Qatar
-
ఐదేళ్లలో వాణిజ్యం రెట్టింపు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని భారత్, ఖతార్ నిర్దేశించుకున్నాయి. ప్రస్తుతం 14 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని 28 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు భారత ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్–థానీ(Qatar Emir Sheikh Tamim bin Hamad Al Thani) మధ్య మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదు ఒడంబడికలపై సంతకాలుఆర్థిక భాగస్వామ్యం, సహకారం, యువజన వ్యవహారాలు, క్రీడలు, పురాతన వస్తువుల నిర్వహణ తదితర అంశాల్లో ఐదు ఒడంబడికలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య ద్వంద్వ పన్నుల విధానం నివారణ ఒప్పందం పొడిగింపుపైనా సంతకాలు జరిగాయి. ‘‘ ఖతార్తో ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాం. వాణిజ్యం, ఇంధన భద్రత, పెట్టుబడులు, సాంకేతికత, ఇరు దేశస్తుల మధ్య సత్సంబంధాలు తదితర అంశాల్లో పరస్పర భాగస్వామ్య ధోరణిని ఇక మీదటా కొనసాగిస్తాం’’ అని ఇరు దేశాల మధ్య చర్చల వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అరుణ్కుమార్ ఛటర్జీ తర్వాత మీడియాకు చెప్పారు.‘‘ వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే అన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ముఖ్యంగా భద్రత సంబంధ అంశం తలెత్తినప్పుడు ప్రత్యేకంగా దీనిపై రెండు దేశాలు ఉమ్మడి ఎజెండా రూపొందిస్తాయి’’ అని ఛటర్జీ చెప్పారు. విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ, అమీర్ తమీమ్లు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. ‘‘ సీమాంతర ఉగ్రవాదం సహా అంతర్జాతీయంగా అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని తుదముట్టిద్దాం. విభేదాలను ద్వైపాక్షిక చర్చలు, బహుముఖ మార్గాల ద్వారా సామరస్యంతో రూపుమాపుదాం’’ అని ఆ ప్రకటనలో భారత్, ఖతార్ పేర్కొన్నాయి.పెరగనున్న పెట్టుబడులుఒప్పందంలో భాగంగా భారత్లో మౌలిక వసతులు, నౌకాశ్ర యాలు, నౌకల నిర్మాణం, ఇంధనం, పునరు త్పాదక ఇంధన రంగం, స్మార్ట్ సిటీ లు, ఫుడ్ పార్క్లు, అంకుర సంస్థలతోపాటు కృత్రిమ మేథ, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతికత రంగాల్లో ఖతార్ పెట్టుబడుల ప్రాధికార సంస్థ పెట్టుబడులను మరింత పెంచుతుంది. అంతర్జాతీయ వివాదా లకు శాంతియుత పరిష్కారాలను చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే సాధించగలమని ఇరు దేశాలు వ్యాఖ్యానించాయి.గత ఏడాది మోదీ ఖతార్లో పర్యటించినప్పుడు ఏకంగా 78 బిలియన్ డాలర్ల ద్రవరూప సహజ వాయువు దిగుమతిపై ఒప్పందం కుదుర్చుకున్నారు. 2048 ఏడాదిదాకా మార్కెట్ ధరల కంటే తక్కువకే భారత్కు ఖతార్ నుంచి ఏటా 75 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతి అయ్యేలా ఒప్పందం కుదుర్చు కున్నారు. ఫిబ్రవరి 17 నుంచి రెండ్రోజుల పర్యటన కోసం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ భారత్కు విచ్చేసిన విషయం తెల్సిందే. తమీమ్ భారత్లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2015లో ఆయన భారత్కు వచ్చారు. -
గాజా ఒప్పందం.. ఆఖరి నిమిషంలో కొర్రీలు!
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్థానీ ఘనంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఆఖరి నిమిషయంలో ఇటు ఇజ్రాయెల్.. అటు హమాస్లు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ(Ceasefire Deal) ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అందుకు హమాస్ చివరి నిమిషంలో పెట్టిన కొర్రీలే కారణమని ఆరోపించింది. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.చివరి నిమిషంలో హమాస్(Hamas) ఉగ్రసంస్థ ఒప్పందంలో మార్పులు సూచించడమే అందుకు కారణమని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. హమాస్ మాత్రం మధ్యవర్తులు తెచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ఇదీ చదవండి: గాజా శాంతి ఒప్పందం ఘనత ఎవరిదంటే..అయితే.. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ (Israel) గాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి జరిగిన దాడుల్లో 71 మంది మరణించినట్లు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. పైగా ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని, పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా.. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఆదివారం(జనవరి 19) నుంచి మొదలుకావాల్సిన ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకునే అవకాశం లేకపోలేదు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 15 నెలల యుద్ధంలో 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తూ వచ్చాయి. అటు అమెరికా.. ఇటు ఈజిప్ట్,ఖతారులు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ చర్చలు జరుపుతూ వచ్చాయి.ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్థానీ టెలివిజన్ ముఖంగా చేసిన ప్రకటనతో.. పాలస్తీనాలో సంబురాలు జరిగాయి. ఇటు గాజా సరిహద్దులో శరణార్థ శిబిరాల్లో ఉన్నవాళ్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా మానవతా ధృక్పథంతో ముందకు సాగాలని, గాజా కోలుకునేందుకు అవసరమైన సాయం కోసం ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. గాజా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న పరిణామంపై భారత్ సహా పలుదేశాలు స్వాగతించాయి. -
ఖతార్లో తెలుగు ప్రవాసికి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం
ఖతార్లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన తెలుగు ప్రవాసి వెంకప్ప భాగవతుల "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డును గెలిచారు. ఖతార్లోని తెలుగు, భారత సమాజానికి ఆయన అందించిన అసాధారణ కృషి, ప్రేరణాత్మక నాయకత్వం, వివిధ రంగాల్లో కనబరచిన విశిష్ట ప్రతిభా పాటవాలు, , సేవలకు గౌరవంగా ఈ అవార్డు ఆయనను వరించింది."సౌత్ ఐకాన్ అవార్డు" అనేది SIGTA కార్యక్రమంలో అందించబడే అత్యున్నత గౌరవం. విదేశాల్లో నివసిస్తూ తమ మాతృభూమి సాంస్కృతిక వారసత్వం మరియు నైతిక విలువలను పరిరక్షించడంలో, వాటిని ప్రోత్సహించడంలో విప్లవాత్మకమైన కృషి చేసిన ప్రవాసులకు ఈ అవార్డు ప్రకటించబడుతుంది. ఖతార్లోని ప్రపంచ ప్రఖ్యాత AL MAYASA థియేటర్ (QNCC) లో జరిగిన ఈ ఘనమైన వేడుకకు 2,500 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల ప్రముఖులు, వ్యాపార, వినోద, సాంస్కృతిక, సేవా, సామాజిక రంగాల నుండి ప్రతిష్టాత్మక వ్యక్తులు పాల్గొని తమ అభినందనలు తెలిపి, ఈ కృషికి ఎంతో గౌరవం అర్పించారు.ఖతార్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు భాష, కళలు, సాంస్కృతిక వారసత్వం , సామాజిక సేవలలో చేసిన అసాధారణ కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యి, అందరి మన్ననలు పొందారు వెంకప్ప భాగవతుల.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డు పొందడం గర్వకారణంగా , గౌరవంగా భావిస్తున్నాను అని, ఇది తన బాధ్యతను మరింత పెంచింది" అని పేర్కొన్నారు అన్నారు వెంకప్ప భాగవతుల. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు సంబంధించి, SIGTA కార్యవర్గం, జ్యూరీ సభ్యులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ గుర్తింపు నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. ఈ అవార్డును నా కుటుంబసభ్యులకు, ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులకు, నాకు ప్రేరణగా నిలిచే నా మిత్రులకు, అలాగే ఖతార్లోని తెలుగు సమాజానికి అంకితం చేస్తున్నాను." అని ఆయన అన్నారు. -
కొఠారి ఇండస్ట్రియల్లో ఎఫ్జేకు వాటా
చెన్నై: నాన్లెదర్ ఫుట్వేర్, డ్రోన్ల తయారీ కంపెనీ కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్లో ఖతార్ సంస్థ ఎఫ్జే గ్లోబల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీ బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కొఠారి ఇండస్ట్రియల్ పేర్కొంది.వెరసి కొఠారి ఇండస్ట్రియల్లో దోహా బ్యాంక్, ఖతార్ ఎయిర్వేస్ సంస్థల ప్రమోటర్ ఎఫ్జే గ్లోబల్ 70,56,000 షేర్లను సొంతం చేసుకోనుంది. రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరునూ రూ. 25 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు కొఠారి వెల్లడించింది. మరోపక్క అధీకృత మూలధనాన్ని రూ. 25 కోట్ల నుంచి రూ. 75 కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది.అయితే ప్రమోటర్ రఫీఖ్ అహ్మద్ కంపెనీలో 47 శాతం వాటాను నిలుపుకునేందుకుగాను మరిన్ని పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. కాగా.. ఫుట్వేర్ తయారీ సంస్థ ఫీనిక్స్ కొఠారి ఫుట్వేర్లో అహ్మద్ 30 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సైతం బోర్డు అనుమతించినట్లు కొఠారి ఇండస్ట్రియల్ వెల్లడించింది. బీఎస్ఈలో కొఠారి ఇండస్ట్రియల్ 2% బలపడి రూ. 72.5 వద్ద ముగిసింది. -
దిగ్విజయంగా ముగిసిన '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు'
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుఘనంగా ముగిసాయి. మధ్య ప్రాచ్య దేశాలలో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించుకుంది. 9 తెలుగు సంస్థల సహకారంతో నిర్వహింపబడిన ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రధాన అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విచ్చేశారు. ఖతార్ లో భారతదేశ రాయబారిశ్రీ విపుల్ కూడా సదస్సుకు హాజరై నిర్వాహకులను అభినందించారు. అమెరికా, భారత దేశం, ఉగాండా, స్థానిక ఆరబ్ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సుమారు 18 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్, MSME, SERP & NRI సాధికారత శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ సదస్సుకు ప్రత్యేక అభినందనలు వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రాధిక మంగిపూడి (ముంబై), విక్రమ్ సుఖవాసి (దోహా) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (హ్యూస్టన్), వంశీ రామరాజు (హైదరాబాద్) దోహా ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులైన సాయి రమేశ్ నాగుల, దాసరి రమేశ్, శేఖరం.ఎస్. రావు, గోవర్ధన్ అమూరు, ఆరోస్ మనీష్ మొదలైనవారు, శ్రీ సుధ బాసంగి, శిరీష్ రామ్ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్, కవి మౌనశ్రీ మల్లిక్, రాజ్యశ్రీ కేతవరపు, అత్తలూరి విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి, కలశపూడి శ్రీనివాస రావు, గంటి భానుమతి, గరికిపాటి వెంకట ప్రభాకర్, బి.వి. రమణ, ప్రభల జానకి, విశ్వవిద్యాలయ ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, శరత్ జ్యోత్స్నా రాణి, త్రివేణి వంగారి, దేవీ ప్రసాద్ జువ్వాడి, కట్టా నరసింహా రెడ్డి, సినీ నిర్మాతలు వై.వి. ఎస్. చౌదరి, మీర్ అబ్దుల్లా, నాట్య గురువు ఎస్.పి. భారతి మొదలైన వక్తలు, కవులు వైవిధ్యమైన అంశాల మీద తమ సాహిత్య ప్రసంగాలను, స్వీయ రచనలను వినిపించారు. వరంగల్ కి చెందిన ప్రొ. రామా చంద్రమౌళి గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది, సదస్సులో భాగంగా శ్రీమతి బులుసు అపర్ణ చేసిన అష్టావధానం అందరినీ ప్రత్యేకంగా అలరించడమే కాకుండా, మధ్య ప్రాచ్య దేశాలలోనే జరిగిన తొలి అష్టావధానంగా రికార్డ్ ను సృష్టించింది. రెండవ రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరఫున వందన సమర్పణ కార్యక్రమంలో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. దుబై, అబుదాబి, బెహ్రైన్, ఒమాన్, ఖతార్ తదితర ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని వివరించారు. -
ధర పెరిగినా, తగ్గినా.. భారత్లోనే బంగారం చీప్!
ఒమన్, ఖతార్, సింగపూర్, యూఏఈ వంటి దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో బంగారం ధరలు కొంత తక్కువగా ఉన్నాయని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక పేర్కొంది.2024 నవంబర్ 16 నాటికి భారతదేశంలో బంగారం ధరలు రూ.75,650 (24 క్యారెట్ల 10గ్రా), రూ.69,350 (22 క్యారెట్ల 10గ్రా)గా ఉన్నాయి. నవంబర్ 1వ తేదీ ధరలతో పోలిస్తే.. ప్రస్తుత ధరలు చాలా క్షీణించినట్లు తెలుస్తోంది.యూఏఈలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,204. సింగపూర్లో రూ.76,805, ఖతార్లో రూ.76,293, ఒమన్లో రూ.75,763గా ఉంది. ఈ ధరలతో పోలిస్తే.. భారతదేశంలో బంగారం ధరలు కొంత తక్కువే అని స్పష్టంగా అర్థమవుతోంది.భారత్లో బంగారం తగ్గుదలకు కారణంమార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. బంగారం ధర తగ్గడానికి కారణం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగియడం, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అని తెలుస్తోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గుదల కూడా గోల్డ్ రేటు తగ్గడానికి దోహదపడింది.ఇదీ చదవండి: జాబ్ కోసం సెర్చ్ చేస్తే.. రూ.1.94 లక్షలు పోయాయ్భారతదేశంలో బంగారం మీద పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఒమన్, ఖతార్, సింగపూర్, యుఏఈ వంటి దేశాల్లో మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇది కూడా అక్కడ బంగారం ధరల పెరుగుదలకు కారణం అయింది. -
హమాస్పై ఖతార్ కీలక నిర్ణయం.. నోటీసులు జారీ
హమాస్ గ్రూప్ను బహిష్కరించడానికి అంగీకరించినట్లు ఖతార్ వెల్లడించింది. దోహాలోనే నివసిస్తూ ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు హమాస్ నేతలు ఆమోదం తెలపని విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో హమాస్ నేతలను బహిష్కరించాలని ఖతారకు అగ్రరాజ్యం అమెరికా ఆమోదం సూచించింది. ఈ క్రమంలో అమెరికా విజ్ఞప్తికి ఖతార్ అందుకు అంగీకారం తెలిపి.. హమాస్కు నోటీసులు పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రచురిస్తోంది.ఇటీవలి కాల్పుల విరమణ, బందీల మార్పిడి ప్రతిపాదనలను హమాస్ గ్రూపు తిరస్కరించిన నేపథ్యంలో దోహాలో హమాస్ కొనసాగడం ఆమోదయోగ్యం కాదని అమెరికా ఖతార్కు తెలియజేసింది. “ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలనే ప్రతిపాదనలను పదేపదే తిరస్కరిస్తోంది. హమాస్ నేలను ఇకపై ఏ అమెరికన్ భాగస్వామి దేశం తమ రాజధాని నగరాల్లోకి స్వాగతం పలకకూడదు. కాల్పల విరమణను తిరస్కరించిన హమాస్ను బహిష్కరించాని మేం ఖతార్కు స్పష్టం చేశాం’ అని ఓ అమెరికా అధికారి తెలిపారు.మరోవైపు.. అమెరికా విజ్ఞప్తి మేరకు ఖతార్ హమాస్ను బహిష్కరించటాన్ని హమాస్ నేతలు ఖండించారు.అమెరికా, ఈజిప్ట్తో పాటుగా ఖతార్ దేశాలు.. గాజాలో హింసను అంతం చేయడానికి పలుసార్లు హమాస్-ఇజ్రాయెల్ చర్చలకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్లో జరిగిన చర్చల్లో హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇజ్రాయెల్ కొత్త షరతులను ప్రవేశపెట్టడంతో వాటిని తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని హమాస్ తేల్చిచెప్పింది. -
ఇజ్రాయెల్కు సాయం చేయకండి: అరబ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్-ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనా, లెబనాన్లపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే.. ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈనేపథ్యంలో ఇరాన్ పొరుగున ఉన్న అరబ్ దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు తీవ్ర హెచ్చరికలు చేసింది.తమపై(ఇరాన్) దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్కు సాయం చేయవ ద్దని హెచ్చరించింది. అలా కాదని అరబ్ దేశాలు వారి భూబాగాలు, గగనతలాన్ని ఉపయోగించి దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ వంటి చమురు సంపన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రహస్య దౌత్య మార్గాల ద్వారా ఈ హెచ్చరికను పంపింది. అయితే ఇవన్నీ యూఎస్ సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు.ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లా మృతి అనంతరం ఇరాన్ 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ పెద్దతప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకుంటుందని, ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఇరాన్లోని అణుస్థావరాలతో పాటు.. చమురు క్షేత్రాలనూ లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందని ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథయంలోనే ఇస్లామిక్ రిపబ్లిక్పై ఎలాంటి దాడులు జరగకూడదని,అలా జరిగితే ప్రతీకార దాడులకు పాల్పడతామని అరబ్ దేశాలను హెచ్చరించింది. -
మిస్టరీగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ కీలక నేతలను అంతం చేయాటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులను జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ మిస్టరీగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఆయన బతికే ఉన్నారా? లేరా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే యాహ్యా సిన్వార్కు సంబంధించి.. ఖతార్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం మొదటి నుంచి ఖతార్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గత వారం రోజులుగా సిన్వార్ తమకు టచ్లో లేరని ఖతార్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం.. తమతో ఆయన కమ్యూనికేషన్కు సంబంధించి కీలక విషయాలను వింటారనే భయంతో సిన్వార్ ప్రస్తుతం పెన్, పేపర్లతో మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనతో మధ్యవర్తిత్వ చర్చలకు జరపడానికి తమకు సవాల్గా మారిందని తెలిపారు. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు హమాస్ స్పందించలేదు.ఇక.. సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణగా పెట్టుకొని ఉన్నారని ఇజ్రాయెల్ స్థానిక మీడియా ఓ నివేదిక ప్రచురించింది దీంతో హమాస్ చీఫ్ వైమానిక దాడిలో మరణించి ఉండవచ్చనే ఊహాగానాలకు తెరపడినట్లైంది. మరోవైపు.. కాల్పుల ఒప్పందానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడులతో హత్యల విధానాన్ని కొనసాగిస్తోందని ఖతార్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మాజీ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతం చేసింది. ప్రస్తుతం హమాస్కు కీలకమైకన నేతగా ఖలీద్ మషాల్ ఉన్నారు. ఆయన హనియే కంటే చాలా బలవంతుడని ఖతార్ అధికారులు తెలిపారు.చదవండి: మీరెన్ని చెప్పినా.. ఇరాన్పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని -
వేధింపుల నుంచి కాపాడండి
రాయవరం: జీవనోపాధి నిమిత్తం ఖతర్ వెళ్లిన ఓ మహిళ అక్కడ తనకు జరుగుతున్న బాధలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, ఇండియా తీసుకువెళ్లాలని వేడుకుంది. తనను రక్షించి తన పిల్లల వద్దకు చేర్చాలని, ప్రభుత్వం తన పట్ల దయ చూపించాలని ఆ వీడియోలో కోరింది. దానికి సంబంధించిన వీడియోలో ఆ మహిళ ఆవేదన ఈ విధంగా ఉంది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి చెందిన సారథి దేవీ హేమలత స్థానికంగా ఫ్యాన్సీ షాపులో పనిచేసేది. కుటుంబ పోషణ నిమిత్తం భర్త మధుబాబు, ఇద్దరు ఆడ పిల్లలను వదిలి జీవనోపాధి కోసం ఖతర్ వెళ్లింది. 2023 నవంబర్లో ఏజెంటు ద్వారా ఖతరు వెళ్లిన ఆమె.. అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయని ఆ వీడియోలో వెల్లడిస్తూ ఆవేదన చెందింది. భారత కరెన్సీలో రూ.25,000 జీతంతో ఇంటిలో క్లీనింగ్ పని అని చెప్పి తనను ఖతర్ పంపించారని పేర్కొంది. తీరా అక్కడకు వెళ్లిన తరువాత రాత్రి అనక, పగలనక తనతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ఆరోగ్యం బాగుండకపోయినా తనతో పనిచేయిస్తున్నారని చెప్పింది. ఆరోగ్యం బాగుండకపోతే ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లడం లేదని, కనీసం మందులు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను బతికే పరిస్థితి లేదంటూ ఆవేదనతో వెల్లడించింది. మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ తనపై దయతలచి తనను స్వదేశానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా వేడుకొంది. -
రిఫరీ చెత్త నిర్ణయం.. భారత్ ఆశలు ఆవిరి
దోహా: ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భారత జట్టు మూడో రౌండ్కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మూడో రౌండ్కు చేరాలంటే భారత జట్టు ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సింది. కానీ భారత జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. మరోవైపు అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కువైట్ జట్టు 1–0తో గెలిచింది. దాంతో గ్రూప్ ‘ఎ’ నుంచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఖతర్... 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన కువైట్ మూడో రౌండ్కు అర్హత సాధించాయి. 5 పాయింట్లతో భారత్, అఫ్గానిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన గోల్స్ సగటుతో భారత్కు మూడో స్థానం, అఫ్గానిస్తాన్కు నాలుగో స్థానం లభించాయి. రిఫరీ చెత్త నిర్ణయం... ఖతర్తో మ్యాచ్లో భారత జట్టుకు 37వ నిమిషంలో లాలియన్జువాల్ చాంగ్టె గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 73 నిమిషాల వరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ దశలో రిఫరీ చెత్త నిర్ణయం కారణంగా ఖతర్ జట్టు ఖాతాలో గోల్ చేరి స్కోరు సమమైంది. 73వ నిమిషంలో యూసుఫ్ ఐమన్ కొట్టిన హెడర్ను భారత గోల్కీపర్, కెపె్టన్ గుర్ప్రీత్ సింగ్ నిలువరించాడు. ఆ తర్వాతి బంతి గోల్ లైన్ దాటి బయటకు వెళ్లింది. కానీ అక్కడే ఉన్న ఖతర్ ఆటగాడు హాష్మీ అల్ హుస్సేన్ బంతిని వెనక్కి పంపించగా, యూసుఫ్ ఆ బంతిని లక్ష్యానికి చేర్చాడు. రిఫరీ దీనిని గోల్గా ప్రకటించాడు. దాంతో భారత ఆటగాళ్లు నివ్వెరపోయి రివ్యూ చేయాలని రిఫరీని కోరినా ఆయన అంగీకరించకుండా గోల్ సరైనదేనని ప్రకటించాడు. టీవీ రీప్లేలో బంతి గోల్లైన్ దాటి బయటకు వెళ్లిందని స్పష్టంగా కనిపించినా భారత ఆటగాళ్ల మొరను రిఫరీ ఖాతరు చేయలేదు. ఈ సంఘటనతో భారత బృందం ఏకాగ్రత చెదిరింది. 85వ నిమిషంలో అహ్మద్ అల్రావి గోల్తో ఖతర్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లి చివరి నిమిషం వరకు దీనిని కాపాడుకొని విజయాన్ని అందుకుంది. -
2026 FIFA World Cup: భారత ఫుట్బాల్ జట్టు సత్తాకు పరీక్ష
దోహా: స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన తర్వాత... భారత ఫుట్బాల్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయర్స్లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్ను ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో నేడు ఆడనుంది. ఓవరాల్గా ఖతర్తో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆడిన భారత్ ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకొని, మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇప్పటికే ఆసియా జోన్ మూడో రౌండ్కు అర్హత పొందిన ఖతర్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్లా ఉపయోగ పడనుండగా... భారత జట్టుకు మాత్రం తాడోపేడోలాంటింది. గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడనున్న భారత జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మూడో రౌండ్కు చేరుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’గా ముగిస్తే మాత్రం అఫ్గానిస్తాన్, కువైట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. భారత్ తమ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంటే అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియాలి. అలా జరిగితేనే భారత్ మూడో రౌండ్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్లో ఫలితం వస్తే గెలిచిన జట్టు మూడో రౌండ్కు చేరుకుంటుంది. భారత్తోపాటు ఓడిన మరో జట్టు రెండో రౌండ్కే పరిమితమవుతుంది. 2026 ప్రపంచకప్లో తొలిసారి 48 జట్లు పోటీపడనుండగా... ఆసియా నుంచి 8 జట్లకు నేరుగా అవకాశం లభిస్తుంది. మరో బెర్త్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఖరారవుతుంది. -
ఇజ్రాయెల్పై అడ్డుకట్టకు ఖతార్తో జోబైడెన్ భేటీ
గత ఆరు నెలలుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్ను నిర్మూలించాలనే ఇజ్రాయెల్ లక్ష్యం.. గాజా స్ట్రిప్లోని ప్రజలను కష్టాలపాలు చేస్తోంది. గాజాలో తలెత్తుతున్న విధ్వంసకర పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.అమెరికాలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇది అధ్యక్షుడు జో బైడెన్కు కొత్త సమస్యలను తెచ్చిపెట్టేదిగా మారింది. దీంతో బైడెన్ గాజాలో యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ ప్రతిపాదనను బైడెన్ ఇటీవలే ప్రకటించాడు.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరోసారి ఈ ఒప్పందానికి సంబంధించి ఖతార్ ఎమిరేట్స్తో మాట్లాడారు. కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించేలా హమాస్పై ఒత్తిడి తేవాలని కోరారు. గాజాలో సంక్షోభాన్ని అంతం చేయడానికి, కాల్పుల విరమణ, బందీ ఒప్పందాన్ని అమలు చేయడంపై ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో చర్చించారు.‘నేను ఈ రోజు ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడాను’ అని బైడెన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. కాల్పుల విరమణ, బందీ ఒప్పందానికి సంబంధించిన ప్రణాళికను ఎలా రూపొందించాలనే దానిపై చర్చించానన్నారు. హమాస్ ఒప్పందాన్ని ఆమోదించేలా అన్ని తగిన చర్యలను తీసుకోవాలని తాను అమీర్ తమీమ్ను కోరానన్నారు. గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపానన్నారు. ఈ ఒప్పందం అమలుకు ఈజిప్ట్, ఖతార్లతో కలిసి యునైటెడ్ స్టేట్స్ పని చేస్తుందని బైడెన్ పేర్కొన్నారు.ఐదు వేలకు పైగా రాకెట్లను ప్రయోగిస్తూ హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ నగరాలపై దాడి మొదలుపెట్టింది. అనంతరం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి అక్కడి ప్రజలపై దాడులు జరిపారు. దీనికి ప్రతిగా గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో గాజాలోని హమాస్ స్థావరాలపై భారీ బాంబు దాడులు జరిగాయి. ఫలితంగా గాజాలోని పలు ప్రాంతాలు శిథిలమయ్యాయి. ఇజ్రాయెల్,గాజాలలో ఇప్పటివరకు మొత్తం 34,622 మంది మృతి చెందారు. The United States has worked relentlessly to support Israelis’ security, to get humanitarian supplies into Gaza, and to get a ceasefire and a hostage deal to bring this war to an end. pic.twitter.com/eGXgV3KSbV— President Biden (@POTUS) June 1, 2024 -
200 వైడ్బాడీ జెట్లు కొనుగోలు చేయనున్న ప్రముఖ సంస్థ
మిడిల్ ఈస్ట్ ఎయిర్ క్యారియర్ ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా ఎయిర్బస్ ఏ350ఎస్, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తున్నట్లు బ్లూమ్బర్గ్ నివేదిక ద్వారా తెలిసింది.జులై నెల చివరినాటికి బ్రిటన్లో జరగబోయే ‘ఫార్న్బరో ఎయిర్ షో’లో విమానాల కొనుగోలుకు సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. బ్లూమ్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం..ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 200 విమానాలను కొనుగోలు చేయాలనుకుంటుంది. వైడ్బాడీ జెట్లుగా పేరున్న ఎయిర్బస్ ఏ350, బోయింగ్ 777ఎక్స్ మోడళ్లను ఆర్డర్ చేయాలని చూస్తుంది. దీనిపై ‘ఫార్న్బరో ఎయిర్ షో’ నిర్ణయం వెలువడనుంది. ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకునే వైడ్బాడీ జెట్లపై విమానకంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి, పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణ డిమాండ్ను తీర్చడానికి సంస్థ వీటిని కొనుగోలు చేయనుంది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్ప్లస్ కూటమి ప్రభావంఈ డీల్ వివరాలకోసం ఎయిర్బస్ను సంప్రదించినపుడు విమానాల అవసరాల గురించి కస్టమర్లతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని తెలిపింది. అయితే ఈ డీల్కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఖతార్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను విస్తరించడానికి 100 నుంచి 150 వైడ్బాడీ జెట్లను ఆర్డర్ చేయనుందని బ్లూమ్బర్గ్ మార్చిలోనే నివేదించింది. బోయింగ్, ఎయిర్బస్లతో ముందస్తు చర్చలు జరుపుతోందని గతంలో తెలిపింది. -
Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్ ఓకే!
జెరూసలెం: ఈజిప్టు– ఖతార్ ప్రతిపాదించిన యుద్ధ విరమణ ప్రతిపాదనను తాము ఆమోదించామని హమాస్ సోమవారం ప్రకటించింది. గాజాలో ఏడు నెలలుగా హమాస్– ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నామనే విషయాన్ని ఖతారు ప్రధాని, ఈజిప్టు ఇంటలిజెన్స్ మినిస్టర్లకు తెలియజేశారని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి యుద్ధ విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి మళ్లడం లాంటివి ఈ శాంతి ప్రతిపాదనలో ఉన్నాయో, లేదోననే విషయంపై స్పష్టత లేదు. లక్ష మంది పాలస్తీనియన్లు రఫా నగరం నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హకుం జారీచేసిన కొద్ది గంటల్లోనే హమాస్ ప్రకటన వెలువడటం గమనార్హం. హమాస్ నుంచి ఈ ప్రకటన వెలువడగానే రఫాలోని శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు ఆనందోత్సాహాన్ని వెలిబుచ్చారు. రఫాపై ఇజ్రాయెల్ దాడి ముప్పు తప్పినట్లేనని వారు భావిస్తున్నారు. అయితే హమాస్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. -
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇదే..
ఖతార్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. లండన్కు చెందిన పరిశోధనా సంస్థ స్కైట్రాక్స్ ఇటీవల పరిశోధన నిర్వహించి విడుదల చేసిన ర్యాంకుల్లో దోహా హమద్ ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఎంపికైంది. ప్రయాణికులు చెక్-ఇన్ విధానాలు, రాకపోకలు, షాపింగ్, భద్రత, ఇమ్మిగ్రేషన్, నిష్క్రమణ ప్రక్రియలు తదితర అంశాలపై 2023 ఆగస్టు నుంచి 2024 ఫిబ్రవరి మధ్య కాలంలో నిర్వహించిన సమగ్ర గ్లోబల్ సర్వే ఆధారంగా స్కైట్రాక్స్ ర్యాంకులు విడుదల చేసింది. జర్మనీలో ఏప్రిల్ 17న 2024 వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డుల కార్యక్రమం జరిగింది. స్కైట్రాక్స్ ర్యాంకుల్లో దోహా హమద్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానం సాధించగా సింగపూర్లోని చాంగి విమానాశ్రయం రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికి వస్తే ఈ జాబితాలో మొదటి వంద విమానాశ్రయాలలో నాలుగు మాత్రమే భారత్కు చెందిన ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో ఉండగా, బెంగళూరు ఎయిర్పోర్ట్ 59, హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 61, ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 95వ స్థానాలలో నిలిచాయి. -
Lok sabha elections 2024: పోటీ కేరళలో.. ప్రచారం గల్ఫ్లో!
– ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగిది. కేరళ కాంగ్రెస్ నేత షఫి పరంబిల్ దీన్నే గుర్తు చేస్తున్నారు. వడకర లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన గల్ఫ్ దేశాల్లో ఓట్లను అభ్యరి్థస్తున్నారు. యూఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లో భారీగా స్థిరపడిన కేరళీయులను కలిసి భారత్కు వచ్చి ఓటేయాలని కోరుతున్నారు. షార్జాలో, ఖతార్లో తాజాగా కేరళీయులతో సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే దయచేసి వచ్చి ఓటేయాలని కోరారు. అలాగే కేరళ నుంచి విదేశాలకు వెళ్తున్న వారు కూడా పోలింగ్ దాకా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. కేరళ ఎన్నారైలు గతంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో ఈసారి వారి మద్దతు కోసం పరంబిల్ ఇలా గల్ఫ్ యాత్ర చేపట్టారు. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. పరంబిల్ ప్రస్తుతం పాలక్కాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మెట్రోమ్యాన్గా పేరొందిన ఇ.శ్రీధరన్పై 3,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం సీపీఎం ఎమ్మెల్యే కేకే శైలజ, బీజేపీ అభ్యర్థి ప్రఫుల్ కృష్ణన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రచార నిమిత్తం ఇలా గల్ఫ్ బాట పట్టారు. -
వీసా ఉంటే చాలు.. రూ. 1.25 లక్షల జీతం!
ఖతార్లోని భారత రాయబార కార్యాలయం లోకల్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. శాశ్వత, తాత్కాలిక ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఒక నోటీసును ప్రచురించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రాథమిక అర్హత. కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి. ఇంకా ఏమేం ఉండాలంటే.. ఖతార్లోని ఇండియన్ ఎంబసీలో ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. 2024 ఫిబ్రవరి 29 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా గుర్తింపు ఉన్న సంస్థ లేదా కార్యాలయంలో క్లరికల్ పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. అరబిక్లో ప్రావీణ్యం అదనపు అర్హత. అభ్యర్థులు తమ అదనపు అర్హతలు, పని అనుభవం లేదా సర్టిఫికెట్లను అప్లికేషన్లో చూపవచ్చు. అన్ని అలవెన్సులతో కలిపి నెలవారీ జీతం 5,500 ఖతార్ రియాల్స్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1.25 లక్షలు ఉంటుంది. చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న అభ్యర్థులు 2024లోపు ఏప్రిల్ 7 దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ పంపడానికి ప్రచురించిన నోటీసుతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో లింక్ అందుబాటులో ఉంటుంది. -
భారత్, ఖతార్ బంధం సుదృఢం
దోహా: భారత్, ఖతార్ దేశాల బంధం మరింత బలోపేతం అవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఖతర్ పర్యటనలో ఉన్న మోదీ గురువారం ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయి శిక్షలు పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులకు ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టిన నేపథ్యంలో ఖతార్ పాలకునితో మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘ ఎమీర్ను కలవడం అద్భుతం. ఇరుదేశాల మధ్య భిన్నరంగాల్లో విస్తృతస్తాయి సహకారానికి ఈ భేటీ బాటలు పరుస్తోంది. పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే నూతన రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్, ఖతార్ సిద్ధంగా ఉన్నాయి’’ అని భేటీ తర్వాత మోదీ ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. నేవీ అధికారులను విడిచిపెట్టినందుకు థాంక్యూ ‘ఇరు నేతల చర్చలు ఫలవంతమయ్యాయి. ఖతార్లోని భారతీయుల సంక్షేమ బాధ్యతలు తీసుకున్న ఖతార్ ఎమీర్కు మోదీ ధన్యవాదాలు చెప్పారు. కఠిన శిక్షలు పడిన 8 మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులను వదిలిపెట్టినందుకు ఖతార్ ఎమీర్కు మోదీ థాంక్యూ చెప్పి మెచ్చుకున్నారు. భారత్లో పర్యటించాల్సిందిగా ఆయనను మోదీ ఆహా్వనించారు’’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. -
బంధం బలపడుతోంది!
ప్రధానమంత్రిగా తన రెండో విడత పదవీకాలం ముగిసిపోనున్న వేళ నరేంద్ర మోదీ చేస్తున్న తుది అంతర్జాతీయ పర్యటనల్లో ఒకటి గత రెండు మూడు రోజులుగా ఆసక్తి రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, ఆ వెంటనే ఖతార్లో సాగిన మోదీ పర్యటన ఘన విజయం సాధించిందనే చెప్పాలి. అబుదాబిలో స్వామి నారాయణ్ ఆలయ ప్రారంభోత్సవం, ఈ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందే ఖతార్ నుంచి ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళాధికారుల విడుదల, దుబాయ్లోని వరల్డ్ గవర్నమెంట్ సమిట్లో ఇతర దేశాలు చెవి ఒగ్గి మన మాట వినేలా చేయడంలో భారత విజయం... ఇవన్నీ ఛాతీ ఒకింత ఉప్పొంగే క్షణాలు. కృత్రిమ మేధ (ఏఐ), క్రిప్టో కరెన్సీ సహా పలు అంశాలపై ప్రపంచ దేశాల మధ్య సహకారానికి పిలుపునిస్తూ, ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది సమ్మిళిత, స్వచ్ఛ, పారదర్శక, పర్యావరణ హిత ప్రభుత్వాలని భారత ప్రధాని పేర్కొనడం సైతం ఆకర్షించిందనే చెప్పాలి. వెరసి, అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో భారత ప్రధానికి ఉన్న ప్రత్యేక అనుబంధం రెండు దేశాలనూ మరింత సన్నిహితం చేస్తోంది. నమ్మకమైన ఇలాంటి మిత్రదేశం చలవతో గల్ఫ్ ప్రాంతంలో భారత ప్రాబల్యం మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది. తాజా పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబిలో ‘ఎహ్లాన్ మోదీ’ (మోదీకి స్వాగతం) కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అక్కడి పాలకులను ప్రశంసిస్తూ, ప్రవాస భారతీ యులను ఉత్తేజపరుస్తూ ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ హంగామా కానీ, ఆ మర్నాడు చేసిన భారీ హిందూ దేవాలయ ప్రారంభోత్సవం కానీ భారత్, గల్ఫ్సీమల మధ్య బలపడుతున్న బంధా నికి ప్రతీకలే. చెప్పాలంటే, మన దేశం దృష్టిలో పశ్చిమాసియాకు ముఖద్వారం అబుదాబి. అందుకే 2015 ఆగస్ట్లో మోదీ తొలిసారిగా ఈ గల్ఫ్దేశాన్ని సందర్శించారు. 1981లో ఇందిరా గాంధీ అనంతరం భారత ప్రధాని ఒకరు అక్కడికి వెళ్ళడం అదే తొలిసారి. మూడు దశాబ్దాల పైచిలుకు తర్వాత మొదలుపెట్టినా అప్పటి నుంచి ఈ తొమ్మిదేళ్ళలో 7 సార్లు యూఏఈ వెళ్ళారు మోదీ. విస్తృత ద్వైపాక్షిక అజెండాకూ, ఇరు దేశాల మధ్య బలమైన బంధానికీ అది బలమైన పునాది అయింది. పనిలో పనిగా యూఏఈలోని ప్రవాస భారతీయుల దీర్ఘకాలిక వాంఛకు తగ్గట్టుగా హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం కోరారు. ఆ దేశం అంగీకరించింది. సంప్రదాయవాద ఇస్లామిక్ దేశంలో, పూర్తిగా ఆ దేశ పాలకుల అండతో, 27 ఎకరాల విశాల ప్రాంగణంలో అత్యంత భారీ హిందూ దేవాలయ నిర్మాణం జరగడం, దాని ప్రారంభోత్సవానికి భారత ప్రధాని వెళ్ళడం అనూహ్యం, అసాధారణం. ఇరుదేశాల మధ్య గాఢమైన బంధాన్ని పరస్పర ప్రయోజనాలు ప్రోది చేశాయి. యూఏఈలో దాదాపు 35 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారని లెక్క. ఏడు దేశాల సమూహమైన యూఏఈ మన వాళ్ళకు ఉపాధి అందించే కేంద్రం. ఫలితంగా, అక్కడి నుంచి మన దేశానికి ధన ప్రవాహం సరేసరి. గల్ఫ్సీమకు సైతం మనం వాణిజ్యానికీ, వ్యూహాత్మకంగా నమ్మదగిన దేశమయ్యాం. వీటన్నిటి ఫలితంగా స్థానిక రాజకీయాలతో సంబంధం లేకుండా కొన్నేళ్ళుగా బంధం బలపడిందన్న మాట. అసలు పశ్చిమాసియాలోని వివిధ శక్తిసంపన్న దేశాలతో చారిత్రకంగా మన దేశానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సున్నీల ప్రాబల్యమున్న సౌదీ అరేబియా నుంచి షియాలు చక్రం తిప్పే ఇరాన్ వరకు అన్నీ మనకు మిత్రదేశాలే. ఆ మధ్య కొన్నేళ్ళుగా అరబ్ ప్రపంచానికీ, ఇజ్రాయెల్కూ మధ్య సర్దుబాటు చేసే క్రమంలో పశ్చిమాసియాతో మన బంధం మరింత దృఢమవుతూ వచ్చింది. ఇక, భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాల మధ్య ఐ2యూ2 సాంకేతిక సహకారం నిమిత్తం 2022 జూలైలో అమెరికాతో కలసి మనం సంతకాలు చేశాం. ఖతార్ సైతం భారత్లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అంతేకాక, భారత్ చేసుకొనే ద్రవీకృత సహజవాయు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో సగభాగం ఖతార్ చలవే. పైగా రష్యా ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకొనేలా ఒప్పందాల కోసం యూరప్ సైతం ఈ ప్రాంతం వైపు చూస్తున్న సమయంలో... భారత్ – ఖతార్ల మధ్య దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందం సంతోషదాయక విషయం. నిజానికి, 2022లోనే ఇరుదేశాలూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి, 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని బాస చేసుకున్నాయి. ఇంధనం, డిజిటల్ లావాదేవీలు సహా పలు అంశాలపై ఒప్పందాలు కుదరడం విశేషం. ఇక,ఇండియా – మధ్యప్రాచ్యం– యూరప్ ఆర్థిక నడవాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒడంబడిక అత్యంత కీలకమైనది. చైనా చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’కు ప్రత్యామ్నా యమని భావిస్తున్న నడవాను గత సెప్టెంబర్లో ఢిల్లీలో జీ20 సదస్సు వేళ ప్రకటించారు. గాజాలో యుద్ధం కారణంగా దాని భవిష్యత్తుపై ప్రస్తుతం కొంత నీలినీడలు పరుచుకున్నా ఒక్కసారి అమలైతే ప్రాంతీయ అనుసంధానాన్ని అది పెంచుతుంది. అబుదాబిలో దిగితే అచ్చం స్వదేశంలో ఉన్నట్టే ఉందని భారత ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. వినడానికి కాస్త అత్యుక్తిగా అనిపించినా, ఆ మాటల్లో వాస్తవం లేకపోలేదు. భారత్ – అరబ్ ఎమిరేట్స్ మధ్య సాంస్కృతికంగా, ఆర్థికంగా, భౌగోళిక రాజకీయాల పరంగా సత్సంబంధాల సంచిత ఫలితమది. ముస్లిమ్ మెజారిటీ దేశంలో ఒక అతి పెద్ద హిందూ ఆలయ నిర్మాణం పెరుగుతున్న ధార్మిక సహిష్ణుతకు చిహ్నమనే చెప్పాలి. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఆయుధాలు, సైనిక టెక్నాలజీల విషయంలోనూ గల్ఫ్, భారత్ కలసి అడుగులు వేస్తే మంచిది. పశ్చిమ హిందూ మహా సముద్రంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలూ నెరవేరుతాయి. -
దౌత్య విజయం
అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా సాగించిన వివిధ దౌత్యయత్నాలు ఫలప్రదమయ్యాయి. భారత ప్రధానికీ, ఖతార్ అమీర్కూ మధ్య నిరుడు సాగిన సమావేశం ఫలించింది. మరణశిక్ష పడ్డ 8 మంది నౌకాదళ సీనియర్ సిబ్బందిని ఖతార్ ఎట్టకేలకు విడుదల చేసింది. వారిలో ఏడుగురు సోమ \వారం స్వదేశానికి చేరుకోగా, ఎనిమిదో వ్యక్తిని సైతం సాధ్యమైనంత త్వరగా భారత్ రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏణ్ణర్ధం పైగా అక్కడి జైలులో మగ్గుతూ, మరణదండనతో మృత్యుముఖం దాకా వెళ్ళి, చివరకు అన్ని అభియోగాల నుంచి విముక్తమై వారు తిరిగి రావడం అసాధారణం. ఇది భారత దౌత్య విజయం. బుధవారం ఖతార్లో భారత ప్రధాని మోదీ పర్యటించనున్న వేళ వెలువడ్డ ఈ ప్రకటన విశేషమైనది. అంతర్జాతీయంగా మన దేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యానికీ, అరబ్ దేశాలతో మనం నెరపుతున్న స్నేహసంబంధాల సాఫల్యానికీ ఇది ఓ మచ్చుతునక. జరిగిన కథలోకి వెళితే, విడుదలైన ఈ 8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బంది ఇజ్రాయెల్ పక్షాన గూఢచర్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినవచ్చాయి. అందులో నిజం లేదంటూ, వారిని విడుదల చేయాలని భారత్ ప్రయత్నిస్తూ వచ్చింది. గత ఏడాది కాలంగా భారత విదేశాంగ శాఖ అజెండాలో ఓ ప్రధానాంశం – ఈ నౌకాదళ మాజీ అధికారుల విడుదల. అందుకు తగ్గట్టే మంత్రిత్వ శాఖలో సంబంధిత విభాగం, అలాగే ఖతార్లోని భారత దౌత్య కార్యాలయం నిర్విరా మంగా శ్రమించాయి. ప్రచారానికి దూరంగా తమ పని తాము చేస్తూ, చివరకు ఆశించిన ఫలితాన్ని సాధించాయి. విదేశాంగ శాఖ గల్ఫ్ డివిజన్కు మునుపు సారథ్యం వహించిన విపుల్ గత ఏడాది ఖతార్కు వెళ్ళి, ఆ దేశంలో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టడం సైతం కలిసొచ్చింది. ఆయన సంబంధిత వర్గాలన్నిటితో మాట్లాడి, ఒప్పించగలిగారు. అదే సమయంలో, జాతీయ భద్రతా సల హాదారైన అజిత్ దోవల్ సారథ్యంలోని జాతీయ భద్రతా మండలి సచివాలయం సైతం ఖతార్ రాజ ధాని దోహాలోని తన సన్నిహితులతో మంతనాలు సాగించింది. ఓర్పుగా, నేర్పుగా వ్యవహారం నడి పిస్తూ, మన మాజీ అధికారులు విడుదలై, తిరిగివచ్చేవరకు కథను గుట్టుగా నడిపించడం విశేషం. అసలు ఈ వివాదం ఏణ్ణర్ధం క్రితం మొదలైంది. 2022 ఆగస్ట్ 30న ఈ 8 మందిని అరెస్ట్ చేసి, ఏకాంతవాస శిక్ష విధించారు. ఖైదీలుగా ఉన్న మనవాళ్ళను ఆ ఏడాది అక్టోబర్ మొదట్లోనే భారత దౌత్య సిబ్బంది కలిశారు. నిజానికి, అరెస్టయినవారిలో అధికులు దహ్రా గ్లోబల్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు పనిచేస్తూ వచ్చారు. ఖతారీ నౌకాదళంలో ఇటాలియన్ యూ212 రహస్య జలాంతర్గాముల్ని ప్రవేశపెట్టడంలో సాయపడేందుకు వారు ఖతార్కు వచ్చారన్నది కథనం. జైల్లో పడ్డ తమ సిబ్బందికి సాయం చేసేందుకు సదరు ప్రైవేట్ సంస్థ సీఈఓ సైతం ప్రయత్నించక పోలేదు. కానీ, ఆయనా జైల్లో పడి, రెండు నెలలు ఒంటరి చెరను అనుభవించి, అనంతరం జామీను మీద బయటపడాల్సి వచ్చింది. గడచిన 2023 మార్చి వచ్చేసరికి మన అధికారులు పెట్టుకున్న పలు జామీను అభ్యర్థనలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. ఆ నెలాఖరున వారిపై ఖతార్ చట్టప్రకారం విచారణ మొదలైంది. చిత్రమేమంటే ఈ అధికారుల్లో ఒకరైన కెప్టెన్ నవ్తేజ్ గిల్ లాంటి వారు భారత నేవల్ అకాడెమీ నుంచి పట్టభద్రులైనప్పుడు తమ ప్రతిభా ప్రదర్శనకు ఏకంగా రాష్ట్రపతి స్వర్ణపతకం అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో బోధకుడిగా పనిచేశారు. మొదట్లో గత అక్టోబర్లో ఈ నౌకాదళ మాజీ అధికారులందరికీ మరణ దండన విధించారు. ఆపైన మన దౌత్య యత్నాలు, భారత ప్రభుత్వ జోక్యం కారణంగా దాన్ని నిరవధిక జైలు శిక్షగా మార్చారు. బందీలుగా ఉన్న అధికారుల క్షేమం కోసం మన దేశం ఖతార్ అమీర్ కార్యాలయంతో సంప్రతింపులు సాగిస్తూ వచ్చింది. గత ఏడాది దుబాయ్లో ‘కాప్–28’ సదస్సు వేళ భారత ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇరు ప్రభుత్వాధినేతల స్నేహబంధం చివరకు పరిష్కారం చూపింది. మరోపక్క వీరు పనిచేసిన దహ్రా గ్లోబల్ సంస్థ నిరుడు మేలోనే దోహాలో తన కార్యకలాపాలకు స్వస్తి చెప్పింది. ఆ సంస్థలో అత్యధికులు భారతీయులే. వారు అప్పుడే భారత్కు తిరిగొచ్చేశారు. లెక్కచూస్తే, ఒక్క ఖతార్లోనే 8 లక్షల మంది భారతీయులు, 6 వేల భారతీయ కంపెనీలున్నాయి. రెండేళ్ళ క్రితమే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15.03 బిలియన్ డాలర్లుంది. ఇక, భారత్ చేసుకొనే ద్రవీభూత సహజవాయు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో 40 శాతం ఖతార్ నుంచే! వచ్చే 2048 దాకా ఆ దిగుమతుల కోసం 78 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని గత వారమే ఖతార్తో భారత్ కుదుర్చుకుంది. ఇవన్నీ ఇప్పుడు కలిసొచ్చాయి. మొత్తం పశ్చిమాసియా సంగతికొస్తే 90 లక్షల మంది భారతీయులున్నారు. కొన్నేళ్ళుగా పశ్చి మాసియాలో, ప్రధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, కువైట్, ఖతార్ల వైపు భారత్ నిరంతరం స్నేహహస్తం చాస్తోంది. తాజా దౌత్య పరిష్కారం మన ఆ స్నేహానికి ఫలితం. పెరుగుతున్న భారత ప్రాబల్యానికి నిదర్శనం. ఈ ప్రాంత దేశాలన్నీ ఇంధన సరఫరాలో భారత్కు చిరకాలంగా సన్నిహితమైనా, విదేశాంగ విధానంలో పాకిస్తాన్ వైపు మొగ్గేవి. కొన్ని దశాబ్దాలుగా పాక్ అదృష్టం తలకిందులవడంతో, ఆర్థిక, భద్రతా అంశాల రీత్యా ఈ ప్రాంతంలో భారత్తో బలమైన సంబంధాలు అవసరమనే ఎరుక వాటికి కలిగింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో సమష్టి దౌత్య, భద్రతా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, భారత్ను అవి ఇప్పుడు విశ్వసనీయ మిత్రదేశంగా భావిస్తున్నాయి. నౌకాదళ అధికారుల విడుదలకు అదీ ఓ కారణమే. ఏమైనా ఇదే అదనుగా పశ్చిమా సియా దేశాలతో భారత్ దోస్తీ బలపడితే, మరిన్ని దౌత్య, వ్యూహాత్మక ప్రయోజనాలు తథ్యం. -
ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సుగుణాకర్ కుటుంబం
-
ఖతార్లో ఎనిమిదిమంది భారతీయుల మరణశిక్ష రద్దు!
భారత్ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులు విడుదలయ్యారు. దీనిపై భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎనిమిది మంది భారతీయుల్లో ఏడుగురు భారత్కు తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లు దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్లో పనిచేశారు. గూఢచర్యం ఆరోపణలపై 2022, ఆగస్టులో వీరు అరెస్టయ్యారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ ఖతార్ సైనిక దళాలకు, ఇతర భద్రతా సంస్థలకు శిక్షణ, ఇతర సేవలను అందిస్తుంది. ఏడాదికి పైగా జైలు జీవితం గడిపిన అనంతరం ఈ మాజీ మెరైన్లకు ఖతార్లోని దిగువ కోర్టు గత ఏడాది అక్టోబర్లో మరణశిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం భారత్కు ఇవ్వలేదు. దీంతో ఈ నిర్ణయంపై భారత్ అప్పీల్ చేసింది. #WATCH | Delhi: Qatar released the eight Indian ex-Navy veterans who were in its custody; seven of them have returned to India. pic.twitter.com/yuYVx5N8zR — ANI (@ANI) February 12, 2024 దీనిపై విచారణ జరిగిన నేపధ్యంలో ఆ ఎనిమిది మంది అధికారుల మరణశిక్షను ఖతార్ రద్దు చేసింది. ఈ విధంగా భారతదేశం దౌత్యపరంగా మరో విజయం సాధించింది. దుబాయ్లో జరిగిన కాప్-28 కాన్ఫరెన్స్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఖతార్లో నివసిస్తున్న భారతీయుల గురించి అమీర్తో మాట్లాడారు. #WATCH | Delhi: One of the Navy veterans who returned from Qatar says, "We are very happy that we are back in India, safely. Definitely, we would like to thank PM Modi, as this was only possible because of his personal intervention..." pic.twitter.com/iICC1p7YZr — ANI (@ANI) February 12, 2024 ఖతార్ అదుపులో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ డిసెంబర్ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత్ వారి విడుదలకు విశేష కృషి చేసింది. అవన్నీ ఫలించి ఈరోజు వారు స్వదేశానికి చేరుకోవటంతో భారత్కు దౌత్యపరంగా గొప్ప విజయం లభించినట్లయింది. -
ఇజ్రాయెల్కు ఖతర్ ప్రధాని హెచ్చరికలు
హమాస్ సాయుధులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తీరుపై ఖతర్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ మండిపడ్డారు. గాజాలో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తిరస్కరించిన విషయం తెలిసిందే. దావోస్లోని మంగళవారం ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో తీవ్రమైన విధ్వంసం జరుగుతోందని.. అందుకే దాడులు ఆపేయాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్ సైన్యం హమాస్పై చేస్తున్న దాడుల విషయంలో ఇజ్రాయెల్ సైన్యం, అంతర్జాతీయ సమాజంపై యాన విమర్శలు చేశారు. గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి ఇరుదేశాల మధ్య ఆమోదయోగ్యమైన పరిష్కారం అవసరమని తెలిపారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు గాజాలో తిరిగి మళ్లీ మునుపటి పరిస్థితి తీసుకురావటం కష్టమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ప్రస్తుతం గాజా అనేది లేకుండా పోయిందన్నారు. అంటే గాజాలో ఏం లేదని.. పలు చోట్ల ఇజ్రాయెల్ చేసిన భారీదాడులకు గాజా తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. వెస్ట్బ్యాంక్లో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతత నేపథ్యంలో పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో దాడులు ఆపేయాలని ఇజ్రాయెల్ కోరారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, రాజకీయ నేతల సహకారం లేకుండా ప్రస్తున్న నెలకొన్న ఇజ్రాయెల్, గాజాల సమస్యకు పరిష్కారం లభించదని అన్నారు. అదే విధంగా ఇప్పడు జరుగుతున్న దాడులకు ముగింపు కూడా పలకలేమని తెలిపారు. ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలపై యెమెన్లోని హౌతీ దళాలు చేస్తున్న దాడులపై ఆయన మండిపడ్డారు. చదవండి: చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు.. చిక్కుకుపోయిన వందల మంది -
జైలు శిక్షపైనా అప్పీలు!
న్యూఢిల్లీ: ఖతర్లో గూఢచర్య ఆరోపణలపై జైల్లో ఉన్న 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు మరింత ఊరట. వారికి విధించిన మరణశిక్షను అక్కడి న్యాయస్థానం ఇటీవలే జైలు శిక్షగా మార్చడం తెలిసిందే. దానిపై కూడా ఖతార్ సుప్రీంకోర్టులో అప్పీలుకు వీలు కల్పించడంతో పాటు అందుకు 60 రోజుల గడువిచ్చినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైస్వాల్ తెలిపారు. 8 మంది మాజీ అధికారుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా జైలు శిక్ష విధించినట్టు చెబుతున్నారు. వాటి వివరాలను ఖతార్, భారత్ గోప్యంగా ఉంచుతున్నాయి. -
ఖతార్లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు
న్యూఢిల్లీ: ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడిన 8 మంది భారత నావికాదళం మాజీ అధికారులకు భారీ ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను ఖతార్ అప్పిలేట్ కోర్టు రద్దు చేసింది. ఈ శిక్షను కేవలం జైలు శిక్షగా మారుస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. అయితే, వారు ఎంతకాలం జైలులో శిక్ష అనుభవించాలన్నది తెలియరాలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కేసులో ఖతార్ కోర్టు 8 మందికి శిక్షను తగ్గించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గూఢచర్యం కేసులో 8 మంది నేవీ మాజీ అధికారులు 2022 ఆగస్టులో ఖతార్లో అరెస్టయ్యారు. అప్పిలేట్ కోర్టు తాజా తీర్పును భారత దౌత్య విజయంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్–28 సదస్సు సందర్భంగా ఇటీవల దుబాయ్లో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖతార్లో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష గురించి ఈ భేటీలో మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. శిక్ష నుంచి వారికి విముక్తి కలి్పంచాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఖతార్ పాలకులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఖతార్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమంపై అల్–థానీతో చర్చించినట్లు ఈ భేటీ తర్వాత మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరణ శిక్షను రద్దు చేసి, జైలు శిక్షగా కుదిస్తూ ఖతార్ కోర్టు తీర్పు ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటాం ఖతార్ కోర్టు తాజా తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తదుపరి చర్యల విషయంలో న్యాయ నిపుణులతో, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. కోర్టులో గురువారం జరిగిన విచారణకు ఖతార్లోని భారత రాయబారి, ఇతర అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారని తెలియజేసింది. బాధితులకు అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేసింది. ఏమిటీ కేసు? 8 మంది భారత మాజీ అధికారులు ఖతార్ రాజధాని దోహాకు చెందిన అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ ఖతార్ సైనిక దళాలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇస్తోంది. ఇతర సేవలు అందిస్తోంది. అల్–దాహ్రా సంస్థలో పని చేస్తున్న 8 మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ రహస్యాలను చోరీ చేస్తున్నట్లు వారిపై అభియోగాలు మోపారు. ఇతర దేశాలకు సమాచారం చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అయితే, ఈ అభియోగాలను బహిరంగపర్చలేదు. ఈ ఏడాది అక్టోబర్లో ఖతార్ కోర్టు 8 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచి్చంది. దీంతో భారత ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించింది. శిక్షను వ్యతిరేకిస్తూ ఖతార్లోని కోర్టు ఆఫ్ అప్పీల్ను ఆశ్రయించింది. ఖతార్లో శిక్ష పడిన వారిలో నవతేజ్ గిల్, సౌరభ్ వశి‹Ù్ట, పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్పాల్, ఎస్.కె.గుప్తా, బి.కె.వర్మ, సుగుణాకర్ పాకాల, సైలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవారు. -
ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట..
ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళానికి చెందిన మాజీ అధికారులకు ఊరట లభించింది. ఖతార్లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మందికి విధించిన మరణ శిక్షను ఖతార్ కోర్టు తగ్గించింది. దీనిని జైలు శిక్షగా మారుస్తున్నట్లు తీర్పునిచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు బయటకు రాకపోవడంతో.. శిక్షను ఎంత తగ్గించారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు న్యాయ బృందంతోపాటు బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం పేర్కొంది. తాము మొదటి నుంచి భారతీయ మాజీ నేవీ అధికారులకు అండగా ఉన్నామని, రాయబార సంప్రదింపులతోపాటు చట్టపరమైన సహాయాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది. దీనిపై ఖతార్ అధికారులతోనూ చర్చిస్తున్నట్లు తెలిపింది. చదవండి: నిజ్జర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం?! కాగా భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు గూఢచర్యం కేసు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేసిన భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్లో వారికి మరణశిక్ష విధించింది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణ శిక్ష అపీల్పై ఖతార్ కోర్టు విచారణ జరిపి.. మరణ శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది. -
ఖతర్లో మరణశిక్ష కేసు.. బాధితులను కలిసిన భారత రాయబారి
ఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా మరణ శిక్షపడిన వారిని భారత రాయబారి కలిసినట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు. ఎనిమిది మంది నావికాదళ అధికారులపై ఖతర్ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ.. భారత్ అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిగిందని తెలిపారు. #WATCH | MEA Spokesperson Arindam Bagchi says, "You would have seen Prime Minister Modi meet Sheikh Tamim Bin Hamad, the Amir of Qatar in Dubai on the sidelines of CoP28. They've had a good conversation on the overall bilateral relationship as well as in the well-being of the… pic.twitter.com/PfcBKtKvnm — ANI (@ANI) December 7, 2023 సున్నితమైన ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. నావికాదళ అధికారులకు న్యాయ, దౌత్యపరమైన సాయం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 3ను వారిని భారత్ రాయబారి కలిసినట్లు అరిందమ్ బాగ్చి వెల్లడించారు. అదేవిధంగా.. ఇటీవల కాప్ సదస్సులో భాగంగా దుబాయ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్తో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అక్కడి భారత కమ్యూనిటీ సంక్షేమం సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు బాగ్చి తెలిపారు. -
Safeena Husain: ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్
పేదరికంలో పుట్టిన దిల్లీకి చెందిన సఫీనా హుసేన్ చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరింది. లండన్లో చదువుకున్న సఫీనా అమెరికాలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత మన దేశానికి తిరిగి వచ్చి పేదింటి ఆడపిల్లలు బడి బాట పట్టడానికి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఎన్నో రాష్ట్రాలలో వేలాదిమంది ఆడపిల్లలు చదువుకోగలిగేలా చేసింది. తాజాగా... ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో కృషి చేస్తున్న వారికి ‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్, ఖతర్’ వారు ఇచ్చే ‘వైజ్’ప్రైజ్కు ఎంపికైంది. ఈ ప్రైజుకు ఎంపికైన ఫస్ట్ ఇండియన్ సఫీనా హుసేన్ గురించి... ‘అబ్బాయిని స్కూలుకు పంపిస్తున్నారు కదా. మరి అమ్మాయిని ఇంటిపనులకే పరిమితం చేస్తున్నారేమిటి?’ అని అడిగినప్పుడు ఆ ఇంటిపెద్ద నవ్వుతూ ఇచ్చిన సమాధానం.... ‘ఆడపిల్లలకు చదువెందుకు. ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సిందే కదా’ ఇంచుమించు ప్రతి ఇంటి నుంచి ఇలాంటి సమాధానమే వినిపించింది. ‘ఆడపిల్లలకు విద్య’ అనే నినాదం ప్రాధాన్యతకు నోచుకోని ఎన్నో ప్రాంతాలను చూసింది సఫీనా. దీనికి పేదరికం ఒక కారణం అయితే, ఆర్థికస్థాయి బాగున్నా ‘ఆడపిల్లకు చదువెందుకు’ అనే నిర్లిప్తత మరోకారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపిల్ల బడికి వెళ్లాలనే లక్ష్యంతో ‘ఎ డ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సఫీనా. ‘ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దానితో మమేకం కావాలి’ అంటున్న సఫీనాకు పేదరికం అనేది అపరిచిత సమస్య కాదు. దిల్లీలోని ఒక పేదకుటుంబంలో పుట్టింది. ఎన్నో కష్టాల మధ్య కూడా ‘చదువు’ అనే ఆయుధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ కుటుంబం నుంచి లండన్లో చదువుకున్న తొలి వ్యక్తి అయింది. లండన్ నుంచి అమెరికాకు వెళ్లి స్వచ్ఛంద సేవారంగంలో పని చేసిన సఫీనా 2005లో స్వదేశానికి తిరిగి వచ్చింది. ‘చదువుకోవడం వల్ల నేను ఎంతో సాధించాను. దేశదేశాలు తిరిగాను. చదువుకోకపోతే నా పరిస్థితి ఊహకు కూడా అందనంత దయనీయంగా ఉండేది’ అనుకున్న సఫీనా హుసేన్ పేదింటి ఆడపిల్లల చదువు కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ప్రభుత్వ సంస్థల నుంచి వివరాలు సేకరించింది. చదువుకు సంబంధించి జెండర్–గ్యాప్ ఉన్న 26 జిల్లాల గురించి తెలుసుకుంది. అందులో తొమ్మిది రాజస్థాన్లో ఉన్నాయి. రాజస్థాన్లో ఆడపిల్లల చదువుకు దూరంగా ఉన్న ప్రాంతాలను మొదట ఎంపిక చేసుకుంది సఫీనా బృందం. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకులతో ‘ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్’ను ఏర్పాటు చేసి ‘దయచేసి మీ అమ్మాయిని స్కూల్కు పంపించండి’ అంటూ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ‘ఆడపిల్లలకు చదువు’ అనే అంశంపై గ్రామ సమావేశాలు ఏర్పాటు చేశారు. సఫీనా ఆమె బృందం కృషి వృథా పోలేదు. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది ఆలోచన తీరులో మార్పు వచ్చింది. తమ ఇంటి ఆడపిల్లలను స్కూలుకు పంపించడం ప్రారంభించారు. చాలా బడులలో ఆడపిల్లల కోసం టాయిలెట్ సదుపాయాలు లేవు. అలాంటి బడులలో ప్రత్యేక టాయిలెట్లు నిర్మించేలా చేశారు. బడిలో అకాడమిక్ పాఠాలు మాత్రమే కాకుండా లైఫ్స్కిల్స్కు సంబంధించిన పాఠాలు కూడా చెప్పేవారు. ‘ఆడపిల్లలకు చదువు దూరం కావడం అనేది ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది పితృస్వామిక భావజాలానికి సంబంధించింది. మేము పనిచేసిన కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంటి ఆడపిల్ల కంటే గొర్రెలు, మేకలను విలువైన ఆస్తిగా భావించడం చూశాం. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకు రావాలనుకున్నాం. అది అంత తేలిక కాదని తెలిసినా రంగంలోకి దిగాం. ప్రభుత్వ సంస్థల నుంచి లోకల్ వాలెంటీర్స్ వరకు కలిసి పనిచేశాం. అయితే మేము నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు’ అంటుంది సఫీనా. ‘ఆడపిల్లలకు చదువు అందని ప్రాంతాలు ఏమిటి?’ అనే అంశంపై ఒకప్పుడు ప్రభుత్వ సంస్థల డాటాపైన ఆధారపడిన సఫీనా బృందం ఇప్పుడు డాటా ఎనాలటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. జియో–ట్యాగ్డ్ టార్గెట్ విలేజెస్ నుంచి మొబైల్ ఫోన్స్లో డాటా సేకరిస్తున్నారు. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని ఉత్తమఫలితాలు సాధించడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. గతాన్ని గట్టిగా గుర్తు పెట్టుకున్న సఫీనా హుసేన్ ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది పేదింటి అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా కృషి చేస్తోంది. అయినా వెనకడుగు వేయలేదు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’తో తొలి అడుగులు వేసినప్పుడు ‘మీలాగే చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు’ అని నిరుత్సాహపరిచారు కొందరు. అయితే అలాంటి మాటలను మేము సీరియస్గా తీసుకోలేదు. ‘ఫలితం వచ్చేవరకు మా ప్రయత్నం’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బయటి వాళ్లు చెప్పే మాటల కంటే తమ ఊరి వాళ్లు చెప్పే మాటలకే గ్రామస్థులు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో స్థానికులతో కలిసి ఆర్మీ ఆఫ్ జెండర్ ఛాంపియన్స్ను ప్రారంభించి ఆడపిల్లల విద్యకు సంబంధించి ఇంటింటి ప్రచారం నిర్వహించాం. – సఫీనా హుసేన్, ఫౌండర్, ఎడ్యుకేట్ గర్ల్స్ -
నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట
దోహా: భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారుల మరణశిక్ష వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిది మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఖతార్ కోర్టు అనుమతించింది. ఈ మేరకు నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారుల కుటుంబాలకు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం అందినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. భారత అప్పీల్ను కోర్టు అంగీకరించిందని, ఈ కేసులో తుది నిర్ణయంపై పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే విచారణ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా మరణ శిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాలపాటు సేవలందించారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తూ ఇజ్రాయెల్ తరపున ఓ సబ్మెరైన్ ప్రోగ్రాం కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడినట్లు వీరిపై ఖతార్ ఆరోపణలు మోపింది. చదవండి: కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి మృతి ఈ నేపథ్యంలో 2022 ఆగస్టు 30న ఎనిమిది మంది అధికారులను అరెస్ట్ చేశారు. గత అక్టోబర్ నెలలో దేశ న్యాయస్థానం వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగరణించింది. ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై ఖతార్లో అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి నవంబర్ 9న వెల్లడించారు. ఈ తీర్పు రహస్యంగా ఉందని, న్యాయ బృందంతో మాత్రమే దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరణ శిక్ష పడిన వారిలో..కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేగ్లు ఉన్నారు. సంబంధిత వార్త: అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు -
భారత్పై ఖతర్దే పైచేయి
భువనేశ్వర్: ఎలాంటి అద్భుతం జరగలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. తమకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న ఖతర్ జట్టును నిలువరించడంలో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు విఫలమైంది. ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయర్స్ రెండో రౌండ్లో భాగంగా ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్ లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఖతర్ జట్టు తరపున ముస్తఫా మషాల్ (4వ ని.లో), అల్మోజ్ అలీ (47వ ని.లో), యూసుఫ్ అదురిసాగ్ (86వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. భారత జట్టుకు కూడా గోల్ చేసే అవకాశాలు లభించినా ఫినిషింగ్ లోపంతో మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్గా ఖతర్ జట్టుతో నాలుగు మ్యాచ్లు ఆడిన భారత్ మూడింటిలో ఓడిపోయి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. ఈనెల 16న కువైట్తో జరిగిన మ్యాచ్లో 1–0తో గెలిచిన భారత్ ఈ మ్యాచ్లో మాత్రం తడబడింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 102వ స్థానంలో ఉన్న భారత్ అనూహ్యంగా ఈ మ్యాచ్లో రెగ్యులర్ గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూకు విశ్రాంతి కల్పించి మరో గోల్కీపర్ అమరిందర్ సింగ్ను ఆడించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 61వ స్థానంలో ఉన్న ఖతర్ భారత రక్షణపంక్తిలోని లోపాలను సద్వినియోగం చేసుకొని ఆట నాలుగో నిమిషంలోనే తొలి గోల్ సాధించింది. ఆ తర్వాత భారత జట్టు తేరుకొని ఖతర్కు కాస్త పోటీనిచ్చింది. విరామ సమయానికి ఖతర్ 1–0తో ఆధిక్యంలో ఉంది. రెండో అర్ధభాగం మొదలైన రెండో నిమిషంలోనే ఖతర్ ఖాతాలో రెండో గోల్ చేరింది. ఆ తర్వాత కూడా ఖతర్ తమ జోరు కొనసాగించి మ్యాచ్ ముగియడానికి మరో నాలుగు నిమిషాల ముందు మూడో గోల్ను సాధించింది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి 83 నిమిషాలు ఆడాక అతని స్థానంలో ఇషాన్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో ఖతర్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... మూడు పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను వచ్చే ఏడాది మార్చి 24న అఫ్గానిస్తాన్తో ఆడుతుంది. -
భారత్ సత్తాకు సవాల్
భువనేశ్వర్: సొంతగడ్డపై సమష్టి ఆటతీరుతో రాణించి ఆసియా చాంపియన్ ఖతర్ జట్టును నిలువరించాలని భారత పురుషుల ఫుట్బాల్ జట్టు పట్టుదలతో ఉంది. ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ రెండో రౌండ్లో భాగంగా నేడు కళింగ స్టేడియంలో ఖతర్ జట్టుతో భారత్ తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఖతర్ 61వ స్థానంలో, భారత్ 102వ స్థానంలో ఉన్నాయి. ర్యాంక్ పరంగానూ, ప్రావీణ్యం పరంగానూ తమకంటే మెరుగ్గా ఉన్న ఖతర్ జట్టును నిలువరించాలంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీని విజయంతో ప్రారంభించింది. కువైట్తో ఈనెల 16న జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 1–0తో గెలిచింది. మరోవైపు ఖతర్ జట్టు తొలి లీగ్ మ్యాచ్లో 8–1తో అఫ్గానిస్తాన్పై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ భారతజట్టు సత్తాకు సవాల్గా నిలువనుంది. ఇప్పటి వరకు భారత్, ఖతర్ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. 1996లో ఖతర్తో జరిగిన తొలి మ్యాచ్లో 0–6తో ఓడిన టీమిండియా, 2019లో రెండో మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. 2021లో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 0–1తో ఓటమి చవిచూసింది. ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ఇంటా బయటా పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో మొత్తం ఆరు మ్యాచ్లు ఆడుతుంది. అనంతరం టాప్–2లో నిలిచిన రెండు జట్లు ప్రపంచకప్ మూడో రౌండ్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. -
ఎల్ అండ్ టీ కంపెనీపై రూ.239 కోట్లు పెనాల్టీ.. కారణం ఇదేనా..
దిగ్గజ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ షేర్ ధర సోమవారం 0.71 శాతం నష్టాల్లో ట్రేడయింది. శుక్రవారంతో పోలిస్తే షేర్ ధర 22 పాయింట్లు తగ్గి రూ.3087 వద్ద స్థిరపడింది. కంపెనీపై ఖతార్ విధించిన పెనాల్టీ ఇందుకు కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖతార్ ట్యాక్స్ విభాగం రూ.111.30 కోట్లు, రూ.127.60 కోట్ల చొప్పున రెండు జరిమానాలు విధించినట్లు ఎల్ అండ్ టీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ ప్రకటించిన ఆదాయ వివరాల్లో భారీ వ్యత్యాసం ఉందని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఖతార్ప్రభుత్వం వివరించింది. మార్చి 2017 నుంచి మార్చి 2018 మధ్య కాలానికిగాను కంపెనీపై ఈ జరిమానా విధించారు. అయితే సంస్థ ఈ జరిమానాపై పిటిషన్ దాఖలు చేయనుంది. మిడిల్ఈస్ట్ దేశాల్లో ఎల్ అండ్ టీ రెండో అతిపెద్ద నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. లార్సెన్ అండ్ టూబ్రో హైడ్రోకార్బన్ వ్యాపారం పశ్చిమాసియాలో పెద్ద కాంట్రాక్టును సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆ కాంట్రాక్ట్ విలువ ఎంతో కంపెనీ వెల్లడించలేదు. కానీ దాని విలువ రూ.15 వేల కోట్ల మేర ఉండొచ్చని అంచనా. ఇందుకు సంబంధించి ఓ కస్టమర్ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ను అందుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. -
ఆ 8 మందికి మరణశిక్షపై భారత్ అప్పీల్
న్యూఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్ దేశ న్యాయస్థానం విధించిన మరణశిక్షపై అప్పీల్ చేశామని భారత్ గురువారం వెల్లడించింది. సంబంధిత అంశాలను ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ వివరించారు. ‘ మంగళవారమే ఆ ఎనిమిది మందితో సంప్రతింపుల జరిపే అవకాశం దోహా నగరంలోని భారతీయ ఎంబసీ దౌత్యాధికారులకు లభించింది. నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారులతో మనవాళ్లు మాట్లాడారు. వారికి న్యాయ, దౌత్యపరమైన పూర్తి రక్షణ కలి్పంచేందుకు భారత ప్రభుత్వం కృషిచేస్తోంది’ అని బాగ్చీ అన్నారు. వీరికి మరణశిక్ష ఖరారుచేస్తూ ఖతర్ కోర్టు అక్టోబర్ 26వ తేదీన తీర్పు ఇవ్వగానే భారత ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించింది. వారికి విముక్తి కలి్పంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన దౌత్య మార్గాలను అన్వేíÙస్తోంది. ‘అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వీరిపై ఖతర్ మరణశిక్ష మోపింది. ఈ తీర్పు వివరాలు అత్యంత గోప్యమైనవి. వీటిని కేవలం న్యాయబృందంతోనే భారత్ పంచుకుంటోంది. తదుపరి చర్యలకు సిద్ధమయ్యాం. ఇప్పటికే అప్పీల్ కూడా చేశాం. బాధితుల కుటుంబాలతో మాట్లాడాం. ఇటీవలే వారి కుటుంబసభ్యులను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు’’ అని బాగ్చీ చెప్పారు. అసలు వీరు ఏ విధమైన గూఢచర్యానికి పాల్పడ్డారనే వివరాలను ఇంతవరకు ఖతర్ న్యాయస్థానం బహిరంగంగా వెల్లడించలేదు. కేసులోని సున్నితత్వం దృష్ట్యా ఈ అంశంపై భారత్ తరఫున ఉన్నతాధికారులూ బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. ‘కేసు సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఎవరూ ఈ అంశాన్ని సంచలనాల కోసం లేనిపోని రాద్దాంతాలు, వక్రభాష్యాలతో నింపేయకండి’ అని బాగ్చీ విజ్ఞప్తిచేశారు. మార్చి 25వ తేదీన మాజీ అధికారులపై కేసు నమోదుచేసి ఖతార్ చట్టాల కింద అరెస్ట్చేశారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాలపాటు సేవలందించారు. దళ సభ్యులకు ఇన్స్ట్రక్టర్లుగా పనిచేశారని మాజీ సైన్యాధికారులు గుర్తుచేసుకున్నారు. వీరి అరెస్ట్ తర్వాత మే నెలలో దోహాలోని అల్ దహ్రా గ్లోబల్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపేసింది. అందులో పనిచేసే సిబ్బందిని, ముఖ్యంగా భారతీయులను స్వదేశానికి పంపించేసింది. -
అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు
ఢిల్లీ: ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారుల విషయంలో భారత ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అప్పీల్కు వెళ్లినట్లు గురువారం ప్రకటించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇది సున్నితమైన అంశమని, ప్రచారంలోకి వస్తున్న ఊహాగానాల్ని నమొద్దని కోరుతోంది. ‘‘ఈ సమస్యకు సంబంధించి ఖతార్లోని భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. తీర్పు గోప్యతకు సంబంధించిన అంశం. కేవలం న్యాయ బృందానికి మాత్రమే తీర్పు సంబంధిత వివరాల్ని తెలియజేస్తారు. అందుకే ఈ వ్యవహారంలో ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దు’’ అని విదేశీ వ్వవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ఎనిమిది మందిని కిందటి ఏడాది ఆగష్టులో అరెస్ట్ చేశారు. అక్టోబర్ నెలలో ఖతార్ కోర్టు వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది కూడా. ‘‘ఆ ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే ఢిల్లీలో ఆ కుటుంబ సభ్యుల్ని కలిశారు. వీలైనంత మేర దౌత్య, న్యాయపరమైన సహాయం వాళ్లకు అందించేందుకు సిద్ధం. మంగళవారం నుంచే దౌత్యపరమైన సాయం వాళ్లకు అందుతోంది. ఈ సున్నితమైన వ్యవహారంలో ఊహాగానాలు నమ్మొద్దు అని బాగ్చీ మరోసారి అన్నారు. ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులలో ఒకప్పుడు ప్రధాన భారతీయ యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన వాళ్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్ సమయంలో వాళ్లంతా దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ & కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. దహ్రా అనేది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ సేవలను అందించే ఒక ప్రైవేట్ సంస్థ. -
ఖతార్లో ఉరిశిక్ష పడిన వారి విడుదలకు ప్రయత్నాలు: జైశంకర్
ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ మాజీ అధికారులను విడిపించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జైశంకర్ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ఖతార్లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వారికి తెలియజేశా. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన, బాధలను తెలుసుకున్నాం. ఉరిశిక్ష పడిన ఎనిమిది మంది అధికారుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని భరోసా ఇచ్చాం. ఆ విషయంలో వారి కుటుంబాలతో సమన్వయం చేసుకుంటాం’ అని ఎక్స్ (ట్విటర్) వేదికగా జైశంకర్ పేర్కొన్నారు. Met this morning with the families of the 8 Indians detained in Qatar. Stressed that Government attaches the highest importance to the case. Fully share the concerns and pain of the families. Underlined that Government will continue to make all efforts to secure their release.… — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 30, 2023 కాగా గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్న భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. -
ఎటువంటి ఆధారాలు లేవు..నేవీ మాజీ అధికారి సుగుణాకర్ బంధువు షాకింగ్ నిజాలు..!
-
ఖతార్లో అత్యాచారానికి విధించే శిక్ష ఎంత కఠినం?
ఖతార్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లకు ఖతార్ మరణశిక్ష విధించింది. వారందరినీ కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. వారు గూఢచర్యానికి పాల్పడ్డారని ఖతార్ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ నేపధ్యంలో ఖతార్లో అమలయ్యే వివిధ శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కఠినమైన చట్టాలను ఖతార్ అమలు చేస్తోంది. వీటిలో అత్యాచారానికి సంబంధించిన చట్టం కూడా ఉంది. ఈ శిక్ష గురించి తెలిస్తేచాలు ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఖతార్లో ఒక్కో రకమైన నేరానికి ఒక్కో రకమైన శిక్ష విధిస్తారు. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు, అత్యాచారాలకు కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. దేశంలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. మరోమారు ఇటువంటి నేరం చేసే సాహసం చేయలేని రీతిలో శిక్ష విధిస్తారు. ఖతార్లో అత్యాచారానికి పాల్పడిన నేరస్తులపై రాళ్లతో దాడిచేస్తారు. తరువాత వారి శరీర భాగాలను కూడా నరికివేస్తారు. అంతేకాదు ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అంటే అత్యాచారానికి పాల్పడిన తర్వాత దోషికి వీలైనంత త్వరగా శిక్ష పడుతుందన్నమాట. కాగా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యాచారాలకు కఠినమైన శిక్షలు విధించే నిబంధనలున్నాయి. ముస్లిం దేశమైన కువైట్లో కూడా అత్యాచార నిందితులకు ఏడు రోజుల్లో మరణశిక్ష విధిస్తారు. అదేవిధంగా ఇరాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో అంతమొందిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాల్చివేసే శిక్ష అమలు చేస్తారు. ఈ శిక్ష వారంలోపు విధిస్తారు. సౌదీ అరేబియాలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జననాంగం కోయడం లేదా ఉరి శిక్ష అమలు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలను రూపొందించిన దేశాల జాబితాలో ఖతార్ కూడా ఉంది. ఖతార్ తొలిసారిగా ఫిఫా ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఈ చట్టాలు, నియమాలు ప్రపంచానికి మరింతగా తెలిశాయి. ఇది కూడా చదవండి: హమాస్ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
ఖతార్ ‘మరణ’ మృదంగం!
గల్ఫ్ దేశాల్లో పనిచేయటం కత్తిమీది సాము. అక్కడ అమలయ్యే చట్టాలు, న్యాయవ్యవస్థ తీరు తెన్నులు భిన్నమైనవి. కనుక ఉపాధి కోసం వెళ్లినవారు ఎంతో జాగురూకతతో వుంటారు. అందువల్లే ఆ దేశాల్లో ఒకటైన ఖతార్లో అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మన నావికాదళ మాజీ అధికారులు ఎనిమిది మంది గూఢచర్యం ఆరోపణల సాలెగూటిలో చిక్కుకోవటం, అక్కడి న్యాయస్థానం గురువారం వారికి మరణదండన విధించటం అందరినీ కలవరపెట్టింది. వాస్తవానికి గూఢచర్యం ఆరోపణలున్నాయని మీడియాలో కథనాలు రావటం మినహా అధికారికంగా ఖతార్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఖతార్తో నిరుడు ఆగస్టు నుంచి సంప్రదింపులు జరుపుతూ, వారి విడుదలకు కృషి చేస్తున్న మన విదేశాంగ శాఖ కూడా ఏమీ చెప్పలేదు. న్యాయస్థానంలో విచారణ సరేసరి. అంతా గోప్యంగా ముగిసిపోయింది. మరణశిక్ష పడినవారు సాధారణ వ్యక్తులు కాదు. మన నావికాదళంలో పనిచేసినన్నాళ్లూ తమ సత్తా చాటినవారు. వీరిలో తెలుగువారైన సుగుణాకర్ పాకాల కమాండర్ స్థాయిలో పనిచేసి రిటైరయ్యారు. తన సర్వీసు కాలంలో రెండుసార్లు నావికాదళ నౌక ఐఎన్ఎస్ తరంగిణిపై ఒంటరిగా వెళ్లి భూమధ్య రేఖప్రాంతంలో అట్లాంటిక్, పసిఫిక్ మహా సము ద్రాలను దాటివచ్చినవారు. ఇతరులు కూడా నావికాదళ విభాగాల్లో నిపుణులు, లబ్ధ ప్రతిష్టులు. ఒక సందర్భంలో అందరినీ స్వదేశం వెళ్లేందుకు సిద్ధంగా వుండమని చెప్పిన ఖతార్ అధికారులు అంత లోనే నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. వీరు పని చేసిన అల్ దహ్రా గ్లోబల్ సంస్థ నిర్వాహకులను కూడా అరెస్టు చేసిన ఖతార్ అధికారులు రెండు నెలలకే వారిపై ఎలాంటి విచారణ లేకుండా విడుదల చేశారు. మరి భారతీయుల విషయంలో ఈ వివక్ష ఎందుకో అర్థం కాని విషయం. ఇటలీ నుంచి ఖతార్ సమకూర్చుకున్న యు 212 జలాంతర్గామిపై ఆ దేశ నావికాదళ సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు హఠాత్తుగా వీరిని అరెస్టు చేశారంటున్నారు. ఆ జలాంత ర్గామి సాంకేతిక వివరాలను ఇజ్రాయెల్కు చేరేశారన్నది ప్రధాన అభియోగమని చెబుతున్నారు. నేరారోపణలు ఎదుర్కొన్నవారికి న్యాయసహాయం లభించిందా... అసలు వారిపై వున్న ఆరో పణలు ఏమిటన్నది వెల్లడి కాలేదు. కనీసం కుటుంబ సభ్యులకైనా ఆ వివరాలు అందించారా లేదా అన్నది అనుమానమే. సాధారణంగా గూఢచర్యం కేసుల్లో ప్రభుత్వాలు ఎక్కడలేని గోప్యతా పాటి స్తాయి. ఇందువల్ల అటు ముద్దాయిలకు అన్యాయం జరగటంతోపాటు ఆ దేశానికి కూడా అంత ర్జాతీయంగా చెడ్డపేరొస్తుంది. ఖతార్కు ఈ విషయాలు తెలిసేవుండాలి. ఖతార్తో వున్న ద్వైపాక్షిక సంబంధాలను వినియోగించుకుని వీరందరి విడుదలకూ మన దేశం చేసిన ప్రయత్నాలను ఆ దేశం వమ్ముచేసింది. అక్కడి మీడియా సంస్థలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఈ కేసు లొసుగులను ఎత్తి చూపుతూ రాసిన కథనం తమ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నదని ఆగ్రహించి ఆమెను సైతం అరెస్టు చేయటానికి ఖతార్ అధికారులు ప్రయత్నించారని ఒక ఆంగ్ల దినపత్రికలో ఇటీవలే కథనం వెలువడింది. దీనిపై ముందుగా ఉప్పందటంతో ఆ జర్నలిస్టు, అక్కడ వేరే ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త హుటాహుటీన ఆ దేశం విడిచి భారత్ వచ్చారని ఆ కథనం తెలిపింది. ఈ కేసుపై మొత్తంగా ఏడు వాయిదాల్లో విచారణ జరిగిందని చెబుతున్నారుగానీ, దాని తీరుతెన్నులెలా వున్నాయో జర్నలిస్టుకు ఎదురైన చేదు అనుభవమే తేటతెల్లం చేస్తోంది. ఆరోపణలొచ్చినంత మాత్రాన అన్నీ నిజమైపోవని ఖతార్కు తెలియదనుకోలేం. ఎందుకంటే ఆ దేశానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయంటూ ఆరేళ్ల క్రితం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) నుంచి దాన్ని సౌదీ అరేబియా సాగనంపింది. కానీ చివరికి మళ్లీ ఖతార్తో సంధి కుదుర్చుకోక తప్పలేదు. ఉగ్రవాదులుగా ముద్రపడిన తాలిబన్లకు ఆశ్రయం ఇచ్చి, వారితో అమె రికా చర్చలు జరిపేలా చేయటంలో ఖతార్ విజయం సాధించింది. ఇప్పుడు ఇజ్రాయెల్లో చొరబడి ఆ దేశ పౌరులను కాల్చిచంపి, అనేకమందిని బందీలుగా పట్టుకున్న హమాస్కు సైతం ఖతార్లో కార్యాలయం వుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే హమాస్ తీవ్రవాదులు బందీల్లో ఇద్దరు అమెరికన్ పౌరులను విడుదల చేశారు కూడా. వీటన్నిటినీ చూపి ఖతార్ను ఉగ్రవాద దేశంగా పరిగణించాల్సిన అవసరం లేదు. గల్ఫ్ దేశాల్లో ఖతార్ చూడటానికి చిన్న దేశమే కావొచ్చుగానీ, దానికుండే సహజ వనరులు అపారమైనవి. దాని తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఖతర్కూ, ఇరాన్కూ మధ్య సముద్ర జలాల్లో అపారమైన సహజవాయు నిక్షేపాలున్నాయి. అందుకే ఆ దేశంతో ఖతార్కు స్నేహ సంబంధాలున్నాయి. ఇతర గల్ఫ్ దేశాల తీరు ఇందుకు భిన్నం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణశిక్ష పడినవారికి 2015లో భారత్–ఖతార్ల మధ్య కుదిరిన ఒప్పందం ఒక ఆశాకిరణం. దాని ప్రకారం యావజ్జీవ శిక్ష పడినవారిని స్వదేశంలో శిక్ష అనుభవించటానికి వీలుగా వెనక్కిపంపే వీలుంటుంది. ప్రస్తుతం మరణశిక్ష పడిన ఎనిమిదిమందీ ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకుంటే వారిని నిర్దోషులుగా విడుదల చేయొచ్చు. కనీసం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చే అవకాశం వుంటుంది. అదే గనుక జరిగితే 2015 ఒప్పందం కింద వీరిని భారత్ పంపే వీలుంటుంది. ఏదేమైనా ఈ వ్యవహారం మన దౌత్య నైపుణ్యానికి పెద్ద పరీక్ష. గత తొమ్మిది నెలలుగా తెరవెనక సాగించిన యత్నాలు పెద్దగా ఫలించలేదు. కనీసం ఇకముందైనా ఖతార్ను ఒప్పించటంలో, అది సహేతుకంగా వ్యవహరించేలా చేయటంలో మన ప్రభుత్వం విజయం సాధించాలని ఆశించాలి. -
నేను అప్పుడే చెప్పినా..పట్టించుకోలేదు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ వైరల్
సాక్షి, హైదరాబాద్: గూఢచర్య ఆరోపణలతో భారత నేవీకి చెందిన ఎనిమిది మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మాజీ నావికాదళ అధికారులు ఇపుడు మరణం అంచున ఉండటం దురదృష్టకరమంటూ ఆయన ట్వీట్ చేశారు. (భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్లో మరణశిక్ష!) ఖతార్లో చిక్కుకున్న నావికాదళ మాజీ అధికారుల సమస్యను ఆగస్టులో పార్లమెంట్లో లేవనెత్తినట్లు ఒవైసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఇస్లామిక్ దేశాలు తనను ఎంతగా ప్రేమిస్తున్నాయని గొప్పగా చెప్పుకునే ప్రధాని మోదీ మరణశిక్షను ఎదుర్కొంటున్న మన మాజీ నావికాదళ అధికారులను వెంటనే వెనక్కి తీసుకురావాలని ఒవైసీ డిమాండ్ చేశారు. కాగా ఇజ్రాయెల్కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులోఘీ ఎనిమిది మంది అధికారులను ఖతార్అదుపులోకి తీసుకుంది. వీరికి ఖతార్ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సాధ్యమయ్యే అన్ని చట్టపరమైన చర్యలను అన్వేషిస్తున్నట్లు ప్రకటించింది. In August, I had raised the issue of our ex-naval officers stuck in #Qatar. Today they have been sentenced to death. @narendramodi has boasted about how much “Islamic countries” love him. He must bring our ex-naval officers back. It’s very unfortunate that they face the death row pic.twitter.com/qvmIff9Tbk — Asaduddin Owaisi (@asadowaisi) October 26, 2023 -
భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్లో మరణశిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్లో మరణశిక్ష విధించారు. గురువారం ఖతార్లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ వెల్లడించింది. అయితే.. ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్టు ప్రకటించింది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు వివరణాత్మక కాపీ కోసం ఎదురు చూస్తున్నామనీ, బాధితుల కుటుంబ సభ్యులు, న్యాయవాద బృందంతో చర్చించి అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యతనిస్తామని, అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. గూఢచర్యం కేసులో ఈ 8 మందిని గతంలో అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఇండియన్ నేవీకి చెందిన 8 మందితో పాటు ఖతార్కు చెందిన మరో ఇద్దరిపై కూడా గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నట్లు ఖతార్ అధికారులు వాదన. వీరి బెయిల్ పిటీషన్లను పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా తీర్పు సంచలనం రేపుతోంది. నిందితులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో పని చేస్తున్న క్రమంలో ఇటలీనుంచి అధునాతన జలాంతర్గాముల కొనుగోలుకు ఖతార్ రహస్యకార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్కు అందించా రనేది వారి ఆరోపణ. ఖతార్ అధికారులతో కలిసి ఈ నిఘాకు పాల్పడినట్టు ఆరోపింది. ఇదే కేసులో ఒక ప్రైవేటు డిఫెన్స్ కంపెనీ సీఈవోను, ఖతార్కు చెందిన అంతర్జాతీయ సైనిక కార్యకలాపాల అధిపతిని కూడా అరెస్ట్ చేసింది. వీరందరినీ భారతీయ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఎనిమిది మందిని 2022 ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పటినుంచి అంటే ఏడాదికిపైగా కాలంగా వీరంతా జైల్లోనే ఉన్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్ నవతేజ్సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, అమిత్నాగల్, పురేందు తివారి, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాజేశ్ ఉన్నారు. -
ఖతర్ మధ్యవర్తిత్వం
దోహా: ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీల మారి్పడికి, వీలైతే పోరుకు తెర దించేందుకు ఖతర్ రంగంలోకి దిగింది. హమాస్ చెరపట్టిన మహిళలు, పిల్లలను విడిపించేందుకు ముందుకొచి్చంది. బదులుగా ఇజ్రాయెలీ జైళ్లలో బందీలుగా ఉన్న 36 మంది మహిళలు, పిల్లలను విడుదల చేయాలని ప్రతిపాదించింది. దీనిపై ఇప్పటికే హమాస్ తో మాట్లాడుతున్నట్టు ఖతర్ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ విషయంలో అమెరికా సాయం కూడా తీసుకుంటున్నట్టు చెప్పింది. ‘‘చర్చల్లో పురోగతి ఉంది. పోరుకు తెర పడి శాంతి నెలకొనాలని, బందీలు విడుదల కావాలని మా ప్రయత్నం’’ అని వివరించింది. ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి సంప్రదింపులూ జరగడం లేదని పేర్కొంది. -
ఇషా అంబానీ దూకుడు: ఖతార్ నుంచి రూ.8 వేల కోట్ల పెట్టుబడులు
బిలియనీర్,రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పెట్టుబడుల విషయంలో దూసుకుపోతోంది. రిలయన్స్కు చెందిన రీటైల్ విభాగం భారీ పెట్టుబడులను సాధించింది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (QIA) రిలయన్స్ రీటైల్లో రూ. 8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి నిమిత్తం సంస్థలో దాదాపు ఒక శాతం వాటాను తీసుకుంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా, అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్విఎల్)లో రూ. 8,278 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ బీఎస్ఈ ఫైలింగ్లోతెలిపింది. ఇది రిలయన్స్ రిటైల్లో 0.99 శాతం వాటాను కొనుగోలుతో మైనారిటీ ఈక్విటీ వాటాగా మారుతుంది. ఈ పెట్టుబడి ప్రీ-మనీ ఈక్విటీ వాల్యూ రూ. 8.278 లక్షల కోట్లు అనిఆగస్టు 23న విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది. ఇషా అంబానీ ఏమన్నారంటే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో క్యూఐఏ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థను ప్రపంచ స్థాయి సంస్థగా మరింత అభివృద్ధి చేయడం ద్వారా, భారతీయ రిటైల్ రంగాన్ని మార్చేందుకు, క్యూఐఏ గ్లోబల్ అనుభవం బలమైన ట్రాక్ రికార్డ్ తమకు లబ్ది చేకూరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా రిటైల్ మార్కెట్లో, విభిన్నమైన పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో చేరడంపై ఆనందంగా ఉందని క్యూఐఏ సీఈఓ మన్సూర్ ఇబ్రహీం అల్-మహమూద్ అన్నారు. కాగా ఆర్ఆర్విఎల్ 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి రూ. 4.21 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీ వాటాగా మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించిన సంగతి తెలిసిందే. -
ప్రపంచ దేశాల్లో భారత్లో సగటు జీతం, నిరుద్యోగ శాతం ఎంతో తెలుసా?
అవునూ.. మీ జీతమెంత? ఎందుకంటే.. ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల సగటు జీతం ఎంత అన్న దానిపై వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక నివేదిక రూపొందించింది.. దీని ప్రకారం ప్రపంచంలోని 23 దేశాల్లో సగటు జీతం లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉందట. 104 దేశాల్లో సర్వే చేయగా.. టాప్లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567) ఉండగా.. అట్టడుగున పాకిస్థాన్ (రూ. 11,858) ఉంది. మరి మన పరిస్థితి ఏమిటనా.. భారత్తో సగటు జీతం రూ.46,861. ఆయా దేశాల్లో ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. జీతాల సంగతి చెప్పుకున్నాం.. ఇప్పుడు అసలు జీతాలే రాని వారి గురించి చెప్పుకుందాం.. అదేనండీ నిరుద్యోగుల గురించి.. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత శాతాన్ని చూస్తే.. నైజీరియాలో ఇది ఎక్కువగా ఉంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఖతార్లో ఇది అత్యల్పంగా ఉంది. పలు దేశాల్లో నిరుద్యోగిత శాతం సంగతి ఓసారి చూస్తే.. చదవండి: విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్పై లైంగిక వేధింపులు -
ఖతార్ ఇన్వెస్ట్మెంట్కు సీసీఐ ఓకే
న్యూఢిల్లీ: సింగపూర్ నిధుల సమీకరణ సంస్థ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) ప్రతిపాదిత పెట్టుబడులకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. క్యూఐఏ ఖతార్కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్కాగా.. మర్డోక్ సంస్థ లుపా సిస్టమ్స్(జపాన్)తోపాటు, స్టార్, డిస్నీ ఇండియా మాజీ చైర్మన్ ఉదయ్ శంకర్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ వెంచర్ సంస్థే బీటీఎస్1. అయితే బీటీ ఎస్1లో క్యూఐఏ పెట్టుబడులు పెట్టనుంది. వయాకామ్18లో పెట్టుబడుల కోసం బీటీఎస్1 వివిధ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. క్యూఐఏ నుంచి 1.5 బిలియన్ డాలర్ల సమీకరణకు గతేడాది ఫిబ్రవరిలో మర్డోక్, ఉదయ్ శంకర్ బోధి ట్రీ సిస్టమ్స్(బీటీఎస్)ను ఏర్పాటు చేశారు. తదుపరి ఏప్రిల్లో బిలియనీర్ ముకేశ్ అంబానీతో భాగస్వా మ్యం ద్వారా బీటీఎస్.. వయాకామ్18లో రూ. 13,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ త్రిముఖ ఒప్పందం ద్వారా దేశీయంగా భారీస్థాయిలో టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఆపై 2022 సెప్టెంబర్లో బీటీఎస్ ఇన్వెస్ట్మెంట్, రిలయన్స్ ప్రాజెక్ట్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పెట్టుబడుల నేపథ్యంలో జియో సినిమా, వయాకామ్18 మీడియా విలీనానికి సీసీఐ అనుమతించింది. -
ఖతార్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
‘సంక్రాంతి‘ తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే ఈ ‘పెద్ద పండుగ‘ను ఖతార్లోని ‘ఆంధ్ర కళా వేదిక‘, వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించుకుంది. తెలుగు నేపథ్య గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకు తోడుగా సత్యభామ స్వాతి, ప్రముఖ జానపద గాయకురాలు శిరీష, అత్యంత ప్రజాదరణ పొందిన డాన్స్ షో ‘ఢీ(ఈఏఉఉ)‘ ఫేమ్ డాన్స్ మాస్టర్ పండు, మాధురి తమ పాటలతో, ఆటలు మాటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించి ఉర్రూతలూగించారు. ముఖ్య అతిధిగా ఖతార్లోని భారత రాయబార కార్యాలయం నుంచి విచ్చేసిన మొదటి కార్యదర్శి (సాంస్కృతిక, విద్య – సమాచారం) సచిన్ దినకర్ శంక్పాల్ మాట్లాడుతూ.. బాషా, కళా, సాంస్కృతిక, సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వినోద్ నాయర్ ప్రెసిడెంట్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్, కృష్ణ కుమార్ ప్రధాన కార్యదర్శి, ఇండియన్ కల్చరల్ సెంటర్, మెడికల్ అసిస్టెన్స్ హెడ్ రజని మూర్తి, అఓవీ సలహామండలి చైర్మన్ సత్యనారాయణ, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు శ్రీనివాస్ గద్దె, హరీష్ రెడ్డి ఇతర ప్రముఖులు, తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి వారి అభినందనలు తెలియజేసారు. ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ.. కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా ప్రేక్షకులు కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు అని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, వీబీకే మూర్తి, సుధ, సోమరాజు, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, ఓఖీ రావు, శిరీష రామ్ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి ప్రత్యేకించి రమేష్, మెసయిద్ టీంకి, వేదిక ప్రాంగణ అలంకరణకు సహకరించిన మహిళలందరికీ, కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులను, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఖ్యాతి, అనన్యలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా చూడామణి, శ్రీ సుధ వారి వెన్నుండి సహకరించారు. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది. -
మెస్సీ 'నల్లకోటు' వెనక్కి ఇవ్వాలంటూ రూ. 8.2 కోట్ల ఆఫర్
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్కప్ను అర్జెంటీనా నెగ్గిన సంగతి తెలిసిందే. జట్టును అన్నీ తానై నడిపించిన మెస్సీ ట్రోఫీ గెలవడంతో పాటు తన 17 ఏళ్ల కలను కూడా నెరవేర్చుకున్నాడు. ఈసారి ఫిఫా వరల్డ్కప్లో మెస్సీ ఏడు గోల్స్ చేయడమే గాక బెస్ట్ ఫుట్బాలర్గా గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఫిఫా టైటిల్ అందుకునే క్రమంలో మెస్సీ ఒక నల్లకోటు ధరించి వచ్చాడు. ఆ నల్లకోటును అరబ్ దేశాల్లో 'బిష్త్' అని పిలుస్తారు. ఎవరైనా గొప్ప పని సాధిస్తే కృతజ్ఞతగా వారిని గౌరవిస్తూ బిస్ట్ను అందిస్తారు. ఈ నేపథ్యంలోనే మెస్సీ ధరించిన బిష్త్(నల్లకోటు)ను ఖతర్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ అందించారు. ట్రోఫీ అందుకోవడానికి ముందు మెస్సీకి ఆ నల్లని కోటు తొడిగారు. ఆ నల్లని కోటు ధర అక్షరాలా 10 లక్షల డాలర్లు. మరి అంత విలువైన కోటును మెస్సీ బహుకరించింది మాత్రం ఒమన్కు చెందిన అహ్మద్ అల్ బర్వానీ అనే పార్లమెంట్ సభ్యుడు. తాజాగా మెస్సీ ధరించిన బిస్ట్ వెనక్కి ఇవ్వాలంటూ మరొక ట్వీట్ చేశాడు అహ్మద్ అల్ బర్వానీ. ఆ ట్వీట్లో ఏముందంటే.. ''ఖతర్ సుల్తాన్ తరఫున వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. బంగారం, నలుపు రంగులో ఉన్న అరబిక్ బిష్త్ శౌర్యానికి, తెలివితేటలకు ప్రతీక. అయితే మెస్సీ ఇప్పుడు దానిని తిరిగి ఇస్తే అతనికి నేను మిలియన్ డాలర్(రూ. 8.2 కోట్లు) ఆఫర్గా ఇస్తాను. ఎందుకంటే బిష్త్ అనేది మా సంప్రదాయానికి ప్రతీక. మెస్సీ సాధించిన గొప్పతనానికి గుర్తుగా ఆ బిష్త్ను తొడిగాం. మా దేశంలో ఉంటేనే ఆ బిష్త్కు గౌరవం ఉంటుంది. అందుకే మెస్సీ బిష్త్ తిరిగి ఇచ్చేయాలనే ఈ ఆఫర్ ఇస్తున్నా అంటూ తెలిపాడు. మొత్తానికి లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్కప్ అందుకోవడం ఏమోగానీ ఎటునుంచి చూసినా అతనికి డబ్బులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. నిజంగా మెస్సీ అదృష్టవంతుడు. ఇప్పుడు తాను ధరించిన బిష్త్(నల్లకోటు)కు కూడా అంత ధర ఆఫర్ చేయడం మాములు విషయం కాదనే చెప్పొచ్చు. صديقي ميسي.. من #سلطنة_عمان أبارك لكم فوزكم بـ #كأس_العالم_قطر_2022 أبهرني الأمير @TamimBinHamad وهو يُلبسك #البشت_العربي ،رمز الشهامة والحكمة.#ميسي أعرض عليك مليون دولار أميركي نظير أن تعطيني ذلك #البشت#Messi𓃵 I'm offering you a million $ to give me that bisht@TeamMessi pic.twitter.com/45BlVdl6Fh — أحـمَـد الـبـَروانـي (@AhmedSAlbarwani) December 20, 2022 చదవండి: మెస్సీ ధరించిన నల్లకోటు ధర ఎంతంటే? -
పోర్చుగల్ స్టార్ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్కప్ పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు చేదు అనుభవమే మిగిల్చింది. మెగాటోర్నీ ఆరంభం కాకముందే పియర్స్ మోర్గాన్కు ఇచ్చిన ఇంటర్య్వూ ద్వారా మాంచెస్టర్ యునైటెడ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టను దిగజార్చకున్నాడు. ఇక ఫిఫా వరల్డ్కప్లోనూ రొనాల్డో ఆశించినంత మేర రాణించలేదనే చెప్పాలి. కేవలం ఒకే ఒక్క గోల్ కొట్టిన రొనాల్డో ఆ తర్వాత కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో తొలుత బెంచ్కే పరిమితమయ్యాడు. ఫామ్లో లేని రొనాల్డో స్థానంలో వేరేవారికి అవకాశం ఇవ్వాలనే అతన్ని బెంచ్కు పరిమితం చేసినట్లు పోర్చుగల్ హెడ్కోచ్ ఫెర్నాండో శాంటెజ్ వివరించాడు. అయితే రొనాల్డో తుదిజట్లులో లేకపోవడం పోర్చుగల్ను దెబ్బకొట్టిందనే చెప్పొచ్చు. స్విట్జర్లాండ్తో మ్యాచ్లో నెగ్గినప్పటికి.. కీలకమైన క్వార్టర్ ఫైనల్లో మొరాకో చేతిలో ఓడి పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్లోనూ రొనాల్డో తొలుత బెంచ్కే పరిమితమయ్యాడు. రెండో అర్థభాగంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఆ తర్వాత క్రిస్టియానో రొనాల్డో కన్నీటిపర్యంతం అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అలా రొనాల్డో అవమానభారంతో ఫిఫా వరల్డ్కప్ను ముగించాడు. 37 ఏళ్ల రొనాల్డో మరో ఫిఫా వరల్డ్కప్ ఆడేది అనుమానమే. ఈ నేపథ్యంలోనే రొనాల్డోకు మరోసారి అవమానం జరిగింది. ఫిఫా వరల్డ్కఫ్లో చెత్త ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో సోఫాస్కోర్ అనే వెబ్సైట్ వరస్ట్ ఎలెవెన్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో క్రిస్టియానో రొనాల్డో చోటు దక్కించుకున్నాడు. ఒకే ఒక్క గోల్ చేసిన రొనాల్డోకు సోఫాస్కోర్ ఇచ్చిన స్కోర్ రేటింగ్ 6.46. ఇక ఈసారి ఫిఫా వరల్డ్కప్ ఛాంపియన్స్గా నిలిచిన అర్జెంటీనా జట్టులో నుంచి కూడా ఒక ఆటగాడికి వరస్ట్ ఎలెవెన్ టీమ్లో చోటు దక్కింది. అతనే ఫార్వర్డ్ ప్లేయర్ లౌటారో మార్టినెజ్. పైనల్ మ్యాచ్లో అదనపు సమయంలో జులియన్ అల్వరేజ్ స్థానంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన మార్టినేజ్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. ఈ వరల్డ్కప్లో 148 నిమిషాల పాటు యాక్షన్లో ఉన్న మార్టినేజ్ గోల్ కొట్టడంలో.. అసిస్ట్ చేయడంలో ఫెయిల్ అవ్వడంతో కోచ్ లియోనల్ స్కలోని అతన్ని రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితం చేశాడు. మార్టినేజ్కు 6.35 రేటింగ్ ఇచ్చింది. ఇక వీరిద్దరితో పాటు సెనెగల్ స్టార్ గోల్కీపర్ ఎడౌర్డ్ మండీ(6.30) రేటింగ్ ఇచ్చింది. రౌండ్ ఆఫ్ 16లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెనెగల్ ఇంటిబాట పట్టింది. ఇంకా ఈ జాబితాలో సెర్జినో డెస్ట్(అమెరికా, 6.50 రేటింగ్), పోలాండ్కు చెందిన కమిల్ గ్లిక్, బార్టోజ్ బెరెస్జిన్స్కిలు ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన జాక్సన్ ఇర్విన్, మాథ్యూ లిక్కీలతో పాటు సౌత్ కొరియాకు చెందిన హవాంగ్ ఇన్ బోయెమ్, రూబెన్ వర్గస్(స్విట్జర్లాండ్)లను మిడ్ఫీల్డింగ్లో చోటు దక్కింది. సోఫాస్కోర్ ఫిఫా వరల్డ్కప్ వరస్ట్ ఎలెవెన్ జట్టు: క్రిస్టియానో రొనాల్డో(కెప్టెన్), లౌటారో మార్టినె, హవాంగ్ ఇన్ బోయెమ్, రూబెన్ వర్గస్, జాక్సన్ ఇర్విన్, మాథ్యూ లిక్కీ, ఎడౌర్డ్ మండీ(గోల్ కీపర్), సెర్జినో డెస్ట్, కమిల్ గ్లిక్, బార్టోజ్ బెరెస్జిన్స్కి, అబ్దు డియల్లో చదవండి: శకం ముగిసింది.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
FIFA WC: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! రొనాల్డో సంగతి? అవమానకర రీతిలో..
Lionel Messi- Cristiano Ronaldo: ఏడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాడిగా ‘బాలన్ డీర్’ అవార్డు... ప్రతిష్టాత్మక క్లబ్ బార్సిలోనా తరఫున ఏకంగా 35 టైటిల్స్లో భాగం... ఏ లీగ్లోకి వెళ్లినా అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఘనత... లెక్కలేనన్ని రికార్డులు, అపార ధనార్జన... అపరిమిత సంఖ్యలో అతని నామం జపించే అభిమానులు... మెస్సీ గురించి ఇది ఒక చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. ఫుట్బాల్ మైదానంలో అతను చూపించిన మాయకు ప్రపంచం దాసోహమంది... ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడిగా గొప్పగా కీర్తించింది... కానీ...కానీ... అదొక్కటి మాత్రం లోటుగా ఉండిపోయింది. మెస్సీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరల్డ్ కప్ మాత్రం గెలవలేదే అనే ఒక భావన... 2006లో అడుగు పెట్టిన నాటి నుంచి 2018 వరకు నాలుగు టోర్నీలు ముగిసిపోయాయి. కానీ ట్రోఫీ కోరిక మాత్రం తీరలేదు. 2014లో అతి చేరువగా ఫైనల్కు వచ్చినా, పేలవ ఆటతో పరాభవమే ఎదురైంది. రొనాల్డోతో ప్రతీసారి పోలిక వరల్డ్ కప్ లేకపోయినంత మాత్రాన అతని గొప్పతనం తగ్గదు... కానీ అది కూడా ఉంటే బాగుంటుందనే ఒక భావన సగటు ఫ్యాన్స్లో బలంగా నాటుకుపోయింది. అతని సమకాలీకుడు, సమఉజ్జీ క్రిస్టియానో రొనాల్డోతో ప్రతీసారి ఆటలో పోలిక... కానీ ఇప్పుడు మెస్సీ వరల్డ్ కప్ విన్నర్ కూడా... ఈ విజయంతో అతను రొనాల్డోను అధిగమించేశాడు... అర్జెంటీనా ఫుట్బాల్ అంటే మారడోనానే పర్యాయపదం... 1986లో అతను ఒంటి చేత్తో (కాలితో) తమ టీమ్ను విశ్వవిజేతగా నిలిపిన క్షణం ఆ దేశపు అభిమానులు మరచిపోలేదు. అంతటివాడు అనిపించుకోవాలంటే వరల్డ్ కప్ గెలవాల్సిందే అన్నట్లుగా ఆ దేశం మెస్సీకి ఒక అలిఖిత ఆదేశం ఇచ్చేసింది! ఎట్టకేలకు అతను ఆ సవాల్ను స్వీకరించాడు... తొలి మ్యాచ్లో సౌదీ అరేబియా చేతిలో పరాజయం ఎదురైన తర్వాత తమను లెక్కలోంచే తీసేసిన జట్లకు సరైన రీతిలో సమాధానమిచ్చాడు. మైదానం అంతటా, అన్నింటా తానై అటు గోల్స్ చేస్తూ, అటు గోల్స్ చేసేందుకు సహకరిస్తూ టీమ్ను నడిపించాడు. ప్రపంచ కప్ చరిత్రలో గ్రూప్ దశలో, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్లో, సెమీస్లో, ఫైనల్లో గోల్ చేసిన ఏకైక ఆటగాడు కావడంతో పాటు జట్టును శిఖరాన నిలిపాడు. శాశ్వత కీర్తిని అందుకుంటూ అర్జెంటీనా ప్రజలకు అభివాదం చేశాడు. చివరగా...మెస్సీ భావోద్వేగాలు చూస్తుంటే సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజం కూడా తన కెరీర్లో అన్నీ సాధించిన తర్వాత లోటుగా ఉన్న క్రికెట్ ప్రపంచకప్ను ఆరో ప్రయత్నంలో అందుకోవడం, అతడిని సహచరులు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరిగిన ఘటన మీ కళ్ల ముందు నిలిచిందా! -సాక్షి, క్రీడా విభాగం. మరి రొనాల్డో సంగతి?! గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT).. ప్రస్తుత తరంలో మేటి ఫుట్బాల్ ఆటగాడు ఎవరు అంటే.. ఠక్కున గుర్తుకు వచ్చే రెండు పేర్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. అన్నిటిలోనూ పోటాపోటీ.. అయితే, మెస్సీ ఖాతాలో ఇప్పుడు వరల్డ్కప్ టైటిల్ ఉంది. 37 ఏళ్ల రొనాల్డోకు ఇక ప్రపంచకప్ ట్రోఫీ గెలిచే అవకాశమే లేదు. నిజానికి, ఖతర్ ఈవెంట్లో మొదటి మ్యాచ్లోనే సౌదీ అరేబియా వంటి చిన్న జట్టు చేతిలో ఓటమి పాలైనా ఏమాత్రం కుంగిపోక.. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ జట్టును ఫైనల్ వరకు తీసుకువచ్చాడు మెస్సీ. నాయకుడిగా, ఆటగాడిగా తన అపార అనుభవాన్ని ఉపయోగించుకుంటూ జట్టును ఆఖరి మెట్టు వరకు తీసుకువచ్చాడు. ఉత్కంఠభరిత ఫైనల్లోనూ చిరునవ్వు చెదరనీయక ఎట్టకేలకు ట్రోఫీ ముద్దాడి విజయదరహాసం చేశాడు. కానీ రొనాల్డోకు ఈ మెగా టోర్నీకి ముందే ఎదురుదెబ్బలు తగిలాయి. యునైటెడ్ మాంచెస్టర్తో బంధం తెగిపోవడం సహా కీలక ప్రి క్వార్టర్స్లో జట్టులో చోటు కోల్పోవడం వంటి పరిణామాలు జరిగాయి. పోర్చుగల్ సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ అతడు ఆలస్యంగా బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో రొనాల్డో ప్రవర్తన వల్లే కోచ్ అతడిని కావాలనే పక్కనపెట్టాడనే వార్తలు వినిపించాయి. ఏదేమైనా మెస్సీ తన హుందాతనంతో ఘనంగా ప్రపంచకప్ టోర్నీకి వీడ్కోలు పలికితే.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో నిష్క్రమించినట్లయింది. దీంతో ఇద్దరూ సమఉజ్జీలే అయినా మెస్సీ.. రొనాల్డో కంటే ఓ మెట్టు పైకి చేరాడంటూ ఫుట్బాల్ అభిమానులు అంటున్నారు. చదవండి: Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు.. Rohit Sharma: ‘సెంచరీ వీరుడు గిల్ బెంచ్కే పరిమితం! రెండో టెస్టులో ఓపెనర్లుగా వాళ్లిద్దరే!’ Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వారెవ్వా అర్జెంటీనా.. మూడోసారి, మూడో స్థానం, మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్!
FIFA WC Qatar 2022 World Champions Argentina: ఫిఫా ప్రపంచకప్ గెలవాలన్న అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ఆదివారం(డిసెంబరు 18) తెరపడింది. ఖతర్ వేదికగా ఫ్రాన్స్తో జరిగిన హోరాహోరీ పోరులో మెస్సీ బృందం విజయం సాధించడంతో కల సాకారమైంది. మేటి ఆటగాడు మెస్సీకి ఘనమైన వీడ్కోలు లభించడంతో పాటు మూడోసారి ట్రోఫీని గెలిచిన ఘనతను అర్జెంటీనా తన ఖాతాలో వేసుకుంది. కాగా అదనపు సమయంలోనూ 3-3తో ఇరు జట్లు సమంగా ఉన్న వేళ.. పెనాల్టీ షూటౌట్ ద్వారా వరల్డ్కప్-2022 ఫైనల్ ఫలితం తేలిన విషయం తెలిసిందే. 4-2తో అర్జెంటీనా పైచేయి సాధించి విశ్వ విజేతగా అవతరించింది. మరి ఈ మ్యాచ్ ద్వారా అర్జెంటీనా సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి! మూడోసారి ►ప్రపంచకప్ ఫుట్బాల్ టైటిల్ సాధించడం అర్జెంటీనాకిది మూడోసారి. గతంలో ఆ జట్టు 1978, 1986లలో సాధించింది. మూడో స్థానం ►ప్రపంచకప్ను అత్యధిక సార్లు గెలిచిన జట్ల జాబితాలో అర్జెంటీనా మూడో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్ (5 సార్లు) టాప్ ర్యాంక్లో, జర్మనీ (4 సార్లు), ఇటలీ (4 సార్లు) సంయుక్తంగా రెండో ర్యాంక్లో ఉన్నాయి. మూడో జట్టు ►‘షూటౌట్’ ద్వారా ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా. గతంలో బ్రెజిల్ (1994లో), ఇటలీ (2006లో) ఈ ఘనత సాధించాయి. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్లో ‘షూటౌట్’లలో మ్యాచ్లు గెలిచిన జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. పాపం ఫ్రాన్స్ ►డిఫెండింగ్ చాంపియన్ తదుపరి టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో అర్జెంటీనా (1990లో), బ్రెజిల్ (1998లో) జట్లకు ఇలాంటి ఫలితమే ఎదురైంది. ఇప్పుడు ఫ్రాన్స్ వంతు! చదవండి: Lionel Messi: మెస్సీ నామసర్మణతో మారుమ్రోగిన అర్జెంటీనా.. కోల్కతాలోనూ సంబరాలు IND VS BAN 1st Test: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు Make way for the 👑 #FIFAWorldCup #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 19, 2022 -
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. డ్యాన్స్ చేయనున్న బాలీవుడ్ నటి
ఫిఫా ప్రపంచకప్ తుది సమరానికి మరి కొన్ని గంటల్లో తేరలేవనుంది. ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ కలను నెరవెర్చకుంటాడా? లేదా ప్రాన్స్ యువ సంచలనం కిలియాన్ ఎంబాపె తమ జట్టుకు మరోసారి ప్రపంచకప్ను అందిస్తాడా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ మ్యాచ్ దోహా వేదికగా స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరిగే లుసైల్ ఐకానిక్ స్టేడియం వద్ద ఇప్పటి నంచేఅభిమానుల కోలాహలం నెలకొంది. కాగా ఇప్పటికే అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు స్టేడియం చేరుకున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్కు ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫిఫా సిద్దమైంది. ఈ వేడుకలలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనతో అభిమానులను అలరించనుంది. నోరా ఫతేహితో పాటు యూఏఈ పాపులర్ సింగర్ బాల్కీస్, ఇరాక్ సింగర్ రహ్మా రియాద్, ఐషా, గిమ్స్ వంటి ప్రముఖ సింగర్లు ఈ కార్యక్రమంలో పాల్గోనబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ క్లోజింగ్ సెర్మనీ 15 నిమిషాలు పాటు జరగనుంది. కాగా కెనడాకు చెందిన నోరా ఫతేహి 2014లో వచ్చిన రోర్: టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు! ఇక తిరుగు లేదు.. -
సాకర్ వరల్డ్ కప్ రారాజు ఎవరు ?
-
నేడే ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్.. అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనున్న ఫ్రాన్స్
దోహా: ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిన క్షణం ఇప్పటికీ అర్జెంటీనా కెప్టెన్ లయనెల్ మెస్సీకి గుర్తుండే ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచకప్ను ముద్దాడే అవకాశం మళ్లీ మెస్సీ ముంగిట వచ్చింది. ఈరోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ కెరీర్లో అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ ఈ తుది సమరాన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. పేరుకు అర్జెంటీనా–ఫ్రాన్స్ జట్ల మధ్య సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అంటున్నా... దీనిని మెస్సీ, ఫ్రాన్స్ మధ్య పోరుగానే అభివర్ణించాల్సి ఉంటుంది. తటస్థ అభిమానులందరూ అర్జెంటీనా గెలిచి మెస్సీ తన కెరీర్ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా... అత్యంత పటిష్టంగా ఉన్న ఫ్రాన్స్ మెస్సీ కల కలగానే మిగిలిపోవాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతా తానై... టైటిల్ ఫేవరెట్స్లో ఒకటిగా ఖతర్కు వచ్చిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. దాంతో మెస్సీపైనే కాకుండా అర్జెంటీనా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే కెప్టెన్గా మెస్సీ రెండో మ్యాచ్ నుంచి అంతా తానై జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు కదలికలతో ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఐదు గోల్స్ చేయడంతోపాటు సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్లో మెస్సీ మ్యాజిక్తోనే అర్జెంటీనా మూడో గోల్ చేయగలిగింది. క్రొయేషియా డిఫెండర్ గ్వార్డియోల్ ఎంత వెంటపడ్డా మెస్సీ తన పాదరసంలాంటి కదలికలతో అతడిని తప్పిస్తూ సహచరుడు అల్వారెజ్కు అందించిన పాస్, క్షణాల్లో నమోదైన గోల్ను ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఫ్రాన్స్తో జరిగే ఫైనల్ను అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతోపాటు అతడి సహచరులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడినా తమ నుంచి ట్రోఫీ మరోసారి చేజారిపోతుందని అర్జెంటీనాకు తెలుసు. మెస్సీతోపాటు ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన అల్వారెజ్, ఎంజెల్ డి మారియా, రోడ్రిగో డి పాల్, ఎంజో ఫెర్నాండెజ్, గోల్కీపర్ మార్టినెజ్ రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఆద్యంతం పకడ్బందీగా ఆడి ట్రోఫీని అందుకుంటుందా లేక ఆఖరి మెట్టుపై తడబడి నాలుగోసారి ట్రోఫీని చేజార్చుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎంబాపె ఒక్కడే కాదు... అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీ ఆటపై ఆధారపడి ఉండగా... ఫ్రాన్స్ మాత్రం ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమష్టి ఆటతో ఫైనల్కు చేరుకుంది. 23 ఏళ్ల కిలియాన్ ఎంబాపె ఐదు గోల్స్తో అదరగొట్టగా... 36 ఏళ్ల ఒలివియర్ జిరూడ్ నాలుగు గోల్స్తో మెరిపించాడు. థియో హెర్నాండెజ్, చువమెని, రాన్డల్, రాబియోట్ ఒక్కో గోల్ చేయగా... గ్రీజ్మన్ గోల్స్ చేయకున్నా సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. గోల్కీపర్, కెప్టెన్ హుగో లోరిస్ ఏకంగా 53 సార్లు గోల్స్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. 1998లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న దీదీర్ డెషాంప్స్... కోచ్గా మారి 2018లో ఫ్రాన్స్కు రెండోసారి ప్రపంచ కప్ను అందించాడు. ఈ నేపథ్యంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఫ్రాన్స్ జట్టుకు మరోసారి గెలవాలంటే ఎలా ఆడాలో తెలుసు కాబట్టి నేటి ఆఖరి సమరం రంజుగా సాగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. 6: అర్జెంటీనాకిది ఆరో ప్రపంచకప్ ఫైనల్. 1978, 1986లలో విజేతగా నిలిచిన అర్జెంటీనా 1930, 1990, 2014లలో రన్నరప్గా నిలిచింది. నేటి ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోతే అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీ (4 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 4: ఫ్రాన్స్ జట్టుకిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్. 1998, 2018లలో టైటిల్ నెగ్గిన ఫ్రాన్స్ 2006లో రన్నరప్గా నిలిచింది. 3: నేటి ఫైనల్లో ఫ్రాన్స్ గెలిస్తే ఇటలీ (1930, 1934), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడోజట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 4: ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న నాలుగో మ్యాచ్ ఇది. 1930లో అర్జెంటీనా 1–0తో... 1978లో అర్జెంటీనా 2–1తో ఫ్రాన్స్పై గెలిచింది. 2018 ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను ఓడించింది. 10: దక్షిణ అమెరికా జట్లతో జరిగిన గత 10 ప్రపంచకప్ మ్యాచ్ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు. ఆరు మ్యాచ్ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకుంది. చివరిసారి దక్షిణ అమెరికా జట్టు చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడం 1978లో (అర్జెంటీనా చేతిలో 1–2తో) జరిగింది. 11: దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాల మధ్య జరగనున్న 11వ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఇది. ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్లకు టైటిల్ లభించగా... మూడుసార్లు యూరోప్ జట్ల ఖాతాలో టైటిల్ చేరింది. -
FIFA WC: ప్చ్.. క్రొయేషియాతో పాటే అమ్మడు అందాలకు చెక్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ 2022 ఫాలో అవుతున్న వారికి క్రొయేషియా మోడల్ ఇవానా నోల్ గురించి పరిచయం అక్కర్లేదు. అసభ్య దుస్తులకు అనుమతి లేని చోట పొట్టి పొట్టి డ్రెస్సులు ధరిస్తూ హాట్ లుక్స్తో ఫిఫా అభిమానులను అలరిస్తుంది. తనకు తాను హాటెస్ట్ ఫ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రకటించుకున్న ఇవానా నోల్ తాజాగా తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా అర్జెంటీనా, క్రొయేషియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్కు హాజరైన ఇవానా నోల్ మరింత రెచ్చిపోయింది. క్రొయేషియా జెండా కలర్ లో కట్ టాప్ డ్రెస్.. బ్లూ జీన్స్తో మ్యాచ్కు హాజరైంది. కట్టిపడేసే అందంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన కుర్రకారు గుండెల్లో ఆమె రైళ్లు పరిగెత్తించింది. క్లీవేజ్ షో చేస్తూనే హాట్ హాట్ లుక్స్తో అందరి కళ్లు తనవైపుకు తిప్పుకుంది. అయితే క్రొయేషియా కథ సెమీస్లో ముగియడంతో అమ్మడు అందాలు కూడా ఇక్కడికే పరిమితమవుతాయేమోనని కొంతమంది తెగ ఫీలవుతున్నారు. క్రొయేషియా వెళ్లిపోయింది కాబట్టి తాను వెళ్లిపోతుందని.. ప్చ్ అందాల ప్రదర్శన మిస్ అవుతామోనని మరికొంత మంది కామెంట్స్ చేశారు. అయితే ఇవానా నోల్ ఖతర్ను వీడి వెళుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదని.. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ ముగిసాకే ఆమె తన దేశం వెళుతుందంటూ కొంతమంది పేర్కొన్నారు. ఏది ఏమైనా తన అందంతో ఈసారి ఫిఫా వరల్డ్కప్లో ఆటగాళ్లతో సమానంగా పేరు పొందిన ఇవానా నోల్కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. అరబ్ లాంటి కఠినమైన దేశాల్లో వారి ఆంక్షలను బేఖాతరు చేసి పొట్టి పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిచ్చి అందాలు ఆరబోసిన ఇవానా నోల్ దైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ కొందరు అభిమానులు ట్విటర్ వేదికగా తెలిపారు. View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) చదవండి: FIFA WC 2022: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
ఖతర్లో అంతేనా.. కార్మికుల ప్రాణాలకు లెక్క లేదా
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఖతర్ అన్ని దేశాల దృష్టిని ఆకర్షించింది. గత నెల 20న ప్రారంభమైన ఫుట్బాల్ పోటీలు ఈనెల 18తో ముగియనున్నాయి. ఫిఫా క్రీడా సంగ్రామంతో దాదాపు రూ.1.40 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న ఖతర్.. తన గుర్తింపు కోసం రక్తం చిందించిన వివిధ దేశాల వలస కార్మికులను మాత్రం మరచిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఫిఫా కోసం చేపట్టిన వివిధ నిర్మాణాల్లో భాగస్వాములైన వలస కార్మికులు ప్రమాదాల వల్ల, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు ఉన్నాయి. మరణించిన వలస కార్మికుల్లో తెలంగాణకు చెందిన వాళ్లే సుమారు వంద మంది వరకు ఉంటారని గల్ఫ్ జేఏసీ అంచనాల్లో తేలింది. ‘చనిపోయిన వారిని స్మరించుకుందాం–బతికి ఉన్నవారి కోసం పోరాడుదాం’ అనే నినాదంతో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఖతర్ ఫిఫా అమరులను స్మరిస్తూ నిజామాబాద్లో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఖతర్లో ఫిఫా పనులు చేస్తూ మరణించిన వారి కుటుంబాలను ఐక్యం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఖతర్ సర్కార్కు బాధితుల గోడును వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ తెలంగాణ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు బసంత్రెడ్డి, న్యాయవాది బాస రాజేశ్వర్లు బాధిత కుటుంబాలతో సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిరాశపరిచిన విదేశాంగ శాఖ.. పార్లమెంట్ సమావేశాల్లో ఖతర్ మృతుల ఆంశంపై ఎంపీలు వెంకటేశ్ నేత బొర్లకుంట, డాక్టర్ రంజిత్రెడ్డి, మాలోవత్ కవిత ప్రస్తావించారు. ఇందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ సమాధానం ఇస్తూ ఖతర్ కార్మిక చట్టాల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందుతుందని తెలిపారు. కానీ మృతుల సంఖ్యను వెల్లడించలేదు. కనీసం ఎంత మందికి పరిహారం అందించారనే విషయంలోనూ స్పష్టత లేదు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సమాధానం అస్పష్టంగా ఉండటం బాధిత కుటుంబాలను నిరాశపరిచిందనే అభిప్రాయ వ్యక్తమవుతోంది. (క్లిక్ చేయండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!) -
FIFA WC: సెమీస్ వరకు ప్రయాణం ఇలా! 32 జట్లకు ప్రైజ్మనీ ఎంతంటే!
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్-2022 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. విశ్వవిజేతగా అవతరించేది ఏ జట్టు అన్న విషయం మరో వారం రోజుల్లో తేలనుంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మెగా ఈవెంట్ గత నెల 20న ఖతర్ వేదికగా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి అర్హత సాధించిన 32 జట్లు 8 స్టేడియాల్లో మ్యాచ్లు ఆడాయి. ఇక బ్రెజిల్, పోర్చుగల్ వంటి మేటి జట్లు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగగా.. మొరాకో సంచలన విజయంతో సెమీస్ వరకు చేరింది. డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్తో పాటు రన్నరప్ క్రొయేషియా, స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా సెమీస్కు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో రౌండ్ ఆఫ్ 16 నుంచి సెమీస్ వరకు కీలక మ్యాచ్లలో జట్ల ప్రయాణం, తదుపరి షెడ్యూల్, ప్రైజ్మనీ తదితర అంశాలు గమనిద్దాం. 8 గ్రూప్లు ►గ్రూప్ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్. ►గ్రూప్ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్. ►గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా. ►గ్రూప్ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియా. ►గ్రూప్ ‘ఇ’: జర్మనీ, స్పెయిన్, జపాన్, కోస్టారికా. ►గ్రూప్ ‘ఎఫ్’: బెల్జియం, క్రొయేషియా, కెనడా, మొరాకో. ►గ్రూప్ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, కామెరూన్, స్విట్జర్లాండ్. ►గ్రూప్ ‘హెచ్’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా. రౌండ్ 16కు చేరిన జట్లు ఇవే ►నెదర్లాండ్స్ ►అమెరికా ►అర్జెంటీనా ►ఆస్ట్రేలియా ►జపాన్ ►క్రొయేషియా ►బ్రెజిల్ ►దక్షిణకొరియా ►ఇంగ్లండ్ ►సెనెగల్ ►ఫ్రాన్స్ ►పోలాండ్ ►మొరాకో ►పోర్చుగల్ ►స్పెయిన్ ►స్విట్జర్లాండ్ నాకౌట్ మ్యాచ్లో విజయం సాధించిన జట్లు ►అమెరికాపై 3-1 తేడాతో నెదర్లాండ్స్ విజయం.. ఆస్ట్రేలియాపై 2-1తో అర్జెంటీనా గెలుపు.. తద్వారా గ్రూప్- ఏ నుంచి నెదర్లాండ్స్, గ్రూప్- సి నుంచి అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. క్వార్టర్స్లో పెనాల్టీ షూటౌట్లో నెదర్లాండ్స్ను ఓడించి అర్జెంటీనా సెమీ ఫైనల్కు చేరింది. ►జపాన్పై విజయంతో క్రొయేషియా క్వార్టర్ ఫైనల్కు చేరగా.. కొరియాను మట్టికరిపించి(4-1) బ్రెజిల్ ముందడుగు వేసింది. ఈ క్రమంలో క్వార్టర్స్లో బ్రెజిల్, క్రొయేషియా తలపడ్డాయి. నిర్ణీత సమయంలో 1-1 గోల్స్తో సమంగా ఉండగా పెనాల్టీ షూటౌట్లో 4-1తో క్రొయేషియా గెలుపొంది సెమీస్లో అడుగుపెట్టింది. ►సెనెగల్పై విజయంతో ఇంగ్లండ్, పోలాండ్పై విజయంతో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. ఇక ఇంగ్లండ్తో పోరులో 2-1తో పైచేయి సాధించిన ఫ్రాన్స్ సెమీస్లో అడుగుపెట్టింది. మరోవైపు.. స్పెయిన్పై విజయంతో క్వార్టర్స్ ఫైనల్ చేరుకున్న మొరాకో.. స్విట్జర్లాండ్ను ఓడించి తమతో పోటీకి దిగిన పోర్చుగల్ను ఓడించింది. తద్వారా 92 ఏళ్ల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా రికార్డు సృష్టించింది. మిగిలిన షెడ్యూల్ ►డిసెంబరు 14న మొదటి సెమీ ఫైనల్ అర్జెంటీనా వర్సెస్ క్రొయేషియా ►డిసెంబరు 15న రెండో సెమీ ఫైనల్ ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో ►డిసెంబరు 17న మూడో స్థానం కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ►డిసెంబరు 18న ఫైనల్ ప్రైజ్మనీ వివరాలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం
FIFA World Cup 2022- Virat Kohli- Cristiano Ronaldo: ‘‘క్రీడా రంగానికి నువ్వు చేసిన సేవ ఎనలేనిది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులను అలరించిన తీరు మరువలేనిది.. నువ్వు ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోవడం.. కేవలం నాకే కాదు.. నాలాంటి ఎంతో మంది అభిమానులకు దేవుడిచ్చిన వరం అది. ప్రతి మ్యాచ్లోనూ నీ కఠోర శ్రమ, నీ అంకితభావం మాకు కనిపిస్తూనే ఉంటుంది. వందకు వంద శాతం ఆటకు న్యాయం చేయడమే పరమావధిగా భావించగలగడం ఆటగాడికి దక్కిన ఆశీర్వాదం లాంటిది. ప్రపంచంలోని ప్రతి ఆటగాడికి అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అవుతాడు. నా దృష్టిలో అత్యుత్తమ ఆటగాడి(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్- GOAT)వి నువ్వే! మా అందరిని ఇంతగా అలరించిన నువ్వు ట్రోఫీ గెలవకపోతేనేం..? టైటిల్ సాధించకపోతేనేం? అదేమీ పెద్ద విషయం కానేకాబోదు. నీ ఆట తీరుతో మా మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న నీ గురించి వర్ణించడానికి ఎలాంటి ట్రోఫీలు, టైటిళ్లు అక్కర్లేదు’’ అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి భావోద్వేగ ట్వీట్ చేశాడు. పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను ఉద్దేశించి ఈ మేరకు ఉద్వేగపూరిత నోట్ రాశాడు. కల చెదిరింది! ఫిఫా ప్రపంచకప్-2022లో భాగంగా మొరాకో చేతిలో ఓటమితో.. టైటిల్ దిశగా సాగాలనుకున్న పోర్చుగల్ ఆశలకు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ఖతర్ వేదికగా సాగుతున్న ఈ మెగా ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లోనే పోర్చుగల్ కథ ముగిసింది. కాగా ఇంతవరకు ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కన్నీరే మిగిలింది! అదే విధంగా.. ఆ జట్టు కెప్టెన్, మేటి ఫుట్బాల్ ఆటగాడు రొనాల్డోకు ఇదే ఆఖరి వరల్డ్కప్ టోర్నీ కానుందన్న అభిప్రాయాల నేపథ్యంలో అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రపంచకప్ ట్రోఫీ సాధించాలనుకున్న 37 ఏళ్ల రొనాల్డో కల కలగానే మిగిలిపోయినట్లయింది. ఈ పరాజయాన్ని తట్టుకోలేక అతడు కన్నీటిపర్యంతమైన తీరు అభిమానుల చేత కంటతడి పెట్టించింది. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) రొనాల్డోపై కోహ్లి అభిమానం ఈ క్రమంలో రొనాల్డోపై అభిమానం చాటుకుంటూ కోహ్లి సోషల్ మీడియా వేదికగా అతడికి అండగా నిలబడ్డాడు. ఇన్స్టాలోనూ ఈ మేరకు రొనాల్డో ఫొటో పంచుకోగా.. గంటల్లోనే వైరల్గా మారింది. నాలుగు గంటల్లోనే 30 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇక 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కోహ్లి.. కెప్టెన్గా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. అయితే, టెస్టుల్లో టీమిండియాను నంబర్ 1గా నిలపడం సహా 72 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన క్రికెటర్గా ఎన్నో ఘనతలు తన ఖాతాలో ఉన్నాయి. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! సంజూ శాంసన్కు బంపర్ ఆఫర్ ఇచ్చిన పరాయి దేశం The moment ❤️ Peter Drury's commentary of the moment ❤️🔥 You cannot not replay this special narration of the special night for #Morocco by a special commentator 🎙️#MARPOR #Qatar2022 #FIFAWorldCup #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/Lh03wXs792 — JioCinema (@JioCinema) December 11, 2022 -
FIFA: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! మరీ ఇలాంటి ముగింపా?!
FIFA World Cup 2022- Cristiano Ronaldo: ఇద్దరక్కలు.. ఓ అన్న.. ఇంట్లో నాలుగో సంతానం. నిజానికి అప్పటికే పేదరికంలో మగ్గుతున్న కారణంగా ఆ తల్లి నాలుగో బిడ్డను కనకూడదు అనుకుంది. అబార్షన్ చేయించుకోవాలనుకుంది. కానీ, దేవుడు అలా జరుగనివ్వలేదు. ఆ బిడ్డ భూమ్మీద పడ్డాడు. ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించాడు. స్టార్ ఫుట్బాలర్గా ఎదిగి.. తల్లిని గర్వపడేలా చేశాడు. లెక్కకు మిక్కిలి అభిమానులు, లెక్కలేనంత డబ్బు! తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో రికార్డులు సాధించిన రారాజు.. మరీ ఇలా, ఇంత ఘోరంగా తన ప్రయాణం ముగిసిపోతుందని ఊహించి ఉండడు! ఇంతటి అవమానకర పరిస్థితుల్లో ‘ఆఖరి మ్యాచ్’ను ఆడాల్సి వస్తుందనే ఊహ కూడా కనీసం అతడి దరికి చేరి ఉండదు! కెరీర్లో ఒక్క ప్రపంచకప్ టైటిల్ అయినా ఉండాలని అతడు ఆశపడ్డాడు. అందుకు తను వందకు వందశాతం అర్హుడు కూడా! కానీ విధిరాత మరోలా ఉంది! నువ్వు ఎన్ని అంతర్జాతీయ గోల్స్ చేస్తేనేం? ఐదు ప్రతిష్టాత్మక బాలన్ డీఓర్ అవార్డులు గెలిస్తేనేం? ఎన్నెన్ని చాంపియన్స్ లీగ్ మెడల్స్ సాధిస్తేనేం? మూడు దేశాల్లో క్లబ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడివి అయితేనేం? ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఫుట్బాలర్గా నీరాజనాలు అందుకుంటేనేం? ఈ ఒక్క లోటు నిన్ను, నీ అభిమానులను జీవితాంతం వేదనకు గురిచేయడం ఖాయమన్నట్లుగా.. గుండెకోతను మిగిల్చింది. చిన్నపిల్లాడిలా అతడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు చూసి అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ‘‘మరేం పర్లేదు రొనాల్డో.. నువ్వు ఎప్పటికీ మా దృష్టిలో చాంపియన్వే’’ అని పైకి చెబుతున్నా.. హృదయాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న బాధ వాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు!- సాక్షి, వెబ్డెస్క్ తల్లితో రొనాల్డో వీళ్లకు ఉన్నంత పాపులారిటీ ఎవరికీ లేదు! నిజానికి ఆధునిక ఫుట్బాల్లో స్టార్లు ఎవరంటే ఠక్కున గుర్తుకువచ్చే పేర్లు.. లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. సాకర్ గురించి పెద్దగా తెలియనివాళ్లకు కూడా వీరి పేర్లు సుపరిచితమే అనడంలో సందేహం లేదు. కోట్లాది మంది అభిమానం చూరగొన్న.. చూరగొంటున్న మెస్సీ, రొనాల్డో ఆటలో తమకు తామే సాటి. తమకు తామే పోటీ. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మేటి ఫుట్బాలర్లు ఉన్నా వీరిద్దరికి దక్కినంత పాపులారిటీ మరెవరికి దక్కలేదనడం అతిశయోక్తి కాదు. గర్ల్ఫ్రెండ్, తమ పిల్లలతో ఇలా అదొక్కటే లోటు! చాంపియన్స్ లీగ్ సహా ఇతర క్లబ్ టోర్నీలలో తమదైన ఆట తీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అర్జెంటీనా స్టార్ మెస్సీ, పోర్చుగల్ మేటి ఆటగాడు రొనాల్డో.. తమ కెరీర్లో ఎన్నెన్నో రికార్డులు సాధించారు. అరుదైన ఘనతలు తమ ఖాతాలో వేసుకున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఎందులోనూ వీరికి లోటు లేదు. అయితే, విచిత్రంగా ఈ ఇద్దరు ఫుట్బాల్ స్టార్లు తమ కెరీర్లో జాతీయ జట్టు తరపున ఇప్పటి వరకు ఒక్క వరల్డ్కప్ టైటిల్ కూడా గెలవకపోవడం గమనార్హం. మెస్సీ, రొనాల్డో మెస్సీ ముందడుగు.. పాపం రొనాల్డో అర్జెంటీనా ఇప్పటి వరకు రెండు సార్లు(1978, 1986) ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడగా.. పోర్చుగల్ ఖాతాలో ఒక్క టైటిల్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్కప్-2022లో ఈ ఇద్దరు కెప్టెన్లు తమ జట్లను ముందుకు నడిపి ఫైనల్లో తలపడితే చూడాలని, ఏ ఒక్కరు గెలిచినా చరిత్ర సృష్టించడం ఖాయమంటూ ఫుట్బాల్ అభిమానులు అంచనాలు వేశారు. అంతేగాక 37 ఏళ్ల రొనాల్డో, 35 ఏళ్ల మెస్సీ తమ కెరీర్లో ఇదే ఆఖరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకరికి ఈ ఏడాది టోర్నీ చిరస్మరణీయం కావాలని కోరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్పై అర్జెంటీనా గెలుపుతో మెస్సీ చిరకాల కల నెరవేరేందుకు ముందుడుగు పడగా.. మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమితో రొనాల్డో వరల్డ్కప్ ప్రయాణానికి తెరపడింది. అరుదైన రికార్డు ఫిఫా ప్రపంచకప్-2022లో ఘనాతో ఆరంభ మ్యాచ్లో పెనాల్టీ కిక్ను గోల్గా మలచడం ద్వారా రొనాల్డో తన ఖాతా తెరిచాడు. తద్వారా ఐదు ప్రపంచకప్లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్ స్టార్ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్లలో గోల్ చేశాడు. ఓవరాల్గా 8 గోల్స్ సాధించాడు. ఇక గ్రూప్- హెచ్లో ఉన్న పోర్చుగల్ ఈ మ్యాచ్లో 3-2తో విజయం సాధించింది. ఆ తర్వాత మాజీ చాంపియన్ ఉరుగ్వేను 2-0తో ఓడించింది. అనంతరం దక్షిణా కొరియా చేతిలో 2-1 ఓటమి పాలైనప్పటికీ గ్రూప్ టాపఱ్గా ఉన్న పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అవమానకర రీతిలో.. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణా కొరియా ఆటగాడితో రొనాల్డో వాగ్వాదం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్లో భాగంగా స్విట్జర్లాండ్తో కీలక మ్యాచ్లో కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ అయిన రొనాల్డోను పక్కనపెట్టడం ఫ్యాన్స్ అవమానకరంగా భావించారు. ఈ మ్యాచ్లో అతడి స్థానంలో వచ్చిన యువ ప్లేయర్ గొంకాలో రామోస్ హ్యాట్రిక్ గోల్స్తో మెరవగా.. స్విస్పై పోర్చుగల్ 6-1తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో స్విస్తో మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా మైదానంలోకి వచ్చిన రొనాల్డో క్వార్టర్స్ మ్యాచ్కు ముందు ప్రాక్టీసుకు డుమ్మా కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అవమానం తట్టుకోలేకే ఇలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కీలక మ్యాచ్కు రొనాల్డోను పక్కనపెట్టడం పట్ల అతడి గర్ల్ఫ్రెండ్ జార్జినా కూడా అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయగా.. 50 లక్షలకు పైగా మంది ఆ పోస్టును లైక్ చేసి రొనాల్డోకు మద్దతుగా నిలిచారు. అయినా, మేనేజ్మెంట్ తీరు మారలేదు. మొరాకోతో క్వార్టర్ మ్యాచ్ ఆరంభంలోనూ రొనాల్డోను ఆడించలేదు. 51 నిమిషంలో అతడిని సబ్స్టిట్యూట్ ప్లేయర్గా బరిలోకి దించింది. ఈ క్రమంలో తనకు గోల్ కొట్టే అవకాశం రాగా.. మొరాకో గోల్ కీపర్ అడ్డుపడటంతో రొనాల్డోకు నిరాశే మిగిలింది. సెమీస్, ఆపై ఫైనల్ చేరి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలన్న పోర్చుగల్ సారథి కల ఇలా ముగిసిపోయింది. నిజానికి 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాలేదు. అయితే, రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. ఇప్పుడు కూడా అంతే! ఎంతటి మొనగాడు అయితేనేం?! 18 ఏళ్ల వయసులో ఫిఫా వరల్డ్కప్-2003లో తొలిసారిగా మెగా ఈవెంట్లో ఆడిన రొనాల్డోకు టైటిల్ లేకుండానే కెరీర్ ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ ప్రెస్మీట్లో కూల్డ్రింక్ బాటిల్ను పక్కకు జరిపి.. వాటర్ గ్లాస్ అందుకున్నందుకే సదరు కంపెనీ బ్రాండ్ వాల్యూ అమాంతం పడిపోయేంత ప్రభావం చూపగల.. పాపులర్ ఆటగాడు ఇలా ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని చిన్నపిల్లాలడిగా కన్నీటిపర్యంతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు సగటు అభిమాని. ఎంతటి మొనగాడికైనా గడ్డుకాలం అంటే ఇలాగే ఉంటుందేమోననంటూ కామెంట్లు చేస్తున్నారు. -సుష్మారెడ్డి, యాళ్ల చదవండి: Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్ఫ్రెండ్ పోస్ట్ వైరల్! ఇంతకీ ఆమె ఎవరంటే! -
మ్యాచ్ కవర్ చేస్తూ కుప్పకూలాడు.. మృతిపై అనుమానాలు!
దోహా: అమెరికన్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్(48).. గుర్తున్నారా?.. ఫుట్బాల్ స్టేడియం వద్ద రెయిన్ బో కలర్ దుస్తులు ధరించి.. ఖతార్ పోలీసుల ఆగ్రహానికి గురైన వ్యక్తి. ఎల్జీబీటీక్యూ హక్కులకు మద్ధతుగా ఆయన ఈ పని చేశాడు. అయితే.. ఆయన శుక్రవారం మ్యాచ్ సమయంలో హఠాత్తుగా కుప్పకూలి మరణించారు. శుక్రవారం లుసాయిల్ స్టేడియంలో అర్జెంటీనా-నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను కవర్ చేస్తూ ఆయన హఠాత్తుగా కుప్పకూలాడు. పక్కనే ఉన్న జర్నలిస్టులు ఆయన్ని సీపీఆర్ కాపాడే యత్నం చేశారు. కానీ, అది ఫలించలేదు. అయితే.. ఆయన మరణం పట్ల సోదరుడిగా చెప్పుకుంటున్న ఎరిక్ వాల్ అనే వ్యక్తి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. గ్రాంట్ మరణంలో.. ఖతార్ ప్రభుత్వ ప్రమేయం ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేశాడాయన. నా పేరు ఎరిక్ వాల్. వాషింగ్టన్ సియాటెల్లో జీవిస్తున్నా. గ్రాంట్ వాహ్ల్ సోదరుడిని నేను. నా కారణంగానే నా సోదరుడు రెయిన్బో రంగు షర్ట్తో ఫుట్బాల్ మ్యాచ్కు హాజరయ్యాడు. ఆయన చాలా ఆరోగ్యవంతుడు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. చావు బెదిరింపులు వచ్చాయని ఆయన నాతో చెప్పాడు. చాలా ఆరోగ్యంగ ఉన్న ఆయన మరణించాడంటే నమ్మబుద్ధ ఇకావడం లేదు. ఆయన్ని చంపేసి ఉంటారు. సాయం కోసం అర్థిస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్లో ఆయన సోదరుడు ఒక వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఇన్స్టాగ్రామ్ ఎందుకనో ఆ వీడియోపై ఆంక్షలు విధించింది. Free to read: What happened when Qatar World Cup security detained me for 25 minutes for wearing a t-shirt supporting LGBTQ rights, forcibly took my phone and angrily demanded that I remove my t-shirt to enter the stadium. (I refused.) Story: https://t.co/JKpXXETDkH pic.twitter.com/HEjr0xzxU5 — Subscribe to GrantWahl.com (@GrantWahl) November 21, 2022 ఇదిలా ఉంటే.. ఫిఫా వరల్డ్ కప్ ఆరంభంలో గ్రాంట్ వాల్ను సెక్యూరిటీ సిబ్బంది అల్ రయాన్లోని అహ్మద్ బిన్ అలీ స్టేడియం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు కూడా. సుమారు 25 నిమిషాల తర్వాత తానెవరో తెలుసుకుని.. ఆపై వాళ్లు తనకు క్షమాపణలు చెప్పి.. లోనికి అనుమతించారని తెలియజేశారు. ఇదిలా ఉంటే.. వాల్ భార్య గౌండర్ మాత్రం ఆయన హఠాన్మరణంపై అనుమానాలు వ్యక్తం చేయలేదు. కేవలం తన భర్త మరణంపై దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ఆమె ట్విటర్ ద్వారా ఓ పోస్ట్ చేశారు. I am so thankful for the support of my husband @GrantWahl's soccer family & of so many friends who've reached out tonight. I'm in complete shock. https://t.co/OB3IzOxGlE — Céline Gounder, MD, ScM, FIDSA 🇺🇦 (@celinegounder) December 10, 2022 వాల్.. ప్రిన్స్టన్ నుంచి 1996లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పటి నుంచి 2021 దాకా స్పోర్ట్స్ జర్నలిస్ట్గా రాణించారు. సాకర్, బాస్కెట్ బాల్ కవరేజీలకు ఆయన ప్రత్యేక గుర్తింపు దక్కింది. 2012 నుంచి ఏడేళ్ల పాటు ఆయన ఫాక్స్ స్పోర్ట్స్లో పనిచ చేశారు. ఆపై ఆయన తన సొంత వెబ్సైట్ను లాంఛ్ చేశారు. -
ఖతర్లో వరల్డ్కప్.. ప్రపంచానికి తెలియని మరణాలు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటివరకు గ్రూప్ దశతో పాటు ప్రీక్వార్టర్స్ మ్యాచ్లు ముగిశాయి. ఇక క్వార్టర్స్లో టాప్-8 జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్ చేరిన వారిలో అర్జెంటీనా, పోర్చుగల్, బ్రెజిల్, మొరాకో, నెదర్లాండ్స్, క్రొయేషియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్లు ఉన్నాయి. ఈ సంగతి పక్కనబెడితే ఫిఫా వరల్డ్కప్లో మనకు తెలియని ఒక ఆసక్తికర విషయం బయటపడింది. సాధారణంగా అరబ్ దేశాలకు వలస కార్మికులు ఎక్కువగా వస్తుంటారు. అందులో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. అయితే వీరందరిని వరల్డ్కప్ సందర్భంగా స్టేడియాల నిర్వహణకు ఖతర్లోని దోహాకు తరలించారు. అప్పటినుంచి 400 నుంచి 500 మంది వలస కార్మికులు మరణించినట్లు సమాచారం. గార్డియన్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఖతర్లో ఫిఫా వరల్డ్కప్ ప్రాజెక్ట్ కోసం ఏడాది క్రితమే దాదాపు 6500 మంది వలస కార్మికులు తీసుకెళ్లారని తెలిపింది. అప్పటినుంచి అక్కడే పనిచేస్తున్న వలస కార్మికుల్లో చాలా మంది చనిపోయినట్లు తెలిసింది. తాజాగా గురువారం మరో వలస కార్మికుడు మృతి చెందడాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఫిలిపినో అనే సంస్థ ఖతర్లో వర్క్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ను ప్రారంభించింది. వలస కార్మికుల మరణాలు ఎందుకు జరిగాయదన్న దానిపై నివేదిక అందజేయనుంది. వలస కార్మికుల మృతిపై ఫిఫా విచారం వ్యక్తం చేసింది. వరల్డ్కప్ నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన వారందరికి నివాళి అర్పించింది. ఇక ఫుట్బాల్ సభ్యత్వం ఉన్న 10 యూరోపియన్ దేశాలతో పాటు ఇంగ్లండ్ , జర్మనీలు వలస కార్మికుల క్షేమమై ఫిఫాకు లేఖ రాశాయి. ఖతర్లోని వలస కార్మికుల హక్కులను మెరుగుపరచడానికి ప్రపంచ పాలకమండలి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. అదే విధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO)కు కూడా యూరోపియన్ దేశాలు తమ లేఖను అందజేశాయి. Another DEATH at QATAR 2022 as organisers probing demise of Filipino MIGRANT worker at WC Training site#FIFAWorldCup #Qatar2022 https://t.co/z1McJFJ33Y — InsideSport (@InsideSportIND) December 9, 2022 చదవండి: ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా? FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా? -
ప్రాక్టీస్ సెషన్కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా?
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో మంగళవారం పోర్చుగల్, స్విట్జర్లాండ్ మధ్య ప్రీక్వార్టర్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు పోర్చుగల్ కెప్టెన్.. ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను పక్కనబెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది. కీలక నాకౌట్ దశలో రొనాల్డో డగౌట్లో కూర్చోవడం చాలా మందిని బాధించింది. అయితే రొనాల్డోస స్థానంలో జట్టులోకి వచ్చిన రామోస్ హ్యాట్రిక్ గోల్స్తో మెరవడం.. ఆపై మరో ముగ్గురు పోర్చుగల్ ఆటగాళ్లు గోల్స్తో దుమ్మురేపారు. దీంతో పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్పై ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే తనను జట్టు నుంచి తప్పించారన్న అవమానం తట్టుకోలేక రొనాల్డో ప్రాక్టీస్ సెషన్కు డుమ్మా కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తన జూనియర్లతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి రొనాల్డో ఇష్టపడలేదని.. రోజు మొత్తం జిమ్లో గడపడానికే ప్రాధాన్యం ఇచ్చాడంటూ స్పెయిన్కు చెందిన ఒక వార్తపత్రిక తన కథనంలో వెల్లడించింది. ఇక రొనాల్డోను ఆడించకపోవడంపై జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ స్పందించాడు. ''రొనాల్డోతో విబేధాలున్నాయన్న మాట నిజం కాదు.అతను ఒక స్టార్ ఆటగాడు. రొనాల్డో లేకుండా జట్టు బలాలు, బలహీనతలు తెలుసుకోవాలని ప్రయత్నించాం. రొనాల్డో స్థానంలో జట్టులోకి వచ్చిన గొంకాలో రమోస్ సూపర్గా రాణించాడు. అలా అని రొనాల్డోను పక్కనబెట్టలేం. కానీ మొరాకోతో జరగనున్న క్వార్టర్స్లోనూ రొనాల్డో ఆడకపోవచ్చు. కొత్త వాళ్లకు అవకాశాలు రావాలి. మేం కరెక్ట్ స్ట్రాటజీతోనే వెళ్తున్నాం.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక స్విట్జర్లాండ్తో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్కు హాజరైన అభిమానులు రొనాల్డో.. రొనాల్డో అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆట 73వ నిమిషంలో రొనాల్డో గ్రౌండ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జావో ఫెలిక్స్ స్థానంలో వచ్చిన రొనాల్డో గోల్ కొట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ఫిఫా ప్రపంచకప్ లో పోర్చుగల్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న కొద్దిరోజుల క్రితమే మాంచెస్టర్ యునైటెడ్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతో మాంచెస్టర్ యూనైటెడ్ నుంచి బయటకు వచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటినుంచి రొనాల్డో ఏ ఫ్రాంచైజీకి సంతకం చేయలేదు. అయితే సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ కు ఆడనున్నాడనే వార్తలు వస్తున్నాయి. మూడేండ్ల పాటు అల్ నజర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ప్రతీ యేటా సుమారు రూ. 600 కోట్లకు పైగా రొనాల్డోకు ముట్టజెప్పేందుకు డీల్ ఓకే అయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రొనాల్డో ఖండించాడు. చదవండి: FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా? -
FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?
ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్కప్ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే గ్రూప్ దశతో పాటు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ముగిశాయి. శుక్రవారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. అరబ్ గడ్డపై జరుగుతున్న వరల్డ్కప్ను లైవ్లో వీక్షించేందుకు దాదాపు కోటికి పైగా వెళ్లారు. లైవ్ చూడలేని వాళ్లు మాత్రం టీవీల్లో, జియో సినిమాలో, తమకు నచ్చిన ఫ్లాట్ఫాంలో చూస్తూ ఆనందిస్తున్నారు. తాజాగా యూట్యూబ్ మాత్రం ఫిఫా అభిమానులను దారుణంగా మోసం చేసింది. ఫిఫా వరల్డ్కప్ సందర్భంగా గ్రూప్ దశలో జపాన్, జర్మనీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రీప్లేను యూట్యూబ్లో టెలికాస్ట్ చేశారు. రియల్ మ్యాచ్ అనుకొని ఎంజాయ్ చేసిన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ ట్విస్ట్ ఏంటంటే.. అది రియల్ మ్యాచ్ కాదు ఫేక్ గేమ్ అని. ఫిఫా 23 గేమ్ప్లే(ఆన్లైన్ గేమ్)లో భాగంగా ఒక గేమింగ్ కంపెనీ దీనిని రూపొందించింది. మాములుగా యూట్యూబ్లో మనం ఏదైనా మ్యాచ్ వీక్షిస్తే.. ఒరిజినల్కు, డూప్లికేట్కు తేడా ఇట్టే తెలిసిపోతుంది. కానీ సదరు యూట్యూబ్ చానెల్ మాత్రం మ్యాచ్ రెజల్యూషన్(క్వాలిటీ) తగ్గించి గేమింగ్ను కాస్త రియల్ గేమ్లాగా చూపించారు. దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చం రియల్ మ్యాచ్లానే కనిపిస్తోంది. కాస్త దగ్గరి నుంచి పరిశీలిస్తే కానీ అది బొమ్మల గేమ్ అని అర్థమవుతుంది. అంత మాయ చేశారు యూట్యూబ్ నిర్వాహకులు. అయితే నిజంగానే జపాన్, జర్మనీలు ఒకే గ్రూప్లో ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఫేక్ మ్యాచ్ను ఒరిజినల్ అనుకొని దాదాపు 40వేల మంది వీక్షించారు. ఇక ఫిఫా వరల్డ్కప్లో నాలుగుసార్లు చాంపియన్ అయిన జర్మనీ గ్రూప్ దశలో వెనుదిరగ్గా.. జపాన్ ప్రీక్వార్టర్స్లో ఇంటిబాట పట్టింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం! -
FIFA WC: 8 స్టేడియాలు.. వాటి ప్రత్యేకతలు ఇవే! ఫైనల్, ముగింపు వేడుకలు అక్కడే!
FIFA World Cup Qatar 2022- ALL 8 Stadiums: జగమంత సాకర్ కుటుంబాన్ని ఒక్క చోట కూర్చోబెట్టే టోర్నీ ఫుట్బాల్. అరబ్ ఇలాకాలో తొలి సాకర్ సమరం ఇదే కావడంతో ఖతర్ తమ సంప్రదాయాన్ని, సాంస్కృతిక ప్రాభవాన్ని ప్రతిబింబించేలా స్టేడియాల్ని నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో 974 స్టేడియం ఈ మెగా ఈవెంట్ ముగియగానే కనుమరుగుకానుంది. ఈ నేపథ్యంలో 974తో పాటు మిగిలిన ఏడు స్టేడియాలకు సంబంధించిన విశేషాలు మీకోసం. వేలమంది ఈలల్ని... దిక్కులన్నీ పిక్కటిల్లే గోలల్ని... తట్టుకునేలా స్టేడియాల్ని ముస్తాబు చేసింది ఖతర్. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్)ల్లో ఫుల్ చార్జింగ్తో స్టేడియాలన్నీ చుట్టేయొచ్చు. ‘కిక్’ ఇచ్చే ఈ ఎనిమిది స్టేడియాలు దగ్గర దగ్గరలోనే ఉండటం మరో విశేషం. అవన్నీ కూడా దోహా చుట్టుపక్కలే. ఇంకా చెప్పాలంటే ఒకే రోజు (24 గంటల వ్యవధిలో) 8 స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించినా... అన్నింటిని చూసేయొచ్చంటే అతిశయోక్తి కాదు! ఎందుకంటే గంటల తరబడి సాగే క్రికెట్ కాదిది. గంటన్నరలో ముగిసే ఫుట్బాల్ కదా! photo courtesy : Twitter అల్ బైత్ స్టేడియం ►నగరం: అల్ ఖోర్ – సీట్ల సామర్థ్యం: 60 వేలు ►మ్యాచ్లు: ఆరంభ సమరం, వేడుకలు, ►సెమీఫైనల్ దాకా జరిగే పోటీలు ఇది భిన్నమైన ఆకృతితో నిర్మించిన స్టేడియం. గల్ఫ్ సంచార ప్రజలు ఉపయోగించే గుడారాలే దీనికి ప్రేరణ. స్టేడియం కూడా భారీ టెంట్ (షామియానా)ల సమూహంగా కనిపిస్తుంది. ఖతర్ భూత, వర్తమానాన్ని ఆవిష్కరించేలా... హరిత అభివృద్ధికి ఆధునిక నమూనాలా ... స్టేడియాన్ని నిర్మించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. photo courtesy : Twitter అహ్మద్ బిన్ అలీ స్టేడియం ►నగరం: ఉమ్ అల్ అఫాయ్ – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్ దోహాకు 29 కి.మీ. దూరంలో ఉన్న ఈ స్టేడియం, చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు ఖతర్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ప్రత్యేకించి స్టేడియం ముఖద్వారం ఇసుక తిన్నెల అలల్ని తలపిస్తుంది. చుట్టూరా ఉన్న కట్టడాలు స్థానిక వృక్షజాలం, జంతుజాల అందాల్ని వర్ణించినట్లుగా ఉంటాయి. photo courtesy : Twitter అల్ జనౌబ్ స్టేడియం ►నగరం: అల్ వక్రా – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్ దోహాకు 21 కిలో మీటర్ల దూరంలో దక్షిణ వక్రా నగరంలో దీన్ని నిర్మించారు. ఖతర్ సంప్రదాయ బోట్లను ప్రతిబించించేలా స్టేడియం పైకప్పు నిర్మాణం ఉంటుంది. ఈ మెగా ఈవెంట్ కోసం 40 వేల సామర్థ్యమున్న స్టేడియాన్ని తర్వాత్తర్వాత కుదిస్తారు. ఇతర స్పోర్ట్స్ ప్రాజెక్టుల కోసం విరాళంగా ఇస్తారు. photo courtesy : Twitter ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం ►నగరం: దోహా – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్, మూడో స్థానం ప్లే ఆఫ్ చాన్నాళ్ల క్రితమే 1976లో నిర్మించిన ఈ స్టేడియాన్ని 2005లో పూర్తిగా నవీకరించారు. 2006లో ఈ స్టేడియంలోనే ఆసియా క్రీడలు నిర్వహించారు. ఆ పాత మైదానం నుంచి అధునాతన స్టేడియంగా ఎన్నో సదుపాయాల నెలవుగా దీన్ని విస్తరించారు. అక్వాటిక్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ మ్యూజియం ఇలా ఒకటేమిటి అన్ని హంగులకూ ఈ స్టేడియం పెట్టిందిపేరు. photo courtesy : Twitter ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం ►నగరం: అల్ రయ్యాన్ ►సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్ దోహాకు అత్యంత చేరువలో 12 కిలో మీటర్ల దూరంలోనే ఈ స్టేడియం ఉంది. ప్రపంచశ్రేణి యూనివర్సిటీ క్యాంపస్ల మధ్యలో దీన్ని నిర్మించారు. డైమండ్ బిళ్లల ఆకారంలో ఉండే ఈ స్టేడియంపై సూర్యరశ్మి ఎక్కడ పడితే అక్కడ (డైమండ్ బిళ్లలపై పడే సూర్యరశ్మి) మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ సిటీలో ఉన్న ఈ స్టేడియంలోని సగం టికెట్లను వర్సిటీ జట్లు, విద్యార్థుల కోసమే రిజర్వ్ చేశారు. photo courtesy : Twitter లుసాయిల్ స్టేడియం ►నగరం: లుసాయిల్ ►సీట్ల సామర్థ్యం: 80 వేలు ►మ్యాచ్లు: ఫైనల్దాకా సాగే మ్యాచ్లన్నిటికీ లుసాయిల్ ప్రధాన స్టేడియం. దోహాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్ ఆఖరికి ఫైనల్ మ్యాచ్(డిసెంబరు 18), ముగింపు వేడుకలనూ ఇక్కడే నిర్వహిస్తారు. టోర్నీ దిగ్విజయంగా ముగిసిన అనంతరం దీన్ని కమ్యూనిటీ సెంటర్గా మార్చేస్తారట! పాఠశాలలు, షాప్లు, కేఫ్, స్పోర్ట్స్, ఆరోగ్య కేంద్రాలను ఇందులో నిర్వహిస్తారు. photo courtesy : Twitter 974 స్టేడియం ►నగరం: దోహా ►సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్లు: గ్రూప్ దశ, ప్రీక్వార్టర్స్ హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరువలో ఉంటుంది ఈ స్టేడియం. గల్ఫ్ కోస్తా ప్రాంతంలోని ఆకాశహర్మ్యాల మధ్య షిప్పింగ్ కంటెయినర్స్తో నిర్మించారు. మొత్తం 974 కంటెయినర్లను వినియోగించడంతో పాటు ఖతర్ ఐఎస్డీ (ఇంటర్నేషనల్ సబ్స్క్రైబర్ డయలింగ్) కోడ్ కూడా 974 కావడంతో ఆ నంబర్నే స్టేడియానికి పేరుగా పెట్టారు. ఈ మైదానానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని పూర్తిగా పడగొడితే ఇందులోని మెటిరీయల్ వృథాకాకుండా పునర్వినియోగానికి అంతా పనికొస్తుందట! photo courtesy : Twitter అల్ తుమమ స్టేడియం ►నగరం: దోహా – సీట్ల సామర్థ్యం: 40 వేలు ►మ్యాచ్లు: గ్రూపు దశ, ప్రీక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్ అల్ తుమమ స్టేడియం అరబ్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్చరల్ ఐకాన్. సంప్రదాయ ఖాఫియా నుంచి ప్రేరణతో రూపొందించారు. ఖాఫియా అంటే టోపీ. దాని ఆకారంలోనే ఈ స్టేడియాన్ని నిర్మించారు. డిజైన్, అద్దిన రంగులు, దిద్దిన సొబగులన్నీ ఓ పే...ద్ద టోపీలాగే ఉంటుంది. అరబ్ సాంస్కృతిక చరిత్రకు దర్పణంలా కనిపిస్తుంది. -యెల్లా రమేశ్ చదవండి: Rahul vs Pant: అతడు ‘ఆల్రౌండర్’.. తుది జట్టులో తనే ఉండాలి.. బౌలింగ్ ఆప్షన్ దొరుకుతుంది: భారత దిగ్గజం Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్లలో ఆడించాలి: మాజీ క్రికెటర్ -
FIFA: అదృశ్యం కానున్న 'స్టేడియం 974'; ప్రత్యేకత తెలుసుకోవాల్సిందే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో మ్యాచ్లను ఎనిమిది స్టేడియాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎనిమిది స్డేడియాల్లో ఒక స్టేడియాన్ని మాత్రం వినూత్న శైలిలో నిర్మించారు. అదే 974 స్టేడియం. అంకెలు ఎందుకు ఉన్నాయనేగా మీ డౌటు.. ఈ స్టేడియం నిర్మాణంలో 974 షిప్పింగ్ కంటైనర్లను ఉపయోగించారు. అందుకే ఈ స్డేడియానికి 974 అని పేరు వచ్చింది. కాగా ఇదే '974' సంఖ్య ఖతార్ అంతర్జాతీయ టెలిఫోన్ కోడ్ను సూచిస్తుంది. అయితే ఫిఫా వరల్డ్కప్ ముగియగానే 974 స్టేడియం కనుమరుగు కానుంది. సోమవారం బ్రెజిల్, సౌత్ కొరియాల మధ్య మ్యాచ్ 974 స్టేడియంలో చివరిది కావడం విశేషం. దోహా పోర్ట్ ప్రాంతంలో నిర్మించిన ఈ స్టేడియాన్ని ప్రపంచకప్ ముగిసిన తర్వాత కూలగొట్టనున్నట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. తాజాగా స్టేడియానికి సంబంధించిన వీడియోను ఫిఫా వరల్డ్ కప్ అభిమానులతో పంచుకుంది. ''త్వరలో అదృశ్యం కానున్న 974 స్టేడియాన్ని ఒకసారి చూసేయండి'' అంటూ ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Built with 974 shipping containers. the stadium can be fully dismantled and re-purposed post-event 🧱 Take a look at Stadium 974 🏟️ #FIFAWorldCup #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2022 చదవండి: పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం! FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు! -
FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా?
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన కెరీర్లో చివరి ఫిఫా వరల్డ్కప్ ఆడుతున్నాడని చాలామంది భావిస్తున్నారు. 35 ఏళ్ల వయసులో ఉన్న మెస్సీ మరో వరల్డ్కప్ ఆడడం అనుమానమే. అందుకే కెరీర్లో ఎన్నో మైలురాళ్లను, రికార్డులను అందుకున్నప్పటికి ఫిఫా వరల్డ్కప్ ట్రోఫీ అందుకోలేదన్న కోరిక మెస్సీకి బలంగా ఉంది. ఈసారి ఎలాగైనా అర్జెంటీనాను విజేతగా నిలిపి తన కోరికను నెరవేర్చుకోవడంతో పాటు హ్యాపీ మూమెంట్తో ఆటకు వీడ్కోలు పలకాలని మెస్సీ భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే మెస్సీ ప్రయాణం కొనసాగుతుంది. తొలి మ్యాచ్లో సౌదీ అరేబియా చేతిలో ఓటమి మినహా.. క్వార్టర్ ఫైనల్స్ వరకు అంతా సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇప్పటివరకు మెస్సీ మూడు గోల్స్ కొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రస్తుతం నాకౌట్ దశ జరుగుతుండడంతో ప్రతీ మ్యాచ్ కీలకమే.. అర్జెంటీనా ఓడితే మాత్రం ఇంటిబాట పట్టడమే కాదు మెస్సీ కెరీర్ కూడా ముగిసినట్లే. డిసెంబర్ 10న బలమైన నెదర్లాండ్స్తో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్ పోరులో తలపడనుంది. ఆ మ్యాచ్లో మెస్సీ సేన విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లాలని బలంగా కోరుకుందాం. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో భాగంగా లియోనల్ మెస్సీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఫుట్బాల్ అంటే బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ఆటగాళ్లు పరిగెత్తుతూనే ఉండాలి.. అయితే మెస్సీ మాత్రం బంతి తన ఆధీనంలో లేనప్పుడు పరిగెత్తడం కంటే ఎక్కువగా నడవడం చేస్తుంటాడని ఒక వెబ్సైట్ తన సర్వేలో పేర్కొంది. ఫిఫా వరల్డ్కప్లో భాగంగా గ్రూప్ దశలో మ్యాచ్ సమయంలో గ్రౌండ్లో ఎక్కువగా నడిచిన టాప్-10 ఆటగాళ్ల లిస్ట్ రూపొందించారు. ఈ లిస్ట్లో మెస్సీ మూడుసార్లు చోటు దక్కించుకోవడం విశేషం. మెక్సికోతో మ్యాచ్లో మెస్సీ అత్యధికంగా 4998 మీటర్లు దూరం నడిచాడు. ఆ తర్వాత పోలాండ్తో మ్యాచ్లో 4736 మీటర్ల దూరం, సౌదీ అరేబియాతో మ్యాచ్లో 4627 మీటర్ల దూరం నడిచాడు. ఓవరాల్ జాబితాలో రెండు, ఐదు, తొమ్మిదో స్థానాలు కలిపి మొత్తంగా మూడుసార్లు మెస్సీ చోటు దక్కించుకున్నాడు. ఇక తొలి స్థానంలో పోలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెవాన్డోస్కీ ఉన్నాడు. సౌదీ అరేబియాతో మ్యాచ్లో రాబర్ట్ 5202 మీటర్ల దూరం నడిచాడు. ఆ తర్వాత అర్జెంటీనాతో మ్యాచ్లో 4829 మీటర్ల దూరం నడిచిన లెవాన్డోస్కీ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచి రెండోసారి చోటు సంపాదించాడు. మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా? మరి మ్యాచ్లో మెస్సీ పరిగెత్తడం కంటే ఎక్కువగా నడుస్తాడనే దానిపై సందేహం వచ్చింది. ఈ ప్రశ్నకు మెస్సీ మాజీ మేనేజర్ పెప్ గార్డియోలా సమాధానం ఇచ్చాడు. ''మెస్సీ నడవడంలోనే పరిగెత్తడం చేస్తుంటాడు. అతను గేమ్లో ఎంతలా ఇన్వాల్వ్ అయితాడనేదానికి అతని నడకే ఒక ఉదాహరణ. మెస్సీ కావాలని అలా నడవడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కనీసం ఒక పది నిమిషాల పాటు గ్రౌండ్ మొత్తం నడుస్తూనే తన జట్టు ఆటగాళ్ల కదలికలను.. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారనే దానిపై ఒక కన్ను వేస్తాడు. గ్రౌండ్ పరిసరాలను మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికే ఈ ప్రయత్నం. ఆ తర్వాత తలను ఎడమ, కుడి.. ఇలా 360 డిగ్రీస్లో తిప్పుతూ ఆటగాడి కదలికలను.. వారు కొట్టే షాట్స్ను అంచనా వేయడం అతనికి అలవాటు. ఇక అంతా బాగుంది అనుకొని అప్పుడు తనలోని ఆటను బయటికి తీయడం చేస్తుంటాడు. మెస్సీ సక్సెస్కు ఇదీ ఒక కారణం అని చెప్పొచ్చు. అంతేకాని ఏదైనా సమస్య కారణంగా మెస్సీ పరిగెత్తడం లేదని.. నడకకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని అనుకుంటే మాత్రం పొరబడ్డట్లే. మెస్సీలో ఉన్న ప్రత్యేకత ఇదే.'' అంటూ చెప్పుకొచ్చాడు. Here is a video of Pep Guardiola explaining why Messi seems to “just walk around the pitch” when he doesn’t have the ball: pic.twitter.com/sEBQ4Juufh — ⚡️ (@Radmanx23) July 8, 2021 Tell us something we don't know 😂 pic.twitter.com/YbZLH1g8LE — M•A•J (@Ultra_Suristic) December 3, 2022 చదవండి: ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్ కోసం చకోర పక్షుల్లా FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు! -
FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు!
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వవ్యాప్తంగా మెస్సీకి యమా క్రేజ్ ఉంది. క్రిస్టియానో రొనాల్డోతో సమానంగా ఫ్యాన్ బేస్ కలిగిన మెస్సీ చివరి వరల్డ్కప్ ఆడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా జట్టుకు ఫిఫా టైటిల్ అందించాలనే లక్ష్యంతోనే మెస్సీ బరిలోకి దిగినట్లుగా అనిపిస్తుంది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనాను మెస్సీ క్వార్టర్ ఫైనల్స్కు చేర్చాడు. మరో మూడు అడుగులు దాటితే కప్ అర్జెంటీనా సొంతం అవుతుంది. అయితే నాకౌట్ దశ కావడంతో ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిబాట పట్టాల్సిందే. ఈ స్థితిలో మెస్సీ ఎలా జట్టును ముందుకు తీసుకెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ వరల్డ్కప్లో మూడు గోల్స్ సాధించిన మెస్సీ ఓవరాల్గా ఫిఫా వరల్డ్కప్స్లో తొమ్మిది గోల్స్ నమోదు చేశాడు. ఈ విషయం పక్కనబెడితే.. ఆటలో మెస్సీ రారాజు మాత్రమే కాదు.. ప్రశాంతతకు మారుపేరు. మ్యాచ్ సమయంలో అతను సహనం కోల్పోయింది చాలా తక్కువసార్లు అని చెప్పొచ్చు. అయితే మెస్సీ కొడుకు మాత్రం అల్లరిలో కింగ్లా కనిపిస్తున్నాడు. శనివారం అర్థరాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్కు మెస్సీ భార్య అంటోనిలా రొక్కుజో తన కుమారుడితో హాజరయ్యింది. మ్యాచ్లో 35వ నిమిషంలో మెస్సీ గోల్ చేసినప్పుడు కొడుకుతో కలిసి సంతోషాన్ని పంచుకున్న అంటోనిలా మెస్సీకి ప్లైయింగ్ కిస్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత కాసేపటికే మెస్సీ కొడుకు తనలోని తుంటరితనాన్ని బయటికి తీశాడు. నోటిలో ఉన్న చూయింగ్ గమ్ను బయటకు తీసి తన ఎదురుగా ఫ్యాన్స్పైకి విసిరేశాడు. ఈ చర్యతో షాక్ తిన్నా వాళ్లు వెనక్కి తిరిగి చూడగా.. చేసింది మెస్సీ కొడుకని తెలుసుకొని ఏమీ అనలేకపోయారు. అయితే తల్లి అంటోనిలా రొక్కుజో మాత్రం కొడుక్కి చివాట్లు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ఫన్నీ కామెంట్స్తో రెచ్చిపోయారు. ''మెస్సీ వారసుడు అంటున్నారు.. అతని లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. ఈ పిల్లాడి వల్ల చాలా ముప్పు.. వెంటనే స్కూల్కు పంపించేయండి.. వాళ్ల నాన్న కనిపించేసరికి అతనిపై వేద్దామనుకున్నాడు.. కానీ మిస్ అయిపోయింది..'' అంటూ పేర్కొన్నారు. ఇక ప్రీక్వార్టర్స్లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన మెస్సీ బృందం డిసెంబర్ 10న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్తో తలపడనుంది. ఇక ఆస్ట్రేలియాతో మ్యాచ్ మెస్సీ కెరీర్లో 1000వ మ్యాచ్. ఈ మ్యాచ్లో గోల్ చేసిన మెస్సీ దిగ్గజం మారడోనా రికార్డును బద్దలు కొట్టాడు. Bro who pissed Messi's son Mateo off this much?? 😭😭 pic.twitter.com/GvK0snj7vY — mx (@MessiMX30iiii) December 4, 2022 చదవండి: 60 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన ఫ్రాన్స్ ఫుట్బాలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: వరల్డ్ కప్లో చారిత్రాత్మక ఘట్టం.. ఆ మహిళామణులు ఎవరంటే!
FIFA World Cup 2022 Germany Vs Costa Rica: తొలిసారి మహిళా రిఫరీలు వరల్డ్ కప్లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ఫిఫా వరల్డ్కప్-2022లో భాగంగా జర్మనీ, కోస్టారికా మ్యాచ్కు ముగ్గురు మహిళలే రిఫరీలుగా వ్యవహరించడం విశేషం. పురుషుల ప్రపంచకప్ మ్యాచ్లో ఇలాంటిది జరగడం ఇదే మొదటిసారి. కాగా... స్టెఫానీ ఫ్రాపర్ట్ (ఫ్రాన్స్) ఫీల్డ్ రిఫరీగా, న్యూజా బ్యాక్ (బ్రెజిల్), కరెన్ డియాజ్ (మెక్సికో) అసిస్టెంట్ రిఫరీలుగా ఈ ఘనతలో భాగమయ్యారు. తదుపరి మ్యాచ్ల్లో సలీమా ముకన్సంగా (రువాండా), యోషిమి యామషిటా (జపాన్) కూడా ఫీల్డ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. 38 ఏళ్ల స్టెఫానీ 2019లో లివర్పూల్, చెల్సీ జట్ల మధ్య యూరోపియన్ కప్ పురుషుల సూపర్ కప్ ఫైనల్లో, 2020లో చాంపియన్స్ లీగ్ మ్యాచ్లో, గత సీజన్లో ఫ్రెంచ్ కప్ ఫైనల్లోనూ రిఫరీగా వ్యవహరించింది. చదవండి: FIFA WC 2022: రెండు గోల్స్.. అంతా తలకిందులు! దురదృష్టం అంటే జర్మనీదే! భారీ షాకిచ్చిన జపాన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సాకర్ సంగ్రామంలో కీలకఘట్టం
-
FIFA WC: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ చూడడానికి వచ్చే అభిమానులకు కఠినమైన కండీషన్స్ పెట్టారు నిర్వాహకులు. మాములుగా ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే యువతుల గ్లామర్ షో ఎక్కువగా ఉండడం సహజం. మందు, విందు, చిందు కూడా కామన్గా కనిపిస్తాయి. ఫిఫా లాంటి మెగా టోర్నీలో అయితే ఇక చెప్పనవసరం లేదు. పొట్టి దుస్తులు ధరించి క్లీవేజ్ షో చేస్తూ తమ అంద చందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. కానీ అరబ్ దేశమైన ఖతర్లో ఇలాంటివి నిషేధం. ఇస్లాం మతం ఎక్కువగా ఆచరించే దేశంలో మహిళలు అసభ్యకర దుస్తులు ధరించడానికి వీల్లేదు. అందుకే ఫిఫా వరల్డ్కప్కు వచ్చే యువతులు, మహిళలలు ఎట్టి పరిస్థితుల్లోనూ కురచ దుస్తులు వేసుకొని రావొద్దని.. అనవసరంగా క్లీవేజ్ షో చేసి జైలుపాలు కావొద్దని ముందే హెచ్చరించింది. అంతేకాదు మ్యాచ్ చూడడానికి వచ్చే మహిళా అభిమానులు ఫుల్ డ్రెస్ వేసుకొని రావాలని.. తప్పనిసరిగా మెడచుట్టు స్కార్ఫ్ వాడాల్సిందేనని పేర్కొన్నారు. అయితే క్రొయేషియాకు చెందిన మోడల్ ఇవానా నోల్ మాత్రం తనకు ఈ నిబంధనలు ఏ మాత్రం వర్తించవని ధైర్యంగా పేర్కొంది. ప్రస్తుతం వరల్డ్కప్లో హాటెస్ట్ ఫ్యాన్గా ముద్రపడిన ఇవానా నోల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అందాల ప్రదర్శన చేయడం సంచలనం కలిగించింది. క్రొయేషియా, బెల్జియం మ్యాచ్కు హాజరైన ఇవానా నోల్.. స్టేడియంలోకి సాధారణంగానే ఎంట్రీ ఇచ్చింది. మ్యాచ్ జరుగుతుండగానే ఇవానా నోల్ తాను వేసుకున్న డ్రెస్ పైపార్ట్ తొలగించి క్లీవేజ్ షో చేసింది. ఫిఫా నిర్వాహకుల సంగతి ఏమో తెలియదు కానీ మ్యాచ్కు వచ్చిన అభిమానులు మాత్రం ఆమె అందాల ప్రదర్శనను బాగా ఎంజాయ్ చేశారు. అయితే తన అందాల ప్రదర్శనే ఇప్పుడు ఇవానా నోల్కు సమస్యను తెచ్చిపెట్టింది. ఖతర్ వీధుల్లో ఇవానా నోల్ ఫోటోలను దగ్దం చేసిన స్థానిక యువకులు వెంటనే ఆమెను దేశం నుంచి బహిష్కరించాలని లేదా జైలులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఇవానా నోల్ మాత్రం తన అంద చందాలతో ఖతర్లో సెగలు పుట్టించింది. చదవండి: నాలుగుసార్లు ఛాంపియన్.. ఇదంతా గతం; మాకు జరగాల్సిందే View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) View this post on Instagram A post shared by Ivana Knöll (@knolldoll) -
నాలుగుసార్లు ఛాంపియన్.. ఇదంతా గతం; మాకు జరగాల్సిందే
ఫుట్బాల్ చరిత్రలో జర్మనీది ప్రత్యేక స్థానం. సాకర్ సమరంలో నాలుగుసార్లు చాంపియన్స్గా నిలిచిన జర్మనీ.. అత్యధిక వరల్డ్కప్స్ సాధించిన జట్టుగా ఇటలీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. 2014లో జర్మనీ నాలుగోసారి చాంపియన్స్గా అవతరించింది. అంతకముందు 1954,1974,1990లో ఫిఫా వరల్డ్కప్ అందుకుంది. కానీ ఇదంతా గతం. చివరగా 2014లో ఫిఫా వరల్డ్ చాంపియన్స్గా నిలిచిన జర్మనీ వరుసగా రెండు ప్రపంచకప్లలో గ్రూప్ దశను దాటలేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువ లేదు. థామస్ ముల్లర్, మారియో గోట్జే, లుకాస్ క్లోస్టర్మెన్, జోనస్ హాప్మన్ ఇలా ఎవరికి వారే సాటి. కానీ ఈ వరల్డ్కప్లో మాత్రం వీళ్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత సంచలనం నమోదైంది. కోస్టారికాపై 4-2 తేడాతో ఘన విజయం సాధించినప్పటికి జర్మనీ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అందుకు కారణం జర్మనీ తమ తొలి మ్యాచ్ జపాన్ చేతిలో ఓడడమే. ఆ తర్వాత బలమైన స్పెయిన్తో మ్యాచ్ డ్రా చేసుకోవడం ఆ జట్టును కొంపముంచింది. ఆ తర్వాత జపాన్.. స్పెయిన్ను ఓడించడంతో జర్మనీ కథ ముగిసింది. ఓటమికి తోడు దురదృష్టం కూడా తోడవ్వడంతో జర్మనీ వరుగగా రెండోసారి ఫిఫా వరల్డ్కప్ నుంచి భారంగా వైదొలిగింది. ఇక స్పెయిన్తో పాటు జపాన్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. ఇక జర్మనీలో వ్యక్తిగతంగా ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసినప్పటికి జట్టుగా విఫలమైందని ఆ దేశ అభిమానులు పేర్కొన్నారు. అభిమానులే కాదు అక్కడి మీడియా కూడా జర్మనీ ఫుట్బాల్ టీంపై విమర్శలు వ్యక్తం చేసింది. ''వ్యక్తిగతంగా చూస్తే అందరు మంచి ఆటగాళ్లుగానే కనిపిస్తున్నారు.. కానీ జట్టులా చూస్తే అలా అనిపించడం లేదు. 2014లో జర్మనీ ఫిఫా వరల్డ్కప్ గెలవడంలో బాస్టియన్ ష్వీన్స్టీగర్ , లుకాస్ పోడోల్స్కీలది కీలకపాత్ర. వారు రిటైర్ అయ్యాకా జర్మనీ ఆట కళ తప్పింది. జర్మనీ జట్టు వైభవం కూడా వారితోనే పోయింది. ఇప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లు తమ ప్రయోజనాల కోసం ఆడతున్నారు తప్పిస్తే ఒకటిగా కలిసి ఆడడం లేదు. ఇదే మా కొంపముంచింది. మాకు ఇది కావాల్సిందే'' అంటూ కామెంట్ చేశారు. నాలుగుసార్లు ఛాంపియన్ అయిన ఇటలీ కనీసం ఫిఫాకు అర్హత సాధించలేదు. అర్హత సాధించిన జర్మనీ కూడా వైదొలగడం సగటు ఫిఫా అభిమానిని బాధిస్తుంది. రెండు పెద్ద జట్లు లేకుండానే ఫిఫా వరల్డ్కప్ ముందుకు సాగుతుంది. వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్కప్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జర్మనీ వచ్చే ఫిఫా వరల్డ్కప్ వరకైనా బలంగా తయారవ్వాలని.. మునుపటి ఆటతీరు ప్రదర్శిచాలని కోరుకుందాం. -
FIFA WC: డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్కు ఊహించని షాక్! కానీ..
FIFA world Cup Qatar 2022: వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి అందరి కంటే ముందుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించిన ఫ్రాన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్కు అనూహ్య పరాజయం ఎదురైంది. ప్రపంచ 30వ ర్యాంకర్ ట్యునీషియా 1–0 గోల్తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఫ్రాన్స్ జట్టును ఓడించింది. అయితే ఈ గెలుపు ట్యునీషియాకు నాకౌట్ బెర్త్ను అందించలేకపోయింది. ఆట 58వ నిమిషంలో వాహిబి ఖాజ్రి గోల్తో ట్యునీషియా విజయాన్ని దక్కించుకుంది. స్టాపేజ్ సమయంలో (90+10వ ని.లో) ఫ్రాన్స్ గ్రీజ్మన్ కొట్టిన షాట్ ట్యునీషియా గోల్పోస్ట్లోనికి వెళ్లడంతో స్కోరు సమం అయింది. అయితే ట్యునీషియా రిఫరీ నిర్ణయాన్ని సమీక్షించడంతో రీప్లేలో ఫ్రాన్స్ గోల్ ఆఫ్సైడ్గా తేలింది. దాంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. ఫలితంగా 1971 తర్వాత ఫ్రాన్స్పై ట్యునీషియాకు రెండో విజయం దక్కింది. చదవండి: Sanju Samson: పంత్ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి అండగా ఉంటాం.. ఎవరిని ఆడించాలో తెలుసు: వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అందం హిందోళం.. అధరం తాంబూలం
అందంలో మనకు ఐశ్వర్యరాయ్ ఎలాగో.. ఒంటెల్లో ఇదలాగన్న మాట.. ఖతర్లో అటు ప్రపంచ ఫుట్బాల్ కప్ పోటీలు జరుగుతున్న సమయంలోనే ఇటు ఈ ఒంటెల అందానికి సంబంధించిన ప్రపంచ కప్ పోటీలూ జరిగాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందమైన ఆడ ఒంటెలు ఈ పోటీల్లో తమ హొయలను ప్రదర్శించాయి. ఈ చిత్రంలోని ఒంటె.. మొదటి స్థానాన్ని గెలుచుకుని.. రూ.44 లక్షల బహుమతిని గెలుచుకుంది. ఇందులో గెలవడం అంత ఈజీ కాదు.. ముందుగా ఈ ఒంటెలకు వైద్యుల పర్యవేక్షణలో ఎక్స్రేలు వంటివి తీస్తారు. ఎందుకంటే.. అందాన్ని ఇనుమడింపజేయడానికి ఏమైనా ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్ ఇంజెక్షన్లు వంటివి వాటికి ఇచ్చారా అన్నది తెలుసుకోవడానికట. సహజ సౌందర్యరాశికే పట్టం కట్టాలన్నది తమ లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు. గత పోటీల్లో వైద్య పరీక్షల్లో పట్టుబడిన 47 ఒంటెలపై అనర్హత వేటు వేశారట. పోటీల్లో భాగంగా.. వాటి చెవులు, ముక్కు.. పెదాలు ఇలా అన్నిటినీ నిశితంగా పరీక్షించి.. జడ్జీలు మార్కులేస్తారు. Spectators watch a camel beauty contest in Ash-Shahaniyah, Qatar 📸 @reuterspictures pic.twitter.com/0wQ3WCyQBm — Reuters (@Reuters) November 30, 2022 -
మెస్సీకి అగ్ని పరీక్ష.. పోలాండ్ చేతిలో ఓడితే!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్కప్లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా బుధవారం అగ్నిపరీక్ష ఎదుర్కోనుంది. ఇవాళ అర్థరాత్రి దాటిన తర్వాత పోలాండ్తో జరగనున్న మ్యాచ్లో అర్జెంటీనా కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెస్సీకి ఇదే చివరి ఫిఫా వరల్డ్కప్ అని భావిస్తున్న తరుణంలో అర్జెంటీనా ప్రీ క్వార్టర్స్కు చేరాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అయితే గ్రూప్-సిలో అర్జెంటీనా సహా మిగతా అన్ని జట్లకు కూడా రౌండ్ ఆఫ్-16 అవకాశాలున్నాయి. అయితే చివరకు రెండు జట్లు మాత్రమే ప్రీ క్వార్టర్స్కు చేరుకుంటాయి. మరి ఆ రెండు జట్లు ఏవి అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. అర్జెంటీనా, పోలాండ్కు ఎంత అవకాశం? ►బుధవారం జరగబోయే మ్యాచ్లలో అందరి కళ్లూ అర్జెంటీనా, మెస్సీపైనే ఉన్నాయి. ఆ టీమ్ తర్వాతి రౌండ్కు అర్హత సాధిస్తుందా లేక తొలి రౌండ్లోనే ఇంటిదారి పడుతుందా అన్నది తేలనుంది. గ్రూప్ సిలో టాపర్గా ఉన్న పోలాండ్తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలిస్తేనే అర్జెంటీనా రౌండ్ ఆఫ్ 16కు వెళ్తుంది. ►ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే రాబర్ట్ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్ రౌండ్ ఆఫ్ 16కు వెళ్తుంది. అటు అర్జెంటీనా మాత్రం మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాను మెక్సికో ఓడించాలి. అదే సమయంలో గోల్ డిఫరెన్స్తో అర్జెంటీనా కంటే మెక్సికో వెనుక ఉండాలి. లేదంటే ఈ ఇద్దరి మ్యాచ్ డ్రా కావాలి. సౌదీ అరేబియా, మెక్సికో ►సౌదీ అరేబియా నాకౌట్కు చేరాలంటే కచ్చితంగా మెక్సికోను ఓడించాలి. మెక్సికో రౌండ్ ఆఫ్ 16 చేరాలంటే సౌదీని ఓడించడంతోపాటు అటు అర్జెంటీనాను పోలాండ్ ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో అర్జెంటీనా కంటే గోల్స్ డిఫరెన్స్లో పైచేయి సాధించాలి. అయితే సౌదీ అరేబియాతో పోలిస్తే మెక్సికోకు నాకౌట్ చేరే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు. ఆ లెక్కన చూస్తే అర్జెంటీనాకు ఇది అగ్ని పరీక్షే. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్రీ క్వార్టర్స్ చేరాలంటే పోలాండ్ను కచ్చితంగా ఓడించాల్సిందే. ఇక తొలి మ్యాచ్లో సౌదీ అరేబియా చేతుల్లో ఓడడం అర్జెంటీనా అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఇక ఫిఫా వరల్డ్కప్లో ఇప్పటికే బ్రెజిల్, ఫ్రాన్స్, పోర్చుగల్లాంటి జట్లు రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించాయి. అటు గ్రూప్-ఏ నుంచి నెదర్లాండ్స్, సెనెగల్.. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, అమెరికాలు ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. చదవండి: Lionel Messi: ఒక్క మ్యాచ్.. మూడు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు పంత్కు గాయం.. బంగ్లా టూర్కు దూరం! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో అమెరికా ప్రి క్వార్టర్స్కు చేరుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఇరాన్తో జరిగిన మ్యాచ్లో అమెరికా 1-0తో గెలిచి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఆట 38వ నిమిషంలో అమెరికా ఫుట్బాలర్ పులిసిక్ కొట్టిన గోల్ జట్టుకు విజయంతో పాటు ప్రి క్వార్టర్స్కు చేర్చింది. ఇక రిఫరీ మ్యాచ్ ముగిసిందని విజిల్ వేయగానే ఇరాన్ ఆటగాడు మెహదీ తరేమి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇది గమనించిన యూఎస్ఏ ఫుట్బాలర్ ఆంటోనీ రాబిన్సన్ తరేమి వద్దకు వచ్చి అతన్ని ఓదార్చాడు. విషయంలోకి వెళితే.. మరికొద్దిసేపట్లో ఆట ముగస్తుందనగా తరేమి పెనాల్టీగా భావించి సలహా కోసం రిఫరీ వద్దకు వెళ్లాడు. అయితే అది పట్టించుకోకుండా రిఫరీ విజిల్ వేయడం.. ఆ తర్వాత తన సహచర ఆటగాళ్లు అతని వద్దకు రావడంతో కన్నీళ్లు ఆగలేదు. అప్పుడే రాబిన్సన్ వచ్చి తరేమిని ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ''దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు.. ఇది రాజకీయం మాత్రం కాదు.. క్రీడాస్పూర్తి మాత్రమే'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఇరాన్, అమెరికాల మధ్య సత్సంబంధాలు లేవు. 40 సంవత్సరాల క్రితమే దౌత్య సంబంధాలను తెంచుకున్న ఇరు దేశాలు ఫిఫా వరల్డ్కప్లో ఎదురుపడడం ఆసక్తి కలిగించింది. అమెరికాతో జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ ఆటగాళ్లకు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇరాన్లో ప్రస్తుతం హిజాబ్ రగడ నడుస్తోంది. దీంతో వారికి మద్దతుగా ఇరాన్ ఫుట్బాల్ టీం జాతీయ గీతం ఆలపించేందుకు నిరాకరించింది. దీనికి సీరియస్గా తీసుకున్న ఐఆర్జీసీ ఆటగాళ్లు ఇలాగే చేస్తే జైలుకు పంపిస్తామని.. వారి కుటుంబాలకు నరకం అంటే చూపిస్తామని హెచ్చరించడం గమనార్హం. No politics, just sportsmanship. #USAvIRN pic.twitter.com/F9z1XtF7Pf — David Blenkle (@StockLlamma) November 30, 2022 చదవండి: ఇంగ్లండ్ జట్టులో కలకలం.. 15 మందికి గుర్తుతెలియని వైరస్ -
FIFA WC: పిచ్చి వేషాలు వేస్తే జైలుకే.. ఇరాన్ జట్టుకు హెచ్చరిక!
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఆ దేశపు ఆటగాళ్లు ఇంగ్లండ్తో ఆడిన తమ తొలి మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా మౌనం దాల్చిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఆటగాళ్లు నిరసన అందరిని ఆశ్చర్యపరిచింది. దేశం కోసం ఆడేటప్పుడు జాతీయ గీతం ఆలపించకుండా మౌనం పాటించడం మంచి పద్దతి కాదని ఇరాన్ జట్టు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లవెత్తాయి. దీనిని సీరియస్గా తీసుకున్న ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తమ జట్టు ఆటగాళ్లందరితో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ఈ మీటింగ్ లో ఐఆర్సీజీ ప్రతినిధులు.. ఫుట్బాల్ ప్లేయర్లను మందలించారని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు ముందు గానీ.. ఆట జరిగే సమయంలో గానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జైలుకు పంపిస్తామన్నారు. అంతేకాదు ఆటగాళ్ల కుటుంబాలకు టార్చర్ అంటే ఏంటో చూపెడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు ముందు అన్ని జట్ల మాదిరిగానే నిబంధలను పాటించాలని, నిరసనలు, మౌనం వహించడం వంటి చర్యలకు దిగితే సహించేది లేదని ఐఆర్జీసీ పేర్కొన్నట్లు సమాచారం.మరోసారి అలా చేస్తే జైలు శిక్ష తప్పదని.. ఆటగాళ్ల కుటుంబాలకు కూడా నరకం చూపిస్తామని బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐఆర్జీసీ బెదిరింపులకు భయపడిన ఇరాన్ జట్టు ఇంగ్లండ్తో మ్యాచ్ లో జాతీయ గీతం పాడకుండా నిరసన తెలిపిన ఇరాన్.. తర్వాత వేల్స్ తో మ్యాచ్ లో మాత్రం యథావిధిగా జాతీయ గీతాలపన చేసింది. ఇక గ్రూప్ స్టేజ్ లో భాగంగా బుధవారం (నవంబర్ 30) ఆ జట్టు యూఎస్ఏతో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో సక్రమంగా ఉండాలని, గెలిచినా ఓడినా ఫర్వాలేదు గానీ పిచ్చి వేషాలేస్తే మాత్రం తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐఆర్జీసీ హెచ్చరించినట్లు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. చదవండి: FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?' FIFA WC: ఖతర్ను కలవరపెడుతున్న 'క్యామెల్ ప్లూ' వైరస్ -
ఫిఫా వరల్డ్కప్లో వైరలవుతోన్న సంజూ శాంసన్ బ్యానర్లు
టీమిండియా టాలెంటెడ్ ఆటగాడు సంజూ శాంసన్కు అన్యాయం జరుగుతూనే ఉంది. న్యూజిలాండ్తో ముగిసిన టి20 సిరీస్కు ఎంపిక చేసినప్పటికి ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. ఆ తర్వాత వన్డే సిరీస్లోనూ అదే పరిస్థితి. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఏదో మొక్కుబడిగా తొలి వన్డే ఆడించారు. ఆ తర్వాత వెంటనే రెండో వన్డేకు పక్కకు తప్పించారు. అలా అని సంజూ శాంసన్ బాగా ఆడలేదా అంటే 37 పరుగులు చేశాడు. ఎన్ని అవకాశాలిచ్చినా వరుసగా విఫలమవుతున్న పంత్ కంటే శాంసన్ చాలా బెటర్గా కనిపిస్తున్నాడు. దీపక్ హుడాకు స్థానం కల్పించడానికి శాంసన్ను తప్పించినట్లు ధావన్ చెబుతున్నప్పటికి సౌత్ ప్లేయర్ అనే వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించిదని అభిమానులు పేర్కొన్నారు. మరి నవంబర్ 30(బుధవారం) జరిగే చివరి వన్డేలోనైనా సంజూకు అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సంగతి పక్కనబెడితే.. సంజూ శాంసన్ ఫ్యాన్స్ ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్లో అతని బ్యానర్లు ప్రదర్శించడం వైరల్గా మారింది.ఫిఫా మ్యాచ్ లకు హాజరవుతూ శాంసన్ కు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా గల్ఫ్ దేశాలలో మళయాళీలు స్థిరపడుతుంటారు. సంజూ కూడా మళయాళీనే కావడంతో అక్కడి కేరళీయులు అతడికి మద్దతు తెలుపుతున్నారు. అంతేగాక ఫిఫా చూడటానికి వెళ్లిన పలువురు కేరళ ఫ్యాన్స్ కూడా బ్యానర్లతో స్టేడియాలకు హాజరవుతూ అతడిపై ప్రేమను చాటుకుంటున్నారు. ''నిన్ను టీమిండియా ఆడించినా ఆడించకపోయినా మేం నీతోనే ఉంటాం. నువ్వు ఏ జట్టు తరఫునా ఆడినా మంచిదే. మా మద్దతు ఎప్పుడూ నీకు ఉంటుంది.'' అని ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. సంజూ శాంసన్ ఫ్యాన్ పేజీ ఈ ఫోటోలను ట్విటర్ లో పోస్ట్ చేయగా రాజస్తాన్ రాయల్స్ జట్టు దానికి ..''అతడి మీద మీకున్న ప్రేమకు సలామ్..'' అని కామెంట్స్ చేయడం విశేషం. Everybody: Who are you supporting at the FIFA World Cup? Us: pic.twitter.com/e66NRg78dh — Rajasthan Royals (@rajasthanroyals) November 27, 2022 చదవండి: FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?' Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్ నాది' -
FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?'
ఫిఫా వరల్డ్కప్లో భాగంగా గ్రూప్-హెచ్లో సోమవారం ఘనా, దక్షిణ కొరియాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఘనా జట్టు 3-2 తేడాతో సౌత్ కొరియాపై ఉత్కంఠ విజయాన్ని సాధించింది. మహ్మద్ కుదుస్ రెండు గోల్స్తో విజయంలో కీలకపాత్ర పోషించి ఘనా ఆశలను నిలపగా.. మరోపక్క సౌత్ కొరియా మాత్రం ఓటమితో వరల్డ్కప్ నుంచి నిష్క్రమించినట్లే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓడిపోయామన్న బాధలో ఉన్న సౌత్ కొరియా కెప్టెన్ సన్ హ్యుంగ్ మిన్ ఏడుస్తూ తెగ ఫీలయ్యాడు. ఇలాంటి సమయంలో ఓదార్చాల్సింది పోయి అతని వద్దకు వచ్చిన ఘనా స్టాఫ్ సిబ్బంది తమ చేష్టలతో విసిగించారు. ఒకపక్క ఓటమి బాధలో సన్ హ్యుంగ్ ఏడుస్తుంటే.. ఘనా సిబ్బంలోని ఒక వ్యక్తి మాత్రం అతనితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి స్టాఫ్ మెంబర్ వద్దని వారించినా వినకుండా సెల్ఫీ దిగాడు. ఇదంతా గమనించిన ఫుట్బాల్ ఫ్యాన్స్ ఘనా స్టాఫ్ సిబ్బందిని ట్రోల్ చేశారు. ''పాపం మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో అతను ఏడుస్తుంటే సెల్ఫీ ఎలా తీసుకుంటారు''.. ''సిగ్గుండాలి.. బాధలో ఉన్న ఆటగాడిని ఓదార్చాల్సింది పోయి ఇలా సెల్ఫీలు దిగడమేంటి.. చాలా అసహ్యంగా ఉంది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక గ్రూప్ హెచ్ నుంచి పోర్చుగల్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించగా.. ఇక ఘనా తన చివరి మ్యాచ్ ఉరుగ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్రి క్వార్టర్స్కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు చేరిన పోర్చుగల్ మాత్రం సౌత్ కొరియాతో డిసెంబర్ 3న ఆడనుంది. Ghana's coaches taking a selfie with a tearful Son Heung-min following their nation's victory over South Korea 😅😳#Qatar2022 pic.twitter.com/6ZX2O46Ogu — FourFourTwo (@FourFourTwo) November 28, 2022 చదవండి: Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్ నాది' -
FIFA WC: ఖతర్ను కలవరపెడుతున్న 'క్యామెల్ ప్లూ' వైరస్
ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్కప్ 2022 ఖతర్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్కప్ను లైవ్లో వీక్షించడానికి విశ్వవ్యాప్తంగా 1.2 మిలిమన్ అభిమానులు ఖతర్ వెళ్లినట్లు సమాచారం. వీరంతా తమకు ఇష్టమైన ఫిఫా వరల్డ్కప్ను ఎంజాయ్ చేస్తూనే అరబ్ దేశాల్లో ఒకటైన ఖతర్ అందాలను వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పరిశోధనా బృందం పెద్ద బాంబు పేల్చింది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో క్యామెల్ ప్లూ(Camel Flu Virus) అనే వైరస్ కలవరం సృష్టిస్తుందన్నారు. వరల్డ్కప్ను వీక్షించడానికి వచ్చినవారిలో కొంతమంది అభిమానులు క్యామెల్ ప్లూ వైరస్తో భాదపడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. క్యామెల్ ప్లూ వైరస్ అనేది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS) వ్యాధితో బాధపడేలా చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఇక క్యామెల్ ప్లూ వైరస్ కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమని.. ఈ వైరస్ను తొలుత 2012లో సౌదీ అరేబియాలో గుర్తించినట్లు వైద్య నిపుణులు స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా దాటికి ప్రపంచంలోని దేశాలన్ని లాక్డౌన్ విధించుకున్నాయి. ఇప్పటికే ఆ మహమ్మారి వదలడం లేదు. మెర్స్ వ్యాధి లక్షణాలు కరోనా లక్షణాలుగానే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, శ్వాసకోస ఇబ్బంది లాంటి సహజ లక్షణాలతోనే వ్యాధి ప్రారంభమవుతుంది. నుమోనియా లక్షణాలు కూడా దీనిలో అంతర్భాగం. ఈ వ్యాధికి గురైన వారు రోజురోజుకు మరింత వీక్గా మారిపోతుంటారు. విరేచనాలు, గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతుంటారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు హెచ్చరించారు. ఇక క్యామెల్ ప్లూ వైరస్ ద్వారా సంక్రమించే మెర్స్ వ్యాధితో మరణాల రేటు 35 శాతం ఉందని హెచ్చరించారు. సాధారణంగా అరబ్ దేశాల్లో ఒంటెలతో అక్కడి జనజీవనం ముడిపడి ఉంటుంది. క్యామెల్ ప్లూ.. పేరులోనే ఒంటె పేరు కనిపిస్తుండడంతో ఈ వైరస్ ఒంటెల ద్వారా సంక్రమిస్తున్నట్లు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యామెల్ రైడ్స్.. సఫారీ ఖతర్ ప్రజలకు జీవనాధారంగా ఉంది. అక్కడికే వచ్చే పర్యాటకులు క్యామెల్ రైడ్స్.. సఫారీ చేస్తుంటారు. క్యామెల్ ప్లూ వైరస్ కారణంగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ చూడడానికి వచ్చే ఫుట్బాల్ అభిమానులు ఒంటెలను నేరుగా తాకకూడదని ఇంతకముందే హెచ్చరించారు. ఇది తెలియని కొంత మంది అభిమానులు ఒంటెలను ముట్టుకోవడం.. వాటిపై సఫారీ చేయడం వల్ల క్యామెల్ ప్లూ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. క్యామెల్ ప్లు అనేది జంతువుల నుంచి జంతువులకు.. జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అది నేరుగా లేదా ఇన్డైరెక్ట్గా వైరస్ అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఇక ఫిఫా వరల్డ్కప్ 2022ను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో క్యామెల్ ప్లూ వైరస్ బాధితులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం తమను కలవరపెడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి: FIFA WC: నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ ఎక్కడ? మెక్సికోపై గెలుపు.. షర్ట్ విప్పి రచ్చ చేసిన మెస్సీ -
FIFA WC: నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ ఎక్కడ?
ఫుట్బాల్లో ప్రతీ జట్టుకు కొందరు వీరాభిమానులు ఉంటారు. అందునా ఫిఫా వరల్డ్కప్లో విశ్వవిజేతగా అవతరించిన జట్లపై అభిమానం అయితే మరీ ఎక్కువ. మరి అలాంటిది నాలుగుసార్లు విశ్వ విజేత అయిన ఇటలీ ఈసారి ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్కు ఎందుకు దూరమైందని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. ఒకప్పుడు ఫుట్బాల్లో దేదీప్యమానంగా వెలిగిన ఇటలీ ఇప్పుడు కనీసం అర్హత సాధించేందుకే నానా కష్టాలు పడుతోంది. ఫిఫా వరల్డ్కప్లో ఇటలీది ప్రత్యేక ప్రస్థానం. నాలుగుసార్లు జగజ్జేతగా అవతరించిన ఘనత ఇటలీ జట్టుకు ఉంది. 18 సార్లు ఫిఫా వరల్డ్కప్స్ ఆడిన ఇటలీ.. 1934. 1938, 1982, 2006లో చాంపియన్స్గా అవతరించింది. అలాంటి ఇటలీ ఇప్పుడు ఫిఫా వరల్డ్కప్కు క్వాలిఫై కూడా కాలేకపోయింది. ఇక ప్రపంచకప్లో ఇటలీ కనిపించకపోవడం వరుసగా ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్కు అది ఎందుకు అర్హత సాధించలేకపోయిందో ఇప్పుడు చూద్దాం. ►యూఈఎఫ్ఏ ప్రపంచకప్ క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-సిలో స్విట్జర్లాండ్, నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లిథువేనియాతో కలిసి డ్రా చేసుకుంది. నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రపంచకప్ కప్కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలం కావడంతో కోచ్ రాబర్టో మాన్సినీ, జట్టుపై ఒత్తిడి విపరీతంగా ఉంది. ►ఇక గతేడాది జరిగిన యూరోపియన్ చాంపియన్షిప్ నుంచి విరామం తీసుకోవడానికి ముందు నార్తరన్ ఐర్లాండ్, బల్గేరియా, లుథువేనియాతో జరిగిన మ్యాచుల్లో వరుస విజయాలు సాధించింది. టోర్నమెంటులో విజయం సాధించాక వరుసగా బల్గేరియా, స్విట్జర్లాండ్తో మ్యాచ్లను డ్రా చేసుకుంది. అంతకుముందు స్వదేశంలో లుథువేనియాతో జరిగిన మ్యాచ్లో 5-0తో విజయం సాధించింది. 2006 ఫిఫా వరల్డ్కప్ ►దీంతో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అర్హత సాధించినట్టుగా కనిపించింది. అయితే, ఆ తర్వాత స్విట్జర్లాండ్తో జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా కావడంతో చివరి రౌండ్కు ముందు ఇరు జట్లు సమాన పాయింట్లతో నిలిచాయి. ►యూరో 2020 విజయం తర్వాత నాలుగు నెలలకు నార్తరన్ ఐర్లాండ్-ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రా అయింది. అదే సమయంలో బల్గేరియాతో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ విజయం సాధించడంతో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ గ్రూప్లో స్విట్జర్లాండ్ అగ్రస్థానానికి చేరుకుంది. 1982 ఫిఫా వరల్డ్కప్ ఇటలీ ప్రపంచకప్ ప్లే ఆఫ్స్ ఆశలు ఎలా అడుగంటాయి? ►నిర్ణయాత్మక ప్లే ఆఫ్ టైలో పోర్చుగల్తో తలపడాల్సిన ఇటలీ.. స్వదేశంలో నార్త్ మాసడోనియాతో జరిగిన మ్యాచ్లో 1-0తో ఓటమి పాలు కావడంతో ఫైనల్స్ అవకాశాలు కోల్పోవడంతో 2022 వరల్డ్కప్కు కూడా దూరమైంది. ►నార్తరన్ మాసడోనియా ఫైనల్కు చేరుకుంది. అక్కడ ఆ జట్టును 2-0తో ఓడించిన పోర్చుగల్ ప్రపంచకప్లో చోటు దక్కించుకుంది మరి 2018 ప్రపంచకప్కు ఎందుకు క్వాలిఫై కాలేదు? 2018 ప్రపంచకప్ కోసం జరిగిన క్వాలిపికేషన్ రౌండ్ గ్రూప్-జిలో ఇటలీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 2017లో స్వదేశంలో స్వీడన్తో జరిగిన మ్యాచ్ 0-0తో డ్రా కావడంతో 60 సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రపంచకప్కు అర్హత సాధించడంలో ఇటలీ విఫలమైంది. 1938 ఫిఫా వరల్డ్కప్ చదవండి: మారడోనా సరసన మెస్సీ.. కళ్లు చెదిరే గోల్ చూడాల్సిందే ఒక ఫుట్బాల్ ఆటగాడి కోసం ఇంతలా వెతికారా? -
మెస్సీ గురి అదిరింది.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్ ఆశలు సజీవం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా తన ప్రి క్వార్టర్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో అర్జెంటీనా జూలు విదిల్చింది. గ్రూప్-సిలో భాగంగా శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచ్లో 2-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. అయితే రెండో అర్థభాగంలో మాత్రం అర్జెంటీనా మెక్సికోపై అటాకింగ్ గేమ్ ఆడి ఫలితాలను సాధించింది. ముందు ఆట 64వ నిమిషంలో లియోనల్ మెస్సీ జట్టుకు తొలి గోల్ అందించగా.. ఆ తర్వాత ఆట 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండేజ్ రెండో గోల్ కొట్టాడు. ఇక మెస్సీకి ఈ ప్రపంచకప్లో ఇది రెండో గోల్ కావడం విశేషం. సౌదీ అరేబియాతో మ్యాచ్లోనూ మెస్సీ ఫెనాల్టీని గోల్గా మలిచిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికి మెక్సికోపై విజయంతో అర్జెంటీనా ప్రిక్వార్టర్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. Cometh the ⌛ Cometh the 🐐 💯 ▶ Relive Messi's heroics against #ElTri that kept @Argentina in the #FIFAWorldCup 🙌 Keep watching the #WorldsGreatestShow, only on #JioCinema & @Sports18 📲📺#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/KQHjSrSDTY — JioCinema (@JioCinema) November 27, 2022