resigned
-
పాక్ ఎఫెక్ట్..? ఐసీసీ సీఈవో అలార్డీస్ రాజీనామా
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ ముందర అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో సీఈవో జెఫ్ అలార్డీస్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇందుకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ సన్నద్ధత సరిగా లేకపోవడం గురించి స్పష్టంగా వివరించడలేకపోవడం కూడా అలార్డీస్ రాజీనామాకు ఒక కారణమని ఐసీసీ సభ్యుడొకరు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్లో కాకుండా.. దుబాయ్ వేదికగా మ్యాచ్లు ఆడనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 57 ఏళ్ల అలార్డీస్ 2012లో జనరల్ మేనేజర్గా ఐసీసీలో చేరాడు. 2021 నవంబరులో ఐసీసీ సీఈవోగా నియమితుడయ్యారు. మరోవైపు ఆయన తప్పుకోవడానికి గల కారణాలు ఐసీసీ పేర్కొనలేదు. అయితే సీఈవోగా అలార్డీస్ అంకితభావంతో పనిచేశాడని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. తదుపరి సీఈవో ఎంపిక ప్రక్రియను ఐసీసీ ప్రారంభించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్టు పాక్లో కరాచీ, రావల్పిండిలో మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే అక్కడి స్టేడియాలు ఇంకా నిర్మాణంలోనే ఉన్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రతిష్టాత్మక ట్రోఫీ నిర్వహణకు పాక్ రెడీనేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు పాక్ ఎంపికపై ఐసీసీ పైనా విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో అలార్డీస్ ఇప్పుడు తప్పుకోవడం గమనార్హం.మరోవైపు.. ఐసీసీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లే, యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్, మార్కెటింగ్ & మీడియా హెడ్ క్లెయిర్ ఫర్లోంగ్లు వ్యక్తిగత కారణాలు చూపుతూ తమ తమ పదవుల నుంచి వైదొలిగారు. -
షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ రాజీనామా
షావోమి ఇండియా ప్రెసిడెంట్.. బీ మురళీకృష్ణన్ ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆరు సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన మురళీకృష్ణన్ అకడమిక్ రీసెర్చ్ వైపు వెళ్తున్న కారణంగా షావోమికి రాజీనామా చేసినట్లు సమాచారం.షియోమీ ఇండియా అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. స్వతంత్ర వ్యూహాత్మక సలహాదారుగా కొనసాగుతారని సంస్థ వెల్లడించింది. 2018లో షావోమి ఇండియాలో అడుగుపెట్టిన మురళీకృష్ణన్ 2022లో కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారు. అంతకంటే ముందు ఈయన సంస్థలో కీలక పదవులను చేపట్టారు.ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలుఇటీవలే పది సంవత్సరాల వార్షికోత్సవాన్ని షావోమి ఇండియా పూర్తి చేసుకుంది. 2023లో మను కుమార్ జైన్ కంపెనీని వీడిన తరువాత.. సంస్థ నుంచి వెళ్తున్న వారిలో మురళీకృష్ణన్ రెండో వ్యక్తి. అయితే మురళీకృష్ణన్ స్థానంలోకి ఎవరు వస్తారనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కంపెనీ సీఓఓగా సుధీన్ మాథుర్, సీఎఫ్ఓగా సమీర్ రావు, సీపీఓగా వరుణ్ మదన్, సీఎమ్ఓగా అనుజ్ శర్మ ఉన్నారు. -
డబ్బు చేతికి అందగానే.. మోపిదేవి, బీదా మస్తాన్ రాజీనామా
-
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా
-
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఏప్రిల్లో ఆయన ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజా ఖేడ్కర్ వ్యవహారానికి, మనోజ్ సోనీ రాజీనామాకు సంబంధం లేదంటూ అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని తెలియజేశాయి. మనోజ్ సోనీ పదిహేను రోజుల క్రితమే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అయితే శనివారం సాయంత్రం వరకు కూడా ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించలేదు. 2029 మే 15 వరకు మనోజ్ సోనీ పదవీకాలం ఉంది. ఆయన గతంలో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. గుజరాత్లోని డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు వరుసగా వీసీగా సేవలందించారు. 2017 జూన్ 28న యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న యూపీఎస్సీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. రహస్యం ఎందుకు?: ఖర్గే మనోజ్ సోనీ 15 రోజుల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూపీఎస్సీలో జరిగిన కుంభకోణాలకు, ఈ రాజీనామాకు మధ్య సంబంధం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మనోజ్ సోనీని తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్గా నియమించారని చెప్పారు. ఈ మేరకు ఖర్గే శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాల్లో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి?: జైరాం రమేష్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచి్చనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరి నీట్–యూజీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఛైర్మన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే.. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం. గత ఏడాది ఏప్రిల్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరిన మనోజ్ సోనీ.. మే 16, 2023న చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్గా ఆయన పనిచేశారు.ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజుల ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరీక్షతోనే ఐఏఎస్కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది.కాగా, మనోజ్ సోని రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ప్రభుత్వ ఒత్తిడితో రాజీనామాలు చేసిన నలుగురు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు
-
చంద్రబాబు బెదిరింపులతో విద్యుత్ సంస్థల డైరెక్టర్ల రాజీనామా
-
ప్రభుత్వ ఒత్తిడితో సవాంగ్ రాజీనామా
-
ఏయూ వీసీ ప్రసాద్రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా
సాక్షి, విశాఖపట్నం: ఏయూ వీసీ ప్రసాద్రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ప్రసాద్రెడ్డి, స్టీఫెన్పై టీడీపీ నేతలు నుంచి ఒత్తిడి రావడంతో వారు రాజీనామా చేశారు.నిన్న వీసీ ఛాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఓవరాక్షన్ చేశారు. ప్రసాద్రెడ్డి రాజీనామా చేయాలంటూ ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా వీసీని భయబ్రాంతులకు గురిచేసే విధంగా టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రణవ్ గోపాల్ వ్యవహరించారుగతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రసాద్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయనను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.కాగా, తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దాష్టీకాలు మొదలు
నెల్లూరు (బారకాసు): ఎన్నికలు ముగియగానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దాష్టీకాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు మేయర్ దంపతులను బెదిరించి రాజకీయ అరాచకానికి తెరతీశారు. గిరిజన మహిళ రిజర్వేషన్తో వైఎస్సార్సీపీ నుంచి మేయర్గా ఎన్నికైన పోట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్లను పార్టీ మారాలని, లేదంటే కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. నిస్సహాయ స్థితిలో ఆ గిరిజన దంపతులు వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, నేతలను టీడీపీలో చేరాలంటూ ఎన్నికలకు ముందు నుంచే శ్రీధర్రెడ్డి బెదిరింపులకు దిగారు.కొందరిపై రాజకీయంగానూ కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండటంతో మరింతగా బెదిరింపులకు దిగుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 12వ డివిజన్ నుంచి పోట్లూరి స్రవంతి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్గా గెలుపొందారు. ఈ డివిజన్ నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో స్రవంతి దంపతులు అప్పట్లో వైఎస్సార్సీపీలోనే ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులుగా కొనసాగేవారు.అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ సహకారంతో స్రవంతి మేయర్గా ఎన్నికయ్యారు. 9 నెలల క్రితం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో మేయర్ స్రవంతి దంపతులు, కొందరు కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లారు. కొద్దిరోజుల్లోనే స్రవంతి దంపతులు తిరిగి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ టిక్కెట్పై గెలుపొందారు.జరిగిందిదీ..నెల్లూరు నగరంలో దాదాపు 70 భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే తనఖా చేసిన ఆస్తులను మాన్యువల్గా కమిషనర్ ఫోర్జరీ సంతకాలతో రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం వచ్చిందంటూ ఓ న్యాయవాది నగర పాలక సంస్థ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మేయర్ భర్త జయవర్ధన్ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై కమిషనర్ విచారణకు ఆదేశించారు.గతంలో తన వెంట ఉండి, వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్న మేయర్ దంపతులను తన దారికి తెచ్చుకునేందుకు, వారిపై పెత్తనం సాగించేందుకు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఈ ‘ఫోర్జరీ’ ఫిర్యాదును ఆయుధంగా ఉపయోగించుకున్నారు. టీడీపీలో చేరితే కేసులు ఉండవని, లేదంటే జైలుకు పంపిస్తామని బెదిరించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో భయపడిన ఆ గిరిజన దంపతులు నిస్సహాయ స్థితిలో వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. -
Lok Sabha Election Results 2024: నవీన్ పట్నాయక్ రాజీనామా
భువనేశ్వర్: ఒడిశాలో బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ పరిపాలనకు తెరపడింది. 24 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నవీన్ పటా్నయక్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రఘువర్ దాస్కు సమరి్పంచారు. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేడీ పరాజయం పాలైంది. 147 స్థానాలకు గాను కేవలం 51 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏకంగా 78 సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం మార్చి 5న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు. -
‘సూపర్ సీఎం’ పాండియన్!
వి.కార్తికేయన్ పాండియన్. వయసు 49. వదులు చొక్కా, సాదాసీదా ప్యాంటు, కాళ్లకు చెప్పులు. అత్యంత నిరాడంబరమైన ఆహార్యం. కానీ ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పటా్నయక్ తర్వాత రాష్ట్రమంతటా ఆ స్థాయిలో మారుమోగుతున్న పేరు. నవీన్ వెనుక ఆయనే ప్రధాన చోదక శక్తి. అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ప్రభుత్వాధికారిగా ‘సూపర్ సీఎం’ అని, పారీ్టలో చేరాక ‘నంబర్ టూ’అని ముద్రపడ్డారు. పటా్నయక్ సలహాదారుగా, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 5టీ చైర్మన్గా కేబినెట్ హోదాలో ఉన్నారు. బీజేడీ ప్రధాన ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ మొదలుకుని రాహుల్గాంధీ దాకా పాండియన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారంటే ఒడిశా ఎన్నికలను ఆయన ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! పటా్నయక్ రాజకీయ వారసునిగా కూడా పాండియన్ పేరు మారుమోగుతోంది... పాండియన్ది తమిళనాడులోని మదురై. 2000 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఒడిశాకు చెందిన ఐఏఎస్ అధికారి సుజాత రౌత్ను పెళ్లాడారు. అలా 2002లో ఒడిశా కేడర్కు మారడం ఆయన కెరీర్లో కీలక మలుపు. ధర్మగఢ్ సబ్ కలెక్టర్గా ఒడిశాలో కెరీర్ ప్రారంభించారు. సీఎం సొంత జిల్లా మయూర్భంజ్, గంజాం కలెక్టర్గా చేశారు. 2011 నుంచి 12 ఏళ్లు పటా్నయక్ వ్యక్తిగత కార్యదర్శిగా చేశారు. ఆయనకు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఒడియా అనర్గళంగా మాట్లాడుతూ పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకూ చేరువయ్యారు. 2023లో వీఆర్ఎస్ తీసుకుని బీజేడీలో చేరారు. నాటినుంచి పార్టీ నిర్ణయాలన్నింట్లోనూ ఆయనదే కీలక పాత్ర. 2014, 2019ల్లోనూ పటా్నయక్ ఎన్నికల వ్యూహాల్లో తెరవెనుక పాత్ర పాండియన్దే. ప్రభుత్వానికి, ప్రజలకు వారధి ఒడిశాలో నవీన్ ప్రజాదరణకు మూల కారణమైన ఫ్లాగ్షిప్ కార్యక్రమాలన్నింటి వెనకా ఉన్నది పాండియనే. సాధారణంగా యంత్రాంగంపై రాజకీయ ఆధిపత్యం దేశమంతటా ఉండే సమస్య. ఒడిశా మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి వాటిపై స్పందన తెలుసుకునే దాకా అంతా ఐఏఎస్ల మయం. ఇందుకోసం పాండియన్ సారథ్యంలో ఐఏఎస్ల బృందమే పని చేసింది! ఒడిశాలో బజ్ వర్డ్గా మారిన 5టీ (బృంద కృషి, సాంకేతికత, పారదర్శకత, పరివర్తన, సమయం) సూత్రధారి కూడా పాండియనే. 2019 నుంచి అధికారులకు, ప్రాజెక్టులకు ఇదే మార్గదర్శి! దీనిలో భాగంగా నాలుగేళ్లలో ఏకంగా 460 రకాల ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోకి వచ్చాయి. హెలికాప్టర్ వివాదం.. ప్రభుత్వ వ్యవహారాలతో పాటు రాజకీయంగానూ బీజేడీలో అడుగడుగునా పాండియన్దే జోక్యం. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ఎత్తుగడల నుంచి టికెట్ల పంపిణీ దాకా అన్నింటా ఆయనదే ప్రధాన భూమిక! అధికారిగా ఉంటూ ప్రభుత్వ హెలికాప్టర్లో 30 జిల్లాల్లోనూ పాండియన్ సుడిగాలి పర్యటన చేయడం తీవ్ర వివాదం రేపింది. ఇవి బీజేడీ ర్యాలీల్లా ఉన్నాయంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. ఆలిండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది! పాండియన్ పెత్తనంపై బీజేడీలోనూ అసమ్మతి మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన సీఎం పక్కనే ఉండటమే గాక ఒక్కరే సమావేశాలూ నిర్వహించడం, మంత్రులను కూడా పక్కకు పెట్టడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అయినా పటా్నయక్ పట్టించుకోలేదు. పైగా పాండియన్ను విమర్శించినందుకు బీజేడీ ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే సౌమ్య రంజన్ను పదవి నుంచి తొలగించారు! నవీన్ వారసుడు...?! నవీన్ పూర్తిస్థాయిలో ‘ఒడియా అస్తిత్వ’ నినాదాన్ని ఎత్తుకునేలా చేసింది పాండియనే. దాంతో విపక్షాల విమర్శలకు ఆయనే లక్ష్యంగా మారారు. ‘‘పాండియన్ వల్ల ఒడియా ఉనికే ప్రమాదంలో పడింది. సమీప భవిష్యత్తులో బయటి వ్యక్తి ఒడిశా పాలకుడుగా మారే ప్రమాదముంది’’ అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ కూడా బీజేడీని ఎదుర్కోవాలంటే పాండియన్ను ఎదుర్కోవాలన్న ఆలోచనకు వచి్చంది. అందుకే ఆయన ‘బయటి వ్యక్తి’ అంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా పదేపదే విమర్శిస్తున్నారు. ‘‘ఒడియా అస్మిత (ఆత్మగౌరవం) ప్రమాదంలో పడింది. ప్రజలు దీన్ని ఎక్కువ కాలం సహించబోరు’’ అని మోదీ ఇటీవల స్థానిక ప్రచార సభలో అన్నారు. పాండియన్ మాత్రం వీటిని తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. ‘‘నవీన్ పటా్నయక్ విలువలకు నేను సహజ వారసుడిని. ఒడిశా నా కర్మభూమి. పాతికేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నా. నా భార్య, పిల్లలూ ఇక్కడివాళ్లే. ఒడిశా ప్రజలు నన్ను తమ వ్యక్తిగా ప్రేమిస్తున్నారు’’ అంటారు! – సాక్షి, న్యూఢిల్లీ -
కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్బై చెప్పిన గౌరవ్
కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ వల్లభ్ పార్టీకి రాజీనామా చేశారు. తాను సనాతనానికి వ్యతిరేక నినాదాలు చేయలేనని, ఇకపై పార్టీలో కొనసాగలేనని ప్రకటించారు. గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తాను పంపిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిలో ‘నేడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మార్గంలో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నేను సనాతన వ్యతిరేక నినాదాలు చేయలేను. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. నేను కాంగ్రెస్లో చేరినప్పుడు దేశంలోనే ఘన చరిత్ర కలిగిన పార్టీ అని నమ్మాను. యువకులకు, మేధావుల ఆలోచనలకు విలువ ఇస్తారని భావించాను. అయోధ్యలోని నూతన రామాలయం విషయంలో కాంగ్రెస్ వైఖరికి నేను కలత చెందాను. నేను పుట్టుకతో హిందువును. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. ఇండియా కూటమితో సంబంధం కలిగిన పలువురు నేతలు సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడటం నాకు నచ్చలేదని’ ఆ లేఖలో గౌరవ్ వల్లభ్ పేర్కొన్నారు. గౌరవ్ వల్లభ్ 2019 లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్లోని జంషెడ్పూర్ తూర్పు నుంచి తొలిసారి పోటీ చేశారు. గౌరవ్ విద్యావంతునిగా పేరొందారు. జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్లో అధ్యాపకునిగా పనిచేశారు. క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్లో డాక్టరేట్ అందుకున్నారు. విద్యావేత్తల కుటుంబం నుండి వచ్చిన గౌరవ్ వల్లభ్ 2023లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. कांग्रेस पार्टी आज जिस प्रकार से दिशाहीन होकर आगे बढ़ रही है,उसमें मैं ख़ुद को सहज महसूस नहीं कर पा रहा.मैं ना तो सनातन विरोधी नारे लगा सकता हूं और ना ही सुबह-शाम देश के वेल्थ क्रिएटर्स को गाली दे सकता.इसलिए मैं कांग्रेस पार्टी के सभी पदों व प्राथमिक सदस्यता से इस्तीफ़ा दे रहाहूं pic.twitter.com/Xp9nFO80I6 — Prof. Gourav Vallabh (@GouravVallabh) April 4, 2024 -
జనసేనకు మాజీ మేయర్ సరోజ రాజీనామా
సాక్షి, కాకినాడ: జనసేనకు మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా చేశారు. పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారంటూ ఆమె మండిపడ్డారు. ‘‘జనసేన అనేది రెసిడెన్షియల్ కాలేజీ లాంటిందని.. ఒక కార్పోరేట్ ఆఫీస్లా నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘జనసేనలో మహిళలకు విలువ లేదు. నాదెండ్ల మనోహర్ టీడీపీకి కోవర్ట్. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి వంటి నేతలతో మేము చాలా ఇబ్బందిపడ్డాం. బీసీలకు కూడా జనసేనలో విలువ లేదు. జనసేనలో బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలని సరోజ అన్నారు. ఇదీ చదవండి: రూల్స్ ఫర్ ఫూల్స్.. రాజకీయాల్లో చంద్రబాబు నైజమిదే..! -
బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి రాజీనామా
సాక్షి ప్రతినిధి నల్లగొండ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి శనివారం ఆ పారీ్టకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు పంపించారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించిన రోజే ఆయన రాజీనామా చేయ డం గమనార్హం. రాజీనామా లేఖలో ఈనెల 18న రాజీనామా చేసినట్లు పేర్కొనగా, చిన్నపరెడ్డి ఈ రోజే రాజీనామా చేశారని, టైపింగ్ ఎర్రర్ వల్ల అలా వచ్చిందని ఆయన అనుచరులు పేర్కొన్నారు. నల్ల గొండ ఎంపీ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని బరిలో నిల పాలని మొదట్లో బీఆర్ఎస్ భావించింది. అయితే ఆయన బీజేపీకి టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరగడంతో చిన్నపరెడ్డి పేరును పక్కన పెట్టింది. కానీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, టికెట్ తనకే వస్తుందని చిన్నపరెడ్డి రెండ్రోజుల కిందట చెప్పారు. బీఆర్ఎస్ అధిష్టానం అనూహ్యంగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. బీజేపీ అధిష్టానం హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించింది. 15 రోజులు గడవక ముందే ఆయన్ను మార్చి చిన్నపరెడ్డికి టికెట్ ఇస్తారన్న చర్చ కూడా సాగుతోంది. కంచర్ల కృష్ణారెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
జేఎంఎంకు సీతా సోరెన్ రాజీనామా!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు. ఒడిశాలోని మయూర్భంజ్లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు. -
బీఆర్ఎస్కు పెద్దిరెడ్డి రాజీనామా
హుజూరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రెండుసార్లు మంత్రిగా, కార్మిక సంఘ నేతగా సేవలందించిన ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గురువారం లేఖ రాశారు. 2021 జూలై 27న తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ తనను పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడం, ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన కదనభేరి సభకు ఆహ్వానించనందుకు మనస్తాపంతో పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులు, ప్రజాభీష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పెద్దిరెడ్డి వెల్లడించారు. -
ఈసీ గోయల్ రాజీనామా
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం ఆయన రాజీనామా చేయడం, ఆ వెంటనే దాన్ని రాష్ట్రపతి ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. గోయల్ పదవీకాలం 2027 డిసెంబర్ దాకా ఉంది. పైగా 2025 ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ రిటైరయ్యాక గోయలే సీఈసీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడున్నరేళ్ల ముందే ఆయన రాజీనామా చేయడానికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే గత ఫిబ్రవరిలోనే రిటైరయ్యారు. ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘంలో అప్పటినుంచీ ఒక స్థానం ఖాళీగానే ఉంది. ఇప్పుడు గోయల్ కూడా తప్పుకోవడంతో కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లు రాజీనామా చేయడం ఇది తొలిసారేమీ కాదు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన పలు కేసుల్లో ఈసీ తీసుకున్న నిర్ణయాలపై నాటి ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తీవ్ర అసమ్మతి తెలిపారు. అనంతరం 2020 ఆగస్టులో రాజీనామా చేశారు. తొలుత ఒక్కరే... ఎన్నికల సంఘంలో తొలుత సీఈసీ ఒక్కరే ఉండేవారు. ఆయన అపరిమిత అధికారాలు చలాయిస్తున్నారన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ 1989లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పట్నుంచి ఈసీ తీసుకునే నిర్ణయాల్లో మెజారిటీ అభిప్రాయమే చెల్లుబాటవుతూ వస్తోంది. గోయల్ నియామకమూ వివాదమే... అరుణ్ గోయల్ 1985 పంజాబ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఆయన నియామకమూ వివాదాస్పదంగానే జరిగింది. 2022 నవంబర్ 18న గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా అదే రోజు కేంద్రం ఆమోదించింది. ఆ మర్నాడే ఈసీగా నియమించింది. దీన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇదేం నియామకమంటూ విచారణ సందర్భంగా కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ, ఈసీ నియామక ఫైళ్లు మెరుపు వేగంతో కదలడం, మొత్తం ప్రక్రియ 24 గంటల్లోపే పూర్తవడంపై విస్మయం వెలిబుచి్చంది. అంత వేగంగా ఎందుకు నియమించాల్సి వచి్చందని కేంద్రాన్ని నిలదీసింది కూడా. ఇప్పుడేం జరగనుంది...? ఈసీ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు అనుసరిస్తున్న 1991 నాటి చట్టానికి కీలక మార్పుచేర్పులు చేస్తూ కేంద్రంలోని మోదీ సర్కారు ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల (నియామకం, పదవీ నిబంధనలు, పదవీకాలం) చట్టం తెచ్చింది. దీని ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవికి కేంద్ర న్యాయ మంత్రి సారథ్యంలోని సెర్చ్ కమిటీ ముందుగా ఐదు పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తుంది. వారిలోంచి ఒకరిని ప్రధాని సారథ్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీలో ప్రధానితో పాటు ఒక కేంద్ర మంత్రి, లోక్సభలో విపక్ష నేత సభ్యులుగా ఉంటారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ప్రధాని తనకు అనుకూలమైన వారినే ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునేందుకు ఇది వీలు కలి్పస్తోందంటూ దుయ్యబట్టాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీలో రెండు ఖాళీల భర్తీ అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త చట్టం ప్రకారమే ముందుకు వెళ్లవచ్చన్న అభిప్రాయాలు విని్పస్తున్నాయి. -
Lok Sabha elections 2024: బీజేపీలో చేరిన గంగోపాధ్యాయ్
కోల్కతా: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. కోల్కతాలోని సాల్ట్లేక్ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద గంగోపాధ్యాయ్కు ఘన స్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆయనకు బీజేపీ జెండా అందజేశారు. రాష్ట్రంలో టీఎంసీ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని అభిజిత్ ఈ సందర్భంగా అన్నారు. -
కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ..?
కలకత్తా: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారం(మార్చ్5) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఈయన వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. తాను రాజీమా చేయనున్నట్లు గంగోపాధ్యాయ్ సోమవారమే స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కొందరు న్యాయవాదులు, కక్షిదారులు ఆయనను కోరారు. అయినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇటీవల గంగోపాధ్యాయ ఇచ్చిన కొన్ని తీర్పులు పశ్చిమబెంగాల్లో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అయితే రాజీనామా తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారా అన్న ప్రశ్నకు మాత్రం జస్టిస్ గంగోపాధ్యాయ్ స్పష్టమైన సమాధానమివ్వలేదు. 2020 జులై30న కలకత్తా హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా గంగోపాధ్యాయ్ పదోన్నతి పొందారు. ఇదీ చదవండి.. లోక్సభ ఎన్నికలు.. సీఈసీ ప్రెస్మీట్ -
రాజ్యసభ సభ్యత్వానికి బీజేపీ చీఫ్ రాజీనామా
సాక్షి, ఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(63) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేపీ నడ్డా.. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన హిమాచల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం లభించింది. బీహార్లో పుట్టి పెరిగిన జగత్ ప్రకాష్(జేపీ) నడ్డా.. నరేంద్ర మోదీకి సహచరుడు. లాయర్గా కెరీర్ను ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన పూర్వ మూలాలు మాత్రం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అందుకే 1993 నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. నెగ్గుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆ రాష్ట్రానికి పలు శాఖల మంత్రిగానూ పని చేశారు. 2012లో హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ.. పెద్దల సభకు వెళ్లాల్సి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. .. 2014 నుంచి 2019 నడుమ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. 2019 జూన్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. 2020, జనవరి 20వ తేదీ నుంచి ఆయన బీజేపీ జాతీయాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 2022లోనే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ.. బీజేపీ అధిష్టానం కాలపరిమితిని పొడగించింది. గుజరాత్ నుంచి నడ్డాతో పాటు గోవింద్ భాయ్ డోలాకియా, జస్వంత్ సింగ్ పర్మార్, మయాంక్ నాయక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
పాలమూరు ‘లోకల్’ పోరుకు నేడు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. 2022 జనవరిలో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరేళ్ల పదవీ కాలం 2028 జనవరిలో ముగియాల్సి ఉంది. అయితే గత ఏడాది చివర్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు నాలుగేళ్ల కాలానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఉండగా, మరో స్థానానికి కూచుకుళ్ల దామోదర్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్దే ఆధిపత్యం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటర్లుగా పరిగణించబడతారు. జిల్లాలో మొత్తం 1,450 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉండగా, వీరిలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు కొత్త ఆశావహులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ అధినేత కేసీఆర్ను కోరుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో జరుగుతున్న ఎన్నికను అధికార కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. -
పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచారు. ‘‘వ్యక్తిగత కారణాలతోపాటు కొన్ని ఇతర బాధ్యతలను నెరవేర్చాల్సిన దృష్ట్యా పంజాబ్ గవర్నర్ పదవితోపాటు, చండీగఢ్ పరిపాలనాధికారి బాధ్యతలకు రాజీనామా సమరి్పస్తున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారిగా 2021లో బన్వారీలాల్ బాధ్యతలు చేపట్టారు. -
Iswaran: బాబు సింగపూర్ పార్ట్నర్ రాజీనామా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడిగా, సింగపూర్ పార్ట్నర్గా పేరొందిన సుబ్రమణియం ఈశ్వరన్.. బాబు బాటలోనే పయనిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంట్ సభ్యత్వానికి, అలాగే పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి (PAP)కి సైతం రాజీనామా సమర్పించారు. అవినీతి కేసులో సింగపూర్ మంత్రి పదవికి ఈశ్వరన్ రాజీనామా చేసి.. జైలుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(CPIB) ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కిందటి ఏడాది జులై 11వ తేదీన ఆయన్ని అరెస్ట్ కూడా చేసింది(వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చారు). ఇక దర్యాప్తు నేపథ్యంలో.. సింగపూర్ ప్రధాని, ఈశ్వరన్ను సెలవుల మీద పక్కకు పెట్టారు. మరోవైపు గతేదాడి సెప్టెంబర్లో ఈ కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో సింగపూర్ పార్లమెంట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై సస్పెన్షన్వేటు వేసింది. తాజాగా నేరారోపణలు నమోదు కావడం, ఆ వెంటనే సీపీఐబీ నుంచి నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరన్ రాజీనామాను ధృవీకరిస్తూ గురువారం సింగపూర్ ప్రధాని కార్యాలయం ఆ దేశ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: చిక్కుల్లో ఈశ్వరన్.. కేసు నేపథ్యం ఇదే! భారీ అక్రమ లావాదేవీలు నడిపారన్న అభియోగాలతో ఈశ్వరన్పై గురువారం న్యాయస్థానంలో 27 రకాల నేరారోపణల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి దర్యాప్తు సంస్థ సీపీఐబీ కూడా నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. 2025లో సింగపూర్లో ఎన్నికలు ఉండడంతో అక్కడి ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణిస్తూ వస్తోంది. తాజా రాజీనామా పరిణామంతో.. గత ఐదు నెలలుగా ఆయన మంత్రి పదవితో పాటు ఎంపీ హోదాలో అందుకున్న జీతభత్యాల్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుతో లింకేంటీ? చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించారు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించారు. Delighted to have met Second Minister (Trade & Industry) S. Iswaran on opportunities in AP. pic.twitter.com/s8kf19f00g — N Chandrababu Naidu (@ncbn) November 12, 2014 అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్బ్రిడ్జి–సెంబ్కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న నాడు సింగపూర్ వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అమరావతి పేరుతో అంతర్జాతీయ నాటకం.. రాష్ట్ర విభజన సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని సింగపూర్ ప్రభుత్వ సహకారంతో దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నూతన నగరాన్ని నిర్మిస్తానంటూ నమ్మబలికారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై వందిమాగధులకు లీకులిచ్చి భారీ ఎత్తున భూములను కాజేశారు. ఆ తర్వాత తాపీగా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ను ముందు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ అందరినీ మభ్యపుచ్చారు. ఈ క్రమంలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ముసుగులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిపి రూ.లక్ష కోట్లు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారు. సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం అన్నట్లుగా.. రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలు అసెండాస్–సిన్బ్రిడ్జి–సెంబ్కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ ఈశ్వరన్తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టులో పెట్టుబడి సహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కలిసి 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా గ్రాస్ టర్నోవర్లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని నాటి చంద్రబాబు కేబినెట్ అంగీకరించింది. ఈ ముసుగులో రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి స్కెచ్ వేశారు. అక్రమాల ఒప్పందం రద్దు.. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో అసెండాస్–సిన్బ్రిడ్జి–సెంబ్కార్ప్ కన్సార్టియంతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ అక్రమాల ఒప్పందం రద్దు అయింది. బాబు తరహా మనిషే! సుబ్రమణియం ఈశ్వరన్ వ్యవహార శైలిపై మొదటి నుంచే విమర్శలు ఉన్నాయి. ఈశ్వరన్ 1997లో తొలిసారి అక్కడి ఎన్నికల్లో నెగ్గారు. ఆపై 2021లో రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యలో ప్రధాని కార్యాలయంతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. అయితే.. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. మన దగ్గర సీఎంగా చంద్రబాబు చేసిన అవినీతి పుట్ట ఎలాగైతే సీఐడీ దర్యాప్తు ద్వారా బద్ధలయ్యిందో.. సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సింగపూర్ దర్యాప్తు సంస్థ సీపీఐబీ నిర్ధారించింది. ఇక ఈ కేసులో ఈశ్వరన్కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్ బెంగ్ సెంగ్ సైతం సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో హూంగ్ బెంగ్ను సైతం దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ చేసి విచారించింది. -
టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్రెడ్డి రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటివరకు ఆమోదించలేదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. జనార్దన్రెడ్డి సోమవారం రాజీనామా సమర్పించగా, పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్కు దానిని ఆన్లైన్ ద్వారా పంపినట్టు అధికారులు తెలిపారు. బుధవారం గవర్నర్ హైదరాబాద్కు తిరిగి రానున్నారని, రాజీనామాను ఆమోదించే విషయంలో అప్పుడే నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం చోటుచేసుకోవడంతో రాతపరీక్షలు రద్దు అయ్యాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు జరిపిన దర్యాప్తుపట్ల గవర్నర్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. -
బీజేపీకి విజయశాంతి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి పంపారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారు. తాజాగా విజయశాంతి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం వినిపిస్తుండగా.. ఇప్పుడు రాజీనామా పరిణామంతో అది ఖాయంగానే కనిపిస్తోంది. ఇదీ చదవండి: నైంటీస్లోనే బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా రాములమ్మ -
జస్టిస్ రాకేష్ కుమార్ రాజీనామా
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) జ్యూడిషియల్ సభ్యుడు జస్టిస్ రాకేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రిబ్యునల్ పదవిలో భాగంగా జస్టిస్ రాకేష్కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు గత వారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్, కేంద్ర న్యాయశాఖకు అందజేశారు. ఫినోలెక్స్ కేబుల్ కేసులో కోర్టు ధిక్కారణ చర్యలు ఎదుర్కొంటున్నారు జస్టిస్ రాకేష్కుమార్. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) ఫలితాలపై యధాతథా సిత్థిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, ఎన్సీఎల్ఏటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై సీజేఐ జస్టిస్ డీవీ చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ రాకేష్ కుమార్తోపాటు ఎన్సీఎల్ఏటీ టెక్నికల్ మెంబర్ అలోక్ శ్రీవాస్తపై కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశాలిచ్చారు. కాగా జస్టిస్ రాకేష్ కుమార్ గంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఏం జరిగింది? ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన కేసులో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ అలోక్ శ్రీవాస్తవలతో కూడిన బెంచ్ ట్రిబ్యునల్ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీ ఓనర్షిప్కు సంబంధించి ఇద్దరు సోదరులు ప్రకాష్ ఛాబ్రియా, దీపక్ ఛాబ్రియా మధ్య వివాదం నెలకొనడంతో విషయం ట్రిబ్యునల్కు చేరింది. కేసును విచారించిన జస్టిస్ రాకేష్కుమార్.. తాము తీర్పు వెలువరించేంతవరకు కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఫలితాలపై స్టే విధించింది. సుప్రీంకోర్టులో ఏం జరిగింది? AGMలో ఫలితాలను వెల్లడించొద్దంటూ ట్రిబ్యునల్లో ఇచ్చిన తీర్పును ఫినోలెక్స్ కేబుల్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను సెప్టెంబర్ 20, 2023న తొలగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్.. ట్రిబ్యునల్ ముందు ఉంచగా.. వాటిని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టుకు తెలిపారు పిటిషనర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్ను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టినట్టు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు ధిక్కరణ తేలడంతో రాజీనామా సుప్రీంకోర్టులో తాము చేసింది కోర్టు ధిక్కరణ అని తేలడంతో జస్టిస్ రాకేష్కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన లాయర్ PS పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదని, అయితే కోర్టు ధిక్కరణ అని తేలినందున తన పదవి నుంచి జస్టిస్ రాకేష్కుమార్ తప్పుకున్నారని పట్వాలియా తెలిపారు. తనపై వచ్చిన అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఇప్పటికే రాజీనామా ఇచ్చినందున ఈ కేసును మూసివేయాలని పట్వాలియా సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఏం తేల్చింది? జస్టిస్ రాకేష్ తరపున పట్వాలియా చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా స్వీకరించారు. "NCLAT పదవికి, ఆర్థిక శాఖ లా సెక్రటరీ పదవికి జస్టిస్ రాకేష్కుమార్ రాజీనామా చేసినట్టు ఆయన తరపు లాయర్ పట్వాలియా ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నం జరిగిందని మేం నమ్ముతున్నాం. అక్టోబర్ 13న NCLATలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను చూశాం. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తన ఆదేశాలను మార్చేందుకు ట్రిబ్యునల్ ఆసక్తి చూపలేదు. అయితే ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నాం. " అని బెంచ్ తెలిపింది. జస్టిస్ రాకేష్కుమార్ గతమేంటీ? జస్టిస్ రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన సమయంలో అమరావతి రాజధాని అంశంపై ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో పలు వివాదస్పద వ్యాఖ్యలు జోడించడంమే కాకుండా.. రాజ్యాంగ సంక్షోభం అంటూ కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్ రాకేష్కుమార్ ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు సరికావని సూచించింది. -
కాంగ్రెస్కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్లో చేరనున్నారని సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డిని మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5:00 గంటలకు నాగం నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్రెడ్డికి నిరాశ ఎదురవ్వడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి తనయుడు రాజేశ్రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని నాగం జనార్దన్రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ను నాశనం చేశారన్నారు. ఇదీ చదవండి: వివేక్తో రేవంత్రెడ్డి భేటీ -
బీజేపీకి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రాజీనామా
భైంసాటౌన్: నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పి.రమాదేవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనను కాదని, గత ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచిన రామారావుపటేల్కు టికెట్ కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భైంసాలోని తన నివాసంలో శుక్రవారం పార్టీ మండలాధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశమై ఆమె రాజీనామాను ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ... అభ్యర్థుల జాబితా ప్రకటనకు గంట ముందు వరకు ఉన్న పేరును తొలగించి, వేరేవారికి ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ముధోల్ బీఆర్ఎస్ ఇన్చార్జి పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి, బీఆర్ఎస్ శుక్రవారం రాత్రి రమాదేవిని ఆమె నివాసంలో కలిశారు. పార్టీలోకి రావాలని ఆహా్వనించగా ఆమె అందుకు అంగీకరించారు. -
బాధతో పార్టీని వీడుతున్నా..
సాక్షి, మేడ్చల్ జిల్లా:/అల్వాల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. అల్వాల్లోని ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననీ, మల్కాజిగిరిలో పార్టీ కోసం పని చేస్తూ ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుతో విభేదించిన సందర్భంగా పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. బీఆర్ఎస్లో తన కొడుకుకు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి కాంగ్రెస్లో చేరారని ఈ క్రమంలో తనకు మల్కాజిగిరిలో పార్టీ టికెట్ ఇవ్వలేమన్న సంకేతాలు రావడం బాధించాయన్నారు. బీసీలకు అన్ని పార్టీలకన్నా అధిక సీట్లు ఇస్తామని ప్రకటించిన నాయకులు తన మాదిరిగా వెనుకబడిన తరగతి నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం చూస్తుంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్రెడ్డికి దెబ్బే.. శ్రీధర్ రాజీనామాతో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లయింది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉండటం గమనార్హం. సొంత నియోజకవర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని కాపాడుకోలేని రేవంత్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా అధికారంలోకి తీసుకు రాగలరన్న ప్రశ్నలు స్థానికంగా పార్టీ శ్రేణుల నుంచి తలెత్తుతున్నాయి. కాగా శ్రీధర్ బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. -
బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా
కల్వకుర్తి/ఆమనగల్లు/సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ పారీ్టకి రాజీనామా చేశారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీసింగ్ కూడా బీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. ఈ మేరకు వీరు తమ రాజీనామా లేఖలను సీఎం కేసీఆర్కు పంపించినట్లు సమాచారం. ఆదివారం హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో ఆయన నివాసంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీసింగ్ భేటీ అయ్యారు. కల్వకుర్తిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారం¿ోత్సవానికి మంత్రి హరీశ్రావు వచ్చిన రోజే వీరు పార్టీని వీడటం చర్చనీయాంశమైంది. ప్రజల అభీష్టం మేరకే పార్టీని వీడుతున్నామని వీరు చెప్పారు. నాలుగేళ్లు ఎమ్మెల్సీ పదవీకాలం ఉన్నా ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు, ఈ ప్రాంతానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని కసిరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనకు రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, అందుకు వారికి కృతజ్ఞతలు అని తెలిపారు. కాగా ఆయన ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ పార్టీ తరఫున కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. ఫలించని బుజ్జగింపులు ఇదిలా ఉండగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని బుజ్జగించడానికి బీఆర్ఎస్ ముఖ్యనేతలు పలుదఫాలు మంతనాలు జరిపారు. మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ రెండుసార్లు ప్రగతి భవన్లో మంతనాలు జరిపినా బుజ్జగింపులు ఫలించలేదని చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఆయన బీఆర్ఎస్ను వీడినట్లు సమాచారం. ఆదివారం రేవంత్రెడ్డితో జరిగిన భేటీలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం నెరవేరలేదు: కసిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా లక్ష్యం నెరవేరలేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, ఇటీవల తుక్కుగూడ సభలో ఆమె ప్రకటించిన ఆరు గ్యారంటీలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకం తనకు కలిగిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సోనియా పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆ లేఖలో తెలిపిన కసిరెడ్డి.. బీఆర్ఎస్లో తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపించారు. ఆదివారం ఉదయం.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కలిసిన కసిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో పేదలకు మేలు జరుగుతుందని భావిస్తున్నానని, అందుకే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. -
ఉదయ్ కొటక్ రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, ప్రమోటర్ అయిన ఉదయ్ కొటక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆయన బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. సెపె్టంబర్ 1 నుంచి ఆయన రాజీనామా అమలులోకి వచి్చందని బ్యాంక్ శనివారం ప్రకటించింది. బ్యాంక్లో ఆయనకు 26 శాతం వాటా ఉంది. ఇక నుంచి నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉదయ్ కొటక్ వ్యవహరిస్తారని కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరైనా 15 ఏళ్లు మాత్రమే ఆ పదవిలో పనిచేయాల్సి ఉంటుంది. గడువు కంటే 3 నెలల ముందే ఉదయ్ రాజీనామా చేయడం గమనార్హం. -
బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్
-
తెలంగాణ బీజేపీకి షాక్.. మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా
సాక్షి, వికారాబాద్: జిల్లాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో పనిచేసే వారిని ప్రోత్సహించడం లేదని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్లోకి చేరనున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో పనిచేసిన చంద్రశేఖర్.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. చదవండి: 17 తర్వాత ఎప్పుడైనా.. బీఆర్ఎస్ జంబో లిస్ట్ -
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కు జగన్నాథన్ గుడ్బై
చెన్నై: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్కు వెంకటస్వామి జగన్నాథన్ రాజీనామా ప్రకటించారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. 78 ఏళ్ల జగన్నాథన్ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. తక్షణం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జూన్ 10న జగన్నాథన్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. జగన్నాథన్ను బీమా రంగం వెటరన్గా చెబుతారు. ప్రభుత్వరంగంలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్కు చైర్మన్, ఎండీగా పని చేసిన ఆయన, పదవీ విరమణ తర్వాత.. దుబాయికి చెందిన ఈటీఏ గ్రూప్ మద్దతుతో ప్రైవేటు రంగంలో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ను స్థాపించారు. కొత్త బాట.. తన రాజీనామాపై జగన్నాథన్ స్పందించారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్కు రాజీనామా చేసినట్టు ధ్రువీకరించారు. ‘‘ప్రతీ ఆరంభానికి ముగింపు ఉంటుంది. అలాగే, ప్రతీ ముగింపునకు ఓ ఆరంభం ఉంటుందని నేను నమ్ముతాను. వచ్చే రెండు నెలల్లో ఏదో ఒకటి కొత్తగా ప్రారంభిస్తాను. అది ఏ రంగంలో అయినా ఉండొచ్చు. అది నా హృదయానికి దగ్గరగా ఉంటుంది’’అని చెప్పారు. 12 మందితో ఆయన ప్రారంభించిన స్టార్ హెల్త్ నేడు రూ.30వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా అవతరించడం గమనార్హం -
సీఎం పదవికి బసవరాజు బొమ్మై రాజీనామా
కర్ణాటక ముఖ్యమంత్రిగా 19 నెలల 17 రోజులు పనిచేసిన 'బసవరాజు బొమ్మై' ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇందులో భాగంగానే తన రాజీనామా లేఖను గవర్నర్కు అందించారు. ఈ రోజు విడుదలైన ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ 136 సీట్లతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. కేవలం 65 స్థానాలకు పరిమితమైన బీజేపీ ప్రస్తుతం కర్ణాటకలో అధికారం కోల్పోయింది. కన్నడ నాట ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఉన్నారు. అయితే ఎవరు కర్ణాటక కొత్త ముఖ్యమత్రి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. -
బ్రిటన్ ఉప ప్రధాని రాజీనామా
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు అక్కడ ఎదురు గాలి వీస్తోంది. బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖలో పాటు వైట్హాల్ విభాగాల్లో ఆయన సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ రిపోర్ట్ గురువారం ప్రధాని సునాక్కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డొమినిక్ రాబ్ తన పదవులకు రాజీనామా ప్రకటించారు. ఈ సీనియర్ కన్జర్వేటివ్ ఎంపీ తన పేషీలో పని చేసే సిబ్బందిని వేధించినట్లు, అవమానించినట్లు, ఏడ్పించినట్లు.. సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ టాబ్లాయిడ్ గార్డియన్ తొలుత బయటపెట్టింది. అయితే.. ఆరోపణలను డొమినిక్ రాబ్ ఖండిస్తూ వస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీనియర్ న్యాయవాది అడమ్ టోలీని కిందటి ఏడాది నవంబర్లో నియమించారు ప్రధాని సునాక్. రెండు ఫిర్యాదుల మీద మొదలైన ఈ వ్యవహారంలో దర్యాప్తు.. మలుపులు తీసుకుంటూ ఎక్కడికో పోయింది. రాబ్కు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించుకుంటూ పోయింది అడమ్ టీం. రాబ్ దగ్గర పని చేసే సిబ్బంది నుంచి వాంగ్మూలం సేకరించి.. నివేదికను సిద్ధం చేసింది. గురువారం ఆ నివేదికను రిషి సునాక్కు సమర్పించారు అడమ్ టోలీ. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ లోపే రాబ్ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు. My resignation statement.👇 pic.twitter.com/DLjBfChlFq — Dominic Raab (@DominicRaab) April 21, 2023 అయితే.. తీవ్ర ఆరోపణలు, రాబ్పై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ సునాక్ను.. మంత్రిగా కొనసాగించడంపై ప్రధాని రిషి సునాక్ రాజకీయపరంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు కిందటి ఏడాది అక్టోబర్లో రిషి సునాక్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు కేబినెట్ మంత్రులు వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే పదవుల నుంచి వైదొలగాల్సి రావడం గమనార్హం. -
బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
-
ఇక సెలవు.. ఉంటా మరి..! టీ కాంగ్రెస్ నేతలకు బై చెప్పిన మాణిక్కం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్రావు థాకరేను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్ను నియమించింది. ఇదిలా ఉండగా, టీ కాంగ్రెస్లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం నెలకొంది. ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వైదొలగినట్లు ప్రచారం సాగింది. లేదు.. వాట్సాప్ గ్రూప్లోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు వాదించారు. కొద్దిరోజుల క్రితం సాంకేతిక సమస్య వల్ల ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు తెలిపారు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారని, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్ను పంపించి.. ఆ స్థానంలో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్రావు థాకరేను అధిష్ఠానం నియమించింది. ఠాగూర్ను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ల నుంచి ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు. వాట్సాప్ గ్రూప్ల నుంచి లెఫ్ట్ అయ్యే ముందు.. ఈ రోజు వరకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. -
ఏపీ బీజేపీలో రాజీనామాల కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. అమిత్ షా పర్యటన వేళ బీజేపీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పుపై నేతలు అంసతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెద్దు పోకడలపై పార్టీ నేతలు అంసతృప్తితో ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆరు జిల్లాల అధ్యక్షుల మార్పు జరగటం విభేదాలను బట్టబయలు చేసింది. సీనియర్లను సంప్రదించకుండా జిల్లా అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పదవులకు తుమ్మల ఆంజనేయులు, కుమారస్వామిలు రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై నిరసన గళం వినిపించారు. ఇదీ చదవండి: టీడీపీ స్థానిక నాయకులు, ఎన్ఆర్ఐల మధ్య సీట్ల పేచీ -
బీఆర్ఎస్కు షాక్.. సర్పంచ్ల మూకుమ్మడి రాజీనామా
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): అధికార పార్టీకి చెందిన ఆదివాసీ సర్పంచ్లు రాజీనామా అస్త్రం సంధించారు. నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అడుగు కూడా ముందుకు సాగడంలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సర్పంచ్లు సమావేశమై గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నామని, అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఆదివాసీ సర్పంచుల సంఘం మండల ప్రధానకార్యదర్శి సిడాం అన్నిగా విలేకరులతో మాట్లాడుతూ 2021 నుంచి నేటి వరకు ప్రభుత్వ విధానాలతోపంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సక్రమంగా అందడంలేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లోని సమస్యలను పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. భూప్రక్షాళన తర్వాత చాలామంది రైతులకు కొత్తపట్టాలు రాలేదని, రేషన్కార్డులు ఇవ్వలేదని, డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణీపై ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. రాజీనామా ప్రతులను వాట్సాప్ ద్వారా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. రాజీనామా చేసినవారిలో ఆదివాసీ సర్పంచుల మండల అధ్యక్షుడు కోట్నాక కిష్టు, సర్పంచులు దేవ్రావు, పెందూర్ పవన్, జంగు, మనోహర్ తదితరులు ఉన్నారు. గతంలోనూ రాజీనామా.. ఏడాది క్రితం మండలంలోని సర్పంచులు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మికి రాజీనామా పత్రాన్ని ఇచ్చేందుకు సైతం వెళ్లారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో రాజీనామా ఆలోచనను విరమించుకున్నారు. -
ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్బై, కేటీఆర్ ఏం చేశారంటే?
సాక్షి,ముంబై: ప్రముఖ టీవీ ఛానల్ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆలస్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా ఇద్దరూ డైరెక్టర్ పదవులకు గుడ్ బై చెపారు. అయితే 32.26 శాతం వాటా ఉన్న ప్రమోటర్లుగా ఛానెల్ బోర్డుకు రాజీనామా చేయలేదు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విటర్లో ఎన్డీటీవీని అన్ఫాలో చేస్తున్నానంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ చేసిన సేవకు వారికి ధన్యవాదాలు తెలిపారు. Unfollowing @ndtv Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ — KTR (@KTRTRS) November 30, 2022 కొత్త డైరెక్టర్లు ఈ క్రమంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగ్లియా, సంథిల్ సమియా చంగళవరాయన్లు ఎన్డీటీవీకి కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రకటించింది. పుగాలియా అదానీ గ్రూప్లో మీడియా కార్యక్రమాలకు సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్గా ఉన్నారు. ఎన్డీటీవీ షేరు జోరు మరోవైపు ఓపెన్ ఆఫర్ ప్రకటించిన దగ్గర్నించి జోరుమీదున్న ఎన్డీటీవీ స్టాక్ తాజా వార్తలతో 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ తాకింది. గత 5 రోజుల్లో 22 శాతానికి పైగా జంప్ చేయగా,ఆరు నెలల కాలంలో స్టాక్ 161 శాతం పెరిగింది. Radhika and Dr. Prannoy Roy have resigned from NDTV's holding company RRPR's board of directors, effectively immediately. pic.twitter.com/LX7J9QuJDx — Abhishek Baxi (@baxiabhishek) November 29, 2022 కాగా అదానీ గ్రూప్ ఎన్డీటీవీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది ఆగస్ట్ 23న, అదానీ ఎంటర్ప్రైజెస్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్, విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్లో 100శాతం ఈక్విటీ వాటాలను రూ.113.74 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తర్వాత,వీపీసీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతంవాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఎలాంటి నోటీసు లేకుండానే టేకోవర్ జరిగిందని ఎన్డీటీవీ వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. చివరికి ఐపీవో కోసం అదానీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ 22, డిసెంబర్ 5 మధ్య నిర్వహిస్తున్న ఓపెన్ ఆఫర్కు స్పందన బాగానే లభిస్తోంది -
Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ దారెటు?
జమ్ము కశ్మీర్ గడ్డపై నల్ల మంచు కురిసిన వేళ.. తాను బీజేపీలో చేరతానంటూ గతంలో బీజేపీలో చేరిక మీడియా ఊహాగానాలపై వ్యంగ్యం ప్రదర్శించారు గులాం నబీ ఆజాద్. ఈ తరుణంలో మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన మనసు మార్చుకుంటారా? లేదంటే మరో పార్టీలో చేరతారా? సొంత కుంపటి పెట్టబోతున్నారా? అసలు ఆయన తర్వాతి అడుగు ఏంటన్న దానిపై చర్చ మొదలైంది ఇప్పుడు.. కాంగ్రెస్ కీలక నేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పీసీసీ చీఫ్గా, రాజ్యసభ సభ్యుడిగా, పెద్దల సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగిన 73 ఏళ్ల వయసున్న ఆజాద్.. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్తో కొనసాగిన అనుబంధాన్ని తెంచేసుకున్నారు. గత రెండు మూడేళ్లుగా కాంగ్రెస్ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని ప్రదర్శిస్తున్న ఆయన.. తాజా పరిణామాలకు మాత్రం తీవ్రంగా నొచ్చుకున్నారు. అయితే.. ఆయన పార్టీని వీడతారని మాత్రం అధిష్ఠానం ఊహించలేదు. పైగా పార్టీని వీడుతూ.. ఆయన విడుదల చేసిన సంచలన ప్రకటన కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. ► 1973లో 22 ఏళ్ల వయసులో భలెస్సా బ్లాక్కు కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఆజాద్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ పనితనానికి మెచ్చి.. రెండేళ్లకే జమ్ము కశ్మీర్ యూత్ ప్రెసిడెంట్ను చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. మరో ఐదేళ్లకు అంటే 1980లో ఏకంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్కు అధ్యక్షుడు అయ్యాడు ఆయన. ఆపై మహారాష్ట్ర వాసిం లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్కు, అటుపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ► పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే.. పార్లమెంటరీ వ్యవహారాలు, పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖలు చేపట్టారు ఆజాద్. ఆపైనా రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ కాలం కొనసాగినా.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి అవకాశం రావడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ► పీపుల్స్ డెమొక్రటిక్పార్టీ కూటమి మద్దతు ఉపసంహరణతో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం పదవికి విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారాయన. ► ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్.. కాంగ్రెస్ నలుగురి ప్రధానుల హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవశాలి గులాం నబీ ఆజాద్. తేడా వ్యాఖ్యలు! ► ప్రతిపక్ష నేతగా, సభ్యుడిగా బీజేపీ-ఎన్డీయేపై ఆయన ప్రత్యక్ష విమర్శలు గుప్పించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ► మోదీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం గులాం నబీ ఆజాద్కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి పురస్కారం అందుకున్నారాయన. ఆ సందర్భంలో.. కనీసం ఎవరో ఒకరు తన పనిని గుర్తించారంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. ► కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గిందంటూ బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా ప్రశంసలు గుప్పించారు గులాం నబీ ఆజాద్. ఆ సందర్భంలో.. బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను స్వాగతించారు. ► కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్ని అవమానిస్తోందని ఆరోపిస్తూ.. ఆయన మేనల్లుడు ముబషర్ ఆజాద్ బీజేపీలో చేరారు. ► కాంగ్రెస్ గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ.. ఏర్పడ్డ జీ 23 కూటమిలో గులాం నబీ ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల(పంజాబ్లో అయితే ఏకంగా అధికారం కోల్పోవడం) ఆధారంగా.. సంస్థాగత మార్పుపై తీవ్రస్థాయిలో అధిష్ఠానంపై గళమెత్తారు. ► ఆ సమయంలోనే ఆయన పార్టీని వీడతారేమో అనే చర్చ నడిచింది. అయితే సోనియా గాంధీ పిలిపించుకుని వ్యక్తిగతంగా మాట్లాడడంతో ఆయన ఆ సమయానికి మెత్తబడ్డారు. "పోస్టులు వస్తాయి... పెద్ద పెద్ద ఆఫీసులు వస్తాయి... అధికారం వస్తుంది... కానీ వాటిని ఎలా నడపాలి అనేది ఎవరైనా సరే... గులామ్ నబీ ఆజాద్ జీ నుంచి నేర్చుకోవాలి. నా దృష్టిలో ఆయన నిజమైన స్నేహితుడు" అని మోదీ భావోద్వేగం చెందారు. "నేను మిమ్మల్ని రిటైర్ కానివ్వను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. నా డోర్లు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయి" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆజాద్ వీడ్కోలు సందర్భంగా రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్నారు. #WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT — ANI (@ANI) February 9, 2021 ► ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్.. బీజేపీ గూటికి చేరతారంటూ పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలే అని అప్పుడు కొట్టిపారేశారాయన ► కాంగ్రెస్లో తన ప్రాబల్యాన్ని తగ్గించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన్ని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా నియమిస్తే, అది ప్రమోషన్ కాదని.. డిమోషన్ అని పేర్కొంటూ ఆ పదవికి రాజీనామా చేసి సోనియాగాంధీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. ఈ నిర్ణయం ప్రకటించి వారం తిరగక ముందే.. ► తాజాగా కాంగ్రెస్కు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపిన లేఖలో.. పార్టీ ఎన్నికలను బూటకమని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలే గుప్పించారు. ► బీజేపీ కాకుంటే.. బీజేపీలో చేరేది ఊహాగానాలే అంటూ గతంలో ప్రకటించారు గులాం నబీ ఆజాద్. కానీ, బీజేపీతో ఆయన అనుబంధం మాత్రం చాలా ఏళ్లుగా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు.. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరవచ్చని ఒకవర్గం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీలో చేరినా.. సలహాదారుగా మాత్రమే ఆయన వ్యవహరించవచ్చనే భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీలో గనుక చేరుకుంటే.. ఆయన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ‘స్థానిక’ సెంటిమెంట్ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్టీ నిర్ణయం తీసుకోవచ్చని, లేదంటే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: రాహుల్కు ఆ హోదా లేకున్నా.. కాంగ్రెస్కు ఆజాద్ రాజీనామా, లేఖ కలకలం -
భారత్తో డీల్ జాప్యం.. టెస్లాకు భారీ షాక్
న్యూఢిల్లీ: భారత్లో తమ ఈవీ కార్ల ఎంట్రీకి బ్రేకులు వేసిన తరుణంలో.. టెస్లా కంపెనీకి ఇప్పుడు భారీ షాక్ తగిలింది. లాబీయింగ్లో ఇంతకాలం కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన టెస్లా కంపెనీ భారత ఎగ్జిక్యూటివ్ అసహనంతో కంపెనీ నుంచి వైదొలిగినట్లు సమాచారం!. భారత్లో రంగ ప్రవేశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయంలో .. టెస్లా కంపెనీ మనుజ్ ఖురానాను పాలసీ & బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా నియమించింది టెస్లా. ఐఐఎం బెంగళూరుకు చెందిన మనుజ్ ఖురానాకు అప్పటికే మేనేజ్మెంట్ కన్సల్టింగ్లో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. టెస్లాకు భారత్లో ఆయనే తొలి ఎంప్లాయ్ కూడా!. ఈ మేరకు మార్చి 2021లో ఆయన నియామకం జరిగింది. అప్పటి నుంచి టెస్లా తరపున మనుజ్ అండ్ టీం కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సూచనల మేరకు.. దిగుమతి సుంకం తగ్గించుకోవాలంటూ భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. ముందుగా తక్కువ దిగుమతి సుంకంతో కార్లను అనుమతించాలని, ఇక్కడి మార్కెట్పై ఓ అంచనాకి వచ్చి కార్ల ఉత్పత్తిని మొదలుపెడతామని మనుజ్ విజ్ఞప్తి చేశారు. చైనా కూడా ఇదే తరహాలో టెస్లాకు అనుమతులు మంజూరు చేసిందని వివరించారాయన. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో అస్సలు తగ్గలేదు. దీంతో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వెల్లగక్కుతూ వస్తున్నారు. అయినప్పటికీ మనుజ్ తన ప్రయత్నాలను ఆపలేదు. అయితే ముందుగా స్థానిక ఉత్పత్తిని ప్రారంభించాకే.. రాయితీల గురించి చర్చించాలని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామాలతో తాజాగా టెస్లా కంపెనీ భారత్ ఎంట్రీని తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఇండోనేషియాతో పాటు థాయ్లాండ్ల పైనా దృష్టిసారించింది. అంతేకాదు భారత్లో షోరూంల కోసం వెతికే ప్రయత్నాలను నిలిపివేయడంతో పాటు ఇక్కడి టీంకు వేరే పనులను అప్పజెప్పింది. ఈ క్రమంలోనే.. మనుజ్ ఖురానా టెస్లాకు రాజీనామా చేశారు. భారత్లో రంగప్రవేశం విషయంలో టెస్లా వైఖరి వల్లే ఆయన కంపెనీని వీడినట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రచురించింది. దీనిపై ఆయన స్పందన కోరగా.. ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. -
తెలంగాణ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ రాజీనామా
-
Sri Lanka: మొత్తం మంత్రుల రాజీనామా.. ప్రధాని మాత్రం నో!
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. కేంద్ర కేబినెట్లోని మొత్తం 26 మంత్రులు తమ పదవులకు ఆదివారం రాజీనామా చేశారు. సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో ప్రభుత్వం విఫలమైందన్న కారణంతోనే తాము రాజీనామా చేస్తున్నట్లు మంత్రులు తమ లేఖల్లో పేర్కొన్నారు. అయితే.. ఆదివారం అర్ధరాత్రి లంక మంత్రులంతా తమ రాజీనామాలను ప్రధాని మహీందా రాజపక్సకు సమర్పించగా.. ప్రధాని పదవికి మాత్రం మహీందా రాజీనామా చేయడానికి సుముఖంగా లేనట్లుతెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఆపద్ధర్మ ప్రభుత్వం లేదంటే కొత్త కేబినెట్.. ఈ రెండు ఆఫ్షన్స్లో ఏదో ఒకదాంతో మహీందా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజపక్స కుటుంబ చిత్రం ఇక రాజీనామా చేసిన మంత్రుల్లో మహీందా తనయుడితో పాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులే కావడం విశేషం. దీంతో ప్రజావ్యతిరేకత కొంతైనా తగ్గుముఖం పడుతుందన్న ఆలోచనలో ఉన్నాడు ప్రధాని మహీందా. ఇక కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా ఆదివారం పౌరులు, విద్యార్థులు, ప్రతిపక్షాలు కలిసి నిరసనలు వ్యక్తం చేయగా.. ఉద్రిక్తతలకు దారి తీశాయి. స్వాతంత్ర్యం వచ్చిన 1948 నుంచి ఇప్పటిదాకా ఈ స్థాయిలో అధిక ధరలు, కరెంట్కోతలు, నిత్యావసరాల కొరత.. చూస్తుండడం ఇదేమొదటిసారి. అందుకే ప్రజా వ్యతిరేకత పెల్లుబిక్కింది. సంబంధిత వార్త: లంకలో ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటంటే.. -
ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపినట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. రాజీనామాను గవర్నర్ కార్యదర్శి బ్రిజేశ్కుమార్ సంత్ ధ్రువీకరించారు. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు సమాచారం. చదవండి: ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్.. మంత్రి అవంతి 1956లో జన్మించిన బేబీ రాణి మౌర్య 2018 ఆగస్టు 26వ తేదీన ఆ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. గతనెలలో ఆమె గవర్నర్గా మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. బేబీ రాణి గతంలో అనేక పదవులు చేపట్టారు. ఆగ్రా మేయర్గా పని చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషనర్ సభ్యురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. సమాజ్ రత్న, ఉత్తరప్రదేశ్ రత్న, నారీ రత్న అవార్డులు పొందారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. నిద్రలోనే బూడిదైన ఖైదీలు -
టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి కోదండరెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మెయిల్ ద్వారా పంపారు. రాజీనామా ప్రతులను ఎంపీ రాహుల్గాంధీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డిలకు పంపారు. తనకు ఇన్నేళ్లు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన టీంను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన రాజీనామా విషయమై కోదండరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాత గతంలో ఉన్న కమిటీలకు రాజీనామాలు చేయడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమని చెప్పారు. కొన్ని పిటిషన్లు తన వద్ద పెండింగ్లో ఉన్నందున అప్పుడు రాజీనామా చేయలేదని, ఇప్పుడు అన్ని పిటిషన్ల విచారణ పూర్తి అయిందని చెప్పారు. రాజీనామాకు ప్రత్యేక కారణాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. -
టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా
-
Etela Rajender: టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాత్రికి రాత్రే తానను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని.. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా? అని ప్రశ్నించారు. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కనీసం తాన వివరణ కూడా అడగలేదన్నారు. ‘‘హుజురాబాద్లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నాం. ప్రాణం ఉండగానే నన్ను బొందపెట్టాలని ఆదేశాలిచ్చారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజూరాబాద్ ప్రజలు చెప్పారు. పదవుల కోసం నేను ఏనాడూ పాకులాడలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశానని’’ ఈటల రాజేందర్ అన్నారు. ‘అది ప్రగతిభవన్ కాదు.. బానిస భవన్’ అంటూ ఈటల విమర్శలు గుప్పించారు. సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ ఒక్కరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘రూ.వందల కోట్లు ఇన్కంట్యాక్స్ కట్టేవారికి రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా. హరీష్రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆకలినైనా భరిస్తాం.. ఆత్మ గౌరవాన్ని వదులుకోమన్నారు. కేసీఆర్ హయాంలో మంత్రులకు , అధికారులకు స్వేచ్ఛ లేదని ఈటల అన్నారు. ఏనుగు రవీందర్రెడ్డి, తుల ఉమ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈటల తెలిపారు. చదవండి: భూముల డిజిటల్ సర్వేపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం Telangana: తడిచె.. మొలకెత్తే.. -
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా
-
రంజీ, వినూ మన్కడ్ టోర్నీలు మాత్రమే!
ముంబై: దేశవాళీ క్రికెట్ సీజన్ను కరోనా మింగేయనుంది. దేశంలో వైరస్ విలయతాండవం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆటలకు బాటలే పడట్లేదు. దీంతో ప్రస్తుత కరోనా సీజన్లో దేశవాళీ టోర్నీలను రెండుకే పరిమితం చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. 2020–21లో సీనియర్ల కోసం రంజీ ట్రోఫీ... కుర్రాళ్ల కోసం అండర్–19 వినూ మన్కడ్ ట్రోఫీల ను మాత్రమే నిర్వహిస్తారు. దులీప్, దేవధర్, విజయ్ హజారే, సీకే నాయుడు (అండర్–23) టోర్నీలు అసాధ్యమేనని బోర్డు భావించింది. వీలు ను బట్టి ముస్తాక్ అలీ టి20 టోర్నీకి చోటిచ్చింది. రంజీ కూడా ఇపుడున్న ఎలైట్, ప్లేట్ కాకుండా పాత పద్ధతిలోనే నిర్వహించే అవకాశముంది. అంటే ఐదు జోన్ల (నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్)లోని జట్ల మధ్య లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. తదుపరి జోన్ విజేతలకు (పాయింట్ల పట్టికలో జోన్ టాపర్) నాకౌట్ పద్ధతిలో నిర్వహించి విజేతను తేలుస్తారు. సాబా కరీమ్ రాజీనామా మరోవైపు బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) పదవికి సాబా కరీమ్ రాజీనామా చేశాడు. ఇటీవల బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన పదవికి గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐలో కొత్త ప్రొఫెషనల్స్ టీమ్ రాబోతుందనే చర్చ మొదలైంది. భారత మాజీ వికెట్ కీపర్ అయిన సాబా కరీమ్ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్గా ముఖ్యంగా దేశవాళీ క్రికెట్ బాధ్యతల్ని నిర్వర్తించేవాడు. -
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా
-
సివిల్ సర్వీస్ ఉద్యోగాలకో దండం
సాక్షి, బెంగళూరు: పని ఒత్తిళ్లు ఓ వైపు.. కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నామనే ఆవేదన మరోవైపు వేధిస్తున్న కారణంగా సివిల్స్ సర్వీస్ అధికారులు తమ పదవులకు రాజీనామా చేయడం రాష్ట్రంలో సాధారణ విషయమైంది. ఐదు నెలల్లో ఒక ఐపీఎస్, మరో ఐఏఎస్ రాజీనామా చేయగా, ఒక ఐఎఫ్ఎస్ (అటవీ) అధికారి ఏకంగా ఆత్మహత్యే చేసుకున్నారు. దీంతో అఖిల భారత సర్వీస్ అధికారుల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. తరువాతి రాజీనామా ఏ అధికారిదోనని ఆ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. విధానసౌధలో ఐఏఎస్లు, ఐపీఎస్ల మధ్య ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. యువ ఐపీఎస్ అన్నామలైతో ఆరంభం కర్ణాటకలో ’సింగం’గా పేరొందిన బెంగళూరు సౌత్ డీసీపీ కె.అన్నామలై ఇండియన్ పోలీస్ సర్వీస్కు మే 28వ తేదీన రాజీనామా చేశారు. అప్పటి సీఎం హెచ్డీ కుమారస్వామిని స్వయంగా కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఉద్యోగం వదిలేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. అన్నామలై 2011 బ్యాచ్ యువ ఐపీఎస్ అధికారి. తమిళనాడులోని కరూర్ ప్రాంతానికి చెందినవారు. 2013లో కార్కళ ఏఎస్పీగా కెరీర్ మొదలుపెట్టారు. కుటుంబంతో గడపలేకపోతున్నానని, బంధువుల పెళ్లిళ్లకు, చావులకు కూడా హాజరు కాలేని పరిస్థితి ఉందని అప్పట్లో ఆవేదన వ్యక్తంచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతకుముందు జరిపిన హిమాలయాల పర్యటన నా కళ్లు తెరిపించిందని, జీవితం గురించి తెలుసుకోవడానికి ఈ యాత్ర దోహదపడిందని పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి సెంథిల్ సంచలనం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం. ఏళ్ల తరబడి అహోరాత్రులు చదివి సాధించిన సివిల్ సర్వీస్ ఉద్యోగాలను చివరికి పూచికపుల్లతోసమానంగా భావించి తప్పుకోవడం, ఆరునెలల్లో ఇలాంటి సంఘటనలు రెండు జరగడం గమనార్హం. విధుల్లో రాజీ పడలేకపోతున్నామంటూ అధికార దండాన్ని పక్కన పెట్టేస్తున్నారు. తమిళనాడుకే చెందిన ఐఏఎస్ అధికారి, దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్ శశికాంత్ సెంథిల్ ఈ నెల 6వ తేదీన రాజీనామా సమర్పించారు. ప్రజాస్వామ్య విలువలు రాజీపడుతున్న ఈ సమయంలో ఐఏఎస్గా కొనసాగడం అనైతికమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యన ప్రకటించారు. అందరి జీవితాలను మెరుగుపరిచేందుకు నా కృషిని కొనసాగిస్తా’ అని సెంథిల్ తెలిపారు. 40 ఏళ్ల సెంథిల్ తమిళనాడులోని తిరుచీ్చకి చెందినవారు. 2009లో ఆయ న ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆయన రాజీనామా దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది. ఐఎఫ్ఎస్ అవతార్సింగ్ ఆత్మహత్య! కర్ణాటక అటవీ అభివృద్ధి మండలి సంస్థ ఎండీ, ఐఎఫ్ఎస్ అధికారి అవతార్ సింగ్ (52) ఈనెల 8వ తేదీన బెంగళూరు యలహంకలోని తన అపార్టుమెంటు ఫ్లాటులో ఉరివేసుకున్న స్థితిలో మరణించారు. ఇది ఆత్మహత్య కావచ్చని, తీవ్రమైన పని ఒత్తడి కారణంగా ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హరియాణాకు చెందిన అవతార్ సింగ్ మరణానికి సంబంధించి విధుల పరంగా ఆయన కొద్ది రోజుల సెలవు తర్వాత ఈనెల 7వ తేదీన చేరారు. అంతలోనే ఇలా తీవ్ర నిర్ణయం తీసుకోవడం సహచర అధికారులను నిశ్చేషు్టలను చేసింది. ప్రభుత్వం ఉలికిపాటు ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ రాజీనామాతో కర్ణాటకలోని బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ ఎందుకు రాజీనామా చేశారు?, అసలు ఏం జరిగింది? ఇలాంటి సంఘటనలు తన ప్రభుత్వంలో మరోసారి జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు. -
టీడీపీకి షాక్!
కర్నూలు, బనగానపల్లె: జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగలింది. ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫాక్స్ ద్వారా లేఖ పంపారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు చల్లా సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో అధికార పార్టీకి షాక్ తగిలింది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వలసల పరంపర కొనసాగుతుండడంతో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో సోమవారం చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీ సభ్యత్వానికి, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించడంతో అధికార పార్టీకి గట్టి దెబ్బతగిలింది. చల్లా కుటుంబం ఐదు దశాబ్దాలుగా జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం విదితమే. చల్లా రామకృష్ణారెడ్డి తండ్రి చల్లా చిన్నపురెడ్డి మంచి నాయకుడిగా ప్రజల్లో పేరుగాంచారు. చల్లా సోదరులు సైతం ప్రజల్లో అదే అభిమానం, గౌరవాన్ని కలిగి ఉన్నారు. ప్రజాభిమానంతో 1983లో పాణ్యం నుంచి 1999, 2004లో కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి చల్లా రామకృష్ణారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సముచిత స్థానం లభించనందునే.. బనగానపల్లె నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ కలిగి ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్రెడ్డి గెలుపునకు కృషి చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత.. చల్లాకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కూడా సముచిత స్థానం కల్పించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అవుకు మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించిన సందర్భంగా చల్లాకు తగిన గౌరవం ఇవ్వలేదన్నవిషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. మంత్రి హోదాలో నారా లోకేష్ అవుకులోని పర్యటన చేస్తున్న సమయంలోను మర్యాదపూర్వకంగా పిలవకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఎమ్మెల్యే బీసీతో విభేదాలు పొడచూపాయని గ్రహించిన సీఎం చంద్రబాబు..కడప ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పదవిని ఇవ్వగా , అది తన స్థాయికి తగదని బహిరంగంగానే చల్లా సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో.. తను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల కోసం కొన్ని నెలల పాటు చేపట్టారు. కొసమెరుపు.. సముచిత స్థానం కల్పించకపోవడంతో పార్టీకి, పదవికి చల్లా రాజీనామా చేసినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. సోమవారం అవుకు పట్టణానికి వెళ్లారు. అక్కడ ఉన్న చల్లా సోదరులను కలిశారు. అయితే తాము కూడా అన్నబాటలోనే పయనిస్తామని తేల్చిచెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు. -
పదవిని త్యజించిన మలేసియా రాజు
కౌలాలంపూర్: మలేసియా రాజు సుల్తాన్ ముహమ్మద్ 5(49) తన పదవిని త్యజించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా రాచరిక విధులకు దూరంగా ఉంటున్న ఆయన రష్యా మాజీ సుందరిని వివాహమాడినట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ముహమ్మద్ భవిష్యత్తుపై వినిపిస్తున్న ఊహాగానాలకు రాజభవనం ఎట్టకేలకు తెరదించింది. ఆయన తన పదవికి రాజీనామా చేశారని, అది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. పదవీకాలం ముగియకముందే రాచరికాన్ని త్యజించిన తొలి మలేసియా పాలకుడిగా ఆయన నిలిచారు. ఆయన నిష్క్రమణకు కారణమేంటో రాజభవనం చెప్పలేదు. రష్యా మాజీ సుందరిని ఆయన వివాహం చేసుకున్నారన్న వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. మలేసియా రాజు పదవీకాలం ఐదేళ్లు కాగా, ముహమ్మద్ రెండేళ్ల క్రితమే బాధ్యతలు చేపట్టారు. 9 వంశాల మధ్య ఐదేళ్లకోసారి అధికార పీఠం మారుతూ ఉంటుంది. -
ప్రధాని ఆర్థిక సలహా మండలికి భల్లా రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్రం స్థాయిలో ఆర్థిక వేత్తల రాజీనామా పరంపర కొనసాగుతోంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో (పీఎంఈఏసీ) సభ్యుడైన ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుర్జిత్ భల్లా తాను సైతం రాజీనామా చేసినట్టు మంగళవారం ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి పీఎంఈఏసీ తాత్కాలిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు భల్లా ట్వీట్ చేశారు. భల్లా రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించినట్టు ఆయన కార్యాలయ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 1952 నుంచి భారత్లో ఎన్నికలు అనే పుస్తకంపై తాను పనిచేస్తున్నానని, సీఎన్ఎన్ ఐబీఎన్లో తాను చేరిన డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని భల్లా తెలిపారు. ప్రభుత్వ విధానాలకు మద్దతుదారుగా ఉండే ఈ ఆర్థిక వేత్త ఇటీవలి జీడీపీ గణాంకాల ప్రకటన విషయంలో నీతి ఆయోగ్ పాత్రపై విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్ సమక్షంలో కేంద్ర ముఖ్య గణాంక అధికారి ప్రవీణ్ శ్రీవాస్తవ గత నెల 28న సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరుగురు సభ్యుల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి బిబేక్ దేబ్రాయ్ నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా కూడా తమ పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. -
కూకట్పల్లిలో టీఆర్ఎస్కు ఝలక్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. టికెట్ ఆశించి భంగపడ్డవారు, అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నవారు.. చివరి నిమిషాల్లో ఆయా పార్టీలకు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపారు. ఈ లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘పార్టీని ఇల్లులా.. కేసీఆర్ను ఇంటి పెద్దదిక్కులా(తండ్రిలా) భావించాను. పార్టీలో ఇన్నాళ్లు చాలా మందికి అన్యాయం జరిగినా ఓపికతో సహించాను. ఇకనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించి ఎదురు చూశాను. అయినా.. ఎటువంటి మార్పులేదు. తెలంగాణ వాదం అనే పదాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. మీలో మార్పు రాకపోగా.. పార్టీ పక్కదారుల పడుతోంది. ఇక పార్టీ గాడిలో పడదని భావించి పార్టీకి, కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాన’ని ఆయన లేఖలో పేర్కొన్నారు. మరో కొద్ది రోజుల్లో ఎన్నికల జరగనుండగా.. కేసీఆర్కు సన్నిహితంగా ఉండే గొట్టిముక్కల రాజీనామా చేయడం కూకట్పల్లిలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
హోంమంత్రికి మొర పెట్టుకున్నా అరణ్యరోదనే..
పెద్దాపురం: ‘నా భర్తపై ఎస్సై చేయి చేసుకున్నా న్యాయం చేయలేని పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఓ వార్డు ప్రతినిధిగా ఉంటూ నా భర్తకే రక్షణ కల్పించలేని పదవి నాకొ’ద్దంటూ అధికార టీడీపీకి చెందిన కౌన్సిలర్ యర్రా లక్ష్మి హోంమంత్రి నిమ్మకాయ ల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తు న్న నియోజకవర్గంలోని పెద్దాపురం పురపాలక సంఘం 25వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మి కౌన్సిల్ సమావేశంలో అనూహ్యంగా పదవికి రాజీనా మా చేస్తున్నానని ప్రకటించి, రాజీనామా లేఖను చైర్మన్కు అందించి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగింది. అందరితో పాటు వచ్చిన కౌన్సిలర్ లక్ష్మి తన పదవికి రాజీనామా చేస్తున్నానని సమావేశంలో ఆరంభంలోనే రాజీనామా లేఖను చైర్మన్కు అందజేశారు. ఎస్సై తన భర్త హోటల్ వద్దకు వెళ్ళి రాత్రివేళ చేయి చేసుకుంటే విషయాన్ని బయటకు రాకుండా అధికారంలో ఉన్న పెద్దలపై గౌరవంతో ఆగి తే ఇప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం బాధాకరంగా ఉందన్నారు. హోం మంత్రి రాజప్ప దృష్టిలో ఉంచినా పోలీసులు, మేము ఒక్కటేనంటూ వారికి వత్తాసు పలికారని నిరసన వ్యక్తం చేశారు. తన భర్తపై చేయి చేసుకున్న పోలీసుల నుంచి రక్షణ లేని పదవి తనకొద్దంటూ తన భర్త శ్రీనుతో కలిసి అక్కడి నుంచి వెళ్ళి పోయారు. చైర్మన్ సూరిబాబురాజు స్పందిస్తూ పోలీసులను రప్పించి కౌన్సిల్ సభ్యుల ఎదుటే విచారించినా ఆమె రాజీనామా చేయడం బా«ధాకరమన్నారు. నాపై అభాండాలు తగదు : ఎస్సై కౌన్సిలర్ లక్ష్మి ఆరోపణపై ఎస్సై కృష్ణ భగవాన్ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను విధి నిర్వహణలో భాగంగానే శ్రీనుకు రాత్రి 10.30 తరువాత హోటల్ ఉంచకూడదని సూచించానే తప్ప మరే విధమైన దురుద్దేశం లేదన్నారు. హోటల్ సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరిగే జంక్షన్ కాబట్టి అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తే తనపై అభాండాలు వేయడం తగదన్నారు. -
విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పసుల సునీతారాణి పదవికి రాజీనామా చేశారు. సునీతారాణిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందే బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె తన రాజీనామాను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక వాక్యంతో కూడిన లేఖను కలెక్టర్కు అందజేసి, రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం రాకుండా చూసేందుకు, క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను వెనక్కి రప్పించేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రాష్ట్ర మంత్రుల స్థాయిలో ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. చివరికి తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేకంగా కౌన్సిల్ను సమావేశపరిచే అర్హత కలెక్టర్కు లేదని మంగళవారం చైర్పర్సన్ సునీతారాణి ఏకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే 28 మంది సభ్యులు కలిసి ఒక కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారని కూడా హైకోర్టుకు నివేదిస్తూ తనపై అవిశ్వాసం పెట్టిన తీర్మానాన్ని తిరస్కరించాలని కోరారు. అయితే కోర్టులో కూడా సునీతారాణికి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేయడంతో గురువారం జరిగే కౌన్సిల్ సమావేశంలో తనకు ఓటమి తప్పదని నిర్ణయించుకున్న ఆమె కలెక్టర్ కార్యాలయంలో రాజీనామా అందజేశారు. ఈ లేఖను పరిశీలించిన కలెక్టర్ కర్ణన్ గురువారం నాటి కౌన్సిల్కు అధ్యక్షత వహించే బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్రాజ్కు పంపించారు. రాజీనామా చేసినా... కౌన్సిల్లోనే ఆమోదం గురువారం నాటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్గా తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఖాయమని భావించిన సునీతారాణి ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు. అయితే కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు తేదీ ఖరారైన నేపథ్యంలో రాజీనామాను ఆమోదించే అధికారం కలెక్టర్కు లేదు. గురువారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశమయిన వెంటనే మున్సిపల్ కమిషనర్ రాజు కౌన్సిల్లోని సభ్యులకు చైర్పర్సన్ రాజీనామా విషయాన్ని తెలియజేస్తారు. ఈ రాజీనామాకు సభ్యులంతా సమ్మతం తెలిపితే అవిశ్వాసంపై ఓటింగ్ జరపకుండానే సభను వాయిదా వేస్తారు. కౌన్సిల్ సమావేశమైనప్పుడు ఒకవేళ సాంకేతిక కారణాలతో రాజీనామా లేఖ అంశం సభ దృష్టికి తీసుకురాని పక్షంలో అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాసంపై ఓటింగ్ చేపట్టే ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి మాత్రమే సబ్ కలెక్టర్ రాహుల్రాజ్ నేతృత్వం వహిస్తారు. రాజీనామా అంశం సభ దృష్టికి వస్తే ఆయన అవసరం ఉండదు. నెల పదిరోజుల్లో ఎన్ని మలుపులో... రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల చైర్పర్సన్లు, ఎంపీపీలు అవిశ్వాస సమస్యను ఎదుర్కొన్నా... బెల్లంపల్లిలో జరిగినంత రచ్చ ఎక్కడా లేదు. అవిశ్వాస నోటీసు ఇవ్వడానికి పది రోజుల ముందే జూన్ 23వ తేదీన 29 మంది కౌన్సిలర్లు రహస్య క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఇండిపెండెంట్ సభ్యులంతా ఈ క్యాంపులో ఉండడం విశేషం. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను వెనక్కి రప్పించేందుకు ఎమ్మెల్యే చిన్నయ్య చేసిన ప్రయత్నాలు, తదనంతర పరిణామాలు విమర్శలకు కారణమయ్యాయి. ఎమ్మెల్యే చిన్నయ్య ఓ కౌన్సిలర్ కూతురిని ఫోన్లో బెరించడం, సింగరేణిలో ఉద్యోగం చేసే ఇద్దరు మహిళా కౌన్సిలర్ల భర్తలను మణుగూరుకు బదిలీ చేయిస్తానని చెప్పి మరీ ఉత్తర్వులు ఇప్పించారు. 18వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి రాములును కిడ్నాప్ చేశారనే ఫిర్యాదు మేరకు వన్టౌన్లో ఐదుగురు అసమ్మతి సభ్యులు, ఓ నాయకుడిపై కేసు నమోదు అయ్యింది. వీరు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకువచ్చారు. -
భారత మహిళల క్రికెట్ కోచ్ తుషార్ రాజీనామా
న్యూఢిల్లీ: అప్పుడు పురుషుల జట్టు కోచ్ అనిల్ కుంబ్లే... ఇప్పుడేమో భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ తుషార్ అరోతె... జట్టు సభ్యులను నొప్పించలేక తప్పుకున్నారు. మంగళవారం తుషార్ తన పదవికి రాజీనామా చేశారు. సీనియర్ మహిళా క్రికెటర్లతో విబేధాలే ఆయన దిగిపోవడానికి కారణమని తెలిసింది. తుషార్ శిక్షణపై స్టార్ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, కోచ్ను తప్పించాల్సిందేనని పట్టుబట్టడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుషార్తో రాజీనామా చేయించింది. ‘వ్యక్తిగత కారణాలతో కోచ్ పదవి నుంచి తుషార్ తప్పుకున్నారు. ఈ అవకాశమిచ్చిన బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. తుషార్ కోచింగ్లోనే గతేడాది ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్లో మహిళల జట్టు రన్నరప్గా నిలిచింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలోనూ వన్డే, టి20 సిరీస్లను గెలిచింది. అయితే ఆసియా కప్ టి20 ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన తర్వాత క్రికెటర్లకు కోచ్కు మధ్య విబేధాలు పొడసూపాయి. ఇవి తారాస్థాయికి చేరడంతో కోచ్ను రాజీనామాతో తప్పించారు. -
అసోసియేషన్ నుంచి వైదొలిగిన నటీమణులు
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి భావన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మళయాళం మావీ ఆర్టిస్ట్స్) నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆమెతో పాటు నటిమణులు రిమా కలింగల్, రమ్య నంబిసన్, గీత్ మోహన్దాస్లు కూడా అమ్మకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఫేస్బుక్ పేజీ ద్వారా తెలియజేశారు. గతేడాది భావనపై నటుడు దిలీప్ లైగింక వేధింపు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దిలీప్ను అరెస్ట్ చేయడంతో అమ్మ అతనిపై నిషేధం విధించింది. తాజాగా అతనిపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో వీరు నలుగురు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అ నటుడి వల్ల గతంలో నేను ఎన్నో అవకాశాలు కొల్పోయాను.. కానీ అమ్మ ఏం చేయలేకపోయిందని భావన తెలిపారు. అమ్మలో కొనసాగడం అనవసరమంటూ ఆమె పేర్కొన్నారు. అమ్మ మహిళల కోసం ఏ విధమైన చర్యలు చెప్పట్టడం లేదని రిమా చెప్పారు. -
బీజేపీని కలవరపెడుతున్న రాజస్తాన్ పరిణామాలు
జైపూర్ : రాజస్తాన్లో జరుగుతన్న రాజకీయ పరిణామాలు బీజేపీని కలవరానికి గురిచేస్తున్నాయి. ఇటీవలే పార్టీకి రాజీనామ చేసిన సీనియర్ ఎమ్మెల్యే ఘన్శ్యామ్ తివారీ ప్రభత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం పార్టీని ఇబ్బందులోకి నెట్టింది. చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తు వస్తున్న ఘన్శ్యామ్ తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయల్లో మరింత వేడిని రగిలించాయి. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వసుంధర రాజే పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అగ్ర కులాలకు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నించడం లేదని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో అపక్రటిత ఎమర్జెన్సీ అమల్లో ఉందన్నారు. ఇంతకాలం బీజేపీలో కొనసాగిన ఘన్శ్యామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఏడాది రాజస్తాన్లో రెండు లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో బీజేపీ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలపై అధినాయకత్వం జోక్యం చేసుకోకపోవడం పార్టీ శ్రేణులను అభద్రత భావానికి గురిచేస్తోంది. దళిత, మైనార్టీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీఎస్పీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. మరోపక్క ఘన్శ్యామ్ కుమారుడు అఖిలేశ్ భారత్ వాహిని పార్టీ పేరుతో 200 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘన్శ్యామ్ గత ఎన్నికల్లో(2013) రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. -
ఫోర్స్ ఇండియాకు మాల్యా గుడ్బై
లండన్ : రుణాల ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఫోర్స్ ఇండియా డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. న్యాయపరమైన వివాదాలను ఎదుర్కోవడంపై మరింత దృష్టిసారించేందుకే మాల్యా ఫోర్స్ ఇండియా నుంచి తప్పుకున్నారు. బ్రిటన్ కోర్టులో మాల్యా అప్పగింతను కోరుతూ భారత్ దాఖలు చేసిన అప్పీల్ను ఎదుర్కొంటున్న వివాదాస్పద పారిశ్రామికవేత్త ఫార్ములా 1 కార్యకలాపాల్లోనూ ఇప్పటివరకూ చురుకుగా పాల్గొన్నారు. కాగా మాల్యా తన స్ధానంలో బోర్డులో తన కుమారుడిని నియమించినట్టు పేర్కొన్నారు. తాను వైదొలిగేందుకు ఎలాంటి బలమైన కారణం లేకున్నా తన స్ధానంలో కుమారుడిని నియమించాలని భావించినట్టు ఆయన చెప్పారు. తాను న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కొంటున్నందున కంపెనీపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఫోర్స్ ఇండియాలో మరో వివాదాస్పద పారిశ్రామికవేత్త సుబ్రతోరాయ్తో మాల్యా సహ భాగస్వామిగా ఉన్నారు. సహారా అధినేత సుబ్రతో రాయ్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. -
నాకొద్దు ఈ ఉద్యోగం; మహిళా ఇన్స్పెక్టర్ రాజీనామా
సాక్షి, చెన్నై: పనిభారంతో ఓ మహిళా ఇన్స్పెక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమాచారం గురువారం వెలుగులోకి వచ్చింది. మరో రెండేళ్లలో పదవీ విరమణ పొందాల్సిన తాను ఇన్నాళ్లు పడ్డ బాధలు, ప్రస్తుతం పడుతున్న కష్టాలను ఓ లేఖ రూపంలో ఆమె ఉన్నతాధికారులకు ఏకరువు పెట్టినట్టు సమాచారం.రాష్ట్ర పోలీసు శాఖలో పని భారం పెరిగినట్టు గత కొంత కాలంగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తోడు మానసిక ఒత్తిళ్లకు లోనైన వారు ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడుతూ వస్తున్నారు. గత నెల చెన్నై కానిస్టేబుల్ అరుణ్ రాజ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్ని కలవరంలో పడేసింది. ఆ ఘటన మరువక ముందే ఐనావరం స్టేషన్లోనే సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సతీష్కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం మరింతగా కలకలం రేపింది. అలాగే, విధుల్లో ఉన్న వాళ్లు పనిభారం, ఒత్తిళ్ల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు ముగ్గురు విధుల్లోనూ గుండె పోటుతో మరణించారు. కేవలం పనిభారం కారణంగా, ఉన్నతాధికారుల వేదింపులతో అనేకచోట్ల ఈ ఘటనలు చోటుచేసుకుంటూ వస్తున్నట్టు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అనేకమంది పోలీసులు స్పందిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ మద్రాసు హైకోర్టుకు సైతం చేరాయి. పోలీసు బాసులకు, హోం శాఖకు అక్షింతలు వేసే రీతిలో కోర్టు స్పందించింది. దీంతో పోలీసులకు మానసిక ఒత్తిడి తగ్గించే రీతిలో యోగా తరగతులు ప్రతి వారం నిర్వహించే పనిలో పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పని భారంతో తన ఉద్యోగాన్ని వదులుకుంటూ రాజీనామా చేస్తూ ఓ మహిళా ఇన్స్పెక్టర్ లేఖ రాసి పెట్టి వెళ్లడం వెలుగులోకి రావడంతో చర్చకు దారి తీసింది. ఆలస్యంగా వెలుగులోకి.. సెంబియం మహిళా పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఇదయ కళ పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి ఓ లేఖ రాసి పెట్టి ఆమె వెళ్లి ఉండటం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. అందులో పనిభారం మరింతగా పెరిగిందని, పనిచేయలేని పరిస్థితి ఉందని, సహ అధికారులు సహరించడం లేదని వివరిస్తూ, తాను పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ తాను రాజీనామా చేస్తున్నామని అందులో ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే, ఉన్నతాధికారులు మాత్రం ఆమె మెడికల్ సెలవుల్లో ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. 1981లో పోలీసు శాఖలో చేరిన ఆమె 2020లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సమయంలో ఆమె పని భారంతో పదవిని వదలుకోవడం గమనార్హం. ఇదే రకంగా అనేక స్టేషన్లలో పనిచేస్తున్న మహిళా సిబ్బందే కాదు, కింది స్థాయి వారు అనేకమంది రాజీనామా అంటూ లేఖల్ని ఉన్నతాధికారులకు పంపినట్టు సమాచారం. -
బీజేపీ మంత్రుల రాజీనామా
-
ఏపీ: బీజేపీ మంత్రుల రాజీనామా
సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్ నుంచి బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు వైదొలిగారు. రాజీనామా లేఖలను గురువారం ఉదయం అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. సీఎం ఛాంబర్లో కామినేని భేటీ అయి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా లేఖ ఇచ్చిన మూడు నిమిషాల్లోనే మంత్రి మాణిక్యాలరావు వెనుదిరిగారు. బీజేపీ మంత్రులు అధికార వాహనాలను, ఐడీ కార్డులను వదులుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం తేల్చిచెప్పడంతో కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్న క్రమంలో ఏపీ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు అధిష్టానం ఆదేశాలతో బీజేపీ మంత్రులు సంసిద్ధమయ్యారు. అనుకున్న విధంగా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే సభలోనే మంత్రులు కామినేని, మాణిక్యాలరావు ముఖ్యమంత్రికి తమ రాజీనామా లేఖలను అందచేశారు. -
ఎట్టకేలకు దిగొచ్చిన జుమా
జోహెన్నెస్ బర్గ్ : ఎట్టకేలకు దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి జాకోబ్ జుమా రాజీనామా చేశాడు. బుధవారం సాయంత్రం తన నిర్ణయాన్ని ఓ టెలివిజన్ సంస్థ ద్వారా ఆయన ప్రకటించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన జుమా.. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను కూలంకశంగా వివరించారు. ఆరోపణలు... అవినీతితో దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీశాడని అధ్యక్షుడు జాకోబ్ జుమాపై ఆరోపణలు రుజువు అయ్యాయి. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం తదితర కారణాలు జుమాపై వ్యతిరేకత ఎక్కువ కావటానికి కారణాలు అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి దిగిపోవాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ) కోరింది. అయితే అందుకు ఆయన నిరాకరించటంతో సోమవారం ఏఎన్సీ అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించింది. వెంటనే ఆయన్ని రీకాల్ చేయాలని తీర్మానించింది. రాజీనామా చేయకపోతే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరింది. దీంతో దిగొచ్చిన జుమా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీనామా తర్వాత కూడా జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్సీ ప్రధాన కార్యదర్శి మగషులే తొలుత పేర్కొన్నారు. అయితే అందుకు జుమా సుముఖత చూపకపోవటంతో డిప్యూటీ ప్రెసిడెంట్ సిరిల్ రామాఫోసా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించనున్నారు. మరోపక్క ప్రభుత్వాన్ని పార్లమెంట్ను రద్దుచేసి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
బ్రేకింగ్: టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్బై....
-
నోకియా స్మార్ట్ఫోన్ల కేర్టేకర్ అనూహ్య నిర్ణయం
నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి పునఃప్రవేశపెట్టిన కొన్నినెలల్లోనే హెచ్ఎండీ గ్లోబల్ సీఈవో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండీ గ్లోబల్ సీఈవో ఆర్టో నుమెలా తన పదవి నుంచి నిష్క్రమించారు. ఆర్టో రాజీనామా చేయడంతో ప్రస్తుతం హెచ్ఎండీ గ్లోబల్కు అధినేతగా ఉన్న ఫ్లోరియన్ సెషినే సీఈవోగా విధులు నిర్వర్తించనున్నారని తెలిసింది. హెచ్ఎండీ గ్లోబల్ ఆపరేషన్స్ను సృష్టించడానికి, టీమ్ను రూపొందించడానికి, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఆర్టో నుమెలా కీలక పాత్ర పోషించారు. ఆర్టో అందించిన సహకారానికి కంపెనీ బోర్డు తరుఫున కృతజ్ఞతలు చెబుతున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ బోర్డు చైర్మన్ శామ్ చిన్ చెప్పారు. ఆయన భవిష్యత్తు లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలిపారు. కంపెనీ ప్రారంభమైన దగ్గర్నుంచి హెచ్ఎండీ గ్లోబల్కు అధినేతలాగా ఫ్లోరియన్ కో-లీడింగ్ సేవలందించినట్టు కొనియాడారు. ఆర్టో పదవిలో ఉన్న కాలంలో హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 3, 5, 6 స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో స్మార్ట్ఫోన్ నోకియా 8ను హెచ్ఎండీ గ్లోబల్ జూలై 31న మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతుంది. నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లలో కెల్లా అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ ఇదే. దీని ధర భారత్లో రూ.40వేలకు పైననే ఉంటుందని తెలుస్తోంది. స్టీల్, గోల్డ్/కాపర్, బ్లూ, గోల్డ్/బ్లూ రంగుల్లో ఇది అందుబాటులోకి రాబోతుంది. -
విశాల్ సిక్కాకు మరో ఎదురు దెబ్బ
-
విశాల్ సిక్కాకు మరో ఎదురు దెబ్బ
బెంగళూరు: ప్రముఖ ఐటీసేవల సంస్థ ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ తాజాగా గుడ్ బై చెప్పారు. ఇన్ఫోసిస్ లార్జ్ డీల్స్ బాస్ రితికా సూరి రిజైన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పనాయా ఒప్పందంలో కీలక పాత్ర వహించిన రితికా సంస్థను వీడారు. సిక్కాతో సంస్థలో జాయిన్ అయిన రితిక అత్యధిక వేతన తీసుకుంటున్న వారిలో రితికా కూడా ఒకరు. ముఖ్యంగా మొబైల్ సంస్థ స్కవా, పనాయా ఒప్పందంలోఎలాంటి లోపాలు కనబడలేదని తేల్చిన అనంతరం చోటు చేసుకున్న ఆమె రాజీనామా ఆసక్తికరంగామారింది. అయితే ఈ వార్తను ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇన్ఫోసిస్ లిమిటెడ్లో భారీ ఒప్పంద బృందానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల విలీనం, స్వాధీనాలకు సంబంధిత కీలక బాధ్యతలను స్వీకరించిన రితికా, పనాయా తో సహా రెండు కీలక ఒప్పందాలకు ఇన్ఫీ అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన అతి తక్కువ సయయంలోనే తన పదవికి రాజీనామా చేయడం చర్చకు తెరతీసింది. గతంలో విలీల్ సిక్కా (ఎం అండ్ అస్) ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు, కాగా ఇటీవల అమెరికాకు చెందిన న్యాయ సంస్థ చేసిన దర్యాప్తులో పన్యా, మొబైల్ కామర్స్ సంస్థ స్వావాతో సహా రెండు కంపెనీలు కొనుగోలు చేయాలనే విషయంలో మేనేజ్మెంట్ నిర్ణయంలో ఎటువంటి దోషమూ లేదని తేల్చింది. ఆగస్ట్ 2014 లో విశాల్ సిక్కా సీఈవోగా బాధ్యతలు స్వీకరిచిన తరువాత కీలక ఎగ్జిక్యూటివ్ సందీప్ దాడ్లని, తాజాగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సూరి సహా, ఇంకా 10 మంది కార్యనిర్వాహకులు ఇన్ఫోసిస్ నుంచి నిష్క్రమించారు. -
బలి.. తప్పలేదు మరి!
- జెడ్పీ చైర్మన్ పదవికి నామన రాజీనామా - అదే బాటలో వైస్ చైర్మన్ - కలెక్టర్కు రాజీనామా లేఖల అందజేత కాకినాడ సిటీ : స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన నాయకుడి కోసం.. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తున్న నేతలు బలవక తప్పలేదు. వైఎస్సార్ సీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు, అక్కడ అదే పార్టీ నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన నవీన్ టీడీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఫిరాయింపు వేళ కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా నవీన్ను జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు టీడీపీ వ్యూహం రచించింది. ఇందులో భాగంగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబును బలవంతంగా ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం ఆయనను జెడ్పీ పీఠం నుంచి తప్పించేందుకు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో నామన తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కలెక్టరేట్లో కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు అందజేశారు. అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్ కూడా తన పదవికి రాజీనామా చేసి ఆ పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. పార్టీ ఆదేశానుసారమే.. ఈ సందర్భంగా నామన మీడియాతో మాట్లాడుతూ, మూడేళ్లుగా జిల్లా అభివృద్ధికి కృషి చేశానన్నారు. పార్టీ ఆదేశానుసారం పదవికి రాజీనామా చేశానని, తనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు ఎంతగానో సహాయ సహకారాలు అందించారన్నారు. వేసవిలో నీటికొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో 42 ప్రాజెక్టులకు తాత్కాలిక మరమ్మతులు చేయించి తాగునీటికి ఇబ్బంది లేకుండా చూశామని చెప్పారు. మారుమూల గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేశానన్నారు. తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులుకు కృతజ్ఞతలు తెలిపారు. తనను టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. -
టాటా గ్రూపులో మరో రాజీనామా
ముంబై: ఇండియన్ హోటల్స్ (తాజ్) ఎండీ, సీఈవో రాకేష్ సర్నా తన పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చెలరేగిన సుమారు రెండు సంవత్సరాల తర్వాత, మిస్త్రీ ఉద్వాసాన అనంతరం హోటల్ తాజ్ కు రాకేష్ సర్నా గుడ్ బై చెప్పారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా ఐహెచ్సీఎల్ కంపెనీ మరియు దాని అనుబంధ సంస్థల డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారని ఇండియన్ హోటల్స్ బిఎస్ఇకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది. సర్నా తన మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత పదవీ విరమణ చేసినట్లు టాటా సన్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీల ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. సర్నా నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపిందనీ, సెప్టెంబర్ 30 దాకా కొనసాగాలని కోరినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించినట్టు చంద్రశేఖరన్ తెలిపారు. కాగా 2015లో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇండియన్ హోటల్స్ కంపెనీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర విచారణ కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్ గా ఉద్వాసనకు గురైన టాటా మిస్త్రీ నియమించిన టాటా కుటుంబానికి చెందని వ్యక్తులలో ఈయన ప్రముఖులు. మిస్త్రీ ఉద్వాసన తరువాత ఈయన కూడా వైదొలగుతారని అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. టాటా గ్రూప్ సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ గత ఏడాది అక్టోబర్ 24 న తొలగించింది. ఈ తొలగింపునకు దారి తీసిన కారణాల్లో ఇండియన్ హోటల్స్ కంపెనీ సీఈవో రాకేష్ సర్నా వచ్చిన ఈ లైంగిక వేధింపుల కేసు కూడా ఒకటై ఉండవచ్చునన్న వార్త గుప్పుమన్న సంగతి తెలిసిందే. -
నన్నయ రిజిస్ట్రార్ రాజీనామా
- ‘నన్నయ’ యూనివర్సిటీలో కళకలం సృష్టిస్తున్న ఆటోమేషన్ టెండర్ - వీసీకి రిజిస్ట్రార్కి మధ్య పెరుగుతున్న అంతరం - రిజిస్ట్రార్పై చర్యకు దళిత ఉద్యోగుల డిమాండ్ - రాజీనామా చేసిన రిజిస్ట్రార్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న ‘ఆటోమేషన్ టెండర్’ ఘటన చినికి చినికి గాలివానగా మారి చివరకు రిజిస్ట్రార్ తన పదవికి రాజీనామా చేసే వరకూ దారితీసింది. యూనివర్సిటీలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ‘ఆటోమేషన్’ విధానాన్ని తీసుకువచ్చేందుకు టెండర్లు పిలవడం, మూడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. ఈ టెండర్లు ఖరారు విషయమై వీసీకి, రిజిస్టార్కి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వీసీ చర్యలను సమర్థిస్తూ ఆటోమేషన్ విధానంపై ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదంటూ ఇటీవల యూనివర్సిటీ ఇద్దరు డీన్స్, ప్రిన్సిపాళ్లు ప్రెస్మీట్ పెట్టి ఆరోపణలను ఖడించారు కూడా. అయినా సమస్య సద్దుమణగలేదు. వీసీ, రిజిస్ట్రార్లు ఎడమెహం, పెడమెహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రిజస్ట్రార్పై ఫిర్యాదు... గురువారం కొంతమంది దళిత ఉద్యోగులు తమ పట్ల రిజిస్ట్రార్ కులవివక్షత చూపిస్తున్నారని, ఆయన పై చర్య తీసుకోవాలంటూ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలు నాయుడికి నేరుగా ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు తాళ్లూరి బాబురాజేంద్రప్రసాద్, బీసీ ప్రజాసంక్షేమ సంఘం అధ్యక్షుడు మేరపురెడ్డి రామకృష్ణ, రాష్ట్ర ఎస్టీ సంఘం అధ్యక్షుడు కె. నారాయణరావు, రాష్ట్ర ప్రజాసంక్షేమ యువజన సంఘం అధ్యక్షుడు మహ్మద్ ఖాసీం, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, బీసీ సంఘాల అధ్యక్షుడు పిచ్చుక అనిల్కుమార్, దళిత నాయకులు అజ్జరపు వాసు తదితరులు 48 గంటల్లోగా ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనస్థాపంతోనే రాజీనామా విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు తనపై కులముద్ర పడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. మనస్థాపంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా గురువారం సాయంత్రం ప్రకటించారు. తాను చదివింది నోబుల్ కాలేజీలోనని, అక్కడ ఎక్కువ శాతం మంది దళితులేనని, వారే తనకు స్నేహితులన్నారు. ఇంతకాలం వారందరి మిత్రత్వంలో ముందుకు వెళ్లిన తనపై కులముద్ర వేయడం తట్టుకోలేకనే రాజీనామా చేస్తున్నానన్నారు. అందరినీ నా వారిగా చూసే తనపై దళిత వ్యతిరేకిననే ముద్ర వేయడాన్ని మానసికంగా తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ ఘటన మున్ముందు ఎంతవరకు దారితీస్తుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
మహిళతో అశ్లీల వ్యాఖ్యలు.. మంత్రి రాజీనామా
తిరువనంతపురం: ఓ మహిళను కేరళ రవాణాశాఖ మంత్రి ఏకే శశింద్రన్ లైంగికంగా వేధిస్తూ అసభ్యంగా సంభాషించిన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం మంత్రి చర్యను తప్పుబట్టగా ఆదివారం మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. విషయం ఏంటంటే.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ నేత ఏకే శశింద్రన్(71) రవాణా మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి శశింద్రన్ గత కొన్ని రోజులుగా ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళకు తరచుగా ఫోన్ చేస్తూ తన కోరికను తీర్చాలంటూ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను మంగళం అనే స్థానిక మీడియో ప్రసారం చేసి మంత్రి వ్యవహారాన్ని బటయపెట్టింది. తనకు సాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ మంత్రి శశింద్రన్ వద్దకు వెళ్లగా అప్పటినుంచీ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారని ఆడియో టేపుల సారాంశం. ఇది తీవ్రమైన చర్య అని మంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. బాధిత మహిళ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆడియో టేపుల సాక్ష్యాలున్నాయని.. ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ నేతలు మంత్రి శశింద్రన్ రాజీనామాకు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉత్తర కేరళ కోజీకోడ్లో ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆడియో టేపుల వివాదంపై మంత్రి శశింద్రన్ వివరణ ఇచ్చారు. 'నేను ఎవరితోనూ ఆ విధంగా సంభాషించలేదు. నా పదవికి రాజీనామా చేశాను. ప్రభుత్వంలో మా పార్టీ వల్ల ఎలాంటి విభేదాలు తలెత్తకూడాదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆడియో టేపుల ఆరోపణలపై సీఎం పినరయి విజయన్ ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాను' అని శశింద్రన్ అన్నారు. -
నాగాలాండ్ సీఎం రాజీనామా
కోహిమా: నాట కీయ పరిణామాల మధ్య నాగాలాండ్ సీఎం టీఆర్ ఝెలియాంగ్ ఆదివారం రాజీ నామా చేశారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో తప్పనిసరి పరిస్థిత్లులో ఝెలియాంగ్ రాజీనామా చేశారు. దీన్ని గవర్నర్ పీబీ ఆచార్య ఆమోదించారు. సోమవారం ఉదయం 11 గంటలకు డెమొక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డీఏఎన్ ) సమావేశమై కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనుంది. మాజీ సీఎం, రాష్ట్ర ఏకైక ఎంపీ నేఫియూ రియో తదుపరి సీఎంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. 60 మంది ఎమ్మెల్యేలున్న నాగా అసెంబ్లీలో రియోకు 49 మంది ఎమ్మెల్యేల బలముంది. కాగా, రెండ్రోజుల క్రితమే ఝెలియాంగ్ కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ను కలిశారు.