rta office
-
ఆర్టీవో ఆఫీసులో దసరా, దీపావళి దందా..!
సాక్షి,విశాఖపట్నం: విశాఖ ఆర్టీవో కార్యాలయంలో దసరా,దీపావళి దందాకు తెరతీశారు. రెండు నెలల నుంచి వేల సంఖ్యలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ రిజిస్ట్రేషన్లను అధికారులు పెండింగ్ పెట్టారు. ఉద్దేశ్య పూర్వకంగానే రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ అధికారులు పెండింగ్లో ఉంచినట్లు తెలుస్తోంది.రిజిస్ట్రేషన్ల పెండింగ్కు ఏదో ఒక సాకు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఒకటికి పది సార్లు తిప్పించుకుంటున్నారు.రిజిస్ట్రేషన్ జరగాలంటే 500 నుంచి 1000 వరకు చేతులు తపాలని ఆర్టీఏ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పని జరగాలంటే తమ డ్రైవర్లను కలవాలని కొందరు అధికారులు షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు.డ్రైవర్లతో వాట్సాప్ కాల్లోనే మాట్లాడాలని ఆ అధికారులు సూచిస్తున్నారు. తమ డ్రైవర్లకు ఎంతోకొంత ముట్టజెప్పిన వారికే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ రవాణా కమిషనర్(డీటీసీ)కి తెలియకుండా కిందిస్థాయి సిబ్బందే ఈ దందా నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంతో విసిగిపోయిన టూ వీలర్,ఫోర్ వీలర్ వాహనాల డీలర్లు డీటీసీని మంగళవారం(అక్టోబర్ 29) కలవనున్నారు. గంభీరం నుంచి ఇటీవల బదిలీపై వచ్చిన అధికారి,మరో మహిళా అధికారితో కలిసి ఈ వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు చెబుతున్నారు. ఆర్టీఏ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: బాంబు బెదిరింపులతో హడల్ -
HYD: ఫ్యాన్సీ క్రేజ్.. ఆ నెంబర్కు రూ. 21 లక్షలు!
హైదరాబాద్: ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పైగా ఖరీదైన వాహనాలకూ నెలవైన హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో అది ఇంకా ఎక్కువే కనిపిస్తుంటుంది కూడా. సెంటిమెంట్, ఇష్టమైన నంబర్ను దక్కించుకునేందుకు వాహనాల యజమానులు ఎంతదాకా అయినా ఖర్చు చేసిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో.. ఇవాళ ఒక్కరోజే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కాసుల వర్షం కురిసింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ. 53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్కు రూ. 21.60 లక్షలు పలుకగా, ఫ్యాన్సీ నెంబర్ పోటీలో అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్కు రూ. 1.04 లక్షలు పలికింది. ఫ్యాన్సీ నంబర్లు – రేటు – సంస్థలు టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 లక్షలు – ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ 09 జీడీ 0009 – రూ. 10.50 లక్షలు – మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టీఎస్ 09 జీడీ 0001 – రూ. 3 లక్షలు – ఆంధ్రా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ టీఎస్ 09 జీడీ 0006 – రూ. 1.83 లక్షలు – గోయజ్ జ్యువెలరీ టీఎస్ 09 జీడీ 0019 – రూ.1.70 లక్షలు – సితారా ఎంటర్టైన్మెంట్స్ టీఎస్ 09 జీడీ 0045 – రూ.1.55 లక్షలు – సాయి పృథ్వీ ఎంటర్ప్రైజెస్ టీఎస్ 09 జీడీ 0007 – రూ. 1.30 లక్షలు – ఫైన్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ 09 జీడీ 0027 – రూ. 1.04 లక్షలు – శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ -
ఫిట్'లెస్' బడి బస్సులు... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన స్కూల్ బస్సులు 224 ఉన్నాయి. ఒక్కో బస్ ఫిట్నెస్ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి రూ.5వేలు ఖర్చవుతుంది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తాయి. ఈ లెక్కన ఒక బస్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా 40 మందికి నెలకు రూ.40 వేలు వసూలు చేస్తారు. కానీ జిల్లా వ్యాప్తంగా 85 బస్సులు ఇప్పటివరకు ఫిట్నెస్ చేయించుకోకుండా వారి స్వలాభం కోసం అలాగే నడుపుతున్నారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే స్కూలు యాజమాన్యాలు కేవలం ఫిట్నెస్ కోసం రూ.5 వేలు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి. నిర్మల్చైన్గేట్: విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను తరలించే వాహనాలకు యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ పాఠశాలలు ప్రారంభమై పది రోజులు కావస్తున్నా యాజమాన్యాలు ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ నెల 12 వరకు అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. అయినా కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు చెందిన బస్సులు 224 ఉండగా ఈ నెల 22 వరకు 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా 85 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం జిల్లాలోని 208 ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 35 వేలకు పైబడి విద్యార్థులు చదువుతున్నారు. పిల్లల ను పాఠశాలల నుంచి తీసువెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వేలకు వేలు ఫీజులు గుంజుతున్న ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల ప్రా ణాలతో చెలగాటమాడుతున్నాయి. జిల్లాలో 224 బ స్సులు ఉండగా 139 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందినట్లు సంబంధిత అధికారులు తెలి పారు. పలు ప్రాంతాల్లో కళ్లముందే ప్రమాదాలు కని పిస్తున్నప్పటికీ అటు అధికారులు, ఇటు యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఫిట్నెస్పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొనసాగుతున్న దళారుల దందా... అమ్మానాన్నలకు బైబై చెప్పి బడికి బయలుదేరుతు న్న చిన్నారులను భద్రంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలది. ఈ బస్సులకు ‘ఫిట్నెస్’ జారీ చేయాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ(ఆర్టీఏ) కార్యాలయాల్లో దళా రుల దందా జోరుగా సాగుతోంది. ఒక్కో వాహనానికి వేలల్లో మామూళ్లు ఇస్తేనే సర్టిఫికెట్ జారీ అవుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తాము అధికారులకు కమీషన్లు ముట్టజెప్పాల్సి వస్తోందని దళారులు బాహాటంగానే చెబుతున్నారు. చేతులు తడిపిన యా జమాన్యాల వాహనాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగా కరోనా కష్టాల నుంచి ఇంకా కోలుకోని కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఏజెంట్లు అడిగినంత ఇవ్వలేక అవస్థలు పడుతున్నాయి. ఫలితంగా బడులు ప్రారంభమైనా ఇప్పటివరకు 85 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ కాకపోవడం గమనార్హం. తనిఖీల జాడేది? విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి 11 రోజులు గడుస్తున్నా ఆర్టీఏ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించడం లేదు. దీంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులను ఎటువంటి ఫిట్నెస్ లేకుండానే యథేచ్ఛగా తిప్పుతున్నాయి. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు, డిజిగ్నీషన్, సెల్ నంబర్, బస్సు మోడల్, డ్రైవర్ వివరాలు, అటెండెంట్, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి, తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకులంగా 325 మి.మీ ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి. ● ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేసి ఉండాలి. ● విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్కు కనబడేలా రెండు వైపులా సైడ్ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి. ● వాహనం టైర్లు, బ్రేక్లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందిందో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉంచాలి. ● పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ● రాత్రి వేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి. ఫిట్నెస్ లేకుంటే చర్యలు అనుమతులు లేకుండా పాఠశాల యాజమాన్యాలు స్కూల్ బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూల్ యాజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్నెస్ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్గా నియమించుకోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం. – అజయ్కుమార్, జిల్లా రవాణాశాఖ అధికారి -
నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: వాహన బీమాలో కొన్ని సంస్థలు మాయాజాలం చేస్తున్నాయి. ఏకంగా ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టిస్తున్నాయి. సదరు సంస్థల బీమాకు వాహన్ పోర్టల్లోనూ ఆమోదం లభించడం గమనార్హం. సాధారణంగా ఎలాంటి వాహనాలకైనా ఏడాదికోసారి బీమాను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలి. బీమా సంస్థలు కనీసం ఏడాది ప్రీమియాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం కొన్ని బీమా సంస్థలు నెల రోజుల వ్యవధితో పత్రాలను అందజేస్తున్నాయి. వీటి ఆధారంగానే కొందరు అధికారులు వాహనాలకు అన్ని రకాల పౌరసేవలను అందజేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్, బదిలీ, అమ్మకాలు, చిరునామా మార్పు వంటి అంశాల్లో అన్ని రకాల డాక్యుమెంట్లతో పాటు సదరు వాహనానికి ఉన్న బీమా కాలపరిమితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. కనీసం ఏడాది పాటు బీమా గడువు ఉన్న వాహనాలకే ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించి వాహన సామర్థ్యాన్ని ధృవీకరించవలసి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఆటో రిక్షాలు, క్యాబ్లు వంటి ప్రజా రవాణా వాహనాల్లో ఇది బేఖాతరు అవుతోంది. ప్రయాణికులు, వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంతో కీలకంగా భావించే బీమాపత్రాల్లో ఎలాంటి పారదర్శకతను పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇలాంటి బీమా పత్రాలకు వాహన్ పోర్టల్లో సైతం ఆమోదం లభించడం విచిత్రంగా ఉంది’ అని ఇబ్రహీంపట్నానికి చెందిన మోహన్ అనే వాహన యజమాని విస్మయం వ్యక్తం చేశారు. తప్పించుకొనేందుకే... నెల రోజుల గడువుతో ఇస్తున్న బీమా పత్రాలు ఇటు వాహనదారులకు, అటు సదరు బీమా సంస్థలకు ఉభయ తారకంగా మారాయి. కొందరు వాహన యజమానులు బీమా భారాన్ని తప్పించుకొనేందుకు కేవలం రూ.1500 చెల్లించి నెల గడువు కలిగిన బీమాను పొందుతున్నారు. ఇది ఆ సంస్థలకు చక్కటి ఆదాయ మార్గంగా మారింది. నిజానికి ఆటోరిక్షాలు, క్యాబ్లు, తదితర వాహనాలకు ఏడాది ప్రీమియం కలిగిన థర్డ్పార్టీ బీమా పొందాలంటే రూ.7000 నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. వ్యక్తిగత కార్లకు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ భారాన్ని తప్పించుకొనేందుకే బీమా సంస్థలు, వాహనదారులు కొత్త ఎత్తుగడను ఎంచుకొన్నాయి. బీమా ప్రీమియం గడువును ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టీఏ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ ఇచ్చేస్తున్నారు. యాజమాన్య మార్పిడి, చిరునామా మార్పు, తదితర రవాణా సేవలను అందజేస్తూ తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. నకిలీల వెల్లువ.. మరోవైపు వాహన బీమాలో నకిలీ పత్రాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాల రెన్యువల్స్లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కొందరు ఏజెంట్లు ఏడాది విలువ కలిగిన నకిలీ పత్రాలను సృష్టించి రూ.1000 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఇలాంటి పత్రాల ఆధారంగానే వాహనదారులు అధికారులను సంప్రదిస్తున్నారు. కొన్ని చోట్ల అవి నకిలీవో, అసలువో నిర్ధారించుకోకుండానే ఏజెంట్లపై ఆధారపడి అన్ని రకాల అనుమతులు ఇవ్వడం గమనార్హం. చదవండి వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు! -
పవన్ కల్యాణ్ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఆరు వాహనాలను ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిలో ఒకటి బెంజ్, మరో రెండు స్కార్పియో కార్లు ఉ న్నాయి. టయోటా వైల్ఫైర్ వాహనంతో పాటు ఒక జీప్ ర్యాంగ్లర్, ఒక టాటా యోధ ట్రాన్స్పోర్టు వాహనం పవన్కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకున్నారు. ఉపరవాణా కమిషనర్ పాపారావు, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: (కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం) -
నయా నకిలీ దందా.. రూ.900కే వెహికిల్ ఆర్సీ..
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఆర్సీలు, ఆధార్ కార్డులను సృష్టించి సొమ్ము చేసుకోవడంతో పాటు కొత్త ఆర్సీ జారీతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు నకిలీ ఆర్సీ ముఠాను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ డీసీపీ సందీప్తో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం వివరాలు వెల్లడించారు. నగరంలోని యూసుఫ్గూడ వాసి షేక్ జాంగీర్ బాషా, కిషన్బాగ్కు చెందిన సయ్యద్ హుస్సేన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి సంపత్.. వీరు ముగ్గురు అత్తాపూర్, భద్రాద్రి కొత్తగూడెం రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయాల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాలోని లొసుగులను ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. ప్రధాన నిందితుడు శంషాబాద్ రాళ్లగూడకు చెందిన చామన సతీష్, కాటేదాన్కు చెందిన డీటీపీ ఆపరేటర్ ఎం గణేష్, వాహన మధ్యవర్తులు అల్వాల్కు చెందిన కలిగిడి చంద్రశేఖర్, మదీనాగూడ వాసి సీహెచ్ రమేష్లు ముఠాగా ఏర్పడ్డారు. ఆర్టీఏలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో ఆర్సీ కార్డు చేతికివ్వరు. వాహనదారు సూచించిన ఇంటి అడ్రస్కు కొరియర్ ద్వారా వస్తుంది. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నా లేదా వాహనదారు ఇల్లు మారినా, మరే కారణంతోనైనా ఆర్సీ తీసుకోని పక్షంలో అది తిరిగి ఆర్టీఏ కార్యాలయానికి వస్తుంది. ఇలా వచ్చిన ఆర్సీలను జాంగీర్ బాషా, సయ్యద్ హుస్సేన్, సంపత్లు దొంగిలించి.. ఒక్కో ఆర్సీని రూ.900 చొప్పున సతీష్, చంద్రశేఖర్, రమేష్లకు విక్రయిస్తారు. డేటా ఆపరేటర్ గణేష్ ఆయా ఒరిజినల్ ఆర్సీ కార్డులపై ఉన్న యజమాని వివరాలను నెయిల్ పాలిష్ (డాజ్లర్)తో తొలగించి నకిలీ ఆర్సీలను సృష్టిస్తాడు. ఆయా బ్రోకర్ల నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వాహనాదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి సందర్శించినప్పుడు కొత్త ఆర్సీలు జారీ కావు. ఎందుకంటే ఒరిజినల్ ఆర్సీని అధికారులు స్వాధీనం చేసుకొని ఆధార్ కార్డును ధ్రువీకరించుకున్న తర్వాతే కొత్త ఆర్సీ జార్సీ చేస్తారు గనక! దీంతో ఆయా వాహన బ్రోకర్లు అంతకుముందే సృష్టించిన నకిలీ ఆర్సీ, ఆధార్ కార్డులను వాహనాదారులకు అందిస్తారు. వీటిని ఆర్టీఏ అధికారులకు సమర్పించి.. వాహనదారులు కొత్త ఆర్సీలను తీసుకుంటారు. ఒడిశా వాహనాలకు నకిలీ ఆర్సీ కాపీలు సృష్టిస్తున్నారని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దృష్టికి రావటంతో రంగంలోకి దిగారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 వేల నగదుతో పాటు 1,200 నకిలీ ఆర్సీలు, 29 రబ్బర్ స్టాంపులు, 75 ఆధార్ కార్డులు, రెండు ల్యాప్టాప్లు, సీపీయూ లు, ప్రింటర్లు, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి గత కొన్ని నెలలుగా ఈ ముఠా నకిలీ ఆర్సీ బాగోతాన్ని నడుపుతోంది. ఒక్కో ఆర్సీ జారీ ద్వారా ప్రభుత్వానికి వచ్చే రూ.1,000 నుంచి 1,200 ఆదాయానికి గండిపడింది. సుమారు వెయ్యి వా హనాలకు నకిలీ ఆర్సీలను సృష్టించారు. ఆయా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. వాహనాలను దొంగతనం చేసే నేరస్తులకు కూడా నకిలీ ఆర్సీలను ఇవ్వాలని ఈ మోసగాళ్లు భావించినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
బాలానగర్ వంతెనపై దారుణం: సేప్టీ గోడకు గుద్దుకుని..
సాక్షి, హైదరాబాద్: అతి వేగం ప్రమాదకరం.. హెల్మెట్ లేని ప్రయాణం వద్దు అని ఎంత ప్రచారం చేసినా పట్టించుకోరు కొందరు. చివరకు ఏం అవుతుంది.. అంటే ఇదిగో ఇలా ఊహించని విధంగా ప్రమాదాలకు గురై మరణించే పరిస్థితులు తలెత్తుతాయి. బాలానగర్లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ మీద బైక్పై అతి వేగంగా వెళ్తూ.. అదుపుతప్పి సేఫ్టీ గోడకు గుద్దుకుని బుధవారం ఓ యువకుడు మృతి చెందాడు. లైసెన్స్ తీసుకునేందుకు ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్(24) అనే యువకుడు లారీ డ్రైవర్గా చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చిన అశోక్.. లైసెన్స్ తీసుకునేందుకు బైక్ మీద తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. బాలానగర్ వంతెనపై నుంచి అతి వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్ను ఢీ కొట్టాడు. ఇది గమనించిన స్థానికుల వెంటనే 108లో అశోక్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిద్రమత్తు కారణంగానే బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
ఖైరతాబాద్లో ప్రత్యక్షమైన ప్రభాస్
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభాస్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు సైతం ప్రభాస్తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. కరోనా టైమ్ కాబట్టి ప్రభాస్ మాస్కు ధరించే బయటకు వచ్చారు. దీంతో మాస్కులో ఉన్న హీరోతో ఫొటోలు దిగేందుకు అక్కడి జనం ఉత్సాహం ప్రదర్శించడంతో వారిని నొప్పించడం ఇష్టం లేని డార్లింగ్ ఫొటోలకు పోజిచ్చారు. ఇదిలా వుండగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నారు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. తన 21వ చిత్రాన్ని 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జోడీగా నటించనున్నారు. (దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?) -
ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నం
సాక్షి,హైదరాబాద్:ఆటో,క్యాబ్డ్రైవర్ల యూనియన్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముట్టడికి యత్నించాయి. పెద్దఎత్తున నిరసన తెలుపుతూ యూనియన్ నాయకులు ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 2019 మోటార్ వాహన చట్టం సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలన్నారు. రవాణా రంగ కార్మికులకు రూ. 7,500 ఆర్థిక సహాయం ఇవ్వాలని తెలిపారు. కార్మిక చట్టాలను సవరించాలని కోరారు. ప్రైవేటు అప్పులను 6నెలలు వాయిదా వేయాలన్నారు. అదే విధంగా క్యాబ్ జేఏసీ నాయకుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. ఓల, ఉబర్ డ్రైవర్ల నుంచి యాజమాన్యం తీసుకుంటున్న 20 శాతం కమిషన్ ఆపాలన్నారు. టోల్ టాక్స్, రోడ్ టాక్స్లను వెంటనే ఎత్తివేయాలిని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ చార్జీలను తగ్గించాలన్నారు. -
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : కేరళ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్ బార్డర్ టాక్స్ ఏడాది కాలం పాటు రద్దు చేయడం, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ స్టేట్ క్యాబ్స్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. సోమవారం ఉదయం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బస్సులలో చేరుకొని ధర్నాకు దిగారు. రోడ్డుకు ఇరువైపులా బస్సులు నిలపడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆర్టీఏ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మొహరించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధర్నాను విరమించబోమని తెలంగాణ స్టేట్ క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. బార్డర్ టాక్స్ ఏడాది పాటు రద్దు చేయాలి ఆంధ్ర, తమిళనాడు, కేరళకు వేళ్లే వాహనాల బార్డర్ టాక్సులు రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ క్యాబ్ అండ్ బస్ ఆపరేటర్ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా బస్సులు రోడ్డు ఎక్కలేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలని కోరారు. -
వాహన కాలుష్యానికి.. ఆన్లైన్ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : వాహన కాలుష్యానికి ఆన్లైన్ తనిఖీలతో కళ్లెం వేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు మనుషుల ద్వారా నిర్వహించే కాలుష్య తనిఖీ పరీక్షలను ఇక నుంచి ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా నిర్వహించనున్నారు.కేంద్రమోటారు వాహన చట్టంలో రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తారు. గ్రేటర్లో వాహన కాలుష్యం రోజు రోజుకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కొత్త వాహనాలతో పాటు, కాలం చెల్లిన వాహనాలు సైతం రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పాత వాహనాలు ప్రమాదకరమైన కాలుష్యకారక పదార్ధాలను వెదజల్లుతున్నాయి. వాటికి నిర్వహించే కాలుష్య తనిఖీల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదు. రోడ్లపై అక్కడక్కడా కనిపించే సంచార పరీక్షాకేంద్రాల్లో ఉత్తుత్తి తనిఖీలను నిర్వహించేస్తున్నారు. రూ.యాభయ్యో, రూ.వందో తీసుకొని కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలను ఇచ్చేస్తున్నారు. ఆర్టీఏ అధికారులు వాటినే ప్రామాణికంగా తీసుకొని వాహనాల సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తున్నారు. దీంతో యథావిధిగా ఈ వాహనాలు భయంకరమైన కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం 55 లక్షల వాహనాలు ఉన్నాయి. బీఎస్ –4 ప్రమాణాల మేరకు ఉన్న కార్లు, బైక్లు, తదితర వ్యక్తిగత వాహనాలు మినహాయిస్తే బస్సులు, ఆటోలు, లారీలు, ఇతర ప్రయాణికుల రవాణా వాహనాల్లో లక్షల కొద్దీ పాత వాహనాలే ఉన్నాయి. బీఎస్–2, బీఎస్–3 వాహనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలాంటి వాటి నుంచి ప్రమాదకరమైన సల్ఫర్, కార్బన్మోనాక్సైడ్, కార్బన్డయాక్సైడ్, లెడ్ వంటివి పెద్ద మొత్తంలో విడుదలవుతున్నప్పటికీ ఇప్పుడు ఉన్న మాన్యువల్ పద్ధతిలో సరిగ్గా నిర్ధారించలేకపోతున్నారు. పైగా కాలుష్య తనిఖీ నియంత్రణ స్టేషన్లపైన ఎలాంటి నిఘా లేకపోవడం వల్ల 80 శాతం ఉత్తుత్తి తనిఖీలతోనే వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ‘స్మార్ట్చిప్’తో ఒప్పందం... కాలుష్యనియంత్రణపైన రవాణా అధికారులు కొంత కాలంగా తీవ్రంగా దృష్టిసారించారు. ఇప్పుడు ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చివేసి మనుషులతో ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే వాహనాల కాలుష్యాన్ని నిర్ధారించాలనే ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా సాంకేతిక సంస్థల నుంచి గతేడాది టెండర్లను ఆహ్వానించారు.పలు సాంకేతిక సంస్థలు పోటీపడ్డాయి. వాటిలో ఢిల్లీకి చెందిన ‘స్మార్ట్చిప్’సంస్థను ఎంపిక చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ సంస్థతో ఒప్పదం కుదుర్చుకోనున్నట్లు రవాణాశాఖ ఐటీ విభాగం సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’ కి చెప్పారు. కేంద్ర మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు కాలుష్య కారకాలను గుర్తించి సర్టిఫికెట్లను అందజేయడంలో తమకు ఈ సంస్థ సాంకేతిక సాయం అందజేస్తుందన్నారు. నగరంలోని సుమారు 350 కి పైగా ఉన్న కాలుష్య తనిఖీ వాహనాలను, కేంద్రాలను ఆన్లైన్ పరిధిలోకి తేనున్నామన్నారు. రహదారులపై వాహనాలకు కాలుష్య పరీక్షలు నిర్వహించినప్పుడు వాటి కాలుష్యం ఏ స్థాయిలో ఉందనేది ఖైరతాబాద్లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలోనే ఆన్లైన్లో నిర్ధారించి సర్టి ఫికెట్లను అందజేస్తారు. తనిఖీ కేంద్రాల్లోని ప్రింటర్ల ద్వారా ఈ సర్టిఫికెట్లు వాహనదారుడికి చేరుతాయి. ఎక్కడా మనుషుల ప్రమేయానికి తావు ఉండదు. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. మరోవైపు ఇప్పుడు ఉన్న తనిఖీ కేంద్రాలను కూడా పెంచుతారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం పొందేవిధంగా పర్యవేక్షిస్తారు. పాత పద్ధతికి స్వస్తి.. కేంద్రమోటారు వాహనచట్టం 1988 ప్రకారం కాలుష్య నియంత్రణకు 2002లో తనిఖీ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని పెట్రోల్ బంకులలో ఏర్పాటు చేసిన స్థిరమైన కేంద్రాలు. కాగా. మరికొన్ని సంచార టెస్టింగ్ స్టేషన్లు. ఈ కేంద్రాల్లో గ్యాస్ అనలైజర్లు, స్మోక్ మీటర్లు ఉంటాయి. వాటి సాయంతో వాహనం నుంచి వెలువడే పొగసాంద్రత, దానిలోని కాలుష్య కారక పదార్ధాలను నిర్ధారిస్తారు. కానీ కొన్ని స్టేషన్లలో అనలైజర్లు, స్మోక్మీటర్లు పని చేయడం లేదు. కేవలం ఉత్తుత్తి తనిఖీలతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు, రవాణా అధికారులు ఈ స్టేషన్ల పై ఎలాంటి తనిఖీలు నిర్వహించపోవడం, చట్టపరమైన చర్యలు లేకపోవడం వల్ల అవి యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. వీటికి ఇక కళ్లెం పడనుంది. -
నంబర్ ప్లేట్.. బాగా లేట్
తిరుపతికి చెందిన రామకృష్ణారెడ్డి ఐదు నెలల క్రితం ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశాడు. నంబర్ ప్లేట్ కోసం రోజూ తిరుపతి రవాణాశాఖ కార్యాలయం సమీపంలోని నంబర్ ప్లేట్ విక్రయ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు. ఫలితం లేదు. కొనుగోలు చేసిన వాహనంపై వెళ్తుండగా శుక్రవారం తనిఖీ అధికారులు ఆపారు. నంబర్ ప్లేట్ లేదని అపరాధ రుసుం వసూలు చేశారు. తాను చేయని తప్పునకు శిక్ష అనుభవించాడు. తిరుపతి అన్నమయ్యసర్కిల్: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారుల జేబులకు చిల్లుపడుతోంది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసి న వారికి సకాలంలో నంబర్ ప్లేట్లు అందడం లేదు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి పరిధిలో ఆరు నెలలుగా వేలాది మంది వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నెలలు గడుస్తున్నా నంబ ర్ ప్లేట్లు అందలేదు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రవాణాశాఖ డిజిటలైజేషన్ పేరుతో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు శ్రీకారం చుట్టి న విషయం తెలిసిందే. ఈ ప్లేట్ల తయారీ ప్రక్రియను రవాణాశాఖ ‘లింక్ ఆటో టెక్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ ’ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించింది. కాంట్రాక్ట్ తీసుకున్న మొదట్లో నంబర్ ప్లేట్లు సకాలంలోనే అందేవి. కొంత కాలంగా తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసినవారంలోపు నంబర్ప్లేట్స్ అందజేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా 10వేలకుపైగా వాహనాలకు ఆరునెలలుగా నంబర్ప్లేట్స్ అందలేదు. ఏపీ03 సీయూ సీరీస్లోనైతే మరీ దారుణంగా ఈ జాప్యం కనబడుతోంది. ఒక్క తిరుపతి పరిధిలోనే ఇప్పటివరకు 6వేల వాహనాలకు నెలలు గడుస్తున్నా నంబర్ప్లేట్స్ సరఫరా చేయకపోవడం గమనార్హం. అడుగడుగునా తనిఖీలతో జేబులకు చిల్లు.. కొత్త వాహనాల కొనుగోలుదారులు అధికారుల తనిఖీలతో బెంబేలెత్తుతున్నారు. రోజు నంబర్ప్లేట్ విక్రయకేంద్రం వద్దకు వచ్చి తమ వాహనాల నంబర్ప్లేట్స్పై ఆరా తీస్తున్నారు. విక్రయ కేంద్రంలోని సిబ్బందికి సైతం జాప్యంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇటు వాహనదారులు... అటు రవాణా శాఖ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆర్టీఓ ఆఫీసులోని హెల్ప్ డెస్క్ను ఆశ్రయిస్తున్నారు. కంపెనీ జిల్లా ఇన్చార్జికి సైతం ఫిర్యాదు చేసినా సరైన సమాధానం ఇవ్వకపోవటంతో వాహనదారులు మండిపడుతున్నారు. నంబర్ప్లేట్లలో వచ్చిన తప్పులు.. వాటిని అందజేయడంలో జరుగుతున్న జాప్యంపై ఎదురవుతున్న సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్కాని, టోల్ఫ్రీ నంబర్కాని అందుబాటులో లేవు. దీనిపై సాక్షి ఆరాతీయగా ఆన్లైన్లో డేటా జాప్యంతో ఈ సమస్య ఏర్పడిందని, ప్రస్తుతం నంబర్ ప్లేట్ తయారీ చురుకుగా కొనసాగుతోందని సమాధానమిచ్చారు. -
ఆర్టీసీ కార్యాలయంలో మసాజ్ సేవలు
ఉప్పల్: ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో ఓ అధికారి కింది స్థాయి సిబ్బందితో మసాజ్ చేయించుకుంటూ బహిరంగంగా దొరికిపోయా డు. లైసెన్స్ల కోసం కార్యాలయానికి వచ్చిన వారు దీనిని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా పనిస్తున్న సురేష్రెడ్డి తన సీట్లోనే కూర్చుని బనియన్పై కిందిస్థాయి సిబ్బందితో మసాజ్ చేయించుకుంటుండటాన్ని గుర్తించిన కొందరు వ్యక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ఉంచారు. తప్పుగా అర్థం చేసుకోవద్దు : సురేష్రెడ్డి గత కొన్నేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నా. శుక్రవారం పని ఒత్తిడితో నొప్పి తీవ్రతరం కావడంతో గార్డెన్లో పనిచేసే వ్యక్తికి ఫిజియోథెరపీ తెలుసని చెప్పడంతో డ్యూటీ ముగిసిన తర్వాత మెడనరం వదిలించడానికి మెల్లగా నొక్కాడు. దయచేసి దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉద్యోగితో మసాజ్ చేసుకునే తత్వంకాదు. -
ఖైరతాబాద్ ఆర్టీఏలో వెంకటేష్
సాక్షి, సిటీబ్యూరో : ప్రముఖ సినీనటుడు వెంకటేష్ బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. తన వాహనం హైపొతికేషన్ రద్దు కోసం ఆయన కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు, రాష్ట్ర రవాణా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శామ్యూల్ పాల్ నిబంధనల మేరకు వాహనం హైపొతికేషన్ రద్దు ధృవీకరణ చేసి ఇచ్చారు. -
నాగోల్ ఆర్టీఏ స్పెషల్.. వాహనాలకు మురుగు టెస్ట్
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళితే ఏం చేస్తారు..? ముందు వంకరటింకర ట్రాక్పై టెస్ట్లు పెడతారు. ఎగుడుదిగుడు రోడ్డుపైనా డ్రైవింగ్ నైపుణ్యం పరీక్షిస్తారు. కానీ నాగోల్ ఆర్టీఏ కార్యాలయంలో వీటికి అదనంగా ‘ముగురు టెస్ట్’ కూడా పెడతారు. మోకాల్లోతు నీటిలో వాహనాలను పరుగులు పెట్టించేవారికే లైసెన్స్ ఇస్తారన్నమాట..! లైసెన్స్ లేదనో.. ఇన్సూరెన్ చేయించలేదనో.. లేక సరైన వాహన పత్రాలు లేవనో నాగోల్ ఆర్టీఏ అధికారులు పట్టుకెళ్లిన వాహనాలకుకూడా మురుగు టెస్ట్లు చేస్తున్నారు. కావాలంటే ఒక్కసారి నాగోల్ ఆర్టీఏకు వెళ్లి చూడండి.. పట్టుబడిన మీ వాహనాల పరిస్థితిని తెలుసుకోంది. ఎందుకంటే వివిధ కేసుల్లో సీజ్ చేసి నాగోల్ ఆర్టీఏ ప్రాంగణంలో ఉంచిన ఆటోలు, బైకులు, కార్లు నాలుగు రోజులుగా మురుగు నీటిలో నానుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ప్రతి రోజు వందలాది మందికి డ్రైవింగ్ పరీక్షలు పెట్టి లైసెన్సులు జారీ చేసే నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ సైతం నీటిలో మునిగిపోయింది. ట్రాక్లు, వాహనాల స్క్రాబ్యార్డు, కొత్తవాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యాలయంతో సహా పలు కేంద్రాలు నాలుగు రోజులుగా నీటోలోనే మునిగి ఉన్నాయి. దీంతో పలు ట్రాక్లలో డ్రైవింగ్ పరీక్షలు నిలిపివేశారు. మోటారు వాహన నిబంధనల మేరకు స్వాధీనం చేసుకున్న సుమారు 500 వాహనాల్లో చాలా వరకు నీట మునిగాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, లారీలు, డీసీఎంలు, తదితర ఖరీదైన వాహనాలు సైతం ఇందులో ఉన్నాయి. మరోవైపు ట్రాక్ అంతా దుర్వాసన వ్యాపించింది. నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ఇంతే.. హైదరాబాద్లోనే అతి పెద్ద పరీక్షా కేంద్రమైన నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్కు చుట్టుపక్కల ఉన్న కాలనీల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతున్నప్పటికీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ, అటు రవాణాశాఖ ఉన్నతాధికారులు గానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఈ సమ స్యపై ఆర్టీఏ నుంచి ఫిర్యాదు అందని కారణంగా జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. మురుగునీటిని తొలగించడం తమ విధి కాదన్నట్లుగా రవాణా అధికారులు భావించడం వల్ల 12 ఎకరాల విస్తీర్ణంలో 6 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టించిన నాగోల్ ట్రా క్లో సగానికిపైగా నీటిలో మునిగిపోయింది. ఏటా ఇదే దుస్థితి... శాస్త్రీయమైన పద్ధతిలో, రహదారి భద్రతా నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి వాహనదారులకు లైసెన్సులు జారీచేసేందుకు 2005లో నాగోల్ ట్రాక్ను నిర్మించారు. రాష్ట్రంలో ఈ తరహా ట్రాక్ పరీక్షలు మొదట ఇక్కడే మొదలయ్యాయి. రహదారులపై ఉండే మిట్టపల్లాలు, మలుపులు తదితర డ్రైవింగ్ టెస్ట్లకు అనుగుణంగా ఇక్కడ ట్రాక్లు నిర్మించారు. ఇలాంటి అతి పెద్ద ట్రాక్లో చాలాకాలంగా మురుగు నీరు చేరుతూనే ఉంది. అటు ఎల్బీనగర్ నుంచి ఇటు ట్రాక్కు దిగువన ఉన్న ఆదర్శనగర్ వరకు కనీసం 10 కాలనీల మురుగునీరు అంతా ఒకే నాలా నుంచి ప్రవహిస్తుంది. ఈ నాలా ఉప్పొంగిన ప్రతిసారీ ట్రాక్ మునిగిపోతుంది. ‘ఎలాంటి భారీ వర్షాలు లేవు. వరదలు లేవు. కానీ మురుగునీరు మాత్రం ట్రాక్ను ముంచేస్తుంది’.. అని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఇదే పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కార చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. నిలిచిపోయిన సేవలు.. ప్రస్తుతం నాగోల్ ట్రాక్లో ‘హెచ్’ ఆకృతిలో ఉన్న 2 ట్రాక్లు, మరో ద్విచక్ర వాహన ట్రాక్ మురుగుతో నిండిపోయాయి. దీంతో వాహనదారుల డ్రైవింగ్ పరీక్షలు స్తంభించాయి. మొత్తం 6 ట్రాక్లలో మూడింటిలో మురుగు చేరడంతో మిగతా ముడూ ట్రాక్లలోనే పరిమితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మలక్పేట్ ఆర్టీఏ కార్యాలయానికి చెందిన రిజిస్ట్రేషన్ పనులకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రతి రోజు మలక్పేట్కు చెందిన సుమారు 200 కొత్త వాహనాలకు నాగోల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే పాతవాటికి ఫిట్నెస్ ధృవీకరిస్తారు. ప్రస్తుతం ఆర్సీ కార్యాలయం, వాహనాలకు పరీక్షలు నిర్వహించే షెడ్డు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు రోజులుగా నాగోల్ ట్రాక్ నీటిలో మునిగి ఉన్న విషయం ఆర్టీఏ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్టు వ్యవహరించడం వినియోగదారులకు అందజేసే పౌరసేవల్లోని డొల్లతనాన్ని ప్రతిబింబిస్తోంది. -
ఆ నెంబర్ ప్లేట్.. ఎందుకంత లేట్..
సాక్షి, సిటీబ్యూరో: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్. వాహనాల భద్రతకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ప్రారంభించిన 5 ఏళ్లు గడిచినా లక్షలాది వాహనాలు ఇంకా ఈ పథకానికి దూరంగానే ఉన్నాయి. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) అమలులో రవాణ శాఖ చేపట్టే చర్యలు పూర్తిస్థాయి ఫలితాలను అందజేయలేకపోతున్నాయి. ఇటీవల కాగ్ నివేదికలోనూ ఇదే అంశం వెల్లడైంది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్లయినా ఇంకా 2,92,843 వాహనాలు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు బదులు సాధారణ నెంబర్ ప్లేట్లనే వినియోగిస్తున్నట్లు కాగ్ స్పష్టం చేసింది. ఇక ఈ పథకం అమల్లోకి వచ్చిన 2013 సంవత్సరానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నమోదైన మరో 30 లక్షల వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తంగా ఈ పథకం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. భద్రతకు భరోసా ఏదీ...? హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు ఒక ప్రహసనంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో ఏ రోజుకు ఆ రోజు నమోదయ్యే కొత్త వాహనాలకు మొదట బిగించి, ఆ తరువాత క్రమంగా పాత వాహనాలకు కూడా ఈ నెంబర్ ప్లేట్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కొత్త వాహనాల లక్ష్యమే ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ 2.98 లక్షల వాహనాలు పెండింగ్లో ఉండటమే ఇందుకు ఉదాహరణ. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2015 డిసెంబర్ నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కానీ ఐదేళ్లు గడిచిన తరువాత కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమల్లోని జాప్యంపై కాగ్ అక్షింతలు వేయడం దీని అమల్లోని నిర్లక్ష్యాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రతిరోజు సుమారు 1,500 వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. ఆర్టీఏ కార్యాలయంలో నమోదయ్యే ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్తో పాటు నెంబర్ ప్లేట్ కూడా అప్పటికప్పుడే బిగించే సదుపాయం ఉంటే చాలా వరకు జాప్యం లేకుండా ఉండేది. కానీ వాహనం నమోదుకు, నెంబర్ ప్లేట్ ఏర్పాటుకు మధ్య 15 రోజుల నుంచి నెల వరకు గడవు విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో నిర్లక్ష్యం నెలకొంటోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు ఖైరతాబాద్లో మాత్రం ప్రయోగాత్మకంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. హెచ్ఎస్ఆర్పీ ఉన్న వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ స్మార్ట్ కార్డు అందజేస్తున్నారు. అలాగే ఆదివారం సెలవు దినమైనా హెచ్ఎస్ఆర్పీ కేంద్రాన్ని తెరిచి ఉంచుతున్నారు. ఈ చర్యల వల్ల ఖైరతాబాద్లో వీటి అమలు బాగానే ఉంది. కానీ మిగతా ఆర్టీఏల్లో ఇలాంటి ప్రత్యేక చర్యలు లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నాణ్యత డొల్ల... మరోవైపు వాహనాల భద్రతకు ప్రతీకగా భావించే హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లలో నాణ్యత కొరవడింది. విరిగిపోవడం, పూర్తిగా రంగు పోవడం, వాహనదారులు ఆశించిన విధంగా నెంబర్ ప్లేట్లు ఆకర్షణీయంగా లేకపోవడంతో చాలా మంది విముఖత చూపుతున్నారు. హెఎండ్ వాహనదారులు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు కలిగిన వారు, రకరకాల ఫ్యాన్సీ నంబర్లు, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లు పొందిన వాహనదారులు వాటిని తమకు నచ్చిన విధంగా ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ నాణ్యత లేని, రంగు వెలిసిపోయే హెచ్ఎస్ఆర్పీని మాత్రం కోరుకోవడం లేదు. ఈ పథకం విజయవంతంగా అమలు కాకపోవడానికి ఇదీ ఒక కారణం. కాగ్ నివేదికపై సమీక్ష... కాగ్ నివేదికలో వెల్లడించిన అంశాలపై ఈ నెల 4వ తేదీన రవాణ మంత్రి మహేందర్రెడ్డి సమీక్షించనున్నారు. లోపాలను సరిద్దిద్దుకొని హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర అంశాలపైన కూడా చర్చించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. -
బండి లేకపోయినా..
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ పౌరుడు ఓ వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే... సవాలక్ష ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ స్లాట్ నుంచి ఆధార్ కార్డు వరకు వివిధ రకాలైన పత్రాలను జత చేసి, వాహ నం తీసుకుని యజమానే స్వయంగా వెళ్లి, కనీసం మూడునాలుగు గంటలు వెచ్చిస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాదు. ఆ తర్వాత ఆర్సీ చేతికి రావడానికి మరో వారం పది రోజులు పడుతుంది. హితేష్ నేతృత్వంలోని ముఠా రంగంలోకి దిగితే కేవలం ‘ఫార్మాలిటీస్’ తప్ప ఇంకేం అవసరం లేదు. వాహనాన్ని, దానికి సంబంధించిన పత్రాలను దాఖలు చేయాల్సిన పని లేదు. కేవలం స్లాట్ బుక్ చేసి, ఫామ్–20 లేదా ఫామ్–25 సమర్పిస్తే చాలు. గంటలోనే ఆర్సీ సిద్ధమైపోయి వీరి చేతికి వచ్చేస్తుంది. అసలు వాహనం లేకపోయినా పర్వాలేదు... భవిష్యత్తులో ‘ఖరీదు చేసే’ ఆలోచన ఉంటే చాలు రిజిస్ట్రేషన్ పూర్తయి ఆర్సీ వీరి చేతిలో ఉంటుంది. బండ్లగూడలోని సౌత్జోన్ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిన ‘బోగస్ రిజిస్ట్రేషన్ల దందా’ నేపథ్యమిదీ. 2015 నుంచి సాగిన ఈ అడ్డగోలు వ్యవహారంలో ఆర్టీఏ అధికారులకు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీఓ నుంచి క్లర్క్ వరకు మొత్తం నలుగురు అధికారులు/సిబ్బంది దళారి విఠల్రావుతో కుమ్మక్కైనట్లు ప్రాథమికంగా నిర్థారించారు. సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన ఐదుగురు సభ్యుల ముఠా 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలకు రిజిస్ట్రేషన్లు సృష్టించి విక్ర యించింది. ఆలుగడ్డబావికి చెందిన మెకానిక్ వద్ద దొరికిన ‘తీగ’ లాగిన టాస్క్ఫో ర్స్ ఈ ము ఠా గుట్టును రట్టు చేసింది. ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి హితేష్ పటేల్ వాహనాన్ని చూసి దాని మోడల్, ఏ ఏడాదిలో తయారయ్యిందో చెప్పగల నేర్పరి కావడం కొసమెరుపు. ఒక్కో వాహనానికి రూ.80 వేలు... ఓఎల్ఎక్స్ ద్వారా కాలం చెల్లిన వాహనాలను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఖరీదు చేసే హితేష్ వాటిని తొలుత మెకానిక్లకు అప్పగిస్తాడు. రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేసి వీటిని కొత్తగా తయారు చేయిస్తాడు. ఆపై ఒక్కో వాహనం కోసం ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ నుంచి కొన్ని నెంబర్లను ఎంపిక చేసి, ఇంజన్తో పాటు ఛాసిస్ నెంబర్లు సృష్టించి ఆర్టీఏ దళారి విఠల్రావుకు అందించేవాడు. వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయించడానికి ఇతను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇలా మొత్తమ్మీద గరిష్టంగా ఒక్కో వాహనానికీ రూ.80 వేల వరకు ఖర్చు చేసున్న హితేష్ గ్యాంగ్ దాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలను ఈ పంథాలో విక్రయించగా... వాటిలో అత్యధికం ఎన్ఫీల్డ్, యమహా బైక్లే కావడం గమనార్హం. మార్కెట్లో వీటికి ఎక్కువ క్రేజ్ ఉండటంతో హితేష్ వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. పత్రాలు ఇస్తే చాలు... ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని విఠల్రావు బండ్లగూడలోని సౌత్జోన్ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిస్తున్నాడు. ఒక్కో వాహనంపై ఆర్సీ సృష్టించడానికి గరిష్టంగా రూ.5 వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆర్టీఓకు రూ.1500, ఎంవీఐకి రూ.1000, సూపరింటెండెంట్కు రూ.1000, ఓ మహిళా క్లర్క్కు రూ.500లతో పాటు కొందరు కానిస్టేబుళ్లకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ మామూళ్లు తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది వాహనం, ఇతర పత్రాలు తీసుకురాకపోయినా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. రీ–అసైన్మెంట్కు ఫామ్–20, రీ–రిజిస్ట్రేషన్కు ఫామ్–25 ఇస్తే చాలు ఆర్సీలు జారీ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఎలాంటి వాహనాలు లేనప్పటికీ 14 ఆర్సీలు ఈ ముఠా వద్ద సిద్ధంగా ఉండటం. మరో 75 నెంబర్లను ఆర్సీల జారీ కోసం సిద్ధం చేసి ఉంచడం. అందరూ నకిలీ వ్యక్తులే... ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి యజమాని, వాహనం తప్పనిసరి. అయితే అధికారులను మేనేజ్ చేస్తున్న ఈ ముఠా వాహనాలు అసలే తీసుకువెళ్లట్లేదు. యజమానులుగా పరిచయస్తులైన మెకానిక్లతో పాటు ఇతరుల్ని తీసుకువెళ్తోంది. వీరితోనే వేలి ముద్రలు వేయించి, వీరే ఫొటోలు దిగిన తర్వాత డిజిటల్ సంతకాలు సైతం చేయించేస్తోంది. కొన్ని సందర్భాల్లో హితేష్ స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 35 ఆర్సీల్లో ఆరు హితేష్ పేరుతో, ఐదు అబు నాసిర్, మరో ఐదు రాజ్కుమార్, ఐదు మహ్మద్ సలీం పేరుతో మిగిలినవి గుర్తుతెలియని వ్యక్తుల పేర్లతో ఉండటం గమనార్హం. వీరే పదేపదే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్తూ తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేసుకుని వాహనాలను అమ్మేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు... ఈ ముఠా విక్రయించిన వాటిలో కొన్ని కాలం చెల్లిన వాహనాలు, మరికొన్ని చోరీ వాహనాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా జరుగుతున్న రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్తో ఒకటికి మించి వాహనాలు తిరిగేస్తుంటాయి. ఫలితంగా హిట్ అండ్ రన్తో పాటు ఇతర నేరాలు జరిగినప్పుడు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసినా.. బాధ్యులను పట్టుకోవడంతో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చిక్కినా వీటికి ఇన్సూరెన్స్ ఉండవు. మరోపక్క చోరీ వాహనాలకు సైతం కొత్త నెంబర్ల వచ్చేస్తున్న నేపథ్యంలో ఎలా దర్యాప్తు చేసినా వీటిని పట్టుకోవడం కష్టం. దీంతో బాధితులు నష్టపోవాల్సి వస్తోంది. చిన్న ఆధారంతో ముందుకు.. మూడేళ్లుగా సాగుతున్న హితేష్ ముఠా దందాపై ఆలుగడ్డబావిలో టాస్క్ఫోర్స్కు ఆధారం దొరికింది. అక్కడి మెకానిక్ మైఖేల్ మోదీ ఇటీవల ఓ వాహనానికి ఇదే పంథాలో ఆర్సీ సృష్టించి విక్రయించాడు. అవే రిజిస్ట్రేషన్, ఛాసిస్, ఇంజిన్ నెంబర్లు మరో వాహనానికి తగిలించి తిరుగుతున్నాడు. ఈ ‘డబుల్ రిజిస్ట్రేషన్’ వ్యవహారంపై మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా... దందా మొత్తం వెలుగులోకి వచ్చి హితేష్, మోదీ సహా ఐదుగురు కటకటాల్లోకి చేరారు. ఈ ముఠాకు సహకరించిన ఇతర మెకానిక్లు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఆర్టీఏ అధికారులను ఆధారాలతో సహా గుర్తించడానికీ ప్రయత్నాలు చేస్తున్నారు. -
లెర్నింగ్ లైసెన్సా.. అంత వీజీ కాదు
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలు వాహన వినియోగదారులను ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. కఠినమైన, తార్కికమైన ప్రశ్నలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా వచ్చేవారు ఎలాంటి పరీక్షలు లేకుండానే క్షణాల్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని వెళ్తుండగా నేరుగా వచ్చేవారు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకునేందుకు అవసరమైన సాధారణ పరిజ్ఞానం మేరకు వినియోగదారుల అవగాహనను అంచనా వేయాల్సి ఉండగా అందుకు విరుద్దంగా గందరగోళాన్ని సృష్టించే ప్రశ్నలతోనే ఫెయిల్ అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నేరుగా వచ్చేవారిని ఉద్దేశపూర్వకంగానే గందరగోళానికి గురి చేసి ఫెయిల్ చేస్తూ తప్పనిసరిగా ఏజెంట్లను ఆశ్రయించే పరిస్థితి కల్పిస్తున్నారు. దీంతో రవాణాశాఖలో అన్ని రకాల పౌరసేవలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినా ఏజెంట్లు లేకుండా ఎలాంటి పనులు కావడం లేదు. రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు, వాహనం నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపైనే లెర్నింగ్ లైసెన్స్ ప్రశ్నలు ఉన్నప్పటికీ అభ్యర్ధులను తికమకపెట్టేలా ఉంటున్నాయి. దీంతో చాలామంది మొదటిసారి సరైన సమాధానాలను ఎంపిక చేయలేక ఫెయిల్ అవుతున్నారు. చివరకు ఏజెంట్లను ఆశ్రయించి రెండోసారి పాస్ అవుతున్నారు. గ్రేటర్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతి రోజూ సుమారు 1500 మంది లెర్నింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరవుతుండగా వారిలో సగటున 350 నుంచి 400 మంది ఫెయిల్ అవుతున్నారు. వీరందరూ దళారులను ఆశ్రయించకుండా నేరుగా వచ్చేవాళ్లే కావడం గమనార్హం. ప్రశ్నలు మిగిలే ఉన్నాయి... శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. ఒక వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకునేందుకు రవాణాశాఖ అందజేసే లెర్నింగ్ లైసెన్స్ 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోగా సదరు వ్యక్తులు డ్రైవింగ్ నేర్చుకొని, అన్ని రోడ్లపైన వాహనాలను నడిపేందుకు అనుభవాన్ని గడించాలి. అప్పుడు మరోసారి శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. ఈ క్రమంలో లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు అభ్యర్ధులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు సిగ్నల్స్, రూల్స్ అండ్ రోడ్ రెగ్యులేషన్స్, జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్, తదితర అంశాలపై ఈ ప్రశ్నలను రూపొందించారు. ఈ కేటగిరీల్లో మొత్తం 450 వరకు ప్రశ్నలతో ఒక క్వశ్చన్ బ్యాంక్ను రవాణాశాఖ సిద్ధం చేసింది. ఈ క్వశ్చన్బ్యాంకు నుంచే అభ్యర్ధుల పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. ఇందు లో కొన్ని గందరగోళానికి గురిచేస్తున్నట్లు అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ‘సూర్యోదయానికి ముందు, తరు వాత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్ లైట్ ఎలా ఉండాలి’. సాధారణంగా దీనికి ప్రతి ఒక్కరు ‘లైటు వెలిగించుకొని’ బం డి నడపాలనే భావిస్తారు. కానీ లైట్ లో భీమ్లో ఉండాలనేది సమాధానం. అలాగే రోడ్డు మీద గుంతల్లో నీళ్లు చిమ్ముతూ బండి నడిపితే మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన అవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాలు ఏ సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ’వాయు కాలుష్యం వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర దెబ్బతింటే ఏమవుతుంది’ వంటి లెర్నర్కు సంబంధం లేని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. సమయాభావ సమస్యే... లెర్నింగ్ లైసెన్సు కోసం నిర్వహించే ఆన్లైన్ టెస్ట్లో 20 ప్రశ్నలకు సరైన జవాబులను ఎంపిక చేసేందుకు 10 నిమిషాల సమయం ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు అరనిమిషం వ్యవధి లో సమాధానం గుర్తించాలి. అభ్యర్ధులు కనీసం 12 ప్రశ్నల కు సరైన సమాధానం గుర్తిస్తే చాలు. ఉత్తీర్ణులైనట్లుగా భావి ంచి లెర్నింగ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో వాహ నం నేర్చుకొనేందుకు అనుమతి లభిస్తుంది. అయితే చాలామం ది అభ్యర్ధులు సరైన జవాబులు గుర్తించేందుకు సమ యం చాలడం లేదని అభిప్రాయపడుతున్నారు. ‘‘స్క్రీన్పై ఒక ప్రశ్నను చదివి అర్ధం చేసుకొని జవాబును గుర్తించే లోపే మరో ప్రశ్న ముందుంటుంది. దీంతో గందరగోళానికి గురవుతున్నాం.’’ అని మోతీనగర్కు చెందిన సంపత్ పేర్కొన్నా రు. లెర్నింగ్ లైసెన్స్ పరీక్షకు సమయాన్ని 15 నిమిషాలకు పెంచాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు. ఒక్కసారి చదువుకొని వస్తే చాలు.. చాలామంది ఒక్కసారైనా ప్రశ్నావళిని చూడకుండానే నేరుగా పరీక్షకు హాజరవుతున్నారని, దాంతో వారికి ఆ ప్రశ్నలు కఠినంగా కనిపిస్తున్నాయని సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’తో తెలిపారు. ‘ కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉన్న మాట నిజమే. గతంలో ఒక కమిటీ వేసి చాలా వరకు సరళీకరించాం. మార్పులు, చేర్పులు చేశాము. 827 ప్రశ్నలను సగానికి కుదించాము. క్వశ్చన్ బ్యాంకు ప్రింటెడ్ బుక్స్ అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఉన్నాయి. రవాణాశాఖ వెబ్సైట్లో కూడా ఉంది. వెబ్సైట్లో మాక్ టెస్ట్కు కూడా హాజరు కావచ్చు. ఎలాంటి కసరత్తు లేకుండా, సన్నద్ధత లేకుండా వచ్చేవాళ్లకు మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. ’’ అని చెప్పారు. సరైన సమాధానాలను గుర్తించిన తరువాత ఫెయిల్ చేయడమంటూ ఉండదన్నారు. -
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం
-
ఆర్డీవో కార్యాలయాల్లో షాడోలు
జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో పాలన గాడితప్పింది. సిబ్బంది చేయాల్సిన పనులకు షోడోలు అడ్డుపడుతున్నారు. పనికి రేట్లను ఫిక్స్ చేసి ప్రజలను దోచేస్తున్నారు. ఈ తంతు మొత్తం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఆఫీసులో ఉన్న అవినీతి తిమింగలం నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి, అమరావతి బ్యూరో: రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కొంత మంది ఉద్యోగులు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఒకరేటు పెట్టి ప్రజలను దోచేస్తున్నారు. కార్యాలయ ఉన్నతాధికారులు సైతం వారికే వత్తాసు పలకడంతో మిగతా సిబ్బంది చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి దాపురించింది. గుంటూరు కలెక్టరేట్లో సైతం ఓ అధికారి డమ్మీగా మారినట్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారి పలుమార్లు సెలవులో వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం. గుంటూరు ఆర్డీఓ కార్యాలయంలో.. ఈ కార్యాలయంలో ఓ డీటీ (డిప్యూటీ తహసీల్ధార్)స్థాయి అధికారి హవా నడుస్తోంది. మొత్తం ఆదాయ వనరులుగా ఉన్న సబ్జెక్టులు అతని వద్దనే ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారికి అతను చెప్పిందే వేదం. కార్యాలయంలో ఉండే సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో కూడా పాలన గాడితప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్ధార్ కార్యాలయం.. ఇక్కడ వివిధ హోదాల్లో ఓ అధికారి తిష్ట వేసి, ఇష్టారాజ్యంగా ముడుపులు వసూలు చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అడవి తక్కెళ్ల పాడులో అసైన్డ్ భూములకు దొంగపట్టాలు ఇవ్వటంలో సదరు ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. గతంలో తాను చేసిన అవినీతి బయట పడకుండా ఉండేందుకు ఈ కార్యాలయంలోనే ఉండేలా అధికార పార్టీనేతలను ఆశ్రయించి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. తెనాలి ఆర్డీఓ ఆఫీసులో అన్నీ తానై... తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో ఓ రెవెన్యూ అధికారి పెత్తనానికి అడ్డుఅదుపు లేకుండా పోయిం దని అక్కడి ఉద్యోగులే విమర్శిస్తున్నారు. కార్యాలయ అధికారిని కాదని, ప్రతి వ్యవహారంలో తలదూర్చి, పనికి రేట్లు ఫిక్స్ చేసి వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతనిపై వచ్చిన ఆరోపణలతో జిల్లాకు చెందిన ఓ మంత్రి బదిలీ సిఫారసు చేయడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. మండలకార్యాలయాల్లో తహసీల్ధార్ రాసే రిపోర్టులకు సైతం కొర్రీలు వేసి, వాటిని ఆయనే తయారు చేసి డబ్బులు గుంజుతున్నట్లు చర్చ జరగుతోంది. డీటీలు దండుకుంటున్నారు.. నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఓ డీటీ కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. అక్కడ కార్యాలయంలో ఉన్న అధికారి, డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ఎక్కడున్నారో చెప్పలేని దుస్థితి. గతంలో రెవెన్యూ ఇన్పెక్టర్గా ఆ డివిజన్లోనే పనిచేసిన సదరు అధికారి ప్రస్తుతం భూ వ్యవహారాల సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గురజాలలో గుంజుడెక్కువ.. గతంలో అధికార పార్టీ నాయకుడి వెంట తిరిగిన ఓ అధికారి ప్రస్తుతం వ్యవహారాలు చెక్కబెడుతున్నాడు. ఇతనిపై ఏసీబీ దాడులు జరిగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉడటంతో ఉన్నతాధికారి సదరు అధికారిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో సమాంతర వ్యవస్థ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ కోనశశిధర్ ఈ వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. -
ఆర్టీఏ కార్యాలయంలో మహేష్బాబు
హైదరాబాద్: సినీ హీరో మహేష్బాబు శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. తన కారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్వయంగా వచ్చిన మహేష్ బాబు వేలిముద్ర పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అరగంట అనంతరం తిరిగి వెళ్లిపోయారు. -
0001కు రూ.8 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ రవాణా శాఖకు కాసుల పంట పండిస్తోంది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రారంభమైన నూతన సిరీస్లోని టీఎస్ 09 ఈవీ 0001 నంబర్ రికార్డు స్థాయిలో రూ.8.02 లక్షల ధర పలికింది. నగరానికి చెందిన రాజీవ్ అనే వ్యక్తి రూ.62.99 లక్షల విలువ గల తన నూతన బెంజ్ కారుకు ఈ నంబర్ను దక్కించుకున్నారు. ఇక ఇదే సిరీస్లో 0111 నంబర్కు రూ.1.20 లక్షలు లభించా యి. ఇక 09 ఈయూ సిరీస్లోని నంబర్ 0007 వేలానికి రూ.1.07 లక్షలు లభించాయి. మొత్తంగా నూతన సిరీస్ల ప్రారంభంతో ఫ్యాన్సీ నంబర్ల వేలం ప్రక్రియలో ఆర్టీఏకు ఒకేరోజు రూ.14.65 లక్షల ఆదాయం లభించినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. -
ఆర్టీఏలో ఆయనంటే హడల్
ప్రతి పనికీ ఒక రేటు.. చేయి తడపనిదే ఫైలు కదలదు రవాణాశాఖలో ఆ కానిస్టేబుల్.. ఫెవిల్కాల్వీరుడు అనంతపురం సెంట్రల్ : అనంతపురం రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో ఆయనో కానిస్టేబుల్. బదిలీకి అతీతుడిగా.. ఫెవికాల్ వీరునిగా స్థిరపడిన ఈయన కార్యాలయంలో ప్రతి పనికీ చేయి తడపనిదే ఫైలు ముందుకు కదలనీయకుండా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్లు సమాచారం. వివరాల్లోకి వెలితే... ఆర్టీఏ కార్యాలయంలో కిందిస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లకు ప్రతి మూడునెలలకోసారి బదిలీ తప్పనిసరిగా ఉంటుంది. దీని వలన అవినీతి అక్రమాలను తగ్గించవచ్చు అని భావించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా నిబంధన పకడ్బందీగా జరుగుతున్నా అనంతపురంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ విషయంలో మాత్రం ఇది జరగడం లేదు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఉందని సాకు చూపడంతో ఇతడిని బదిలీ నుంచి మినహాయించారు. దీంతో రెండేళ్లుగా ఇక్కడే పాతుకుపోయాడు. అక్రమ వసూళ్లకు అలవాటుపడటం వల్లే ఇక్కడి నుంచి కదలడం లేదని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం బదిలీలు జరిగినా అధికారులు ఆయనకు పూర్తిగా మినహాయించారు. జిల్లాలోని మిగతా ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో పనిచేయడానికి తాము అనర్హులమా అంటూ నిట్టూరుస్తున్నారు. కానిస్టేబుళ్ల కొరత ఉందనే ఇటీవల జరిగిన బదిలీల్లో సదరు కానిస్టేబుల్ను ఇతర ప్రాంతాలకు కాకుండా జిల్లా కేంద్రంలోనే మరొక ఎంవీఐ వద్దకు బదిలీ చేశాం. జిల్లా కేంద్రంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు కానిస్టేబుళ్ల కొరత ఉంది. ఈ సమయంలో బదిలీ చేయడం వలన అధికారులకు ఇబ్బందులు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉద్యోగుల బదిలీ చేశాం. - శ్రీధర్, ఆర్టీఏ, అనంతపురం -
ప్రమాదాలకు లైసెన్స్!
►ఫిట్లెస్ పరీక్షలు ►డ్రైవింగ్ ట్రాక్లలో మొక్కుబడి తంతు ►డ్రైవర్ల సామర్ధ్యంపై అవగాహన లేకుండా లైసెన్సుల జారీ ►పెరుగుతున్న యాక్సిడెంట్లు గ్రేటర్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. ఎలాంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించకుండానే విచ్చల విడిగా డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకు అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు ఉన్నా..వాటిపై ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. రోజుకు మొక్కుబడిగా 20 మందికి పరీక్షల ద్వారా లైసెన్స్లు ఇస్తూ... వందలాది మందికి ఎలాంటి పరీక్షలు లేకుండానే జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేకుండానే వాహనదారులు రోడ్డెక్కుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. పరిశీలించి లైసెన్సులు అందజేయవలసిన ఈ ట్రాక్లో రోజుకు 20 మంది అభ్యర్థులకు కూడా పరీక్షలు నిర్వహించడం లేదు. వందలాది మంది ఈ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటారు. కానీ పరీక్షలకు హాజరయ్యేవాళ్లు చాలా తక్కువ మంది. పైగా ఈ డ్రైవింగ్ పరీక్షలు సైతంఅధికారుల పర్యవేక్షణ లేకుండా మొక్కుబడిగా జరిగిపోతాయి. ఒక్క ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంలోనే కాదు. గ్రేటర్ హైదరాబాద్లోని మరికొన్ని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలో కూడా ఇదే పరిస్థితి. వాహనాలు నడిపే వ్యక్తుల డ్రైవింగ్ సామరŠాధ్యనికి ఎలాంటి శాస్త్రీయమైన పరీక్షలు లేకుండానే లైసెన్సులు వచ్చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కసారి లెర్నింగ్ లైసెన్సు కోసం వస్తే చాలు. ఇక డ్రైవింగ్ లైసెన్సు కోసం మరోసారి పరీక్షలకు హాజరుకావలసిన అవసరమే లేదు. ఇలా లైసెన్సులు తీసుకొని హై వేలలో రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. రహదారి భద్రతకు అతి పెద్ద సవాల్గా మారుతున్నారు. మితిమీరిన వేగం, నిబంధనల పట్ల సరైన అవగాహన లేకపోవడం, వాహనాలను అదుపు చేసే సామర్ధ్యం కొరవడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్ఎఫ్ఐడీ కూడా అంతేసంగతులు... మరోవైపు బెంగళూర్ నగరంలోని 9 డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) పరిజ్ఞానంతో అనుసంధానించినట్లుగానే నగరంలోని ఉప్పల్, నాగోల్ ట్రాక్లను అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేశారు. పూనేకు చెందిన ఓ సాంకేతిక సంస్థ సహకారంతో ఉప్పల్ ట్రాక్లలో ఆర్ఎఫ్ఐడీ ఏర్పాటు చేశారు. యాంటీన్నా ద్వారా ట్రాక్లలో వాహనం కదలికలను కంప్యూటర్లో నమోదు చేసే శాస్త్రీయ పరిజ్ఞానం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అప్పట్లో అనేక రకాల ఆటంకాలు చోటుచేసుకున్నాయి. దీంతోరూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్ఐడీని శాశ్వతంగా వదిలేశారు. ప్రత్యక్ష పరీక్షలకు సెలవ్... డ్రైవర్ల నైపుణ్యాన్ని పరీక్షించేందుకు గతంలో విదేశీ తరహాలో ప్రత్యక్ష పరీక్షా పద్ధతి ఉండేది. ట్రాక్లలో కాకుండా ప్రధానరహదారులలో డ్రైవర్ వాహనాన్ని నడిపేటప్పుడు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్.. డ్రైవర్తో పాటు వాహనంలో పయనిస్తూ అతన్ని నైపుణ్యాన్ని పరీక్షించేవాడు. అభ్యర్ధులు వాహనం నడిపే తీరు, వేగం, వాహనం కండీషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తైన ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలపైన ఈ పరీక్షలు ఉండేవి. ప్రస్తుతం బ్రిటన్ వంటి యూరోప్ దేశాల్లో కచ్చితంగా అమలవుతున్న ఈ విధానిన్ని ఇక్కడ రద్దు చేశారు. దీంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీ ఎలాంటి పర్యవేక్షణ లేని ఒక ప్రహసనంగా కొనసాగుతోంది. నగరంలోని ట్రాక్లు –అందజేసే లైసెన్సులు... గ్రేటర్ హైదరాబాద్లో ఉప్పల్, నాగోల్, కొండాపూర్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నంలలో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు ఉన్నాయి.ఈ ట్రాక్లలో ‘హెచ్’, ‘ఎస్’, ‘రివర్స్ యు’ ‘8’ వంటి ఆకృతులలో ట్రాక్లను నిర్మించారు. ఈ ట్రాక్లలోనే ద్విచక్ర వాహనదారులకు, మోటారు వాహనాలకు పరీక్షలు నిర్వహించి లైసెన్సులు ఇస్తారు.సాధారణంగా ఈ పరీక్షలు ఎంవీఐల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగాలి. కానీ మొక్కుబడిగానే ఈ పర్యవేక్షణ ఉంటుంది. నాగోల్, కొండాపూర్లలో రోజుకు సుమారు 500 డ్రైవింగ్ లైసెన్సుల చొప్పున జారీ అవుతుండగా, మిగతా చోట్ల 300–350 వరకు ఇస్తున్నారు. జాడలేని వీడియో సెన్సర్లు.... వీడియో ఆధారిత సెన్సర్లను వినియోగించడం ద్వారా శాస్త్రీయమైన పద్ధతిలో డ్రైవింగ్ సామర్ధ్య పరీక్షలను నిర్వహించేందుకు రవాణాశాఖ 2 సంవత్సరాల క్రితం ప్రణాళికలను రూపొందించింది. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ల తరహాలో నగరంలోని నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను ఆధునీకరించాలని అప్పట్లో ప్రతిపాదించారు. ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం లేకుండా అభ్యర్థుల నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చునని భావించారు. ఈ మేరకు ఆర్టీఏ అధికారులు అప్పట్లో త్రివేండ్రమ్తో పాటు మరికొన్ని నగరాల్లోని వీడియో సెన్సర్లే కీలకంగా పనిచేసే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను పరిశీలించారు. వీడియో సెన్సర్ల ద్వారా డ్రైవింగ్ నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కేరళ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలను నిర్వహిస్తున్న కెల్ట్రాన్ అనే సంస్థ భాగస్వామ్యంతోనే ఇక్కడ సైతం డ్రైవింగ్ కేంద్రాలను నిర్వహించాలని ప్రతిపాదించినా ఫలితం లేదు. -
ఆర్టీఏ కార్యాలయంలో సినీ హీరో సునీల్ వర్మ
మలక్పేట: తెలుగు సినీహీరో సునీల్వర్మ రాకతో ఈస్ట్జోన్ మలక్పేట ఆర్టీఏ కార్యాలయంలో సందడి నెలకొంది. సునీల్వర్మ తాను కొనుగోలు చేసిన వైట్ స్కోడా లారిన్ కారును రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఆర్టీఏ కార్యాలయానికి సోమవారం వచ్చారు. రూ. 10 వేలు చెల్లించి టీఎస్ 11 ఈజే 2345 నంబర్ను తీసుకున్నారు. ఎంవీఐలు నాగరాజు, టీవీరావులు సిబ్బంది సునీల్తో కలిసి ఫొటోలు దిగారు. -
స్మార్ట్కార్డుకు ‘రిబ్బన్’ ఎఫెక్ట్
రవాణాశాఖలో నెలరోజులుగా సమస్య నిలిచిపోయిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ సాక్షి, సిటీబ్యూరో: ‘స్మార్ట్కార్డు’.. రవాణాశాఖలో నూతన అధ్యాయం.. డ్రైవింగ్ లైసెన్స్లు, వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయిన అనందరం వినియోగదారుల, వాహనాల వివరాలు ముద్రించి అందించాలి. కానీ నెలరోజులుగా ఈ కారులు సంబందిత వాహనదారుకులకు మాత్రం అందడం లేదు. కొద్ది రోజుల క్రితం ఆర్టీఏ కార్యాలయాలకు తెలుపు (వైట్) కార్డులు అందాయి. కానీ వాటిపై అక్షరాలను ముద్రించే రిబ్బన్ మాత్రం సరఫరా కాలేదు. దీందో స్మార్ట్కార్డుల పంపిణీ సాధ్యపడలేదు. నెలరోజులుగా ఇదే సమస్య కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన స్మార్డుకార్డులు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో డ్రైవింగ్ పరీక్షలు ముగించుకొని లైసెన్సులు పొందాల్సినవారు, వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసినప్పటికీ స్మార్డ్ కార్డులు చేతికి రాక వాహనదారులు ఎదురు చూస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాలతో పాటు, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సకాలంలో స్మార్ట్కార్డులు అందక వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్డులు ప్రింట్ చేసేందుకు కావలసిన రిబ్బన్ సింగపూర్ నుంచి దిగుమతి కావాల్సి ఉండగా, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ (టీఎస్టీఎస్) విభాగం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటిదాకా డిమాండ్కు తగిన స్థాయిలో రిబ్బన్ అందలేదు. దీనివల్ల కార్డుల ప్రింటింగ్, పంపిణీలో జాప్యం జరుగుతోందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నెల నుంచి ప్రతిష్టంభన.. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలను వాహనదారులకు కొంతకాలంగా స్మార్ట్కార్డుల రూపంలో అందజేస్తున్నారు. కార్డులోనే వాహనదారుడికి, వాహనానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రింట్ చేస్తారు. వాహనదారుడి చిరునామా, డ్రైవింగ్ లైసెన్సు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెల్లుబాటులో ఉంటుంది.. తదితర వివరాలన్నీరుంటాయి. రిజిస్ట్రేషన్ స్మార్టుకార్డుల్లోనూ వాహనం మోడల్, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్, చిరునామా ప్రింట్ చేస్తారు. ఇలా ప్రింట్ అయిన కార్డులను వారం రోజుల్లోపు వినియోగదారుడికి పోస్టులో చేరాలి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రోజుకు సుమారు 5000 మంది డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం హాజరవుతుండగా, తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో ఈ సంఖ్య 7 వేల నుంచి 8 వేల వరకు ఉంటుంది. అయితే, నెల రోజుల నుంచి కార్డుల ప్రింటింగ్ నిలిచిపోయింది. ఈనెల రోజుల్లో లక్షకు పైగా కార్డుల ముద్రణ, పంపిణీ ఆగిపోవడంతో వాహనదారులకు సమస్యలు తప్పడం లేదు. నిలిచిపోయిన రిబ్బన్ దిగుమతి.. రవాణాశాఖకు సరఫరా చేసే స్మార్టు కార్డులను తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ సరఫరా చేస్తోంది. కార్డుల తయారీని కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టారు. నెలక్రితం సదరు కాంట్రాక్టర్ గడువు ముగియడం, సింగపూర్ నుంచి దిగుమతి కావలసిన రిబ్బన్ సైతం ఆగిపోవడంతో ఆకస్మాత్తుగా సమస్య తలెత్తింది. కొత్త కాంట్రాక్టర్ వచ్చే వరకు పాత కాంట్రాక్టర్ వ్యవస్థనే కొనసాగిస్తూ వారం క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సుమారు 50 వేల వరకు కార్డులు రవాణాశాఖకు అందాయి. మరో 50 వేల కార్డులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సైతం అక్షరాలు ప్రింట్ చేసేందుకు కావలసిన రిబ్బన్ లేదు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో 7000 కార్డులు పెండింగ్లో ఉండగా 5000 మాత్రం పంపిణీ చేశారు. ఇక్కడ 10 రిబ్బన్లు అవసరముండగా 5 మాత్రమే అందాయి. మరోవైపు ఇప్పటికిప్పుడు వాహనదారుల డిమాండ్ను పరిష్కరించేందుకు కొంత మేరకు స్మార్ట్కార్డులు అందుబాటులో ఉన్నా వాటిపైన వివరాలను ముద్రించేందుకు కావలసిన రిబ్బన్లు లేకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు అధికారులు చెబుతున్నారు. -
ఆర్టీఏలో ఒకే కౌంటర్తో ఇక్కట్లు
అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణా శాఖ(ఆర్టీఏ)లో నగదు రహిత లావాదేవీలతో శనివారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రకరకాల సమస్యలతో వచ్చిన వాహనదారులందరికీ ఒకే కౌంటర్ ఏర్పాటు చేయడంతో డబ్బు కట్టేందుకు బారులు తీరారు. గంటల కొద్ది క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం నుంచి రవాణాశాఖలో నగదు రహిత లావాదేవీలు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్లైసెన్స్, వాహనాలకు పన్నులు చెల్లింపులు తదితర వాటికోసం వందల మంది ప్రజలు శనివారం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. అయితే ప్రస్తుతం కార్యాలయంలో ఒక్కటే స్వైప్ మిషన్ ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం ఈ మిషన్ను తెప్పించారు. అన్ని పన్నులకు ఒకే స్వైప్మిషన్ ద్వారా చెల్లించాల్సి రావడంతో గంటల కొద్ది క్యూలైన్లో వేచి ఉండాల్సిన వచ్చింది. ఒక్కటే కౌంటర్ ఏర్పాటు చేయడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాహనదారుల అవసరాల దృష్ట్యా రెండు, మూడు స్వైప్మిషన్లు ఏర్పాటు చేయాలని, చిల్లర నోట్లు ఉన్న వారి నుంచి నగదు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరారు. నగదు రహిత లావాదేవీల్లో రాష్ట్రంలో అగ్రస్థానం : డీటీసీ రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు నగదు రహిత లావాదేవీలు 72శాతం సాధించి రాష్ట్రంలో జిల్లా అగ్రస్థానంలో ఉందని డీటీసీ సుందర్వద్దీ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం రూ. 3,15, 925లను వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించగా అందులో రూ. 2,28,735లను(72) స్వైపింగ్ మిషన్ ద్వారా చెల్లించారన్నారు. ఈ నెలాఖరులోపు వందశాతం నగదు రహిత లావాదేవీలు చేపడుతామని వివరించారు. -
పది ఆటోలు... రూ. 50 వేలు మాత్రమే
– ఆర్టీఏ వాహనాల వేలంలో వ్యాపారుల రింగ్ అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణాశాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో పాత వాహనాలకు నిర్వహించిన వేలంపాటలో గుజిరీ వ్యాపారులంతా రింగ్ అయ్యారు. వందలాది వాహనాలను అతి తక్కువ ధరకే దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలకు మంగళవారం డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ (డీటీసీ) కార్యాలయంలో వేలం పాట నిర్వహించారు. ఆర్టీఓ శ్రీధర్, ఎంవీఐలు వరప్రసాద్, రమేష్, ఏఎంవీఐలు, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల సమక్షంలో వేలంపాట జరిగింది. గుజిరీ వ్యాపారులు దాదాపు 200 మందికి పైగా పాల్గొని ముందస్తు ఒప్పందం ప్రకారం అతి తక్కువ ధరకే వాహనాలను దక్కించుకున్నారు. పది ఆటోలు రూ. 50 వేలకు అమ్ముడుపోయాయి. ద్విచక్ర వాహనాల్లో కొన్ని ఇంకా రోడ్డు మీద తిరిగేందుకు అవకాశముండే వాటిని కూడా తక్కువ ధరకు అప్పగించేశారు. మొత్తం 10 వాహనాలకు కేవలం 70 వేలు మాత్రమే వచ్చింది. ఇందులో ఒక హీరోహోండా స్పెండర్, బజాజ్ కంపెనీకి చెందిన రెండు ద్విచక్రవాహనాలు మన్నికలో ఉండేవి కావడం గమనార్హం. ఏడాది కూడా తిరక్కనే ఆర్టీఓ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. 192 ఆటోలు రూ. 11.56 లక్షలు, 7 మ్యాక్సీ క్యాబ్లు రూ. 3.08 లక్షలు, 13 ట్రాక్టర్లు రూ. 9.86 లక్షలు, 2 మోటార్ కార్లు రూ. 70 వేలు, 29 గూడ్స్ వెహికల్స్ రూ. 3.56 లక్షలకు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా రవాణాశాఖకు రూ. 29.52 లక్షలు ఆదాయం రాగా, కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు రూ. 21, 08, 501 ఆదాయం వచ్చింది. వేలం పాట ప్రారంభానికి ముందే వ్యాపారస్తులంతా చర్చించుకుని ఎక్కువ ధరకు వెళ్లకుండా జాగ్రత్తలు పడ్డారు. -
రెండుగా ఆర్టీఏ కార్యాలయం
ముమ్మరంగా విభజన ఏర్పాట్లు నాలుగు జిల్లాల ఫైళ్ల ఆన్లైన్ పూర్తి హుజూరాబాద్, ములుగులో సబ్ ఆర్టీఏలు ఖిలావరంగల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయ విభజన వేగవంతమైంది. ప్రస్తుత వరంగల్ రవాణా శాఖలో రెండు జిల్లాల పనులు సాగుతున్నాయి. నూతనంగా వరంగల్, హన్మకొండ, జయశంకర్ జిల్లా (భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అక్టోబర్ 1 నుంచే కొత్త కార్యాలయాల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు భూపాలపల్లిలో ఓ అద్దె భవనంలో జిల్లా కార్యకలాపాలకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. మహబూబాబాద్లో సబ్ ఆర్టీఏ కార్యాలయంలోనే జిల్లా కార్యాలయం ఏర్పాటుకు పనులు సాగుతున్నాయి. వరంగల్ ఆర్టీఏ ప్రధాన భవనం పైఫ్లోర్లో హన్మకొండ, గ్రౌండ్ ఫోర్లో వరంగల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆర్టీఏ విభజన పనులతోపాటు కార్యాలయాల మరమ్మతులు వేగంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా రవాణాశాఖ కమిషనర్ ఉత్తుర్వుల మేరకు నాలుగు జిల్లాల స్టేషనరీ చేరింది. ఈమేరకు సోమవారం డీటీసీ శివలింగయ్య కార్యాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పడుతున్న జిల్లా కార్యాలయాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాలకు సంబంధించిన విభజన ఫైళ్లను ఆన్లైన్లోనే నమోదు చేశామని, ప్రభుత్వం అందజేసిన స్టేషనరీ చేరుకుందని చెప్పారు. ఉద్యోగుల విభజన సైతం పూర్తి చేశామని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న జనగామ సబ్ కార్యాలయాన్ని యధావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. వాహనదారుల సౌకర్యార్థం నూతనంగా ములుగు, హుజూరాబాద్లో సబ్ కార్యాలయాల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీలోగా నూతన కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేసి దసరా నుంచి కొత్త కార్యాలయాల్లో పనులు ప్రారంభించనున్నట్లు డీటీసీ తెలిపారు. -
ఆర్టీఏ కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్య
జనగామ: వరంగల్ జిల్లా జనగామ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా నివాసముంటున్న రమేష్(38) శుక్రవారం ఉదయం ఆర్టీఏ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలకు తోడు కుటుంబ కలహాలు ఎక్కువవడంతో బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీఏలో నాగార్జున
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఇన్నోవా కారును టీఎస్ 09 ఈఎన్ 9669 నెంబర్పై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన కొత్త మారుతీ స్విఫ్ట్ డిజైర్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. టీఎస్ 09 ఈఎన్ 9580 నెంబర్పైన వాహనం నమోదు చేసుకున్నారు. జేటీసీ టి. రఘునాథ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. -
వాహనం బదిలీ మరిస్తే ముప్పు తప్పదు
షాద్నగర్ ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు వాహనాలు నయీంకు చెందినవి కావు.ఆర్టీఏ రికార్డుల ప్రకారం మల్లాపూర్,యాఖుత్పురా నూర్ఖాన్ బజార్కు చెందిన వేరు వేరు వ్యక్తుల పేరిట నమోదై ఉన్నాయి.పైగా మల్లాపూర్ అడ్రస్కు, ఆర్టీఏలో నమోదైన బిరుదరాజు లక్ష్మి అనే పేరుకు ఎలాంటి సంబంధం లేదు. అప్పటికి రెండు,మూడు అడ్రస్లపై బదిలీ అయిన వాహనాలు చివరకు ఎన్కౌంటర్ స్థలంలో పోలీసులకు పట్టుబడ్డాయి. ఈ వాహనాలు నయీంకు ఎలా వచ్చాయనే సంగతి పోలీసుల విచారణలో తేలాల్సిందే. ఈ ఒక్క ఉదంతంలోనే కాదు. చాలా సంఘటనల్లో పోలీసులు, రవాణా అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు, ఆ క్షణం వరకు వాటిని వినియోగిస్తున్న వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉండడం లేదు.వాహనాలు అమ్మిన వెంటనే యాజమాన్య బదిలీ చేయడం లేదు. అలాగే కొనుగోలు చేసిన వాళ్లు కూడా తమ పేరిట తిరిగి నమోదు చేసుకోవడం లేదు. ఇలాంటి వాహనాలు సంఘవిద్రోహులు, నేరస్థుల చేతుల్లో పడితే ప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనాల బదిలీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. భారీ మూల్యం తప్పదు... కార్లు,మోటారుబైక్లు వంటి వ్యక్తిగత వాహనాలు, ఆటోరిక్షాలు, క్యాబ్లు, ప్రైవేట్ బస్సులు, తదితర రవాణా వాహనాలు ప్రతి రోజు వేల సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతాయి. సెకెండ్హ్యాండ్స్ అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతి రోజు సుమారు 1000 వరకు పాత వాహనాల క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ వాహన యాజమాన్య బదిలీ కోసం ఆర్టీఏకు వస్తున్న వాహనాలు మాత్రం 250 నుంచి 300 వరకు మాత్రమే ఉన్నాయి. చాలామంది వాహనదారులు తమ పాత వాహనాలను అమ్మిన వెంటనే కొన్నవాళ్ల పేరిట బదిలీ చేయడం లేదు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం సకాలంలో తమ పేరిట బదిలీ చేసుకోవడం లేదు. పైగా ఇలా బదిలీ కాకుండా ఉన్న వాహనాలు ఒకరి నుంచి మరొకరికి అదే పనిగా మారిపోతున్నాయి. చివరకు అసలు వాహన యజమానికి, దానిని వినియోగించే వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 10 లక్షల వాహనాలు బదిలీ కాకుండా ఉన్నట్లు అధికారుల అంచనా. నగరంలో తిరుగుతున్న 1.4 లక్షల ఆటో రిక్షాల్లో సగానికి పైగా బినామీ పేర్లు, ఫైనాన్షియర్లపైనే నమోదై ఉన్నాయి. కానీ వాటిని వినియోగించే వ్యక్తులు మాత్రం వేరే ఉన్నారు. అలాగే తమిళనాడు, మహారాష్ర్ట, న్యూఢిల్లీ, గుజరాత్, తదితర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన లక్షలాది కార్లు, క్యాబ్లు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే నగరంలో తప్పుడు చిరునామాలపైన నమోదై తిరుగుతున్నాయి. చాలా వాహనాలు ఎలాంటి యాజమాన్య బదిలీ లేకుండానే రోడ్డెక్కుతున్నాయి. ఇలాంటి వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడినప్పుడు, ట్రాఫిక్ ఉల్లంఘనల్లో దొరికిపోయినప్పుడు అసలు వాహన యజమానులు భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు.రోడ్డు ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా రవాణాశాఖ రికార్డుల్లో నమోదైన వాహన యజమానులనే పోలీసులు పరిగణనలోకి తీసుకొని కేసులు నమోదు చేస్తారు. అలాంటి వాహనాలు తమ వినియోగంలో లేకపోయినప్పటికీ యాజమాన్య బదిలీ చేయకపోవడం వల్ల రూ.వేలల్లో జరిమానాలు చెల్లించ క తప్పదు. బినామీ దందా.... మరోవైపు వాహనాలపైన బినామీ దందా సైతం యధేచ్చగా సాగిపోతుంది. దొంగ వాహనాలు, కాలం చె ల్లిన వాహనాలు, వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి తరలించిన వాహనాలు, ఒక ఫైనాన్షియర్ నుంచి మరో ఫైనాన్షియర్కు బదిలీ అయ్యే వాహనాలు చాలా వరకు బినామీ పేర్లపైనే నమోదవుతున్నాయి. నగరంలోని కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రవాణా అధికారులు కొందరు దళారులతో కుమ్ముక్కై పెద్ద ఎత్తున ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏజెంట్లు, దళారుల కార్యకలాపాలు యధేచ్చగా సాగిపోతున్నాయి. చిరునామా ధృవీకరణ కోసం రకరకాల ఆధారాలను సృష్టించేస్తున్నారు. -
ఆర్టీఏ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు
సిద్దిపేట(మెదక్): మెదక్ జిల్లా సిద్దిపేట రవాణాశాఖ అధికారి ప్రాంతీయ కార్యాలయంపై శనివారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు బ్రోకర్ల వద్ద నుంచి రూ.93వేలు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
నగరంలో అజహరుద్దీన్
సాక్షి, సిటీబ్యూరో: మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కోసం వచ్చిన ఆయనను జేటీసీ రఘునాథ్ సాదరంగా ఆహ్వానించారు. నిబంధనలకు అనుగుణంగా అధికారులు వేలిముద్ర, ఫొటో, డిజిటల్ సంతకం తీసుకొని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ను అందజేశారు. జేటీసీతో పాటు ఆర్టీఓలు జీపీఎన్ ప్రసాద్, లక్ష్మి తదితరులు ఉన్నారు. -
ఆర్టీఏ సేవలన్నీ ఆన్లైన్లోనే..
ఆగస్టు 2 నుంచి అందుబాటులోకి మొదలైన స్లాట్ బుకింగ్ అయినా దళారులదే హవా! సంగారెడ్డి టౌన్: రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలు ఆగస్టు 2 నుంచి ఆన్లైన్లోనే నిర్వహిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. రెండు రోజుల క్రితమే ఆన్లైన్ స్లాట్ బుక్ ప్రారంభమైంది. డ్రైవింగ్ లైసెన్సుల మాదిరిగానే వాహన రిజిస్ట్రేషన్లు, యాజ మాన్య బదిలీ, చిరునామా మార్పిడి, రెన్యువల్, డూప్లికేట్ తదితర సేవల కోసం ఎవరైనా ఆన్లైన్లోనే స్లాట్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసుకున్న నిర్దేశిత సమయానకి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీఏ వెబ్సైట్లో అవసరమైన సేవలకు సంబంధించి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత కంప్యూటర్ ఒక అప్లికేషన్ నంబరును సదరు అభ్యర్థికి కేటాయిస్తుంది. దాని సమాచారం సదరు వ్యక్తి మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. సంబంధిత ఫీజు ఆన్లైన్లో కాని, ఈసేవ, మీ సేవలో కానీ చెల్లించి, నిర్ణీత స్లాట్ రోజున అవసరమైన ధ్రువపత్రాలను కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. కార్యాలయంలో అభ్యర్థి ఫొటో, సంతకం, వేలిముద్రలు తీసుకొని అభ్యర్థికి అవసరమైన సేవలు అందిస్తారు. దళారుల బెడద తప్పేనా...? డ్రైవింగ్ లైసెన్సుల సేవలు గత ఏడాది నుంచి ఆన్లైన్లోనే అందిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా సేవలు పారదర్శకంగా జరుగుతున్నాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఆన్లైన్ స్లాట్ పొందినా దళారుల ద్వారా వెళ్లిన వారికే పని తర్వగా పూర్తవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. స్లాట్ పొంది లైన్లో గంటల తరబడి నిల్చున్నా పట్టికోని అధికారులు, దళారుల ద్వారా వెళ్లిన వారికి వెంటనే పని పూర్తవుతోందని చెప్పారు. అన్ని సేవలు ఆన్లైన్లో అందించినా దళారుల బెదడ తప్పేట్టు లేదని పలువు అభిప్రాయపడుతున్నారు. -
భువనగిరిలో ఆర్టీఏ కార్యాలయం
భువనగిరి : భువనగిరి కేంద్రంగా ఏర్పాటు కానున్న యాదాద్రి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కలెక్టరేట్ ఇతర శాఖల కార్యాలయాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను పరిశీలించి ఎంపిక చేసిన అధికారులు తా జాగా ఆర్టీఏ ఆఫీస్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ స్థానిక అధికారులతో కలిసి మం గళవారం భువనగిరి శివారులో స్థలాన్ని పరి శీలించా రు. యాదాద్రి జిల్లాలో భువనగిరి కేంద్రంగా ఎంవీఐ కార్యాలయం పని చేయనుంది. ప్రస్తుత ప్రతి పాదనల ప్రకారం యాదాద్రిలో వరంగల్ జిల్లా జనగామ కలిస్తే భువనగిరి, అక్కడ ఉన్న ఆర్టీఏ కార్యాలయాలు రెండు వాహనదారులకు అందుబాటులోకి వస్తాయి. తప్పనిసరిగా సర్దుబాటు చేయాల్సిందే.. ప్రస్తుతం జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ పర్యవేక్షణలో నల్లగొండ, సూర్యాపేటల్లో ఆర్టీఏలు ఉం డగా, భువనగిరిలో ఎంవీఐతో సరిపెట్టారు. తాజాగా 3 జిల్లాల ప్రతిపాదనలు రావడంతో నల్లగొండ, సూర్యాపేటల్లో ఎంవీఐలతోనే కార్యాలయాలు కొనసాగించవ చ్చు. భువనగిరిలో మాత్రం ఎంవీఐ స్థానం లో ఆర్టీఏను నియమిస్తారు. ఇందుకోసం పూర్తిస్థాయి కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. కార్యాలయానికి 3నుంచి 5 ఎకరాల ప్రభుత్వ స్థలం భువనగిరి శివారులో ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేటల్లో ఆర్టీఏ కార్యాలయాల పక్కా భవనాల కోసంప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. భువనగిరిలో కూడా స్థలం ఖరారైతే నిధులు మంజూరు అవుతాయి. అద్దెభవనంలో ఎంవీఐ కార్యాలయం భువనగిరిలోని ఎంవీఐ కార్యాలయం అద్దెభవనంలో నడుస్తోంది. చాలా కాలంగా సొంత భవనం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా అది నెరవేరలేదు. పలుమార్లు కార్యాలయూన్ని మార్చారు. ప్రస్తుతం నల్లగొండ రోడ్డులో కొనసాగుతోంది. కార్యాలయం స్థా యి పెరగడంతో సొంత భవనం నిర్మిం చడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. భువనగిరి శివారులో స్థల పరిశీలన.. ఆర్టీఏ కార్యాలయం భవనం స్థలం కోసం వడపరి,్త మోత్కూరు రోడ్డులో రవాణా శాఖ డిటీసీ ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. 3 నుంచి 5 ఎకరాల స్థలం కావాలని రెవెన్యూ అధికారులను కోరారు. దీంతో రెండు చోట్ల ఉన్న స్థలం వివరాలను రెవెన్యూ అధికారులు రవాణా శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ మేరకు తమకు కావాల్సిన స్థలం వివరాలను తహసీల్తార్కు తెలియజేశామని డీటీసీ చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. స్థలం ఖరారైతే భవనం నిర్మాణం చేపడతామని చెప్పారు. డీటీసీ వెంట ఎంవీఐ వెంకటేశ్వర్రెడ్డి, ఏఎంవీఐ నరేష్ ఉన్నారు. -
త్వరలో క్యాష్లెస్ కార్యాలయంగా ‘రవాణా’
ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ వెల్లడి హైదరాబాద్: రాష్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు. లెసైన్స్ రెన్యూవల్ చేయించుకోవడంతోపాటు కొత్తగా ‘ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లెసైన్స్’ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా శాఖ 15 రకాల ఆన్లైన్ సేవలు అందిస్తోందని, త్వరలో అన్ని సేవలను ఆన్లైన్లో చేర్చి ‘క్యాష్లెస్ కార్యాలయం’గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ శాఖలను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చి పారదర్శకంగా సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దళారుల ఆగడాలపై విలేకరులు ప్రశ్నించగా ఈ విషయమై సంబంధిత శాఖ మంత్రి మాట్లాడతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒకేవిధమైన రవాణా చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ర్ట రవాణ శాఖ కార్యదర్శి సునీల్శర్మ, కమీషనర్ సందీప్ సుల్తానియా, జేటీసీలు రఘునాథ్, వెంకటేశ్వర్లు, రాష్ట మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్కు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను పొందారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు రవాణాశాఖ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. -
షాడో డీటీసీ!
► ఎనిమిదేళ్లుగా ఒకే సీటులో.. ► ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్ చెప్పిందే వేదం ► ఉన్నతాధికారి పేరుతో ఇష్టారాజ్యంగా వసూళ్లు ► హడలిపోతున్న రవాణాశాఖ ఉద్యోగులు నెల్లూరు (టౌన్): ఎనిమిదేళ్లుగా ఆయన రవాణాశాఖ కార్యాలయంలో ఒకే సెక్షను సీటులో పనిచేస్తున్నాడు. ఆ శాఖకు ఏ ఉన్నతాధికారి వచ్చినా ఆయన మాట వినాల్సిందే. ఎంతమంది ఉద్యోగుల బదిలీ అయినా ఆయన మాత్రం ఆ సీటుకు అతుక్కుని పోయాడు. ఉన్నతాధికారి పేరు చెప్పి ఆ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల నుంచి స్పెషల్ వర్క్ల పేరుతో వసూళ్లు చేస్తున్నారు. అక్కడ అందరూ ఈ ఉద్యోగిని షాడో డీటీసీగా పిలుస్తుంటారు. స్పెషల్ వర్క్లు పేరుతో అందరి దగ్గర వసూళ్లు చేసి ఉన్నతాధికారికి రోజుకు రూ.50 వేల అనధికార మొత్తాన్ని ఇస్తుండటంతో పాటు తన కమీషన్ కింద రూ. 5వేలు జేబులో వేసుకుంటున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు గుసుగుసలాడుకుంటున్నారు. దీంతో పాటు ఈయన చూస్తున్న ట్రాక్టర్ల సెక్షనులో రోజుకు మరో రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఉద్యోగి చేయాల్సిన ట్రెజరీ పనులన్నీ ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుకు అప్పజెప్పి రోజంతా ఉన్నతాధికారి వసూళ్లల్లో మునిగి తేలుతారని తోటి ఉద్యోగులే చెబుతున్నారు. ఈ షోడో డీ టీసీ పేరు చెబితేనే ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు హడలిపోతున్నారు. నెల్లూరు ఉపరవాణాశాఖా కార్యాలయంలో అకౌంట్స్ సెక్షనులో ఆయన 2008లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా అదే సెక్ష నులో పనిచేస్తున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ముగ్గురు ఉన్నతాధికారులు మారినా అకౌంట్స్ సెక్షనులో ఇప్పటికీ ఆ ఉద్యోగి ఉండటంపై రవాణాశాఖలో చర్చనీయాంశమైంది. రవాణాశాఖలో ఉన్నతాధికారికి కార్యాలయంలో ఆయా సెక్షన్లకు సంబంధించి అనధికార వసూళ్లు మొత్తం ఈ ఉద్యోగి ద్వారానే చేరుతాయని పలువురు చెబుతున్నారు. లారీల రిజిస్ట్రేషన్లు, బస్సుల పర్మిట్లు, ఎన్ఓసీలు, జేసీబీలు, పెద్ద,పెద్ద మిషన్ల వరకు కాగితాలు సక్రమంగా లేకపోయినా ఈ ఉద్యోగిని కలిస్తే చాలు. ఆయన చెప్పిన ప్రకారం డబ్బులు ఇస్తే ఆ పని క్షణాల్లో పూర్తవుతుంది. ఆ పనికి సంబంధించిన సెక్షను ఉద్యోగి కూడా ఈయన ఎంటర్ అవడంతో నోరెత్తకుండా పనిచేసిపెడతారు. ఉదాహరణకు వాహనం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ కావాలంటే రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి కనీసం ఏడాదిన్నర సమయం ఉండాలి. అలా లేకుంటే వాణిజ్యపన్నుల శాఖలో ట్యాక్స్కట్టి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురావల్సి ఉంది. ఈ పనికి సంబంధించి ఈయనను కలిసి చెప్పిన అనధికార మొత్తాన్ని చెల్లిస్తే పని పూర్తి చేశారు. ఈ రీతిలో స్పెషల్ వర్క్ల పేరుతో ఉన్నతాధికారికి అన్ని సెక్షన్లు నుంచి రోజుకు రూ.50 వేల మేర వసూలు చేసి దాంట్లో రూ.5వేలు తన ఖాతాలో వేసుకుంటారని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కార్యాలయంలో తోటి ఉద్యోగులపై ఉన్నతాధికారికి చాడీలు చెబుతుండటంతో ఈయన అంటేనే అక్కడ పనిచేసే ఉద్యోగులు హడలిపోతున్నారు. డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేసి తెచ్చి ఇస్తుండటంతో ఉన్నతాధికారి ఆ ఉద్యోగి చెప్పినదానికల్లా తల ఊపుతారంటున్నారు. ట్రెజరీ పనులు సెక్యూరిటీ గార్డుకు అప్పగింత రవాణాశాఖలో అకౌంట్స్ విభాగం కీలకం. అక్కడ ఉద్యోగులు, కార్యాలయానికి సంబంధించిన కీలక లావాదేవీలు, పత్రాలు ఉంటాయి. ఈ సెక్షనులో పనిచేస్తున్న ఉద్యోగి ట్రెజరీ బాధ్యతలను ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుకు అప్పజెప్పా రు. సెక్యూరిటీ గార్డే ప్రతిరోజూ ట్రెజరీకి వెళ్లి రవాణా కార్యాలయానికి సంబంధించిన అన్ని పనులను చక్కబెడుతున్నారు. క్యాష్ మాత్రం గుమస్తాకు అప్పజెబుతున్నారు. ఉద్యోగులు, కార్యాలయానికి సంబంధించిన పత్రాలు కూడా బయట వ్యక్తుల చేత పంపించకూడదన్న నిబంధన ఉంది. అయినా ఈ ఉద్యోగి అవేమీ పట్టించుకోరు. ఉన్నతాధికారి వసూళ్లలో నిమగ్నమవుతారు. ఉన్నతాధికారిని ప్రతిరోజూ ప్రసన్నం చేసుకుంటే ఎలాంటి తప్పులు చేసినా పట్టించుకోరన్న ప్రచారం సాగుతోంది. ఈయన బారినుంచి రక్షించాలని ఆ శాఖ ఉద్యోగులు వేడుకుంటున్నారు. వసూళ్లు విషయంపై పరిశీలిస్తాం : శివరాంప్రసాద్, ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో నాపేరు చెప్పి వసూలు చేస్తున్నారనే విషయం తెలియదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ట్రెజరీకి వెళ్లేందుకు గుమస్తాను ప్రత్యేకంగా నియమించాం. సెక్యూరిటీ గార్డును ఎందుకు పంపిస్తున్నారో అడిగి తెలుసుకుంటా. ప్రైవేటు వ్యక్తులను ట్రెజరీకి పంపించకూడదు. అకౌంటెంట్గా ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఆయన ఉంటున్నారు. -
ఆర్టీఏ కార్యాలయంలో దూసుకెళ్లిన కారు...
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జగిత్యాల ఆర్టీఏ కార్యాలయంలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవింగ్ టెస్ట్ చేస్తుండగా కార్యాలయంలోకి వచ్చిన ప్రజలుపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీఏ కార్యాలయానికి చేరుకుని... జరిగిన ఘటనపై విచారిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆర్టీఏ కార్యాలయంలో భారీ చోరీ
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం ఆర్టీఏ ఆఫీసులోని క్యాష్ కౌంటర్లో భారీ చోరీ జరిగింది. క్యాష్ కౌంటర్ లో ఉన్న రూ.80 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. క్యాష్ కౌంటర్ రూం కిటికీలు తొలగించి దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆర్టీఏ ఆఫీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వాళ్లే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. -
హై సెక్యూరిటీ నెంబర్ప్లేట్ల కోసం హైరిస్క్
-
అక్కడంతా ఆమ్యామ్యాలే!
- ఇద్దరు ప్రధాన అధికారుల హవా.. - ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే! - బ్రోకర్ల అండతో యథేచ్ఛగా అవినీతి దందా - ఆర్టీఏ కార్యాలయం ఎదుటేబ్రోకర్ ఆఫీసులు.. - రోజుకు సుమారు 500 ఫైళ్ల లావాదేవీలు - నెలకు రూ.2 కోట్లకు పైగా అక్రమార్జన సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘అనంత’ ఆర్టీఏ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. వెహికల్ రిజిస్ట్రేషన్...లెసైన్స్...పనేదైనా బ్రోకర్ను సంప్రదించాల్సిందే! బ్రోకర్తో సంబంధం లేకుండా ‘పని’కావాలని మొండిపట్టు పడితే ఆ పని ఎప్పటికి అవుతుందో తెలీదు. అధికారులు కూడా బ్రోకర్ల అండతోనే ఫైళ్ల క్లియరెన్స్... లావాదేవీలు సాగిస్తున్నారు. దీంతో ఇక్కడ ఏ పని కావాలన్నా ప్రభుత్వానికి నికరంగా చెల్లించాల్సిన మొత్తాని కంటే అదనంగా 2-4రెట్లు సమర్పించుకోవాల్సిందే. ఇద్దరు అధికారుల హవా! ఆర్టీఏ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్, లెసైన్స్ల జారీ ముగ్గురు ప్రధాన అధికారుల చేతుల మీద సాగుతోంది. వీరిలో ఇద్దరు ఇక్కడి లావాదేవీలు గుప్పిట్లో పెట్టుకున్నారు. వీరిద్దరి కింద దాదాపు 50 మంది బ్రోకర్లు ఉన్నారు. కార్యాలయం గేటు బయటే వీరి ఆఫీసులు ఉన్నాయి. జీపు, కారు, టాటాఏఎస్, మ్యాజిక్ లాంటి నాలుగుచక్రాల వాహనాల రిజిస్ట్రేషన్కు నిబంధనల ప్రకారం 650 రూపాయలు చలానా ఖర్చు అవుతోంది. నెంబర్ ప్లేటుకు మరో 600 రూపాయలవుతుంది. అయితే బ్రోకర్లు 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్కు అయ్యే ఖర్చును చెల్లిస్తారు. తక్కిన డబ్బును మూటగడతారు. ఇలా ఒక్కో బ్రోకర్ రోజుకు దాదాపు రూ.10-13వేల దాకా ఆర్జిస్తున్నట్లు తెలిసింది. అంటే! ఇక్కడున్న 50 మంది బ్రోకర్లు రోజువారి ఆదాయం 5లక్షలపైమాటే! ఈ మొత్తం సొమ్ము సాయంత్రం అయ్యేసరికి ఆర్టీఏ కార్యాలయంలోని ఇద్దరు అధికారులకు ఇస్తారు. ఈ ఇద్దరు ఎవరు ఎన్ని ఫైళ్లు తీసుకొచ్చారు? ఎవరి వాటా ఎంతా అనేది తేల్చుతారు? వారు కింది నుంచి పై స్థాయి వరకూ ‘వడ్డి’ంపులు చేస్తారని కార్యాలయంలోని ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. ఇంగ్లీషుతోనే అసలు సమస్య! వాహనదారులు, డ్రైవర్లు పూర్తి చేయాల్సిన దరఖాస్తులన్నీ ఇంగ్లీషులోనే ఉన్నాయి. వీటిని పూరించడం చాలామందికి తెలీదు. దీంతో బ్రోకర్లను సంప్రదిస్తారు. వీరు వచ్చిందేతడవుగా బ్రోక్లర్లు ‘మీకెందుకు తిప్పలు, మీరు వెళితే లేనిపోని సాకులు చూపి ఆలస్యం చేస్తారు. పైగా నాలుగైదు రోజులకు బాడుగలు పోతాయి. మాకివ్వండి మేం చేస్తాం’ అని ఆందోళన రేపుతారు. దీంతో వాహనదారులు బ్రోకర్లు సరెండర్ అవుతారు. వారు అడిగినంత డబ్బులు చెల్లిస్తున్నారు. బ్రోకర్లను సంప్రదించకుండా నేరుగా ఫైలు అధికారి వద్దకు వెళితే అడ్డంకులు తప్పవు! దానిపై రాతను పసిగట్టి పక్కనపడేస్తారు. మరీ ఇబ్బంది పడితే మొహమాటం లేకుండా ఆ ఇద్దరి వద్ద ఉన్న అసిస్టెంట్లు రేటు చెప్పేస్తారు. వారు చెప్పినంత కచ్చితంగా ఇవ్వాల్సిందే! లేదంటే ‘గ్రీన్ఇంక్’ పెన్ పేపర్పై కదలదు. అదే బ్రోకర్ల ద్వారా వచ్చినవి అయితే నిమిషాల్లో పని చేస్తారు. ఇలా బ్రోకర్ల ద్వారా కార్యాలయంలో రోజుకు దాదాపు 500 ఫైళ్లు నడుస్తున్నట్లు సమాచారం. ఎల్ఎల్ఆర్కూ వసూళ్లే!! లెసెన్స్ల కోసం వెళ్లే డ్రైవర్లు ముందుగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. ఎల్ఎల్ఆర్కు 120 రూపాయలు ఖర్చవుతుంది. అయితే ఇక్కడ మాత్రం అదనంగా 300-500 రూపాయలు చెల్లించాలి. వాహన పరీక్ష (డ్రైవర్ల టెస్ట్)కు వెళితే అక్కడ మరో మూడు వందల రూపాయలు అదనంగా ఇచ్చుకోవాలి. పని పూర్తయిన తర్వాత తీరా లెసైన్స్ చేతికి రావాలంటే అక్కడా చేయి తడపాల్సిందే!! ఈ విధంగా కార్యాలయంలో ఫైలు కదిలే ప్రతీ టేబుల్ వద్ద ముడుపులు తప్పనిసరిగా చెల్లించుకోవల్సిన పరిస్థితి. కార్యాలయంలోని పరిస్థితిని ఆరా తీస్తే వాహనదారులు, లెసైన్స్ దారులంతా ‘ముడుపులు’ ఇవ్వకపోతే పని కాదని... ఇది ఆర్టీఏ కార్యాలయంలో సర్వసాధారణమైపోయిందని చెబుతున్నారు. దీనిపై ‘సాక్షి’ వాయిస్ అడిగితే వాహనాలు ఉన్నోళ్లం మేం ఆరోపిస్తే... మళ్లీ మా పని అవుతుందా? సార్! అని నిరాకరిస్తున్నారు. అన్నిశాఖల ప్రక్షాళనపై దృష్టి సారించిన కలెక్టర్ కోన శశిధర్ ఆర్టీఏ కార్యాలయం వైపు కూడా దృష్టి సారించాలని ‘మాముళ్ల’ భారం తగ్గించాలని కోరుతున్నారు. -
హెల్మెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్ : వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్తున్నారా.. అయితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే. రహదారి భద్రతా ఉద్యమంలో భాగంగా రవాణాశాఖ హెల్మెట్పై విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇకపై హెల్మెట్లు ధరించి వచ్చిన వారికి మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసైన్స్లు వంటి పౌరసేవలను అందజేస్తారు. ఈ మేరకు ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో గత సంవత్సరం జరిగిన ప్రమాదాల్లో దాదాపు 1,212 మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లనే చనిపోయినట్లు ఆర్టీఏ గుర్తించింది. దీంతో హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేశారు. ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చే వారిలో హెల్మెట్ ధరించిన వారికి మాత్రమేసేవలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ ఇంచార్జి సం యుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’తో చెప్పారు. -
భద్రాచలంలో ఏపీ టూరిస్టుల ధర్నా
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్కు చెందని టూరిస్టులు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం ఆందోళనకు దిగారు. సీజ్ చేసిన బస్సును తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు.. భద్రాచలంలోని శ్రీరాముల వారిని దర్శించుకోవడానికి చిత్తూరు, రాజమండ్రి నుంచి వచ్చిన భక్తులతో కూడిన బస్సు శుక్రవారం సాయంత్రం భద్రాచలం పరిసర ప్రాంతాలకు చేరుకుంది. బస్సు డ్రైవర్ వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అవసరమైన పర్మిట్ లేకపోవడంతో.. బస్సును తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద ఆపి.. అక్కడినుంచి ఆటోలో స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి బస్సు వద్దకు చేరుకునే సరికి భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆ బస్సును సీజ్ చేశారు. దీంతో రాత్రి నుంచి తీవ్ర అవస్థలు ఎదుర్కొటోన్న భక్తులు.. శనివారం ఉదయం ఆర్టీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. -
ఆర్టీఏలో బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు
- స్కూల్ బస్సులతో కిటకిటలాడిన ఆర్టీఏ కార్యాలయం - ఆన్లైన్లో నమోదు చేసుకున్న బస్సులకే ఫిట్నెస్లు ఖిలావరంగల్ : విద్యాసంవత్సరం ఆరంభం కానున్న నేపథ్యంలో వరంగల్ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం ఫిట్నెస్ పరీక్షల ప్రక్రియ జోరందుకుంది. ఆన్లైన్లో నమోదు చేసుకున్న బస్సులకే ఫిట్నెస్ పరీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో పెద్దఎత్తున విద్యాసంస్థల బస్సులు రావడంతో ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ నెల 15తోనే ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ పరీక్షల కాలపరిమితి ముగిసింది.. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంతో బస్సుల వివరాలు. బస్సుల డ్రైవర్, అటెం డెంట్, విద్యాసంస్థల వివరాలతోపాటు విద్యార్థుల వివరాలు రూట్మ్యాప్తో కూడిన వివరాలతో నమోదు చేసి ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్న బస్సులకు ఎంవీఐలు ఫిట్నెస్ పరీక్షలు చేసి సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల యజమానులు పోటాపోటీగా ముందుకు రావడంతో ఆర్టీఏ కార్యాలయంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా వరంగల్ రవాణాశాఖ అధికారి మాధవరావు మాట్లాడు తూ జిల్లాలో మొత్తం 1656 పైచిలుకు బస్సులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు బస్సు క ండీషన్ను బట్టి సుమారు 56 బస్సులకు ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. జూన్ 31 తర్వాత ఫిట్నెస్ పరీక్షలు లేని బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఆర్టీఏ ఆఫీసులో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మాయం
హైదరాబాద్ : హైదరాబాద్ ఉప్పల్ ఆర్టీఏ ఆఫీసులో హైసెక్యూరిటీ నంబర్ పేట్లు మాయమయ్యాయి. ఈ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు. కాగా వారు నంబర్ ప్లేట్లను ఆర్టీఏ ఆఫీసులో డెలివరీ ఇచ్చారు. అయితే మంగళవారం ఆఫీసులో నంబర్ ప్లేట్ల బ్యాగు మాయమైంది. దీనిలో సుమారు 300 నంబర్ ప్లేట్లు ఉన్నాయి. దీంతో ఆఫీసు సిబ్బంది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. -
సారుకో షాడో..!
తిమ్మాపూర్ : ఆర్టీఏ కార్యాలయంలో క్లర్క్స్థాయి నుంచి డీటీసీ వరకు 28 మంది ఉద్యోగులుండగా, మరో 18 మంది హోంగార్డులున్నారు. వీరుగాకుండా అనధికారికంగా 12 మంది ప్రైవేటు ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. కార్యాలయంలో ఫీజు వసూలు నుంచి ఆన్లైన్ చేసే వరకు ఒరిజినల్ ఉద్యోగులు పని చేస్తుండగా, వాటికి సంబంధించిన రికార్డుల నిర్వహణ, పత్రాల సమర్పణకు ప్రైవేటు ఉద్యోగులు పని చేస్తున్నారు. అట్లాగే వివిధ రకాల లెసైన్సులకు సంబంధించిన దరఖాస్తులపై సంతకాలు చేయడం అసలు ఉద్యోగుల పనైతే, సదరు ఫైళ్లపై ఉన్న కోడ్ల ఆధారంగా బ్రోకర్ల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేసుకోవడం ప్రైవేటు ఉద్యోగుల పని. ఈ లెక్కన ఏరోజుకు ఆరోజు తమ సారు ఎన్ని ఫైళ్లపై సంతకాలు చేశారో... అన్ని ఫైళ్లకు సంబంధించిన అమ్యామ్యాలను నిక్కచ్చిగా వసూలు చేసి బాస్కు అందజేస్తున్నారు. ఆ వెంటనే సదరు సారు తనకు అందిన డబ్బును లెక్క చూసుకుని అందులోంచి 20 శాతం సొమ్మును ప్రైవేటు ఉద్యోగికి అందజేస్తారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల కంట పడకుండా, ఒకవేళ ప్రైవేటు వ్యక్తి పట్టుపడినా తన చేతికి మట్టి అంటకుండా ఉండేందుకే ఆర్టీఏలో ఈ డూప్లికేట్ ఉద్యోగులను నియమించుకున్నారు. దళారీల వద్దకు వెళితేనే లెసైన్సు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసినా ఆర్టీఏ కార్యాలయ సమీపంలో దళారీ వ్యవస్థ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులు 80 శాతం దళారుల ప్రమేయంతోనే వస్తున్నాయి. లెర్నింగ్ లెసైన్సు నుంచి మొదలుకుని ప్రతీ పనికి దళారులు ఒక రేట్ ఫిక్స్ చేసుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బు కంటే ఎక్కువగా దళారులు వసూలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా దరఖాస్తుదారుడు నేరుగా ఆఫీసుకు వస్తే పత్రాలు సరిగా లేవంటూసాకులు చెబుతూ తిప్పుతుంటారనే విమర్శలున్నాయి. దీంతో విసిగిపోయిన దరఖాస్తుదారులు ఇష్టం లేకపోయినా దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తిమ్మాపూర్లోని ఆర్టీఏ కార్యాలయం వద్ద దాదాపు యాభై మందికి పైగా దళారులున్నట్లు తెలుస్తోంది. వీరంతా తాము పంపే దరఖాస్తులపై కోడ్ మార్కు పెట్టుకుంటారు. సదరు కోడ్ మార్క్ను చూసిన అధికారులు వాటిపై ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా సంతకాలు పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. తప్పనిసరి పనులకూ దళారీ తోడు కొన్ని పనులకు సంబంధించి దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సి ఉంది. ఆ సమయంలోనూ దళారులు ఆయన పక్కనే ఉండి వ్యవహారం నడిపిస్తున్నారు. లర్నింగ్ లెసైన్సు, పర్మినెంట్ లెసైన్సు, వాహన రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపులు, ఫిట్నెస్, పట్టుబడిన వాహనాల రిలీజ్తోపాటు శాఖాపరంగా ఇతర పనులను దళారులు తమకున్న అనుభవంతో చకచకా పనులు పూర్తి చేయిస్తారు. వాహనదారులకే అన్ని పత్రాలు ఇచ్చి వారు నేరుగా ఆఫీసుకు వచ్చేలా చూడాలని ఇటీవల షోరూం డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీటీసీ స్పష్టం చేసినప్పటికీ దానిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కొందరు షోరూం నిర్వాహకులు సైతం వాహన రిజిస్ట్రేషన్ తామే చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేసి ఆ ఫైళ్లను దళారులకు అప్పగిస్తున్నారు. ఆర్టీఏలో ఇంకా పాత పట్టికే... ఆర్టీఏ కార్యాలయంలో అందిస్తున్న సేవలు, వాటి ఫీజుల పట్టికకు, ప్రస్తుతం అధికారులు వసూలు చేస్తున్న చాలా వ్యత్యాసం కన్పిస్తోంది. ఈ విషయాన్ని కొందరు దరఖాస్తుదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికీ ఆఫీసు వద్ద పాత ఫీజు పట్టికే దర్శనమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా స్మార్ట్ కార్డులు రావడంతో ఒక్కో కార్డుకు రూ.200 అదనంగా పెరిగినట్లు చెబుతున్నారు. పట్టికలో చూపించిన ఫీజులతో పాటు అదనంగా పోస్టల్ చార్జీలు వసూలు చేస్తుండగా, ఆ మొత్తం ఫీజు చలాన్ రూపంలోనే చూపించి రశీదు ఇస్తున్నారు. కొందరు నేరుగా, మరికొందరు ఏజెంట్ల ద్వారా కార్డులు తీసుకోవడంతో పోస్టల్ ద్వారా వెళ్తున్న కార్డులు తక్కువనే చెప్పొచ్చు. జేబులకు చిల్లు ఇలా... - లెసైన్స్ కోసం వచ్చే దరఖాస్తుదారునికి లెర్నింగ్ సమయంలో గరిష్టంగా రూ.90, పర్మినెంట్ లెసైన్స్ కోసం రూ.440 మాత్రమే ఆఫీసులో ఖర్చు ఉంటుంది. అయితే వీరి వద్ద దళారులు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తుంటారు. - బైక్ల రిజిస్ట్రేషన్కు రూ.395, కార్లకు రూ.650 ఫీజుంటే రూ.1200 నుంచి 2 వేల వరకు, టాక్సీ కార్లకు పర్మిట్, ఫిట్నెస్, రిజిష్ట్రేషన్కు రూ.2250 వరకు ఫీజుండగా, రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. - లారీలకు ఫిట్నెస్కు రూ.1150 ఫీజుంటే రూ.3వేల వరకు, ట్రాక్టర్లకు రూ.550 ఉంటే రూ.వెయ్యి వరకు వసూలు చేస్తుంటారు. - హార్వెస్టర్కు రూ.3600 ఫీజుంటే రూ.10వేల వరకు వసూలు చేస్తుంటారు. - దళారులు వసూలు చేసిన మొత్తంలో ఒక్కో పనికి ఒక్కో విధంగా రూ.వంద నుంచి రూ.2వేల వరకు కార్యాలయంలో క్లర్క్ నుంచి మొదలు అధికారి వరకు ముట్టజెప్పుతారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. -
వీళ్లకేం మేసే రోగం!
వాళ్లంతా ప్రభుత్వోద్యోగులు. నెల తిరిగే సరికి వేలాది రూపాయల వేతనం చేతికందుతుంది. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా బతికేయొచ్చు. తాము చే సిన పనికి లభించిన వేతనంతో తృప్తిపడదామని అనుకోవడం లేదు. కానీ ఎందుకో ప్రజల సొమ్మును కూడా భోంచేయాలనే దుర్బుద్ధి పుడుతోంది. ఇంకేముంది అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల జరుగుతున్న పలు సంఘటనలు ప్రభుత్వ ఉద్యోగుల తీరుతెన్నులకు అద్దం పడుతున్నాయి. కడప అర్బన్: కడప ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 18.60 లక్షల రూపాయలను స్వాహా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న చక్రపాణి రూ. 5 లక్షలు మాయం చేసేశాడు. ఇక కడప డీసీసీ బ్యాంకు సిబ్బంది ఏకంగా తాకట్టు పెట్టిన బంగారు నగలనే మార్చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఐదు లక్షలు మాయం.. ఆర్టీఏ కార్యాలయంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న చక్రపాణి గతనెల 28వ తేదీన రూ.13లక్షలు ట్రెజరీ నుంచి నగదు రూపంలో కార్యాలయానికి తీసుకొచ్చాడు. రూ.5లక్షలను ఉద్యోగులకు వేతనాలుగా పంపిణీ చేశాడు. మిగిలిన రూ.8లక్షలను బీరువాలో ఉంచి సెలవుపై వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత కార్యాలయానికి తిరిగి వచ్చి బీరువా తెరిచి చూస్తే రూ.3లక్షలు మొత్తం మాత్రమే ఉంది. మిగిలిన రూ.5లక్షలు కనిపించలేదు. బీరువాకు వేసిన తాళం వేసినట్లే ఉంటే ఈ ఐదు లక్షలు ఎలా మాయమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ ప్రశ్నకు సమాధానం సదరు ఉద్యోగి అయినా చెప్పాలి.. లేదంటే కార్యాలయ ఉన్నతాధికారులైనా చెప్పాలి. ఇవేమీ లేకుండా జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే, డబ్బు గురించి పూర్తిగా విచారించకుండానే సంజాయిషీ ఇవ్వాలని నోటీసు ఇవ్వడం.. అదేరోజు అకౌంటెంట్ రూ.5లక్షలు ఠంచన్గా జమ చేసేయడాన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయం ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఇక్కడి డీటీసీపై సీరియస్ అయ్యారు. రికార్డులు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన అకౌంటెంట్ చక్రపాణిని సస్పెండ్ చేశారు. డీసీసీ బ్యాంక్లో బంగారు మాయ... చెన్నూరుకు చెందిన సాదక్ అలీ 2012 మే 4న తన అవసరం కోసం 9.5 తులాల బంగారు ఆభరణాలను జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్లో తాకట్టు పెట్టి రూ.1.36లక్షలను రుణంగా తీసుకున్నాడు. రుణం తీసుకునే సమయంలో బ్యాంకు అప్రైజర్ వీరబ్రహ్మాచారి నగలను పరిశీలించి వాటి నాణ్యత, విలువను నిర్ధారించాకే రుణం మంజూరైంది. మరలా 2013 జులై 25న రెన్యువల్ చేసేటప్పుడు కూడా అదే అప్రైజర్ బంగారు ఆభరణాలను సరిచూశారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారుల ఆదేశాల మేరకు గత నెల 27వ తేదీన వీరబ్రహ్మాచారి, మరో అప్రైజర్ పి.గిరి 520 ఖాతాలకు సంబంధించిన బంగారు ఆభరణాలను రెండు రోజుల్లో సరి చూశారు. ఈ క్రమంలో సాదక్ అలీ రెండు రోజుల క్రితం రెన్యువల్ కోసం డబ్బు కట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన నగలు నకిలీవని బ్యాంక్ అధికారులు తె లపడంతో అవాక్కైన సాదక్ అలీ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు డీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్కె వలీచాంద్ కూడా తమ సిబ్బందితో వచ్చి సాదక్ అలీ ఇచ్చిన నగలు నకిలీవని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారించి ఆ నగలను తీసుకురావాలని చెప్పినప్పటికీ బ్యాంకు అధికారులు నగలను అప్పజెప్పకుండానే కేసు నమోదు చేయాలని కోరడం గమనార్హం. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇటీవల ఎర్రగుంట్ల ఎంపీడీఓ జయసింహ సాక్షరభారత్ నిధులను స్వాహా చేశారనే కారణంగా అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో కడపలో ఓ స్టేట్బ్యాంక్ అధికారి కూడా ఇదే రీతిలో మోసాలకు పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. జిల్లా ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్ట్స్ కళాశాలలో ఏం జరిగిందంటే.. ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రఘురామిరెడ్డి 2013లో తమ కళాశాలలో డిగ్రీ చదివి వెళ్లిన మారుతీనగర్కు చెందిన కృపాకర్ అనే విద్యార్థి పేరు మీద సెంట్రల్ బ్యాంక్లో ఖాతా ఉండటంతో తన దగ్గరున్న చెక్కు బుక్కుతో అక్షరాలా రూ.4.30 లక్షలను రాయించి ఇచ్చాడు. ఆంధ్రాబ్యాంక్కు చెక్కు వెళ్లి సెంట్రల్ బ్యాంక్లో కృపాకర్ ఖాతాలో రూ.4.30లక్షలు జమ అయింది. కృపాకర్ను అడ్డుపెట్టుకొని రఘురామిరెడ్డి, అతని స్నేహితుడు ఎంఎం బాషా, వారి సహచరులు చిన్ని, మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కవిత అనే వారు ఎంచక్కా రూ.4.25లక్షలను డ్రా చేసుకున్నారు. సెంట్రల్ బ్యాంక్ మేనేజర్కు అనుమానం వచ్చి ఆర్ట్స్ కళాశాల ఖాతా నుంచి ఒకే విద్యార్థికి రూ.4.30లక్షలు ఎందుకు జమ అయిందో సంజాయిషీ అడిగారు. సదరు విద్యార్థిని పిలిపించి అథారిటీ లెటర్ తీసుకురావాలని కోరారు. కృపాకర్ రఘురామిరెడ్డిని సంప్రదించగా కవిత ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటలక్షుమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి అథారిటీ లెటర్ తయారుచేసి ఇచ్చింది. ఆ సంతకాలలో ఒకటి నకిలీదని బ్యాంక్ మేనేజర్ గుర్తించి నిలదీశారు. ప్రిన్సిపల్ను పిలిపించి వ్యవహారాన్ని తేల్చమని చెప్పారు. దీంతో ఆమె రఘురామిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో రఘురామిరెడ్డి అండ్ పార్టీ వ్యవహారం బయటపడింది. కడప నగరంలో ఆర్ట్స్ కళాశాలకు సంబంధించిన ఖాతాలు బోలెడున్నాయి. ఇదే అదనుగా భావించిన రఘురామిరెడ్డి మొదట తన స్నేహితుడు ఎంఎంబాషా పేరుతో రూ.4600 చెక్కును రాయించి ఎస్బీఐ బ్యాంక్కు పంపించాడు. వెంటనే ఆ మొత్తం ఎంఎంబాషా పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఆ తర్వాత మారుతీనగర్కు చెందిన కృపాకర్ పేరు మీద రూ.4.30 లక్షలు, రామిరెడ్డి అనే వ్యక్తి పేరు మీద రూ.4,84,500, రూ.4,74,500 అనే రెండు చెక్కులు రాయించాడు. ఇతను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచి ఈ మొత్తం ఖాతాలో పడగానే డబ్బును డ్రా చేసుకొని వెంటనే ఖాతా కూడా రద్దు చేసుకున్నాడు. రఘురామిరెడ్డి బంధువు మనోరంజన్రెడ్డి అనంతపురంలో వ్యాపారం చేస్తున్నాడు. అతని స్నేహితుడు సర్దార్ ఖాతాలో రూ.4.70లక్షల మొత్తాన్ని జమచేసి వెంటనే డ్రా చేసుకున్నాడు. ఇలా మొత్తం రూ.18.60లక్షలను స్వాహా చేసిన రఘురామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇన్ని లక్షల రూపాయలను స్వాహా చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనేది అర్థంకాని ప్రశ్న. -
ఎట్టకేలకు ‘హై సెక్యూరిటీ’
పరిగి: స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించే కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వాహనాలకు నంబర్ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. 2013 డిసెంబర్లో మొదటిసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రతి వాహనానికీ హైసెక్యూరిటీ నంబర్లు ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసింది. జిల్లాలో మొత్తం ఆరు ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా.. ఏడు నెలల క్రితం ఒక్క కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో మాత్రమే ఈ ప్రక్రియ ప్రారంభించారు. మిగతా ఆరు ఆర్టీఏ కార్యాలయాల్లో ఐదు అర్బన్ జిల్లాలో ఉండగా గ్రామీణ జిల్లాలో పరిగిలో మాత్రమే ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఈ ఒక్క ఆర్టీఏ కార్యాలయంలోనూ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ వారంలోపు ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు అప్పటినుంచీ నాన్చుతూ వచ్చారు. ఇదే సమయంలో రాష్ట్ర పునర్విభజన కూడా జరగటంతో ఈ ప్రక్రియ కాస్త అటకెక్కింది. సమస్యలన్నీ తొలగటంతో ఎట్టకేలకు శుక్రవారం నుంచి పరిగిలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించే ప్రక్రియ ప్రారంభానికి నోచుకుంది. ఇందుకోసం పరిగి ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి కేవ లం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు మాత్రమే ఈ నంబర్పేట్లు బిగిస్తారు. అదనపు భారం భరించాల్సిందే.. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకయ్యే ఖర్చును వాహనదారులే భరించాల్సి వస్తుంది. అన్ని రకాల ట్యాక్సులు కలుపుకొని రేట్లు ఇలా ఉన్నాయి. ద్విచక్రవాహనాలకు రూ.245, త్రీ వీలర్ (ఆటో తదితర వాహనాలు)కు రూ. 282, లైట్ మోటార్ వెహికల్ కార్లు తదితర వాహనాలకు రూ.619, ఇతర హెవీ ట్రాన్స్పోర్టు, వాణిజ్య వాహనాలకు రూ.649 చెల్లించి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను బిగించుకోవాల్సి ఉంటుంది. దీనికిగాను వాహనదారు వారం రోజులు ముందుగానే ఆర్టీఏ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికైతే కొత్తవాహనాలకే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు బాధ్యతను ఆర్టీఏ పర్యవేక్షిస్తున్నప్పటికీ ప్లేట్ల బిగింటం, అవి తయారు చేసే బాధ్యతను ఆర్టీసీకి అప్పగించారు. ఇప్పటి వరకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించేందుకు 150ప్రొసీడింగ్స్ సిద్ధంచేసి వారికి అందజేశాం. శుక్రవారం నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యింది. పది మంది వరకు వాహనదారులు దరఖాస్తులు చేసుకున్నారు. వారి వాహనాలకు వారం రోజుల్లో నంబర్ ప్లేట్లను బిగిస్తారు. ముందుగా కొత్త వాహనాలకు మాత్రమే ఏర్పాటు చేస్తాం. పాత వాహనాల విషయంలో ఇంకా ఎలాంటి ఆదేశాలూ అందలేదు. - శ్రీనివాస్రెడ్డి, ఎంవీఐ, పరిగి -
‘లష్కర్’ భద్రత పూచీ నాదే
పోలీసులతో మంత్రి పద్మారావు రాంగోపాల్పేట్: లష్కర్ బోనాల జాతరలో శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానికి పూచీ నాదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు అన్నారు. ఆంక్షల పేరుతో భక్తులను ఇబ్బందులకు గురిచేయొద్దని, ఎవరి నుంచైనా ఇబ్బందులు వస్తే ప్రత్యక్షంగా తాను, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడే ఉండి వెంటనే సరిదిద్దుతామని మంత్రి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ఈనెల 13,14వ తేదీల్లో జరుగనున్న బోనాల జాతరపై నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డ, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలహార బండ్ల ఊరేగింపులో పోలీసులు కొంత సంయమనంతో వ్యవహరించాలని, త్వరగా పంపించాలే ఉద్దేశంతో బలవంతగా పంపిస్తే ఇబ్బందులు వస్తాయన్నారు. ఫలహార బండ్ల నిర్వాహకులు ఎవరైనా అతిగా వ్యవహరిస్తే ‘మీ డ్యూటీ నేను చేస్తా.. మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు, మీ మాట వినని వారు మాకు వింటారు’ మీరు ఇబ్బందులకు గురిచేస్తే మాకు టెన్షన్ పెరుగుతుందన్నారు. డీజేలకు ఒక జోన్లో అనుమతి ఇచ్చి మరో జోన్లో ఇవ్వకపోతే అది పోలీసులకు ఇబ్బందిగా వస్తుంది కాబట్టి సౌండ్ను కొద్దిగా తగ్గించి పెట్టుకునేలా చట్ట ప్రకారం వ్యవహరించి అనుమతి ఇవ్వాలని ఆయన పోలీసులను కోరారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి, అదనపు కమిషనర్ ్ర (ట్రాఫిక్) జితేందర్, జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి, ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి, కార్పొరేటర్లు కిరణ్మయి, మహేశ్వరి, ఈవో అశోక్, ఆర్డీవో రఘురాంశర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను మంత్రి, ఎమ్మెల్యే, కమిషనర్ కలిసి పరిశీలించారు. -
డ్యూటీ వద్దు.. డ బ్బే ముద్దు..
మామునూరు : నవ్విపోతురుగాక మాకేటి సిగ్గు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వరంగల్ ఆర్డీఏ కార్యాలయం లో పనిచేస్తున్న హోంగార్డులు. లెసైన్స్ కోసం కార్యాల యానికి వస్తున్న వాహనదారులను క్రమపద్ధతిలో పం పించి, పనులను వేగవంతం చేసేందుకు పాటుపడాల్సి న హోంగార్డులు విధులను పక్కనపెట్టి అవినీతి దందా కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయి తే అసలు పనులను పక్కనపెట్టి.. అక్రమ సంపాదన కో సం కక్కుర్తి పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరి స్తున్నారు. దీంతో హోంగార్డుల దందా మూడు పువ్వు లు.. ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో నాలుగేళ్ల నుంచి 13 మంది హోంగార్డులు పనిచేస్తున్నా రు. అయితే లెసైన్స్ కోసం కార్యాలయానికి వస్తున్న వాహనదారులకు తగిన సమాచారం అందిస్తూ, వారికి సహాయపడాల్సిన హోంగార్డులు అక్రమ సంపాదనకు అలవాటుపడ్డారు. కార్యాలయం బయట లెసైన్స్లు ఇప్పిస్తున్న ఏజెంట్ల సంపాదనను ప్రత్యక్షంగా గమనిం చిన హోంగార్డులు తాము కూడా కొంత సంపాదించుకోవాలని భావించారు. దీంతో లెసైన్స్ల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వస్తున్న వాహనదారులతో ముందుగా నే మాట్లాడుకుని వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే తమ అక్రమదందాను గమనిస్తున్న అధికారులను మచ్చిక చేసుకు ని వారికి కూడా తమ సంపాదనలో కొంతవాటా ఇస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, లెసైన్స్లు ఇప్పిస్తున్న హోంగార్డుల నెల సంపాదన సుమారు రూ. 60 వేల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీఏలో నాలుగేళ్ల నుం చి పనిచేస్తున్నప్పటికీ తమ విధులను మార్చకుండా ఆర్ఐ స్థాయి అధికారులను హోంగార్డులు మచ్చిక చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఏజెం ట్లను భయబ్రాంతులను గురిచేస్తూ తమ దందాకు అడ్డురాకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, హోంగార్డుల అక్రమ దందాకు సుమారు 100 మంది అనుచరులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. -
కాసులు కురిపించిన ‘కొత్త’ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రం... కొత్త సిరీస్... కొత్త ఫ్యాన్సీ నంబర్లు... వురింకేం.. ఈ కొత్తదనాన్ని కొల్లగొట్టేందుకు వాహనదారు లు క్యూ కట్టారు. నచ్చిన నంబర్ల కోసం పోటీపడ్డారు. లక్షలు వెచ్చించడానికీ వెనకాడకుండా ఫ్యాన్సీ నంబర్లపై క్రేజ్ను చాటుకున్నారు. గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో పలు నంబర్లు రవాణాశాఖకు కాసులు కురిపించాయి.‘టీఎస్ 09 ఈఏ 3456’ అనే రైజింగ్ నంబర్ కోసం పీవీఎస్ రాజు అనే వాహనదారుడు రూ.2.70 లక్షలు చెల్లించారు. రూ.41.23 లక్షల ఖరీదైన తన ఆడి కారు కోసం ఈ నంబర్ను సొంతం చేసుకున్నారు. అలాగే బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనే సంస్థ తమ కారు కోసం ‘టీఎస్ 09 ఈఏ 3366’ నంబర్కు రూ.80 వేలు చెల్లించింది. జి.రాజు సుధీర్ తన రూ.9.69 లక్షల ఖరీదైన ఫోర్డ్ ఇండియా వాహనం కోసం ‘టీఎస్ 09 ఈఏ 3339 ’ నంబర్ను రూ.35,100 చెల్లించి సొంతం చేసుకున్నారు. గురువారం ఒక్కరోజే ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.6 లక్షల ఆదాయం లభించినట్లు ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ తెలిపారు. -
జోరు పెరిగిన ‘టీఎస్’
- ఆర్టీఏ కార్యాలయంలో భారీగా వాహనాల రిజిస్ట్రేషన్లు - మేడ్చల్ రీజియన్కు టీఎస్ 07ఈబీ0001 సిరీస్ కేటాయింపు: ఆర్టీఓ శంకర్ మేడ్చల్ రూరల్: మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ (టీఎస్) సిరీస్తో వాహనాల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం సమ్మతించి జులై 2న అపాయింటెడ్ డే గా ప్రకటించడంతో వాహన యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిలిపివేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకొంటే తెలంగాణ సిరీస్ వస్తుందనే ఈ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు. ఇటీవల టీఎస్ సిరీస్తో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాకు టీఎస్ 07, 08 సిరీస్ను కేటాయించగా మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయ పరిధికి టీఎస్ 07 కేటాయించినట్లు స్థానిక ఆర్టీఓ శంకర్ తెలిపారు. ఈ సిరీస్తోనే వాహనాలకు ఈ నెల 18 నుంచి రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు ఆయన చెప్పారు. వాహనదారులు ఒరిజనల్ పత్రాలతో కార్యాలయంలో సంప్రందించాలని శంకర్ సూచించారు. పాత వాహనదారులు ఆందోళన చెందవద్దు: ఆర్టీఓ శంకర్ పాత వాహనాల యజమానులు తమ పాత నంబర్ సిరీస్ను తొలంగించి టీఎస్ సిరీస్గా మార్చుకోవడంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్టీఓ శంకర్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తున్నామని, పాత వాహనాల సిరీస్ మార్పు చేయడానికి ఎటువంటి ఉత్తర్వులు అందలేదని వివరించారు. ద్విచక్ర వాహనాలకు మేడ్చల్ ఆర్టీఏ పరిధికి టీఎస్07 ఈబీ0001 రిజిస్ట్రేషన్ నంబరు నుంచి ప్రారంభమైందని, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు టీఎస్07యూబీ 0001 నుంచిప్రారంభించామని ఆయన తెలిపారు. పాత వాహనాల సిరీస్ మార్పు కోసం ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వాహనదారులు ఈ విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. కొందరు పాత వాహనాలకు ఏపీ స్థానంలో టీఎస్గా నంబరుప్లేటుపై మార్పు చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఆర్సీని మార్పు చేసిన అనంతరమే నంబర్ప్లేట్పై సిరీస్ను మార్పు చేసుకోవాలన్నారు. -
టీఎస్ 03వచ్చేసింది!
సిరీస్ను విడుదల చేసిన అధికారులు మొదటి రోజు 33 రిజిస్ట్రేషన్లు.. 23 ఫ్యాన్సీ నంబర్లకు రిజర్వేషన్ తెలంగాణ సిరీస్ రావడం ఆనందంగా ఉందన్న వాహనదారులు ఖిలా వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ కూడా మారింది. ఏపీ సిరీస్ పోయి.. టీఎస్ సిరీస్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం మన జిల్లాకు ‘టీఎస్ 03’ కేటారుయించగా.. అధికారులు బుధవారం నుంచి కొత్త సిరీస్ ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ను ప్రారంభించారు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో రవాణా శాఖ ఉప కమిషనర్(డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ కొత్త నంబర్లను విడుదల చేశారు. జిల్లాలో మొదటి నెంబర్ ‘టీఎస్ 03 ఇఏ-0001’ను వాల్గో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సీఈఓ అయిన హన్మకొండ వాసి గుంటి శ్రీధర్రావు దక్కించుకున్నారు. ఆ ఫ్యాన్సీ నంబర్ను శ్రీధర్రావుకు డీటీసీ అందజేశారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ కొత్త సిరీస్తో మొదటిరోజు 33 మంది వాహనదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, దీంతో పాటు 23 ఫ్యాన్సీ నంబర్లకు రిజర్వేషన్ చేసుకున్నారని వివరించారు. టీఎస్03 సీరీస్కు మొదటిరోజు రూ. 2.63లక్షల ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించా రు. పాత వాహనాలకు మాత్రం ఏపీ 36 సీరిస్ కొద్దిరోజుల పాటు యథావిధిగా కొనసాగనుందని తెలి పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంవీఐలు జయకుమార్, కొండల్రావు, రాంచందర్, సత్యనారాయ ణ, కార్యాల సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు. వాహనదారుల్లో కొత్త ఉత్సాహం టీఎస్ సిరీస్ కోసం వచ్చిన వాహనదారులతో వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త రాష్ట్రంలో .. కొత్త వాహనాలతో.. కొత్త నెంబర్లతో వాహనదారులు ఆనందంలో ము నిగిపోయూరు. ఇప్పటికే చాలామంది కొత్త వాహనా లు కొనుగోలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర సిరీస్ కోసం ఎదురుచూశారు. బుధవారం కొత్త నెంబర్లకు ఆర్టీఏ పచ్చజెండా ఊపడంతో ఆర్టీఏ కార్యాల యం వాహనదారులతో కిక్కిరిసిపోయింది. అయితే మొదటిరోజు టీఎస్ సిరీస్లో ఫ్యాన్సీ నంబర్ల కోసం సైతం వాహనదారులు పోటీపడ్డారు. కొంతమంది ఏకంగా ఎన్నిడబ్బులైనా చెల్లిస్తాం.. మాకు ఫ్యాన్సీ నంబర్ కేటాయించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. నా అదృష్ట సంఖ్య 03 దక్కించుకున్నా.. తెలంగాణ రాష్ర్టంలో జిల్లాకు కేటాయించిన టీఎస్03కావడమే కాకుండా నా అదృష్ట సంఖ్య 3 నంబర్ నాకు దక్కడం ఆనందంగా ఉంది. ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం కొన్ని రోజులుగా ఎదురుచూసిన. - తోట సునీల్, వరంగల్ టీఎస్ సిరీస్లో 6 నంబర్ గురించి ఎంతో కలగన్నాం 60 ఏళ్ల కల నెరవేరిన నేపథ్యంలో వాహనాలకు కూడా ఏపీ సిరీస్పోయి టీఎస్ సిరీస్ రావడం చాలా సంతోషంగా ఉంది. 6 మా లక్కీ నంబర్. దీని కోసం చాలా రోజులు ఎదురు చూశాం. ఆర్టీఏ అధికారులు మాకు టీఎస్03ఇఎ006 నంబర్ కేటాయించడం ఆనందంగా భావిస్తున్నాం. - ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ నగర మాజీ మెయర్ ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నా ఇరవైరోజుల క్రిత మే వాహనం కొన్నాను. టీఎస్ సిరీస్లో కొత్త ఫ్యాన్సీ నెంబర్ టీఏస్ 03ఇఎ0036 కోసం ఇన్ని రోజులు ఆగాను. ఆలస్యం అయినా కూడా నాకు మంచి అదృష్ట నంబర్ దక్కింది. -శ్రీనివాస్, ఏకశిలనగర్ తొలి నంబర్ TS 03 EA 0001 దక్కించుకున్న హన్మకొండ వాసి శ్రీధర్రావు టీఎస్ సిరీస్లో తొలి నంబర్ ‘టీఎస్ 03ఇఎ0001’ ను హన్మకొండకు చెందిన గుంటి శ్రీధర్రావు దక్కించుకున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త ఫ్యాన్సీ నంబర్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ నంబర్ కోసం నెలరోజులగా ఎదురు చూస్తున్నానని, జిల్లాలోనే మొదటి నంబర్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. -
కొత్త వాహనాలకు ‘సెక్యూరిటీ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సరికొత్త బాదుడుకు రంగం సిద్ధమైంది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ)ను ప్రస్తుతానికి కొత్త వాహనాలకే పరిమితం చేసినా... దశలవారీగా పాతవాటికీ ఈ నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా భద్రత, వాహనాల రక్షణకు సెక్యూరిటీ ప్లేట్లను అమర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా టెండర్ల ప్రక్రియను సాగదీసిన సర్కారు... ఎట్టకేలకు కాంట్రాక్టుకు ఖరారు చేసింది. తొలివిడతలో మన జిల్లాతోపాటు జంట నగరాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు రవాణా శాఖ సమాయత్తమైంది. బుధవారం నుంచి రోడ్డెక్కే వాహనాలకు సెక్యూరిటీ ప్లేట్లను అమర్చుకోవాలని నిర్దేశించింది. ఆ తర్వాతి దశలో పాత బండ్లకు కూడా ఈ ప్లేట్ల బిగించేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాహనదారుల జేబుకు భారీగా చిల్లు పడనుంది. ప్రస్తుతానికి ఇది నూతన వాహనదారులకే పరిమితం కానుండగా.. ఇప్పటికే సంప్రదాయ నంబ ర్ ప్లేట్లతో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులపై కొత్తగా భారం పడనుంది. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ సగటున 500 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. అలాగే ఇప్పటికే జిల్లాలో సుమారు 15 లక్షల వ్యక్తిగత, రవాణా, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. వీటన్నింటికి త్వరలోనే కొత్త నంబర్ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇదిలావుండగా.. ఈ నెల 11 నుంచి జిల్లాలోని మేడ్చల్, ఇబ్రహీంపట్నం, పరిగి, కూకట్పల్లి, కొండాపూర్, ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయాల్లో సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చే విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రవాణాశాఖ ఉప కమిషనర్ రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా, ఈ నంబర్ప్లేట్ వల్ల అన్నింటికంటే ముఖ్యంగా దొంగ రిజిస్ట్రేషన్లు, దొంగ వాహనాలను అరికట్టేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. సెక్యూరిటీ ఇలా..! రవాణా వాహనాలకు సంబంధించి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు పసుపు రంగు ప్లేటుపైనా నల్లరంగులో.. ఇతర వాహనాలకు తెల్ల ప్లేటుపై నల్ల రంగులో నంబర్లు రాసి ఉండాలి. రిజిస్ట్రేషన్ చిహ్నాలు ఇంగ్లిష్లో.. అంకెలు అరబిక్ భాషలో ఉండాలి. ప్లేట్లు ఐదేళ్లపాటు మన్నికలో ఉండేలా రూపొందిస్తారు. ప్లేటుపై క్రోమియం హాలోగ్రామ్, దీనిపై అశోక చిహ్నం, భారత్ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసి ఉంటుంది. ప్లేటుపై శాశ్వత గుర్తింపు నంబర్ ఏడు అంకెల్లో ముద్రిస్తారు. లేజర్ విధానంతో దీన్ని ఏర్పాటు చేస్తారు. అంకెల పరిమాణం 2.5 ఎంఎం ఉంటుంది. ఈ నంబర్లపై హార్ట్ స్టాంపింగ్ ఫిల్మ్, ఇండియా అని రాసి వుంటుంది. థర్డ్ రిజిస్ట్రేషన్ వాహనాల ప్లేటు 100ఎంఎం- 60 ఎం.ఎం. సైజులో ఉండాలి. కుడిపక్క దిగువన క్రోమియం హాలోగ్రామ్ స్టిక్కర్ 10ఎంఎం-10 ఎంఎం సైజులో ఉంటుంది. ఈ స్టిక్కర్పై రిజిస్ట్రేషన్ నంబర్ పది ఎంఎం సైజులో మధ్యలో ఉండాలి. రిజిస్ట్రేషన్ అథారిటీ పేరు పై భాగంలో ఉండాలి. ఇంజిన్/ఛాసిస్ నంబర్ స్టిక్కర్ కిందిభాగంలో ఎడమవైపున 2ఎం.ఎం సైజులో ఉంటుంది. వాహన ముందుభాగంలో ఏర్పాటు చేసే నంబర్ ప్లేటు విడదీయలేకుండా ఉండాలి. ఆర్టీఏ కార్యాలయాల్లో మినహా మరెక్కడా వీటిని అమర్చరు. ప్లేటు పొరపాటున దెబ్బతింటే పాత ప్లేటును విధిగా అప్పగించాల్సివుంటుంది. -
ఐదు ప్రైవేటు బస్సుల సీజ్
సదాశివపేట/జహీరాబాద్, న్యూస్లైన్ : జిల్లాలో నిబంధనలు పాటించని ఐదు ప్రైవేటు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఇందులో సదాశివ పేటలో రెండు, జహీరాబాద్లో మూడు ఉన్నాయి. సదాశివపేటలో గురువారం రెండు ప్రైవేటు బస్సులను సీజ్ చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్ వద్ద ఆయన ఆధ్వర్యంలో సి బ్బంది ప్రైవేటు బస్సులను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబుబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ప్రతి రోజూ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఒమర్, సహారా ట్రావెల్స్కు చెందిన బస్సుల్లో ప్రయాణికుల వివరాల జాబితా, ఇద్దరు డ్రైవర్లు లేనందువల్ల వాటిని సీజ్ చేసి పోలీసులకు అప్పగించామని మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. తనిఖీల కార్యక్రమంలో సహా య మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బీ కిరణ్కుమార్, బాబులు పాల్గొన్నారు. జహీరాబాద్ : పర్మిట్ లేక పోవడం, ప్రయాణికుల వివరాలు సక్రమంగా లేక పోవడం, ట్యాక్స్ బకాయి పడడం తదితర కారణాలతో జహీరాబాద్లో మూడు ప్రైవేటు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. గురువారం అల్గోల్ రోడ్డులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) గణేష్ వాహనాలను తనిఖీ చేశారు. ముంబాయి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఒమర్ ట్రావెల్స్ బస్సును నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నందున సీజ్ చేశాడు. అదేవిధంగా బీదర్ క్రాస్రోడ్డు వద్ద 9వ జాతీయ రహదారిపై ఎంవీఐ సుభాష్, ఏఎంవీఐలు మధుసూదన్, జయప్రకాష్రెడ్డిలు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని కేశినేని, ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. -
ఆర్టీఏలో ‘పోస్టు’ల పేరిట వసూళ్లు !
సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల పేరిట హోంగార్డుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన అక్రమాల పర్వం తాజాగా మరో మలుపు తిరిగింది. హోంగార్డులకే ఆ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఫైలుపై సంతకం చేశారంటూ ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న వ్యక్తులు మరోసారి పెద్ద ఎత్తున వసూళ్లకు దిగినట్లు సమాచారం. రాజమండ్రికి చెందిన ఓ మోటారు వాహన ఇన్స్పెక్టర్, నగరానికి చెందిన ఒకరిద్దరు హోంగార్డులు కలిసి సాగించిన ఈ వసూళ్ల పర్వంలో వందలాది మంది హోంగార్డులు మోసపోయారు. వివరాల్లోకి వెళితే.. రవాణాశాఖలో ఖాళీగా ఉన్న 250 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెండేళ్ల క్రితమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోస్టుల భర్తీలో సాంకేతిక అంశాలు పరిష్కరించాల్సి ఉందని అధికారులు భర్తీ ప్రక్రియను చేపట్టలేదు. ఈ క్రమంలో, ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఆర్టీఏలో పనిచేస్తున్న హోంగార్డులనే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయాలని హోంగార్డుల సంఘం రవాణాశాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ వ్యవహారంలో రాజమండ్రికి చెందిన ఓ మోటారు వాహన తనిఖీ అధికారి సూత్రధారిగా వ్యవహరించారు. ప్రభుత్వ పెద్దలతో తనకు ఉన్న పరిచయాల దృష్ట్యా ఆ పోస్టులు హోంగార్డులకే ఇప్పించగలనని నమ్మించి వసూళ్లకు దిగాడు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఒకరిద్దరు హోంగార్డులను అనుచరులుగా ఎంపిక చేసుకొని ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఇలా సుమారు రూ.6 కోట్ల దాకా కొల్లగొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో కొంత మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలకు ముట్టజె ప్పినట్లు తెలిసింది. ఉద్యోగాల ఫైలుపై ఎలాంటి కదలికలు లేకపోవడంతో డబ్బులు చెల్లించినవారు రాజమండ్రి బాటపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే పోస్టింగ్ వస్తుందని, సీఎం సైతం సంతకం చేశారని హోంగార్డుల నుంచి ప్రస్తుతం మరో రూ.లక్ష చొప్పున సదరు వ్యక్తులు వసూలు చేసినట్లు తెలిసింది. హోంగార్డులూ మోసపోవద్దు.. ఇలా ఉండగా, పోలీసు శాఖకు చెందిన హోంగార్డులతో రవాణా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసే చట్టం లేదని రవాణాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రవాణాశాఖ కానిస్టేబుళ్ల భర్తీలో తమకు కోటా కేటాయించాలని గతంలో హోంగార్డుల సంఘం విజ్ఞప్తి చేసిందని, కానీ అది సాధ్యం కాదని అదనపు రవాణా కమిషనర్ పి.శ్రీనివాస్ ‘సాక్షి’తో చెప్పారు. పోటీలో నెగ్గిన వారికే ఉద్యోగాలోస్తాయన్నారు. మరోవైపు హోంగార్డుల విజ్ఞాపనపై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో కానిస్టేబుళ్ల భర్తీ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. -
మంత్రి గారి బంధువుమాయ!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జనగామ పట్టణంలో ఆర్టీఏ యూనిట్ కార్యాలయం ప్రస్తుతం అద్దె భవనంలో ఉంది. ఈ ఆఫీసుకు శాశ్వత భవనం కావాలనే ప్రతిపాదనలను ముందుకు కదపడంతోపాటు కొత్త భవన నిర్మాణానికి మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన వంతు ప్రయత్నాలు చేశారు. రూ. 60 లక్షల విలువైన భవన నిర్మాణానికి సర్కారు నుంచి గ్రీన్సిగ్నల్ ఇప్పించారు. సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణం కావడంతో ప్రత్యేక చొరవ ప్రదర్శించినట్లు మంత్రికి గుర్తింపు వచ్చింది. భవనానికి అవసరమయ్యే స్థల సేకరణకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సిద్ధపడింది. ఈ లోగా మంత్రి బంధువు ఒకరు చక్రం తిప్పారు. తమ రియల్ ఎస్టేట్ స్థలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇదో అనువైన.. అనుకూలమైన అవకాశంగా మలుచుకున్నారు. అక్కడున్న ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చేలా అమాంతం డిమాండ్ పెంచుకునేందుకు సరికొత్త ఎత్తుగడ వేశారు. చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయ భవనానికి విరాళంగా ఇస్తే... పక్కనే తమకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లుతుందని పథకం పన్నారు. అనుకున్నదే తడవుగా తమకు అందుబాటులో ఉన్న దాదాపు 40 ఎకరాల్లో రెండెకరాల స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయానికి విరాళంగా స్వాధీనం చేశారు. నిజానికి ఈ స్థలం జనగామ పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో పెంబర్తి గ్రామ పరిధిలో ఉంది. స్థానికులకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నప్పటికీ... మంత్రి గారి కనుసన్నల్లో విరాళంగా వచ్చిన భూములు కావడంతో రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు కిమ్మని కూడా అనలేదు. దీంతో చకచకా ఏర్పాట్లు జరిగాయి. గత ఏడాది డిసెంబరు 20వ తేదీన మంత్రి పొన్నాల ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనుకున్నట్లుగానే తెరచాటు పథకం ఫలించింది. కొత్తగా ఆర్టీఏ ఆఫీసు అక్కడ నిర్మిస్తున్నారనే ప్రచారంతో అక్కడున్న రియల్ వ్యాపారం అంచనాలు దాటింది. మంత్రి బంధువు పంట పండింది. సెవెన్ హిల్స్ పద్మావతి డెవెలపర్స్ పేరిట మూడు వెంచర్లుగా తీర్చిదిద్దిన ఈ రియల్ ఎస్టేట్లో స్వయానా మంత్రి బంధువు ఒకరు డెరైక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం ఈ వెంచర్లో 150 గజాల ప్లాటును రూ. 2.36 లక్షలకు విక్రయిస్తున్నారు. నిజానికీ ఆర్టీఏ ఆఫీసు ఊసు లేకముందు... ఈ గ్రామ పరిధిలో మార్కెట్ రేటు గజానికి కేవలం రూ. 40. వ్యాపార రీత్యా ఐదు రెట్లు గరిష్ఠంగా లెక్కలేసిన 150 గజాల ప్లాటు విలువ రూ. 30 వేలు దాటే ప్రసక్తి లేదు. రియల్ వెంచర్.. డెవెలప్మెంట్ మాటలు చెప్పినా.. ఒక్కో ప్లాటు రూ. 50 వేలు పలుకుతుంది. కానీ.. ఏకంగా నాలుగింతలకు పైగా రేట్లు పెంచి.. కోట్లాది రూపాయల విలువైన భూ దందాకు ద్వారాలు తెరిచారు. ఇప్పటికీ అక్కడ ఆర్టీఏ ఆఫీసు నిర్మాణానికి సంబంధించి శిలాఫలకం తప్ప పునాదులు కూడా తవ్వలేదు. కానీ... మంత్రి బంధువుల రియల్ వ్యాపారం మాత్రం రోజురోజుకూ కోట్లకు పడగలెత్తుతోంది. భూరి విరాళమో... భూములను ఎరవేసి అడ్డగోలు సంపాదించడమెలాగో... జనగామ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెంబర్తి వద్ద వెలిసిన ఈ రియల్ వెంచర్ అందరి కళ్లకు కట్టిస్తోంది.