకమైనదే అయినా ఎన్నదగినది. దీని పర్యవసానాలెలా ఉంటాయో మున్ముందు చూడాలి. -
సంచలన తీర్పు: ముషారఫ్కు ఉరిశిక్ష
-
సంచలన తీర్పు: ముషారఫ్కు ఉరిశిక్ష
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్ను ఉరి తీయాలంటూ పాకిస్తాన్లోని లాహోర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో దేశద్రోహం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ముషారఫ్పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం మంగళవారం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. కాగా అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్ దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పాక్ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే. ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేకంగా 2007 నవంబర్ 3న దేశంలో ఎమర్జెనీ విధించారు. ఈ సమయంలో దేశంలోని విపక్ష నేతలను, న్యాయమూర్తులను అక్రమంగా నిర్బందించారు. అనేక మంది ఉన్నతాధికారులను, న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. కేసు విచారణ జరుగుతుండగానే దేశం విడిచి వెళ్లిపోయారు. విచారణకు హాజరుకావాలని కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా దిక్కరించారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా దుబాయ్లో తలదాచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్ను పాక్కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. మరోవైపు లాహోర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. -
లాడనే మా హీరో: పాక్ మాజీ అధ్యక్షుడు
ఇస్లామాబాద్ : కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తమ హీరో అని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ వైఖరిని ముషార్రఫ్ బహిర్గతం చేశారు. జిహాది ఉగ్రవాదులందరు పాక్ హీరోలంటూ కొనియాడారు. ఈ మేరకు ముషారప్ వ్యాఖ్యానించినట్లుగా పాక్ రాజకీయ నాయకుడు ఫర్హతుల్లా బాబర్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. పాకిస్తాన్కు లాభం చేకూర్చే విధంగా ఆఫ్ఘనిస్తాన్లో 1979లో మతపరమైన మిలిటెన్సిని ప్రవేశపెట్టామని తద్వారా దేశంలోని సోవియేట్లను వెళ్లిపోయే విధంగా కృషి చేశామని ముషారఫ్ అన్నారు. Gen Musharraf blurts that militants were nurtured and touted as 'heroes' to fight in Kashmir. If it resulted in destruction of two generations of Pashtuns it didn't matter. Is it wrong to demand Truth Commission to find who devised self serving policies that destroyed Pashtuns? https://t.co/5Q2LOvl3yb — Farhatullah Babar (@FarhatullahB) November 13, 2019 ‘ప్రపంచంలోని ముజాహిద్దీన్ ఉగ్రవాదులందరిని ఏకం చేశాం. అప్పట్లో లష్కరే తోయిబా, ఆల్ఖైదా ఉగ్రవాదులను ప్రోత్సహించాం. పాక్కు వచ్చే కశ్మీరీలను హీరోలుగా గుర్తించాం. మేము వారికి పటిష్టమైన శిక్షణ ఇచ్చాం. భారత ఆర్మీతో పోరాడే కశ్మీరులను ముజాహుద్దీన్లుగా గుర్తించాం. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల తమ హీరోలు విలన్లయ్యారు’ అని ముషారఫ్ వ్యాఖ్యానించారు. -
కశ్మీర్ మా రక్తంలోనే ఉంది
ఇస్లామాబాద్: కశ్మీర్ తమ రక్తంలోనే ఉందని, కశ్మీరీల కోసం పాకిస్తాన్ ప్రజలు నిలబడతారని పాక్ మాజీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. పాక్ శాంతి మంత్రాన్ని జపిస్తున్నా భారత్ భయపెట్టాలని చూస్తోందన్నారు. ‘భారత్ కార్గిల్ యుద్ధాన్ని మరచిపోయిందేమో.. యుద్ధం ముగిసే ముందు అమెరికా సాయం కోరింది’ అని వ్యాఖ్యానించారు. అనారోగ్యంతో దుబాయ్లో చికిత్స పొందుతున్న ఆయన మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఏపీఎంఎల్) అధ్యక్షుడిగా ఉన్న 76 ఏళ్ల ముషారఫ్ ఆయన అనారోగ్యంతో ఏడాది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్కేక ప్రతిపత్తిని భారత్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత తొలిసారి ఆయన స్సందించారు. కశ్మీర్ పౌరులకు అండగా ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ శాంతి కోరుకుంటోందని, దాన్ని తమ బలహీనతగా భావించొద్దని హెచ్చరించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. 1999 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్.. బెనజీర్ భుట్టో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
ముషారఫ్ ఇంట్లో మికా సింగ్.. నెటిజన్ల ఆగ్రహం
కరాచీ : జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేశాక భారత్, పాక్ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. భారత్పై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్తో వాణిజ్యాన్ని రద్దు చేసుకోవడమేగాక పాక్లో బాలీవుడ్ సినిమాలపై నిషేదం విధించింది. కాగా, పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ కజిన్ కూతురి వివాహ కార్యక్రమం కరాచీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ పాల్గొన్నారు. ఆయన పాటలు పాడుతుండగా పలువురు హుషారుగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పాకిస్తాన్లోని చాలామందికి నచ్చలేదు. దీంతో ఇరుదేశాల నెటిజన్లు ఈ వీడియోపై ట్విటర్లో యుద్ధం చేసుకుంటున్నారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్టు నైలా ఇనాయత్.. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ‘జనరల్ పర్వేజ్ ముషారఫ్ బందువుల ఫంక్షన్లో ఓ భారత సింగర్ ప్రదర్శన ఇచ్చారు. సంతోషం.. అదే పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో ఇది జరిగి ఉంటే?.. అంటూ ప్రశ్నించారు. అలాగే ఓ పాకిస్తానీ ట్వీట్ చేస్తూ.. ‘ఒక పక్క ఇండియా చేతిలో కశ్మీర్ పతనం అవుతోంది. మరో పక్క కరాచీలో భారత కళాకారుడు ప్రదర్శనలు ఇస్తున్నాడు. నయా పాకిస్తాన్ అంటే ఇదేనేమో!’ అని కామెంట్ చేశారు. ‘బాలీవుడ్ సినిమాలు బ్యాన్ చేశారు. భారత్తో వాణిజ్యాన్ని నిలిపేశారు. పాక్ గగనతలంలో భారత విమానాల రాకపోకలను నిషేధించారు. సరే.. విమానాలు రద్దు అయితే, వీసాలు ఇవ్వకుంటే వాళ్లు ఎలా పాక్ వచ్చారు. ఎందుకంటే ఈ నయా పాకిస్తాన్ ఓ షేమ్ పాకిస్తాన్’ అని ఆ నెటిజన్ మండిపడ్డాడు. దీనిపై భారత నెటిజన్లు స్పందిస్తూ.. ‘రాజకీయం వేరు.. కళలు వేరు.. కళలకు హద్దులు లేవు’ అని పేర్కొంటున్నారు. -
పాక్ ముసుగు తొలగించిన ముషార్రఫ్
ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ వైఖరిని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ బహిర్గతం చేశారు. భారత్పై దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ను పాక్ ఇంటెలిజెన్స్ సర్వీస్ను వినియోగిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ నదిమ్ మాలిక్కు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్కూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అయినప్పటికీ.. తన పాలన కాలంలో దానిని భారత్పై దాడుల కోసం ఇంటెలిజెన్స్ వాడుతుండేదని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడుగా ఉన్న కాలంలోనే జైషే సంస్థ తనను రెండు సార్లు హత్య చేసేందుకు యత్నించిదని ఆరోపించారు. అయితే మీ పాలనలో ఉగ్ర సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ జర్నలిస్ట్ ముషార్రఫ్ను ప్రశ్నించారు. దీనికి ముషార్రఫ్ అప్పటి పరిస్థితులు చాలా భిన్నమైనవని.. ఆ కాలంలో భారత్, పాక్లు రహస్యంగా పోరాడేవని వ్యాఖ్యానించారు. ఇందుకోసం పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలు పనిచేసేవని పేర్కొన్నారు. ఉగ్ర నివారణ చర్యల్లో భాగంగా జైషే మహమ్మద్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. తాను కూడా అందుకోసం ఒత్తిడి తీసుకురాలేదని అన్నారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో పాటు భారత్లో జరిగిన చాలా ఉగ్ర దాడుల వెనుకు జైషే చీఫ్ మసూద్ అజార్ హస్తం ఉన్న సంగతి తెలిసిందే. -
అధ్యక్షున్ని అవుతా.. సాయం చేయండి
వాషింగ్టన్: పాకిస్తాన్లో మళ్లీ తాను అధికారంలోకి రావడానికి రహస్యంగా సాయం చేయాలని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అమెరికా చట్ట సభ్యులను కోరుతున్న వీడియో బయటపడింది. పాక్లోని అబోటాబాద్లో అల్కాయిదా చీఫ్ లాడెన్ స్థావరాన్ని గుర్తించడంలో నిఘా సంస్థ ఐఎస్ఐ విఫలం కావడంపై తాను సిగ్గు పడుతున్నట్లు ముషార్రఫ్ చెప్పారు. అమెరికా ఇచ్చిన నిధులతోనే ఉగ్రవాదంపై పోరాడామనీ, పాక్లో పేదరికాన్ని తగ్గించామని చెప్పారు. తాము నిధుల్ని ఉగ్రవాదంపై పోరాటం కోసం ఇచ్చామనీ, పేదరిక నిర్మూలనకు కాదని అమెరికా చట్టసభ్యులు ఘాటుగా స్పందించారు. ‘అబోటాబాద్లో లాడెన్ ఆచూకీ తెలుసుకోకపోవడం ఐఎస్ఐ నిర్లక్ష్యమే. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కూడా 2001, సెప్టెంబర్ 11న ఉగ్రదాడుల విషయంలో ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది’ అని తెలిపారు. 2012 తర్వాత తీసినట్లు భావిస్తున్న ఈ వీడియోను ముషార్రఫ్ వ్యతిరేకి అయిన కాలమిస్టు గుల్ బుఖారీ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. 2001–08 మధ్యకాలంలో పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషార్రఫ్, అభిశంసన నుంచి తప్పించుకునేందుకు రాజీనామా చేశారు. చికిత్స పేరుతో దుబాయ్ వెళ్లిన ముషార్రఫ్ మళ్లీ పాక్కు రాలేదు. 2007లో రాజ్యాంగాన్ని రద్దుచేయడంతో ముషార్రఫ్పై దేశద్రోహం కేసు నమోదైంది. -
ముషార్రఫ్ వైఖరి సరైనదే: కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ : కశ్మీర్ స్వాతంత్ర్యంపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలవడానికి ఇష్టపడటం లేదు.. వారు కోరుకునేది స్వాతంత్ర్యమేనని ముషార్రఫ్ అన్నారు. నేను కూడా తొలి నుంచి అదే చెబుతున్నాను. ఈ విషయాన్ని 2007లో ముషార్రఫ్ పాక్ మిలటరీ అధికారులతోను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోని కొందరితో పంచుకున్నారు. కానీ అది సాధ్యపడదనే విషయం నాకు తెలుసున’ని తెలిపారు. సోజ్ రచించిన ‘గ్లిమ్ప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్’ పుస్తకం ఈ నెల 25 విడుదల కానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన పుస్తకం గురించి మాట్లాడుతూ.. కార్గిల్ యుద్దంలో ఓడిన తర్వాత.. తన లక్ష్యాన్ని చేధించడంలో ముషార్రఫ్ విఫలమయ్యారని తెలిపారు. ఆ తర్వాత కశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారని అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి కాలంలో జరిగిన లాహోర్ డిక్లరేషన్తో కశ్మీర్ ప్రజల ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. కాగా, సోజ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. సైఫుద్దీన్ లాంటి నాయకుడు ఈ విధంగా మాట్లాడటం బాధ కలిగించిదన్నారు. భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గులాం నబీ ఆజాద్ కూడా భారత ఆర్మీని అప్రతిష్టపాలు చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన కూడా సోజ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. -
పిరికివాడిని కాదు : మాజీ అధ్యక్షుడు
కరాచీ: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తిరిగి తన సొంత దేశం రావాలని ప్రయత్నిస్తున్నారు. జూన్ 25న దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ పాక్ సుప్రీంకోర్టు తనను ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తాను పాక్కు తిరిగి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ముషార్రఫ్ భావించారు. ఇటీవల పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే పాక్కి తిరిగి రావచ్చని షరతులతో కూడిన అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. మొదట తన ముందు హాజరైన తరువాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సకిబ్ నసీర్ పేర్కొన్నారు. తనను స్వదేశం రప్పించి అరెస్ట్ చేసేందుకే సుప్రీంకోర్టు ఆ సందేశం పంపిందని ముషార్రఫ్ వ్యాఖ్యానించారు. తనకు పాక్ రావాలని ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ అంశంపై మాట్లాడుతూ.. పోటీ చేసేందుకు తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ తరఫున రెండు స్థానాల్లో నామినేషన్ పత్రాలను సమర్పించానని, ఎన్నికల అధికారి వాటిని తిరిస్కరించారని తెలిపారు. తాను పిరికివాడిని కాదని ప్రపంచం మొత్తం తెలుసునని, త్వరలోనే దేశానికి తిరిగి వస్తానని ముషార్రఫ్ పేర్కొన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముషార్రఫ్ 2016లో దేశం విడిచి వెళ్లి రహస్యంగా దుబాయ్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. -
నీకసలు సిగ్గుందా.?
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ నిప్పులు చెరిగారు. రెహమ్ ఖాన్ ఆత్మకథ ‘టెల్-ఆల్’ నుంచి లీకైన కొన్ని వాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఓ మహిళవై ఉండి ఇలాంటి రాతలు రాయడానికి సిగ్గుండాలని ఖలీజ్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్) ట్వీట్ చేయగా ముషార్రఫ్ రీట్వీట్ చేశారు. ‘రెహమ్ ఖాన్ను పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (పీఎంఎల్ఎన్) తమ ఎజెండా కోసం ఉపయోగించుకుంటుంది. వాట్సాప్లో ఆమె పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలను చదివాను. ఇలాంటి రాతలు రాయడానికి ఆమెకు సిగ్గుండాలి. ఇలాంటి చెత్త రాతలను ప్రత్యేకించి మహిళలు రాయకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. Retweeted APML (Official) (@APMLOfficial_): Reham khan is being used by PMLN i have read some content in whatsapp messages she should be quite ashamed of herself you don't write such things and specially a lady... https://t.co/QIgKIbZvVv — Pervez Musharraf (@P_Musharraf) June 15, 2018 మహిళలు ఏం మాట్లాడాలి? ముషర్రాఫ్ వ్యాఖ్యలపై రెహమ్ ఖాన్ ఘాటుగా స్పందించారు. మరీ మహిళలు ఏం మాట్లాడాలో నిర్ణయించేది ఎవరని ప్రశ్నించారు. ‘ముషర్రాఫ్ చేసిన ట్వీట్ ఎలా ఉందంటే.. మహిళలు ఏం మాట్లాడవద్దు. పురుషులు ఏం చేసినా సహిస్తూ.. గమ్మునుండాలి. మహిళలు ఏం రాయాలి, ఏం మాట్లాడాలి అని నిర్ణయించాడానికి వీళ్లేవరు. ఇది చాలా తప్పు’ అని ఈ మాజీ జర్నలిస్టు మండిపడ్డారు. పీఎంఎల్ఎన్ పార్టీతో తనకు సంబంధం ఉన్నట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘నాకు నవాజ్ షరీఫ్ పార్టీ (పీఎంఎల్ఎన్)తో ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన చాలా ధృడమైన వ్యక్తి. వారి ఎజెండాలో భాగంగా నా పుస్తకం రావడం లేదు. ఇంకా నా పుస్తకం విడుదల కూడా కాలేదు. వారి ఎజెండా ప్రకారం నేను నడుచుకోవడం లేదు.’’ అని ఆమె స్పష్టం చేశారు. రెహమ్ ఖాన్ తన పుస్తకంలో ఇమ్రాన్ ఖాన్ ఓ గే అని, పెళ్లికి ముందే తనను వేధించాడని.. మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ శృంగార అనుభవాల కోసం తన మాజీ, దివంగత సతీమణి ఓ నల్ల జాతీయుడితో సెక్స్ చేసేలా చేశాడని, ఆ తతంగాన్ని మొత్తం దగ్గరుండి చూశాడని పేర్కొనడం తీవ్ర దుమారాన్ని రేపింది. పుస్తకం విడుదల చేయడం వెనుక మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హస్తం ఉందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. పీటీఐ అధినేత ఇమ్రాన్ఖాన్ ఈ పుస్తకాన్ని పాకిస్తాన్లో విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోర్టును సైతం ఆశ్రయించారు. చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఓ గే! -
ముషార్రఫ్కు షాక్ ఇచ్చిన పాక్ సుప్రీం కోర్టు
లాహోర్ : పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్కు భారీ షాక్ ఇచ్చింది. అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు షరుతులతో కూడిన అనుమతినిచ్చిన కోర్టు గురువారం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. 2013లో పెషావర్ హైకోర్టు ముషార్రఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న ముషార్రఫ్ 2016 నుంచి దుబాయ్లోనే ఉంటున్నాడు. తనపై నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా ముషారఫ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జూలై 25న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతవారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అలాగే జూన్ 13వ తేదీన కోర్టు ముందు హాజరవ్వాలని ఆదేశించింది. దీంతో ముషార్రఫ్ ఈ సారి ఎన్నికల్లో చిత్రాల్ నుంచి పోటీ చేసేందుకు దుబాయ్ నుంచే నామినేషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు ముషార్రఫ్ బుధవారం కోర్టుకు హాజరుకాకపోవడంతో అతని లాయర్ మరింత సమయం ఇవాల్సిందగా కోర్టుకు అభ్యర్థించడంతో.. న్యాయమూర్తి ముషారఫ్కు గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇచ్చారు. అయిన కూడా ముషారఫ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఇక నుంచి పాకిస్థానీ కాదు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ నియంతాధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్కు భారీ షాక్ తగిలింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి రానున్నట్లు ప్రధాని నసీర్ ఉల్ ముల్క్ ప్రకటించారు. ఈ మేరకు నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్పోర్టు డైరెక్టోరేట్ కార్యాలయాల నుంచి ప్రకటన వెలువడింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన జాతీయత గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాస్పోర్టు కూడా ఆటోమేటిక్గా రద్దైపోతుంది. ముషర్రఫ్ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీల నిలుపుదల ఉద్దేశంతోనే కోర్టు ఇది వరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న ముషర్రఫ్కు.. తాజా ఆదేశాలు ఇబ్బందికరంగా మారొచ్చు. పాస్పోర్టు రద్దుతో దుబాయ్లో ఆయన చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే కేసుల విచారణ ఎదుర్కుంటున్న ఆయన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాక్కు రప్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక డాక్యుమెంట్ల ద్వారా ఆయన్ని పాక్కు రప్పించనున్నారు. ముషర్రఫ్ కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది కూడా. 2007లో అత్యవసర పరిస్థితి విధించటం, సుప్రీం కోర్టు జడ్జిల గృహనిర్భందం, రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా వ్యవహరించటం, తదితర ఆరోపణలపై ముషర్రఫ్ ‘దేశ ద్రోహం’ కేసును ఎదుర్కుంటున్నారు. 2016లో చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ముషర్రఫ్.. త్వరలో జరగబోయే పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. -
ముషార్రఫ్కు భారీ షాక్; పాస్పోర్టు రద్దు..!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్కు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన పాస్పోర్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజ్యద్రోహం కేసులో కోర్టుకు హాజరవ్వనందుకు ప్రత్యేక న్యాయస్థానం ముషార్రఫ్ పాస్పోర్టును రద్దు చేయాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ముషార్రఫ్ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా అత్యవసర పాలన విధించినందుకు అతనిపై రాజ్యద్రోహం కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ముషరాఫ్ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీలు జరపకుండా ఉండాలనే లక్ష్యంతోనే కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ డేటా బేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్పోర్టు డైరెక్టరేట్ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించాయి. కోర్టు ఆదేశాలు అమల్లోకి వస్తే ముషార్రఫ్ ఇతర దేశాలకు వెళ్లే అవకాశంతో కొల్పోవడంతోపాటు, బ్యాకింగ్ సేవలను వినియోగించుకోలేరు. -
‘వారిని అమెరికాకు అమ్మేశారు’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్పై మాజీ న్యాయమూర్తి జావేద్ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలాది పాకిస్తానీలను ముషారఫ్ అమెరికాకు విక్రయించారని ఇక్బాల్ వెల్లడించడం కలకలం రేపింది. పాక్ జాతీయ అసెంబ్లీ మానవ హక్కుల స్టాండింగ్ కమిటీ ఎదుట గల్లంతైన వ్యక్తుల కమిషన్కు సారథ్యం వహించే ఇక్బాల్ ఈ వివరాలు వెల్లడించారు. డాలర్ల కోసం ముషారఫ్ 4000 మంది పాకిస్తానీలను అమెరికాకు అప్పగించారని అంటూ దీన్ని రహస్య అప్పగింతగా ఆయన అభివర్ణించారు. బెలూచిస్తాన్ ప్రాంతంలో స్ధానికుల గల్లంతు అంశం పాక్ ప్రభుత్వానికి సవాల్గా మారిన నేపథ్యంలో ఇక్బాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముషరఫ్ చర్యలు అక్రమం, చట్టవిరుద్ధమని దీనిపై తదుపరి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టాల కళ్లుగప్పి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తానీలను రహస్యంగా ఇతర దేశానికి కొందరు ఎలా అప్పగిస్తారని ఇక్బాల్ ప్రశ్నించారు. ముషారఫ్ చర్యలను అప్పటి ప్రభుత్వంలో పార్లమెంటేరియన్లు ఎవరకూ ప్రశ్నించకపోవడం గమనార్హం. గల్లంతైన వ్యక్తుల అంశం పాక్ సుప్రీంకోర్టులో ఏళ్లతరబడి నానుతూనే ఉంది. -
నాకు ముషారఫ్ వార్నింగ్ ఇచ్చారు: గంగూలీ
కోల్కతా: తన ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లో ఇప్పటికే పలు విషయాల్ని వెల్లడించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అది కూడా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్..తనను ఫోన్లో మందలించిన సంగతిని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. దాదాపు 15 ఏళ్ల క్రితం పాకిస్తాన్ పర్యటనలో సెక్యూరిటీకి చెప్పకుండా తాను బయటకు వెళ్లిన విషయం ముషారఫ్కు తెలియడం, ఆపై అతనే స్వయంగా కాల్ చేసి ఇక ఎప్పుడూ అలా చేయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గంగూలీ షేర్ చేసుకున్నాడు. 2004లో పాకిస్తాన్ పర్యటన సందర్బంగా ఇది చోటు చేసుకున్నట్లు గంగూలీ తెలిపాడు.ఆ పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. అదే సమయంలో పాకిస్తాన్పై ఆ దేశంలో టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్గా గంగూలీ ఘనత సాధించాడు. ఆ పర్యటనకు సంబంధించి గంగూలీ ఆత్మకథలో పలు విషయాల్ని ప్రస్తావించారు. ‘ఆ పర్యటన ముగిసిన తర్వాత లాహోర్ వీధుల్లో కాసేపు అలా బయటకు వెళ్లాలనుకున్నాం. కబాబ్స్, తందూరీ వంటకాలకు పేరుగాంచిన గవాల్మండి అనే ఫుడ్స్ర్టీట్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. నేను కూడా సరదాగా బయటకు వెళ్లాలనుకున్నా. కానీ, మేం బస చేసింది అత్యంత పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉన్న లాహోర్ స్విష్ పెర్మ్ కాంటినెంటల్ హోటల్లో. మా భద్రతా అధికారికి చెబితే వద్దంటాడని తెలుసు. అందుకే, మా టీమ్ మేనేజర్ చెప్పి హోటల్ బయటి తలుపునుంచి బయటకొచ్చా. నన్నెవరూ గుర్తు పట్టకుండా ముఖాన్ని కవర్ చేశా. అంతలోనే ఒక వ్యక్తి నన్ను గుర్తు పట్టి మీరు సౌరవ్ గంగూలీ కదా? అని ఆడిగాడు. నేను నా గొంతును మార్చి కాదని చెప్పా. సరే అంటూనే అతను.. మీరు అచ్చం గం గూలీలానే ఉన్నారన్నా డు. ఎలాగోలా అనుకున్న చోటుకు చేరుకున్నాం. కానీ, తిరుగు ప్రయాణంలో వెనకాలే ఒక వ్యక్తి కారు దగ్గరకు వచ్చి కారు అద్దం దించాలని కోరాడు. అతను బాంబు విరుతాడేమోనని భయపడి అద్దం దించొద్దని నా సహచరుడు వారించాడు. అయితే, ఆ వ్యక్తి చేతు లు చాచి 'నేను మీకు పెద్ద అభిమానిని. పాకిస్థాన్కు మీ లాంటి నాయకుడు కావాలి’ అంటూ అరుస్తున్నాడు. దాంతో ఊపిరి పీల్చుకొని.. మేం సురక్షితంగా హోటల్ చేరుకున్నాం. ఆ వార్త అప్పటికే ఆ దేశాధ్యక్షుడి ఉన్న ముషార్ఫ్కు తెలిసింది. దాంతో, ఆయన నాకు కాల్ చేశారు. ఈ సారి మీరు బయటకు వెళ్లాలనుకుంటే భద్రతా సిబ్బందికి చెప్పండి. మీకు రక్షణగా వస్తారు. కానీ, దయచేసి ఇలా సాహసాలు చేయకండని ముషారఫ్ హెచ్చరించారు' అని గంగూలీ ఆత్మకథలో చెప్పుకొచ్చాడు. -
‘ట్రంప్ మాటలను పట్టించుకోకండి’
ఇస్లామాబాద్ : అమెరికా-పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతున్న దశలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. పాక్లో అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ చీఫ్ అయిన నవాజ్.. ట్రంప్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని కొట్టి పారేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను నిలబెట్టేందుకు వ్యూహత్మకంగా వ్యవరించాలని ప్రభుత్వానికి సూచించారు. ట్రంప్ సహాయ నిధుల నిలిపివేత వ్యాఖ్యలపై షరీఫ్ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదంపై పోరులో సంకీర్ణ సేనలకు మిత్రదేశంగా పాకిస్తాన్ వ్యవహరించింది. అదే సమయంలో సంకీర్ణ భాగస్వామిగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో పాక్కు అమెరికా ఇచ్చిన నిధులు సహాయం ఎలా అవుతాయ’ని ప్రశ్నిచారు. ఈ నిధులు కేవలం సంకీర్ణ బాగస్వామ్యం, సైనిక అవసరాల కోసం మాత్రమే అగ్రరాజ్యం ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ ఏ దేశం నుంచి ఉదారవాద నిధులు అందుకోవాల్సిన పరిస్థితిలో పాక్ లేదని చెప్పారు. ఇదిలావుండగా మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్పైనా ఆయన విరుచుకుపడ్డారు. దేశంనుంచి పారిపోయిన ఒక వ్యక్తి.. నేడు అంతర్జాతీయ సమాజం ముందు దేశ గౌరవాన్ని కించ పరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మగౌరవాన్ని అమెరికాకు తాకట్టుపెట్టింది ఆయనేనని విమర్శించారు. -
మోదీ దౌత్యం.. పాక్కు శాపం
ఇస్లామాబాద్: అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కొనసాగించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారని పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అభిప్రాయపడ్డారు. మోదీ దౌత్యనీతి తమ దేశానికి శాపంగా మారిందని ముషారఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ అనుసరించిన విధానాలు.. పాక్ను అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టాయని అన్నారు. పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అంతర్జాతీయ దౌత్య విధానాలు అవలంభించడంలో మోదీతో తమ నేతలు పోటీపడలేకపోయారని అన్నారు. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం నిష్క్రియా పరమైన దౌత్య విధానాలను అనుసరిస్తోందన్నారు. ప్రణాళిక లేని దౌత్య విధానాల వల్ల అంతర్జాతీయ ప్రపంచం నుంచి పాకిస్తాన్ దూరం జరిగిందని అన్నారు. ‘పాకిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉందా? మన దౌత్య విధానం భారత ప్రధాని నరేంద్ర మోదీ కన్నా దూకుడుగా ఉందా? నరేంద్ర మోదీ అంతర్జాతీయంగాక్త మన దేశాన్ని ఏకాకి చేయడం నిజం కాదా? ఇప్పటివరకూ కులభూషన్ జాదవ్ను గూఢచారిగా భారత్ గుర్తించలేదు.. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మాత్రం లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా ఎందుకు గుర్తించింద’ని ముషారఫ్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దూకుడుతో కూడిన దౌత్య విధానాలను పాకిస్తాన్ పాలకులు అనుసరించలేకపోవడం వల్ల నేడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నారు. -
'నువ్వొక పిరికిపందవు.. దమ్ముంటే రా..'
లాహోర్ : పాకిస్థాన్ పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ ఆర్మీ మాజీ చీఫ్ పర్వేజ్ ముషార్రఫ్పై నిప్పులు చెరిగారు. ఆయన ఓ పెద్ద పిరికిపంద అన్నారు. వెంటనే న్యాయ వ్యవస్థ అతడిని వెనక్కు రప్పించి అతడు చేసిన నేరాలన్నింటికి శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ముషార్రఫ్ రాజద్రోహానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2007 నవంబర్లో పాక్లో అత్యవసర పరిస్థితి విధించి ఆయన తప్పు చేశారని, రాజద్రోహానికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో ఆయన న్యాయమూర్తులను సైతం అరెస్టు చేయించడమే కాకుండా వారి అధికారాలను కూడా కుదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే నిజమని తేలితే ముషార్రఫ్కు ఉరి శిక్ష పడుతుంది. 'అనారోగ్యం పేరుతో దుబాయ్ వెళ్లి అక్కడే ఉంటున్న ముషార్రఫ్ను వెంటనే వెనక్కు రప్పించాలి. అతడో పెద్ద పిరికిపంద. విదేశాల్లో దాక్కుంటున్నాడు. అతడికి ఏమాత్రం ధైర్యం ఉన్న పాక్లో అడుగుపెట్టి అతడిపై ఉన్న కేసులు ఎదుర్కోవాలి' అని షరీఫ్ను డిమాండ్ చేశారు. -
ఉగ్రసంస్థలపై ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు
కరాచీ : ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబా సంస్థలు.. దేశబక్తికి మారుపేరని ముషారఫ్ అన్నారు. దేశభద్రత కోసం లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముషరాఫ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గతంలోనే ఒక ఇంటర్వ్యూలో.. లష్కే తోయిబా, జమాతే ఉద్ దవాలకు తాను పెద్ద అభిమానిని అని ప్రకటించిన విషమం తెలిసిందే. లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలో పనిచేసే వాళ్లంతా.. దేశభక్తులేనని ముషారఫ్ అభివర్ణించారు. వారంతా పాకిస్తాన్ కోసమే జీవిస్తున్నారని.. పాకిస్తాన్ కోసమే మరణిస్తున్నారని ఆయన అభివర్ణించారు. లష్కే తోయిబా, జమాతే సంస్థలు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే.. ఎవరైనా ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ముషారఫ్ అన్నారు. వారితో పొత్తు పెట్టుకోవడానికి, కలిసి పనిచేయడానికి నేను సిద్దంగా ఉన్నాను.. ఈ విషయంపై వారు నాతో ఇంకా సంప్రదించలేదని చెప్పారు. ఒక వేళ వారు ముందుకు వస్తే.. నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. నాలో ఉదారవాద భావాలు ఉన్నప్పటికీ.. మతపరమైన అంశాలను ద్వేషించనని చెప్పారు. కశ్మీర్లో తీవ్రవాద చర్యలను తానెప్పుడూ సమర్ధిస్తాననే ముషారఫ్ ప్రకటించడం గమనార్హం. -
హఫీజ్ సయీద్తో పొత్తుకు సిద్ధమే!
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్కు ఇటీవలే జై కొట్టిన పాక్ మాజీ మిలటరీ రూలర్.. తాజాగా మరో అడుగు ముందుకేశారు. వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్తో పొత్తు సిద్దమని ముషారఫ్ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పాకిస్తాన్లోని ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. ‘పొత్తు విషయమై నేను వారితో మాట్లాడలేదు, అయితే వారు ముందుకుకొస్తే అహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముషారఫ్ చెప్పారు. గత నెల్లో పాకిస్తాన్లోని 23 పార్టీలతో కలిపి అవామీ ఇత్తేహాద్ కూటమిని ముషారఫ్ ప్రకటించారు. అయితే కొద్ది రోజుల్లోనూ కూటమి కకావికలైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యే ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు అతిపెద్ద మద్దతుదారుడిని అని ప్రకటించి సంచలనం సృష్టించారు. ముంబై దాడుల తరువాత హఫీజ్ సయీద్ని అమెరికా సైతం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని తలమీద 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. పాకిస్తాన్లోని పలు మతసంస్థలపై హఫీజ్ సయీద్ పట్టుసాధించాడు. హఫీజ్ సయీద్ ఉగ్రవాది కాదని.. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితా నుంచి హఫీజ్ సయీద్ పేరును తొలగించాలని ముషారఫ్ కోరారు. -
ముషారఫ్ ఒక అంతర్జాతీయ ఉగ్రవాది
వాంకోవర్ (కెనడా) : పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని వరల్డ్ బలూచ్ ఉమెన్ ఫోరమ్(డబ్ల్యూబీడబ్య్లూఎఫ్) డిమాండ్ చేసింది. ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న ముషారఫ్ పాకిస్తాన్ న్యూస్ చానల్తో మాట్లాడిన విషయాలను ఐక్యరాజ్యసమితి పరిగణలోకి తీసుకుని.. ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డబ్ల్యూబీడబ్య్లూఎఫ్ నాయకురాలు ప్రొఫెసర్ నీలా ఖాద్రి బలూచ్ డిమాండ్ చేశారు. కశ్మీర్లో మారణహోమాన్ని సృష్టిస్తున్న లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవా సంస్థలంటే అభిమానమని.. అలాగే హఫీజ్ సయీద్కు మద్దతుదారుడినని చెప్పడం ద్వారా ముషారఫ్ ఉగ్రవాదాన్ని సమర్థించారని ఆమె అన్నారు. ముషారఫ్ మాట్లాడిన మాటలను సాక్ష్యాలుగా తీసుకుని లష్కరో తోయిబా, జమాతే ఉద్ దవాను ఉగ్రసంస్థలుగా ప్రకటించడంతో పాటు.. ముషారఫ్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఆమె అమెరికాను కోరారు. లష్కరే తోయిబా ఏర్పాటు, విస్తరణ, రిక్రూట్మెంట్లు, ఉగ్రదాడులకు ముషారఫ్ అందించిన సహకారంపై అమెరికా పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆమె అమెరికాను కోరారు. ఇదిలా ఉండగా ముషారఫ్ వ్యాఖ్యలను గమనిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. -
‘పాకిస్తాన్ది ఉగ్రవిధానం’
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాదం.. పాకిస్తాన్ దేశ విధానం అని చెప్పడానికి ఆదేశ మాజీ అధ్యక్షుడు ముషరాఫ్ వ్యాఖ్యలే నిదర్శనమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. లష్కేరే తోయిబా, హఫీజ్ సయీద్పై ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని ఆయన అన్నారు. లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్పై ముషారఫ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న ముషారఫ్.. పాకిస్తాన్లోని ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ.. లష్కరేతోయిబా, హఫీజ్ సయీద్కు తాను అభిమాననింటూ చెప్పుకున్నారు. అదే సమయంలో కశ్మీర్ వేర్పాటు వాదం, ఉగ్రవాదాలను సమర్థిస్తున్నట్లు ముషారఫ్ చెప్పుకోచ్చారు. ముషారఫ్ ఇంటర్వ్యూపై రాథోర్ ట్విటర్లో స్పందించారు. పాకిస్తాన్.. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా అనుసరిస్తున్నట్లు అనిపస్తోందని రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ట్వీట్ చేశారు. Pervez Musharraf has openly endorsed terror as state policy, says @Ra_THORe https://t.co/X59vAmqwUj — Rajyavardhan Rathore (@Rathore_Fans) November 30, 2017 -
‘హఫీజ్పై ఆధారాలుంటే చూపండి’
న్యూఢిల్లీ : ముంబూ దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ని ఆయన అల్లుడు వెనుకోసుకొచ్చాడు. ముంబూ దాడులకు సంబంధించి భారత్ వద్ద ఆధారాలుంటే బయటపెట్టాలని హఫీజ్ సయీద్ అల్లుడు వాలీద్ డిమాండ్ చేశారు. లష్కరే తోయిబా, హఫీజ్ సయీద్ భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నట్లు రుజువులు ఉంటే ప్రపంచం ముందూ చూపించిండి.. అవి లేకుంటే మా మీద పడి ఏడవడం మానుకోండి.. అని వాలీద్ భారత్కు చెప్పారు. పాకిస్తాన్, హఫీజ్ సయీద్ విషయంలో భారత్ ప్రతిసారి అమెరికా భుజాల మీద పడి ఏడవడం పరిపాటిగా మారిందన్నారు. భారత్ ఒత్తిడికి తగ్గట్లే అమెరికా కూడా ప్రవర్తిస్తోందని చెప్పారు. అందులో భాగంగానే హఫీజ్ సయీద్ను మరోసారి గృహనిర్భంధంలో ఉంచాలని అమెరికా డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే హఫీజ్ సయీద్కు అనుకూలంగా మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరాఫ్ సహా పలుపురు రాజకీయ నేతలు మద్దతు ప్రకటించారు. -
హఫీద్ సయీద్ అంటే నాకిష్టం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ సంచలన విషయాలను ప్రకటించారు. తనకు జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, లష్కరే తోయిబా ఏర్పాటులో కీలకంగా వ్యహరించిన హఫీజ్ సయీద్ అంటే ఇష్టమని ప్రకటించారు. కశ్మీర్ వేర్పాటువాదులకు సహకారం అందించడం.. ఆ ప్రాంతంలో జిహాద్, ఉగ్రదాడులకు కారణమవుతున్న హఫీజ్ సయీద్ పట్ల అభిమానం ఉందని ముషారఫ్ ప్రకటించారు. ‘నాకు హఫీజ్ సయీద్ అంటే చాలా ఇష్టం. కశ్మీర్లో వేర్పాటు వాద కార్యక్రమాలకు ఆయన స్థాపించిన జమాత్ ఉద్ దవా ముందుకు నడిపిస్తోంద’ని పాకిస్తాన్లోని ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ముషారఫ్ చెప్పారు. లష్కరే తోయిబాను కూడా పూర్తిగా సమర్థిస్తున్నట్లు ముషారఫ్ స్పష్టం చేశారు. నేను సమర్ధిస్తా! భారత్ నుంచి కశ్మీర్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా, జీహాద్ను పూర్తిగా సమర్థిస్తున్నట్లు ముషారఫ్ తెలిపారు. అంతేకాక తాను అధికారంలో ఉన్న సమయంలో హఫీజ్ సయీద్తో పలుమార్లు భేటీ అయినట్లు వెల్లడించారు. సైనిక చర్యకు నేను అనుకూలమే! జమ్మూకశ్మీర్పై సైనిక చర్యకు ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉన్నట్లు ముషారఫ్ ప్రకటించారు. భారత సైన్యం చాలా శక్తివంతమైనది.. ఆ సైన్యాన్ని ఎదుర్కోవడం క్లిష్టమని ఆయన తెలిపారు. అదే సమయంలో కశ్మీర్లో లష్కరే తోయిబా సమర్థవంతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అమెరికా సహకారంతో భారత్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంలో సఫలమైందన్నారు. ముంబై దాడుల్లో హఫీజ్ హస్తం లేదు! భారత్ను కుదిపేసిన 26/11 ముంబై దాడుల సూత్రధారిగా హఫీజ్ సయీద్ను పేర్కొనడాన్ని ముషారఫ్ తప్పు పట్టారు. ఆ దాడులకు జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబాకు సంబంధం లేదని కూడా ఆయన చెప్పారు. హఫీజ్ సయీద్ను ఉగ్రవాదిగా పిలిచేందుకు పాకిస్తాన్లో ఎవరూ ఇష్టపడరని ముషారఫ్ తెలిపారు. I am the biggest supporter of LeT and I know they like me & JuD also likes me: Pervez Musharraf to Pakistan's ARY News, also said 'yes' on being asked if he likes Hafiz Saeed, added that, 'I have met him (Hafiz Saeed)' pic.twitter.com/txxT58oPoU — ANI (@ANI) November 29, 2017 -
ముషార్రఫ్ సంచలన ఆరోపణలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, నియంత పర్వేజ్ ముషార్రఫ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ పాకిస్థాన్ సహ చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీపై సంచలన ఆరోపణలు చేశారు. జర్దారీ భార్య బెనజీర్ భుట్టో హత్యలో జర్దారీకి కూడా భాగస్వామ్యం ఉందని, ఆమె హత్యకు అసిఫ్ అలీ జర్దారీ హస్తం ఉందన్నారు. ఆమె సోదరుడు ముర్తాజ భుట్టో చావుకు కూడా జర్దారీ కారణం అన్నారు. రావల్పిండిలో 2007 డిసెంబర్ 27న బెనజీర్ భుట్టోపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె మృత్యువాత పడ్డారు. అయితే, ఆగస్టు 31న యాంటీ టెర్రరిజం కోర్టు ముషార్రఫ్ పాత్ర కూడా ఈ హత్యలో ఉందంటూ ఆరోపించింది. అదే సమయంలో సాక్ష్యాధారాలు లేవని ఓ ఐదుగురు నిందితులను విడిచిపెట్టింది. ఇక బెనజీర్ భుట్టో ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆమె సోదరుడు ముర్తాజా 1996లో కరాచీలో హత్యకు గురయ్యారు. ఆ హత్య ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముషార్రఫ్ భుట్టో కుటుంబానికి సంబంధించి మాట్లాడుతూ ’భుట్టో కుటుంబంలో జరిగిన దుర్ఘటనలన్నింటికి ఒక వ్యక్తే కారణం అదే జర్దారీ. బెనజీర్ భుట్టో, ఆమె సోదరుడు ముర్తాజా భుట్టో హత్యకు కారణం జర్దారీనే’ అంటూ ఆయన భుట్టో జర్దారీ ముగ్గురు పిల్లలకు వీడియో ద్వారా ఈ సందేశం చెప్పారు. భార్య చనిపోయినా ఏమీ పట్టించుకోని జర్దారీ పదవీ కాలాన్ని మాత్రం ఐదేళ్లపాటు దర్జాగా అనుభవించారని ఆరోపించారు. -
ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడు
-
ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడు
► భుట్టో హత్య కేసులో నిర్థారించిన పాకిస్తాన్ కోర్టు ► ఆస్తుల స్వాధీనానికి ఆదేశం ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసుకు సంబంధించి ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడని పాక్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీర్పుచెప్పింది. ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. భుట్టో హత్య జరిగిన పదేళ్ల తర్వాత వెలువరించిన తీర్పులో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులకు 17 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. భుట్టో 2007 డిసెంబర్ 27న హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతం తర్వాత కేసు నమోదు కాగా.. విచారణ సందర్భంగా అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. పదేళ్ల కాలంలో వివిధ కారణాల వల్ల ఎనిమిది మంది జడ్జీలు ఈ కేసును విచారించారు. చివరికి రావల్పిండి కోర్టు కేసు విచారణను బుధవారం ముగించింది. ఈ కేసులో తీర్పు వెలువరించిన జడ్జి అస్గర్ ఖాన్.. ముషారఫ్ పరారీలో ఉన్న నేరస్తుడని ప్రకటించారు. వైద్య చికిత్సల నిమిత్తం గత ఏడాది పాకిస్థాన్ విడిచి వెళ్లిన ముషారఫ్ అప్పటి నుంచి దుబాయ్లోనే ఉంటున్నారు. రావల్పిండి మాజీ సీపీవో సాద్ అజీజ్, రావల్ టౌన్ ఎస్పీ ఖుర్రమ్ షెహజాద్ను దోషులుగా ప్రకటించింది. వారికి ఒక్కొక్కరికీ 17 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ 5 లక్షల జరిమానా విధించింది. -
ఔను! దావూద్ పాకిస్థాన్లోనే ఉన్నాడు!
భారత్కు ఎందుకు అప్పగించాలి? లాహోర్: పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే ఉన్నాడని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఓ పాకిస్థాన్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ముషార్రఫ్.. దావూద్ను అప్పగించాలన్న భారత్ డిమాండ్పై స్పందించారు. 'భారత్ చాలాకాలంగా పాక్పై ఆరోపణలు చేస్తోంది. ఎందుకు ఇప్పుడు మనం మంచివారిగా మారి వారికి సహకరించాలి? దావూద్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అతను తప్పక ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు. భారత్ ముస్లింలను చంపేస్తోంది. దానిపై దావూద్ ప్రతిస్పందిస్తున్నాడు' అని అన్నారు. పాక్ ఆశ్రయంలోనే దావూద్ ఉన్నాడన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. కరాచీలోని ఓ విలాసవంతమైన భవనంలో దావూద్ దర్జాగా జీవిస్తున్నాడని భారత్ అనేకసారి ఆధారాలతో పేర్కొన్నా.. పాక్ మాత్రం అతను తమ దేశంలో లేడని బుకాయిస్తోంది. గత పదేళ్లుగా ఈ విషయంలో ఎన్ని ఆధారాలు భారత్ సమర్పించినా.. పాక్ మాత్రం తన వాదన మార్చుకోవడంలేదు. ఒసామా బిన్ లాడెన్ కూడా పాక్లోనే తలదాచుకుంటున్నాడని భారత్ గతంలో ఆరోపించగా.. ఆ తర్వాత అమెరికా నేవీ సీల్స్ 2011లో అతన్ని హతమార్చిన సంగతి తెలిసిందే. -
ముషార్రఫ్కి మరో ఝలక్
లండన్: పాకిస్థాన్ మాజీ సర్వసైన్యాధక్షుడు, ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ వ్యవస్థాపకుడు పర్వేజ్ ముషార్రఫ్కి మరో పరాభవం ఎదురైంది. లండన్లోని ఓ యూనివర్సిటీలో ఆయన నేతృత్వంలో జరగాల్సిన ఓ చర్చా కార్యక్రమానికి అనుమతి నిరాకరించింది. పాకిస్థాన్కు చెందిన ఓ ప్రైవేట్ ఛానెల్ ఈనెల 24న ముషార్రఫ్తో ముఖాముఖిని ఏర్పాటుచేసింది . లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ విద్యాలయాన్ని వేదికగా ఎంచుకుంది. తనపై పడిన అనర్హత వేటుతోపాటు ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలపై ముషార్రఫ్ ప్రసంగించాల్సి ఉంది. ఇంతలో పలు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో యూనివర్సిటీ మేనేజ్మెంట్ వెనక్కి తగ్గింది. ‘‘ముషార్రఫ్పై నమోదైన అభియోగాల నేపథ్యంలో ఇంటర్వ్యూకు అనుమతించటం ద్వారా తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఒక రకంగా పాకిస్థాన్లో జరిగిన నేరాలకు, హింసకు మరియు మిలిటరీ తిరుగుబాటులకు ఈ విద్యాలయం పరోక్షంగా మద్ధతు తెలిపినట్లే అవుతుంది. అందుకే ఆయన ఇంటర్వ్యూకు అనుమతి నిరాకరించాలి’’ అని పలు ప్రగతిశీల గ్రూపులకు చెందిన పాకిస్థాన్ నేతలు ఎస్ఓఏఎస్ కు లేఖ రాశారు. ఆయన(ముషార్రఫ్) ప్రసంగిస్తే నిరసన తెలిపేందుకు ఓ మూడు సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. తద్వారా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఆయన కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నామని యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో ఈ కార్యక్రమంలో తన బుక్ను ముషార్రఫ్తో ఆవిష్కరింపజేయాలనుకున్న ఓ రచయిత కూడా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని సమాచారం. ఇంతకు ముందు నోబెల్ శాంతి సెంటర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ పాక్ మాజీ నియంత పాల్గొనగా, నిరసనలు వ్యక్తం కావటంతో కార్యక్రమం మద్య నుంచే ఆయన వెళ్లిపోయారు. -
పాక్లో నియంతల పాలనే బెస్ట్: ముషార్రఫ్
ఇస్లామాబాద్: తాను పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్పై అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న ఆలోచన వచ్చిందని, కానీ భారత్ ఎదురుదాడులకు దిగితే పరిస్థితి ఏంటని వెనక్కి తగ్గినట్లు ఇటీవల పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. బుధవారం బీబీసీ ఉర్దూ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి భారత్కు వ్యతిరేకంగా పాక్ మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యలుచేశారు. నియంతల (ఆర్మీ చీఫ్లు) పాలనలో భారత్పై పాక్ ప్రాబల్యం అధికంగా ఉండేదని, కానీ ప్రజల చేత ఎన్నుకైన ప్రభుత్వాల పాలనలో అంతా నాశనమైందని విమర్శించారు. ఆర్మీ చీఫ్లు ఫీల్డ్ మార్షల్ అయుబ్ ఖాన్, జనరల్ జియా ఉల్ హక్ల పాలనలో పాక్ సరైన మార్గంలో నడిచిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నవాజ్ షరీఫ్ భారత్తో సంబంధాలంటూ ఎన్నో అంశాలలో పైచేయి సాధించలేక పోయారన్నారు. షరీఫ్ పాలన అంతా అమ్ముకునే విధానాలేనని దుయ్యబట్టారు. జియా ఉల్ హక్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా, ముజాహిద్దీన్ సాయంతో సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా పోరాటం సాగించడం సాధ్యమైందన్నారు. డిక్టేటర్స్ పాలనలో ఉన్న ఆసియా దేశాలు ఎంతో ప్రగతి సాధించాయని అభిప్రాయపడ్డారు. 1999లో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆర్మీ తిరుగుబాటు ద్వారా కూలదోసి అధికారం హస్తగతం చేసుకోవడంపై స్పందించారు. ఆర్మీ చీఫ్ల పాలనలోనే తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని, వారి అభీష్టం మేరకు తాను తిరుగుబాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు చేత ఎన్నికైన నేతలు దేశాన్ని నాశనం చేయగా.. ఆర్మీ చీఫ్లు మాత్రం ప్రజల హక్కులను రక్షించినట్లు వివరించారు. 2001 నుంచి 2008 వరకు ముషార్రప్ అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన దుబాయ్లో తలదాచుకుంటున్నారు. -
భారత్పై అణుదాడి చేద్దామనుకున్నా
ముషార్రఫ్ వెల్లడి దుబాయ్: 2002 ఏడాదిలో భారత్పై అణ్వస్త్రాలను ప్రయోగించాలా వద్దా అన్నదానిపై తాను తీవ్రంగా ఆలోచించినట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇటీవల తెలిపారు. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో తనకు అణ్వాయుధాలను ప్రయోగించాలన్న ఆలోచన వచ్చిందనీ, కానీ భారత్ వైపు నుంచి ప్రతిదాడులు జరుగుతాయన్న భయంతో ఆగిపోయానని ముషార్రఫ్ ఓ జపాన్ పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన గుర్తుచేసుకున్నారు. అణ్వాయుధాలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించగా ‘అప్పటికి క్షిపణులు అణ్వస్త్రాలతో సిద్ధంగా లేవు. ఆదేశాలు ఇచ్చి ఉంటే మరో రెండు రోజులకు సిద్ధమయ్యేవి. కానీ క్షిపణులకు వార్హెడ్లను అమర్చాలన్న ఆదేశాలను కూడా నేను ఇవ్వలేదు’ అని ముషార్రఫ్ చెప్పారు. 1999 అక్టోబరులో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆర్మీ తిరుగుబాటు ద్వారా కూలదోసి 2001 నుంచి 2008 వరకు ముషార్రఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. వైద్య చికిత్సల నెపంతో పాకిస్తాన్ విడిచి వచ్చి ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు. -
మోదీపై ముషార్రఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ముంబైపై 2008లో ఉగ్రవాదులు దాడిచేసి 166 మందిని పొట్టనపెట్టుకున్న ఘటనలో జమాత్–ఉద్–దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర లేదని పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషార్రఫ్ తెలిపారు. పాకిస్తాన్ సయీద్ను అసలు ఉగ్రవాదిగా భావించడమే లేదన్నారు. సయీద్ గృహనిర్భంధంపై మీడియాతో మాట్లాడుతూ.. ‘హఫీజ్ సమస్య భారత్కే పరిమితం. దీని గురించి అమెరికాలో ఎవ్వరూ మాట్లాడర’ని స్పష్టం చేశారు. ప్రస్తుత భారత్–పాక్ సంబంధాలపై ముషార్రఫ్ స్పందిస్తూ, ఇరుదేశాల మధ్య శాంతిని పెంపొందించగల శక్తి ఒక్క నరేంద్ర మోదీకే ఉందని అభిప్రాయపడ్డారు. కానీ శాంతి నెలకొనడం ఆయనకు ఇష్టం లేదన్నారు. 2018లో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ముషార్రఫ్ ప్రకటించారు. తాను ప్రధాని కావాలనుకోవడం లేదని, మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నట్టు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తీసుకురావడంతో 68 ఏళ్ల సయీద్ను ఇంతకుముందు పాకిస్తాన్ 90 రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచింది. -
కశ్మీర్లో ‘వారిని’ మేనేజ్ చేశాం: ముషార్రఫ్
ఇస్లామాబాద్: కశ్మీర్లోని ‘స్వాతంత్య్ర సమరయోధుల’(కశ్మీర్ వేర్పాటువాదులు)కు తమ ప్రభుత్వం మద్దతుగా నిలబడిందనీ, వారికి అవసరమైన సహాయం చేసిందని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ సోమవారం చెప్పారు. కేవలం వారితోనే పని అవ్వదనీ, కశ్మీర్ సమస్య పరిష్కారంపై భారత్తో చర్చలకు రాజకీయ విధానం అవసరమని అనంతరం గుర్తించినట్లు తెలిపారు. భారత్ చర్చించడానికి కూడా ఇష్టపడని విషయాలపై రాజీ కుదుర్చుకునేందుకు తాము భారత్ను చర్చల వరకు తీసుకొచ్చామని ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్టపుకొచ్చారు. ప్రస్తుతం ముషార్రఫ్ దుబాయ్లో ఉంటున్నారు. -
‘అంతా టచ్లో ఉన్నారు.. మేం వస్తాం’
ఇస్లామాబాద్: చాలా కాలం తర్వాత పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ రాజకీయ అంశాన్ని మాట్లాడారు. తిరిగి తాను పాక్ రాజకీయాల్లో మెరవబోతున్నట్లు లీకులిచ్చారు. ఇప్పటికే తనతో పాక్లోని ప్రముఖ రాజకీయ నాయకులంతా తనకు అనుబంధంగానే ఉంటూ ఎప్పటికప్పుడు టచ్లో ఉంటున్నారన్న ఆయన త్వరలోనే పాక్లోకి మూడో రాజకీయ కూటమి వస్తుందని చెప్పారు. ఆ కూటమే పాక్ ప్రజల సమస్యలన్నింటిని తీరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన పార్టీ దేశ వ్యాప్త రాజకీయాల్లోకి ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వెళుతుందని, అతడు తీసుకురాబోమే ప్రగతి, సంస్కరణల అజెండాలను ప్రజలకు తెలియజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం పాక్ సంక్షోభంలో ఉందని, అందులో నుంచి బయటపడేయడమే తమ ముందున్న లక్ష్యం అని తెలిపారు. మంచి ప్రభుత్వాలు రాకుంటే పేదరికం అలాగే ఉండిపోతుందనే విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెబుతామని స్పష్టం చేశారు. -
'ఆర్మీ చీఫ్ నన్ను దేశం నుంచి తప్పించారు'
కరాచీ: కష్టకాలంలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ తనకు ఎంతో సాయం చేశారని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. రహీల్ షరీఫ్ వల్లే తాను దేశం నుంచి సురక్షితంగా బయడపడగలిగానని ఓ మీడియా టాక్ షో సందర్భంగా వెల్లడించారు. కోర్టులు, ప్రభుత్వం నుంచి తనపై ఒత్తిడి తగ్గించి, తనకు అండగా నిలబడ్డారని కొనియాడారు. షరీఫ్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టకముందు తాను ఆ పదవిలో కొనసాగానని, ఆ సమయంలో అతడికి తాను బాస్గా వ్యవహరించానని ముషార్రఫ్ గుర్తుచేసుకున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం వల్లే ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. షరీష్ ఆర్మీ చీఫ్ బాధ్యతల నుంచి గత నెలలో రిటైరైన విషయం తెలిసిందే. ఆయన తర్వాత ఖమర్ జావెద్ బజ్వా పాక్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా పాక్ లో ఏదైనా జరగాలంటే ప్రభుత్వానికి ఆర్మీ చీఫ్ సాయం ఆవశ్యకమని ఆర్మీ మాజీ బాస్ ముషార్రఫ్ పేర్కొన్నారు. పాక్ సుప్రీంకోర్టు తనపై విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించగా, షరీఫ్ జోక్యం చేసుకోవడంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా గత మార్చిలో తాను విదేశాలకు వెళ్లగలిగానని ముషార్రఫ్ వివరించారు. 2007లో ఎమర్జెన్సీ రూల్, జడ్జిలను అరెస్ట్ చేయడం వారి అధికారాలు తగ్గించడంపై ఆ తర్వాత కాలంలో చిక్కులు ఎదుర్కున్నారు. -
'ఆర్మీ చీఫ్ నన్ను దేశం నుంచి తప్పించారు'
-
చెరిగిపోతున్న అధీన రేఖ!
జాతిహితం 1989 కశ్మీర్ తిరుగుబాటును వాడుకుని పాక్ సిమ్లా ఒప్పందాన్ని చెత్తబుట్టలో పడేస్తే, భారత్ అదే పనిని ఇప్పుడు చేసింది. ఆ ఒప్పందం తర్వాత నాలుగు దశాబ్దాలకు పాక్ కశ్మీర్ను అసంపూర్తి వ్యవహారమంటుంటే.. భారత్ ఆ ఒప్పందాన్నే అసంపూర్తి వ్యవహార మని ఎందుకు పిలవకూడదు? అని మోదీ భావన. ఆయన ప్రభుత్వం యథాతథ స్థితిని భగ్నం చేయడంలోనే వ్యూహాత్మక, జాతీయ ప్రయోజనం ఉన్నదని భావిస్తోంది. అందువల్ల భారతమెరుపు దాడులు వాస్తవాధీన రేఖ అనుల్లంఘనీయతను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఆగ్రా శిఖరాగ్ర సమావేశం కోసం జనరల్ పర్వేజ్ ముషర్రాఫ్ భారత్లో జరిపిన పర్యటనకు సంబంధించిన ఆణిముత్యాల లాంటి స్మృతులలో ఒక దాన్ని ఎల్కే అద్వానీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆగ్రా సమావేశం వెలుపల ముషర్రాఫ్ ఆయనను మహా ఆర్భాటంగా మన సంబంధాలలో విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలంటే ఏం చేయాలని అడి గారు. మాతో నేర స్తుల అప్పగింత ఒప్పందంపై సంతకం చేసి, దావూద్ ఇబ్రహీంను వెనక్కు పంపండని అద్వానీ బదులిచ్చారు. స్వాతిశయంతో తనను తానొక మహా మేధావిగా భావించే వాచాలుడు ముషర్రాఫ్కు... ఒక వృద్ధ ‘పౌరుడు’ తనను ఇలా చిత్తు చేయడం నచ్చలేదు. ‘‘అద్వానీగారూ! మీరు ప్రయోగిస్తున్నది ఏమిటో తెలుసా, మేం దాన్ని సైన్యంలో చిన్న ఎత్తుగడ అంటాం’’ అన్నాడు బడాయిగా. పెద్ద, రాజకీయ, వ్యూహాత్మక సమస్యలను చర్చిద్దామని ఆయన అర్థం. కనీసం భారత్ దృష్టి నుంచే అయినా ఆయన అనుకున్నది తప్పు. కశ్మీర్లోని వాస్తవాధీన రేఖ వెంబడి/అవతల జరిగిన దాడుల తదుపరి భారత-పాకిస్తాన్ సంబంధాలు తిరిగిన ఈ తాజా మలుపునకు ఈ పరీక్షను అన్వయించి చూద్దాం. సెప్టెంబర్ 28-29 మధ్య రాత్రి కచ్చితంగా జరిగిందే మిటి, భారత కమాండోలు అధీనరేఖ నుంచి ఎంత లోపలికి చొచ్చుకుపో యారు, శత్రువుకు మరణాలు, ఆస్తుల ధ్వంసం రూపేణా కలిగించిన నష్టం ఎంత లేదా పాకిస్తానీల్లా ప్రశ్నిస్తే అసలు మనవాళ్లు ‘‘లోపలికి’’ వెళ్లారా, ‘‘చిన్న ఆయుధాలు’’ ప్రయోగించి ఇద్దరు పాక్ సైనికులను మాత్రమే కాల్చి చంపారా... ఇవన్నీ చిన్నవి, ఎత్తుగడలపరమైన విషయాలు. అయితే భారత్ ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ముఖ్యమైనది, వ్యూహాత్మకమై నది. అదే ఇక నుంచి భారత్-పాక్ సంబంధాలను పునర్నిర్వచిస్తుంది. భారత్ వైపు నుంచి యథాతథస్థితి కొనసాగింపునకు ముగింపును సంకేతిస్తుంది. ఎల్ఓసీ అంతర్జాతీయ సరిహద్దా? 1989లో కశ్మీర్ లోయలో సమస్య తిరిగి తలెత్తడం, 1993 ముంబై వరుస బాంబుదాడులు, ఉగ్రవాదం భారత ప్రధాన భూభాగంపై మొదటిసారిగా ప్రత్యక్షం కావడం వల్ల కొన్ని సూత్రాలు పుట్టుకొచ్చాయి. అవే ఏళ్ల తరబడి భారత ప్రతిస్పందనలను నిర్వచిస్తున్నాయి, నియంత్రిస్తున్నాయి. కశ్మీర్ సమ స్యను పాక్ ‘‘అంతర్జాతీయం’’ చేయాలని చేసే ఏ ప్రయత్నం పట్లయినా భారత్... మానసిక వైకల్యమనిపించేంతటి ఏహ్య భావాన్ని ప్రదర్శించడం, ‘‘ద్వైపాక్షికమైన’’ కశ్మీర్ సమస్య పాతదనీ అది 1972 సిమ్లా ఒప్పందంలో వేళ్లూనుకుని ఉన్నదని అనడం అందులో కొన్ని. దీనితో ముడిపడి ఉన్నదే సిమ్లా ఒప్పందం. అది, పాత కాల్పుల విరమణ రేఖ (సీఎఫ్ఎల్)ను వాస్తవా దీన రేఖ(ఎల్ఓసీ)గా పునర్నిర్వచించి, దానికి ఆచరణలో సరిహద్దు హోదాను ఇచ్చింది. దాని వెంబడే కశ్మీర్ విభజనను ధృవీకరించింది. ఇరుదేశాలు మరింత అనువైన సమయంలో దాన్ని లాంఛనంగా ఆమోదించాల్సి ఉంది. ఇరు పక్షాలూ 1989 వరకు చాలా నిజాయితీగానే దీన్ని గౌరవించాయి. 1984 వసంత కాలంలో భారత సేనలు సియాచిన్ గ్లేసియర్ (మంచు కొండలు) పైకి పోవడాన్ని కూడా వాస్తవాధీన రేఖ విభజించని భూభాగంలో మన ఉనికిని నెలకొల్పడంగానే మనం సమంజసమైనదన్నాం. అయితే పాక్ ఆ విషయాన్ని తీవ్రంగా సవాలు చేసింది, భారత్ను అక్కడి నుంచి తరిమే యాలని ఎన్నో సాహసోపేతమైన దాడులు చేసింది, భారీ నష్టాలకు గురై మరీ విఫలమైంది. వాస్తవాధీన రేఖ ఆచరణలో సరిహద్దు రేఖ అనేదే కార్గిల్ విష యంలో సైతం భారత్ ప్రతిస్పందనలో కేంద్ర అంశంగా ఉన్నది. మొత్తం ప్రపంచమే వాస్తవాధీన రేఖను అనుల్లంఘనీయమైనదిగా గుర్తించడానికి, భారత్కు వ్యూహాత్మక విజయంగా చూడటానికి అది కారణమైంది. మన పాక్ విధానంలో మౌలిక మలుపు అందువల్లనే చాలా సందర్భాలలో వివిధ సెక్టార్లలో ఎత్తుగడల కారణాల రీత్యానో లేదా సమస్యాత్మకమైన ఏ పాకిస్తానీ స్థావరాన్ని నిర్మూలించడానికో లేదా అర్థం చేసుకోదగినవే అయిన ఖండనలను అడ్డుపెట్టుకుని బుద్ధి చెప్పి రావడానికో కూడా భారత బలగాలు వాస్తవాధీన రేఖను దాటాయి. 2013 జనవరిలో మన ఇద్దరు భారత సైనికుల తలలను నరికినందుకు సైన్యం ‘‘ప్రతీకారాన్ని తీర్చుకున్నద’’ని ఒక విశ్రాంత సైనికాధికారి (జనరల్ బిక్రమ్ సింగ్) చెప్పారు. ఆ వివరాలను మాత్రం తెలుపలేదు. కార్గిల్ తదుపరి ఎంతో కాలం కాకముందే సమస్యాత్మకమైన ఒక పాకిస్తానీ స్థావరాన్ని నిర్మూలించడా నికి నాలుగు మిరేజ్-2000 యుద్ధవిమానాలు శివాలిక్ పర్వత శ్రేణుల లోలో తులుకు చొచ్చుకుపోయి మరీ లేజర్ గెడైడ్ ప్రిసిషన్ బాంబు దాడులను సాగించాయి. ఆ విషయాన్ని సైతం రహస్యంగానే ఉంచారు. పాకిస్తానీలు కూడా ఈ దాడుల గురించి కిమ్మనకుండా ఉండటం విశేషం. బహుశా వాళ్లు తమకు అనువైన సమయం, స్థలం ఎన్నుకుని ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసమే అలా చేసి ఉండొచ్చు. తాజా మలుపు దాన్నంతటినీ మార్చేసింది. వాస్తవాధీన రేఖను అదేదో అంతర్జాతీయ సరిహద్దు అన్నట్టు దాని అనుల్లంఘనీయతను నొక్కిచెప్పడానికి బదులుగా భారత్ ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తోంది. ఆ విషయాన్ని చెప్పడానికి ఎన్డీఏ ప్రభుత్వం నియమించినది ఒక జూనియర్ మంత్రినే కావచ్చు. కానీ, కశ్మీర్ మొత్తం మా భూభాగమే కాబట్టి, అక్కడ ఎక్కడికి వెళ్లినా అది సరిహద్దు ఉల్లంఘన ఎలా అవుతుంది? అని రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అనడానికి ప్రాధాన్యం ఉన్నది. ప్రత్యేకించి ప్రధాని పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలిస్థాన్లను ప్రస్తావించడంతో కలిపి అర్థం చేసుకుంటే దీని ప్రాధాన్యం అర్థమౌతుంది. కశ్మీర్ సమస్యకు సమంజసమైన అంతిమ పరిష్కారం ఇంతవరకు సరిహద్దు విషయంలో వాస్తవాధీన రేఖ పట్ల ఆమోదం చుట్టూనే తిరుగుతోంది. అదే సిమ్లా ఒప్పందం స్ఫూర్తి. వాజ్పేయి ఆ తదుపరి నవాజ్ షరీఫ్, ముషర్రాఫ్లతో జరిపిన సంభాషణల స్ఫూర్తి కూడా అదే. దానినే చివరకు ముషర్రాఫ్, మన్మోహన్సింగ్లు చర్చించి సూత్రీ కరించారు. అదంతా ఇప్పుడు చరిత్రే. 1989 కశ్మీర్ తిరుగుబాటును వాడుకుని పాక్ సిమ్లా ఒప్పందాన్ని చెత్తబుట్టలో పడేస్తే, భారత్ అదే పనిని ఇప్పుడు చేసింది. సిమ్లా ఒప్పందం ద్వారా పాక్ తనకు లభించిన దాన్ని తీసేసుకుంటూ, మరింత ఎక్కువ కోసం పోరాడే అవకాశాన్ని ఉంచుకుంటున్నదనేది నరేంద్ర మోదీ ప్రాపంచిక దృక్పథం. ఆయన తన రాజకీయ, వ్యూహాత్మక, ఎత్తుగడలపరమైన చర్యల ద్వారా పాక్కు ఉన్న ఆ ధీమాను దెబ్బతీశారు. సిమ్లా ఒప్పందం స్ఫూర్తిని పాక్ ఆమోదించాలనడానికి బదులు ఆ పాత ఒప్పందాన్ని తలకిందులుగా నిలబెట్టారు. సిమ్లా ఒప్పందం తర్వాత నాలుగు దశాబ్దాలకు పాక్ కశ్మీర్ను అసంపూర్తి వ్యవహారంగా పిలవగలుగుతుంటే... భారత్ ఆ సిమ్లా ఒప్పందాన్నే అసంపూర్తి వ్యవహారంగా ఎందుకు పిలవకూ డదు? బాగా కటువుగా వినిపిస్తుందా? భారత్లోని మొట్టమొదటి నిజమైన మితవాద ప్రభుత్వం ఆలోచన అదే. అది యథాతథస్థితిని... అది ఎంత అను కూలమైనదే అయినాగానీ కాపాడాలని కోరుకోవడం లేదు. దాన్ని భగ్నం చేయడంలో వ్యూహాత్మక, జాతీయ ప్రయోజనాన్ని అది చూస్తోంది. బ్లాక్మెయిలింగ్లు ఇక చెల్లవు ఈ సరికొత్త మూలస్తంభం కేంద్రంగా ఒక నూతన విధానమే మొత్తంగా నిర్మితమవుతోంది. అణ్వస్త్రాల ముంగిటికి చేర్చే హద్దును ‘‘దాటి ఘర్షణను విస్తరించనీయరాదు’’ అనే భావనను మోదీ ప్రభుత్వం తిరస్కరించాలని కోరుకుంటోంది. అణ్వస్త్రాలు ఏకపక్ష నిరోధకంగా పనిచేస్తున్నాయని అది విశ్వసిస్తోంది లేదా భారత్ను నెత్తురోడేలా చేసే విధంగా అల్పస్థాయి సైనిక కార్యకలాపాలను కొనసాగించడానికి ఉపయోగపడే ఛత్రంగా వాడుకుంటోం దని భావిస్తోంది. ఈ ప్రమాదకర క్రీడతో ఉన్న ముప్పేమిటో పాకిస్తానీలు తమకు తామే గ్రహించాలి. భారత్ ఎప్పటికీ పాక్కు పక్కనే బతకాల్సి ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా దాన్ని అణు బ్లాక్మెయిలింగ్ చేయజాలమని గుర్తించాలి. మౌలిక విధానపరమైన ఈ మార్పుల వల్ల కలిగే ఊహించదగిన పర్యవసానం... వ్యూహాత్మక సంయమనాన్ని విడనాడటమే. అయితే పూర్తిగా తోసి పారేయలేదు. భారత్కు ప్రతీకార చర్యను చేపట్టడానికి మరింత ఎక్కువ వెసులుబాటును అందించడంపైకి కేంద్రీకరణ మళ్లింది. పది సెకండ్ల సౌండ్ బైట్ను లేదా 140 అక్షరాల ట్వీట్ను విశ్లేషణ, అభిప్రాయాలు రెండింటి ప్యాకేజీగా ఇచ్చే ఈరోజుల్లో... కొద్దిగా సంక్లిష్టమై నది ఏదైనా రాయడం ఒక సవాలే. సూక్ష్మ బేధాల వివరణకు ఓపిక వహిం చాలని కోరాలన్నా అంతే. సెప్టెంబర్ 18 ఉదయాన్నే ఉడీ దాడి గురించి వెల్లడైన వెంటనే నేను.. భారత్ దీన్ని కూడా చూస్తూ ఊరుకొంటుందని భావిస్తే పాకిస్తానీలు తప్పు చేస్తున్నారని అన్నాను. మనం ఇప్పుడు పాత వ్యూహాత్మక సంయమనం నుంచి దూరంగా జరిగాం. అయితే వ్యూహాత్మక సంయమనం భారత్కు ఉపయోగపడింది కాబట్టి నేను దాన్ని కొనసాగించా లనే కోరాను. కొందరు ఇందులో వైరుధ్యాన్ని చూశారు. ఈ క్షణభంగురతకు పట్టంగట్టే ఈరోజుల్లో వస్తుగతమైన ఒక క్షేత్రస్థాయి వాస్తవాన్ని విశ్లేషించడా నికి, సూచనాత్మకమైన అభిప్రాయానికి మధ్య తేడాను, ఇవి పరస్పరం ఎలా విరుద్ధమైనవి కాగలవో వివరించడం దాదాపు అసాధ్యం. సరికొత్త అభిప్రాయానికి, విశ్లేషణలకు నూతన వస్తుగత వాస్తవికతే ప్రాతిపదికై తీరాలి. ఇది వివేకవంతమైనదేనా? లేక నిర్లక్ష్యపూరితమైనదా? తప్పా, ఒప్పా? అని వాదించాల్సింది మరో సందర్భంలో. ముందుగా తప్పని సరిగా ఇది అంగీకరించి తీరాలి: ఇది మొట్టమొదటి నిజమైన మితవాద భారత ప్రభుత్వం, ఇది పాత రాజీవాద వైఖరికి తగు సమయాన్ని ఇచ్చి చూసింది, వాస్తవాధీన రేఖ అనుల్లంఘనీయత, వ్యూహాత్మక సంయమనం, పాత అణు హద్దుల నుంచి దూరంగా జరిగింది. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, ఈ నూతన వాస్తవికతపై స్పందించాల్సిందే. అంతేగానీ, ఎంత విచారకర మైనదే అయినా నేడు లేని దాని కోసం సంతాపం పాటించడం కాదు చేయాల్సింది. భారత విశ్లేషకులు ఇది గ్రహించడం ముఖ్యం. పాకిస్తానీ విధా నకర్తలు గుర్తించడం అంతకంటే ముఖ్యం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
బెనజీర్ను చంపిందెవరు..?
‘‘నేను పాక్కు వెళ్లాలనుకుంటున్నా..’’ అంటూ మనసులో మాట బయటపెట్టింది భుట్టో. ఆమె సన్నిహితులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘మీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? ఈ పరిస్థితుల్లో పాక్కు వెళ్లడం అవసరమా..’ కొందరు ధైర్యం చేసి గొంతు సవరించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి, ‘మీరు వెళ్లకూడదంతే..’ అంటూ అడ్డుతగిలారు. కానీ, బెనజీర్ భుట్టో మొండిఘటం. ఎవరి మాటా వినలేదు. చివరకు నిఘా వర్గాల మాట కూడా..! 2007 అక్టోబర్ 18.. బెనజీర్ భుట్టో పాక్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఎవరెన్ని చెప్పినా ఆమె వినిపించుకునే స్థితిలో లేదు. ఒకటా రెండా.. ఎనిమిదేళ్లు! దేశానికి దూరంగా.. ఎవరో విసిరేస్తే ఎగిరిపడినట్టు, విదేశాల్లో పడింది. దుబాయ్, బ్రిటన్లలో భారంగా కాలం వెళ్లదీసింది. స్వదేశాన్ని చూడాలని, పాక్ ప్రజల జేజేలు అందుకోవాలనీ ఆమెకూ ఆత్రంగానే ఉండేది. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పాక్ను ముషారఫ్ ఏలుతున్నాడు. అసలే సైనికాధ్యక్షుడు, ఆపై నియంత.. తలచుకుంటే ఏదైనా చేయగలడు. అందుకే అన్ని రోజులూ అజ్ఞాతంలో గడిపింది. ఇక, ఉపేక్షించి లాభం లేదు. పాక్కు ఎలాగైనా వెళ్లాల్సిందే. నాలుగు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాల్సిందే. భయపడితే కుదరదు. అయినా, రెండు సార్లు దేశానికి ప్రధానిగా పనిచేసిన తాను భయపడటమా..? నెవర్! కొన్ని గంటల వ్యవధిలోనే భుట్టో విమానం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. బయట వేల సంఖ్యలో మద్దతుదారులు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఓ మానవ హారంలా ఏర్పడ్డారు. వారి మధ్యలోంచి బెనజీర్ భుట్టో ర్యాలీ. ఎనిమిదేళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న ఆమె ముక్కు పుటాలకు కమ్మని మట్టివాసన తాకిందో లేదో గానీ, క్షణాల వ్యవధిలోనే బాంబుల వాసన చుట్టేసింది. ర్యాలీలో రెండు బాంబులు పేలి భారీ విధ్వంసం జరిగింది. భుట్టో ఎలాగో ప్రాణాలతో బయటపడింది. కానీ, 139 మంది మరణించారు. 450 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ స్థాయి ఘన స్వాగతాన్ని భుట్టో ఊహించలేదు. అప్పుడు గుర్తొచ్చాయి అమెకు సహచరుల హెచ్చరికలు! వెంటనే దేశాధ్యక్షుడు ముషారఫ్కు లేఖ రాసింది. తనకు, తన భర్త అసిఫ్ అలీ జర్దారీకి భద్రత పెంచమంది. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, బాంబులను నియంత్రించే జామర్లు, ప్రైవేటు గార్డులు, నాలుగు పోలీసు వాహనాలు.. ఇలా ఏవేవో కోరింది. ముగ్గురు అమెరికన్ సెనేటర్లు కూడా ఇదే విషయమై ముషారఫ్కు లేఖలు రాశారు. అయితే, అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి. భుట్టోకు మెల్లమెల్లగా పరిస్థితి అర్థమైంది. ‘ఇలాగే అయితే కష్టం.. తన ప్రాణాలు ఎన్నో రోజులు నిలవవు..’ అనుకుంది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏకు, బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన స్కాట్లాండ్ యార్డ్కు, ఇజ్రాయెల్లోని మొసాద్లకు లేఖలు రాసింది. తన భద్రత కోసం అభ్యర్థించింది. అయితే, పాక్తో దౌత్య సంబంధాల దృష్ట్యా ఈ దేశాల నుంచీ ఆమెకు స్పందన కరవైంది. చిట్టచివరగా అమెరికా, బ్రిటన్లలోని అత్యుత్తమ ప్రైవేట్ ఏజెన్సీలైన ‘బ్లాక్వాటర్’, ‘ఆర్మర్ గ్రూప్’లను తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరింది. ఈ రెండు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. కానీ, పాక్ ప్రభుత్వం ఈ సంస్థలకు వీసా నిరాకరించింది. విదేశీ శక్తులను దేశంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోనే జనవరిలో జరగబోయే ఎన్నికల కోసం కసరత్తులు మొదలుపెట్టింది భుట్టో. పార్టీ మేనిఫెస్టో రూపొందించి, జనాల్లోకి దూసుకెళ్లింది. ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్లినా జనమే జనం! దీనికితోడు అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఆమెకు నిఘా విషయంలో రహస్యంగా సహాయం చేస్తానని మాటిచ్చింది. ఈ ఉత్సాహంతో మరింత దూకుడు పెంచింది భుట్టో. 2007, డిసెంబర్ 27న రావల్పిండిలో ఓ ర్యాలీ ఏర్పాటు చేసింది. ర్యాలీ విజయవంతంగా ముగిశాక, తన టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనంలోకి చేరుకుంది. అయినా, చుట్టూ జనమే! ఈలోగా కారు లోపలి వ్యక్తులు కొందరు.. సన్ రూఫ్ను తెరచి అభిమానులకు మరోసారి అభివాదం చేయాలంటూ సలహాలిచ్చారు. భుట్టో కూడా అదే చేసింది. సన్ రూఫ్ నుంచి బయటకు తల పెట్టి, ప్రజలకు అభివాదాలు చేసింది. అంతే.. కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఘోరం జరిగిపోయింది. ఎవరు కాల్చారో.. ఏ వైపు నుంచి కాల్చారో కానీ.. భుట్టో తలలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. ఒక్కసారిగా కారులోకి కూలబడిపోయింది భుట్టో. ఇది జరిగిన మరుక్షణమే శక్తిమంతమైన బాంబు ఒకటి పేలింది. అంతే.. ఆ దెబ్బకు పరిసరాలన్నీ అదిరిపోయాయి. అభిమానులు రక్తపు ముద్దలయ్యారు. కాసేపటికి తేరుకున్న కొందరు భుట్టోను ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 6.16 నిమిషాలకు భుట్టో మరణవార్తను ప్రపంచం వినాల్సివచ్చింది. ముషారఫ్ ప్రభుత్వ నిరంకుశ, నిర్లక్ష్య ధోరణి వల్లే భుట్టో మరణించిందని కొందరన్నారు. ముషారఫ్ ఈ హత్య చేయించాడన్నారు. మరి కొందరేమో.. ఆమె భర్త జర్దారీని సైతం అనుమానించారు. ఇంకొందరు అల్ ఖైదా పనేనన్నారు. ఇలా ఎవరికి వారు ఏదేదో చెప్పుకొచ్చారు. చివరకు నిజాన్ని మాత్రం సమాధి చేశారు. భుట్టోను చంపిందెవరో ఆ ‘అల్లా’కే తెలియాలి! -
పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు: ముషార్రఫ్
న్యూఢిల్లీ: సింధు నది నుంచి తమ దేశానికి నీళ్లు రాకుండా భారత్ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ హెచ్చరించారు. ప్రతిఘటిచేందుకు సిద్ధంగా ఉంటామని ‘ఇండియా టుడే’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నీళ్లపై నియంత్రణతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్ తో తలపడాలని తాము కోరుకోవడం లేదని, శాంతిప్రక్రియ ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు పర్యటనలు ఎల్లప్పుడు సమస్యలను పరిష్కరించలేవని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాకిస్థాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ముషార్రఫ్ ఈ వ్యాఖ్య చేశారు. ప్రతిదానికి పాకిస్థాన్ ను నిందించడం సరికాదన్నారు. ఉడీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడికి పాకిస్థాన్ కారణమంటూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగం డాబుసరిగా ఉందని విమర్శించారు. సార్క్ సమావేశాల నుంచి భారత్ తప్పుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భారత్ ప్రభావితం చేయడం వల్లే అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ కూడా సార్క్ సదస్సుకు దూరమయ్యాయని ఆరోపించారు. బలూచిస్థాన్ లో పాకిస్థాన్ జాతీయ పతకాలను తగులబెట్టిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. -
ఫేస్బుక్ ఫ్రెండ్ పై పోలీసులకు ఫిర్యాదు
మంగళూరు: ఫేస్బుక్ లో పరిచయమైన యువతిని మోసగించి మరో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పెళ్లి చేసుకుంటానని తనను వంచించి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని పర్వేజ్ ముషారఫ్ అనే వ్యక్తి కర్ణాటకలోని మంగళూరుకు చెందిన యువతి(26) పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు దగ్గరయ్యాడని, తర్వాత మొహం చాటేశాడని వాపోయింది. నాలుగు నెలల నుంచి తనను తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె తెలిపింది. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని తెలుసుకున్న బాధితురాలు.. అతడిని నిలదీసింది. తమ మధ్య సంబంధాన్ని మర్చిపోవాలని ఆమెకు సూచించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇండియాపై ముషార్రఫ్కు కన్నుకుట్టింది!
ఇస్లామాబాద్: భారత్-అప్ఘనిస్థాన్ సంబంధాలు చూసి పాకిస్థాన్కు కన్నుకుట్టింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ భారత్పై తన అక్కసు వెళ్లగక్కాడు. భారత్ చెప్పినట్లల్లా అప్ఘనిస్థాన్ ఆడుతోందని, అలా చేయకూడదని అన్నారు. భారత్ స్వార్థంతో చేసే పనులకు అప్ఘనిస్థాన్ ఆకర్షణకు లోనై పాకిస్థాన్కు శత్రువుగా మారొద్దంటూ వ్యాఖ్యానించాడు. అప్ఘనిస్థాన్ కు భారత్ వ్యత్యాసం ఉందని, కానీ పాకిస్థాన్తో పోలీస్తే మాత్రం చాలా దగ్గర అనుబంధం ఉంటుందనే విషయం తెలుసుకోవాలని అన్నారు. పాకిస్థాన్-అప్ఘనిస్థాన్ సరిహద్దులోని తోర్కామ్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకొని ఓ పాకిస్థాన్ సీనియర్ ఆర్మీ అధికారి చనిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన ముషార్రఫ్.. భారత్ ను తప్పుబట్టారు. విలువలు, జాతి, భాష, మతంవంటి విషయాల్లో చాలా దగ్గర సంబంధాలు తామిద్దరికి(అప్ఘనిస్థాన్-పాకిస్థాన్) ఉంటాయని, భారత్ చెప్పినట్లు చేస్తూ ఆ దేశం తప్పు చేస్తోందంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాకిస్థాన్కు అప్ఘనిస్థాన్ వ్యతిరేకంగా మార్చడమే ధ్యేయంలాగా కనిపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఓ పత్రికకు, ఆన్ లైన్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. -
దుబాయ్కి ముషారఫ్
కరాచీ: వైద్యం చేయించుకోవడానికి విదేశాలకు వెళ్లేందుకు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆదేశాలు అందుకున్న వెంటనే ఆయన వెన్నెముకకు చికిత్స చేయించుకోవడానికి దుబాయ్కు చేరుకున్నారు. తానో యుద్ధ యోధుడినని, తన జన్మభూమికి త్వరలోనే తిరిగి వెళతానని ఈ సందర్భంగా ముషారఫ్ చెప్పారు. పాక్ తిరిగి వెళ్లిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానన్నారు. ముషారఫ్ దుబాయ్ వెళ్లడానికి గురువారం సాయంత్రం పాక్ ప్రభుత్వం అనుమతిచ్చింది. రాజద్రోహంతో పాటు చాలా కేసుల్లో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
ముషారఫ్పై మాత్రమే ‘రాజద్రోహం’ విచారణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో 2007లో అధ్యక్షుడిగా ఉన్న పర్వేజ్ ముషారఫ్ మాత్రమే రాజ్యాంగాన్ని కూలదోయాలనుకున్నాడని, రాజద్రోహం కేసులో ఆయనపై మాత్రమే విచారణ జరుగుతుందని పాక్ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అబ్దుల్ హమీద్ దోగర్, మరో ఇరువురిని విచారణ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. -
ముషర్రఫ్కు తీవ్ర అస్వస్థత
కరాచీ: తీవ్రమైన రక్తపోటుతో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఆస్పత్రిలో చేరారు. కరాచిలోని స్వగృహంలో ముషర్రఫ్ విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా రక్తపోటు పెరిగి స్పృహ కోల్పోయారు. వెంటనే అయనను కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ముషర్రఫ్ చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముషర్రఫ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
భారత్ అతిగా స్పందిస్తుంది: ముషారఫ్
పాకిస్థాన్ : భారత్లోని పఠాన్కోట్ ఘటనపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మంగళవారం స్పందించారు. ఈ ఘటనపై భారత్ అతిగా స్పందిస్తుందని ముషారఫ్ ఆరోపించారు. పాక్ - భారత్ రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే అని ఆయన చెప్పారు. పఠాన్కోట్లాంటి ఘటనలు సాధారణం అని ఆయన వ్యాఖ్యానించారు. పాక్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక పర్యటనకు అంత ప్రాధాన్యత లేదని ముషారఫ్ పేర్కొన్నారు. -
భారత్ పై అణ్వాయుధాలు వేయాలనుకుంది!
వాషింగ్టన్: 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ అణు ఘాతుకానికి తెగబడాలని ప్రయత్నించిందట! భారత్ పై ప్రయోగించేందుకు పాకిస్థాన్ అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నదని, వాటిని భారత్ పై వేసే అవకాశం కూడా ఉందని సీఐఏ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ను హెచ్చరించినట్టు వైట్ హౌస్ మాజీ టాప్ అధికారి ఒకరు తెలిపారు. 1999 జులై 4 న అమెరికా పర్యటనకు వచ్చిన అప్పటి-ఇప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో క్లింటన్ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయనకు సీఐఏ ఈ విషయాన్ని తెలిపింది. రోజువారీ రహస్య సమాచారాన్ని నివేదించడంలో భాగంగా పాక్ అణు సన్నాహాల గురించి వివరించింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ దుస్సాహసానికి తెగబడి..కార్గిల్ ముట్టడికి ప్రయత్నించడం.. భారత్ సైన్యాలు పాక్ ఆర్మీ దాడిని తిప్పికొడుతున్న నేపథ్యంలో షరీఫ్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు కోరేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోతే అంతర్జాతీయంగా అప్రతిష్టపాలవుతామనే ఉద్దేశంతో ఆయన సామరస్యంగా ఈ యుద్ధాన్ని ముగించాలని భావించారు. ఈ నేపథ్యంలో అప్పటి క్లింటన్-షరీఫ్ భేటీలో పాల్గొన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ జాతీయ భద్రత మండలి సభ్యుడు బ్రూస్ రీడెల్ అప్పటి విషయాలను వెల్లడించారు. 'పాకిస్థాన్ తన అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నది. వాటిని వాడే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కచ్చితమైన నిఘా సమాచారముంది. ఇందుకు సంబంధించి ఓవల్ ఆఫీస్ లో గంభీర వాతావరణముంది' అని సీఐఏ క్లింటన్ కు చెప్పిందని బ్రూస్ వివరించారు. క్లింటన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు సాండీ బెర్జర్ బుధవారం క్యాన్సర్ తో మృతిచెందిన నేపథ్యంలో ఆయనకు స్మృతిలో రాసిన వ్యాసంలో బ్రూస్ ఈ విషయాలు తెలిపారు. పాకిస్థానే ఈ యుద్దం ప్రారంభించిన నేపథ్యంలో అదే యుద్ధాన్ని ఎలాంటి పరిహరం కోరకుండా ఆపేయాలని, అప్పుడే మరింత ఉద్రిక్తతలు రేకెత్తబోవని షరీఫ్ కు చెప్పాలని క్లింటన్ కు సాండీ బెర్జర్ సూచించినట్టు ఆయన వివరించారు. -
'లాడెన్, తాలిబన్లు.. మాకు హీరోలు'
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒసామా బిన్ లాడెన్, తాలిబన్లు వంటి ఉగ్రవాదులను పాకిస్థాన్ హీరోలుగా భావించేదని ముష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ మద్దతు ఇచ్చినట్టు అంగీకరించారు. '1990లో కశ్మీర్లో వేర్పాటువాద కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆ సమయంలో లష్కరే తోయిబా వంటి 12 ఉగ్రవాద సంస్థలు ఏర్పడ్డాయి. వారికి మద్దతు ఇచ్చి, కశ్మీర్లో పోరాడేందుకు శిక్షణ కూడా ఇచ్చాం. హఫీజ్ సయీద్, లక్వీ వంటి ఉగ్రవాదులు హీరోలుగా చెలామణి అయ్యారు. అనంతరం పాకిస్థాన్లో మతతత్వ పోరాటం ఉగ్రవాదంగా మారింది. ఇప్పుడు సొంతవారినే చంపుతున్నారు. దీన్ని నియంత్రించాలి. తాలిబన్లకు శిక్షణ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు పంపించాం. తాలిబన్లు, లాడెన్, జవహరి వంటి ఉగ్రవాదులు అప్పట్లో హీరోలు. ఆ తర్వాత విలన్లుగా మారారు' అని ముష్రాఫ్ చెప్పారు. -
ముషారఫ్ కు పాకిస్థాన్ ప్రభుత్వం షాక్
ఇస్లామాబాద్: మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు పాకిస్థాన్ ప్రభుత్వం షాకిచ్చింది. సౌదీ అరేబియా వెళ్లేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది. ఇటీవల మృతి చెందిన సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ తనకు సోదరుడు వంటివాడని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సౌదీ అరేబియా వెళ్లేందుకు ముషారఫ్ అనుమతి కోరగా ప్రభుత్వం తిరస్కరించింది. 71 ఏళ్ల ముషారఫ్ పాకిస్థాన్ లో పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లు దుబాయ్ లో ప్రవాస జీవితం గడిపిన ముషారఫ్ పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో పాల్గొనేందుకు 2013లో స్వదేశానికి తిరిగొచ్చారు. -
ఆ ఉగ్రవాదులకు శిక్షణ
ఇచ్చింది ‘రా’నే!: ముషార్రఫ్ ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ భారత్పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. పెషావర్లో మంగళవారం తాలిబాన్ దాడిలో 148 మంది చిన్నారులు మరణించిన ఘటనపై స్పందిస్తూ.. ఆ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులకు భారత దేశ నిఘాసంస్థ ‘రా(రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్)’ శిక్షణనిచ్చిందని ఆరోపించారు. ‘మౌలానా ఫజ్లుల్లా ఎవరు? తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ కమాండర్. అఫ్ఘానిస్థాన్లో ఉంటాడు. అఫ్ఘానిస్థాన్లోని గత కర్జాయ్ ప్రభుత్వం, భారతదేశ నిఘా సంస్థ ‘రా’.. పాక్లో దాడులు చేసేందుకు అతడికి సహకారం అందించాయనేందుకు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది’ అని ఆంగ్ల వార్తాచానెల్ సీఎన్ఎన్ఐబీఎన్కు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పెషావర్ దాడి వెనుక భారత్ కుట్ర ఉందని జమాత్ఉద్దవా అధినేత హఫీజ్ సయీద్ ఆరోపించారు. -
కాశ్మీర్ సమస్యకు ముషార్రఫ్ ఫార్ములానే పరిష్కారం
ప్రముఖ న్యాయవాది రామ్జెఠ్మలానీ ప్రకటన తాను చెప్పడంవల్లే ఆర్టికల్ 370పై బీజేపీ మౌనం దాల్చిందని వ్యాఖ్య శ్రీనగర్: కాశ్మీర్ సమస్యకు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సూచించిన నాలుగు సూత్రాల ఫార్ములానే శాశ్వత పరిష్కారమని ప్రముఖ న్యాయవాది, మాజీ బీజేపీ ఎంపీ రామ్జెఠ్మలానీ అన్నారు. కాశ్మీర్ పరిష్కారానికి ఏర్పాటైన ఓ ప్రైవేటు కమిటీకి జెఠ్మలానీ చైర్మన్గా ఉన్న విషయం తెలిసిందే. శ్రీనగర్ వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ముషార్రఫ్ సదుద్దేశంతో భారత్కు వచ్చారని(అధ్యక్షుడిగా ఉన్న సమయంలో), ఆయన ప్రతిపాదన కాశ్మీర్ సమస్యకు అద్భుత పరిష్కారమని చెప్పారు. ముషార్రఫ్ డాక్యుమెంట్ అద్భుతమని, కాశ్మీర్కు శాశ్వత పరిష్కారానికి ఇది ప్రాతిపదికగా ఉండాలన్నారు. అయితే, ఆయన ప్రయత్నాలు భారత్కు కోపాన్ని తెప్పించాయని చెప్పడానికి తాను సంశయించడం లేదన్నారు. ముషార్రఫ్ డాక్యుమెంట్లో తాను కొన్ని మార్పులు చేశానని, అప్పట్లో ఓ మిత్రుడి ద్వారా దాన్ని తన వద్దకు పంపినట్లు వెల్లడించారు. కాశ్మీర్కు ఇరువైపులా లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలన్నదే ఆ డాక్యమెంట్ ఉద్దేశంగా పేర్కొన్నారు. వేర్పాటువాదులు అందరూ పాక్ ఏజెంట్లు కారని, వారితో తాను సంప్రదింపులు కొనసాగిస్తున్నానని, ఎక్కువ మంది భారత్తోనే ఉండాలనుకుంటున్నారన్నారు. ఆర్టికల్ 370ని ఎవరూ కదిలించలేరు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని, దాన్ని ఎవరూ ముట్టుకోలేరని జెఠ్మలానీ అన్నారు. దీని ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీకి వివరించానని, అందుకే బీజేపీ దీనిపై మౌనం దాల్చిందన్నారు. ఎన్నికల ముందు ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించడం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఆర్టికల్ను ఏర్పాటు చేశారని, దీన్ని ఎవరూ రద్దు చేయలేరని పేర్కొన్నారు. -
వేర్పాటువాదులను రెచ్చగొట్టాలి
కాశ్మీర్పై ముషార్రఫ్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు భారత్తో యుద్ధానికి పాక్ సైన్యం సిద్ధమని వెల్లడి మోదీ ముస్లిం వ్యతిరేకి, పాక్ వ్యతిరేకి అని ఆరోపణ ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో కవ్వింపు చర్యలకు దిగారు. కాశ్మీర్లో భారత్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వేర్పాటువాదులను పాకిస్థాన్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్పై విడుదలైన ముషార్రఫ్ ఓ చానల్తో మాట్లాడుతూ భారత్తో యుద్ధానికి పాక్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. అలాగే పాక్లో లక్షలాది ప్రజలు కాశ్మీర్ కోసం పోరాడేందుకు సుముఖంగా ఉన్నారన్నారు. పాక్ తిరిగి దాడి చేయబోదన్న భ్రమలో ఉండరాదని భారత్ను హెచ్చరించారు. ‘‘కాశ్మీర్లో భారత సైన్యం తో మేం ముందు, వెనక నుంచి కూడా పోరాడగలం. ‘మేం ముస్లింలము, మా చెంపలపై కొడితే రెండోవైపు చూపించం. దాడి చేస్తే మేం తగిన రీతిలో బుద్ధిచెప్పగలం’ అని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇటీవలి కాల్పుల ఉదంతంపై ముషార్రఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం అంతర్గతంగా బలంగా ఉంటే పాక్ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పైనా ముషార్రఫ్ ఆరోపణలు గుప్పించారు. మోదీని ముస్లిం వ్యతిరేకిగా, పాక్ వ్యతిరేకిగా అభివర్ణించారు. మోదీ ప్రమాణస్వీకారానికి పాక్ ప్రధాని వెళ్లడాన్ని ముషార్రఫ్ తప్పుబట్టారు. పాక్కు భారత్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా కల్పించడాన్ని జోక్గా అభివర్ణించారు. యుద్ధాన్ని గుర్తుచేసుకున్న నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 1965 నాటి భారత్-పాక్ యుద్ధాన్ని గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో యుద్ధ విమానాలు లాహోర్ గగనతంలో పోరు సాగించడాన్ని చూశానన్నారు. గురువారం ఇస్లామాబాద్లోని ఎయిర్ హెడ్క్వార్టర్స్లో వైమానిక చీఫ్ ఎయిర్చీఫ్ మార్షల్ తాహిర్ రఫీక్తో భేటీ సందర్భంగా షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా సరిహద్దులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతకుముందు షరీఫ్ భద్రతాపరమైన అంశాలపై చర్చించేందుకు సైనిక, ప్రభుత్వ నేతలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. -
హత్యాయత్నం నుంచి తప్పించుకున్న ముషార్రఫ్
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసు విచారణ ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ గురువారం తెల్లవారుజామున హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రావల్పిండిలోని సైనిక హృద్రోగ ఆస్పత్రి నుంచి ఇస్లామాబాద్లోని ఫాంహౌస్కు ఆయన చేరుకున్న 20-25 నిమిషాల వ్యవధిలోనే ఫాంహౌస్కు సమీపంలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ముషార్రఫ్ కాన్వాయ్ ప్రయాణించిన రోడ్డు కింద ఓ డ్రైనేజీ పైపులో దుండగులు ఈ బాంబును అమర్చారు. ముషార్రఫ్ లక్ష్యంగానే ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. -
‘దేశద్రోహి’ ముషార్రఫ్!
సంపాదకీయం పాకిస్థాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి, తొమ్మిదేళ్లపాటు దేశాన్ని తన గుప్పిట బంధించిన మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్పై ప్రత్యేక కోర్టులో ఎట్టకేలకు దేశద్రోహ నేరానికి సంబంధించిన అభియోగాలు ఖరారయ్యాయి. ఈ అభియోగాలపై విచారణ జరిగి, ముషార్రఫ్ దోషిగా నిర్ధారణ అయితే ఆయనకు మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడుతుంది. పాక్ చరిత్రలో ముషార్రఫ్ను పోలిన నియంత లెందరో కనబడతారు. వారంతా సైనిక దళాల చీఫ్లుగా పనిచేస్తూ బలప్రయోగంతో ప్రభుత్వాలను చెరబట్టినవారే. ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసంచేసినవారే. కానీ, ముషార్రఫ్లా వారెవరూ ఆ నేరానికి బోనెక్కలేదు. శిక్షలూ పడలేదు. పాకిస్థాన్ వేర్వేరు సమయాల్లో మొత్తం 34ఏళ్లపాటు సైనిక నియంతల పాలనను చవిచూసింది. జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని కూలదోయడమే కాదు... ఆయనను ఒక హత్య కేసులో దోషిగా చేసి విచారణ తతంగాన్ని నడిపించి ఉరిశిక్ష అమలు చేయించినవాడు జనరల్ జియా ఉల్ హక్. ఆయన దేశాధ్యక్ష పదవిలో ఉండగానే విమాద ప్రమాదంలో మరణించాడు. అయితే మిగిలిన సైనిక నియంతలకూ, ముషార్రఫ్కూ తేడా ఉంది. వారంతా సైనిక దుస్తుల్లోనే దేశాన్నేలితే, ముషార్రఫ్ సివిలియన్ దుస్తుల్లో ప్రజాస్వామ్యబద్ధమైన పాలకుడిగా కనబడే ప్రయత్నంచేశారు. మళ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో నిరుడు మార్చిలో ఆయన పాక్ గడ్డపై అడుగుపెట్టారు. పాకిస్థాన్లో సైనిక పాలన ఉన్నా, ప్రజా ప్రభుత్వం ఉన్నా సైన్యానికుండే పలుకుబడి అపారమైనది. వారికి అసంతృప్తి కలిగించేలా వ్యవహరించేందుకు అధికారంలో ఉన్నవారు సిద్ధపడే అవకాశం లేదు. తాను 1999లో కూలదోసిన నవాజ్ షరీఫే మళ్లీ పరిపాలకుడిగా ఉంటున్నా, ఆయన తనపై పాత కక్షలను తీర్చుకునే అవకాశం లేకపోలేదన్న అనుమానం ఉన్నా... ముషార్రఫ్ తిరిగివచ్చే సాహసం చేసింది అందుకే. కానీ, ఆయన అనుకున్నది ఒకటైతే అయింది మరోటి. ఇప్పటికే ఆయనపై పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్యకేసు, బలూచిస్థాన్ జాతీయ నాయకుడు అక్బర్ బుగ్తీ హత్యకేసు ఆరోపణలున్నాయి. అయితే, ముషార్రఫ్పై ఇప్పుడు ఖరారైన అభియోగాలను జాగ్రత్తగా గమనిస్తే అందులోని లొసుగులు వెల్లడవుతాయి. 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సంబంధించిన అభియోగం అందులో లేదు. 2007 నవంబర్లో రాజ్యాంగాన్ని రద్దుచేసి దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు...సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అక్రమంగా పదవులనుంచి తొలగించి, నిర్బంధించడం వగైరా అభియోగాలు మాత్రమే ఉన్నాయి. అంతకు ఆరేళ్లముందు ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయకుండా ఇవేవీ ముషార్రఫ్కు సాధ్యమయ్యేవి కాదు. అయినా ఎందుకనో అభియోగాల్లో ఆ ప్రస్తావన లేదు. దేశద్రోహ నేరం కూడా ఒక్క ముషార్రఫ్పైనే ఉన్నది. వివిధ స్థాయిల్లోని సహచర సైనికాధికారుల సహాయసహకారాలు లేకుండా ముషార్రఫ్ ఒక్కరే అధికారాన్ని కైవసం చేసుకోవడం, దాన్ని చెలాయించడం సాధ్యంకూడా కాదు. కానీ, చిత్రంగా ఇతర అధికారులపైగానీ, రిటైర్డు అధికారులపైగానీ దీనికి సంబంధించిన కేసులు పెట్టలేదు. కేసును ముషార్రఫ్కు మాత్రమే పరిమితం చేయడంద్వారా సైన్యంనుంచి ప్రతిఘటన ఎదురుకాకుండా నవాజ్ షరీఫ్ జాగ్రత్తపడ్డారు. ముషార్రఫ్కు ఇప్పటికీ సైన్యంనుంచి గట్టి మద్దతే ఉంది. ఆయన ఏదో ఒక దశలో దీన్నుంచి బయటపడి సురక్షితంగా దేశం విడిచి వెళ్తారన్న విశ్వాసం సైన్యంలో ఉంది. బహుశా అందువల్లే కావొచ్చు జరుగుతున్న తతంగాన్నంతా సైన్యం మౌనంగా వీక్షిస్తున్నది. కేసులపై విచారణ మొదలయ్యాక కోర్టు ముందు హాజరుకావడం ముషార్రఫ్కు ఇది రెండోసారి. సోమవారంనాటి విచారణ సందర్భంగా ఆయన తనను తాను గట్టిగా సమర్ధించుకున్నారు. దేశం కోసం రెండు యుద్ధాల్లో పోరాడి, 44 ఏళ్లపాటు సైన్యానికే జీవితాన్ని అంకితం చేసిన తనపై దేశద్రోహ నేరారోపణలు చేయడమేమిటని ఆయన నిబ్బరంగా ప్రశ్నించారు. కనుక ఈ కేసు విచారణ చివరి వరకూ ఇదే తరహాలో వెళ్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. నవాజ్ షరీఫ్ను 2000 సంవత్సరంలో ముషార్రఫ్ నిర్బంధంలో ఉంచినప్పుడు మధ్యవర్తిత్వంవహించిన సౌదీ అరేబియా ప్రభుత్వం ఇప్పుడు ముషార్రఫ్ను రక్షించడానికి తెరవెనుక మంతానాలు సాగిస్తోంది. దేశం విడిచివెళ్లడానికి వీల్లేని వ్యక్తుల జాబితానుంచి ఆయన పేరు తొలగించాలని ఒత్తిడి తెస్తోంది. అయితే, ముషార్రఫ్పై న్యాయవ్యవస్థ ఆగ్రహంతో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టుకునేందుకు నవాజ్ షరీఫ్ సిద్ధంగా లేరు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దుబాయ్లో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న 94 ఏళ్ల తన తల్లిని చూసి మళ్లీ వస్తానని ముషార్రఫ్ చెబుతున్నారు. ఈ ఆరోపణలు ఎదుర్కొని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని హామీ ఇస్తున్నారు. కానీ, పాకిస్థాన్ గత పాలకుల చరిత్ర గమనించి నవారెవరూ ఈ హామీని విశ్వసించలేరు. ఏదేమైనా ముషార్రఫ్ ఇప్పుడు ఒక సంకట స్థితిలో పడ్డారు. ఉగ్రవాదులొకపక్క... ప్రభుత్వమూ, న్యాయవ్యవస్థ మరోపక్క వెంటాడుతుంటే దిక్కుతోచకుండా అయ్యారు. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోసిన ఒక నియంతకు ఈ స్థితి ఏర్పడటం పాక్ చరిత్రలో ఇదే ప్రథమం. భవిష్యత్తు కుట్రలను నివారించే స్థాయిలో ఈ విచారణ సజావుగా పూర్తయి ముషార్రఫ్కు శిక్షపడుతుందా లేక ఇదంతా ప్రహసనంగా మిగిలిపోతుందా అన్నది వేచిచూడాలి. -
ముషారఫ్ బండారం బయటపెట్టిన బ్రిటీష్ జర్నలిస్ట్
వాషింగ్టన్/ఇస్లామాబాద్(పిటిఐ): బ్రిటన్కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్ట్ కార్లోట్టా గాల్ తన తాజా పుస్తకంలో పాకిస్తాన్ మాజీ సైనిక నియంత, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు చెందిన అనేక వాస్తవాలను బయటపెట్టారు. హత్యకు గురైన అల్ఖైదా నాయకుడు ఒసామాబిన్ లాడెన్ అజ్ఞాతంలో ఎక్క్డడ ఉండేవాడో ముషారఫ్కు తెలుసునని గాల్ తన పుస్తకంలో పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కోసం ఆమె ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్లలో చాలా సంవత్సరాలు జర్నలిస్ట్గా పని చేశారు. తను కొత్తగా విడుదల చేసిన 'రాంగ్ ఎనిమీ' అనే పుస్తకంలో ముషారఫ్కు చెందిన అనేక విషయాలను వెల్లడించారు. 300 పేజీలు ఉన్న ఈ పుస్తకం ఏప్రిల్ 8 నుంచి మార్కెట్లో అమ్మకానికి పెడతారు. కాశ్మీర్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నానని చెప్పే ముషారఫ్, ఆల్ఖైదాకు మద్దతు ఇవ్వడంలేదని వాదించేవారని ఆ పుస్తకంలో వివరించారు.కోర్టుగనక అనుమతించి ఉంటే ముషారఫ్ పాలనా కాలంలోని అనేక రహస్యాలు వెలుగు చూసి ఉండేవని గాల్ పేర్కొన్నారు. లాడెన్ పాకిస్తాన్లోని అబ్బోట్టాబాద్ పట్టణంలో ఒక రహస్య స్థావరంలో ఉండగా 2011 మే నెలలో అమెరికా కమాండోలు దాడి చేసి అతనిని హత్య చేశారు. ఇదిలా ఉండగా, పలు ఇతర కేసులతోపాటు ముషారఫ్ పాకిస్తాన్ కోర్టులో దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇస్లామాబాద్లోని స్పెషల్ కోర్టులో ముషారఫ్పై దేశద్రోహ ఆరోపణలు నమోదయ్యాయి. -
ముషారఫ్కు నాన్బెయిలబుల్ వారెంట్లు
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో విచారణకు గైర్హాజరైన పాకిస్థాన్ మాజీ నియంత పాలకుడు పర్వేజ్ ముషారఫ్కు ప్రత్యేక విచారణ కోర్టు శుక్రవారం నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ముషారఫ్ మార్చి 31వ తేదీలోగా కోర్టు ఎదుట హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లను అమలు చేస్తామని ప్రత్యేక కోర్టు రిజిస్ట్రార్ అబ్దుల్ ఘని సుమ్రో తెలిపారు. అనంతరం విచారణను కోర్టు ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. అభియోగాల నమోదుకు కోర్టు ఎదుట హాజరు కావాలని జస్టిస్ ఫైజల్ అరబ్ నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముషారఫ్ను ఆదేశించింది. అయితే భద్రతా కారణాల రీత్యా ముషారఫ్ కోర్టుకు రాలేరని డిఫెన్స్ న్యాయవాదులు నివేదించారు. ముషారఫ్ హాజరు కావాలంటే కోర్టు వద్ద భద్రతా తనిఖీలు చేపట్టేందుకు కనీసం 6 వారాలు అవసరమని పేర్కొన్నారు. పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ను ఆయన భద్రతా సిబ్బందే హతమార్చిన తరహాలో ముషారఫ్పై దాడి జరిగే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
'ముషార్రఫ్ ఆరోగ్యం 18 ఏళ్ల కుర్రాడిలా ఉంది'
ఇస్తామాబాద్: దేశ ద్రోహం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఆరోగ్య పరిస్థితి18 ఏళ్ల కుర్రాడి మాదిరిగా ఉందని ప్రభుత్వ న్యాయవాది అక్రమ్ సిఖ్ తెలిపారు. ఆయన దేశం దాటి వెళ్లి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జనవరి 2వ తేదీ నుంచి మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముషార్రఫ్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటి వరకూ నోరు మెదపలేదన్నారు. అతని ఆరోగ్యం ఆందోళనకరంగా ఏమీ లేదన్న విషయం తాజా మెడికల్ రిపోర్ట్ చూస్తే అర్ధమవుతుందన్నారు. వైద్యానికి రోగులు సహకరించినా, సహకరించకపోయినా ఆస్పత్రి నుంచి బహిష్కరించరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దేశ ద్రోహం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న ముషార్రఫ్ వైద్యం చేయించుకోవడానికి పాకిస్తాన్ దాటి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే పాకిస్తాన్ లో గుర్తింపు పొందిన చాలా ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ముషార్రఫ్ గుండె 18 ఏళ్ల యువకుడికి ఎలా ఉంటుందో అదే తరహాలో పని చేస్తుందని సిఖ్ తెలిపారు. కాగా, ముషార్రఫ్ ఆరోగ్యం అతని తరుపు న్యాయవాది అహ్మద్ రాజా కాసూరి ఆందోళన వ్యక్తం చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని, విశ్రాంతి తీసుకోవడానికి సమయం కావాలన్నారు. దీనికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన వాదనలు వినిపించడానికి మరింత గడువు ఇవ్వాల్సిందిగా ముషార్రఫ్ కోర్టు అనుమతి తప్పక కోరతారన్నారు. -
ముషార్రఫ్ తల తెస్తే 200 కోట్లు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ను హతమారిస్తే రూ.200 కోట్లు, 200 ఎకరాలు నజరానాగా ఇస్తానని జమ్హూరీ వతన్ పార్టీ అధ్యక్షుడు తలాల్ అక్బర్ బగ్టి ప్రకటించారు. గతంలో రూ. 100 కోట్లు, 100 ఎకరాలు అని ఆయన ప్రకటించిన నజరానాను ప్రస్తుతం రెట్టింపు చేస్తున్నట్లు రావల్పిండిలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత ఇంట్లో మంగళవారం వెల్లడించారు. ముషార్రఫ్ పరిపాలన కాలంలో తలాల్ తండ్రి అక్బర్ ఖాన్ 2006లో హత్యకు గురయ్యారు. -
మారుతున్న ‘శాంతి’ సమీకరణలు
మన దేశంలో పర్యటనకు ముందే కర్జాయ్ ‘తలరాత’ మారిపోయిన సంగతి మన విదేశాంగ శాఖకు పట్టలేదు. కాబట్టే కర్జాయ్ పర్యటనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాని మన్మోహన్సింగ్ ఆయనతో రహస్య సమాలోచన సాగించారు. పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ విశ్లేషకులందరి అంచనాలను తలకిందులు చేశారు. 1999లో నవాజ్ ప్రభుత్వాన్ని కూలదోసిన మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్పై ప్రతీకారాన్ని తీర్చుకోడానికి యత్నించకపోవచ్చని అంతా ఊహాగానాలు చేశారు. ముషార్రఫ్ను ఏదో ఒక విధంగా దేశం విడిచిపోయేలా చేయడమే నవాజ్కు, పాక్ ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమని సూచించారు. పాక్ చరిత్రలో మొదటిసారిగా ఒక మాజీ జనరల్పై పౌర ప్రభుత్వం క్రిమినల్ నేరారోపణలను చేయడం, విచారించడం సైనిక వ్యవస్థకు మింగుడు పడదని అంచనా వేశారు. ముషార్రఫ్ను అవమానించడానికి యత్నిస్తే సహించేదిలేదని ఆయన పాక్ గడ్డపై కాలుపెట్టినప్పుడే మాజీ ఆర్మీ చీఫ్లు ప్రకటించారు. అది నిజానికి ఆర్మీ చీఫ్ అష్ఫాక్ కయానీ హెచ్చరికేనని అందరికీ తెలిసిందే. అయినా నవాజ్ ముషార్రఫ్పై మరణశిక్ష విధించదగిన దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలను ఒక్కటొక్కటిగా చేయిస్తూ వస్తున్నారు. తాజాగా ముషార్రఫ్పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యానేరం ఆరోపణను మోపారు. కీలక రాజకీయ పాత్రధారిగా మారిన పాక్ న్యాయవ్యవస్థకు కూడా ముషార్రఫ్ అంటే కంటగింపే. కాబట్టి ముషార్రఫ్ తనకు తగినంత భద్రత కల్పించడం లేదని బెనజీర్ ఒక పాత్రికేయునికి రాసిన లేఖ ఒక్కదాని ఆధారంతోనే కోర్టు కేసు విచారణకు సిద్ధపడటంలో ఆశ్చర్యం లేదు. పైగా నవాజ్ భారత్తో సత్సంబంధాలను కోరుతున్నారు. 1999లో సరిగ్గా అందుకే ముషార్రఫ్ ఆయనపై ఆగ్రహించారు. కయానీకి ఈ పరిణామా లు మింగుడుపడతాయా? అందుకే పాక్ చరి త్రలో నాలుగో సైనిక తిరుగుబాటుకు తెరలేస్తున్నదేమోనని భయపడుతున్నారు. సరిహద్దుల్లోని ఇటీవలి ఘర్షణలు పాక్ సైన్యం ప్రేరేపిస్తున్నవేనని, నవాజ్ మాత్రం భారత్తో మైత్రికే ప్రాధాన్యం ఇస్తున్నారని తరచుగా వినవస్తోంది. అయితే మే నెలలో అఫ్ఘాన్ అధ్యక్షుడు మన దేశ పర్యటనకు రావడానికి ముందు నుంచి పాక్ సైన్యం ట్యాంకు లు, భారీ శతఘు్నలతో అఫ్ఘానిస్థాన్పై కాల్పు లు సాగిస్తోంది. అఫ్ఘాన్లోని హమీద్ కర్జాయ్ ప్రభుత్వంతో తప్ప అన్ని తాలిబన్, జిహాదీ గ్రూపులతోనూ పాక్ సైన్యానికి మంచి సంబంధాలున్నాయి. అందుకే పాక్ అఫ్ఘాన్లో కీలక పాత్రధారి. అమెరికా సైతం ఈ ఏడాది మొదటి నుంచి కర్జాయ్ను వదిలి, కయానీపై ఆధారపడుతోంది. కయానీ సహాయంతోనే రియాద్లో తాలిబన్లతో శాంతి చర్చలకు సన్నాహా లు చేస్తోంది. కాగా, రేపటి అఫ్ఘాన్లో భారత్ ప్రముఖ పాత్ర నిర్వహించనున్నదనే భ్రమలో మన దౌత్యనీతి బతుకుతోంది. అందుకే మన ప్రభుత్వం అఫ్ఘాన్లో రోడ్లు, ఆస్పత్రుల వంటి మౌలిక నిర్మాణాలపై 200 కోట్ల డాలర్లకుపైగా ఖర్చు చేసింది. అఫ్ఘాన్ పోలీసు బలగాలకు శిక్షణను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నదని మీడియా కథనం. అయితే మన దేశంలో పర్యటనకు ముందే కర్జాయ్ ‘తలరాత’ మారిపోయిన సంగతి మన విదేశాంగ శాఖకు పట్టలేదు. కాబట్టే కర్జాయ్ పర్యటనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాని మన్మోహన్సింగ్ ఆయనతో రహస్య సమాలోచనలను సైతం సాగిం చారు. కర్జాయ్ భారీ శతఘు్నలు, యుద్ధ విమానాలు తదితర ఆయుధ సామాగ్రిని కోరారు. అవి పాక్ సరిహద్దులలో మోహరించడానికేనన్నది స్పష్టమే. అయినా గుర్తించలేని గుడ్డితనం కయానీకి లేదు. అఫ్ఘాన్-భారత్ సైనిక బంధమంటే పాక్ను చుట్టుముట్టడమేనని పాక్ సైన్యం భావిస్తున్నది. మన సరి హద్దుల్లోని తుపాకుల మోతకు, అఫ్ఘాన్ సరి హద్దుల్లోని శతఘు్నల ఘోషకు కారణం ఒక్కటే. ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ కోసం అమెరికా పాక్కు అందిస్తున్న భారీ ఆయుధ, ఆర్థిక సహాయాన్ని సైన్యం దారిమళ్లించి భార త వ్యతిరేక జిహాదీ ముఠాలకు చేరవేస్తోందనేది 2010లో రచ్చకెక్కింది. ఆ తదుపరి అమెరికా పాక్కు అందించే సైనిక సహాయం దారి మళ్లకుండా ఆయుధాలు, నిధులు ఉగ్రవాద వ్యతిరేక యుద్ధానికి అవసరమైనవి మాత్రమేనని ధృవీకరించే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. నామమాత్రమైన ఆ ధృవీకరణను సైతం అమెరికా ఫిబ్రవరిలో కయానీ కోరిక మేరకు గుట్టు చప్పుడు కాకుండా ఎత్తేసింది. అమెరికా, కయానీల మధ్య కుదిరిన సయోధ్యను గుర్తించకుండానే మన విదేశాంగశాఖ అఫ్ఘాన్, పాక్ విధానాలను రూపొందించుకుంటోంది. అఫ్ఘాన్ యుద్ధం ప్రారంభంలో ముషార్రప్ అమెరికాకు ఎంతటి కీలక మిత్రుడో నేడు కయానీకూడా అంతే కీలక మిత్రుడు. అప్ఘాన్ యుద్ధం ముగింపు దశలో సైన్యం నవాజ్ ‘ధిక్కారాన్ని’ సహించడమంటే వారి మధ్య ‘అంగీకారం’ కుదిరిందనే అర్థం కావాలి. ఆ ‘అంగీకారం’ ముషార్రఫ్ను ఉరికంబానికి ఎక్కించవచ్చేమోగానీ భారత్ పట్ల ‘మెతక’ వైఖరిని కనపబరచదనే అర్థం. అలాంటి ‘అంగీకారం’ ఏదీలేకుంటే మనం మరో సైనిక కుట్రను చూడాల్సిరావొచ్చు. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ముషార్రఫ్పై హత్యాభియోగం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్పై మంగళవారమిక్కడి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఒకటి హత్యా నేర అభియోగాలను నమోదు చేసింది. 2007లో జరిగిన మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ఈ చర్య తీసుకుంది. 66 ఏళ్ల దేశ చరిత్రలో అత్యధిక కాలం సైన్యమే పాలించిన పాక్లో ఓ మాజీ సైనిక పాలకుడిపై అభియోగాలను నమోదు చేయడం ఇదే తొలిసారి. భుట్టో హత్యకు యత్నించడం, హత్యకు కుట్ర చేయడం, హత్యకు అవసరమైనవి సమకూర్చడం వంటి అభియోగాలు వీటిలో ఉన్నాయి. ఈ కేసులో ముషార్రఫ్తో పాటు ఏడుగురు నిందితులున్నారు. నేరం రుజువైతే ముషార్రఫ్కు మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.