Priya Bhavani Shankar
-
ఓటీటీలోకి బిగ్గెస్ట్ హిట్ సినిమా.. 'డార్క్' పేరుతో తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'బ్లాక్' తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. ఎలాంటి ప్రకటన లేకుంగానే సడెన్గా 'డార్క్' టైటిల్తో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్లో భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కావడంతో ఈ వీకెండ్ చూసేయవచ్చని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రంలో నటుడు జీవా(Jiiva), నటి ప్రియ భవానీశంకర్(Priya Bhavani Shankar) జంటగా నటించారు. ప్రొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్బాబు నిర్మించిన ఈ చిత్రానికి జీకే.బాలసుబ్రమణి దర్శకత్వం వహించారు.సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో పాటు మంచి థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. బ్లాక్ (డార్క్) చిత్రాన్ని రూ. 5 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతటి భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ 'డార్క్' పేరుతో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతంది. ఈ సినిమా మొత్తం జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రల చుట్టూ ఓ విల్లా నేపథ్యంలోనే సాగడం గమనార్హం. 'కోహెరెన్స్ 'అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దర్శకుడు బాలసుబ్రమణి డార్క్ మూవీని తెరకెక్కించినట్లు నెట్టింట భారీగా ప్రచారం జరిగింది.కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ. -
'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)
థియేటర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు.. ఓటీటీ అంటే థ్రిల్లర్ మూవీస్ అనేది ప్రస్తుతం ట్రెండ్. అందుకు తగ్గట్లే డిఫరెంట్ కథలతో తీస్తున్న థ్రిల్లర్స్.. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలా కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్లోకి వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 'బ్లాక్'. అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు 'బ్లాక్' నచ్చేస్తుంది. 1964లో సినిమా ఓపెన్ అవుతుంది. తన ఫ్రెండ్, అతడి ప్రేయసికి మనోహర్ (వివేక్ ప్రసన్న).. బీచ్ దగ్గర్లోని తన విల్లాలో ఉంచి, తర్వాతి రోజు ఉదయం పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల వాళ్లిద్దరినీ ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే స్టోరీ 60 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతానికి వస్తుంది.వసంత్, ఆరణ్య.. వాళ్లిద్దరి ప్రవర్తన, మనస్తత్వాలు ఇలా సీన్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఇవి రొటీన్గా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్లిద్దరూ విల్లాలోకి అడుగుపెడతారో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. తమలాంటి ఇద్దరు వ్యకులు వీళ్లకు కనిపించడంతో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అలా హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్ ఏదో ఉందనే ఉత్కంఠ కలుగుతుంది. చీకటి ప్రదేశం కారణంగా ప్రతిసారీ తాము వివిధ కాలాల్లోకి (టైమ్ లైన్) ముందుకు వెనక్కి వెళుతున్నామని వసంత్ తెలుసుకోవడం, చీకటి ప్రదేశం కారణంగానే వసంత్-ఆర్యం ఒకరికొకరు దూరమవడం.. చివరకు ఎలా కలుసుకున్నారనేది సినిమా.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్గా ఉంటుంది. కాకపోతే అలా జరగడానికి వెనకున్న కారణాన్ని బయటపెట్టే సీన్ మాత్రం పేలవంగా ఉంటుంది. ఏదో ఫిజిక్స్ క్లాస్ చెబుతున్నట్లు వేగంగా చూపించేశారు. దీంతో సగటు ప్రేక్షకుడికి సరిగా అర్థం కాదు. క్లైమాక్స్ కూడా ఏదో హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా రెండు గంటల్లోపే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారు?సినిమాలో జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. వీళ్లిద్దరూ ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. వాస్తవానికి, ఊహలకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా జీవా వేరియషన్స్ చూపించాడు. వివేక్ ప్రసన్నతో పాటు మిగిలిన వాళ్లది అతిథి పాత్రలే. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ కేజీ సుబ్రమణి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే స్క్రిప్ట్లో లాజిక్స్ సరిగా ఎష్టాబ్లిష్ చేసుంటే బాగుండేది అనిపించింది. శామ్ సీఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్. కొన్ని సీన్లను బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. మిగిలిన డిపార్ట్మెంట్స్ తమ వంతు న్యాయం చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ఓటీటీలో థ్రిల్లర్ మూవీ ఏదైనా చూద్దామనుకుంటే 'బ్లాక్' ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి తమిళ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ ఉన్నాయి.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'బిగ్బాస్' హౌస్లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి) -
'జీబ్రా' సినిమా రివ్యూ
యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్తో దీన్ని తీశారు. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన ధనంజయ, 'బాహుబలి' సత్యరాజ్, సత్య, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్తోనే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా (నవంబర్ 22) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?షేర్ మార్కెట్, స్కామ్ అనగానే చాలామందికి 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. లేదంటే మొన్నీమధ్యనే తెలుగులో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి, దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్తో తీసిన 'లక్కీ భాస్కర్' అద్భుతమైన హిట్. మరీ ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్తోనే తీసిన మూవీ 'జీబ్రా'. అందులో డబ్బు కొట్టేసి హీరో ఎవరికీ దొరకడు. ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు. కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్కి దొరికిపోతాడు.హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది. సూర్య, అతడి తల్లి, అతడి ప్రేయసి స్వాతి.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోతాం. కాసేపటికే తనకో సమస్య వచ్చిందని స్వాతి.. హీరో సాయం కోరుతుంది. మనోడుతో చాలా తెలివితో బ్యాంకులో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు. కానీ ఇక్కడే ఊహించని సమస్య మరొకటి వస్తుంది. రూ.4 లక్షలతో స్కామ్ చేస్తే రూ.5 కోట్ల కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది. ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలీ.. పెద్ద పెద్ద గుండాలనే శాసించే ఇతడికి రూ.5 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు 4 రోజులు పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.కథ పరంగా ఇది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంక్ సిస్టమ్లోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్గా చూపించారు. సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం, దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్కో దాన్ని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్గా ఉంది.చెస్లో మంత్రి, గుర్రం, ఏనుగు, భటులు ఇలా చాలా ఉంటాయి. ఈ సినిమాలో చెస్ గేమ్లా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మెటాఫర్స్, డ్రస్సు కలర్స్ మీరు సినిమాలో చూడొచ్చు. అన్నీ ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుక్కి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇది కాస్త ల్యాగ్, రొటీన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్ని కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?సూర్య పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్లో కనిపిస్తాయి. డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్గా చేసిన ధనంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతడి పాత్ర బాగుందనిపిస్తుంది. సత్య సిట్చుయేషనల్ కామెడీ సూపర్. డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు. రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల ఇతడి పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది. బాబాగా చేసిన సత్యదేవ్, స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్.. ఎవరికి వాళ్లు పూర్తి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే రైటింగ్కి నూటికి 90 మార్కులు వేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు ఇది నచ్చదు. డిఫరెంట్ థ్రిల్లర్స్, అందులోనూ బ్యాంక్ స్కామ్ తరహా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'జీబ్రా' నచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ 'లక్కీ భాస్కర్' రిలీజైన కొన్నిరోజుల తర్వాత థియేటర్లలోకి రావడం దీనికి ఓ రకంగా మైనస్.రేటింగ్: 2.75/5- చందు డొంకాన(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్పై బన్నీ) -
‘జీబ్రా’ క్లైమాక్స్ వరకు ఆ విషయం తెలియదు: సత్యదేవ్
‘ఇప్పుడు బ్యాంక్ వ్యవస్థ అంతా డిజిటల్ అయ్యింది. అక్కడ క్రైమ్ చేయడం అంత ఈజీ కాదు. బ్యాంక్ లో పని చేసే వాళ్లకి తప్పితే సామాన్యులకు అక్కడ జరిగే తప్పులు తెలియవు. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్ లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్ తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ తో ‘జీబ్రా’ సినిమాను తెరకెక్కించాడు. ఏటీఎం లో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ తో డబ్బులు బయటికి వస్తాయి. ఆ సౌండ్ వెనుక ఏం జరుగుతుందనేదే ఈ సినిమా. కామన్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు హీరో సత్యదేవ్. కన్నడ స్టార్ హీరో డాలీ ధనంజయ హైలీ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సత్యదేవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ జీబ్రా..బ్లాక్ అండ్ వైట్ కి మెటాఫర్. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. అలాగే చివరి వరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే ఉంటుంది. అందుకే టైటిల్ ఫాంట్ కి గ్రే పెట్టి, సినిమాకి జీబ్రా అనే టైటిల్ పెట్టారు. నాకు స్క్రిప్ట్ పంపినప్పుడే అదే టైటిల్ తో వచ్చింది. అలాగే నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అన్ని రకాలుగా జీబ్రా టైటిల్ యాప్ట్.→ ఈ కథ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. ఇంత గొప్ప కథ మనదగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలని విన్నపుడే ఫిక్స్ అయ్యాను. సినిమా రిలీజైన తర్వాత ఆయన రైటింగ్, డైరెక్షన్ కి చాలా మంచి పేరు వస్తుంది.→ ఇందులో నేను బ్యాంకర్ని. ధనుంజయ గ్యాంగ్ స్టర్.. మా రెండు ప్రపంచాలు ఎలా కలిశాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పుష్పలో జాలీ రెడ్డి పాత్ర తనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో చాలా మంచి శ్వాగ్ ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ గాచేశాడు. ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులు ఇంకా దగ్గరవుతాడు. సినిమా కన్నడ లో కూడా రిలీజ్ అవుతుంది, అక్కడ తనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ కూడా సినిమా బాగా ఆడుతుంది.→ నాకు కామన్ మ్యాన్ రోల్స్ ఇష్టం. ఇందులో ఆ కామన్ మ్యాన్ కనెక్ట్ నచ్చింది. ఇందులో లుక్ మారుస్తున్నాను. బ్యాంకర్ రోల్ ఇప్పటివరకూ చేయలేదు. అది ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇప్పటివరకూ దాదాపు సీరియస్ రోల్స్ చేశాను. దాన్ని బ్రేక్ చేద్దామని దర్శకుడు ఈశ్వర్ కూడా భావించారు. ఇందులో చాలా కొత్త సత్యదేవ్ ని చూస్తారు. కామన్ మ్యాన్ విన్ అనేది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్.→ ప్రస్తుతం 'ఫుల్ బాటిల్' అనే సినిమా చేస్తున్నాను. అది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్. వెంకటేష్ మహా తో ఓ సినిమా ఉంటుంది. చాలా గ్రేట్ స్టొరీ కుదిరింది. -
తప్పులు దిద్దుకుని జీబ్రా చేశాను : ఈశ్వర్ కార్తీక్
సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా, ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కీనాటో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ–‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 32 కంపెనీల్లో ఉద్యోగం చేశాను. అయితే నా ఇష్టం సినీ రంగంవైపు ఉందని గ్రహించి సినిమాల్లోకి వచ్చాను. కీర్తీ సురేష్గారితో ‘పెంగ్విన్ ’ సినిమా తీశాను. ఆ మూవీ రిలీజ్ తర్వాత నా రచన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, తప్పులు దిద్దుకుని ‘జీబ్రా’ చేశాను. ఫైనాన్షియల్ క్రైమ్స్ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది. నేను బ్యాంకు ఉద్యోగిగా చేసిన సమయంలో అక్కడ జరిగే కొన్ని తప్పులను గమనించాను. ఆ అనుభవాలను కూడా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాను. సత్యదేవ్, ధనంజయగార్లు బాగా నటించారు. సత్యరాజ్, ప్రియభవానీ పాత్రలూ ఆసక్తిగా ఉంటాయి. రవి బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. త్వరలో నా కొత్త చిత్రం ప్రకటిస్తాను’’ అన్నారు. -
పెద్ద హీరో, 55 రోజులు నటించా కానీ..: హీరోయిన్
కళ్యాణం కమనీయం సినిమాతో ప్రియా భవానీ శంకర్ టాలీవుడ్కు పరిచయమైంది. అయితే, ఒక పెద్ద హీరో సినిమాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ చెన్నై బ్యూటీ తాజాగా పంచుకుంది. స్కిన్ షోకు దూరంగా ఉంటూనే అవకాశాలను గోల్డెన్ ఛాన్స్లు దక్కించుకుంటున్న ప్రియా న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి ఆపై తమిళ బుల్లితెరపై సీరియల్స్లో మెప్పించింది. అక్కడ వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా భారీగానే ఆఫర్లు అందుకుంది. 'మేయాద మాన్'తో ఎంట్రీ ఇచ్చిన ప్రియ భవానీ శంకర్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. డీమాటీ కాలనీ –2, ఇండియన్– 2,రత్నం,భీమా వంటి సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ జీవాతో కలిసి బ్లాక్ చిత్రంలో నటించింది.ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఒక పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఎంతో ఇష్టపడి ఆ చిత్రంలో 55 రోజుల పాటు నటించినట్లు చెప్పారు. ఎండనక వాననకు ఎంతో శ్రమించి నటించినట్లు చెప్పారు. షూటింగ్ పూర్తి అయిన తరువాత డబ్బింగ్ చెప్పడానికి వెళ్లగా షాక్ అయ్యానన్నారు. అయితే, ఆ సినిమాలో తన పాత్ర కేవలం 5 నిమిషాల కంటే తక్కువగానే ఉంది. దీంతో తనకు చెప్పిన కథ ఏమిటి, తనతో చేసిన షూటింగ్ అంతా ఏమైంది అని ఆ చిత్ర దర్శకుడిని అడగ్గా అదంతా మ్యూజిక్లో వస్తుంది చూడండి అని చెప్పారన్నారు. దీంతో ఆ చిత్ర హీరోకు ఫోన్ చేసి విషయం చెప్పానన్నారు. దీంతో ఆయన తానూ 135 రోజులు షూటింగ్ చేశానని, తన సన్నివేశాలే లేవని చెప్పారని నటి ప్రియభవానీ శంకర్ పేర్కొన్నారు. అయితే ఆమె ఏ చిత్రం గురించి చెప్పారు? ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. -
ఓటీటీలో హారర్ మూవీ.. నిద్రలేని రాత్రి కోసం సిద్ధమా?
బ్లాక్బస్టర్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. అరుళ్ నిధి, ప్రియ భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డీమాంటి కాలనీ 2. ఇది 2015లో వచ్చిన హిట్ మూవీ డీమాంటి కాలనీకి సీక్వెల్గా తెరకెక్కింది. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాట ఆగస్టు 15న విడుదలై దాదాపు రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో అదే నెల 23న తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జీ5లో తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు.సినిమా విషయానికి వస్తే..క్యాన్సర్తో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను డెబీ (ప్రియ భవానీ శంకర్) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతడిని క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. అతడి ఆత్మహత్య వెనక కారణం తెలియక మానసికంగా సతమతమవుతుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని, ఈ తరహాలోనే పలువురూ మరణించారని తెలుసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? వరుస చావులకు చెక్ పెట్టేందుకు ఆమె ఏం చేసింది? ఈ పుస్తకానికి, డిమాంటి కాలనీకి ఉన్న లింకేంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by ZEE5 Tamil (@zee5tamil) చదవండి: హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్ -
హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2 రివ్యూ.. ఆడియన్స్ను భయపెట్టిందా?
టైటిల్: డీమాంటీ కాలనీ-2నటీనటులు: ప్రియాభవానీ శంకర్, అరుల్ నిధి, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ తదితరులుదర్శకుడు: అజయ్ ఆర్ జ్ఞానముత్తునిర్మాతలు: విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్కుమార్నిర్మాణసంస్థలు: బీటీజీ యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్సంగీతం - సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ - హరీశ్ కన్నన్ఎడిటర్ - కుమరేశ్ డివిడుదల తేదీ: ఆగస్టు 23(తెలుగు)హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. ఈ జానర్లో వచ్చే చిత్రాలకు కొదవే లేదు. ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్బేస్ ఉంటుంది. అందుకే ఇలాంటి కథలపై డైరెక్టర్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలా 2015లో వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్గా డీమాంటీ కాలనీ-2 తీసుకొచ్చారు. ప్రియా భవానీ శంకర్, అరుల్ నిధి జంటగా నటించారు. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈనెల 23న రిలీజవుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షో వేశారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డీమాంటీ కాలనీ 2 అభిమానులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే..తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సామ్ ఆత్మహత్యకు పాల్పడటాన్ని అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేదు. భర్త ఎందుకలా మరణించాడో తెలుసుకోవాలని ఆరాతీయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆరేళ్లకు ఒకసారి లైబ్రరీలోని పుస్తకం చదవడానికి వెళ్లిన వ్యక్తులందరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఆ మరణాలు ఆపేందుకు డెబీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) గురించి కూడా తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్న డెబీ.. ఆ ఇద్దరు అన్నదమ్ములను డెబీ, తన మావయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో కలిసి కాపాడిందా? వీరికి టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఎలా సాయపడ్డారు? తన భర్త కోరికను డెబీ నెరవేర్చిందా? శ్రీనివాస్ను రఘునందన్ ఎందుకు చంపాలని అనుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే డీమాంటీ కాలనీ-2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..హారర్ థ్రిల్లర్కు సీక్వెల్గా వచ్చిన డీమాంటీ కాలనీ 2. ప్రీక్వెల్ను బేస్ చేసుకుని ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు. అందుకే డీమాంటీ కాలనీ చూసిన వారికైతే సీక్వెల్ కాస్తా ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీ విషయానికొస్తే డీమాంటీ అనే ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇక హారర్ సినిమాలంటే సస్పెన్స్లు కామన్ పాయింట్. ఫస్ట్ పార్ట్లో సినిమా ప్రారంభంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, అతని ఆత్మతో మాట్లాడేందుకు భార్య చేసే ప్రయత్నాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి.సెకండాఫ్ వచ్చేసరికి ఇందులోకి డీమాంటీ కాలనీ పాత్రలను తీసుకొచ్చిన తీరు ఆడియన్స్కు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. డీమాంటీ కాలనీకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా హారర్ సీన్స్లో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని డైరెక్టర్ చూపించారు. కథ మధ్యలో సర్ప్రైజ్లు కూడా ఆడియన్స్ను మెప్పిస్తాయి. కథలో ప్రధానంగా ఆత్మతో పోరాడే సీన్స్ మరింత ఆసక్తిగా మలిచారు జ్ఞానముత్తు. ఈ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ హైలెట్. టిబెటియన్ యాక్టర్తో సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని హారర్తో పాటు అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు లాంటి పాత్రలతో ఎమోషన్స్ పండించాడు. క్లైమాక్స్ విషయానికొస్తే ఆడియన్స్ను అద్భుతమైన థ్రిల్లింగ్కు గురిచేశాడు. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చివర్లో పార్ట్-3 పై ఇచ్చిన హింట్తో మరింత క్యూరియాసిటీని పెంచేశాడు జ్ఞానముత్తు.ఎవరెలా చేశారంటే..ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా హారర్ సీన్స్లో హావభావాలు అద్భుతంగా పండించింది. అరుని నిధి ద్విపాత్రాభినయంతో అదరగొట్టేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. గ్రాఫిక్స్, సౌండ్ ఫర్వాలేదనిపించాయి. సామ్ సీఎస్ బీజీఎం ఈ చిత్రానికి హైలెట్. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్లో కాస్తా ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్గా హారర్ జానర్ ఇష్టపడేవారికి ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. -- పిన్నాపురం మధుసూదన్, సాక్షి వెబ్డెస్క్ -
‘డెమోంటే కాలనీ 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ప్రియుడితో పెళ్లి ప్రకటించిన టాప్ హీరోయిన్
కమలహాసన్ ఇండియన్ –2 సినిమాలో మెరిసిన నటి ప్రియా భవానీ శంకర్ తాజాగా శుభవార్త చెప్పారు. త్వరలో తన ప్రియుడితో కలిసి ఏడు అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. గోపీచంద్ భీమా సినిమాతో పాటు సంతోష్ శోభన్తో కల్యాణం కమనీయం అనే సినిమాలో నటించిన ఈ చెన్నై బ్యూటీ నాగచైతన్య ధూత వెబ్ సిరీస్తో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇప్పటికే ధనుష్, విశాల్, శింబు, కార్తి వంటి స్టార్ హీరోలతో ఆమె కలిసి నటించింది. ఆగష్టు 15న డీమాంటీ కాలనీ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.మెసేజ్ చేసినా లింక్ పెట్టేశారు: ప్రియా భవానీ శంకర్ప్రియా భవానీ శంకర్ తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ అనే వ్యక్తితో తాను పదేళ్ల నుంచి రిలేషన్లో ఉన్నానని ఓపెన్ అయింది. సినీ పరిశ్రమలోకి రాక ముందునుంచే రాజ్తో ప్రేమలో ఉన్నట్లు ఆమె తెలిపింది. అయితే, ప్రియుడితో డేటింగ్పై ఆసక్తి చూపుతున్న ఈ బ్యూటీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదనే ప్రచారం జరిగింది. దీంతో వారిద్దరూ విడిపోయారంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను చాలామంది హీరోలతో కలిసి నటించడం వల్ల ఏదైనా సందర్భంలో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే వెంటనే తప్పుగా ప్రచారం చేశారని చెప్పింది. వారితో రిలేషన్లో ఉన్నానంటూ కూడా కామెంట్ చేశారని గుర్తుచేసుకుంది. లక్కీగా ఇప్పుడు వారందరికీ పెళ్లి అయిపోయిందని సరదాగా చెప్పుకొచ్చింది. ఒకవేళ కళాశాల చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి ప్రపోజల్ వచ్చి ఉంటే రాజ్తో ఈ పాటికే జరిగి ఉండేదన్నారు. కాగా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రియుడు రాజ్ గురించి చెబుతూ తన జీవితంలోకి రాజ్ రావడంతోనే అదృష్టం అని పేర్కొన్నారు. తను లేకపోతే తాను ఇప్పటికీ ఒక మధ్య తరగతి కుటుంబ యువతిగానే మిగిలిపోయేదాన్నని అన్నారు. రాజ్ అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి చేర్చిందనే అభిప్రాయాన్ని నటి ప్రియాభవానీ శంకర్ వ్యక్తం చేశారు. -
భారతీయుడు 2 ఫ్లాప్.. నా వల్లే అంటున్నారు: హీరోయిన్
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. భారతీయుడు సినిమా అద్భుతంగా ఉంటే దాని సీక్వెల్ దరిదాపుల్లో కూడా లేదని పలువురూ విమర్శించారు. ఈ మూవీ విడుదలైనప్పుడు తనను తీవ్ర స్థాయిలో విమర్శించారంటోంది హీరోయిన్ ప్రియ భవానీ శంకర్.ముందే తెలిస్తే..హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ.. నా కెరీర్లో నేను సంతకం చేసిన భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ మూవీ ఒప్పుకోగానే నాకు ఎన్నో ఛాన్సులు వచ్చాయి. పెద్ద సినిమాలు చేస్తేనే హీరోయిన్గా భావిస్తున్నారు. ఇకపోతే ఫ్లాప్ అవుతాయని ముందే తెలిస్తే ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవ్వాలనే కష్టపడతారు.వర్కవుట్ కాకపోతే..అందరూ ఇష్టంగా కష్టపడి పని చేసినప్పుడు అది వర్కవుట్ కాకపోతే చాలా బాధేస్తుంది. ఇండియన్ 2 హిట్ అవదని తెలిసినా సరే దాన్ని నేను వదులుకోకపోయేదాన్ని. కమల్ -శంకర్ సర్ కాంబినేషన్లో మూవీని ఎవరు వద్దనుకుంటారు? కానీ జనాలు నన్ను మాటలతో వేధిస్తున్నారు. అందుకు బాధగా ఉంది. మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ..ఒక్కరే కారణం కాదుసినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి. కానీ నేనే కారణమంటే మనసుకు బాధేస్తోంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియ భవానీ శంకర్ 'డీమాంటి కాలనీ' సినిమాలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
హారర్... థ్రిల్
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్– శ్రీ బాలాజీ ఫిలింస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్ను దర్శకుడు రామ్గోపాల్ వర్మ రిలీజ్ చేసి, ‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది.సినిమా హిట్టవ్వాలి’ అన్నారు. కాగా అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్గా ‘డీమాంటీ కాలనీ 2’ రూపొందింది. ‘‘హారర్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ఇది. డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి? చివరగా వెళ్లినవారు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు?’ అనేది ‘డీమాంటీ కాలనీ 2’లో ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్ట్యాగ్తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్ప్లే కూడా చాలా రొటీన్గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్తో కమల్ చేసే యాక్షన్ సీన్కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
‘రత్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రత్నంనటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులునిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్దర్శకత్వం: హరిసంగీతం: దేవీ శ్రీ ప్రసాద్విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాస్ సినిమాలను డిఫరెంట్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషన్ సీన్స్లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఎమ్మెల్యే పన్నీర్గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
చెబుతావా రత్నం
విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రత్నం’. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె. రాజ్కుమార్ విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘చెబుతావా..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా, సింధూరి విశాల్ పాడారు. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘రత్నం’. ‘చెబుతావా..’ పాట మెలోడియస్గా, ఎమోషనల్గా సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సీరియల్ నుంచి సినిమాల్లోకి.. ఇప్పటికీ అలాగే!
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన కథానాయికల్లో ప్రియ భవానీశంకర్ ఒకరు. 2017లో మేయాదమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఆ తరువాత నటించిన కడైకుట్టి సింగం, మాన్స్టర్ వంటి చిత్రాల సక్సెస్ ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ చేశాయి. ఇకపోతే తమిళంతో పాటు తెలుగులోనూ అవకాశాలు రావడంతో ప్రియాభవానీ శంకర్ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల ఈమె గోపీచంద్ సరసన నటించిన తెలుగు చిత్రం భీమా విడుదలై మంచి వసూళ్లనే సాధించింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. నటనతో పాటు రెస్టారెంట్ బిజినెస్తో బాగానే సంపాదిస్తున్నారు. ఎక్కువగా పద్ధతిగానే కనిపించే ప్రియ చాలామటుకు ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటుంది. తన షేర్ చేసే ఫోటోల్లో కూడా ఎక్కడా అతి అనిపించదు. అందుకే చాలామంది ఆమెను ఆరాధిస్తున్నారు. నేచురల్ బ్యూటీ అని పొగిడేస్తున్నారు. ఇకపోతే ఈమె నటించిన డీమాంటీ కాలనీ– 2 చిత్రం విడుదల కావాల్సి ఉండగా విశాల్ సరసన నటించిన రత్నం చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. వీటితో పాటు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్– 2 చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) చదవండి: దేశంలో నాలాగే ఒంటరిగా చాలామంది ఉన్నారు.. తప్పుగా రాయకండి: మీనా -
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: హీరో గోపీచంద్
‘‘భీమా’ పక్కా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. నేను చేసిన భీమా పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాలున్నాయి. ఈ కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ని హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది. సినిమా చూసి బయటికి వచ్చాక ప్రేక్షకుల మనసులో భీమా నిలిచిపోతాడనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఎ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భీమా’. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ పంచుకున్న విశేషాలు. ► ‘భీమా’ సహనిర్మాత శ్రీధర్గారు కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని నాకు పరిచయం చేశారు. అప్పుడో కథ చెప్పాడు హర్ష.. కథ బావుంది కానీ ఆ సమయంలో చేయకూడదని అనిపించింది. పోలీస్ నేపథ్యంలో ఏదైనా వైవిధ్యమైన కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొన్న హర్ష ఆ తర్వాత వచ్చి ‘భీమా’ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చడంతో ఓకే చెప్పాను. ► నేను గతంలో పోలీసు పాత్రలు చేశాను. ‘గోలీమార్’లో డిఫరెంట్ కాప్. ‘ఆంధ్రుడు’ లవ్ స్టోరీ నేపథ్యంలో నడుస్తుంది కానీ దాని నేపథ్యం పోలీసు కథే. ‘శౌర్యం’ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పోలీస్ పాత్రని ‘భీమా’లో చేశాను. ఈ పోలీసు కథలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది.. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. హర్ష కన్నడలో చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ‘భీమా’ని అద్భుతంగా తీశాడు.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంటుంది. ► ‘భీమా’ పరశురామ క్షేత్రంలో జరిగే కథ. ట్రైలర్లో చూపించినట్లు అఘోరాలు, కలర్ ప్యాలెట్, నేపథ్య సంగీతం వల్ల ‘అఖండ’ సినిమాతో పోలుస్తున్నారు. కానీ, ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ. ఈ సినిమాలో శివుని నేపథ్యం ఉంది. పైగా సినిమా కూడా మహా శివరాత్రికి వస్తోంది. అయితే దీన్ని మేం ముందుగా ప్లాన్ చేయలేదు.. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను. ► నిర్మాత రాధామోహన్, నా కాంబినేషన్లో ‘పంతం’ (2018) సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ‘పంతం’ వాణిజ్య పరంగా సక్సెస్ అయినా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ, ‘భీమా’తో తప్పకుండా హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాని చాలా గ్రాండ్గా నిర్మించారాయన. ► మా నాన్న (డైరెక్టర్ టి. కృష్ణ)తో పాటు ఆ తరంలోని దర్శకులు జనాలతో మమేకం అయ్యేవారు. అలా ప్రజల సాధక బాధకాలు, సమస్యలు తెలుసుకుని కథ రాసుకుని, సామాజిక బాధ్యతతో సినిమాలు తీసి హిట్ సాధించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శంకర్గారి లాంటి ఒకరిద్దరు దర్శకులు తప్ప మిగిలిన వారు సమాజం, ప్రజల నేపథ్యంలో కథలు రాయడం లేదు. సొసైటీ బ్యాక్డ్రాప్ని ఎంచుకుని సరైన విధానంలో తెరపై చూపించగలిగితే ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. దర్శకత్వం అనేది చాలా కష్టమైన పని.. అందుకే నాకు ఆ ఆలోచన లేదు. ► చిత్ర పరిశ్రమలో దాదాపు 22 ఏళ్ల ప్రయాణం నాది.. ఇన్నేళ్ల జర్నీ హ్యాపీగా ఉంది కానీ నటుడిగా పూర్తిగా సంతృప్తి పడటం లేదు. ఒక నటుడికి సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు.. ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే తపన ఉంటుంది. ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ, ఆ చాన్స్ రాలేదు.. వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాం. ప్రస్తుతం శ్రీను వైట్లగారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. ఆ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లతో ఓ చిత్రం, యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేయాల్సి ఉంది. -
‘భీమా’ డిఫరెంట్ కాప్ స్టోరీ..ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి: గోపీచంద్
‘ఇప్పటికే నేను పలు సినిమాల్లో పోలీసు పాత్రలు చేశాను. గోలీమార్ డిఫరెంట్ కాప్ స్టోరీ. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. లాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో గోపీచంద్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం రీలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ టైమ్లో దర్శకుడు హర్ష నాకొక కథ చెప్పారు. అది బాగుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా 'కథ' చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అలా కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది. ► భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ఈ చిత్రాన్ని చాలా మంది 'అఖండ' తో పోలుస్తున్నారు. కానీ ఆ కథతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వల్ల అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా 'అఖండ' పోలిస్తే మంచిదేగా (నవ్వుతూ). భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం. ► హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే చేశాడు. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు యాప్ట్ అని టైటిల్ గా పెట్టడం జరిగింది. ► ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. కథకు కావాల్సిన పాత్రలు. పాత్రలకు ఒక పర్పస్ ఉంటుంది. ► రవిబస్రూర్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయింది. ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు. ► ప్రస్తుతం శ్రీను వైట్ల గారితో ఓ సినిమా చేస్తున్న. ముఫ్ఫై శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో ఉంటుంది. -
Priya Bhavani Shankar: క్యూట్ అందాలతో కుర్రకారు మనసు దోచేస్తున్న ప్రియా భవానీ (ఫొటోలు)
-
గల్లీ సౌండుల్లో భీమా
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కేకే రాధామోహన్ నిర్మించిన ‘భీమా’ మార్చి 8న రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గల్లీ సౌండుల్లో..’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. రవి బస్రూర్, సంతోష్ వెంకీ రాసిన ఈ పాటను సంతోష్ వెంకీ పాడారు. ‘‘గోపీచంద్ పాత్ర గురించి చెప్పే ట్రాక్ ఇది. ఈ పాట మాస్ని అల రించేలా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
18 ఏళ్లకే లవ్లో పడ్డ బ్యూటీ.. ప్రియుడికి బర్త్డే విషెస్
టీవీ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా కొనసాగుతోంది ప్రియభవానీ శంకర్. ఈమె కథానాయకిగా నటించిన డీమాంటి కాలనీ 2 త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అదే విధంగా కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్–2 చిత్రంలోనూ ప్రియా భవానిశంకర్ నటించింది. అదేవిధంగా విశాల్ హీరోగా నటిస్తున్న 43వ చిత్రంలోనూ ఈమె యాక్ట్ చేస్తుంది. ప్రేమలో మునిగి తేలుతున్న బ్యూటీ ఇకపోతే ఈమె ప్రేమ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చేసిందీ బ్యూటీ. తాను 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానంటూ బాయ్ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫొటోలను తరచూ నెట్టింట పోస్ట్ చేస్తోంది. తాను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు రాజ్వేల్ అని కూడా చెప్పేసింది. శనివారం తన బాయ్ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా అతనితో క్లోజ్గా ఉన్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. సరదాలు, గొడవలు, ఏడుపులు.. అందులో ప్రియా భవానిశంకర్.. 'ఇక్కడున్న అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్. మేము కలిసి నవ్వుకుంటాం, గొడవ పడుతాం, ఏడుస్తాం, తరచూ విడిపోతాం. రాజ్వేల్ తప్పుడు లిరిక్స్ను కూడా ఎంతో గట్టిగా ధైర్యంగా పాడుతుంటాడు. మేమిద్దరం వేర్వేరు భావాలు కలిగిన వాళ్లం. అయినప్పటికీ అతను నన్ను ఎప్పుడూ సంతోష పరుస్తుంటాడు. అతనితో నేను ప్రేమగా, జాలీగా ఉంటాను. అతడు తోడుంటే ఏ సమస్యలూ లేనట్లు ప్రశాంతంగా అనిపిస్తుంది. సాయంత్రం సంధ్యా వేళల్లో అతనితో ప్రశాంతంగా కూర్చొని సూర్యుడిని చూస్తూ నా మనసులోని కష్టాలను చెప్పుకోగలుగుతాను. ఈ జీవితానికి అది చాలు. కడవరకు ఆనందంగా గడిపేస్తాను..' అని ఎమోషనలైంది హీరోయిన్. View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్.. యానిమల్, 12th ఫెయిల్ చిత్రాలకు అవార్డ్స్ పంట -
సౌత్లో ఈ బ్యూటీనే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్!
కెరీర్ ప్రారంభంలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ పొందిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రూట్ మార్చింది. మోడ్రన్గా మారిపోయింది. మెల్లమెల్లగా ఎదుగుతూ టాప్ హీరోయిన్ రేంజుకి చేరుకుంది. ఇప్పటివరకు చెప్పింది హీరోయిన్ ప్రియా భవాని శంకర్ గురించే. మొదట్లో న్యూస్ రీడర్గా పనిచేసింది. అనంతరం సీరియల్స్లో నటించింది. అక్కడ తానెంటో నిరూపించుకుని.. సినిమాల్లోకి వచ్చింది. స్వతహాగా ప్రియా భవాని శంకర్.. ఇంజినీరింగ్ స్టూడెంట్. కానీ గ్లామర్ రంగాన్ని ఎంచుకుంది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) 2017లో 'మేయాద మాన్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'కడైకుట్టి సింగం' తదితర చిత్రాల్లో నటించింది. ఎక్కువగా హోమ్లీ పాత్రలు చేసే ప్రియా భవాని శంకర్.. లారెన్స్తో కలిసి 'రుద్రన్' అనే సినిమాని గతేడాది చేసింది. ఇందులో అందాలను కాస్త ఎక్కువగానే చూపించింది. అలానే లిప్లాక్ సీన్స్లోనూ నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కేవలం తమిళ వరకు మాత్రమే పరిమితమైపోకుండా తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. గతేడాది సంక్రాంతికి 'కల్యాణం కమనీయం' సినిమాలో హీరోయిన్గా చేసింది. పెద్దగా కలిసిరాలేదు. డిసెంబరులో నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్లో మంచి పాత్ర చేసింది. ఇకపోతే గతేడాది ఐదు మూవీస్ చేసిన ఈ బ్యూటీ.. 2024లో ఏకంగా 5-6 సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. దీనిబట్టి చూస్తే ఈమెని ట్రెండింగ్ హీరోయిన్ అనొచ్చేమో! (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
కోబ్రా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాలే: దర్శకుడు
డీమాంటి కాలనీ చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు అజయ్ జ్ఞానముత్తు. ఈ సినిమా సక్సెస్తో చిత్త పరిశ్రమ దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు. ఆ తర్వాత నయనతార- విజయ్ సేతుపతిలను హీరోహీరోయిన్లుగా పెట్టి తీసిన ఇమైకా నొడిగల్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత విక్రమ్ కథానాయకుడిగా నటించిన కోబ్రా చిత్రం డిజాస్టర్గా మారింది. తాజాగా ఈయన డీమాంటి కాలనీ – 2 సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇది ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన డీమాంటి కాలనీకి సీక్వెల్ కావడం గమనార్హం. బీటీజీ యూనివర్సల్ సంస్థ అధినేత బాబి బాలచంద్రన్ సమర్పణలో జ్ఞానముత్తు పట్టరై, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంలో అరుళ్నిధి, ప్రియా భవాని శంకర్ జంటగా నటించిన ఇందులో నటుడు అరుణ్ పాండియన్, నటి మీనాక్షి గోవిందరాజన్, ముత్తుకుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ హారర్, థ్రిల్లర్ కథా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని వీఆర్ మాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. తన గత చిత్రం కోబ్రా ప్లాప్ అయిందని, అయితే ఎందుకది ఫ్లాప్ అయిందో అర్థం కాక నిరాశతో ఉన్నప్పుడు నటుడు అరుళ్ నిధి వచ్చి జరిగినదాన్ని మర్చిపోండి మనం మళ్లీ సినిమా చేద్దామని భుజం తట్టి ప్రోత్సహించారన్నాడు. అప్పటి నుంచి నేటి వరకు ఆయన తన వెన్నంటే ఉన్నారన్నాడు. ఇలాంటి మంచి వ్యక్తులు తన చుట్టూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ చిత్రం ద్వారా తన తండ్రిని నిర్మాతను చేయాలన్న కోరిక నెరవేరిందన్నాడు. చదవండి: బిగ్బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. -
స్టార్ హీరో కొత్త చిత్రం.. టైటిల్ ఫిక్స్!
మార్క్ ఆంటోనీ చిత్రం తర్వాత కోలీవుడ్ హీరో విశాల్ మరో చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఇంతకు ముందు హరి.. పూజై, తామిర భరణి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ మూవీని స్టోన్ బెంచ్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి డైరెక్టర్ హరి రెడీ అయిపోయారు. సాధారణంగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ కథా చిత్రాల కేరాఫ్గా మారిన హరి.. ఈ సినిమా కూడా అలాంటి నేపథ్యంలోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రమని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. దీనికి రత్నం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. తాజాగా దీనికి సంబంధించి విడుదల చేసిన టీజర్లో నటుడు విశాల్ ఒక వ్యక్తి తలను నరికే సన్నివేశం ఉంది. ఈ ఒక్క సీన్ చూస్తేనే మరో పక్క కమర్షియల్ ఎంటర్టైనర్గా ఇది ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిత్ర షూటింగ్ను కారైక్కుడి, తూత్తుక్కుడి, చైన్నె ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Well here it is finally, my 34th film. Happy to share THE FIRST LOOK of #RATHNAM, unleashing the combo with hari sir for the third time The action begins and looking forward to summer 2024 release. Hope u all like it. Hardwork never fails. God bless. Tamil -… pic.twitter.com/7tmHn0FrJV — Vishal (@VishalKOfficial) December 2, 2023 -
శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు.. పూనమ్ బజ్వా హాట్ లుక్స్!
►గోల్డ్ డ్రెస్లో శృతిహాసన్ స్టన్నింగ్ పోజులు ►బ్లూ కలర్ డ్రెస్సులో పూనమ్ బజ్వా హాట్ లుక్స్ ►ఎల్లో శారీలో ప్రియా భవానీశంకర్ హోయలు ►కలర్ఫుల్ డ్రెస్లో నిహారిక స్మైలీ లుక్స్ ►ఫుల్గా చిల్ అవుతోన్న ఆదా శర్మ ►గ్లామర్తో కవ్విస్తోన్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా సీరియల్ బ్యూటీ
'తెగింపు' సినిమాతో ఈ ఏడాది హిట్ కొట్టిన అజిత్.. ప్రస్తుతం 'విడాముయర్చి' చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 62వ మూవీ. పలు ఇబ్బందులు క్లియర్ చేసుకుని, సెట్స్ పైకి వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకుడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ప్రస్తుతం అజర్ బైజాన్ దేశంలో షూటింగ్ జరుగుతోంది. త్రిష, హ్యూమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే హ్యూమా ఈ సినిమా నుంచి తప్పుకొందని ఆమె బదులు రెజీనాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని ఆ పాత్రకు ప్రియా భవానిశంకర్ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఇదే కనుక నిజమైతే అజిత్ సరసన ప్రియాభవానికి ఇది తొలి సినిమా అవుతుంది. ఇప్పుటివరకు యంగ్ హీరోల సరసన చేసిన ప్రియా భవానిశంకర్.. ప్రస్తుతం శంకర్-కమలహాసన్ కాంబోలో తీస్తున్న 'ఇండియన్ 2'లో నటిస్తోంది. ఈ బుల్లితెర నటి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజుకి చేరిపోయిందనమాట. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) -
అజిత్ కొత్త సినిమా.. త్రిష అవుట్.. రంగంలోకి సీరియల్ బ్యూటీ!
మనిషి జీవితం చాలామటుకు అదృష్టం చుట్టే తిరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతటి వారైనా ఆ అదృష్ట దేవత కోసం ఎదురు చూడాల్సిందే. అది ఒక్కసారి వరిస్తే జీవితం సెటిల్ అయిపోతుంది. హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ పరిస్థితి ఇలాంటిదే. ఒక టీవీ న్యూస్ రీడర్గా పనిచేసిన ఈమె ఆ తర్వాత నటిగా అవతారం ఎత్తి టీవీ సీరియల్లో నటించింది. అది క్లిక్ అవడంతో సినీ రంగప్రవేశానికి ద్వారాలు తెరుచుకున్నాయి. అలా మేయాదమాన్ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ప్రియ భవానీ శంకర్కు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే ఇప్పటివరకు పలు చిత్రాల్లో ఈమె నటించినా స్టార్ హీరోలతో జతకట్టే అవకాశం మాత్రం రాలేదు. అలాంటిది తాజాగా ఈ బ్యూటీకి అజిత్ సరసన నటించే అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. అజిత్ నటిస్తున్న తాజా చిత్రం విడాముయిర్చి. నిజానికి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పూర్తి కావాల్సింది. అయితే అనేక కారణాల వల్ల ఇప్పటికీ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ సినిమాకు మొదట నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. ఆ తరువాత దర్శకుడు మగిళ్ తిరుమేణి లైన్లోకి వచ్చారు. దీంతో అజిత్ చిత్రం త్వరగా సెట్పైకి వచ్చేస్తుంది అని భావించిన వారికి నిరాశ ఎదురైంది. అజిత్ బైక్ టూర్ కారణంగా విడాముయిర్చి చిత్రం షూటింగ్ మరింత ఆలస్యమైంది. ఇదంతా నటి ప్రియా భవాని శంకర్ కోసమే అయ్యిందా అనిపిస్తోందిప్పుడు. ఎందుకంటే ఇందులో ఇప్పటివరకు హీరోయిన్ త్రిష కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రియా భవానీ పేరు వినిపిస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: నిర్మాతను మోసం చేసిన డైరెక్టర్.. చివరి రోజుల్లో వైద్యానికి డబ్బుల్లేక.. -
అమ్మకు క్యాన్సర్.. స్టేజీపైనే ఏడ్చేసిన హీరోయిన్
టీవీ యాంకర్గా పేరు తెచ్చుకుని ఆపై బుల్లితెరకు, ఆ తర్వాత వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. కెరీర్ తొలినాళ్లలో పెద్దగా విజయాలు అందుకోని ఈ బ్యూటీ ప్రస్తుతం పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే శుక్రవారం(సెప్టెంబర్ 22) ప్రపంచ గులాబీ దినోత్సవం సందర్భంగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రియా భవానీ హాజరైంది. క్యాన్సర్ ఆమెను బలి తీసుకోనివ్వను ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా అమ్మ కూడా క్యాన్సర్ బాధితురాలే! గతేడాది తనకు క్యాన్సర్ సోకింది. అప్పుడు నన్ను కూడా టెస్ట్ చేయించుకోమన్నారు. అమ్మ అనారోగ్యానికి గురయినప్పుడల్లా నీకు త్వరలోనే నయమవుతుందమ్మా అని చెప్తూ ఉంటాను. ప్రారంభదశలోనే దాన్ని గుర్తించి చికిత్స చేయిస్తున్నాము. ఈ రోజు ఇక్కడ ఇంతమంది వారి అనుభవాలు చెప్పుకునేందుకు రావడం చూస్తుంటే చాలా ఎంకరేజింగ్గా ఉంది. క్యాన్సర్ మా అమ్మను బలితీసుకోనివ్వను. వైద్యులపై నాకు పూర్తి నమ్మకముంది' అంటూ స్టేజీపైనే కంటతడి పెట్టుకుంది హీరోయిన్. అనంతరం అక్కడున్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపింది. వరల్డ్ రోజ్ డే అంటే ఏంటి? గులాబీ అనగానే చాలామందికి ప్రేమ, ప్రపోజల్ గుర్తొస్తుంది. అయితే గులాబీ కేవలం ప్రేమను తెలియజేసే నిర్వచనం మాత్రమే కాదు, క్యాన్సర్ మహమ్మారికి గుర్తు కూడా! క్యాన్సర్ రోగులు మనోధైర్యంతో ఉండాలనే సందేశాన్ని చాటిచెప్తూ సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే.. జీవించే సమయం తగ్గిపోవచ్చు.. కానీ, ప్రతిరోజు ఉదయించే సూర్యుడిని చూసిన ప్రతిసారి ఈరోజు గెలిచాను, జీవిస్తున్నాను అని ఫీల్ అవండి. ఈరోజు మృత్యువును జయించామని సంతోషించండి. అలా గెలిచిన ప్రతిరోజును ఆనందంగా గడుపుతూ మనసారా ఆస్వాదించండి. -
గోపీచంద్కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు, ఎవరంటే?
గోపీచంద్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భీమా’. కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఫీసర్ భీమ పాత్రలో నటిస్తున్నారు గోపీచంద్. భీమాకు జోడీగా ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మలను ఎంపిక చేసినట్లు గురువారం చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘‘కుటుంబ భావోద్వేగాలు మిళితమైన యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘భీమా’ రూపొందుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కొత్త సినిమా ప్రకటించిన విశాల్, హీరోయిన్ ఎవరంటే?
హీరో విశాల్ ఇటీవల వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈయన తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని. నటి రీతూ వర్మ నాయకిగా, ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో విశాల్ ఒక పాటను పాడటం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో పాటు తుప్పరివాలన్–2 చిత్రాన్ని చేస్తున్నారు. కాగా విశాల్ తన తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. ఇది ఆయన నటించే 34వ చిత్రం. ఈ చిత్రానికి కమర్షియల్ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ స్టూడియో, జి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంతకుముందు ఈయన హరి సింగం 1, 2, వేంగై చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా విశాల్, దర్శకుడు హరి కాంబోలో ఇంతకుముందు తామరభరణి, పూజై వంటి హిట్ చిత్రాలు రూపొందాయి. తాజాగా ఈ కాంబోలో రూపొందుతున్న మూడవ చిత్రం శనివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నటుడు విశాల్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు ఇందులో నటి ప్రియా భవానీ శంకర్ నాయకిగా నటించనున్నట్లు, నటుడు యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్ను తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కథాచిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. చదవండి: నిత్యామీనన్ ఇంట్లో విషాదం -
ఆమెతో నాకు పోటీ కాదు.. అసూయ కూడా లేదు: వాణి
ప్రస్తుతం హీరోయిన్లు అభినయం కంటే అందం, అదృష్టాన్నే ఎక్కువగా నమ్ముకుని ఉన్నారనే వాదన ఉంది. ఇకపోతే అదృష్టం వారి చేతిలో ఉండదు కాబట్టి అందాలారబోత పైనే దృష్టి పెడుతున్నారు. నటి వాణి భోజన్ ఈ విషయంలో తక్కువేమీ కాదు. తాజాగా భరత్తో కలిసి రొమాన్స్ చేసిన చిత్రం 'లవ్'. ఇటీవల జరిగిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి అందాలను ఆరబోసే విధంగా దుస్తులు ధరించి వచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్ల దృష్టి అంతా ఆమె పైనే పడింది. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన వాణి భోజన్ ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నానని.. ఇందులో యోగి బాబు ముఖ్య పాత్రను పోషిస్తున్నారని చెప్పింది. అదే విధంగా నటుడు అధర్వకు జంటగా ఒక చిత్రం చేస్తున్నట్లు తెలిపింది. కాగా చాలా గ్యాప్ తరువాత తెలుగులో ఒక్క చిత్రంలో నటించినట్లు చెప్పింది. ఎలాంటి సినీ నేపధ్యం లేని తాను నటిగా ఇంత దూరం పయనించడం సాధనే అని పేర్కొంది. ఇకపై కూడా మంచి పాత్రలు ఎంపిక చేసుకుని నటిస్తాననీ, ఇప్పటి వరకు తన జర్నీ సంతోషంగానూ, సంతృప్తిగానూ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మీ మాదిరి గానే బుల్లితెర నుంచి వచ్చిన నటి ప్రియా భవానీ శంకర్ను మీకు పోటీగా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు తాను అలా భావించడం లేదని చెప్పింది. ఆమె చాలా చిత్రాల్లో నటిస్తున్నారని, పెద్ద నటులతో జత కడుతున్నారని, ఒక స్నేహితురాలిగా తనకు సంతోషమేనని చెప్పింది. అంతే ఆమెతో తనకు పోటీ కానీ, అసూయ లేవని స్పష్టం చేసింది. నా దారిలో నేను వెళుతున్నట్లు ఇందులో ఒకరితో ఒకరిని పోల్చాల్సిన అవసరం లేదని వాణి భోజన్ తెలిపింది. కాగా.. టాలీవుడ్లో మీకు మాత్రమే చెప్తా సినిమాతో పరిచయమైంది కోలీవుడ్ భామ. భరత్, వాణీ భోజన్ జంటగా నటిస్తోన్న లవ్ చిత్రం మలయాళ మూవీకి రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
శారీలో రకుల్ హోయలు.. బ్రెజిల్లో ఆలియా భట్ పోజులు!
►వైట్ శారీలో రకుల్ ప్రీత్ సింగ్ హాట్ లుక్స్ ►గ్రీన్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్ పోజులు ►హెబ్బా పటేల్ లుక్స్ క్యూట్ లుక్స్ ►శోభిత రానా స్టన్నింగ్ పిక్స్ ►బ్లాక్ డ్రెస్లో ప్రియా భవానీ శంకర్ View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) -
లైంగిక వేధింపులపై ఆమె ఏమన్నారంటే..
కోలీవుడ్లో పాపులర్ నటి ప్రియాభవానీ శంకర్. టీవీ.యాంకర్గా పేరు తెచ్చుకుని ఆపై బుల్లితెరకు రంగప్రవేశం చేసి, ఆ తరువాత సినీ కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే తొలి చిత్రం మేయాదమాన్ తరువాత ఆశించిన విజయాలు మాత్రం ఈమెను వరించడం లేదని, దీంతో అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర వేయడానికి చిత్ర పరిశ్రమలో ఒక వర్గం రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రియా భవానీశంకర్ నటిస్తున్న చిత్రాల్లో కమలహాసన్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ఇండియన్ 2, ఎస్జే.సూర్య సరసన నటిస్తున్న బొమ్మై చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు తనకు సక్సెస్లు రావడం లేదన్న కొరతను తీరుస్తాయనే నమ్మకాన్ని ఈమె ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినీరంగంలో జరుగుతున్న లైంగిక వేధింపులపై స్పందిస్తూ ఇలాంటివి సినిమా రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆ రంగం, ఈ రంగం అని చూడకుండా అన్ని రంగాల్లోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని అలాంటి వారు ధైర్యంగా బయటకు చెప్పాలన్నారు. అంతకంటే ముఖ్యం వారు చెప్పింది సమాజం వినాలన్నారు. అదే విధంగా వారిని తక్కువగా చూడడం మానుకోవాలన్నారు. తమకు జరిగిన అక్రమాలపై స్పందించాలి గానీ, ఇప్పుడు చెబుతున్నారేమిటి, ముందే చెప్పొచ్చుగా అంటూ విమర్శంచకూడదన్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్నారు. కాగా బొమ్మై చిత్రం ఈ నెల 16న తెరపైకి రానుంది. -
అందుకే ప్రియాభవానీ శంకర్తో రెండోసారి: ఎస్జే సూర్య
నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'బొమ్మై'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా చేసింది. ఈ చిత్రానికి రాధామోహన్ కథ అందించి దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈనెల 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్జే సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'దర్శకుడు రాధామోహన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ మూవీ నిర్మించాను. అలా మొదలైన ఈ చిత్రం చాలా సంతృప్తిగా వచ్చింది. 'మాన్స్టర్'లో నాతో కలిసి యాక్ట్ చేసిన ప్రియాభవానీ శంకర్నే ఇందులోనూ హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారు. మా అక్క కూతురికి ఇంచుమించు ప్రియాభవాని ఛాయాలు ఉంటాయి. నటి సిమ్రాన్కు, త్రిషకు అలాంటి ఫేస్ కట్ ఉంటుంది. అలా ముఖంలో ఓకే కట్ ఉన్న ఒకరికి, మరొకరికి మధ్య సారుప్యత ఉంటుంది' 'నటుడు షారూక్ ఖాన్కు, నటి కాజోల్కు అలాంటిదే ఉంది. కారణం ఏంటనేది చెప్పలేను గానీ నాకు, ప్రియాభవాని శంకర్కు ఒక మ్యాథమేటిక్స్ ఫ్యూచర్స్ సెట్ అవుతుంది. ఇది ఒక కారణం కావచ్చు. చాప్టర్ను మలరుమ్ పాటలో నేను, సిమ్రాన్ మాదిరిగానే ప్రియాభవాని శంకర్ ఉంది. ఇకపోతే ప్రియాభవాని శంకర్, తాను మాన్స్టర్ చిత్రంలో నటించాం. అది మంచి హిట్ కావడం కూడా ఇందులో మళ్లీ మేమిద్దరం కలిసి నటించడానికి కారణం అయ్యిండొచ్చు' అని ఎస్జే సూర్య చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: హీరో షారుక్ ఖాన్కి చేదు అనుభవం.. ఆమె అలా చేసేసరికి!) -
స్పైడర్ విలన్ సూర్య హీరోగా బొమ్మై, రిలీజ్ ఎప్పుడంటే?
స్పైడర్ విలన్, ప్రముఖ నటుడు ఎస్జే సూర్య, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం బొమ్మై. మాన్స్టర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత ఈ జంట కలిసి నటించిన చిత్రమిది. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రాధామోహన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏంజెల్ స్టూడియో పతాకంపై వి.మారుడు పాండియన్, డాక్టర్ జాస్మిన్ సంతోష్, డాక్టర్ దీప డి.దురై కలిసి నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం అందించారు. ఇందులో నటి చాందిని, డౌట్ సెంథిల్, ఆరోల్ శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ గత ఏడాది విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అదే విధంగా ఇటీవల ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా చేశారు. కాగా రొమాంటిక్, సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అనివార్య కారణాల వల్ల విడుదల తేదీ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు చిత్రం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. బొమ్మై చిత్రం ఈ నెల 16వ తేదిన తెరపైకి రానున్నట్లు నటుడు ఎస్జే సూర్య శుక్రవారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇది దర్శకుడు రాధామోహన్ చిత్రం కావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చదవండి: నా మాజీ భార్త ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు: నటి -
స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్.. ఏకంగా త్రిష ప్లేస్లో!
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. త్రిష కథానాయకిగా నటిస్తున్న ఇందులో పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోసిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సగానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న లియో చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (ఇది చదవండి: త్రిషకు వరుస ఛాన్సులు.. ఈసారి ఏకంగా ధనుష్తో జోడీ!) కాగా తర్వాత విజయ్ నటించనున్న తన 68వ చిత్రం గురించి ఇప్పటికే ప్రచారం హోరెత్తింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దర్శకుడు మిష్కిన్, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇకపోతే ఇందులో నాయకిగా నటించే అవకాశం త్రిష వరించినట్లు ఇప్పటికే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. (ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!) ఇలాంటి పరిస్థితుల్లో మరో నటి పేరు తెరపైకి వచ్చింది. తనే ప్రియా భవాని శంకర్. ఇంతకు ముందు యువ హీరోలతో జతకడుతూ వచ్చిన ఈ భామ ఇటీవల పత్తుతల చిత్రంలో శింబు సరసన, లారెన్స్కు జంటగా రుద్రన్ చిత్రంలోనూ నటించారు. అలాంటిది తాజాగా దళపతి విజయ్తో రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ వచ్చినట్లు టాక్. అయితే ఈ చిత్రంలో విజయ్కు జంటగా త్రిషతో పాటు ప్రియా భవాని శంకర్ నటించనున్నారా? లేక త్రిషను పక్కకు నెట్టి ప్రియా భవాని శంకర్ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారా అనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే. -
వీడియో: బాయ్ఫ్రెండ్తో వెకేషన్లో చిల్ అవుతున్న హీరోయిన్..
-
బాయ్ఫ్రెండ్తో రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన హీరోయిన్
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి ప్రియా భవానీ శంకర్. తొలి చిత్రం మేయాదమాన్ విజయం తర్వాత ఈమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం బిజీ హీరోయిన్లలో ప్రియ భవానీ శంకర్ ఒకరు. ఇటీవల ఈమె జయం రవి సరసన నటించిన అఖిలన్, శింబుతో జతకట్టిన పత్తుతల, లారెన్స్తో రొమాన్స్ చేసిన రుద్రన్ చిత్రాలు వరుసగా తెరపైకి రావడం విశేషం. వీటిలో రుద్రన్ చిత్రంలో లారెన్స్తో రొమాంటిక్ సన్నివేశాలు అందాలను ఆరబోసిందనే చెప్పాలి. కాగా నిజ జీవితంలోనూ తన ప్రియుడితో అలాంటి రొమాన్న్స్నే చేయడం గమనార్హం. చదవండి: ఆ బాలీవుడ్ హీరోతో పూజాహెగ్డే రొమాన్స్ డబ్బు ఎక్కువగా వస్తుందని సినీ రంగ ప్రవేశం చేశానని బహిరంగంగా చెప్పిన నటి ప్రియా భవానీ శంకర్ తాను నటిగా పరిచయం అయ్యి 10 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచే ప్రేమ కలాపాలు నడుపుతోంది. రాజవేల్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్న ఈ భామ అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటోంది. అదేవిధంగా తాజాగా తన ప్రియుడు రాజవేల్తో రొమాంటిక్గా దిగిన ఓ వీడియోను ప్రియా భవాని శంకర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఆ వీడియోలు ఆమె ప్రియుడితో ముద్దు మురిపాలతో, పాటు ఇతర స్నేహితులతో కలిసి ఆట, పాట, విందు, వినోదం అంటూ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సామాజి మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా టాప్లో ఉన్న హీరోయిన్లు తమ ఇమేజ్కు భంగం కలుగుతుందనే భయంతో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచుతుంటారు. అయితే ప్రియ భవానీ శంకర్ మాత్రం ఇమేజ్, భయం జాన్తానై అంటూ ప్రియుడితో సరసాలు ఆడేస్తోంది. ఈమె తక్కువ కాలంలోనే బోలెడంత ఆస్తులను కూడబెట్టిందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: నవ్యస్వామితో డేటింగ్పై క్లారిటీ ఇచ్చిన 'విరూపాక్ష' నటుడు -
అప్పుడే ఓటీటీలోకి లారెన్స్ 'రుద్రుడు' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..
రాఘవ లారెన్స్ తాజాగా నటించిన చిత్రం రుద్రుడు.‘మునీ-4’ తర్వాత దాదాపు ముడేళ్లు గ్యాప్ తీసుకుని లారెన్స్ ఈ సినిమాతో పలకరించారు. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లారెన్స్కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించింది. తమిళంలో రుద్రన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రుద్రుడు పేరుతో ఏప్రిల్ 14న విడుదలైంది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.తాజాగా ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్దమయ్యింది. రుద్రుడు సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ కొనుగోలు చేసింది. మే రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. -
Priya Bhavani Shankar Photos: స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంటున్న ప్రియ భవాని శంకర్
స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంటున్న ప్రియ భవాని శంకర్ -
అలాంటి ఛాన్స్ మరొకరికి ఇవ్వొద్దంటున్న కోలీవుడ్ భామ
బుల్లితెర యాంకర్గా పరిచయమై ఆ తరువాత వెండితెర కథానాయకిగా ఎదిగిన నటి ప్రియా భవానీ శంకర్. తొలి చిత్రం మేయాదమాన్తోనే విజయం వరించడంతో ఆ తరువాత ఈమెకు వరుసగా అవకాశాలు వరించడం మొదలెట్టాయి. ప్రస్తుతం బిజీ కథానాయికల్లో ప్రియ భవానీ శంకర్ ఒకరు. ఇటీవల ఈమె జయంరవికి జంటగా నటించిన అఖిలన్, శింబుతో జతకట్టిన పత్తుతల, తాజాగా రాఘవలారెన్స్ సరసన నటించిన రుద్రన్ చిత్రాలు వరుసగా తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన శరీర రంగును పరిహాసం చేస్తూ కొందరు మిమ్మల్ని గాయపరుస్తారన్నారు. అయితే మీరు ఎవరు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? అనే విషయాలను ఇతరులు మాట్లాడి నిర్ణయం తీసుకునే అవకాశం వారికి ఇవ్వొద్దని సూచించారు. ఇక్కడ అందానికి నిర్వచనం అంటూ ఏదీ ఉండదు. స్కిన్ కేర్, తమ అందాలను మెరుగుపరచుకోవడానికి తారలు చాలా ఖర్చు చేస్తుంటారన్నారు. అయితే ఓ సాధారణ కళాశాల విద్యార్థికి అలా చేయడం సాధ్యం కాదన్నారు. అయితే రూపం, రంగు, శరీర సౌష్టవం వంటి వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. కేవలం ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు చూసి ఒక నిర్ణయానికి రాకూడదన్నారు. ఇప్పుడు తాను తయారు కావడానికి 10 మందితో కూడిన ఒక బృందం ఉందన్నారు. అయితే ఇదే సౌందర్యం అని చెప్పడానికి నిర్వచనం ఏదీ లేదన్నారు. కాబట్టి శారీరక అందం గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని.. మానసిక వేదనకు గురి కాకుండా జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలన్నారు. డబ్బు ఉంటే కాకి కూడా కలర్గా మారుతుందని కొందరు చెబుతుంటారని.. అయితే డబ్బు ఎవరికి ఊరకనే రాదని మీరు ప్రపంచంతో పోరాడి కోరుకున్నది గెలవాల్సి ఉంటుందని నటి ప్రియ భవానీ శంకర్ పేర్కొన్నారు. -
క్యూట్ స్మైల్తో ఫిదా చేస్తున్న ప్రియా భవానీ శంకర్...(ఫొటోలు)
-
అమ్మని ఇష్టపడేవాళ్లు రుద్రుడుని ఇష్టపడతారు
‘‘అటు సినిమాలు, ఇటు సేవా కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయడం మొదట్లో కష్టంగా ఉండేది. తర్వాత అలవాటైంది. ఇప్పటివరకూ దాదాపు 150 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించాను. సినిమాల్లో హీరోగా ఉండటం కంటే రియల్ లైఫ్లో హీరోగా ఉండాలనేది నా కోరిక’’ అన్నారు రాఘవా లారెన్స్. కతిరేశన్ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా రూపొందిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలవుతోంది. నిర్మాత ‘ఠాగూర్’ మధు ‘రుద్రుడు’ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్ చెప్పిన విశేషాలు. ► ‘రుద్రుడు’ మదర్ సెంటిమెంట్ ఫిల్మ్. నా ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి సందేశం ఉన్నట్టే ఇందులోనూ అమ్మానాన్నల గురించి ఓ చక్కని సందేశం ఉంది. ఈ చిత్రంలో ఐటీ ఉద్యోగం చేసే ఒక మధ్య తరగతి కుర్రాడిలా కనిపిస్తాను. అలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిని పరిస్థితులు ఎలా మాస్గా మార్చాయి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. అమ్మని ఇష్టపడేవాళ్లంతా ‘రుద్రుడు’ మూవీని ఇష్టపడతారు. ► నన్ను కొత్తగా చూపించాలనే కతిరేశన్గారి తపన నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలోని భావోద్వేగాలు, థ్రిల్, వినోదం, మాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు వంద శాతం చేరువ అవుతాయి. ► ‘ఠాగూర్’ మధుగారు నాకు లక్కీ ప్రొడ్యూసర్. నాపై ఆయనకి చాలా నమ్మకం. మరోసారి ఆ నమ్మకాన్ని ‘రుద్రుడు’ నిలబెట్టుకుంటుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్గారు విలన్గా చేశారు. నా పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆయన పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ‘అఖండ’ సినిమా ఫైట్స్ నాకు నచ్చడంతో ఆ మూవీకి పని చేసిన శివ మాస్టర్ని తీసుకున్నాం. ‘రుద్రుడు’లో కథకు తగ్గట్టు యాక్షన్ని డిజైన్ చేశారాయన. ప్రస్తుతం ‘చంద్రముఖి 2, జిగర్తాండ 2’ సినిమాల్లో నటిస్తున్నాను. అలాగే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కథ, స్క్రీన్ ప్లే అందించి, నిర్మిస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నాను. -
Raghava Lawrence: ఒక పని మనిషిగా పని చేయడానికి నేనున్నాను
దర్శక–నిర్మాత, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. ఫైవ్స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. అందులో భాగంగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో లారెన్స్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. లారెన్స్ మాట్లాడుతూ.. మా అమ్మ ఎప్పుడూ ఓ మాట చెప్తారు. లైఫ్లో నువ్వు స్క్రీన్లో వచ్చి హీరోలా చేయడం కాదు. నిజ జీవితంలో హీరోలా ఉండాలి నువ్వు అని. స్క్రీన్లో వచ్చి హీరోగా ఉన్నవాళ్లు వెళ్లిపోతారు. కానీ రియల్ హీరోగా ఉన్నవాళ్లు వారు చణిపోయిన తరువాత కూడా హీరోలుగానే అందరి గుండెల్లో ఉంటారంటూ తనకు చెప్పిన తల్లికి లారెన్స్ థాంక్స్ తెలియజేశారు. ఇంకా తన అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మీ అందరూ విజిల్స్, క్లాప్స్తో ఇచ్చే ఉత్సాహం మరువలేను. నాలుగు సంవత్సరాల తరువాత చిత్రం చేస్తున్నాను అయినా నన్ను మరచిపోకుండా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీలో ఎవరైనా చదువుకోడానికైనా, హాస్పిటల్ వైద్యానికైనా, ఓపెన్ హార్ట్సర్జరీ చేపించుకోడానికి కష్టపడుతుంటే మీరు లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్కి కాల్ చేయండి. నేను చేస్తున్న సహాయ కార్యక్రమాలు ముందు నేను చేస్తున్నాను అని అనుకున్నాను. కానీ దేవుడు నన్నొక పని మనిషిగా పెట్టుకుని ఆయన చేస్తున్నాడని వయసు పెరిగేకొద్ది తెలుసుకున్నాను.నేను మీకు ఒక పని మనిషిగా పని చేయడానికి ఉన్నానని మరచిపోవద్దు. మీరు ఎనీ టైమ్ నన్ను అడగొచ్చు ఎందుకంటే మీరు కొనే ఒక్కొక్క టికెట్ వల్లనే నేను ఈ రోజు సంతోషంగా ఇలాంటి స్థాయిలో ఉంటూ కార్లో తిరుగుతున్నాను. ఇవన్నీ నాకు మీరిచ్చినవే మీరు కొన్న టికెట్ డబ్బులే. లేదంటే నేనింతటి వాడిని అయ్యేవాడిని కాదు. అందుకే మీరు నన్ను హెల్ప్ అడగడానికి సిగ్గు, భయపడకుండా అడగండి ఎందుకంటే మీ డబ్బు మీరు అడుగుతున్నారు. నా డబ్బు మీరు అడగట్లేదు. నా దగ్గరున్న డబ్బు అంతా మీరిచ్చినవే సో.. మీకోసం సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నానన్నారు. -
Rudhrudu: కనిపెట్టాలి.. కొట్టాలి!
‘‘కూర్చున్న చోటే స్కెచ్ వేసి మనుషుల్ని లేపేసేవాడివి. నిన్నే వాడు బయటకు లాక్కొచ్చాడంటే వాడెంత తోపై ఉంటాడు’’ అనే డైలాగ్తో మొదలవుతుంది ‘రుద్రుడు’ సినిమా ట్రైలర్. దర్శక–నిర్మాత, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. ఫైవ్స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత ‘ఠాగూర్’ మధు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు. ‘ఒకడి జీవితంలో ఏవేవి జరగకూడదో అవన్నీ రుద్ర జీవితంలో జరిగాయి’, ‘మావ.. మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతోంది రా.. మనమే వెతకాలి. మనమే కనిపెట్టాలి. మనమే కొట్టాలి’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు లారెన్స్. తనకి ఇష్టమైన అమ్మాయి ప్రియా భవానీ శంకర్ని పెళ్లి చేసుకుంటాడు. అయితే, శరత్కుమార్ అతని లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కష్టాలు మొదలవుతాయి. అయినప్పటికీ దృఢంగా నిలబడి, క్రిమినల్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
అవకాశాల కోసం అలా చేయాల్సిన అవసరం రాలేదు: హీరోయిన్
కోలీవుడ్లో జయాపజయాలకతీతంగా అవకాశాలను అందుకున్న నటి ప్రియా భవానీ శంకర్. కేవలం ఆమె ఐదేళ్లలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఈమె ఓ టీవీ ఛానల్లో యాంకర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. ఆ తరువాత టీవీ సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అలా 2017లో మేయాదమాన్ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వైభవ్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం అనూహ్య విజయం సాధించింది. అంతే సినిమాలో ప్రియా భవానీ శంకర్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. వరుసగా అవకాశాలు ఈ అమ్మడి తలుపు తడుతున్నాయి. ఈమె నటించిన చిత్రాల్లో ఎక్కవ భాగం విజయాలే. స్టార్ హీరోలతో నటించే అవకాశం వేస్తే పాత్రల గురించి కూడా ఆలోచించకుండా అంగీకరించేస్తోంది. అలా ఆ మధ్య కార్తీతో నటించిన కడైకుట్టి సింగం, అరుణ్ విజయ్తో జత కట్టిన తానై, ధనుష్ సరసన నటించి తిరుచిట్రంఫలం వంటి చిత్తాల సక్సెస్లు ఈమె ఖాతాలో పడ్డాయి. అయితే ఇటీవల జయం రవితో నటించిన అఖిలన్ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. తాజాగా శింబు కథానాయకుడిగా నటించిన పత్తు తల చిత్రంలో నటించింది. ఇది ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. ప్రస్తుతం లారెన్స్కు జంటగా రుద్రన్, అరుళ్ నిధితో డిమాంటీ కాలనీ 2 తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మంచి అవకాశాలు వరుసగా రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే అడ్జెస్ట్మెంట్ అవ్వాలనే అంశం గురించి స్పందిస్తూ.. తనకైతే అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పింది. కానీ సినీరంగంలో ఆ సమస్య లేదని చెప్పలేనని వ్యాఖ్యానించింది. -
Agilan Movie Review: జయం రవి అఖిలన్ సినిమా ఎలా ఉందంటే?
పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాజు అరుళ్మొళిగా అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు జయం రవి తాజాగా అఖిలన్గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్క్రీన్ స్కిన్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఇది భూలోకం చిత్రం ఫేమ్ కల్యాణ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటి ప్రియాభవాని శంకర్ నాయకిగా నటించగా నటి తాన్యా రవిచంద్రన్ కీలక పాత్ర పోషించారు. నటుడు జయం రవి నటించిన 28వ చిత్రం ఇది. ఈ చిత్రానికి ది కింగ్ ఆఫ్ ది ఓషన్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఇది సముద్రతీరంలో మాఫియా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని క్యాప్షన్ చూస్తేనే అర్థమైపోతుంది. కథ: దేశ ఆర్థిక లావాదేవీలను శాసించే వేదిక హార్బర్. అక్రమాలు, హత్యలు స్మగ్లింగ్ వంటి దుర్మార్గాలకు సాక్ష్యంగా నిలిచేది హార్బరే అని చెప్పే కథా చిత్రం అఖిలన్. అలాంటి నేపథ్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిందే ఈ సినిమా. ఒక కూలీగా పని చేసే అఖిలన్ ఓ మాఫియా ముఠా దుర్మార్గాలకు సహకరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత తనే ఒక మాఫియా డాన్గా ఎదిగే ప్రయత్నం చేస్తాడు. హార్బర్లో జరిగే అక్రమాలకు అన్నిటికీ తనే కారణంగా మారతాడు. అతనికి హార్బర్లో పనిచేసే పోలీస్ అధికారి ప్రియ భవాని శంకర్ సహకరిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా అతను ఎందుకు చేస్తున్నాడు? తర్వాత అతని జీవితం ఎటువైపు సాగింది? వంటి పలు సంఘటనలతో సాగే చిత్రం అఖిలన్. విశ్లేషణ ఈ చిత్రంలో జయంరవి తన నటనతో మెప్పించారు. ఇందులో జయం రవి తండ్రి పాత్ర కూడా ఉంటుంది. ఆయన కలను సాకారం చేయడం కోసమే అఖిలన్ పోరాడతాడు. అయితే దాన్ని నెరవేర్చగలిగాడా? లేదా? అసలు ఆయన తండ్రి కల ఏమిటి అన్న ఆసక్తికరమైన అంశాలతో పలు మలుపులతో అఖిలన్ చిత్రం సాగుతుంది. కథ పూర్తిగా హార్బర్లోనే సాగుతుంది. జయం రవిది నెగటివ్ షేడ్లో సాగే పాజిటివ్ పాత్ర అని చెప్పవచ్చు. దాన్ని ఆయన సమర్థవంతంగా పోషించారు. అఖిలన్ కమర్షియల్ అంశాలతో సాగే అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. -
ఓటీటీకి వచ్చేసిన కళ్యాణం కమనీయం, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్.. ఎక్కడంటే
యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేదు. సంక్రాంతికి స్టార్ హీరో చిత్రాలు ఉండటంతో కళ్యాణం కమనీయం ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుకోలేకపోయింది. అంతేకాదు థియేటర్లు కూడా ఎక్కువగా దొరకకపోవడంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. దీంతో ఈ చిత్రానికి బిగ్స్రీన్పై పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. విడుదలైన నెల రోజులకే కళ్యాణం కమనీయం ఓటీటీలోకి రావడం విశేషం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్న ఆహా ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది. చెప్పినట్టుగానే శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడే పెళ్లి బంధం నిలబడుతుందనే స్టోరీ లైన్తో దర్శకుడు అనిల్ కుమార్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్ ప్రియా భవాని శంకర్ నటించింది. ఈ చిత్రంతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవిత్ర లోకేశ్ వంటి తదితర నటులు ప్రధాన పాత్రలు పోషించారు. Prema lekunda pelli cheskovachu kani job lekunda pellante? adhii ee generation lo.🙆🏻♀️🙆🏻♂️#KalayanamKamaneeyamOnAHA, A tale of complicated relationship, premieres Feb 17, only on aha!@santoshsoban @priya_Bshankar @UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/v3SmpJGJp5 — ahavideoin (@ahavideoIN) February 8, 2023 -
ఇండియన్ 2: నెల రోజులు నాన్స్టాప్ షూటింగ్
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లోనే ‘ఇండియన్’కు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, గండికోట లొకేషన్స్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ చాలా కీలకమైనదని తెలిసింది. ఎందుకంటే నెల రోజుల పాటు నాన్స్టాప్గా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు కమల్హాసన్. ముందుగా కమల్హాసన్, హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ కాంబినేషన్స్లోని సీన్స్ను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్లోనే ఈ చిత్రకథానాయిక కాజల్ అగర్వాల్ కూడా జాయిన్ అయ్యే చాన్స్ ఉందని టాక్. ఇంకా రకుల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. -
రెస్టారెంట్కు ఓనర్ కాబోతున్న హీరోయిన్
బుల్లితెర నుంచి వెండి తెరకు వచ్చిన నటి ప్రియా భవాని శంకర్. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. పాత్ర చిన్నదో పెద్దదో స్టార్ హీరోల చిత్రాలు కనిపిస్తోంది.. మరోపక్క కథానాయకిగానూ చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఆ మధ్య కార్తీ కథానాయకుడిగా వచ్చిన కడైకుట్టి సింగం చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. అయితే ఆ చిత్రం విజయంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఇటీవల ధనుష్ చిత్రం తిరుచిట్ట్రంఫలం చిత్రంలోనూ కనిపించింది. ఇకపోతే తాను డబ్బు వస్తుందనే నటించడానికి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. తాజాగా తాను అలా అనలేదంటూ ప్లేట్ పిరాయించింది. వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ తక్కువ కాలంలోనే డబ్బు బాగానే కురబెట్టింది. ఇందుకు ఉదాహరణ గత డిసెంబర్ నెలలో చెన్నై సముద్ర తీరంలో ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నట్లు తనే స్వయంగా వెల్లడించింది. అంతేకాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పాలసీని అమలు చేస్తూ తాజాగా వ్యాపారంగంలోకి అడుగుపెడుతోంది. ఈ అమ్మడు ఇప్పుడు ఒక రెస్టారెంట్కు ఓనర్ కాబోతోంది. ఇందు కోసం స్థలాన్ని కొనుగోలు చేసి రెస్టారెంట్ను కట్టిస్తోంది. త్వరలో దీన్ని ప్రారంభించనునట్లు నటి ప్రియా భవాని శంకర్ ఒక వీడియోను విడుదల చేసింది. View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
డబ్బు కోసమే ఇండస్ట్రీకి వచ్చా, ఆ భయం లేదు: ప్రియా భవానీ శంకర్
డబ్బు సంపాదించడం కోసమే నటించడానికి వచ్చానని నటి ప్రియా భవానీ శంకర్ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పింది. ఆమె బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన సంగతి తెలిసిందే. మేయాదమానే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాభవానీశంకర్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎస్జే.సూర్య సరసన మాన్స్టర్, కార్తీకి జంటగా కడైకుట్టి సింగం, అరుణ్విజయ్తో మాఫియా,ధనుష్తో తిరుచ్చిట్రంఫలం వంటి చిత్రాల్లో నటించి ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం రుద్రన్, డిమాంటీ కాలనీ- 2, ఇండియన్-2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన కల్యాణం.. కమనీయం అనే తెలుగు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న తెరపైకి వచ్చింది. మరో తెలుగు చిత్రం కూడా చేస్తోంది. ఈ సందర్భంగా ప్రియాభవానిశంకర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సహజత్వంతో కూడిన కథా చిత్రాలంటే తనకు ఇష్టం అని చెప్పింది. ఇటీవల తమిళంలో ధనుష్కు జంటగా తిరుచ్చిట్రంఫలం చిత్రంలో నటించానని చెప్పారు. నటించడానికి వచ్చినప్పుడు భవిష్యత్ గురించి ఎలాంటి ఆలోచనలు లేవని చెప్పింది. ప్రేక్షకులు తనను ఆదరిస్తారా, లేదా అని భయపడలేదని చెప్పింది. నటిస్తే డబ్బు వస్తుంది అనే భావించానని, అందుకే నటించడానికి వచ్చానని పేర్కొంది. ఇటీవలే తెలుగులోనూ నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. సినీ నేపథ్యం కలిగిన వారే తామేంటో నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారని, దీంతో తాను ఇంకా ఎక్కువగా శ్రమించాలని భావిస్తున్నాననే అభిప్రాయాన్ని ప్రియాభవానీశంకర్ పేర్కొంది. -
‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ
టైటిల్: కళ్యాణం కమనీయం నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు నిర్మాణసంస్థ: యూవీ కాన్సెప్ట్స్ దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ల సంగీతం: శ్రావణ్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని ఎడిటర్: సత్య జి విడుదల తేది: జనవరి 14, 2023 పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం’.సంక్రాంతి సందర్భంగా నేడు(జనవరి 14) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శివ(సంతోష్ శోభన్) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం లేకుండా ఖాలీగా తిరుగుతుంటాడు. జాబ్ కోసం వెతుకున్న సమయంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రుతి(ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత కూడా శివ ఉద్యోగం చేయడు. శ్రుతి ఒక్కతే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే ఒక రోజు సడన్గా శివను ఉద్యోగం చేయమని అడుగుతుంది శ్రుతి. దీంతో కథ మలుపు తిరుగుతుంది. శివ ఉద్యోగం సంపాదించే క్రమంలో ఓ అబద్దం చెబుతాడు. ఆ అబద్దం వారికి ఎన్ని కష్టాలను తెచ్చిపెట్టింది? శ్రుతికి ఆఫీస్లో ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఇతరుల కారణంగా వారి వైవాహిక జీవితంలోకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? శివ, శ్రుతిలు ఎందుకు దూరమయ్యారు? చివరకు వారిద్దరు మళ్లీ ఎలా ఒకటయ్యారనేదే మిగతా కథ. కొత్తగా పెళ్లైయిన ఓ జంట చుట్టూ తిరిగే కథే ‘కల్యాణం కమనీయం’. వారిద్దరి వైవాహిక జీవితంలో ఎదురయ్యే సంఘటన నేపథ్యంలో కథనం సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయని, వాటిని భార్యాభర్తలు అనుభవాలుగా స్వీకరించి, కలిసి ముందుకు సాగితేనే ఆ బంధం నిలబడుతుందని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. భార్య భర్తల మధ్య వచ్చే సంఘర్షణలను మాత్రం ఆసక్తిగా రాసుకోలేకపోయాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఉద్యోగం చేసే భార్య, ఖాలీగా ఉండే భర్తల నేపథ్యంలో మరింత కామెడీ, ఎమోషన్ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు అంతగా వాడుకోలేదు. కానీ ఎక్కడా బోర్ కొట్టించకుండా, సాగదీత లేకుండా చూసుకున్నాడు. ఫస్టాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ ఇప్పటి జనరేషన్కి బాగా కనెక్ట్ అవుతాయి. సెకండాఫ్లో కామెడీ కంటే ఎమోషనల్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. సినిమా నిడివి (109 నిమిషాలు) చాలా తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. కథనం ఆసక్తికరంగా సాగకపోయినా..ఎక్కడా బోర్ కొట్టదు. ప్రస్తుతం తరుణంగా ఈ సినిమా థియేటర్స్ ఆడియన్స్ని ఏ మేరకు మెప్పింస్తుందో తెలియదు కానీ.. ఓటీటీ ప్రేక్షకులను మాత్ర కచ్చితంగా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. శివ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా నటించాడు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ, భార్య సంపాదన మీద బతికే కుర్రాడి పాత్రలో మెప్పించాడు. ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని రకాలుగా సంతోష్ శోభన్ ఆకట్టుకున్నాడు. ఇక ప్రియా భవానీ శంకర్ సైతం చక్కగా నటించింది. తెరపై ప్రియా భవానీ కనిపించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. కేదార్ శంకర్, దేవీ ప్రసాద్ తమ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. పవిత్రా లోకేష్ అమ్మగా ఆకట్టుకుంది. సద్దాం, సప్తగిరి నవ్వించారు. సత్యం రాజేష్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం, కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అప్పుడు ఆ ఆలోచనలు లేవు: ప్రియా భవానీశంకర్
కళ్యాణం కమనీయం’ చిత్రంలో నేను చేసిన శ్రుతి పాత్రకి, నిజజీవితంలో నాకు దాదాపు 90శాతం పోలికలున్నాయి. అందుకే ఆ పాత్ర చేయడం నాకు పెద్దగా కష్టం అనిపించలేదు. తమిళ్లో నా మొదటి చిత్రం విడుదలప్పుడు నాకు పెద్దగా ఆలోచనలు లేవు.. కానీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎలా ఆదరిస్తారో అనే ఎగ్జయిట్మెంట్ ఉంది’’ అని హీరోయిన్ ప్రియా భవానీశంకర్ అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. యూవీ కాన్సెప్ట్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక భవానీశంకర్ మాట్లాడుతూ– ‘‘తమిళ్లో చాలా మంచి చిత్రాలు చేశాను. యూవీలాంటి పెద్ద బ్యానర్లో తెలుగులో పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఉద్యోగం లేని భర్త శివ, జాబ్కి వెళ్లే భార్య శ్రుతి. వారు సంతోషంగానే ఉన్నా చుట్టూ ఉన్న వాళ్ల మాటలు, అభిపప్రాయాల వల్ల వారిద్దరి మధ్య మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్లింది? అన్నదే ఈ చిత్రకథ. శ్రుతి పాత్రలో మహిళలు తమని తాము చూసుకుంటారు. ఇక నాగచైతన్యతో ‘దూత’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. సత్యదేవ్తో ఓ సినిమాలో నటించనున్నాను’’ అన్నారు. -
ఈ సినిమాకు మొదటి ఛాయిస్ నేను కాదట!: సంతోష్ శోభన్
యంగ్ హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "కళ్యాణం కమనీయం". ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించగా, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో చిత్రయూనిట్ సినీ విశేషాలు పంచుకుంది. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ "దర్శకుడికి, హీరోయిన్ ప్రియకి తెలుగులో ఇదే మొదటి సినిమా. చిరంజీవి, బాలకృష్ణగారి సినిమాలతో సంక్రాంతికి మళ్ళీ ఒక కళ వచ్చింది. వాళ్ళ సినిమాలతో పాటు మా సినిమాకి కూడా ఈ అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. యూవీ క్రియేషన్స్ అనేది నా ఫ్యామిలీ, వాళ్ళెప్పుడూ నాకు వెన్నుదన్నుగా ఉంటారు. నాకు దర్శకుడు అంటే దేవుడితో సమానం. ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకి ఎంత క్రెడిట్ వచ్చినా అది మొత్తం అనిల్కే దక్కాలి. శివ పాత్రకి మొదటి ఆప్షన్ నేను కాదు అది ఎవరో మీరే అనిల్ను అడగాలి కానీ శృతి పాత్రకి ప్రియానే మొదటి ఆప్షన్" అన్నాడు. హీరోయిన్ ప్రియ భవాని శంకర్ మాట్లాడుతూ "ఇది తెలుగులో నా మొదటి సినిమా. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది అలాగే భయంగానూ ఉంది. ఈ సారి తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తాను. సినిమాలో శృతి క్యారెక్టర్ ఎలాంటిదో నాది ఇంచుమించు అలాంటి క్యారెక్టరే" అన్నారు. దర్శకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, "మనం జెన్యూన్గా ఒక కథ రాసుకుంటే యూనివర్స్ మొత్తం మనకి హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతాను. ఈ కథ అలా రాసుకున్నదే. జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు కళ్యాణం కమనీయంలో ఉన్నాయి. నా ఫ్రెండ్ వేదవ్యాస్ నుంచి ప్రారంభమయిన ఈ కథ, యూవీ వరకు వచ్చింది, యూవీ క్రియేషన్స్ వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ అవసరం రాలేదు" అన్నారు. చదవండి: తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్కు: చిరంజీవి వీరసింహారెడ్డి: థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్ -
ఏడాదిన్నర పాటు సైట్ కొట్టాను.. తను కనీసం కన్నెత్తి చూడలే!
ఒక యువకుడికి తాను.. ఏడాదిన్నర పాటు సైట్కొట్టానని నటి ప్రియ భవాని శంకర్ చెప్పింది. ఎదుగుతున్న కథానాయికల్లో ఈమె ఒకరు. కోలీవుడ్లో పలు విజయాలను అందుకుని చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె.. కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్–2 చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈమె ఓ రహస్యాన్ని బయటపెట్టింది. దీని గురించి ఒక భేటీలో పేర్కొంటూ గత కొన్నేళ్లుగా జిమ్కు వెళుతున్నానని చెప్పింది. అదే జిమ్కు వస్తున్న ఓ యువకుడి చూసి ఆకర్షణకు లోనైనట్లు చెప్పారు. దీంతో ఏడాదిన్నర పాటు అతనికి సైడ్ కొట్టానంది. వచ్చినపని మాత్రమే చేసుకుని వెళ్లిపోయే అతని ప్రవర్తన ఆకట్టుకుందని చెప్పింది. దీంతో చాలా రోజులు అతనికి సైట్ కొట్టానని అయితే తాను సైట్ కొడుతున్నట్లు అతనికి తెలియదని పేర్కొంది. తనను ఒకసారి కూడా తనవైపు కన్నెత్తి చూడటం గానీ, పలకరించడం గానీ జరగలేదని చెప్పింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల తాను వేరే జిమ్కు మారడంతో ఆ యువకుడిని చూడలేదని తెలిపింది. అందరినీ గౌరవించే వ్యక్తులంటే తనకు ఇష్టమని చెప్పింది. అంతేకాకుండా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో బీఎండబ్ల్యూ కారులో తిరిగే యువకుల కంటే స్వసక్తితో ఎదుగుతూ బైక్లో తిరిగే యువకులంటే తనకు అభిమానం అని వెల్లడించింది. ఇంతకీ తాను అంతగా సైట్ కొట్టిన యువకుడి వివరాలు మాత్రం ఆమె చెప్పలేదు. -
ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న ప్రియాభవానీ
సాధారణంగా ఇండియాలో వేసవికాలంలో విహారయాత్రలకు వెళ్తారు. కానీ హీరోయిన్లు మాత్రం వర్షాకాలంలో విదేశీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. నవ దంపతులు విఘ్నేష్ శివన్, నయనతార ఇప్పటికే స్పెయిన్ దేశంలో ఎంజాయ్ చేస్తుండగా సాక్షి అగర్వాల్ వంటి కొందరు హీరోయిన్లు కూడా విదేశాల్లో గడిపేస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రియా భవాని శంకర్ చేరింది. ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. కోలీవుడ్లో బిజీగా ఉన్న బ్యూటీ ఈమె. యువ హీరోలు, నవ హీరోలు అనే తారతమ్యం లేకుండా అందరితో జతకట్టేస్తోంది. పాత్రల పరిధి కూడా పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని రెండు చేతులా సంపాదించుకునే పనిలో పడింది. అలా ఇటీవల ధనుష్ సరసన నటించిన చిత్రం తిరుచిట్రంపలం. ఇందులో ఒక పాట రెండు మూడు సన్నివేశాలు మాత్రమే ఈ అమ్మడు కనిపిస్తుంది. అయినా చిత్ర విజయం సాధించడంతో అందులో తానున్నాననే క్రెడిట్ కొట్టేస్తోంది. బిజీ షెడ్యూల్లోనూ రిలీఫ్ కోసం తన ప్రియుడు రాజవేల్తో కలిసి వారం క్రితం విదేశాలకు చెక్కేసింది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసింది. ట్రైనర్ సహాయంతో హెలీకాప్టర్ నుంచి పారాచ్యూట్ ద్వారా కిందికి దిగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం జయం రవికి జంటగా అఖిలన్, ఎస్జే సూర్య సరసన బొమ్మై, శింబుతో పత్తు తల, రుద్రన్ అనే మరో చిత్రంలో నటిస్తున్న ప్రియా భవాని శంకర్ త్వరలో ఇండియన్–2 చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అవుతోంది. చదవండి: (మాజీ బాయ్ప్రెండ్తో సుష్మితా సేన్ షాపింగ్, వీడియో వైరల్) -
బిజీ బిజీగా మారిన హీరోయిన్.. ఒకేసారి అరడజన్కుపైగా చిత్రాలకు సైన్!
కోలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రియ భవాని శంకర్. ముందుగా బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మేయాదమాన్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈమె తొలి చిత్రంతోనే సక్సెస్ను అందుకుంది. దీంతో వరుసగా అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. ఆ తర్వాత ఎస్జే సూర్యతో జతకట్టిన మాన్స్టర్, కార్తీతో కడైకుట్టి సింగం చిత్రాలతో వరుస విజయాలు అందుకుని సక్సెస్ఫుల్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం అత్యధిక చిత్రాలు చేస్తున్న కథానాయికల వరుసలోనూ చేరింది. ఇటీవల ఈమె నటించిన ఓ మన పెణ్నే, యాన్నై చిత్రాలు విడుదలై ప్రజాదరణను పొందాయి. చదవండి: దిక్కుతోచని స్థితిలో ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ..! ప్రస్తుతం ధనుష్కు జంటగా తిరిచ్చిట్రంబలం చిత్రం, అధర్వకు జంటగా, కురిదియాటం, శింబు సరసన పత్తు చిత్రాల్లో నటిస్తోంది. ఆ మధ్య కొంత షూటింగ్ను జరుపుకున్న పత్తు తల చిత్రం త్వరలో మళ్లీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇలా యువ కథానాయకులతో నటిస్తూ దర్శక, నిర్మాతల నటిగా పేరు తెచ్చుకుంది. కాగా మొదట్లో పక్కింటి అమ్మాయిగా కనిపిస్తూ కుటుంబ సభ్యులను అలరించిన ప్రియ భవాని శంకర్ తాజాగా తాను మాత్రం తక్కువ తిన్నానా అంటూ గ్లామర్పై దృష్టి సారించి కుర్రకారును ఆకర్షించేలా, అదే సమయంలో దర్శక నిర్మాతలకు తన మరో ముఖాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. గ్లామరస్ దుస్తులు ధరించిన ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేస్తూ, అభిమానులకు టచ్లో ఉంటోంది. View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) -
'రుద్రుడు'గా రాఘవ లారెన్స్.. ఆ పండుగకే రిలీజ్
Raghava Lawrence Rudrudu Movie Release Date Announced: దర్శకుడిగా, కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ఎంతోమంది హీరోలకు నృత్యం నేర్పించిన రాఘవ.. డైరెక్టర్గా హార్రర్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'రుద్రుడు'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఫైవ్స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై కతిరేషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తాజగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. 'యాక్షన్ థ్రిల్లర్గా రూపొందింన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది.' అని చిత్రబృందం పేర్కొంది. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: కమల్ హాసన్కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? కేన్సర్తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి Presenting the Second Look of @offl_Lawrence master in #Rudhran#Rudhran In Theaters Worldwide From December 23 2022#RudhranFromDecember23@offl_Lawrence @kathiresan_offl @realsarathkumar @gvprakash @priya_Bshankar @RDRajasekar @editoranthony @onlynikil pic.twitter.com/Tqntry9XTJ — Five Star Creations LLP (@5starcreationss) July 3, 2022 -
‘ఏనుగు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏనుగు నటీనటులు : అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, రాధికా శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి, కేజీయఫ్ రామచంద్రరాజు తదితరులు నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ దర్శకత్వం: హరి సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్ సినిమాటోగ్రఫీ: గోపీనాథ్ ఎడిటర్: ఆంథోని విడుదల తేది: జులై 1,2022 హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కాకినాడకు చెందిన పీఆర్వీ, ‘సముద్రం’ కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంటుంది. పీఆర్వీ రెండో భార్య కొడుకు రవి(అరుణ్) తన కుటుంబానికి, సవతి తల్లికొడుకులు(సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్)కు అండగా నిలబడతాడు. ‘సముద్రం’కుటుంబానికి చెందిన లింగం( కేజీయఫ్ గరుడ రామ్)తో తన ఫ్యామిలీకి ముప్పు ఉందని తెలుసుకున్న రవి.. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అన్నయ్యలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటాడు. ఈ క్రమంలో తన అన్నయ్య(సముద్రఖని)కూతురు దేవి(అమ్ము అభిరామి)చేసిన పనికి రవి,అతని తల్లి(రాధికా శరత్ కుమార్)ఇంటిని వీడాల్సి వస్తుంది. అసలు దేవి చేసిన తప్పేంటి? దాని వల్ల రవి ఎందుకు అన్నయ్యలకు దూరమయ్యాడు? పీవీఆర్, సముద్రం కుటంబాల మధ్య వైరుధ్యుం ఎందుకు ఏర్పడింది? తండ్రి మరణం అన్నదమ్ముల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ మధ్యలో మేరీ (ప్రియా భవానీ శంకర్)తో రవి ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు రవి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మితగా కథ ఎలా ఉందంటే.. సింగం సిరీస్, పూజ సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు హరి. ఆయన చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. అందుకే తమిళ సినిమా యానైని తెలుగు ఏనుగు పేరుతో విడుదల చేశారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎమోషనల్ కంటెంట్తో పాటు మంచి ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా పీవీఆర్, సముద్రం కుటుంబాల మధ్య వైర్యం, మేరి, రవిల ప్రేమాయణంతో రొటీన్గా సాగుతుంది. ప్రధాన పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. యోగిబాబుతో వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయిస్తాయి. పీవీఆర్ కుటుంబంలో చీలికలు ఏర్పడడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్తో నింపేశాడు. అన్నయ్య కూతురు దేవిని వెతికే క్రమంలో వచ్చే ట్విస్టులు, ఎమోషన్ సీన్స్ సినిమాని మరోస్థాయి తీసుకెళ్తాయి. రవి తండ్రి చనిపోయిన సీన్ అయితే కంటతడి పెట్టిస్తాయి. అయితే రొటీన్ స్క్రీన్ప్లే, కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. అలాగే నిడివి కూడా ఎక్కువగా ఉండడం మైనస్. ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. రవి పాత్రకు న్యాయం చేశాడు అరుణ్ విజయ్. యాక్షన్, ఎమోషన్స్ సీన్స్లో చక్కగా నటించాడు. ఇక మేరి పాత్రలో ఒదిగిపోయింది ప్రియా భవానీ శంకర్. తెరపై తెలుగింటి అమ్మాయిగా, అందంగా కనిపించింది. పీఆర్వీ కుటుంబ పెద్దగా సముద్రఖని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. రవి తల్లిగా రాధిక శరత్ కుమార్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. విలన్ గా గరుడ రామ్ ఆకట్టుకున్నాడు. జిమ్మిగా యోగిబాబు తనదైన కామెడీ పంచ్లతో నవ్వించాడు. మిగిలిన నటీటనులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. జీవి ప్రకాశ్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. గోపినాథ్ సినిమాటోగ్రఫి బాగుంది. సముద్ర తీరం అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటర్ ఆంథోని తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. కొన్ని సీన్స్కి తొలగించి, నిడివిని తగ్గిస్తే సినిమా స్థాయి మరోరకంగా ఉండేది. నిర్మాణ విలువల చాలా రిచ్గా, సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
తెలుగులో వస్తున్న ఏనుగు, ట్రైలర్ చూశారా?
‘‘నా కెరీర్లో ‘ఏనుగు’ బిగ్గెస్ట్ సినిమా. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఇందులో మంచి ఎమోషనల్ కంటెంట్తో పాటు ఫ్యామిలీ వాల్యూస్ని చూపించారు హరి. అందరూ తప్పుకుండా కనెక్ట్ అవుతారు’’ అని హీరో అరుణ్ విజయ్ అన్నారు. హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘యానై’. వేదిక కారన్పట్టి, ఎస్. శక్తివేల్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ‘ఏనుగు’ పేరుతో తెలుగులో రానుంది. జగన్మోహిని సమర్పణలో సీహెచ్ సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ని హైదరాబాద్లో రిలీజ్ చేశారు.‘‘ఈ సినిమాలో ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలని వినోదాత్మకంగా చూపిస్తూ, మంచి సందేశం ఇచ్చాం’’ అన్నారు హరి. ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు హ్యాపీగా బయటకు వస్తారు’’ అన్నారు సీహెచ్ సతీష్ కుమార్. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో! డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్ -
నాగచైతన్య ‘దూత’ షూటింగ్, పాల్గొన్న ప్రియా భవానీ శంకర్
నాగచైతన్య నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘దూత’ చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే. నాగచైతన్య హీరోగా నటించిన ‘మనం’, ‘థ్యాంక్యూ’ (రిలీజ్ కావాల్సి ఉంది) చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కె. కుమార్ ఈ వెబ్ సిరీస్కు దర్శకుడు. ఈ సిరీస్లో లీడ్ హీరోయిన్గా ప్రియా భవానీశంకర్, కీలక పాత్రలో మలయాళ నటి పార్వతి నటిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, ప్రియా భవానీశంకర్, పార్వతీల మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? Yuvasamrat #NagaChaitanya malayalam actress #Parvathy & @priya_Bshankar from the sets of Amazon Prime Horror web series #Dootha 🎥 pic.twitter.com/G3M4NIPD5y — Milagro Movies (@MilagroMovies) March 9, 2022 -
నిన్ను పెళ్లాడాలంటే ఏం చేయాలి? హీరోయిన్కు ప్రపోజల్
హీరోలకే కాదు హీరోయిన్లకూ వీరాభిమానులు ఉంటారు. కాకపోతే అభిమాన తారలను దగ్గరనుంచి చూడాలని మురిసిపోయే వారు కొందరైతే, కుదిరితే ఆ తారలతో సెల్ఫీ దిగాలని, మరీ కుదిరితే ఏకంగా ఆమె చేయి పట్టుకుని నడవాలని పగటికలలు కనేవాళ్లు మరికొందరు. ఇక్కడ కూడా ఓ నెటిజన్.. తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్తో ప్రేమలో పడ్డాడు. కానీ తన ప్రేమను ఆమెకు ఎలా వ్యక్తం చేయాలి? ఆమెను ఎలా బుట్టలో వేసుకోవాలి? అసలు పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కాక సతమతమయ్యాడు. దీనికి పరిష్కారం సూచించమని సదరు హీరోయిన్నే సూటిగా ప్రశ్నించాడు. "మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి" అని సోషల్ మీడియాలో అడిగేశాడు. దీనికి సదరు నటి స్పందిస్తూ.. "నాతో ప్రయాణం అంటే కొత్తవారికి కొంత కష్టమే! కాబట్టి మీకు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలన్న విషయం తెలియకపోతేనే మంచిది, సురక్షితం కూడా! అని బదులిచ్చింది. కాగా న్యూస్రీడర్గా పని చేసిన ప్రియాభవానీ శంకర్ తర్వాత బుల్లితెరపై సందడి చేసింది. ఆ తర్వాత వెండితెరవైపు అడుగులు వేసిన ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించింది. గత కొన్నేళ్లుగా ఆమె రాజవేల్తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు షికారు చేశాయి. కానీ దీనిపై ప్రియా భవానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె చివరగా బ్లాక్బస్టర్ మూవీ 'మాఫియా'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మంచు మనోజ్ సరసన 'అహం బ్రహ్మాస్మి'లోనూ ప్రియాభవానీ నటిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చదవండి: రజనీకాంత్ ‘శివాజీ’ మూవీకీ 14 ఏళ్లు: అప్పటి కలెక్షన్స్ ఎంతంటే.. -
పోలీసాఫీసర్ వీరశంకర్
‘డాన్శీను, బలుపు’ వంటి హిట్ చిత్రాల తర్వాత హీరో రవితేజ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్’. సరస్వతీ ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు నిర్మిస్తున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా, వరలక్ష్మీ శరత్కుమార్ నెగటివ్ రోల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని రవితేజ కొత్త స్టిల్ను గురువారం రిలీజ్ చేశారు. ఇందులో ఏపీ పోలీసాఫీసర్ పి. వీరశంకర్గా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని, బి.మధు మాట్లాడుతూ– ‘‘ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకొని తయారు చేసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చివరి షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలో బ్యాలెన్స్ షెడ్యూల్ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమన్ స్వరపరచిన పాటల్లో ఓ పాటను త్వరలో విడుదల చేయనున్నాం. థియేటర్లు తెరుచుకోగానే ‘క్రాక్’ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి. -
అక్టోబర్లో స్టార్ట్
‘మనం’ తర్వాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు నాగచైతన్య. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘థ్యాంక్యూ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కనిపించే అవకాశం ఉందని తెలిసింది. రకుల్ ప్రీత్సింగ్, తమిళ నటి ప్రియా భవానీ శంకర్లను ఈ సినిమాలో హీరోయిన్లుగా తీసుకోవాలని చిత్రబృందం అనుకుంటున్నారట. గతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో జంటగా నటించారు చైతన్య, రకుల్. మరి ‘థ్యాంక్యూ’లో జంటగా కనిపిస్తారా? అనేది త్వరలో తెలిసిపోతుంది. హీరోయిన్ల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
అహం బ్రహ్మాస్మి అదిరిపోతుంది
మూడేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రియాభవానీ శంకర్ కథానాయిక. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పణలో ఎంఎం ఆర్ట్స్ బ్యానర్పై మనోజ్ కుమార్ మంచు, నిర్మలాదేవి మంచు నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మనోజ్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో రామ్చరణ్ క్లాప్ ఇచ్చారు. మంచు లక్ష్మి, చిరంజీవి కుమార్తె సుస్మిత కెమెరా స్విచ్చాన్ చేశారు. లక్ష్మి కుమార్తె బేబీ విద్యా నిర్వాణ మంచు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించింది. నటుడు మోహన్బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణలు దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘శ్రీకాంత్ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చడంతో మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. యంగ్ టీమ్తో పనిచేస్తున్న ఈ సినిమా అదిరిపోతుంది. ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని, మా అభిమానుల్ని అలరిస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న చిత్రమిది. ఈ నెల 11నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మే నెలలో పీటర్ హెయిన్స్ సారథ్యంలో హైదరాబాద్లో యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. జూన్లోగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం కొత్తగా ఉంటాయి. అనంత శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి చక్కని పాటలు రాశారు’’ అన్నారు సంగీత దర్శకుడు అచ్చు రాజమణి. ‘‘ఈ చిత్రంలో ఒక పాటకు సంగీతాన్ని అందిస్తున్నా’’ అన్నారు రమేష్ తమిళమణి. ‘‘మంచి సినిమాలో నన్ను భాగం చేసిన మోహన్ బాబుగారికి, మనోజ్, శ్రీకాంత్గార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ప్రియాభవానీ శంకర్. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ చల్లగుళ్ల. -
లుక్ అదిరింది
మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై తన ఎనర్జీని చూపించడానికి రెడీ అయ్యారు మంచు మనోజ్. కమ్బ్యాక్ సినిమాగా ‘అహం బ్రహ్మస్మి’ అనే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ను ఎంచుకున్నారాయన. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మంచు మనోజ్, నిర్మలా దేవి నిర్మిస్తున్నారు. ప్రియా భవానీశంకర్ కథానాయికగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్ను బుధవారం విడుదల చేశారు. ఫస్ట్ లుక్ అందరి దృష్టినీ ఆకర్షించేలా ఉంది. సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. రేపు ఈ సినిమా ముహూర్తం జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
నటి ‘ప్రేమలేఖ’ నెట్టింట్లో వైరల్
నటి ప్రియా భవానీశంకర్ తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమలేఖ లాంటిది తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. ఇటీవల వార్తల్లో ఉంటుంన్న నటి ప్రియా భవానీశంకర్. అందుకు కారణం దర్శకుడు, నటుడు ఎస్జే.సూర్యతో ప్రేమాయణం అనే వదంతులు రావడమే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన ఈ అమ్మడు ఇప్పుడు సక్సెస్పుల్ కథానాయికిగా రాణిస్తోంది. మేయాదమాన్తో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియా భవానీశంకర్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కమలహాసన్తో కలిసి ఇండియన్ 2 చిత్రంలో నటించే స్థాయికి చేరుకుంది. కాగా ఈ మధ్యలో ఎస్జే.సూర్యతో కలిసి మాన్స్టర్ చి త్రంలో నటించింది. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. తాజా గా బొమ్మై అనే మరో చిత్రంలో ఆయనతో జత కట్టింది. దీంతోనే వీరి మధ్య ప్రేమ సాగుతోందనే ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యవహారంపై నటుడు ఎస్జే.సూర్య క్లారిటీ ఇచ్చారు. ప్రియా భవానీశంకర్ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశారు. అయినా సామాజిక మాధ్యమాలు వారి గురించి వదంతులు ప్రసారం చేస్తూనే ఉన్నాయి. తాజాగా నటి ప్రియా భవానీశంకర్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న తన ప్రేమికుడు రాజ్కు ప్రేమలేఖ రాసింది. అందులో ‘పదేళ్ల క్రితం కళాశాలలో చాలా సంతోషంగా, ఆత్మస్థైర్యంతో చాలా ఓ మాదిరి అందం కలిగిన నన్ను నువ్యు ప్రేమించినప్పుడు ఆశ్యర్యపడలేదు. ఇప్పటికీ అన్నింటినీ దాటి ఇంకా నాతో ఉండాలని కోరుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. పగిలిన భావాలను సేకరించుకుంటున్న ఒకరితో ఉండడం అంత సంతోషాన్నివ్వదు. నువ్వు నేను వినడానికి మరిచిన సంగీతం లాంటి వారం. గాయాలను మరచిపోవడానికి కొత్త ప్రేమను విమర్శించనవసరం లేదు. పరిస్థితులకు మారని అభిమానం చాలు. నాకు ఒక పాప పుడితే తన జీవితంలో నీలాంటి వాడు ఒకడు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. నక్షత్రాలు నిండిన నా జీవితంలో నువ్వు మాత్రమే సూర్యుడివి. పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని పేర్కొంది. అంతేకాకుండా తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటో సహా ఈ అమ్మడు ఇన్స్ట్రాగామ్లో పేర్కొన్న ఈ ప్రేమలేఖ ఇప్పు డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్కు ఇప్పటివరకు రెండు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. View this post on Instagram I wasn’t surprised when you fell in love with the most happy, confident, less attractive, so called average looking ‘me’ from college a decade ago. But I am surprised you chose to stay with this ‘new me’ through everything. It is NOT fun & exciting to be with a broken person picking their destroyed pieces. நீ, நான் கேட்க மறந்த இசை. காயங்களை மறக்க புதிய காதலின் கிளர்ச்சி தேவையில்லை, சூழ்நிலைக்கு மாறாத அன்பு போதும் என்றிருக்கும் பேராண்மை. எனக்கு ஒரு பெண் குழந்தை பிறந்தா அவள் வாழ்க்கைல உன்னை மாதிரி ஒரு ஆண் இருக்கனும்னு நான் கடவுளை கேட்டுக்கறேன்😊 in my world full of stars you remain my sunshine! Happy birthday maa🤗 A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) on Jan 26, 2020 at 8:58pm PST -
వారిద్దరి ప్రేమాయణం సోషల్మీడియాలో వైరల్
నటుడు, దర్శకుడు ఎస్జే.సూర్య నటి ప్రియభవానీ శంకర్ని ప్రేమిస్తున్నట్లు, అయితే ఆమె ఆయన ప్రేమను తిరష్కరించినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి ప్రియాభవానీశంకర్. మేయాదమాన్ చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు ఆ చిత్ర విజయంతో పేరు తెచ్చుకుంది. ఈ తరువాత కార్తీతో నటించిన కడైకుట్టి సింగం వంటి చిత్రాల సక్సెస్ ప్రియభవానీశంకర్ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తరువాత సోలో హీరోయిన్గా ఎస్జే.సూర్యకు జంటగా నటించిన మాన్స్టర్ చిత్ర విజయం మరింత పాపులర్ చేసింది. చదవండి: నా గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు: రష్మిక ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కమలహాసన్కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించే అవకాశం వరించే స్థాయికి చేరుకుంది. కాగా ఇప్పుడు మరోసారి ఎస్జే.సూర్యతో కలిసి బొమ్మై అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ఆమె పేరును నటుడు ఎస్జే, సూర్యనే సిఫారసు చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఎస్జే.సూర్య, నటి ప్రియభవానీశంకర్ల మధ్య ప్రేమాయణం జరుగుతుందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటివరకూ ఈ ప్రచారంపై పెదవి విప్పని నటుడు ఎస్జే.సూర్య తాజాగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ కొందరు ఫూల్స్ తాను నటి ప్రియభవానీశంకర్కు ఐలవ్యూ చెప్పినట్లు, దాన్ని ఆమె నిరాకరించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. చదవండి: సినిమాగా నయన, విఘ్నేశ్శివన్ ప్రేమకథ నిజానికి మాన్స్టర్ చిత్రం నుంచే నటి ప్రియభవానీశంకర్ తో పరిచయం తమ మధ్య మంచి స్నేహంగా మారిందన్నారు. ప్రియభవానీశంకర్ మంచి నటి అని పేర్కొన్నారు. తమ మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని స్పష్టం చేశారు. తమ స్నేహాన్ని ఏదేదో ఊహించుకుంటూ తప్పుడు ప్రచారం చేయవద్దు అని అని వదంతులకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కాగా నటుడు ఎస్జే.సూర్య ఇప్పటికీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అన్నది గమనార్హం. అయితే ఈ వ్యవహారంపై నటి ప్రియభవానీశంకర్ మాత్రం మౌనం దాల్చింది. -
గుత్తా జ్వాల ప్రియుడితో ప్రియా రొమాన్స్
యువ నటుడు విష్ణువిశాల్ ఇంతకుముందు వరకూ తన చిత్రాలకు సంబంధించిన వార్తలో ఉండేవారు. ఇప్పుడు ప్రియురాలు, ప్రేమ అంటూ వార్తలో నానుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రేమలో మునిగితేలుగున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ ప్రచారం అవుతోంది. నటుడిగా మాత్రం బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం జగజ్జాల కిల్లాడి, ఎఫైఆర్ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా విష్ణువిశాల్ ఇంతకుముందు సిలుక్కువార్పట్టి సింగం చిత్రంలో నటించడంతో పాటు దాని నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. దీనికి సెల్లా ఆయ్యావు దర్శకుడు. ఈ చిత్రం 2018 డిసెంబర్లో విడుదలయ్యింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా విష్ణువిశాల్ ఈ దర్శకుడికి తాజాగా మరో అవకాశాన్నిచ్చారు. వీరి కాంబినేషన్లో కొత్త చిత్రానికి సంబంధించిన ఫ్రీ పొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్) కాగా ఇందులో విష్ణువిశాల్కు జంటగా నటి ప్రియాభవానీ శంకర్ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు కథ వినిపించినట్లు, కథ నచ్చడంతో ప్రియాభవానీశంకర్ కూడా నటించడానికి సమ్మతించినట్లూ సమాచారం. ఈ చిత్రానికి ఇంకా కాల్షీట్స్ను కేటాయించలేదట. కారణం ఇప్పుడు ప్రియాభవానీశంకర్ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం కురుది ఆట్టం, కళత్తిల్ సంథిస్పోమ్, కసడదపర, మాఫియా, బొమ్మై. ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల మధ్య ఖాళీ చూసుకుని విష్ణువిశాల్ చిత్రానికి కాల్షీట్స్ కేటాయిస్తానని నటి ప్రియాభవానీశంకర్ మాట ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
విష్ణు విశాల్ సినిమాలో ప్రియా
‘రాక్షసన్’చిత్రం సక్సెస్తో లైమ్లోకి వచ్చిన యువనటుడు విష్ణువిశాల్. ఇప్పుడు ఆయనతో రొమాన్స్కు నటి ప్రియా భవానీ శంకర్ సై అంటున్నట్లు తాజా వార్త. విష్ణువిశాల్ ప్రస్తుతం జగజాలా కిల్లాడి, ఎఫ్ఐఆర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఇందులో లక్కీ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించనుంది. ‘మేయాదమాన్’చిత్రంతో వెండితెరపైకి వచ్చిన బుల్లితెర నటి ఈ అమ్మడు. తొలి చిత్రమే సక్సెస్ కావడంతో హీరోయిన్గా సెటిల్ అయ్యిపోయ్యింది. ఆ తర్వాత కార్తికి జంటగా నటించిన కడైకుట్టి సింగం, ఎస్జే.సూర్యతో నటించిన మాన్స్టర్ చిత్రాల విజయాలు ప్రియా భవానీ శంకర్ కెరీర్కు బాగా హెల్ప్ అయ్మాయి. దీంతో ఈ చిన్నది బిజీ హీరోయిన్గా మారింది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కురిది ఆట్టం, కలత్తిల్ సందిప్పోమ్, కసర తపర, మాఫియా ఛాప్టర్ అంటూ అరడజను చిత్రాల వరకు నటిస్తుంది. తాజాగా విష్ణువిశాల్తో రొమాన్స్కు సిద్ధమవుతోంది. ఈ సినిమాను విష్ణువిశాల్ స్వయంగా తన విష్ణువిశాల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్నారు. చెల్ల దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు సిలుక్కువారుపట్టి సింగం అనే వినోదభరిత చిత్రం వచ్చింది. తాజా చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే మరొ కొద్ది రోజులు ఆగాల్సిందే. -
రహస్య భేటీ
చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో రహస్యంగా వ్యూహరచన చేస్తున్నారట నటుడు కమల్హాసన్. మరి.. కమల్ తాజా ప్రణాళిక లక్ష్యం ఏంటో వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో జరుగుతోందని కోలీవుడ్ సమాచారం. హోటల్ బ్యాక్డ్రాప్లో కమల్పై వచ్చే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. హాటల్లో కమల్ ఎవరెవరితో రహస్యంగా భేటీ అయ్యారో ప్రస్తుతానికి సస్పెన్స్. సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. 1996లో కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన ఇండియన్ చిత్రానికి ‘ఇండియన్ 2’ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళా సాధికారిత అంశాలపై ‘ఇండియన్ 2’ కథనం ఉంటుం దని టాక్. -
ఆ ముగ్గురిలో నేనున్నా!
ఆ ముగ్గురిలో నేనున్నానంటూ సంబరపడిపోతోంది నటి ప్రియ భవానీశంకర్. బుల్లితెరపై నటనలో ఓనమాలు నేర్చుకున్న ఈ బ్యూటీ వెండితెరపై స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తోంది. మేయాదమాన్ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన నటి ప్రియా భవానీశంకర్పై ఆ చిత్ర హిట్ కావటంతో బిజీ అయ్యింది. ఇక ఆ తరువాత కార్తీ సరసన కడైకుట్టి సింగం, ఎస్జే.సూర్యతో జతకట్టిన మాన్స్టర్ చిత్రాలు ప్రియాభవానీశంకర్ను సక్సెస్ఫుల్ హీరోయిన్ల పట్టికలో చేర్చాయి. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి తాజా బంపర్ డ్రా తగిలినట్లయ్యింది. అవును ఏకంగా విశ్వనాయకుడితోనే నటించే లక్కీచాన్స్ను ఇండియన్–2లో కొట్టేసింది. స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా ఇందులో హీరోయిన్లగా నటి కాజల్ అగర్వాల్, ఐశ్వర్యారాజేశ్, ప్రియభవానీశంకర్ నటించనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఇండియన్–2 చిత్రం సెట్పైకి వెళ్లనుంది. కాగా ఇండియన్–2 చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి నటి ప్రియభవానీశంకర్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇండియన్–2 చిత్రంలో తాను నటించనున్న మాట నిజమేనని చెప్పింది. ఈ చిత్రం కోసం తనను పిలిపించిన శంకర్ రెండు గంటల పాటు కథను వినిపించారని చెప్పింది. అందులో తన పాత్ర గురించి తెలిసిన తరువాత ఆశ్చర్యపోయానని అంది. కమలహాసన్ చిత్రంలో 10 నిమిషాల పాత్రలోనైనా నటిస్తే చాలని భావించానని అంది. అలాంటిది ఇండియన్–2 చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో తానూ ఒకరినని తెలిసి వెంటనే నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్, సిద్ధార్థ్, కాజల్అగర్వాల్ వంటి వారితో కలిసి నటించడం భాగ్యంగా భావిస్తున్నానని చెప్పింది. ఇండియన్–2లో ఈ బ్యూటీ పాత్ర చిత్రంలో చివరి వరకూ ఉంటుందట. ఇకపోతే ఈ చిత్రంతో పాటు ప్రియభవానీశంకర్ను మరో భారీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్కు జంటగా ఆయన 54వ చిత్రంలో నటించనుంది. ఇలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంటోందీ అమ్మడు. -
ప్రియమైన బిజీ
న్యూస్ ప్రెజెంటర్గా కెరీర్ను స్టార్ట్ చేసిన ప్రియా భవానీ శంకర్ ప్రస్తుతం కోలీవుడ్లో మంచి జోష్ మీద ఉన్నారు. ‘మేయాద మాన్’ సినిమాతో సిల్వర్స్క్రీన్పై మెరిసిన ఈ బ్యూటీ గతేడాది ‘కడైకుట్టి సింగమ్’ (తెలుగులో ‘చినబాబు’) సినిమాతో తెలుగు ఆడియన్స్ కూడా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ బ్యూటీ కోలీవుడ్లో భారీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. ఇటీవలే కమల్హాసన్ ‘ఇండియన్ 2’లో కీలక పాత్రకు ఊ కొట్టిన ప్రియ తాజాగా విక్రమ్ సరసన హీరోయిన్గా నటించే చాన్స్ను దక్కించుకున్నారట. ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇక ‘మాఫియా’, ‘వాన్’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రియ. -
అడ్డంకులు మాయం!
ఆర్థికపరమైన సమస్యల వల్ల ‘ఇండియన్ 2’ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడిందనే వార్తలు ఆ మధ్యకాలంలో బాగానే వినిపించాయి. ఒక దశలో ఈ సినిమా ఆగిపోతుందనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ ‘ఇండియన్ 2’ చిత్రీకరణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని కోలీవుడ్ తాజా సమాచారం. ఆగస్టు మూడో వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆగస్టు 19న మొదలు కానుందని చెన్నై కోడంబాక్కమ్ కబర్. ఈ సినిమాలో సిద్ధార్థ్తో పాటు కథానాయికలు ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్ కీలక పాత్రలు చేయనున్నారని సమాచారం. 1996లో కమల్హాసనే హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) చిత్రానికి ‘ఇండియన్ 2’ సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... 2015లో దర్శక–నిర్మాతగా కమల్హాసన్ ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. కారణాలు ఏవైనా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ‘ఇండియన్ 2’తో పాటు ఈ సినిమాను కూడా సెట్స్పైకి తీసుకువెళ్తున్నారు కమల్హాసన్. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ను స్వరకర్తగా తీసుకున్నారు. ‘ఇండియన్ 2’ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన లైకా ప్రొడక్షన్స్ ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్ నిర్మాణంలోనూ భాగమవ్వడం విశేషం. ఇలా కామా పెట్టిన పాత ప్రాజెక్ట్స్ని కూడా ముగించే పనిలో ఉన్న కమల్ ఆగిపోయిన తన ‘శభాష్ నాయుడు’ చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారా? వేచి చూద్దాం. -
లిప్లాక్కు ఓకే కానీ..
చెన్నై : బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయ్యి కథానాయికలుగా నిలదొక్కుకున్న వారు అరుదే. అలాంటి నటీమణుల్లో ప్రియా భవానీశంకర్ ఒకరు. బుల్లితెర ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆయనతో కలిసి ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలని భావించింది. దీంతో ఆమె నటిస్తున్న కల్యాణం ముదల్ కాదల్ వరై సీరియల్ నుంచి వైదొలిగింది. అయితే ఆమె నటనకు దూరం కావడాన్ని ప్రేక్షకులు ఇష్టపడలేదు. అలా నటనను కొనసాగించిన ప్రియా భవానీశంకర్ మేయాదమాన్ చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. ఆ మధ్య నటుడు కార్తీతో కడైకుట్టిసింగంతో, ఇటీవల నటుడు ఎస్జే.సూర్యకు జంటగా మాన్స్టర్ చిత్రాల్లో నటించి సక్సెస్లను తన ఖాతాలో వేసుకుంది. ఇలా హీరోయిన్గా సక్సెస్ బాటలో పయనిస్తున్న ప్రియా భవానీశంకర్ తాజాగా ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఆ ఫొటో ఇప్పుడు అభిమానుల మతి పోగొడుతోంది. ఫొటోలో ఉన్నది ప్రియ భవానీశంకరేనా? ఇంత అందంగా ఉంటుందా? అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రియ నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అని కొందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ అమ్మడు తెగ ఖుషీ అవుతోంది. కొందరైతే తల(నటుడు అజిత్)కు జంటగా నటిస్తే చూడాలనుందనే కోరికను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఒక భేటీలో లిప్లాక్ సన్నివేశాలు, బికినీ దుస్తులు ఈ రెండింటిలో ఒక దాంటో నటించాలంటే దేన్ని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు ప్రియాభవానీశంకర్ స్పందిస్తూ లిప్లాక్ సన్నివేశంలో నటించడానికైనా ఒప్పుకుంటాను కానీ బికినీ దుస్తుల్లో నటించడానికి ఎంత మాత్రం ఒప్పుకోనని ఖరాకండీగా చెప్పింది. అంతే కాదు వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడం లేదని, తనకు నచ్చిన కథ పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు ఈ అమ్మడు పేర్కొంది. మొత్తం మీద లిప్లాక్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అని దర్శక నిర్మాతలకు ప్రియాభవానీ శంకర్ బహిరంగంగానే చెప్పేసిందన్నమాట. -
మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!
పెరంబూరు : నరేంద్రమోదీకి తాను శుభాకాంక్షలు చెప్పలేదని వర్ధమాన నటి ప్రియాభవాని శంకర్ వివరణ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో గెలు పొందిన రాజకీయ నాయకులకు ప్ర జలకు సినీ కళాకారులకు శుభాకాంక్షలు వివిధ రకాలుగా తెలియజేస్తున్నారు. అదే విధంగా నరేంద్రమోదీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది సినీ కళాకారుల మాదిరిగానే నటి ప్రియాభవాని శంకర్ ట్విట్టర్లో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అందులో శుభాకాంక్షలు మన నిరంతర ప్రధాని నరేంద్రమోదీ సార్. మోదీ రిటర్న్ అని పేర్కొంది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుభాకాంక్షలు చెప్పిన నటి ప్రియాభవాని శంకర్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో షాక్కు గురైన ఆమె తాను మోదీకి శుభాకాంక్షలు తెలపలేదన్నారు. నకిలీ ట్విట్టర్తో ఇదంతా చేశారు.. తన పేరుతో ఎవరో నకిలీ ట్విట్టర్ రూపొందించి ఆ ట్వీట్ను పొందుపరిచారని వివరణ ఇచ్చారు. అంతే కాదు ప్రధాని మోదీ పేరుతోనే ట్విట్టర్ ప్రారంభించి ఆయనకే శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా! నకిలీ ట్విట్టర్తో ఎందుకు ఇంత ఎమోషనల్. మీ అభిప్రాయాలతో ఇతరులను ఇబ్బంది పెట్టకండి అంటూ నటి ప్రియ భవాని శంకర్ తన ట్విట్టర్లో పేర్కొంది. విశేషం ఏమిటంటే ప్రియా భవానిశంకర్ అసలైన ట్విట్టర్ అకౌంట్ కంటే నకిలీ ట్విట్టర్కే అధికంగా ఫాలోవర్స్ ఉన్నారు. -
ఇంటి సంఘటన తెరకు!
దర్శకుడు, నటుడు యస్.జె. సూర్య, ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మాన్స్టర్’. ‘ఒరు నాళ్ కూత్తు’ ఫేమ్ నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘మాయా– మా నగరం’ అనే చిత్రాన్ని నిర్మించిన పొటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మాణ సంస్థ తమ మూడవ ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందించనుంది. దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా ఓ రోజు మా ఇంట్లో ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటనకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి స్క్రిప్ట్గా రాసుకున్నాను. బాలల నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఇప్పుడు ఇంతకంటే కథ గురించి వేరే విషయాలు ఏమీ చెప్పలేను. యస్. జె సూర్య నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా గత చిత్రం ‘ఒరు నాళ్ కూత్తు’లో సీరియస్ పాత్ర పోషించిన కరుణాకరన్ ఈ చిత్రంలో తన నటనతో కామెడీ కితకితలు పెడతాడు’’ అన్నారు. -
భరత్తో కలిసి వెబ్కు
సినిమా: తొలి చిత్రం మేయాదమాన్ చిత్రంతోనే కోలీవుడ్ దృష్టని తనపై తిప్పుకున్న వర్ధమాన నటి ప్రియ భవానీశంకర్. అంతకుముందు బుల్లితెర వ్యాఖ్యాతగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అటుపై నటిగా బుల్లితెరకు పరిచయమైంది. ఇప్పుడు వెండితెరపై మెరుస్తోంది. ఇటీవల కార్తీ నటించిన కడైకుట్టి సింగం చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ప్రియభవానీశంకర్ ప్రస్తుతం ఈ అమ్మడు ఎస్జే.సూర్యకు జంటగా మాన్స్టర్, అధర్వతో కురుదిఆట్టం చిత్రాల్లో నటిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియభవానీశంకర్ తాజాగా వెబ్ సీరీస్లో నటించడానికి సై అంది. అందులో నటుడు భరత్కు జంటగా నటించనుంది. ముఖ్యపాత్రల్లో నటుడు కరుణాకరన్, రోబోశంకర్ నటించనున్నారు. ప్రముఖ నటీనటులు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్లో నటించడానికి రెడీ అంటున్నారన్నది తెలిసిందే. చాలా మంది ఇమేజ్ గురించి పట్టించుకోవడంలేదు. అంతేకాకుండా వెబ్ సీరీస్కు కూడా ప్రాచుర్యం లభిస్తోందన్నది గమనార్హం. నటి శ్రుతిహాసన్, నటుడు మాధవన్, రానా లాంటి వారు కూడా వెబ్ సీరీస్లో నటిస్తున్నారు. ఇప్పుడు నటుడు భరత్, ప్రియభవానీశంకర్ కూడా ఆ వరుసలో చేరుతున్నారు. -
రాక్షసుడు!
గతేడాది మహేశ్బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ పాత్ర చేసిన ఎస్.జె. సూర్య గుర్తుండే ఉంటారు. 2001లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘ఖుషి’ చిత్రానికి కూడా ఎస్.జె. సూర్యానే దర్శకుడని తెలిసిన విషయమే. అప్పుడప్పుడు హీరోగా, విలన్గా చేస్తుంటారాయన. ఇప్పుడు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మాన్స్టర్’ అనే టైటిల్ని ఖరారు చేశారు. మాన్స్టర్ అంటే రాక్షసుడు, భూతం అనే మీనింగ్స్ ఉన్నాయి. ‘ఒరు నాళ్ కూత్తు’ దర్శకుడు నెల్సన్ ఈ సినిమాకు దర్శ కత్వం వహిస్తున్నారు. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. పిల్లల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. -
ప్రియతో జోడీ కడుతున్న యువహీరో!
సాక్షి, తమిళసినిమా: ఒకవైపు సీనియర్ తారలు తెరమరుగవుతుంటే, కొత్త భామలు సత్తా చాటుతున్నారు. కోలీవుడ్లో యువ నటీమణుల జోరు కొనసాగుతోంది. ఈ కోవలోకి తాజాగా వర్ధమాన నటి ప్రియాభవానీశంకర్ చేరారు. ఆమెను వరుసగా విజయాలతోపాటు అవకాశాలు పలుకరిస్తున్నాయి. బుల్లితెర ద్వారా వెండితెరకు ప్రమోట్ అయిన ఈ బ్యూటీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ‘మేయాదమాన్’ తో వెండితెరకు పరిచయమైన ప్రియ భవానీశంకర్.. ఆ చిత్రం విజయవంతం కావడంతో కోలీవుడ్లో అందరి దృష్టిలో పడ్డారు. ఆ తరువాత హీరో కార్తీకి జోడీగా నటించిన ‘కడైకుట్టిసింగం’ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. దీంతో ప్రియకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా యువ నటుడు అధర్వకు జంటగా నటించే లక్కీఛాన్స్ను ఆమె సొంతం చేసుకున్నారు. ‘కురుధి ఆట్టం’ చిత్రం కోసం వీరు జోడీ కట్టబోతున్నారు. దీనికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయనకిది రెండో సినిమా. అందరూ కొత్తవారితో శ్రీగణేశ్ తెరకెక్కించిన ‘8 తొట్టాగళ్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మధురై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా గ్యాఫ్ తరువాత నటుడు రాధారవి, ఆయన సోదరి, నటి రాధికాశరత్కుమార్ నటించబోతున్నారు. రాక్ ఫోర్ట్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత టీ మురగానందం, బిగ్ ప్రింట్ పిక్చర్స్ ఐబీ కార్తీకేయన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.