Saluru
-
నడిరోడ్డుపై విగతజీవిగా పసిపాప
సాలూరు (విజయనగరం): అప్పుడే పుట్టింది.. ఇంకా కళ్లు కూడా తెరవలేదు.. కన్నపేగు వసివాడ లేదు.. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాప నడిరోడ్డుపై విగతజీవిగా కనిపించిన దృశ్యం విజయనగరం జిల్లా సాలూరు పట్టణ వాసులను మంగళవారం కంటతడి పెట్టించింది. సాలూరు ఎస్ఐ ఫకృద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) వెనుక ఉన్న సీసీ రోడ్డు సమీపంలో ఓ చిన్నారి రోడ్డుపై మరణించి ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూశారు. అప్పుడే పుట్టినట్టుగా గుర్తించారు. సీహెచ్సీ వెనుక కవరులో కప్పి పడవేయగా.. ఏదైనా వాహనం ఆ కవరును రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి ఉంటుందని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పాపకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మేమేమి పాపం చేశాం ...నాన్న!
మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఇష్టంగా దగ్గరయ్యారు.. మాకు జన్మనిచ్చారు. చిటికన వేలి అందజేసి లోకమంతా చూపించాల్సిన మీరు.. మాపై లింగత్వ పరీక్ష పెట్టి కక్ష పెంచుకోవడం తగునా ‘నాన్నా’.. మీరు కోరుకుంటేనే కదా భూమి మీదకు వచ్చాం.. ఇప్పుడు ప్రాణమే లేకుండా చేశారంటూ చిన్నారి ఆత్మఘోషిస్తోంది. సాలూరు మండలం జోడుమామిడివలసలో శుక్రవారం రాత్రి నిద్రపోతున్న రెండేళ్ల చిన్నారిని సొంత తండ్రే కర్కశంగా హతమార్చడం మానవ బంధాలను ప్రశ్నిస్తోంది. సాక్షి,విజయనగరం(సాలూరు): ముద్దులొలికే ఇద్దరు ఆడపిల్లలను చూసి మురిసిపోవాల్సిన తండ్రి.. వారిపై కక్ష పెట్టుకున్నాడు. మద్యానికి బానిసై భార్య, పిల్లలను వేధించడం మొదలెట్టాడు. భర్త రాక్షసత్వాన్ని గమనించిన భార్య.. ప్రాణాలు కాపాడుకునేందుకు పిల్లలను తీసుకుని కన్నవారింటికి వెళ్లినా విడిచిపెట్టలేదు. భార్యతో పాటు ఇద్దరి పిల్లలను హతమార్చే ప్రయ త్నం చేశాడు. చివరకు ఒక కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడు. మరో కుమార్తెను తీవ్రంగా గాయపరిచిన విషాదకర ఘటన సాలూరు మండలం తుండ పంచాయతీ జోడుమామిడివలసలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొమరాడ మండలం ఉలిపిరికి చెందిన కొలికి ప్రసాద్ తొలిభార్య మరణించింది. సాలూరు మండలం జోడుమామిడివలసకు చెందిన లక్ష్మిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న సిరి, ప్రణవి కుమార్తెలు ఉన్నారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, మగ పిల్లలకు జన్మనివ్వలేదంటూ భార్య లక్ష్మిని నిత్యం వేధించేవాడు. కుమార్తెలను అసహ్యించుకునేవాడు. భర్త వక్రబుద్ధిని గమనించిన లక్ష్మి పిల్లలను తీసుకుని కన్నవారు నివసిస్తున్న జోడుమామిడివలసకు వారం రోజుల కిందట వచ్చేసింది. అప్పటికీ భర్త వేధింపులు ఆపలేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లక్ష్మివద్దకు వచ్చాడు. గొడవ పడ్డాడు. పూటుగా మద్యం సేవించి రాత్రి పది గంటల సమయంలో దాడికి తెగబడ్డాడు. మంచంపై నిద్రపోతున్న ప్రణవి కాళ్లుచేతులు పట్టుకుని రోడ్డుకు కొట్టేశాడు. అంతే చిన్నారి అక్కడికక్కడే విగతజీవిగా మారింది. పెద్దపాప సిరిని సైతం తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు అడ్డుకోవడంతో కొన ఊపిరితో బయటపడింది. పాపను 108లో ముందుగా సాలూరు సీహెచ్సీకి, అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి అక్క డి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. భర్త దాడికి భయపడి లక్ష్మి దూరంగా పారిపోవడంతో ప్రాణాలతో బయటపడింది. చిన్నారిని బలితీసుకున్న ప్రసాద్ను స్థానికులు తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. ప్రసాద్ మొదటి భార్య మరణంపైనా స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేశారు. -
టీడీపీలో టికెట్ బేరాలు
సాలూరు: ‘పార్టీలో కష్టపడి పనిచేసే తనకు కాకుండా డబ్బులకు అమ్ముడుపోయి ఇంకెవరికో టికెట్టు ఎలా ఇస్తారు..’ అని ప్రశ్నించిన ఓ టీడీపీ మహిళా నేతను చేయి పట్టుకుని ఓ మాజీ ఎమ్మెల్యే గెంటేసిన ఉదంతం బుధవారం విజయనగరం జిల్లా సాలూరులో చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఇస్తామని నియోజకవర్గ నాయకులు హామీ ఇవ్వడంతో సాలూరు మున్సిపాలిటీలో బంగారమ్మపేట 25వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా కొయ్యాన లక్ష్మి నామినేషన్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్.పి.భంజ్దేవ్ ఇంటికి రమ్మని చెప్పడంతో లక్ష్మి, ఆమె భర్త, మద్దతుదారులతో కలిసి వెళ్లారు. ‘నీవు ఎంత ఖర్చు పెడతావ్, టికెట్కు రూ.5 లక్షలు ఇవ్వాలి. నీవు ఎంత ఇవ్వగలవు’ అని భంజ్దేవ్ అడుగగా, రూ.4 లక్షలు ఇవ్వగలమని తెలిపారు. అక్కడే ఉన్న మరో అభ్యర్థి ఇంకా ఎక్కువ ఇస్తాననడంతో సీన్ రివర్స్ అయింది. దీంతో లక్ష్మికి బీ–ఫారం ఇవ్వబోమని చెప్పారు. ‘ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న మమ్మల్ని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి డబ్బులు తీసుకుని టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం’ అని లక్ష్మి, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్ను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన భంజ్దేవ్.. లక్ష్మి చేయి పట్టుకుని బయటకు పొమ్మంటూ నెట్టేశారు. ‘నాకు నచ్చిన వారికే టికెట్ ఇస్తా, చేతనైంది చేసుకో..’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను అక్కడున్నవారు సెల్ఫోన్లో చిత్రీకరించడంతో ఇది స్థానికంగా వైరల్ అయింది. భంజ్దేవ్ టికెట్ అమ్ముకున్నారని లక్ష్మి కంటతడిపెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తానని పేర్కొన్నారు. -
నీటిని నిలిపి.. పొలాలు తడిపి..
కష్టాలు ఆలోచనలకు పదునుపెట్టాయి. ఒక ఆలోచన దిశ చూపింది. సంకల్పం చేతులు కలిపింది. పొలం తడిసింది. జలం జీవం పోసింది. పంట పండింది. గ్రామస్తుల దశ మారింది. కళ్లముందే నీరున్నా పొలానికి అందక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడిన ఆ గ్రామస్తులు ఇప్పుడు రెండు పంటలు పండిస్తున్నారు. నిరంతరం పారే నీటికి చిన్న అడ్డుకట్ట వేసి పొలాలకు మళ్లించారు. నీటి ఎద్దడే లేదు. వంద ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. నీరు లేక పంటలు పండించే అవకాశంలేక అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనం గడిపిన వారు ఇప్పుడు స్వయంగా పంటలు పండించుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ ఘనత సాధించిన విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని గుంటబద్ర గ్రామస్తులు.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. మక్కువ (సాలూరు): గుంటబద్ర గ్రామంలో సుమారు వంద గిరిజన కుటుంబాలున్నాయి. గ్రామం పక్కనే ప్రవహించే అడారు గెడ్డ ఉంది. ఒడిశా రాష్ట్రంలోని కొండలపైనుంచి నిరంతరం వచ్చే నీటితో ఈ గెడ్డ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ పొలాలకు నీరందించే లక్ష్యంతో చేపట్టిన అదనపు ఆనకట్ట పనులు ఆగిపోవడంతో వరుణుడు కరుణిస్తేనే పంట పండేది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని అందరూ చర్చించుకున్నారు. అడారు గెడ్డ నీటిని ఎలా మళ్లించాలా అని ఆలోచించారు. గెడ్డకు అడ్డంగా రాళ్లు వేసి ప్రవాహాన్ని కొంత అయినా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి రాళ్లను సేకరించి అడారు గెడ్డ మధ్యలో గట్టులా వేశారు. అక్కడ ఆగిన నీరు పొలాలకు వెళ్లేలా కాలువ తవ్వారు. రాళ్ల మధ్య నుంచి కిందకు వెళ్లేనీరు పోగా కాలువకు వస్తున్న నీటితో వంద ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఖరీఫ్లో వందెకరాల్లో వరి పండించిన ఈ గ్రామస్తులు రబీ సీజన్లో 70 ఎకరాల్లో మొక్కజొన్న, 30 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. అటవీ అభ్యంతరాలతో ఆగిన అదనపు ఆనకట్ట నిర్మాణం మక్కువ, పార్వతీపురం, సాలూరు మండలాలకు చెందిన 1,876 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మకు్కవ మండలం పనసబద్ర పంచాయతీ మూలవలస గ్రామ సమీపంలో 1955లో సురాపాడు చెక్డ్యాం నిర్మించారు. చెక్డ్యాం శిథిలావస్థకు చేరడం, కాలువల్లో పూడిక పేరుకోవడంతో ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు కూడా నీరందడం లేదు. ఎగువనున్న కొండలపై నుంచి అడారుగెడ్డ ద్వారా వచ్చిననీరు వచ్చినట్లు వృథాగా పోతోంది. అడారుగెడ్డపై నుంచి వచ్చిన నీటిని నిల్వ చేసేందుకు సురాపాడు ప్రాజెక్టు దిగువన 2,500 ఎకరాలకు సాగు నీరందించేలా అదనపు ఆనకట్ట (మినీ రిజర్వాయర్) నిర్మించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలపెట్టారు. ఇందుకోసం రూ.1.2 కోట్లు మంజూరుచేశారు. 2006 మే 28న అప్పటి రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన ఆరు నెలలకే అటవీ శాఖాధికారులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి. దీంతో మక్కువ మండలంలోని మూలవలస, ఆలగురువు, గుంటబద్ర, చెక్కవలస, నగుళ్లు, పార్వతీపురం మండలంలోని అడారు గ్రామాల పొలాలకు నీరందక ఏటా గిరిజన రైతులు నష్టపోతున్నారు. నీటి సమస్య తీరింది గ్రామస్తులమంతా ఏకమై అడారు గెడ్డ మధ్యలో రాళ్లను గట్టులా వేశాం. కొంతమేర కిందకు వెళ్లగా మిగిలిన నీటిని కాలువ ఏర్పాటుచేసి పొలాలకు మళ్లిస్తున్నాం. మా పంటపొలాలకు నీరు సక్రమంగా అందుతోంది. పంటలు పండించుకుంటున్నాం. - సీదరపు లాండు, గుంటబద్ర, రైతు పంటలు పండించుకుంటున్నాం ఏటా వరుణదేవుడిపై ఆధారపడి పంటలు సాగుచేస్తూ నష్టపోతూనే ఉండేవాళ్లం. ఇప్పుడు అడారు గెడ్డ మధ్యలో రాళ్లతో గట్టుకట్టి నీటిని పొలాలకు మళ్లించుకున్నాం. పంటలు పండించుకుంటున్నాం. సంతోషంగా ఉంది. - కర్రా రామారావు, గుంటబద్ర, రైతు కోర్టులో కేసు ఉంది సురాపాడు ప్రాజెక్టు సమీపంలో 2006లో అదనపు ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రదేశం రిజర్వ్ఫారెస్ట్ ఏరియాలో ఉంది. అందువల్ల అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో కేసు వేసింది. ఇంతవరకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. అందువల్ల పనులు అలాగే నిలిచిపోయాయి. -కె.నారాయణరావు, అటవీ అధికారి, మక్కువ -
గిరిజనుల రహదారి కల సాకారం
‘అక్షరం’ అనేక జీవితాలను నిలబెడుతుందని... చరిత్రను ‘కలం’ తిరగరాస్తుందని... మరోసారి రుజువైంది. శతాబ్దాలుగా రహదారులు లేక... అభివృద్ధికి నోచుకోక... కాలం వెళ్లదీస్తున్న గిరిజనుల కష్టాలను, కన్నీళ్లను కళ్లకు కట్టినట్లు చూపించిన ‘అరణ్య రోదన’ కథనం అడవి బిడ్డల కలలను సాకారం చేస్తోంది. చేయీ.. చేయీ కలిపి చందాలు పోగేసి మొదలుపెట్టిన మట్టి రోడ్డు ఇప్పుడు ప్రధాన రహదారిగా రూపుదిద్దుకోనుంది. సాక్షి, విజయనగరం: సాలూరు మండలం కొదమ పంచాయతీ చింతామల గిరిశిఖర గ్రామ ప్రజలు, నూట ఇరవై ఐదు కుటుంబాలు కలిసి, బంగారం, భూమి తాకట్టు పెట్టి, ఆవులు, గేదెలు, మేకలను అమ్మి, అదీ చాలక షావుకారు వద్ద అప్పుచేసి, ఇంటికి రూ.7 వేలు చొప్పున చందాలు వేసుకున్నారు. మరికొంత రుణాలు తీసుకున్నారు. ఆ సొమ్ముతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా బారి జంక్షన్ వరకూ సొంతంగా రహదారి వేసుకున్నారు. దీనిపై సాక్షి ప్రధాన సంచికలో ఆగస్టు 14న కథనం ప్రచురితమైంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం కార్యాలయం జిల్లా అధికారులను వివరాలు కోరింది. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సాక్షి కథనం గురించి ప్రస్తావన గిరిజనులను అభినందించారు. త్వరలోనే వచ్చి కలుస్తానన్నారు. కదిలించిన సాక్షి కథనం ఈ క్రమంలోనే గిరిజనులు అనుభవిస్తున్న కష్టాలపై ‘అరణ్య రోదన’ శీర్షికతో ఆగస్టు 25న సాక్షి జిల్లా సంచికలో మరో కథనం ప్రచురించింది. ఆ కథనం అధికారులను కదిలించింది. స్పందించిన ఐటీడీఎ పీఓ ఆర్.కూర్మనాథ్ గిరిజన పల్లెల్లో ఆ మరునాడే పర్యటించా రు. మరోవైపు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఇటు ఐటీడీఎ పీఓతోనూ, అటు అటవీ శాఖ జిల్లా అధికారి చేతన్తోనూ చర్చించారు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సైతం స్పందించారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధప్రాతిపదికన చర్య లు చేపట్టాల్సిందిగా ఐటీడీఎ పీఓ కూర్మనాథ్ను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులు విడుదల ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఉపాధిహామీ పథకం జిల్లా కోఆర్డినేటర్ అయిన డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేశారు. సాక్షి కథనాన్ని తొలి రిఫరెన్స్గా తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కలెక్టర్ తరఫున ఐటీడీఎ పీఓ కూర్మనాథ్ రూ.1.65 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వులపై మంగళవారం సంతకం చేశారు. చింతామల గ్రామం నుంచి ఒడిశా సరిహద్దు వరకూ రహదారి నిర్మాణానికి బుధవారం శంకుస్తాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పీఓ కూర్మనాథ్ ‘సాక్షి ప్రతినిధి’కి వెల్లడించారు. గిరిజన ప్రాంతాభివృద్ధిపై వైఎస్ ముద్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి హయాంలో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఆయన హఠాన్మరణం, తదితర కారణాలు వల్ల నిర్మాణం పూర్తికాలేదు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మా ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అటవీ శాఖ కూడా అనుమతులు ఇచ్చే విషయంలో సానుకూలంగా ఉంది. దానికి నిదర్శనమే తాజాగా రూ.1.65 కోట్లు మంజూరు కావడం. ఈ రహదారితో పాటు గిరిజన ప్రాంతంలో మిగిలిన రోడ్లు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు. రహదారుల కొరత తీరుస్తాం గిరిజనులు పడుతున్న ఇబ్బందు లను రహదారుల నిర్మాణంతో కొంతైనా తీర్చగలుగుతాం. ఈ విషయంలో ఎలాంటి తాత్సారానికీ తావివ్వకుండా అన్ని అనుమతులు తీసుకుంటున్నాం. మరో రూ.11.62 కోట్లతో పోనంగి రహదారి నిర్మాణానికి కూడా చర్యలు చేపడుతున్నాం. అటవీశాఖ నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్లు కూడా వ స్తున్నాయి. అంతర్గత సీసీ రోడ్లు, చెక్ డ్యామ్ల నిర్మాణాలు కూడా పూర్తి చే స్తాం. ప్రభుత్వం నిధుల మంజూరుకు సిద్ధంగా ఉంది. – ఆర్.కూర్మనాథ్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఎ, పార్వతీపురం -
బొబ్బిలి వాడి.. పందెం కోడి
ఆ కోళ్లు బొబ్బిలి పౌరుషానికి ప్రతిరూపం. బరిలో దిగితే గెలుపు ఖాయం. అందుకే వాటికి మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంది. పందెం రాయుళ్ల నుంచి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. సాలూరు మండలం నెలిపర్తి ఎన్ఆర్ఆర్ అగ్రికల్చర్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పెంచుతున్న పందెం కోళ్లు పౌరుషానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. – సాలూరు రూరల్ నెలిపర్తి ఎన్ఆర్ఆర్ అగ్రికల్చర్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పెంచుతున్న పందెం కోళ్ల పెంపకంలో యాజమాన్యం తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇచ్చే శిక్షణ ప్రత్యేకం. ప్రొటీన్లు సమకూరే ప్రత్యేక ఆహారాన్ని తయారు చేసి కోళ్లకు అందిస్తారు. కాలానికి అనుగుణంగా సమశీతోష్ణస్థితిని ఏర్పాటు చేస్తారు. పందాలకు అవసరమైన ప్రత్యేక శిక్షణను ఇస్తూ బోలెడన్ని మెలకువలు కూడా నేర్పిస్తారు. ప్రత్యేక గూళ్లలో పరుగు నేర్పిస్తారు. నాటు పడవుల్లో ఈత నేర్పుతారు. దీంతో అవి మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. కోళ్లుకు ఈత నేర్పే నాడు పడవ ఎన్నో రంగులు.. జాతులు సాలూరు, బొబ్బిలి, మక్కువ, మెంటాడ పరిసర ప్రాంతాలతో పాటు ఒడిశా సరిహద్దు గ్రామాల్లోని రకరకాల రంగులు, జాతుల కోళ్లను కొనుగోలు చేసి వాటికి ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. ఎన్నోరకాల రంగులు, జాతుల కోళ్లకు ఇక్కడ శిక్షణ ఇచ్చి పందేనికి సిద్ధం చేస్తున్నారు. డేగ, కాకి పూల, పర్ల, కెక్కిరాయి, సీతువ. రసంగి, అబ్రాసు, నెమలి బరుల జాతుల కోళ్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. కోళ్లకు రన్నింగ్ నేర్పే గూడు ఇతర జిల్లాల నుంచి డిమాండ్ కోళ్లను మార్కెట్లో అమ్మేటప్పుడు బొబ్బిలి పులితో పోల్చుతారు. జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఎక్కువగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందెం పోటీల కోసం అధిక సంఖ్యలో వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. ఒక్కొక్క కోడిని రూ.10 నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తుంటారు. శిక్షణ పొందిన కోళ్లు మార్కెట్లో మంచి గిరాకీ ఈ ప్రాంతంలో దొరికే కోళ్లనే కొని వాటికి బలమైన ఆహారం పెట్టి పందేనికి అనుగుణంగా తయారు చేస్తున్నాం. బొబ్బిలి పందెం కోళ్లుగా మార్కెట్లో విక్రయించడం వల్ల మంచి గిరాకీ ఉంది. పొరుగు జిల్లాల నుంచి అధికంగా వచ్చి కొనుగోలు చేసుకుంటారు. ప్రస్తుతం 5 వందల వరకు కోళ్ల పుంజులున్నాయి. – ఎన్.రామారావు, కోళ్ల పెంపకందారు, నెలిపర్తి -
నకిలీల ఆటకట్టు..
సాలూరు: పట్టణ పరిసర ప్రాంతాల్లో నకిలీ మావోయిస్టులు, నకిలీ పోలీసులు హల్చల్ చేస్తున్నారు. వర్తకులను లక్ష్యంగా చేసుకుని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులమని, మావోయిస్టులమని బెదిరించి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా వేల నుంచి లక్షల రుపాయల వరకు ఈ డిమాండ్లు ఉంటున్నాయి. దీంతో ఈ నకిలీలలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాకచక్యంగా దర్యాప్తు నిర్వహిస్తూ నకిలీలను పట్టుకుంటున్నారు. కొద్ది రోజుల కిందటే నకిలీ పోలీసులను పట్టుకున్న విషయం మరువకముందే తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. జరిగిన సంఘటనలు.. ►ఈ ఏడాది జూన్ 11న పాచిపెంట మండలం పారమ్మకొండ వద్ద మక్కువ మండలంనకు చెందిన నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ►ముగ్గురు నకిలీ పోలీసులు సాలూరు మండలంనకు చెందిన ఓ వర్తకుడి నుంచి 27 వేల రుపాయల నగదు కాజేశారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురులో ఇద్దరు నకిలీ పోలీసులను పట్టుకుని ఈ నెల 12న వారిని బొబ్బిలి కోర్టులో ప్రవేశపెట్టగా 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ►పాచిపెంట మండలంలో ముగ్గురు నకిలీ మావోయిస్టులను తాజాగా పాచిపెంట పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక దృష్టి సారించాం.. నకిలీ పోలీసులు, నకిలీ మావోయిస్టుల హల్చల్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో అటువంటి నకిలీలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల సాలూరు పట్టణంలో నకిలీ పోలీసులను పట్టుకోగా... తాజాగా పాచిపెంట మండలంలో నకిలీ మావోయిస్టులను పట్టుకున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు ఎవ్వరు పాల్పడినా చర్యలు తప్పవు. – సింహాద్రినాయుడు, సీఐ, సాలూరు -
‘గిరిజనులతో మైత్రిని కొనసాగిస్తాను’
సాక్షి, విజయనగరం: గిరిజనుల జీవన విధానాన్ని తను వ్యక్తిగతంగా చూశానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వారితో మైత్రిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పాచిపెంట మండలం అమ్మవలస ఆదివాసి గ్రామాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన గిరిజన రైతులతో మాట్లాడారు. వాళ్ల బ్యాంకు ఖాతాలకు ఎంత సొమ్ము జమ అవుతుందో ఆరా తీశారు. ఈ క్రమంలో అమ్మవలస ఆదివాసి గిరిజన రైతులు సాగుచేస్తున్న ఉద్యానవన పంటలను సందర్శించి గిరిజన రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వరి , మొక్కజొన్న, అరటి, పత్తి, మామిడి, జీడిమామిడి తదితర పంటల సాగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవలస ఆదివాసి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యే రాజన్న దొర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. గిరిజనుల జీవన విధానాన్ని వ్యక్తిగతంగా చూసి, వారి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. సమస్యల పరిష్కార చర్యలపై ప్రభుత్వానికి సూచిస్తానని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు వేల సంవత్సరాలు నుంచి వచ్చాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కాపాడటం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం రెండు ప్రధాన అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని నిర్వహించే క్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గిరిజనులు విద్యకు ప్రాధ్యాన్యత ఇచ్చి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏఎన్ఎం వ్యవస్థ, పీహెచ్సీలు ఏర్పాటు చేసినా భౌగోళికపరంగా సమస్యలు ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడం.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గిరిజన యువత ఉపాధి కోసం కొత్త రంగాలను ఎంచుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పోటీ పరిక్షలకు సిద్ధం అవుతూ.. తమను తాము మార్చుకుని ప్రభుత్వం సహకారం పొందాలని వివరించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. పరిష్కారం కోసం ఆ వివరాలను ప్రభుత్వానికి సూచించడం తన బాధ్యత అన్నారు. గిరిజనులతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని.. ఈ మైత్రి బంధాన్ని భవిష్యత్లో కూడా కొనసాగిస్తాని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వాభివృద్ధి ఫలాలు అందుతున్న తీరును పరిశీలించేందుకు గవర్నర్ రావడం శుభసూచకం అన్నారు. ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాల్లో విద్య, వైద్యం అందాల్సి ఉందని గుర్తుచేశారు. పాడేరులో మెడికల్ కళాశాల, సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం రాబోతున్నాయని వెల్లడించారు. గిరిజన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని శ్రీవాణి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోటియా గ్రామాల సమస్యను ఎమ్మెల్యే రాజన్నదొర గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ.. కోటియా గ్రామాల గిరిజనులు సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అభివృద్ధిలో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని గవర్నర్కి విన్నవించినట్టు తెలిపారు. -
ఆ పెట్రోల్ బంక్లో డీజిల్కు బదులు నీరు..!
సాక్షి, సాలూరు: పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టించుకోవాలని వెళ్లిన ప్రయాణికులకు వింత పరిస్థితి ఎదురైంది. డీజిల్కు బదులు వర్షపు నీరు రావడంతో వాహన చోదకులకు ఇక్కట్లు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. పాచిపెంట మండలంలోని శ్యామలగౌరీపురం సమీపంలో జాతీయ రహదారికి పక్కనున్న ఓ బంక్లో డీజిల్కు బదులు వర్షపు నీరు వచ్చింది. శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో ఓ కారు యజమాని బంక్కు వెళ్లి డీజిల్ కొట్టమని సిబ్బందిని కోరాడు. దీంతో సిబ్బంది కారు ట్యాంక్ ఓపెన్ చేసి డీజిల్ కొట్టారు. అయితే ఆ కారు కొంతదూరం వెళ్లాక ఆగిపోయింది. పరిశీలించి చూడగా.. ట్యాంక్లో డీజిల్కు బదులు వర్షపు నీరు ఉండడంతో కారు ఓనర్ అవాక్కయ్యాడు. వెంటనే ఓ ఆటో సహాయంతో కారును బంక్కు తీసుకువచ్చి సిబ్బందిని నిలదీశాడు. అయితే అప్పటికే కొంతమంది వాహనదారులు డీజిల్కు బదులు వర్షపునీరు కొట్టిన విషయం గుర్తించి సిబ్బందితో గొడవపడుతున్నారు. వాహనాలు ఆగిపోవడంతో కొంతమంది మెకానిక్లను సంప్రదించగా.. మరికొంతమంది వాహనాలను ఆయా షోరూమ్లకు తీసుకెళ్లారు. ఇదిలాఉంటే కంపెనీ వారు పదిహేను సంవత్సరాల కిందట పైపులు వేశారని.. అవి పాడవ్వడం వల్ల వర్షపునీరు కలిసిపోయి ఉంటుందని బంకు యజమాని సాధనాల గోపాల్ అన్నారు. ఈ విషయమై కంపెనీ వారికి సమాచారం ఇచ్చామని తెలిపారు. ఆటోకు తాడు కట్టి కారును తీసుకువస్తున్న దృశ్యం కొత్త వాహనం ఆగింది.. పదిహేను రోజుల కిందటే కారు కొన్నాను. అత్యవసరమైన పని మీద ఒడిశా వెళ్తూ బంక్లో ఆయిల్ కొట్టించాను. అయితే డీజిల్కు బదులు వర్షపునీరు రావడంతో వాహనం ఆగిపోయింది. వెంటనే ఆటో సహాయంతో కారును బంక్కు తీసుకువచ్చాను. కారు మరమ్మతులకు అయిన ఖర్చు ఇస్తామని బంకు యజమాని ఒప్పుకున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా ఆగిపోవడంతో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. – యమరాపు ముత్యాలునాయుడు, కవిరిపల్లి, మక్కువ మండలం -
లారీలకు బ్రేక్లు
లారీ పరిశ్రమకు అటు విజయవాడ తరువాతి స్థానం సాలూరుదే. పట్టణంలో అడుగడుగునా లారీలు... వాటిపై ఆధారపడిన ఎన్నో గ్యారేజీలు... మరిన్ని మెకానిక్ షెడ్లు... మనకు దర్శనమిస్తాయి. అంటే ఈ పరిశ్రమ ఎంతోమందికి భుక్తి కలిగిస్తోందన్నమాట. ఇప్పటికే పెరిగిన డీజిల్ధరలు... జీఎస్టీలు... పెరిగిపోతున్న ముడిసరకుల ధరలతో పరిశ్రమ కాస్తా కుంటుపడింది. ఒకప్పుడు దర్జాగా బతికిన యజమానులు కాస్తా నష్టాలతో కష్టాలపాలయ్యారు. అయినా ఇంకా కొందరు దానిపైనే ఆధారపడి కాలం నెట్టుకొస్తున్నారు. తద్వారా కొందరు బడుగులకు జీవన భృతి కలుగుతోంది. కానీ తాజాగా వచ్చిన కొత్త వాహన చట్టం ఆ పరిశ్రమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోంది. భారీ జరిమానాలతో నడపలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు ప్రాంతం లారీలకు ప్రసిద్ధి.. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వందలాది లారీలు సరుకు రవాణా చేస్తుంటాయి. వేలాది మంది ఇక్కడి లారీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మోటారు వెహికల్ చట్టంలోని నిబంధనల పుణ్యమాని నష్టాలు చవిచూస్తున్నారు. దీనికి నిరసనగా గురువారం దేశ వ్యాప్తం గా జరుగుతున్న లారీల బంద్లో పాలు పంచుకుం టున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ తరు వాత లారీలు అధికంగా సాలూరులోనే ఉన్నాయి. ఇక్కడ సుమారు 2500 లారీలుండగా వీటిలో సుమా రు 1500 లారీలు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకే గాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరుకులను నిత్యం రవాణా చేస్తున్నాయి. ఈ లారీలను నడుపుతున్న డ్రైవర్లు, క్లీనర్లు, యజమానులు ఒక్క సాలూరు పట్టణంలోనే సుమా రు 10 వేలకుపైగా ఉన్నారు. దీనిపైనే ఆ కుటుంబా లు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరితో పాటు గ్రీజ్బాయ్లు, మెకానిక్లు తదితర మొత్తం 15 వేలకు పైగా కుటుంబాలు సైతం వీటి ఆధారంగానే జీవిస్తున్నాయి. ఇక్కడి లారీలనే ఇతర రాష్ట్రాల్లో అవసరాలకు కాంట్రాక్టర్లు, వినియోగదారులు తీసుకువెళుతుంటారు. ఈ లారీల ద్వారా బొగ్గు, బాయిల్డ్ రైస్, ఇనుము, మట్టి రవాణా అధికంగా ఉంటుంది. విశాఖపట్నంలోని గన్నవరం పోర్టు నుండి బొగ్గు రవాణా అధికంగా జరుగుతుంది. ఒక లారీ ఒక రోజు ఆగితే సుమారు రూ.6 వేల వరకు నష్టం ఉంటుందని లారీ యజమానులు చెబుతున్నారు. ఒక రోజు లారీ లు బంద్లోకి వెళితే సాలూరు పట్టణంలో అన్ని లారీలకు కలిపి సుమారు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లుతుందంటున్నారు. వేధిస్తున్న కొత్త నిబంధనలు... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మోటారు వెహికల్ చట్టం వల్ల అధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని లారీ యజమానులు ఆందోళన బాట పట్టారు. ఈ లారీలు ఒడిశా, చత్తీస్గఢ్లకు వెళ్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా కొత్త చట్టం ప్రకారం భారీగా జరిమానాలు విధిస్తుండటంతో లారీ యజమానులకు రానూపోనూ కిరాయి డబ్బులు ట్రాఫిక్ జరిమానాలకే సరిపోవడం లేదు. బీమా ప్రీమియం, జీఎస్టీలు వంటివి యజమానులకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయనేది వారి వాదన. మోటారు వాహన చట్టంలో సవరణలు చేసి లారీలపై జరిమానాలు తగ్గించాలని, జీఎస్టీ మినహాయించాలనేది వారి ప్రధాన డిమాండ్. దానికోసం ఆలిండియా మోటారు ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ల అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఫలితంగా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లే లారీలన్నీ సాలూరులోనే నిలిచిపోనున్నాయి. బుధవారమే కొన్ని లారీలు నిలిచిపోయాయి. సాలూరు శివారులో రోడ్డు పక్కన, పట్టణ లారీ అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో భారీగా లారీలు నిలిచాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు పడుతున్నాం. లారీలు నడపడం కష్టం గా మారింది. ట్రాఫిక్ చట్టాల పేరుతో భారీగా జ రిమానాలు వేస్తున్నారు. ఇలా అయితే మరీ నష్టాల్లో కూరుకుపోతాం. ఇంతకుముందు రూ.500 లోపు జరిమానాలు ఉండగా ఇప్పుడు రూ.2500 కు తక్కువ కాకుండా ఫైన్లు వేస్తున్నారు. – అక్కేన అప్పారావు, లారీ యజమాని, సాలూరు లారీ పరిశ్రమకు సడలింపునివ్వాలి.. కేంద్ర ప్రభుత్వం లారీ పరి శ్రమలకు కొన్ని సడలింపులివ్వాలి. లారీ లపై జరిమానాలు విధింపు తగ్గించాలి. జీఎస్టీ మినహాయింపులు ప్రకటించాలి. లేక పోతే అంతంత మాత్రంగా సాగుతున్న ఈ పరిశ్రమ మరింత కునారిల్లక తప్పదు. – కర్రి మహేష్, సాలూరు లారీ ఓనర్ల సంఘం మాజీ జాయింట్ సెక్రటరీ, లారీ యజమాని -
రాజకీయ హత్య..!
సాక్షి, సాలూరు: ప్రశాంతమైన సాలూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరతీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని సమయాల్లోనూ సోదర భావంతో గడిపిన పల్లెల్లో రాజకీయ హత్యలకు పాల్పడడం కలకలం రేగుతోంది. పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త గండిపల్లి తవుడు (49) ఆదివారం రాత్రి హత్యకు గురైనట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో తవుడు వైఎస్సార్ సీపీ తరఫున చురుగ్గా పాల్గొనడం, టీడీపీ ఓటమి పాలవ్వడంతో గ్రామానికి చెంది న టీడీపీ నాయకులే హత్య చేశారని మృతుడి భార్య అచ్చమ్మ, కుమారుడు సామయ్య, కుమార్తె దేవి, గ్రామస్తుడు, స్థానిక వైఎస్సార్ సీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు గండిపల్లి రాము ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల కాపరి అయిన తవుడు ఆదివారం సాయంత్రం ఆవులను కట్టిన తరువాత గ్రామంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. నిమజ్జనం తర్వాత తవుడు ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం స్థానిక శివాలయం సమీపంలో విగత జీవిగా దర్శనమిచ్చాడు. మృతుడి కుడిచేయి విరిగి ఉండడం, మెడ నులిపేయడంతో వాపురావడంతో హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానించారు. పోలి సులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఎస్ఐ గంగరాజు, సీఐ సింహాద్రినాయుడులు ఘటనా స్థలా న్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తామని తెలిపి శవపంచనామాకు సహకరించాలని కోరారు. నిందితులును పట్టుకునేంత వరకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించమని మృతుడి కుటుంబీకులు, స్థానిక నాయకులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు విజ యనగరం నుంచి క్లూస్ టీం, శ్రీకాకుళం నుంచి డాగ్స్క్వాడ్లు తెప్పించారు. ఓఎస్డీ రామ్మోహనరావు, ఏఎస్పీ సుమిత్గర్గ్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసుకు సంబంధించి అనుమానితులను విచారిస్తున్నట్టు సమాచారం. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ .. సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోలబాబ్జి, పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలునాయుడు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు సలాది అప్పలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మధుసూదనరావు, నాయకులు పెద్దిబాబు తదితరులు చేరుకున్నారు. బాధిత కుటుంబీకులను ఓదార్చారు. ఇది రాజకీయ హత్యగా అనుమానం వ్యక్తం చేస్తూ నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు గండిపల్లి రాము డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవాలి... ఈ ఘటనపై ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఫోన్లైన్లో మాట్లాడుతూ ఇది రాజకీయ హత్యగానే అనుమానిస్తున్నామని, ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టాలని ఫోన్లో కలెక్టర్, ఎస్పీలను కోరారు. మృతుడి కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. -
వృద్ధురాలి హత్య..!
సాక్షి, సాలూరు రూరల్: బంగారం కోసం వృద్ధురాలి ని హతమార్చిన సంఘటన ఆదివారం తెల్లవా రుఝామున సాలూరు పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దాసరివీధిలో గెంబలి శకుంతల (68) ఒంటరిగా నివాసముంటోంది. ఈమెకు ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమారుడు విశాఖలో ఆటోడ్రైవర్గా పనిచేస్తుండగా.. మరో కుమారు డు త్రినాథరావు సాలూరులోనే ఓ టైర్ల దుకా ణంలో పనిచేస్తున్నాడు. త్రినాథరావు సాలూరులో వేరేగా ఉంటుండడంతో శకుంతల ఒంటరి గా నివశిస్తోంది. ఇదిలా ఉంటే త్రినాథరావు కుమారుడు తేజవిజయ్ (17) ఆదివారం కావడంతో నాన్నమ్మను చూసేందుకు తెల్లవారు 6 గంటలకు ఇంటికెళ్లి తలుపుకొట్టాడు. నాన్న మ్మ స్పందించకపోవడంతో తలుపు తీసుకుని ఇంటిలోకి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉంది. వెం టనే విజయ్ తండ్రికి ఫోన్ చేయగా.. త్రినాథరావు హుటాహుటిన ఇంటికి చేరుకుని వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ గౌతమీశాలి సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. బంగారం కోసమేనా..? బంగారం కోసమే దుండగులు వృద్ధురాలిని హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఒంటి మీద ఉండాల్సిన 8 తులాల ఆభరణాలు లేకపోవడంతో దోపిడీ, హత్య, తదితర కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. అలాగే సమీపంలో ఉండే సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామన్నారు. వివరాల సేకరణలో క్లూస్టీమ్.. హంతకుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు క్లూస్ టీమ్ సభ్యులతో పాటు జాగిలాన్ని రంగంలోకి దించారు. జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి మెయిన్ రోడ్డు వరకు వెళ్లి ఆగిం ది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో సీఐ సింహాద్రినాయుడు, పట్టణ ఎస్సై శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
రాఖీ కట్టేందుకు వచ్చి...
సాక్షి, పాచిపెంట(సాలూరు): సోదరుడికి రాఖీ కట్టేందుకు అత్తవారింటి నుంచి రాష్ట్రం దాటి వచ్చిన చెల్లెలు అన్న వద్దే అనారోగ్యంతో మృత్యు కౌగిలికి చేరుకుంది. మృతురాలి తోటికోడలు దమయంతి, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రం కల్హండి జిల్లా ముఖీగుండికు చెందిన సిల్ పార్వతి (32) తన అన్న గణేష్కు రాఖీ కట్టేందుకు సాలూరు పట్టణంలోని బోను మహంతివీధికి ఈ నెల 14న వచ్చింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను ఈ నెల 16, 21 తేదీలలో సాలూరు పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పార్వతిని విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి ఈ నెల 24న తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మృతి చెందింది. వైరల్ ఫీవర్, డెంగీతో మరణించిందని దయయంతి, మృతురాలి సోదరుడు గణేష్ తెలిపారు. మృతురాలికి భర్త పవిత్రో, పిల్లలు హుస్సేన్, వైష్ణవి ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు మాట్లాడుతూ, పార్వతి మృతికి సంబంధించి వైద్యుల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటామని చెప్పారు. బిడ్డకు సైతం.. మృతురాలు పార్వతి కుమారుడు హుస్సేన్ (3) సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పార్వతి మృతదేహాన్ని ఆదివారం ఖననం చేసి హుస్సేన్ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు డెంగీ అనుమానిత కేసులు.. ఈ క్రమంలో సాలూరు సీహెచ్సీ నుంచి ఆరు డెంగీ అనుమానిత కేసులను విజయనగరం కేంద్రాస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి దిలీప్కుమార్ అన్నారు. సాలూరు పట్టణానికి చెందిన ఎస్.రమాదేవి, హుస్సేన్, పాచిపెంట, సాలూరు మండలాలకు చెందిన జి.రాధ, బి.శ్యామల, యు.సీతారాం, యు.పైడిరాజులను కేంద్రాస్పత్రికి పంపించామన్నారు. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
గాల్లో విమానం.. పడిపోయిన ఇంధన ట్యాంక్!
చెన్నై: భారత వైమానిక దళానికి చెందిన విమానం గాలిలో ఉండగానే ఇంధన ట్యాంక్ కింద పడిపోయిన ఘటన కలకలం రేపింది. తమిళనాడులోని ఓ పొలంలో జెట్ ఇంధన ట్యాంక్ పడిపోవడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం కోయంబత్తూరులో చోటు చేసుకుంది. సులూరు వైమానిక దళానికి సమీపంలో ఉన్న పొలంలో ఇంధన ట్యాంక్ పడిపోవడం గమనించి వెంటనే అప్రమత్తమైన పైలట్.. దానిని సురక్షితంగా నేలపైకి దింపాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, పేలుళ్లు గానీ సంభవించలేదని వైమానిక దళం అధికారులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. కాగా ఐఏఎఫ్నకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్య పరీక్షను తేజస్ గతేడాది విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనత సాధించింది. -
విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
విజయనగరం : ఖరీఫ్ సీజన్ ప్రారంభవనున్న నేపథ్యంలో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర రైతులకు ఆదివారం విత్తనాలు పంపిణీ చేశారు. సాలూరు మండల ఏవో కార్యాలయం ఆవరణలో విత్తనాల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడారు. సీజన్ ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వం విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. మండలంలోని సుమారు ఏడువేల మంది రైతులకు గాను 60 టన్నుల వరి విత్తనాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ప్రతియేడు మే నెల వచ్చేనాటికి రూ.12,500 రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బండుకొండ అప్పలనాయుడు పూసపాటిరేట, భోగాపురం మండలాల రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వేతనాలు పెంచండి.. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని గోపాలమిత్ర యూనియన్ నాయకులు జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో కలిశారు. తమకు వేతనాలు పెంచాలని వినతిపత్రం సమర్పించారు. -
రీపోలింగ్ నిర్వహించాలి
సాలూరు: సాలూరు మండల పరిధిలోని కొఠియా వివాదాస్పద గ్రామాల గిరిజనులను ఓటేయకుండా అడ్డుకుని తిప్పిపంపిన ఎన్నికల అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు రీపోలింగ్ నిర్వహించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం నేరెళ్లవలస పోలింగ్ కేంద్రంలో తమను ఓటేయనీయకుండా అడ్డుకుని, ఎన్ని కల అధికారులు తిప్పి పంపించారని ఎమ్మెల్యేకు పలువురు గిరిజనులు ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ బీసు ఆధ్వర్యంలో కలిసి తమ వేదన వినిపించారు. స్పందించిన ఎమ్మెల్యే వారితో కలిసి కాలినడకన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి కనకారావుకు విషయాన్ని వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకరిద్దరు ఒడిశాలో ఓటేసినవారు పోలింగ్ కేంద్రాలకు వస్తే, అందర్నీ తిప్పి పంపించడం దారుణమన్నారు. గతంలో జరిగి న ఎన్నికల్లో ఒడిశాలో ఓటేసి, ఇక్కడ ఓటేసేందుకు వచ్చేవారని, అలాగే ఇక్కడ ఓటేసి, అక్కడకు కూడా గిరిజనులు వెళ్లేవారన్నారు. ఓటరు స్లిప్పులు, గుర్తింపు కార్డులతో వెళ్లినా ప్రిసైడింగ్ అధికారులు ఓటేయనీయకుండా అడ్డుకోవడం ఓటరు ప్రాథమిక హక్కును హరించడమేనన్నారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కై కుట్ర చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు. విషయాన్ని రిటర్నింగ్ అధికారి సుబ్బారావుకు తెలిపేందుకు ఫోన్ చేస్తే ఆయన అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా కలెక్టర్కు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వస్తోం దన్నారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు ఫోన్ చేసినా స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరురాష్ట్రాల వివాదం కారణంగా నలి గిపోతున్న అమాయక గిరిజనుల విషయంలో ఇలా వ్యవహరించడం తగదన్నారు. రాజన్నదొర వెంట పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సూరిబా బు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు తదితరులున్నారు. -
విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలి : వైఎస్ విజయమ్మ
-
విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలి : వైఎస్ విజయమ్మ
సాక్షి, విజయనగరం : ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి, దర్మానికి అధర్మానికి, అవకాశవాదానికి.. మాటమీద నిలబడేవారికి మధ్య జరగుతోందని, విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను కోరారు. సాలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘మన అనుబంధం దాదాపు 40 ఏళ్లది. రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత.. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనుకున్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ సంక్షేమా పథకాలు అందాలనుకున్నారు. ఆయన పాలనలో ఒక్క పైసా పన్ను కూడా పెరగలేదు’అని అన్నారు. విజయమ్మ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పాలనలో అక్రమం, దౌర్జన్యం, మోసం మాత్రమే ఉన్నాయి. ఆనాడు వృద్దుల కోసం ఫించను తీసుకొచ్చారు. రైతే రాజు కావాలని, వ్యవసాయం పండగ చేయాలని జలయజ్ఞం తీసుకొచ్చారు. మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్పై పెట్టారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన ప్రాజెక్ట్లే.. ఇంకా పూర్తి చేయలేకపోయారు. డ్వాక్రా మహిళలను ఆదుకున్నారు. ఆరోగ్య శ్రీ, 108 పథకాలు ఎంతో మంది ప్రాణాలు కాపాడాయి. ప్రతీ పేదవాడి పిల్లలు చదువుకోవాలని ఫీరీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఆనాడు కేంద్రప్రభుత్వం గ్యాస్పై రూ.50 పెంచితే.. ప్రభుత్వమే భరించింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఒక్క ప్రాజెక్ట్కూడా పూర్తి కాలేద’ని విమర్శించారు. ‘ఆ ప్రభుత్వాన్ని చూసి అన్నివర్గాల వారు సంతోషంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు లేకపోవడం వల్ల నాకు వచ్చిన నష్టం కంటే.. మీకు కలిగిన నష్టమే ఎక్కువ అని అనిపిస్తూ ఉంటుంది. ఆరోజు.. అసెంబ్లీ సమావేం అయింది. వర్షం ఎక్కువగా ఉంది.. ఈ సమయంలో వెళ్లడం అవసరమా అని అన్నాను. కానీ ఆయన వినలేదు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి అని బయల్దేరారు. ఆయన పోయాక అందరూ మమ్మల్ని వదిలివెళ్లారు.. కానీ మీరు మాత్రం వదల్లేదు. జగన్.. ఓదార్పు చేయడానికి వెళ్తే.. జగన్కే ఓదార్పు ఇచ్చారు.. అది నేను ఎప్పటికీ మరవలేన’ని అన్నారు. ‘ఆయనపై ప్రజలు ఇంత అభిమానం చూపటం కాంగ్రెస్కు నచ్చలేదు. ఆయన చనిపోయాక.. రాజకీయాల్లో రావాలని అనిపించలేదు.. మీరు చూపించే ప్రేమ కోసమే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాను. ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా.. జగన్ కదల్లేదు.. స్థిరంగా ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేశారు. ఎక్కడ ఎవరికీ ఏ కష్టం వచ్చినా.. జగన్ వచ్చేవాడు. నా బిడ్డ మీ అందరికీ అండగా ఉంటాడు.. జగన్ బాబు ఏదైనా అనుకుంటే సాధిస్తాడు.. జగన్ను జైల్లో పెట్టినప్పుడు.. 18 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వచ్చినప్పుడు.. ఆ రోజు మీముందుకు రావల్సిన పరిస్థితి వచ్చింది. నాటి ఎన్నికల్లో 16మంది భారీ మెజార్టీతో గెలిచారు. అవతలివారికి డిపాజిట్లు కూడా రాలేదు. మాకు సమస్య వచ్చినప్పుడు మీరున్నారు.. మీకు కష్టమొస్తే మేమున్నాము.. చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్తో పెట్టుకున్నారు. అప్పుడు చంద్రబాబే.. తల్లి కాంగ్రెస్ పిల్లకాంగ్రెస్ అని అన్నాడు. చంద్రబాబే ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నాడు. జగన్ బీజేపీతో, కేసీఆర్తో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. జగన్ ఎప్పుడూ ఒక్కడే.. సింహం సింగిల్గానే వస్తుంది. జగన్కు పొత్తు ఏదైనా ఉంటే.. అది ఆంధ్ర ప్రజానికంతోనే’ అని అన్నారు. -
సంక్షేమపాలన జగన్తోనే సాధ్యం
సాక్షి, సాలూరు: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, జగనన్న సంక్షేమ పాలన తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కోరా రు. మంగళవారం రాత్రి పట్టణంలోని 8,9 వార్డులపరిధిలోని గాంధీనగర్, మెట్టువీధి, కొంకివీధి, మహంతివీధి, మత్రాసువీధులలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో ఇం టింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న నవరత్నాల పథకాలను వివరించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలలో ఏఒక్కటీ అమలు చేయలేదని, ఇంటికో ఉద్యోగంఇస్తానని నమ్మించి మోసం చేశారన్నా రు. యువత నిరుద్యోగులుగా కాలక్షేపం చేస్తున్నారన్నారు. జగన్ సీఎం కాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని, పిల్లలను బడికి పంపించే తల్లులకు నెలకు రూ.500 నుంచి రూ.2వేల వరకు అందిస్తారన్నారు. మాటతప్పని రాజశేఖరరెడ్డి బిడ్డగా జగన్ కూడా ఇచ్చిన మాటను నిలుపుకుంటారని, అమలుచేయలేని హామీలను ఆయన ఇవ్వరన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రచారానికి వచ్చిన రాజన్నదొరకు మహిళలు హారతులు పట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జరజాపు ఈశ్వరరావు, అర్బన్బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు, పట్టణ నాయకులు కొంకి అప్పారావు, గొర్లె జగం, హరి స్వామినాయుడు, మున్సిపల్ వైస్చైర్మన్ కాకి రం గ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ గిరి రఘు, కౌన్సిలర్ నాగార్జున తదితరులు పాల్గన్నారు. జగన్కి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి పాచిపెంట: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఆపార్టీ రాష్ట్ర బీసీసెల్ నాయకుడు సలాది అప్పలనాయుడు, నాయకుడు ఇజ్జాడ అప్పలనాయుడు ప్రజలను కోరారు. మండలంలోని కొటికిపెంట పంచాయతీ గోగాడవలస, కోడికాళ్లవలస, గరేళ్లవలస గ్రామాల్లో సలాది అప్పలనాయుడు, కొటికిపెంట,మోదుగ, గొట్టూ రు పంచాయతీల్లో ఇజ్జాడ అప్పలనాయుడు వేర్వేరుగా మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. రాష్ట్రాభివృద్ధి జగన్తోనే సాధ్యమని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నవరత్నాలతో నవశకానికి నాంది మెంటాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవశకానికి నాంది పలకనున్నాయని ఆపార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. మండలంలోని గుర్ల గ్రామంలో పార్టీ నాయకులలో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించి..ప్యాన్గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, ప్రచార కన్వీనర్ కనిమెరక త్రినాథ, తిరుపతి, ఎంపీటీసీ చింతకాశీనాయుడు, దాట్ల హనుమంతురాజు, పల్లి అప్పలనాయుడు, పల్లి కన్నమ్మ, సతీష్, పుర్నాన అప్పలనాయుడు, డి.దేముడుబాబు, పుర్నాన రామునాయుడు పాల్గొన్నారు. -
మంత్రుల హామీలు.. నీటిమూటలు
సాక్షి, మెంటాడ: మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని నాలుగున్నరేళ్ల క్రితం టీడీపీ మంత్రులు, నియోజకవర్గానికి చెందిన ఆపార్టీ నాయకులు హామీ ఇచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వపాలనా కాలం పూర్తయినా కళాశాల ఏర్పాటుకు ఒక్క అడుగూ ముందుకు వేసిన పాపాన పోలేదు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 2014 డిసెంబర్8న నిర్వహించిన జోన్–4 గ్రిగ్స్ క్రీడల ప్రారంభోత్సవానికి అతిథిగా హాజ రైన నాటి రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రి కిమిడి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభాస్వాతిరాణికి మెంటాడలో బాలికలకు ప్రత్యేక హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని కోరుతూ మండలవాసులు వినతిపత్రం అందజేశారు. అనంతరం మరోమారు మం డల కేంద్రంలో స్త్రీశక్తి భవనం ప్రారంభోత్సవం, చల్లపేటలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి హాజరైన మృణాళిని, స్వాతిరాణి మాట్లాడుతూ జూనియర్ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయిస్తామని భరోసానిచ్చారు. మృణాళిని ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సం ధ్యారాణి, మెంటాడ మాజీ వైస్ ఎంపీపీ, చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమిటీ చైర్మన్ గెద్ద అన్నవరం, మండల టీడీపీ ప్రచార కన్వీనర్ రెడ్డిరాజగోపాల్ తదితరులు 2017 డిసెంబర్లో అమరావతిలో విద్య, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి 2017–2018 విద్యాసంవత్సరం నుంచి జూనియ కాలేజ్ నిర్వహించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వపాలనా కాలం ముగిసినా కళాశాల ఏర్పాటు కాకపోవడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థులకు తప్పని అవస్థలు మెంటాడలో జూనియ కాలేజ్ ఏర్పాటు చేస్తే, మెంటాడ మండలంతో పాటు పక్కనే ఉన్న విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలానికి చెందిన 9 పంచాయతీలు, పాచిపెంట మండలంలోని పలుగిరిజన గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. అనంతగిరి, పాచిపెంట, మెంటాడ మండలాల నుంచి ఏటా ఇంటర్విద్య కోసం సుమారు 12 వందల మంది విద్యార్థులు గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, విశాఖపట్నం తదితర పట్టణాలకు వెళ్లి చదువుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్థోమత లేక మధ్యలోనే చదువుకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. చదువులు మానుకోవాల్సి వస్తోంది మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోవడంతో ఈప్రాంత పేదవిద్యార్థులు పదోతరగతి తర్వాత చదువుమానుకోవాల్సి వస్తోంది. నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారు. వందలమంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిసి కూడి కళాశాల ఏర్పాటు చేయకపోవడం మంచిది కాదు. వచ్చే ప్రభుత్వమైనా కళాశాల ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. –అగతాన త్రినాథ, మాజీ సర్పంచ్, లోతుగెడ్డ, మెంటాడ మండలం టీడీపీ ప్రభుత్వం విఫలమైంది మెంటాడలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. నాటి, నేటి మంత్రులు మృణాళిని, గంటా శ్రీనివాసరావుతో పాటు ఈ ప్రాంత టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జిల్లా పరిషత్ చైర్పర్స్న్ శోభా స్వాతిరాణి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్.పి.భంజ్దేవ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. గిరిజనుల అభివృద్ధికి వీరు చేసింది శూన్యం. కనీసం విద్యార్థులు చదువుకునేందుకు కళాశాల కూడా ఏర్పాటు చేయలేకపోయారు. –అంజిలి పైడితల్లి, జీసీసీ మాజీ డైరెక్టర్, కొండపర్తి మెంటాడ మండలం -
బాబూ... ఇచ్చిన హామీలు గుర్తున్నాయా...!
గడిచిన ఎన్నికల సమయంలో సాలూరు వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతవాసులకు ఏదేదో చేస్తామని హామీలు గుప్పించారు. ముఖ్యంగా లారీ పరిశ్రమకు పేరొందిన ఈ ప్రాంత లారీ యజమానులు, కార్మికుల సంక్షేమానికి కల్లబొల్లి హామీలన్నీ ఇచ్చేశారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. అదే సమయంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇదే ప్రాంతానికి గురువారం సీఎం హోదాలో చంద్రబాబు వస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలిస్తారా! కొత్తవి ఇస్తారా! ఏమైనా ఇక బాబును నమ్మం బాబూ...అంటున్నారు. సాక్షి, సాలూరు: ప్రతిపక్ష నాయకుడిగా 2014 ఎన్నికల ప్రచారానికి సాలూరు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాలూరు నియోజకవర్గం అభివృద్ధికి, ప్రధానంగా లారీ పరిశ్రమ, యజమానులు, కార్మికుల సంక్షేమానికి ఏవేవో చేసేస్తానని హామీలను గుప్పించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసేశారు. మళ్లీ ఎన్నికలు రావడంతో మాకే ఓట్లేయాలని ఎప్పటిలాగే ప్రచారానికి రోడ్ షో పేరుతో గురువారం సాలూరు పట్టణానికి సీఎం వచ్చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఆయనకు, ఆ పార్టీ నాయకులకు గుర్తున్నాయో... లేదోగానీ నియోజకవర్గం ప్రజలకు మాత్రం మదిలోనే మెదులుతున్నాయి. అప్పట్లో పట్టణంలోని బోసుబొమ్మ జంక్షన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సంక్షోభంలో వున్న లారీ పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. ఆటోలు, జీపులు, లారీల కొనుగోలుకు రాయితీపై రుణాలను మంజూరు చేస్తామన్నారు. లారీ పరిశ్రమకు అనుబంధ పరిశ్రమలను స్థాపించి, కార్మికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఆటోనగర్ను అభివృద్ధి చేస్తామని ఆర్భాటంగా చెప్పారు. మోటారు పరిశ్రమపైనే ఆధారపడ్డ కుటుంబాలు సాలూరులో ఎక్కువుగా వున్నందున పదో తరగతి పాసవ్వకపోయినా డ్రైవింగ్ లైసెన్స్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 40ఏళ్లుగా సాలూరు పట్టణవాసులు కలగంటోన్న బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, దానిగుండానే సాలూరు వస్తానన్నారు. సంధ్యారాణి విజ్ఞప్తి మేరకు అరకు రహదారిని పూర్తి చేస్తామని ప్రకటించారు. వంద పడకల ఆస్పత్రిగా సాలూరు ప్రభుత్వ ఆస్పత్రిని మారుస్తామన్నారు. ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేసారో చంద్రబాబు చెప్పాలన్న డిమాండ్ వ్యక్తమౌతోంది. లారీ పరిశ్రమ అభివృద్ధికి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్న వాదన వినవస్తోంది. అలాగే సాలూరు బైపాస్ రోడ్డుకు రైతులు ఆనందంగా భూములిచ్చినా, ఆపై రెండేళ్లుగా కదలిక లేకుండాపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్ పరిస్థితి కూడా మొండిగోడలు, అరకొర సౌకర్యాలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఏమాత్రం పురోగతి లేకుండా మిగిలి వుంది. వంద పడకల ఆస్పత్రి హామీని మాత్రం ఎన్నికల కోడ్ నేడో, రేపో కూసేస్తుందన్న సమయంలో ప్రకటించారే తప్ప, ప్రజలపై అభిమానంతో కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. మళ్లీ చంద్రబాబు రోడ్షో పేరుతో అదే బోసుబొమ్మ జంక్షన్కు వస్తున్నందున మళ్లీ అవే హామీలు ఇస్తారా?, ఇంకేమైనా కొత్త హామీలు కురిపిస్తారా...! అన్న చర్చ జరుగుతోంది. హామీలు నీటి మూటలయ్యాయి... చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు గానే మారాయి. విజయవాడ తర్వాత లారీ పరిశ్రమకు పెట్టింది పేరైన సాలూరులో లారీ పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారే ఎక్కువుగా వున్నారన్న విషయం తెలుసుకుని ఓట్లు కోసం గాలమేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల ఊసే పూర్తిగా మరిచిపోయారు. పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామన్న హామీని పదవీకాలం ముగుస్తోన్న తరుణంలో జీఓను ఇచ్చారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తునే వున్నారు. మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెబితే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. – జరజాపు సూరిబాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు... ముఖ్యమంత్రి అయితే ఎంతో మేలు చేసేస్తానని నమ్మించి గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. కానీ ఏమీ చేయలేదు. సాలూరు ప్రాంతవాసులను వంచించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు దండుకోవడానికి వస్తున్నారు?. సాలూరు నియోజకవర్గం వాసులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయి. హామీలను నెరవేర్చకుండా మళ్లీ ప్రజల ముందుకు రావడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు. – పువ్వల నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం నియోజకవర్గ కన్వీనర్ -
సాహో..సాలూరు
ఒడిశాకు ఆనుకున్ని ఉన్న సాలూరు నియోజకవర్గానికి ఎంతో విశిష్టత ఉంది. రాష్ట్రంలో అతి పెద్ద లారీ పరిశ్రమ విజయవాడలో ఉండగా సాలూరు రెండో స్థానంలో ఉంది. సాలూరులో ఎక్కువ మంది గిరిజనులే ఉన్నా రాజకీయంగా చైతన్యవంతులనే చెప్పాలి. నమ్మితే అందలం ఎక్కించడం.. అపనమ్మకం కుదిరితే దించేయడం ఇక్కడ సర్వసాధారణం. పీడిక రాజన్నదొర, భంజ్దేవ్లు చెరో మూడుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా వీరిద్దరే బరిలో ఉండగా.. సాలూరు వాసులు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు నియోజకవర్గంలో రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. గిరిజనులకు కేటాయించిన ఈ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ, టీడీపీ నుంచి సీనియర్ నాయకులే ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరూ ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే కావడం ఒక చిత్రమైతే.. అవినీతి, నిజాయితీలకు చెరొకరూ బ్రాండ్ అంబాసిడర్లు కావడం మరో విశేషం. అభ్యర్థుల బలాబలాలతో పాటు, ఆయా పార్టీలకు ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా వారి గెలుపోటములను ప్రభావితం చేయనుంది. అవినీతి..వివాదాలు: అసలు సిసలు గిరిజనుడైన రాజన్నదొర సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసినా ఎలాంటి అవినీతి మరక అంటించుకోలేదు. నీజాయితీపరుడిగా.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. భంజ్దేవ్ అసలైన గిరిజనుడు కాదన్న వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవలే ప్రభుత్వం తమది కావడంతో తాను ఎస్టీ అంటూ జీఓ తెచ్చుకున్నారు భంజ్దేవ్. అయితే దానిని సవాల్ చేస్తూ రాజన్నదొర హైకోర్టుకు వెళ్లడంతో భంజ్దేవ్ కులవివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తాను కొండరాజు కులానికి చెందినవాడినంటూ భంజ్దేవ్ వాదిస్తుండగా, అసలు భారత రాజ్యాంగంలో కొండరాజు పేరుతో ఎస్టీ జాబితాలో కులం లేదని రాజన్నదొర చెబుతున్నారు. చేపలచెరువులు, ప్రభుత్వ, గ్రామదేవత భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు భంజ్దేవ్పై ఉన్నాయి. వాటిపై నెలకొన్న వివాదాలు కూడా ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సాలూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. రాజన్నదొర కోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా పదవిని చేపట్టిన నాటి నుంచి టీడీపీ కోటకు బీటలువారాయి. తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో గడ్డుపరిస్థితి వచ్చేలా చేసింది రాజన్న దొర పనితీరు. ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడంలో రాజన్నదొర విజయం సాధిస్తున్నారు. ఈసారి రాజన్నదొర జగన్కు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూనే.. భంజ్దేవ్ అవినీతి, కులవివాదాన్ని తనకు అనుకూల అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. భంజ్దేవ్ మాత్రం తనకు ఇవే చివరి ఎన్నికలంటూ ఎలాగైనా గెలవాలని నానా పాట్లు పడుతున్నారు. హ్యాట్రిక్ వీరులు.. భంజ్దేవ్ 1994లో తొలిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమచంద్ర సన్యాసిరాజుపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మళ్లీ 1999లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిపై పోటీచేసి గెలుపొందారు. ఆపై 2004 ఎన్నికల్లో పీడిక రాజన్నదొర (కాంగ్రెస్)పై గెలిచి హ్యట్రిక్ సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో భంజ్దేవ్ గిరిజనుడు కాదంటూ ఎన్నికల పిటీషన్ను హైకోర్టులో రాజన్నదొర వేయడం, గెలవడంతో 2006లో రాజన్నదొర గెలిచినట్టుగా కోర్టు ప్రకటించింది. దీంతో తొలిసారి రాజన్నదొర ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మళ్లీ 2009లో జరిగిన ఎన్నికల్లో రాజన్నదొర (కాంగ్రెస్) టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సంధ్యారాణిపై గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ భంజ్దేవ్ టీడీపీ అభ్యర్థిగా రాజన్నదొరతో తలపడ్డారు. భంజ్దేవ్ ఓటమిపాలవడంతో రాజన్నదొర కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. నాలుగోసారి వీరిద్దరూ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్యే పోటీ.. సాలూరు అసెంబ్లీ నియోజకవకర్గంలో ఇద్దరు హ్యాట్రిక్ వీరులు తలపడుతుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పోటీ చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆర్పీ భంజ్దేవ్ తలపడుతున్నారు. వీరిద్దరూ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేలుగా పదవులను చేపట్టినవారే. ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి తలపడుతున్నా, వీరిద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం(ఎస్టీ) మొత్తం ఓటర్లు 1,82,778 మహిళా ఓటర్లు 98,319 పురుష ఓటర్లు 89,456 ఇతరులు 3 మొత్తం జనాభా 2,50,983 -
సాలూరు టీడీపీలో మూడుముక్కలాట!
సాలూరులో తెలుగుదేశం పార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. అక్కడ మొదటినుంచీ భంజ్దేవ్, సంధ్యారాణి మధ్య అంతర్గత పోరునడుస్తుండగా... కొత్తగా స్వాతిరాణి అక్కడ పాగా వేయడానికి తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారాలు అక్కడి కేడర్ను అయోమయంలో పడేస్తున్నాయి. ప్రతిసారీ దేవ్, సంధ్యల నడుమ ఆధిపత్యపోరు బహిర్గమవుతూనే ఉంది. అధిష్టానం ఆదేశించినా... వారి మధ్య అగాధం తగ్గలేదు సరికదా పెరుగుతూ వస్తోంది. ఇదే అదనుగా అక్కడ స్వాతిరాణి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఆమె భర్త పావులు కదుపుతున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: అధికారపార్టీని అంతర్గత విభేదాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆధిపత్య పోరుతో ఆ పార్టీ మూడు ముక్కలైంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్.పి.భంజ్దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణిల మధ్య రాజకీయంగా మూడుముక్కలాట మొదలైంది. వీరెంత తన్నుకున్నా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు పెరుగుతున్న జనాదరణ మాత్రం తగ్గించలేకపోతున్నారన్నది స్పష్టమవుతోంది. 1951లో ఏర్పడ్డ సాలూరు నియోజకవర్గాన్ని షెడ్యూల్డు తెగలకు(ఎస్టి) రిజర్వ్ చేశారు. 2007–08లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తర్వాత సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసి 2014 ఎన్నికల్లో మరలా వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన పీడిక రాజన్నదొర ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వరుస పరాజయాలను చవిచూస్తున్న టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్(ఆర్పి) భంజ్దేవ్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మాత్రమే పెద్దదిక్కుగా మిగిలారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సంధ్యారాణికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అదే అదనుగా నియోజకవర్గ టీడీపీలో పట్టు సాధించే ప్రయత్నాలను సంధ్యారాణి ముమ్మరం చేశారు. ఈ విషయాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్నుటీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించారు. బహిర్గతమైన విభేదాలు ఈ పరిణామం తర్వాత సంధ్యారాణి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. చివరికి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కూడా తాను వేరుకుంపటి అనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. భంజ్దేవ్ ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేయగా... కొంతకాలం నియోజకవర్గ విషయాల్లో ప్రమేయం తగ్గించుకోమని అధిష్టానం పెద్దలు ఆమెను కట్టడిచేయడానికి చెప్పారు. కానీ పైకి తగ్గినట్లు కనిపిస్తూనే తెరవెనుక తన వర్గాన్ని ఆమె వృద్ధి చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సందర్భంలో దేవ్ తనకే టిక్కెట్టు ఖరారైందంటూ ద్వితీయశ్రేణి నాయకులను నమ్మించి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతని ప్రయత్నాలకు పెద్దగా మద్ధతు లభించడం లేదు. మూడో ప్రత్యామ్నాయం భంజ్దేవ్ ఒడిశాకు చెందిన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారని రికార్డులు చెబుతున్నాయి. ఆయన పూర్వీకులు సాలూరు వచ్చి స్థిరపడటంతో అతను ఎస్టీగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఎస్టీ కాదని రాజన్నదొర నిరూపించడంతో ఒకసారి ఎమ్మెల్యే పదవిని కూడా పోగొట్టుకున్నారు. మరోవైపు చేపల చెరువుల కోసం ప్రభుత్వ, దేవుడి భూముల ఆక్రమణ, పలు అవినీతి ఆరోపణలతో భంజ్దేవ్ ప్రతిష్ట మసకబారింది. అలాగే సంధ్యారాణికి నియోజకవర్గంలో అనుకూలమైన వర్గం ఉన్నప్పటికీ అది ఎన్నికల్లో విజయాన్నందించేంత పెద్దది కాదు. ఆమె సామర్ధ్యం కూగా ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని చేకూర్చేంత గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో సాలూరు టీడీపీకి మూడో ప్రత్యామ్నాయంగా మారవచ్చని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి రంగంలోకి దిగారు. పార్టీ టిక్కెట్టుకు యత్నాలు స్వాతిరాణి భర్త గణేష్కు సాలూరు సొంత నియోజకవర్గం కావడంతో తమ సామాజిక వర్గం, బంధుగణం ఓట్లతో గట్టెక్కేయొచ్చని భావించి పండుగలకు, పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళాలు గుప్పిస్తూ నియోజకవర్గ పార్టీలో ఎదగాలని చూస్తున్నారు.ఇవన్నీ సీటు కోసం చేస్తున్న గిమ్మిక్కులైనప్పటికీ భారీ ప్లెక్సీల ద్వారా లేని బలాన్ని ఉన్నట్లుగా అధిష్టానం పెద్దలకు చూపించుకోవడానికి స్వాతిరాణి వర్గం చేస్తున్న ప్రయత్నాలు భంజ్దేవ్కు నష్టం చేకూర్చేవిగానే ఉన్నాయి. అంతేగాదు చినబాబు మద్దతు కూడా స్వాతిరాణికే ఉందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి జెడ్పీ చైర్పర్సన్గా చిన్నవయసులోనే పదవిలోకి వచ్చిన ఆమెకు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఢీకొట్టేంత సామర్థ్యం లేదు. అధికారుల బదిలీలు, డెప్యుటేషన్ల విషయంలో కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఆమెపైనా ఉన్నాయి. అయినా ఆమె భర్త గణేష్ వెనకుండి ఆమెను నడిపిస్తూ, తన సామాజిక వర్గం, ఆర్థిక వనరులను ప్రధానంగా నమ్ముకుని ఈసారి పార్టీ టిక్కెట్టు సాధించాలనుకుంటున్నారు. జనం మదిలే ఇప్పటికే ఓ ముద్ర సాలూరు నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే పదవి చేపట్టినా ఎలాంటి అవినీతి మరక తనపై పడకుండా ప్రజాబలమున్న నాయకుడిగా ఎదిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొరను ఢీ కొట్టే సామర్ధ్యం స్వాతిరాణికే కాదు ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికీ పూర్తి స్థాయిలో లేదన్నది సుస్పష్టం. అయినప్పటికీ వీరిలో ఎవరో ఒకరికి టీడీపీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వాలనుకుంటే ఆ ఒక్కరూ ఎవరనే గందరగోళం టీడీపీ వర్గీయుల్లో నెలకొంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అవ్వడంతోనే టిక్కెట్టు ఖరారైపోయిందనుకుంటున్న భంజ్దేవ్కు మాత్రం ఇద్దరు రాణుల కారణంగా చివరికి అతని సీటుకే ఎసరొస్తుందేమోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
జనసందోహంగా వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసకల్పయాత్ర సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. హత్యయత్నం నుంచి తృటిలో బయటపడిన వైఎస్ జగన్ను చూడాలని ఆడపడుచులు, వృద్దులు, పిల్లలు పెద్ద ఎత్తున కదలివస్తున్నారు. దీంతో పాదయాత్ర జనసందోహంగా మారింది. జగన్తో నడిచి తన కష్టలను ఆయనతో పంచుకుంటున్నారు. ఆయనకు దేవుడి దీవెనలు ఉండాలని, ఎన్ని అవరోధాలు వచ్చిన తాము అండగా ఉన్నామనే భరోసాను జగన్కు ఇస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం తరువాత సాలూరు నియోజకర్గంలో పాదయాత్ర ముగించుకుని పార్వతీపురం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. పింఛన్లు రావడం లేదు.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని కొయ్యనపేటకు చెందిన మహిళ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తిరిగినా అధికారుల్లో స్పందన ఏమాత్రం లేదని తెలిపారు. తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం కూడా లేకపోవడంతో గ్రామంలోని పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నారని కొయ్యనపేటకు చెందిన గ్రామస్తులు జగన్కు వివరించారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ను మక్కువ మండలం తూరుమామిడి గ్రామస్తులు కలిశారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో ఉన్న తమ గ్రామానికి ఏళ్ల తరబడి అడిగినా కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేక పోయారని గ్రామస్థులు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని మక్కువ ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్ధినులు జగన్కు వినతి పత్రం సమర్పించారు. -
296వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు ప్రారంభమైంది. సాలూరు నియోజకవర్గం కొయ్యనపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కంచేడువలస క్రాస్, వెంకటభైరిపురం, బగ్గందొర వలస గెడలుప్పి జంక్షన్ మీదుగా తామరఖండి వరకు నేడు సాగనుంది. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 3,218.3 కి.మీ నడిచారు. -
వైఎస్ జగన్ పాదయాత్ర పున:ప్రారంభం
సంకల్పమే ఆయన ఊపిరి... ప్రజల మధ్య ఉండాలని, వారి బాగోగులు తెలుసుకోవాలి...రాజన్న రాజ్యం తీసుకొచ్చి.... ప్రజాసమస్యలన్నీ పరిష్కరించాలి... ఇదే ఆయన ధ్యేయం, ఆయన లక్ష్యం... ఈ లక్ష్యసాధనలో ఎదురవుతున్న అవరోధాలను దాటుకుంటూ, కుట్ర రాజకీయాలను ఛేదిస్తూ... సంకల్పసూరీడై ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. తనపై హత్యాయత్నం జరిగినా అదరక, బెదరక... మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి.. పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మృత్యుంజయుడై తమ వద్దకు వస్తున్న రాజన్న బిడ్డను ప్రజలు ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు. ఆయన్ను కలవాలని... ఎలా ఉన్నారో ఒక్కసారి కళ్లారా చూడాలని తరలి వస్తున్నారు. సాక్షి, విజయనగరం : అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్ట్లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జననేత పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. 17 రోజుల విశ్రాంతి అనంతరం వైఎస్ జగన్ తన 295వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం, పాయకపాడులో పున: ప్రారంభించారు. వజ్రసంకల్పమే ఊపిరిగా ముందుకుసాగుతున్న జననేత వైఎస్ జగన్ను కలిసేందుకు పాయకపాడుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జననేతకు తమ సమస్యలు విన్నవించేందుకు, తమ కష్టాలు చెప్పేందుకు మహిళలు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా ప్రజలను పలుకరిస్తూ.. జనంతో మమేకమవుతూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. పాయకపాడు నుంచి మేలపువలస, మక్కువ క్రాస్ రోడ్డు, ములక్కాయవలస మీదుగా కాశీపట్నం క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పాపయ్యవలస మీదుగా కొయ్యనపేట వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. 11 జిల్లాలో పాదయాత్ర పూర్తి.. వైఎస్ జగన్ ఇప్పటి వరకు వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. అనంతరం విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసి సాలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ జిల్లాలో ఇంకా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక చివరి జిల్లాగా శ్రీకాకుళంలో ప్రవేశిస్తారు. ఏడాదిగా మొత్తం మీద ఇప్పటి వరకు జగన్ 3,211.5 కిలోమీటర్ల దూరం నడిచారు. -
294వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, సాలూరు (విజయనగరం) : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 294వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం మక్కువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పేకపాడు వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లోని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, విజయనగరం : టీడీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లా సాలూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ సంధ్యారాణి, నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్ బంజ్దేవ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సాలూరులో టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తనను పిలవలేదని సంధ్యారాణి అలకబూనారు. బంజ్దేవ్ కావాలనే తన వర్గం వారిని పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. కాగా సంద్యారాణిని బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ రంగంలోకి దిగారు. బంజ్దేవ్తో పాటు సంధ్యారాణి ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సంధ్యారాణి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టడం గమనార్హం. -
293వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, సాలూరు (విజయనగరం జిల్లా) : రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 293వ రోజు పాదయాత్ర బుధవారం ఉదయం సన్యాసిరాజుపేట శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బాగువలస మీదుగా నక్కడవలస క్రాస్, తడిలోవ, మక్కువ మండలంలోని గునికొండవలస మీదుగా చప్ప బుచ్చమ్మపేట వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని గ్రామాల్లోని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. పాదయాత్రలో మరో మైలురాయి... ప్రజా నాయకుడిగా ప్రజల పక్షాన నిలిచేందుకు, కష్టనష్టాల్లో వారికి తోడుగా నిలుస్తానని భరోసా నింపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో ఘనత సొంతం చేసుకుంది. బుధవారం ఉదయం సన్యాసిరాజుపేట శివారు నుంచి మొదలైన వైఎస్ జగన్ పాదయాత్ర బాగువలస వద్ద 3,200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన బాగువలసలో ఒక మొక్కను నాటి అభిమానులు, కార్యకర్తలతోడుగా ముందుకు కదిలారు. వాల్మీకి జయంతి సందర్భంగా సన్యాసిరాజు పేటలో నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి -
పబ్లిసిటీ చేయడంలో చంద్రబాబు దిట్ట
-
ముగిసిన 291వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర
-
చంద్రబాబు దళారీగా తయారయ్యాడు
-
సాలూరు విజయనగరం జిల్లా ప్రజా సంకల్పయాత్ర
-
వార్డు కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం
సాలూరు: పట్టణంలోని ఏడో వార్డు కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాంధీనగర్లోని ఆయన ఇంటిలో చీమలమందు తాగి బుధవారం బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. కౌన్సిలర్ భార్య తరంగణి తెలిపిన వివరాల ప్రకారం... కౌన్సిలర్ తుపాకుల రవికుమార్ ఉదయం టిఫిన్ చేసి టీవీ చూస్తున్న సమయంలో ఆమె వంట గదిలో ఉంది. వచ్చి చూసేసరికి రవికుమార్ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గట్టిగా కేకలు వేస్తూ సమీపంలో ఉన్నవారిని పిలిచింది. వారి సహకారంతో రవికుమార్ను పట్టణ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అయితే ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన రవికుమార్ వద్ద సూసైడ్ నోట్ లభించింది. గాంధీనగర్కు చెందిన బంగారు సింహాద్రి కుటుంబ సభ్యుడికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి విశాఖలో ఉంటున్న టి. రమేష్, కె. సత్తిబాబు అతడి నుంచి 11 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ వ్యవహారానికి రవికుమార్ మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే టి. రమేష్, కె. సత్తిబాబులు ఉద్యోగం ఇప్పించడంలో విఫలం కావడంతో సింహాద్రి కుటుంబ సభ్యులు డబ్బుల కోసం రవికుమార్పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సింహాద్రి భార్య రాములమ్మ, అల్లుడు ధనాల వినయ్, కుమార్తె హైమావతి డబ్బులు ఇవ్వకపోతే నిన్ను, నీ పిల్లలను చంపేయమంటావా అంటూ బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన రవికుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
54 కిలోల కేక్ను కట్ చేసిన రాజన్నదొర
సాలూరు: ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర పుట్టిన రోజును కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియం ప్రాంగణంలోని వేదికపై అభిమానులు ఏర్పాటు చేసిన 54 కిలోల కేక్ను ఎమ్మెల్యే కట్ చేశారు. అభిమానులు, కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. పార్టీ రాష్ట్రనాయకుడు జరజాపు ఈశ్వరరావు పర్యవేక్షణలో, పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో సాగిన వేడుకల్లో సాలూరు పట్టణంతోపాటు సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ, రామభద్రపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రాజన్నదొరకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, పార్వతీపురం నియోజకవర్గం నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్, సాలూరు మండలం, పాచిపెంట, మెంటాడ మండలాల పార్టీ అధ్యక్షులు సువ్వాడ రమణ, గొట్టాపు ముత్యాలునాయుడు, రెడ్డి సన్యాసినాయుడు, సాలూరు జెడ్పీటీసీ, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, పాచిపెంట మండల జెడ్పీటీసీ సలాది అనురాధ, మెంటాడ మండల ఎంపీపీ సింహాచలమమ్మ, రాష్ట్ర ఎస్టీ విభాగం నాయకుడు అప్పారావు, పార్టీ రాష్ట్ర నాయకులు ముగడ గంగమ్మ, సలాది అప్పలనాయుడు, జిల్లానాయకులు బాబ్జి, జైహింద్కుమార్, శ్రీను, త్రినాథ, డీసీసీబీ సభ్యుడు సురేష్, జిల్లా ట్రేడ్యూనియన్ అధ్యక్షుడు బుల్లెట్రాజు, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ గిరి రఘు, జగం, రవి, మక్కువ మం డల నాయకుడు తిరుపతినాయుడు, వర్క్చార్జ్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డీజీ ప్రసాద్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మున్సిపల్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. సాలూరు సాహితీమిత్రబృందం అధ్యక్ష, కార్యదర్శులు జేబీ తిరుమలాచార్యులు, కిలపర్తి దాలినాయుడు వ్యాఖ్యానంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వేడుకలు సందడిగా సాగాయి. -
ప్రత్యేక హోదాతోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
సాలూరు: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందాయంటే అందుకు కారణం ప్రత్యేక హోదాయేనని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. బుధవారం ఆయన సిక్కిం రాష్ట్రం నుంచి విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. అంచనాల కమిటీ సభ్యులుగా కమిటీ చైర్మన్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆద్వర్యంలో స్టడీ టూర్ నిమిత్తం పశ్చిమబెంగాల్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. ఈ టూర్ ద్వారా ఆయా రాష్ట్రాలు అభివృద్ధి నిధుల కేటాయింపు, ఖర్చు చేస్తోన్న తీరుతెన్నులను పరిశీలిస్తున్నామన్నారు. ఈశాన్య రాష్ట్రాలు కేవలం ప్రత్యేక హోదా రాష్ట్రాలు కావడంతోనే అభివృద్ధి సాధ్యమౌతోందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదాతో ఏం ఒరుగుతుందని ప్రశ్నించారని, ఆయన ఆయా రాష్ట్రాలను చూస్తే ఏం ఒరుగుతుందో తెలుస్తుందన్నారు. కొండప్రాంతమైనా ఎంతగానో అభివృద్ధి చెందాయని తెలిపారు. పశ్చిమబెంగాల్లో గిరిజనుల అభివృద్దికి హిల్ కౌన్సిల్ ఏర్పాటుతో అక్కడి గిరిజనులు అభివృద్ధి చెందుతున్నారని, ఆ తరహాలో మన రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఈ తరహాలోనే సాలూరు ఏజెన్సీ ప్రాంతలోనున్న కొఠియా గ్రామాల అభివృద్ధికి నిధులు సమకూరాయన్నారు. దాదాపు 180కోట్ల రూపాయలను ఒడిశా ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రంలో సాగవుతున్న టీ, కాఫీ తోటలలో 95శాతం విదేశాలకు ఎగుమతులవుతున్నాయని చెప్పారు. తమ టూర్ ద్వారా ఆయా రాష్ట్రాలు అభివృద్ధికి దోహదపడిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ ద్వారా నివేదించనున్నామని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చుట్టూ టీడీపీ నేతలు
సాలూరు (విజయనగరం) : తనను టీడీపీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఆదివారం తన స్వగృహంలో పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇదివరకు కొంత మంది ఎమ్మెల్యేలను కొన్న టీడీపీ నాయకులు తనను కూడా కొనుగోలు చేయాలని నెలరోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు. గత రాత్రి కూడా తనను సంప్రదించారని చెప్పారు. నేను చెప్పింది అవాస్తవమని టీడీపీ నాయకులు ఖండిస్తే బోసుబొమ్మ జంక్షన్లో బహిరంగంగా విషయాలన్నింటినీ వెల్లడిస్తానని స్పష్టం చేశారు. టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేముందని ఎమ్మెల్సీ సంధ్యారాణి వ్యాఖ్యానించడాన్ని రాజన్నదొర తప్పుబట్టారు. భారత రాజ్యాంగంపై అవగాహన లేకుండా, ప్రజాప్రాతినిథ్య చట్టం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
సెల్ఫోన్ షాపులో చోరీ
సాలూరు: పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్ఫోన్ షాపులో శనివారం రాత్రి చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శివ సెల్ పాయింట్ వెనుకభాగంలో పైకప్పును పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే ఫోన్లు దొంగిలించకుపోయారు. పట్టణ పోలీసులకు ఆదివారం ఉదయం ఫిర్యాదు అందడంతో ఎస్సై ఫకృద్దీన్, సీఐ ఇలియాజ్ మహ్మద్ పరిశీలించారు. దొంగలను కనిపెట్టేందుకు విజయనగరం నుంచి క్లూస్ టీమ్ను రప్పించి, వేలిముద్రలు సేకరించారు. ఇదే షాపులో మూడుసార్లు చోరీ ఇదిలా ఉడగా గడిచిన కొద్ది సంవత్సరాలలో ఇదే షాపులో మూడుసార్లు దొంగతనం జరగడం గమనార్హం. షాపు వెనుకభాగం నిర్మానుష్యంగా ఉండడంతో దొంగలు చెలరేగిపోతున్నారు. -
వ్యభిచారం చేయకపోతే చంపేస్తానంటున్నాడు
సాక్షి, సాలూరు : ‘అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే నా పాలిట శాపమయ్యాడు. అతని జల్సాల కోసం నన్ను వ్యభిచారం చేయమంటున్నాడు. కాదంటే కొడుతున్నాడు. చంపేందుకు కూడా ప్రయత్నించాడు. ఇద్దరు ఆడపిల్లలతో వేరుగా వుంటున్నా..., తాగివస్తూ వేధిస్తున్నాడు. అతని వల్ల నాకు.. నా బిడ్డలకు ప్రాణహాని వుంది. న్యాయం చేయండి’ అని పట్టణంలోని నాయుడువీధికి చెందిన మహిళ శనివారం పట్టణ పోలీసులకు పిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరుల వద్ద తన వేదన వివరించింది. విశాఖపట్నానికి చెందిన తనకు 17ఏళ్ల క్రితం సాలూరుకు చెందిన లారీడ్రైవర్ మేకల రమణబాబు(లక్ష్మణ)తో వివాహమైందని, రెండేళ్ల వరకు బాగానే కాపురం చేసినా, ఆ తర్వాత నుంచి వేధింపులు మొదలయ్యాయని తెలిపింది. పనికి వెళ్లడం మాని, తాగుతూ జల్సాలు చేసేవాడని, కుటుంబం సుఖంగా వుండాలంటే లారీ యజమానితో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేశాడన్నారు. గత్యంతరంలేక ఆ పనికి ఒప్పుకున్నానని, దాన్ని సాకుగా చూపుతూ ఏకంగా భిచారమే చేయమంటున్నాడని వాపోయింది. పలుమార్లు హత్యాయత్నం కూడా చేశాడని, ఆ బాధలు తట్టుకోలేక రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డానని తెలిపింది. రెండేళ్ల క్రితం తన బిడ్డలతో కలసి ఇల్లు వదిలి బయటకు వచ్చేసానని, అయినా వేధింపులు కొనసాగాయని చెప్పింది. శుక్రవారం అర్ధరాత్రి ఇంటికివచ్చి, పెద్దగొడవ చేసాడని, తనను చంపేస్తానని, పిల్లలను వ్యభిచార గృహానికి అమ్మేస్తానని బెదించాడని వాపోయింది. ఆదుకున్న స్ఫూర్తి మహిళా మండలి : తన కష్టాలను రెండురోజుల క్రితం స్థానిక స్ఫూర్తి మహిళా మండలి దృష్టికి తీసుకువెళ్లానని, ఆ విషయం తెలియడంతో వేధింపులు ఎక్కువయ్యాయని బాధితురాలు వాపోయింది. శుక్రవారం అర్ధరాత్రి గొడవ అనంతరం మహిళా మండలి అధ్యక్షురాలు బి.రాధ తనతో పాటు పిల్లలకు తన ఇంట్లో ఆశ్రయం కల్సించినట్టు తెలిపింది. పలుమార్లు పట్టణ పోలీసులకు తన కష్టాన్ని వివరించానని, పెద్దల వద్ద పరిష్కరించుకోవాలని చెప్పి పంపించేశారని బాధితురాలు తెలిపింది. సమస్య పరిష్కారానికి వచ్చిన పెద్దలు తమ పక్కలోకొస్తేనే న్యాయం జరిగేలా చూస్తామంటున్నారని కన్నీరుమున్నీరైంది. చివరి ప్రయత్నంగా స్ఫూర్తి మహిళా మండలిని ఆశ్రయించానని, న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయింది. -
హ్యాపీ జర్నీ
ప్రభాత భానుని లేలేత కిరణాలు ప్రసరించే వేళ... పచ్చని ప్రకృతి నడుమ... ఉల్లాసంగా సాగిపోయే ఆ వాహనం కేవలం ప్రజలనే కాదు... వారి మధ్య అనుబంధాలను మోసుకుపోతుంది. రైట్... రైట్... అనకపోయినా... పట్టాలపై పరిగెత్తే ఈ బస్సు ఈ ప్రాంతీయుల మనసును పెనవేసుకుపోయింది. స్కూలుకు వెళ్లే విద్యార్థి దగ్గర్నుంచి... సంతకు వెళ్లే అవ్వ వరకూ పల్లె ప్రజలంతా ఆ రైలు కోసం ఎదురుచూస్తుంటారు. ఒకే బోగీ.. ప్రతి చిన్న స్టేషన్లో ఆగి వచ్చేవారందరినీ ఎక్కించుకుని... వారంతా ఎక్కిన తర్వాతే ముందుకు కదిలే ఆ రైలుబండి కేవలం ఓ వాహనం కాదు.. ఆత్మీయతల నిలయం. బొబ్బిలి – సాలూరు పట్టణాల మధ్య కేవలం ఒకే ఒక్క భోగీతో నడుస్తూ రాష్ట్రంలోనే ఏకైక సర్వీసుగా పేరొందిన రైలుబస్సు ప్రయాణం.. ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి ప్రతినిధి, విజయనగరం బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం: దేశంలోనే ఎక్కడా లేని రైల్ బస్ బొబ్బిలి–సాలూరు మధ్య మాత్రమే నడుస్తోంది. కేవలం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నష్టం వస్తున్నా రైల్వే శాఖ అధికారులు దీనిని నడిపిస్తున్నారు. కటక్, పారాదీప్, కాకినాడ ప్రాంతాల్లో గతంలో నడిచే ఈ తరహా రైల్బస్లు ఇప్పుడు కేవలం బొబ్బిలి–సాలూరు ప్రాంతాలకే దక్కిన ఓ వరం. ఏళ్లతరబడి ఈ రైలు బస్సులో ప్రయాణిస్తున్నవారు ఈ గ్రామాల్లో చాలా మందే ఉన్నారు. ఇల్లు, ఆఫీసు, స్కూలు, కాలేజ్, వాణిజ్య ప్రాంతాల్లో హడావుడి జీవితం గడిపే వారంతా ఈ రైలుబస్సులోకి ఎక్కిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. రైలు స్నేహితులతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటారు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ కాసేపు కలతలన్నీ మర్చిపోతారు. ఈ బస్సులేకుంటే ఇబ్బందే... దాదాపు 75 మంది కూర్చోవడానికి అవకాశం ఉన్న ఈ రైల్బస్ ఈ ప్రాంతంలో నడవకపోతే చాలా మంది ప్రయాణికులు బస్సులు, ఆటోల కోసం వ్యయ ప్రయాసలు పడాల్సిందే. బొబ్బిలి నుంచి నారాయణప్పవలస, గొల్లల పే ట, రొంపిల్లివలస, పారన్నవలస, సాలూరు వంటి స్టేషన్ల వద్ద ప్రయాణికులు కిక్కిరిసి ఎక్కుతారు. ఒక్కో స్టేషన్నుంచి సుమారు అక్కడి నాలుగైదు గ్రామాల ప్రజలు ఈ రైల్బస్ను ఆశ్రయిస్తారు. బోలెడు ఆదా... సాలూరు నుంచి బొబ్బిలి వెళ్లాలన్నా, అక్కడి నుంచి సాలూరు రావాలన్నా కచ్చితంగా రామభద్రపురం రావాల్సిందే. అక్కడ మరో వాహనాన్ని ఆశ్రయించాల్సిందే. 21 కిలోమీటర్ల దూరానికి ప్రయాణ చార్జీలు కూడా ఎక్కువే. బొబ్బిలి నుంచి సాలూరు వెళ్లాలంటే రూ.20 పైనే ఖర్చవుతుంది. అదే రైల్బస్ అయితే కేవలం రూ.10 తోనే వెళ్లొచ్చు. మిగతా రైళ్లలో ప్రయాణానికి స్టేషన్లో బుకింగ్ కౌంటర్ వద్ద టిక్కెట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం రైలులోనే టిక్కెట్ ఇస్తారు. మరో ఆసక్తికరమయిన విశేషం ఏమంటే కొన్ని స్టేషన్లలో దిగేందుకు వీరి వద్ద టిక్కెట్లు ముద్రించి ఉండకపోతే చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ (టీటీ) ఒక చీటీ రాసి ఇస్తారు. అప్పటికి అదే టిక్కెట్. కేవలం 75 లీటర్ల డీజిల్తో లారీలు, బస్సుల్లో ఉపయోగించే ఇంజిన్తో ఈ రైల్ బస్ రోజుకు 14 కిలోమీటర్లు ఐదుసార్లు రెండు పట్టణాల మధ్య నడుస్తుంది. అదే రైలింజన్ వేస్తే ఇదే దూరానికి 1000 లీటర్ల పైనే అవుతుంది. టికెట్ కలెక్టర్గా దాదాపు 22 సంవత్సరాల సర్వీసు ఇందులోనే నడిచింది. దీంట్లో పనిచేయడం అదో అనుభూతి. వాస్తవానికి మామూలు రైళ్లలో అయితే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు డీఏ అదనంగా వస్తుంది. ఈ రైల్బస్లో ఆ అవకాశం లేకపోయినా ఈ రైలంటే మాకదో ప్రత్యేకత. – వసంత రావు ఉమామహేశ్వరరావు, చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ (టీటీ). మాకెంతో ఇష్టం ఈ ప్రయాణం మాకెంతో ఇష్టం. ఈ రైల్బస్తో ఎంతో అనుబంధం పెరిగింది. ఇటీవల కొన్నాళ్లు రైల్బస్ నిలిచిపోయింది. ఆ సమయంలో మేమెంతో ఇబ్బంది పడ్డాం. మళ్లీ ఈమధ్య నుంచే నడిపిస్తుండటంతో సంతోషమనిపించింది. – సీహెచ్.నారాయణరావు, పారన్న వలస బస్ నిలిచిపోయాక నెలకు రూ.700 అయ్యేది: ఈ మధ్య ఈ బస్ నిలిచిపోయింది. మాలాంటి విద్యార్థులకు ఇది చాలా కష్టమనిపించింది. సమయం వృథాతో పాటు నెలకు రూ.700లు ఖర్చయ్యేది. అదే రైల్బస్ అయితే రూ.150తోనే సరిపోతుంది. – సీహెచ్.మౌనిక, విద్యార్థిని, బొబ్బిలి 8వ తరగతి నుంచీ ఈ బస్లోనే వెళ్తున్నా: మాది రొంపిల్లి వలస. నేను ప్రస్తుతం బొబ్బిలిలోని గాయత్రి కాలేజ్లో ఇంటర్ చదువుతున్నా. మాకు చదువుకునేందుకు పట్టణం వెళ్లాలంటే ఈ రైల్బస్ ఎంతో సౌకర్యం. ఈ బస్లో నేను 8వ తరగతి నుంచి వెళ్తున్నా. – పూడి కాంచన, ఇంటర్ విద్యార్థిని మా పిల్లల దగ్గరకు వెళ్తున్నా మాకు ఈ రైల్ బస్సు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. నేనిప్పుడు ఇందులో మా పిల్లల దగ్గరకు వెళ్తున్నా. రైలు బస్ కొన్ని నెలలు ఆగిపోతే పోరాడి మరీ తిరిగి సాధించుకున్నాం. – కిలపర్తి లక్ష్మి, చిన పారన్న వలస మాకిదే తోడు మాది మరిపిల్లి. మేం జంగమయ్యలం. నెలగంటు పెట్టిన నాటినుంచి సంక్రాంతి వరకూ చనిపోయిన పెద్దల్ని పొడుగుతుంటాం. సాధారణ రోజుల్లోనూ ఇలానే వెళ్తాం. రైల్ బస్ మాకు తోడు. దీనిలో వెళితే చాలా సరదాగా ఉంటుంది. –కటమంచి అప్పన్న, మరిపిల్లి -
టీడీపీ ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి
సాలూరు: ఎస్టీ జాబితాలో బోయలను చేర్చాలని నిర్ణయించిన టీడీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్న టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గిరిజనులు, గిరిజన సంఘాలు అడుగడుగునా నిలదీయాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర కోరారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా లేని సమస్యను మన రాష్ట్రంలో ప్రభుత్వం కోరి తెచ్చి పెడుతోందన్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ ప్రజా పోరాటంతోపాటు న్యాయపోరాటం చేస్తున్నారన్నారు. గిరిజనులు నిరక్షరాస్యులు, పేదవాళ్లు, అమాయకులు కావడంతో ఆ స్థాయిలో పోరాటం చేయడం లేదన్నారు. కానీ గిరిజనులు ఆ స్థాయిలో పోరాడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాదేనని సూచించారు. బోయ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోడానికి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు క్యాబినెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేయడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం ఎస్టీల జనాభా 26 లక్షలుంటే బోయ కులస్తుల జనాభా 30 లక్షలకు పైగా ఉందన్నారు. మైదాన ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం ఎస్టీ కులంపై సామాజిక దాడి చేయించడమేన్నారు. వారిపై నిజంగా ప్రేమే ఉంటే ఓబీసీ, ఈబీసీ జాబితాలో చేర్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. జనరల్ సీట్లలో పోటీ చేశారా.. రాష్ట్రంలో ఒక్క జనరల్ సీట్లోనైనా పోటీ చేసి గెలిచిన గిరిజనుడున్నాడా? అని రాజన్నదొర ప్రశ్నించారు. బోయ కులస్తులు మాత్రం జనరల్ సీట్లలో పోటీచేసి, గెలుపొందారని, దానికి నిదర్శనం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన కాల్వ శ్రీనివాసులేనని గుర్తు చేశారు. అగ్రవర్ణాలతో పోటీ పడుతున్న కులాన్ని అన్ని విధాలుగా వెనుకబడ్డ గిరిజనుల్లో చేర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేని సమయంలో ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. ఆ సమయంలో సభలోని టీడీపీ ఎమ్మెల్యేలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు కనీసం అభ్యంతరం కూడా తెలపకుండా ద్రోహం చేశారన్నారు. అందుకే గ్రామాలకు వచ్చే టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిలదీయాలని కోరారు. -
మహిళను పీక్కుతిని చంపేసిన శునకాలు
సాలూరు: భర్త ఆదరణకు నోచుకోని ఓ ఒంటరి ఇల్లాలు వీధికుక్కలకు బలైంది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బంగారమ్మ కాలనీలో వెంకటాపురం గజలక్ష్మి (45) శిథిలమైన తన గృహంలో నివాసం ఉంటోంది. భర్త రామకృష్ణ బొడ్డవలస గురుకుల పాఠశాలలో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఆయన ఆదరణ లేకపోవడంతో ఈమె ఇరుగుపొరుగు వారిచ్చే ఆహారం తీసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. అనారోగ్యం బారినపడ్డ ఆమె శిథిల గృహంలో గురువారం రాత్రి నిద్రపోయింది. తలుపులు కూడా లేని ఆ ఇంట్లో వీధికుక్కలు తలదాచుకోవడం సాధారణమైంది. వేకువజామున 3 గంటల సమయంలో ఆమెపై కుక్కలతో పాటు కుక్క పిల్లలు దాడిచేసి, ఆమె శరీరాన్ని పీక్కుతిని దారుణంగా చంపేశాయి. తెల్లవారుజామున సమీప కుటుంబాలవారు వెళ్లి చూసేసరికి అత్యంత దారుణ స్థితిలో ఉన్న గజలక్ష్మి మృతదేహాం పడిఉంది. వార్డు మాజీ కౌన్సిలర్ పెద్దింటి శ్రీరాములు పోలీసులకు తెలపడంతో ఎస్ఐ పాంగివారి విచారణ జరిపారు. -
ఆమె బతికుండగానే కొరికి చంపాయి..
సాక్షి, విజయనగరం : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళపై కుక్కలు దాడి చేసి, ప్రాణాలు తీశాయి. ఈ హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సాలూరు మున్సిపాలిటీ పరిధిలో బంగారమ్మ కాలనీలో ఓ మహిళపై కుక్కలు దాడి చేసి చంపాయి. వెంకటాపురం గజలక్ష్మి గత కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద కదలలేని స్ధితిలో ఉంది. అయితే నిన్న రాత్రి (గురువారం) గజలక్ష్మి పై కుక్కల దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. కుక్కలు ఒళ్లంతా కొరకడంతో కదలలేని స్ధితిలో ఉన్న ఆమె ఈరోజు తెల్లావారేసరికి మృత్యువు పాలైంది. ఈ హృదయ విదారకర దృశ్యం స్థానికులును కలిచి వేసింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీ ఫార్మసీ విద్యార్థిని మృతి
సాలూరు రూరల్ (పాచిపెంట): మండలంలోని విశ్వనాధపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారి 26పై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీ ఫార్మసీ చదువుతున్న గిరిజన విద్యార్థిని పేటూరి జ్యోతి(19) దుర్మరణం చెందింది. దీనిపై ఎస్.ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలు...బొబ్బిలి సమీపంలో కోమటిపల్లి గ్రామంలోని భాస్కర కళాశాలలో జ్యోతి బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతుంది. జ్యోతి కళాశాలకు వెళ్లేందుకు మండలంలోని పద్మాపురం పంచాయతీ ఫిరంగివలస గ్రామం నుంచి బుధవారం ఉదయం బయల్దేరి రోడ్డుకు చేరుకుని ఆటోకై ఎదురు చూసింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న తన బంధువులైన దీసరి రాజు, సత్యవతి దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎక్కింది. ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై సాలూరు వైపు వస్తుండగా విశ్వనాధపురం జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న ఒడిశా వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. దీసరి రాజుకు కుడి కాలు విరిగిపోయి తలకు దెబ్బతగలగా, సత్యవతికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్కు రిఫర్ చేశారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కళాశాలకు వెళ్తానని చెప్పిన కూతురు మృత్యు ఒడిలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు పేటూరి సత్య, కృష్ణవతి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు. ఎమ్మెల్యే సంతాపం సాలూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పేటూరి జ్యోతి మృతదేహాన్ని పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకురావడంతో ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఆస్పత్రికి చేరుకొని సంతాపం తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను మృతురా>లి తండ్రి కృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీసరి రాజు, ఆయన భార్య సత్యవతిని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
గిరిజనులంటే చిన్నచూపు....
♦ టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు ♦ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సాలూరు: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి గిరిజనులన్నా, గిరిజన ప్రజాప్రతినిధులన్నా చిన్నచూపని, అందుకే అడుగడుగునా అవమానపరుస్తూ, అన్యాయం చేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఆరోపించారు. మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను సీనియర్ అధికారులతో గాని, స్థానిక అధికారులతో గాని ఆహ్వానించాల్సి ఉందన్నారు. అయితే గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ కార్యక్రమానికి జిల్లాలో ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులను గౌరవించలేని ప్రభుత్వం గిరిజనులను ఉద్దరిస్తుందా..? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు పాచిపెంట మండలంలో తమ కుటుంబీకులకున్న భూములను ఉచితంగా ఇస్తామంటే కాదని, కొత్తవలస మండలంలో గిరిజనులు ముప్పై, నలబై ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని నిర్మాణ పనులు చేపట్టడం తగదన్నారు. ఆయా భూములపై పూర్తి హక్కు కలిగిన గిరిజన రైతులకు పరిహారం ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రమంత్రి అశోక్ ఇస్తామన్న భూములు విమానాశ్రయానికి దూరంగా ఉండడం వల్లే గిరిజన విశ్వవిద్యాలయానికి తీసుకోలేదని ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవం కాదన్నారు. అలాంటప్పుడు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ విమానాశ్రమానికి ఎంతదూరంలో ఉందో ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాకంఠక పాలన సాగిస్తున్న టీడీపీకి ప్రజల బుద్ధి చెబుతారన్నారు. -
మద్యంపై మహిళల యుద్ధం
మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళలు మండిపడ్డారు. దుకాణాన్ని మూసేయాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళలకు తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకొంది. చివరకు పోలీసులను మహిళలు ప్రతిఘటించడంతో మద్యం విక్రయాలను నిలిపివేశారు. సాలూరు: పట్టణంలోని బంగారమ్మపేట మార్గంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున శనివారం ఆందోళనకు దిగారు. దుకాణం వద్దకు బంగారమ్మపేట, శ్రీనివాసనగర్తో పాటు కూర్మరాజుపేట గ్రామానికి చెందిన మహిళలు చేరుకుని మద్యం అమ్మకాలు నిలిపి వేయడమే కాకుండా, షాపును ఇక్కడి నుంచి ఎత్తేయాలని డిమాండ్ చేశారు. దీంతో సాలూరు, పాచిపెంట, రామభద్రపురం మండలాల ఎస్ఐలు మద్యం షాపు వద్దకు చేరుకుని ఆందోళనకారులను కట్టడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. దుకాణంలోకి వెళ్లేందుకు యత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో మద్యం విక్రయాలను నిలిపివేశారు. దీంతో మహిళలు మద్యం దుకాణం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. -
ఎమ్మెల్యే భార్యే అయినా...
సాలూరు: ఆయనో ఎమ్మెల్యే. ఆయనకు గానీ... ఆయన కుటుంబ సభ్యులకు గానీ చికిత్స చేయించాలంటే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లొచ్చు. కానీ సహజంగానే నిరాడంబరుడైన సాలూరు ఎమ్మెల్యే(వైఎస్సార్సీపీ) పీడిక రాజన్నదొర మాత్రం స్థానిక ప్రభుత్వాస్పత్రిలోనే తన సతీమణికి చికిత్స చేయించిన సంఘటన ఇది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజన్నదొర సతీమణి రోజారాణి పాచిపెంట మండలంలో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమె మంగళవారం ఉదయం పాఠశాలకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా రోడ్డుపై అకస్మాత్తుగా పాము కనిపించడంతో కంగారుపడి కిందపడ్డారు. ఈ దశలో ఆమె తల వెనుకభాగం, కాలు, చేతులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏమాత్రం సంకోచించకుండా ఆమెను సాలూరు పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రామ్మూర్తి, అప్పలనాయుడు ప్రధమచికిత్స చేసి, తదుపరి వైద్యపరీక్షల కోసం విజయనగరం తరలించాలని సూచించడంతో ఆయన విజయనగరానికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే భార్యను వైద్యం కోసం సామాన్యుడిలా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రులున్నా, ఆక్కడికి వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడంపై ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యంపైనా, వైద్యులపైనా వున్న నమ్మకమే కారణమని బదులిచ్చారు. -
విద్యుదాఘాతంతో గిరిజనుడి మృతి
సాలూరు రూరల్ : విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి చెందిన సంఘటన మండలంలోని తుండ పంచాయతీ జగ్గుదొరవలసలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సీదరపు కాంతారావు (43) ఆయిల్ పామ్æ గెలలు కోసేందుకు ఉదయం ఎనిమిది గంటలకు పొడవాటి కత్తితో (గెలలు కోసే ఇనుప కత్తి) తోటకు వెళ్లాడు. ఈ క్రమంలో తోట సమీపంలోకి వచ్చేసరికి విద్యుత్ తీగలు కాంతారావు పట్టుకున్న కత్తికి తగలడంతో అకడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. రూరల్ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పరామర్శ మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పరామర్శించారు. ప్రభుత్వం తరపున సాయమందేలా చూస్తానని చెప్పారు. -
గల్లంతైన వ్యక్తి కన్నుమూత
వేదసమాజం వీధిలో అలముకున్న విషాదఛాయలు శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు సాలూరు : రాజమహేంద్రవరంలోని గోదావరి నది కోటిలింగాల రేవుకు స్నానానికి వెళ్లి గల్లంతైన సాలూరు యువకుడు సిగడాపు చైతన్య (19) మరణించాడు. రాజమహేంద్రవరంలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న చైతన్య గురువారం తన స్నేహితులతో కలసి స్నానానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదుగురిలో ఇద్దరు నదిలో గల్లంతు కాగా ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు గాలించారు. మరలా శుక్రవారం ఉదయం నదిలో గాలింపు చర్యలు ప్రారంభించగా చైతన్య మతదేహం లభ్యమైంది. దీంతో నదిలో కొట్టుకుపోయిన తమ బిడ్డ, ఎక్కడో ఒకచోట క్షేమంగా ఒడ్డుకు చేరుకుని ఉంటాడన్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. – విషాద ఛాయలు చైతన్య మతి వార్త తెలియడంతో స్థానిక వేదసమాజం వీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న చైతన్య బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో అతని ఇంటికి చేరుకున్నారు. చైతన్య పెదనాన్న బంగారయ్య, తదితరులు రాజమహేంద్రవరంకు చేరుకుని మతదేహాన్ని సాలూరు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసారు. తల్లికి తెలియకుండా.. బిడ్డ చనిపోయిన విషయం తల్లి శ్రీదేవికి తెలియకుండా బంధువులు జాగ్రత్తపడ్డారు. పరామర్శకు ఇంటికి వస్తున్న వారితో తన బిడ్డకు ఏమీకాకుండా దేవుడిని ప్రార్థించండి అంటూ శ్రీదేవి చెబుతుండడంతో ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమవుతున్నారు. విషయం తెలిస్తే తన భార్య ఏమైపోతుందోనని సూర్యనారాయణ భయపడుతున్నాడు. -
600 కేజీల గంజాయి స్వాధీనం
విజయనగరం : కోరాపుట్ నుంచి భువనేశ్వర్కు అక్రమంగా తరలిస్తున్న 600 కేజీల గంజాయిని విజయనగరం జిల్లాలోని సాలూరులో పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తవ్వారు.. వదిలేశారు..
ముందు చూపు లేని నీరు–చెట్టు పని తీసిన మట్టి కాలువల్లోకి జారుతున్న వైనం పూడిక తరలింపునకు నిధులు లేవంటున్న అధికారులు సాలూరు : ఏదైనా పని చేపడితే దానిని కడదాకా పూర్తి చేయాలి. పూర్తిస్థాయిలో చేయగలమా... లేదా అన్నది ముందుగానే గుర్తించాలి. అది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. కానీ అధికారులు చేస్తున్న పనులు చూస్తుంటే... తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్టుంది. సాలూరులో చేపట్టిన పనులు ఈ విషయాన్ని అక్షరాలా రుజువు చేస్తున్నాయి. సాలూరు మున్సిపాలిటీ పరిధిలోనున్న పేరసాగరం చెరువులోకి పాచిపెంట మండలంలోని చెరుకుపల్లి గెడ్డ, పెద్దగెడ్డ పంట కాలువల నుంచి వరద నీరు 26వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న కాలువల ద్వారా చేరుతుంది. వరద నీరు పారేందుకు అనువుగా రెండు కాలువలు లేవు. పూడికలతో నిండిపోవడంతో చిన్నపాటి వర్షం కురిసినా, వర్షంనీరు నేరుగా రోడ్డుపైన, ఆర్టీసీ కాంప్లెక్స్లోనికి వచ్చేయడం, రామాకాలనీ నీట మునగడం సాధారణమైపోయింది. నీరుచెట్టుతో పూడిక తీత నీటిపారుదలశాఖ అధికారులు నీరుచెట్టు కార్యక్రమంలో భాగంగా కాలువల్లో గతంలో పూడికలను తొలగించారు. పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో మరిన్ని నిధులు రప్పించారు. చెరుకుపల్లి కాలువలో 1800మీటర్ల పొడవునా పూడికలు తొలగించేందుకు రూ. 2లక్షలు, రోడ్డుకు అవతలవైపున్న పెద్దగెడ్డ కాలువలో 800 మీటర్ల పొడవునా పూడికతీతకు రూ. 90లక్షలు మంజూరయ్యేలా చేశారు. మొత్తమ్మీద యంత్రాలసాయంతో పూడికతీతపనులు పూర్తిచేశారు. కాలువల్లో లోతుగా పూడికలు తీయడంతో స్థానికులనుంచి హర్షం వ్యక్తమైంది. అసలు తిరకాసు అక్కడే మొదలైంది. కాలువల్లో తీసిన పూడికలు ఎక్కడికక్కడే నిల్వ ఉంచేశారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో తీసిన పూడిక మట్టి మరలా కాలువల్లోకి జారుతుండడమే కాదు... రోడ్డంతా బురదమయమైంది. పూడిక తరలించేందుకు నిధుల్లేవట! కాలువల్లో నుంచి తీసిన పూడికలు వేరేచోటకు తరలించేందుకు నీరుచెట్టు పథకం ద్వారా నిధులు మంజూరుకు అవకాశం లేదంట. అందుకే పూడిక అలా వదిలేశారంట. తీసిన మట్టిని తరలించే అవకాశంలేనపుడు ఆ పనులు చేపట్టడం ఎందుకు... ఇప్పుడు తీసిన మట్టి మళ్లీ కాలువల్లోకి వెళ్తే తీసిన ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మున్సిపాలిటీ అధికారులు స్పందించలేదు నీటిపారుదలశాఖ జేఈ సాయి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కాలువల్లో పూడికతీతపనులు చేపట్టామని. తీసిన పూడికలను తరలించేందుకు నీరుచెట్టు పథకంలో అవకాశం లేదన్నారు. ఎవరూ తరలించకపోవడంతో మున్సిపాలిటీ నిధులతో తరలించాలని లేఖ రాశానని తెలిపారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నీటిపారుదలశాఖ ఎస్ఈ దష్టికి సమస్యను తీసుకువెళ్లానన్నారు. ఆయన కలెక్టర్తో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చేస్తామని తెలిపారని, ఉత్తర్వులు రాగానే పూడికలను తరలిస్తామని వివరించారు. -
పూటకో మాట..?
సాలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికి 30సార్లు ఢిల్లీవెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసమే వెళ్తున్నామని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీవెళ్లి ప్రత్యేక హోదా అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక మెంటాడవీధి కల్యాణమండపంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ సాలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాష్ర్ట విభజన సమయంలో ప్రత్యేక హోదా పది, పదిహేనేళ్లు కావాలని అడిగిన చంద్రబాబు.. నేడు ప్రత్యేక హోదా అవసరమా? అని అంటుండడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి రాజులు వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరితే వారివెంట వెయ్యమందికి మించి వెళ్లలేదని, ప్రజలంతా వైఎస్సార్ సీపీ పక్షాన ఉన్నారనేందుకు ఇంతకన్నా నిదర్శనం లేదన్నారు. పచ్చిమోసగాడికి బుద్ధి చెబుదాం సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, సాలూరు జెడ్పీటీసీ రెడ్డి పద్మావతి మాట్లాడుతూ అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న రాజన్నదొర, పుష్పశ్రీవాణి వంటి నాయకులు తమ పార్టీలో ఉన్నారని కొనియాడారు. సమావేశంలో పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు, మాజీ మంత్రి సాంబశివరాజు, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, రాష్ట్ర యువజనవిభాగం ప్రధానకార్యదర్శి పరీక్షిత్రాజ్, మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్రనాయకులు జరజాపు ఈశ్వరరావు, గంగమ్మ, సాలూరు మండల పార్టీ అధ్యక్షుడు సువ్వాడ రమణ, కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మునిగిపోనున్న నావ సాలూరు ఎమ్మెల్యే, పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర మాట్లాడుతూ టీడీపీ మునిగిపోనున్న నావ అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచ్లతోపాటు ఇతర నాయకులను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలతోపాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు సైతం బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు అడుగడుగునా దగా చేస్తుంటే, ప్రతిపక్షనేత జగన్ ప్రజలపక్షాన పోరాడుతున్నారన్నారు. జగన్ సాగుజలాలకోసం జలదీక్ష చేస్తుంటే రాష్ట్ర మంత్రులేమో వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే టీడీపీకి డిపాజిట్లు దక్కవని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. -
నామినేషన్లన్నీ ఓకే
సాలూరు: సాలూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికలకు సంబంధించి వచ్చిన నామినేషన్లన్నీ ఆమోదయోగ్యంగా ఉన్నట్టు కోఆపరేటివ్ ఎన్నికల అధికారి పి బాంధవరావు తెలిపారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని బ్యాంకు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. 12మంది డెరైక్టర్ల స్థానాలకు మొత్తం 40 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని ఎన్నికల అధికారులు పరిశీలించి అభ్యంతరాలను స్వీకరించారు. అయితే నామినేషన్లపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అన్ని నామినేషన్లు ఆమోదయోగ్యంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఈసందర్భంగా బాంధవరావు విలేకరులతో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణకు ఆదివారం సాయంత్రం 5గంటల వరకు మాత్రమే గడువు ఉందన్నారు. అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో ఈనెల 16న ప్రత్యేకగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల తీరుతెన్నులపై సమావేశంలో అభ్యర్థులందరికీ వివరిస్తామన్నారు. హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థులు నామినేషన్ల పరిశీలనలో అన్ని నామినేషన్లు ఆమోదం పొందడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ తరఫున ఎన్నికల బరిలో పోటీచేస్తున్న అభ్యర్థులు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు తదితరులు బ్యాంకు కార్యాలయంలో జరిగిన నామినేషన్ల పరిశీలనకు హాజరయ్యారు. అయితే ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అన్ని నామినేషన్లను ఆమోదిస్తున్నట్టు బ్యాంక్ సిట్టింగ్ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు సమక్షంలో ఎన్నికల అధికారి బాంధవరావు ప్రకటించారు. ఓటింగ్కు 10బూత్లు ఈనెల 22న జరగనున్న ఎన్నికకు 10 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. గతంలో 8 బూత్లు మాత్రమే ఉండేవని, ఓటర్ల సౌలభ్యం, లెక్కింపు సులభతరం చేసేందుకు ఈసారి 10 బూత్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పోలింగ్ జరుతుందని చెప్పారు. -
ఆహార సలహా సంఘాల జాడెక్కడ ?
సాలూరు : ప్రభుత్వం రాయితీపై బీపీఎల్ కుటుంబాలకు అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆహార సలహా సంఘాలపై ఉంది. పంపిణీలో సమస్యలు తలెత్తినా, కేటాయింపుల్లో కోతలు విధించినా ప్రభుత్వానికి తక్షణమే నివేదిక పంపి సమస్య పరిష్కారమయ్యేలా సభ్యులు చూస్తారు. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి కలెక్టర్, జేసీకి, పౌరసరఫరాల శాఖాధికారులతో పాటు సంబంధిత మంత్రికి కూడా తీర్మాణాలు పంపించి లబ్ధిదారులు, డీలర్ల ప్రయోజనాలు దెబ్బతినకుండా తమవంతు కృషి చేస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆహార సలహా సంఘాలను టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క కమిటీ కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ప్రతి నెలా సమావేశం ప్రతి మండలానికి ఒక సలహా సంఘం ఉండాలి. వారు ప్రతి నెలా సీఎస్డీటీ ఆధ్వర్యంలో సమావేశమై సరుకుల పంపిణీపై ఆరా తీయూలి. అరుుతే జిల్లాలో ఏ మండలంలో చూసినా సుమారు రెండేళ్లుగా సమావేశాలు జరుగుతున్న దాఖాలాలే లేవు. జేసీకి ప్రతిపాదనలు పంపాం ఈ విషయమై తహశీల్దార్ కేడీవీ ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా, ఆరు నెలల కిందటే సాలూరుకు సంబంధించి సలహా సంఘ నియూమకం కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. ఇంతవరకు అనుమతి రాలేదని చెప్పారు. ప్రశ్నిస్తారన్న భయంతోనే.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం రేషన్ సరుకుల పంపిణీలో పలు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని ఆహార సలహా సంఘ సభ్యులు ప్రశ్నిస్తారన్న భయంతోనే ఏర్పాటు వ్యవహారాన్ని పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ పాస్ విధానంలో సరుకులు పంపిణీ చేపట్టడంతో సరుకుల కోసం లబ్ధిదారులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. అలాగే అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలకు బదులు ఐదు కిలోల బియ్యం ఇస్తున్నారు. అలాగే ఐరిష్, వేలిముద్రలు పడక చాలా మందికి నిత్యావసర సరుకులు పంపిణీ కావడం లేదు. ఇలాంటి సమయంలో ఆహార సలహా సంఘ సమావేశాలు జరిగినా, నూతన కమిటీలు ఏర్పాటు చేసినా తమకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశం నాయకుల్లో ఉన్నట్లు సమాచారం. -
‘పోలీసులకు సమాచారమిస్తే చంపేస్తాం’
సాలూరు: తమ కార్యకలాపాలు, కదలికలపై పోలీసులకు సమాచారం అందించిన వారికి తగిన శాస్తి తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం జాకరివలస గ్రామానికి చెందిన పూసూరు వెంకట్రావు అనే వ్యాపారిని మంగళవారం మావోయిస్టులు హతమార్చారు. అతని మృతదేహం వద్ద మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లారు. తమ ఉనికిపై పోలీసులకు ఉప్పందిస్తూ పార్టీకి నష్టం కలిగించేలా వెంకట్రావు వ్యవహరించాడని అందులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారెవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. సీపీఐ మావోయిస్టు కోరాపుట్ డివిజన్ కమిటీ పేరిట ఆ లేఖ ఉంది. ఈ విషయమై ఓఎస్డీ అప్పలనాయుడును సంప్రదించగా లేఖలో రాత కొరాపుట్ దళ కమాండర్ అరుణక్కదిగా భావిస్తున్నట్లు తెలిపారు. -
ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య
సాలూరు: విజయనగరం జిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన సాలూరు ఏజెన్సీలోని దొరలతాడివలస ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో జాకరవలసకు చెందిన కూతూడి వెంకట్రావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
విమ్స్ ప్రారంభించండి
సాలూరు: విశాఖపట్నంలో విమ్స్ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని శాసనసభలో కోరినట్టు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్నుంచి ఫోన్లో స్థానిక విలేకరులకు శాసనసభ సమావేశ వివరాలను తెలిపారు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు తొలుత ఈవిషయాన్ని లేవనెత్తారన్నారు. విశాఖలోని కేజీహెచ్కు రోగుల తాకిడి అదికమవడంతో ఉత్తరాంధ్రతోపాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజన రోగుల సౌకర్యార్థం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో సేవలందడంలేదని, కొన్ని రకాల పరీక్షలను బయట చేయమంటున్న విషయాన్ని తాను సభ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. అందువల్ల రోగుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.100కోట్ల వ్యయంతో 110 ఎకరాల్లో నిర్మించిన విమ్స్ ఆస్పత్రిని ప్రారంభించాలని కోరామన్నారు. నిర్మాణం పూర్తయి 3ఏళ్లు పైబడుతోందని రోగుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని విమ్స్ను ప్రారంభించాలని కోరామన్నారు. దీంతో స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా జోక్యం చేసుకుని విమ్స్ను తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో 60కోట్ల రూపాయలు మంజూరుచేస్తామని ప్రకటించారని గుర్తుచేశారన్నారు. దీనిపై స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని 3నెలల్లో విమ్స్ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారన్నారు. -
బాబు పాలనలో రక్షణ లేదు: రాజన్నదొర
సాలూరు రూరల్: గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెంతాడ మండలం కొండలింగాలవలస గ్రామ పంచాయతీ పరిధిలోని మూలపాడులో ఓ గిరిజన బాలికపై గురువారం ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. నిందితులపై నిర్భయచట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కోరారు. చికిత్స పొందుతున్న బాధిత గిరిజన బాలికకు మెరుగైన వైద్య సేవలు అందేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారాలు పెరిగిపోయాయని, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సాలూరు: పట్టణంలోని వేగావతి నది వంతెనపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన అప్పికొండ తిరుపతి(47) మృతిచెందాడు. తిరుపతి తన ద్విచక్రవాహనంపై సాలూరు నుంచి మోసూరు వెళ్తుండగా వంతెన వద్ద వాహనాన్ని అదుపుచేయలేక కిందపడి ఉంటాడని, బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వీడి వుంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే రోడ్డుకు కుడివైపు వాహనం, మృతదేహం పడివుండటంతో ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కిందపడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. తిరుపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. పట్టణ ఎస్ఐ పరంజ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజ్యాంగం ఉపయోగం మోసగాళ్లకేనా?
ఒకే వ్యక్తికి నాలుగు కుల ధ్రువీకరణ పత్రాలా? సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర విజయనగరం మున్సిపాలిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మోసగాళ్లకు, దోపిడీ దొంగలకు ఉపయోగపడుతో ందని సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక.రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విజయనగరం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి.భంజదేవ్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, దీనిపై జాయింట్ కలెక్టర్ బుధవారం విచారణచేపట్టగా వాయిదా కావాలని భంజ్దేవ్ కోరినట్లు తెలిపారు. 2006వ సంవత్సరంలో ఆర్పి.భంజ్దేవ్ కుల ధ్రువీకరణపై హైకోర్టు ఆయన గిరిజనుడు కాదని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అయితే అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ గతంలో ఐటీడీఏ పీఓగా విధులు నిర్వహించిన సబ్కలెక్టర్ శ్వేతామహంతి గిరిజనుడంటూ ఎలా కులధ్రువీకరణ పత్రం జారీ చేశారన్నారు. న్యాయస్థానం తీర్పును తలకిందులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా జరగలేదన్నారు. ప్రస్థుతం సదరు అధికారి వేరొక రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నా విడిచిపెట్టేది లేదన్నారు. ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విజయనగరం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా ఉద్యోగాలు, పదవులు అనుభవిస్తున్న వారు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో కులధ్రువీకరణ కేసులు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయని వాటిపై యంత్రాంగం దృష్టి సారించి పరిశీలిస్తే అర్హులకు న్యాయం జరుగుతుందని కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని ముఖ్యమంత్రికి తెలిసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలో అంగన్వాడీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియతో పాటు స్వచ్ఛభారత్ ట్రాక్టర్ కొనుగోలులో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. గిరిజన న్యాయవాది రేగు మహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన నాయకులు శోభా.హైమావతి, శత్రుచర్ల, విజయరామరాజు, జనార్దన్ థాట్రాజ్లు ఎస్టీలు కాదని సెక్షన్ 11 ప్రకారం ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేశామని, అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వేసిన కేసు విచారణలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో గుంప ప్రకాశరావు పాల్గొన్నారు. -
కోర్టు నోటీసులు పంపారని మహిళ మృతి
కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి దారుణం... కళ్లెదుటే మహిళ బలవన్మరణం.. ఆస్తి తగాదాల కారణంగా నడిరోడ్డులో ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో సాలూరు పట్టణం అట్టుడుకిపోయింది. సాలూరు: ఆస్తి తగాదాలు ఓ మహిళ బలవన్మరణానికి కారణమయ్యాయి. కోర్టు నోటీసులు పంపారని తీవ్ర వేదనకు గురై వీధిలోకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోవడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వివరాలిలా ఉన్నారుు... పట్టణంలోని తెలగావీధిలో నివాసముంటున్న కూనిశెట్టి రాంబాబుకు సోదరుడు నానాజీతో ఆస్తి తగాదాలున్నారుు. ఈ నేపథ్యంలో నానాజీ తన సోదరుడైన రాంబాబుకు కోర్టు ద్వారా నోటీస్ పంపించాడు. దీంతో రాంబాబు భార్య వరలక్ష్మి (45) తీవ్ర మనస్థాపానికి గురై గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇంటిలోనుంచి బయటకు వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. హఠాత్పరిణామానికి భీతిళ్లి న సమీప కుటుంబాలవారు క్షణాల్లో తేరుకుని మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ఆమె పూర్తిగా కాలిపోయింది. 108 వాహనానికి సమాచారం అందించి పట్టణ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో అదే 108లో విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారు. భార్య చనిపోవడంతో భర్త రాంబాబు, కుటుంబ సభ్యులు రోధన చూపరులను కలిచివేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జగన్ దీక్షను ‘ప్రత్యేక’ంగా అడ్డుకుంటారా..?
సాలూరు; రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో అవసరమైన ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నుంచి జరపతలపెట్టిన నిరాహార దీక్షను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదాకోసం చంద్రబాబు చేయాల్సిన పోరాటాన్ని, బాధ్యతగల ప్రతిపక్షనేతగా జగన్ నిర్వర్తిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం దుర్మార్గమని విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విపక్షనేతలు ఇలా అన్నివర్గాలవారు పెదవి విరుస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలిసిరావాల్సింది పోయి కుట్రచేస్తారా..?; కేంద్రం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయలేని స్థితిలో ఉంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోరాడేందుకు ముందుకు వస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని పోకుండా, పోరాటానికి మోకాలడ్డడం దారుణం. ఇలాంటి చర్యల కారణంగానే రాష్ట్రప్రజలు చంద్రబాబును గతంలో 10ఏళ్లపాటు అధికారానికి దూరం చేశారన్న విషయం గుర్తుంచుకోవడం మంచిది. - ఎన్వై నాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాలూరు స్వేచ్ఛను హరిస్తారా..?; మనం ఉన్నది ప్రజాస్వామ్యదేశంలోనా..?, రాచరికపాలనలోనా..?, రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడే ప్రత్యేక హోదా సాధనకు జగన్ నిరారహార దీక్షకు పూనుకుంటే చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంటుండడం దారుణం. ప్రత్యేక హోదా వస్తే చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం వస్తుంది. ఇంటికో ఉద్యోగం ఇవ్వవచ్చు, అవసరమైతే నిరుద్యోగ భృతి ఇవ్వవచ్చు. ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా సాధించలేక, ప్రతిపక్షనేతగా జగన్ చేపట్టిన పోరాటాన్ని అడ్డుకోవడం దారుణం. - పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే ఇదేం దిక్కుమాలిన తీరు; రాష్ట్రం అన్నివిదాలుగా సంక్షోభంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడి యువత ఉపాధి బాట పట్టాలన్నా, ఉద్యోగావకాశాలు రావాలన్నా, పరిశ్రమలు స్థాపించాలన్నా, ప్రత్యేక హోదా అవసరం. దానికోసం పోరాడలేని టీడీపీ ప్రభుత్వం, జగన్ పోరాటాన్ని అడ్డుకోవడం సరికాదు. ఇదేం దిక్కుమాలిన నిర్ణయం. జగన్ను చూసి భయంతోనే అడ్డుకుంటున్నారు. - గొంప ప్రకాశరావు, భారతీయ రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సాలూరు -
అక్రమంగా తరలిస్తున్న ఉల్లి స్వాధీనం
సాలూరు: విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని చిన్నబజారు జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల ఉల్లి, 5 బస్తాల వెల్లుల్లిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకపోవటంతో పట్టుకున్న ఉల్లిపాయలను, వెల్లుల్లి పాయలను స్థానిక తహశీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కొట్టుకు పోయిన కాజ్ వే - రాకపోకలు బంద్
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని సువర్ణముఖి నదిపై కట్టిన కాజ్వే కొట్టుకుపోవడంతో యానాం, దుగవనందగితో సహా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సువర్ణముఖి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహించడంతో కాజ్వే కొట్టుకుపోయింది. -
గుట్కా, ఖైనీ పట్టివేత
సాలూరు (విజయనగరం జిల్లా) : అక్రమంగా నిల్వ ఉంచిన లక్ష రూపాయలు విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. మున్సిపాలిటీకి చెందిన మోహన్రావు ఇంట్లో అక్రమంగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లను నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతని ఇంట్లో సోదాలు జరిపి లక్ష రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు : ఇద్దరు అరెస్ట్
సాలూరు రూరల్ : విజయనగరం జిల్లా సాలూరు మండలం సొంపిగామ్ సమీపంలోని సిరిలిమెట్ట కొండ వద్ద అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, సుమారు 11 మంది పరారయ్యారు. పట్టుబడిన అమృతరావు, రామారావు నుంచి కొన్ని రంగురాళ్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని ఈ ప్రాంతంలో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు స్థానికులు చెబుతుంటారు. -
పోలీసుల అదుపులో రంగురాళ్ల వ్యాపారులు!
సాలూరు: మండలంలో తాజాగా మరో నలుగురు రంగురాళ్ల వ్యాపారులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారినుండి సమాచారాన్ని రాబట్టేపనిలో నిమగ్నమైనట్టు సమాచారం. మండలంలో రంగురాళ్ల తవ్వకాలు, అమ్మకాలకు చెక్ పెట్టేందుకు గతంలో కన్నా భిన్నంగా పోలీసులు నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెల లో ఏకంగా 13 మంది వ్యాపారులను అరెస్ట్ చేశారు కూడా. అయితే అక్రమ సంపాదన రుచి మరిగిన కొందరు వ్యాపారులు వెరవకుండా తమ పనిని నిరాటంకంగా కానిస్తున్నారు. మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తవ్వకాలను జరిపిస్తూ రంగురాళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం తెలియటంతో సారిక, నేరెళ్లవలస, సొంపిగాం గ్రామాలకు చెందిన నలుగురు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిదగ్గరున్న రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వారు అమాయకులని, విడిచిపెట్టాలని పలువురు మహిళలు రూరల్ పోలీస్స్టేషన్కు వస్తున్నట్టు సమాచారం. వారిని పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఈ తరహా వ్యాపారం మానుకోమని మీ మగవాళ్లకు చెప్పాలని వారికి సూచించినట్ట్టు సమాచారం. అదుపులో ఉన్నవారు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకొందరిని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. -
ఇద్దర్ని మింగేసిన మలేరియా !
సాలూరురూరల్ : సాలూరు మండలంలో మలేరియా విజృంభించింది. పలుగ్రామాల్లో ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. మలేరియా కాటుకు శుక్రవారం రాత్రి ఓ చిన్నారి, మహిళ బలయ్యారు. తోణాం పంచాయతీ సిమిడివలస కొత్తూరు గ్రామానికి చెందిన గెమ్మెల సమీర(4), కొత్తవలస పంచాయతీలో గల గదబకరకవలస గ్రామానికి చెందిన మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు మజ్జి బుచ్చమ్మ(60) అనే మహిళ మృత్యువాత పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సిమిడివలస గ్రామంలో 20 మంది జ్వరాలతో మంచం పట్టారు. కొర్ర సింహాద్రి, గెమ్మెల చరణ్, గెమ్మెల రాజు,గెమ్మెల కమల, గెమ్మెల నర్సమ్మ,కొర్ర సీతమ్మ, గర్బిణి కొర్ర లక్ష్మి, ఆమె కుమార్తె కొర్ర స్వప్న ఇలా గ్రామంలో ఇంటికి ఒకఇద్దరు చొప్పున జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో జ్వరాలు ప్రబలినా వైద్య సిబ్బంది గాని, ఆశ వర్కర్లు గాని , ఏఎన్ఎంలుగానీ తమ గ్రామానికి రాలేదని గ్రామస్తులు తెలిపారు. వైద్యం అందకే ... మృతి చెందిన చిన్నారి సమీర తల్లి మాట్లాడుతూ తన కుమార్తె మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ మృతి చెందిందని భోరున విలపిస్తూ తెలిపింది. తమ గ్రామం నుంచి 20 కిలోమీటర దూరంలో గల మామిడిపిల్లి పీహెచ్సీకి వెళ్లలేక, తమ గ్రామంలో వైద్య సేవలందించవలసిన తోణాం పీహెచ్సీ వైద్య సిబ్బంది ఇక్కడకు రాకపోవడంతో తన పాపకు వైద్యం అందలేదని ఆమె తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం రెండో పాప కడుపులో ఉండగా, మలేరియా జ్వరంతో తన భర్త చనిపోయాడని, ఇప్పుడు పెద్ద కుమార్తెను కూడా జ్వరం పొట్టనపెట్టుకుందని రోదిస్తూ తెలిపింది. మలేరియాతో మృతి చెందిన బుచ్చమ్మ....మధ్యాహ్న భోజన పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి పనిచేస్తోందని, ఆమె మృతితో కుటుంబం రోడ్డున పడిందని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.వై నాయుడు తెలిపారు. ఆమె కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వణికిపోతున్న మన్యం మలేరియా మహామ్మారి విజృంభిస్తుండడంతో మన్యం ప్రజలు వణికిపోతున్నారు. ఏటా వర్షకాలంలో వస్తే చాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బితుకుబితుకుమంటూ గడపవలసి వస్తోంది. ఇప్పటకే జిల్లా 2,115 మందికి పైగా మలేరియాతో బాధపడుతున్నారు. వీరిలో 1900 మంది వ్యాధిగ్రస్తులు గిరిజన ప్రాంతానికి చెందిన వారే. దోమ తెరల పంపిణీ, దోమల నివారణ మందు స్ప్రెయింగ్ తదితర కార్యక్రమాలు వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్నప్పటికి మలేరియాను మాత్రం అదుపుచేయలేకపోతున్నారు. -
చంద్రబాబుది డాబుసరి
మున్సిపల్ కార్మికుల పోరాటానికి అండగా ఉంటాం రౌండ్టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు రాజన్నదొర సాలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబుది డాబుసరి పరిపాలన అని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. మారిన మనిషినని ప్రజలను నమ్మించి తన నిజస్వరూపాన్ని చూపుతున్నారన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సీఐటీయు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మెపై మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగాలను రెగ్యులర్ చేసేస్తానని, మెరుగైన జీతాలు అందిస్తానని స్పష్టం చేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడపీకే పనిలో పడ్డారన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓలనే అమలుచేయడం లేదని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులు కొత్త డిమాండ్లేమీ చేయడంలేదని, చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగానే ఉద్యోగాలు రెగ్యులర్ చేయమంటున్నారని, 10వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలను చెల్లించాలంటున్నారన్నారు. గోదావరి పుష్కరాలు ముగిసిన అనంతరం అక్కడ పనిచేస్తున్న కార్మికులను రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పంపి, సమ్మె చేస్తున్న కార్మికుల సంగతి తేల్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారముందన్నారు. అందువల్ల రాష్ట్ర స్థాయిలో కార్మికులు ఆందోళనలు, నిరసనలు ఉద్ధృతం చేయాలని సూచించారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందన్నారు. అంతకుముందు మాట్లాడిన రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ప్రకాశ్ ముఖ్యమంత్రికి కార్మికుల సమస్యలు పట్టడంలేదని, ప్రజల ఆరోగ్యంతో ఆయనకు పనిలేకుండా పోతోందన్నారు. సీపీఐ సాలూరు ఏరియా కార్యదర్శి ఎస్ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ చట్టాలను చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాలు 8వ, 9వ పీఆర్సీలను చక్కగా అమలు చేశాయని, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కూడా 10వ పీఆర్సీని కార్మికులకు వర్తింపజేయాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో బీజేపీ పట్టణ నాయకుడు లక్ష్మణరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు సువ్వాడ రమణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎం.గంగమ్మ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గేదెల సత్యనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, సీపీఎం నాయకుడు శ్రీనివాస్, లోక్ సత్తా నాయకుడు రధంగపాణి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన సంఘ ప్రధాన కార్యదర్శి నాగార్జున, కౌన్సిలర్లు ఎం.అప్పారావు, టి.రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ గజ...సక్సెస్
మక్కువ/సాలూరు,రూరల్: ఒడిశా నుంచి వచ్చిన ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. సుమారు 200 మంది అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది శ్రమించి ఆపరేషన్ ‘గజ’ను విజయవంతం చేశారు. చిత్తూరు నుంచి రెండు కొంకిస్( శిక్ష ణపొందిన) ఏనుగులను సాలూరు మండలం మామిడిపల్లి గ్రామానికి సోమవారం తీసుకువచ్చారు. అయితే రాత్రి గున్న ఏనుగుజాడ తెలియకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. మంగళవారం ఉదయం సాలూరు మండలం రెయ్యివానివలస గ్రామం సమీపంలోని వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ లోతట్టు ప్రాంతంలోని వాగువద్ద గున్న ఏనుగు సేదతీరుతుండడాన్ని అధికారులు గమనించారు. మామిడిపల్లినుంచి కొంకిస్ ఏనుగులను పసుపువానివలస, రెయ్యివానివలస గ్రామాల మీదుగా నడిపించుకుంటూ మధ్యాహ్నం 12గంటల సమయానికి గున్న ఏనుగు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున కొంకిస్ ఏనుగుల అలసట తీరి, అవి సేదతీరేవరకూ వేచి ఉండి సాయంత్రం 4.14నిమిషాలకు ఆపరేషన్ గజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ జరిగిందిలా... విశాఖపట్నం జూ డాక్టర్ శ్రీనివాస్ మత్తు ఇంక్షన్ గల తుపాకీతో జయంతి ఏనుగుపై కూర్చుని గున్న ఏనుగు ఉన్న ప్రదేశానికి సమీపంలోకి చేరుకున్నారు. అనంతరం గున్న ఏనుగును జయంతి మచ్చిక చేసుకుంది. జయంతికి తోడుగా వినాయక్ అనే ఏనుగు కూడా గున్న ఏనుగు వద్దకు చేరుకుంది. అవి గున్న ఏనుగును బహిరంగ ప్రదేశానికి తీసుకువచ్చాయి. జూ డాక్టర్ తుపాకీలో లోడ్చేసి ఉన్న మత్తు ఇంజక్షను గున్న ఏనుగుపై ప్రయోగించారు. దీంతో అది సృ్పహతప్పి పడిపోయింది. వెంటనే అటవీశాఖ సిబ్బంది తాళ్లు, గొలుసులను కాళ్లకు కట్టారు. గున్న ఏనుగుకు కొంత సృ్పహ వచ్చిన వెంటనే కొంకిస్ ఏనుగుల మధ్యన దానిని ఉంచి లారీవద్దకు తీసుకు వచ్చి ఎక్కించారు. అక్కడి నుంచి విశాఖపట్నం జూకు గున్న ఏనుగును తరలించేందుకు చర్యలు చేపట్టారు. ముందే....ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టిఉంటే...?. అటవీశాఖాధికారులు మందే ఇంత పకడ్బందీగా చర్యలు చేపట్టి ఉంటే పెద్ద ఏనుగు మృతిచెంది ఉండేది కాదని స్థానికులు అభిపాయపడ్డారు. గత నెల 7వ తేదీన ఒడిశా రాష్ట్రం బొలంగీర్ ప్రాంతం నుంచి సాలూరు మండలం కొట్టుపరువు గ్రామంలోకి ప్రవేశించిన రెండు ఏనుగులు నెలరోజులుగా మక్కువ, సాలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరించాయి. ఈ నెల 11వ తేదీన గాదిపల్లివలస గ్రామం సమీపంలోని అరటితోట వద్ద విద్యుత్వైర్లు తగలడంతో పెద్ద ఏనుగు మృతిచెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆపరేషన్ గజను చేపట్టిన అధికారులు గున్న ఏనుగును పట్టుకోగలిగారు. కార్యక్రమంలో అడిషనల్ సీసీఎఫ్ ప్రదీప్కుమార్, విజయనగరం డీఎఫ్ఓ ఐకేవీ రాజు, శ్రీకాకుళం డీఎఫ్ఓ బి.విజయకుమార్, విశాఖపట్నం స్క్వాడ్ డీఎఫ్ఓ బి.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రన్న కానుక’పై విచారణ జరపాలి
సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండగ నేపథ్యంలో పంపిణీ చేపిన ఉచిత సరుకులపై విజిలెన్స్తో గాని, ముగ్గురు సభ్యులతో కూడిన ఐఏఎస్ అధికారులతో గాని విచారణ జరపాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సరుకుల పంపిణీలో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్టు తెలు స్తోందన్నారు. ప్రభుత్వం అందించిన సరుకుల ధరల కన్నా.. స్థానిక, మార్కెట్లో ధరలే తక్కువగా ఉన్నాయని చెప్పారు. అటువంటప్పుడు హోల్సేల్ గా కొనుగోలు చేస్తే వాటి ధర మరింత తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వం ఉచిత సరుకులందిస్తున్నట్టు ప్రకటించిం దని, అప్పట్లో రూ. 287 కోట్ల అవసరమవుతున్నాయన్నారని, కానీ ప్రస్తుతం 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్టు చెబుతున్నారన్నారు. పం డగకు ఉచితంగా సరుకులందించడాన్ని తాము తప్పుబట్టడం లేదని, కానీ ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పారు. అధిక ధరలకు కొనుగోలు చేసిన సరుకులైనా.. నాణ్యంగా లేవన్నారు. కొన్నిచోట్ల తక్కువ ధరకు వచ్చే పాలిష్డ్ పప్పు, ఇంకొన్ని చోట్ల నాశిరకంగా ఉందన్నారు. అలాగే 30 కోట్ల రూపాయలతో కొనుగోలుు చేసిన సరుకుల బ్యాగులు ఎక్కడా కానరాలేదన్నారు. మరీ బ్యాగులు ఏమైనట్టు అని ప్రశ్నించారు. తూకంలో కూడా తగ్గుదల ఉన్నట్టు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన పథకాన్ని... ఎందుకు ఆదరాబాదరాగా చేపట్టాల్సి వచ్చిందో తెలి యడం లేదన్నారు. దుర్వినియోగమైన ప్రజాధనంపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. సంబరాలకెలా వస్తాం..?; ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే తాము సంబరాల్లో ఎలా పాల్గొంటామని రాజ న్నదొర ప్రశ్నించారు. పింఛన్లు పొందేం దుకు అన్ని అర్హతలున్నా అంద కపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారని, చాలామంది మనో వ్యాధితో మరణిస్తున్నారన్నారు. అధికారుల తప్పి దం వల్ల రాష్ట్రంలో 7 లక్షల కుటుంబా లు, జిల్లాలో 14 వేల కుటుంబాల రేషన్కార్డుల ఆధార్సీడింగ్ జరగకపోతే వారికి సరుకులు ఇవ్వడం లేదని, రైతుల రుణమాఫీ కూడా సక్ర మంగా అమలు చేయకపోవడంతో పాటు హుద్హుద్ తుపాను పంట నష్ట పరిహారాన్ని కూడా పాత బకాయిలకు బ్యాంకులు జమ చేస్తుంటే రైతులు పండగ ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ కారణంగానే తాము సంక్రాంతి సంబరాల్లో పాల్గొనలేదని చెప్పారు. -
రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
సాలూరు : అసెంబ్లీ సమావేశాల్లో రుణమాఫీ, పింఛన్ల పంపిణీ, ఎస్సీ, ఎస్టీ రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికా రులు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పని చేయాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. రాజకీయ వ్యవస్ధలో మార్పులు వస్తున్నా.. అధికారులు మాత్రం విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలని చెప్పారు. కానీ సాలూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆ పరిస్థితి లేదన్నారు. ఇందుకు ఇటీవల ప్రభు త్వ పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణే ఉదాహరణ అని చెప్పారు. ముఖ్యంగా పింఛన్ల కేటాయింపులో అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లోనయ్యా రన్నారు. వారి తీరు వల్ల అర్హులైన వారికి పింఛన్లు అందకుండా పోయాయన్నారు. అలాగే దళితులు, గిరిజనులకు మంజూరు చేసే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ట్రైకార్ రుణాల ఎంపిక కమిటీలో గిరిజనేతరులకు స్థానం కల్పించి, అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వమైనా అర్హులకు పథకాలు అందివ్వాలన్న లక్ష్యంతో పని చేస్తుంది. కానీ మాకు వస్తున్న ఫిర్యాదుల మేరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారికే రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అలాగే రుణమాఫీపై కూడా ప్రభు త్వం అనుసరించిన విధానం సరిగ్గా లేదన్నారు. దీనిపై శాసనసభలో ప్రభుత్వాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తారని చెప్పారు. పింఛన్ల నిలిపివేతపై ఇప్పటికే న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని, రుణాల మంజూరు విషయంలో కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పది మందికి పథకాలు అందించాలని భావిస్తే వెయ్యి మంది దరఖాస్తు చేసుకుంటారని, ఆ పదీ తమ అనుకూలురికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే మిగిలిన 9, 990 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారని చెప్పారు. ఫైలేరియా నిర్మూలనకు కృషి ప్రతి ఒక్కరూ ఫైలేరియా నిర్మూలనకు కృషి చేయాలని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ ైఫైలేరియా వారోత్సవాల ప్రారంబోత్స వం సందర్భంగా వెలమపేట రామమందిరం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫైలేరియా వ్యాధి బారిన పడితే తగ్గేందుకు అవకాశం లేదన్నారు. అందువల్ల ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పడడమే మార్గమన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోన్న మాత్రలను ప్రతి ఒక్కరూ విధిగా వేసుకోవాలని సూచించారు.మలేరియా నివారణాధికారి సంగమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్, ఇన్చార్జి ఎస్పీహెచ్ఓ డాక్టర్ సంజీవనాయుడు, స్థానిక నాయకులు అక్యాన అప్పచ్చి, ఎర్ర దాలినాయుడు, జె. సీతారాం తదితరులు పాల్గొన్నారు. అలాగే సాలూరు మండలంలోని మా మిడిపల్లిలో కూడా జాతీయ పైలేరియా వారోత్సవాలను ప్రారంభించా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోని ఈశ్వరమ్మ, మామిడిపల్లి పీహెచ్సీ వైద్యాధికారి సురేష్చంద్రదేవ్, టీడీపీ నాయకుడు డొంక శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు
సాలూరు : అధికారుల ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం తో పాటు స్పీకర్కు ఫిర్యాదు చేసినట్టు సాలూరు ఎమ్మె ల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర తెలిపారు. ఫిర్యాదుపై సరి గ్గా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో పలువురు అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలను మాజీ ప్రజాప్రతి నిధులతో ప్రారంభోత్సవం చేస్తూ, ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అధికారులు సమాచారం ఇవ్వకుండా ప్రొటోకాల్ను ధిక్కరిస్తుండడంతో ఎమ్మెల్యేగా తన గౌరవాన్ని, శాసన సభ గౌరవాన్ని కాపాడుకోవాల్సి న అవసరం తనపై ఉందన్నారు. అందుకే జరిగిన తీరుతెన్నులను కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీల ద్వారా ప్రభుత్వానికి, శాసనసభ స్పీకర్ ద్వారా శాసనసభకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. విచారణ అనంతరం అధికారులపై చర్యలు చేపడితే తాను బాధ్యుడ్ని కానని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు పత్రికాముఖంగా, ప్రత్యక్షంగా ప్రొటోకాల్ ఉల్లంఘన వద్దని అధికారులకు తెలిపానని, కానీ కొందరు అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అందుకే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తాను మాజీ ప్రజాప్రతినిధులను కూడా గౌరవించాలని ఇప్పటికే పలు కార్యక్రమాల్లో స్పష్టం చేశానని, అన్ని పార్టీలవారు, అందరు నాయకులు కలిసికట్టుగా కృషి చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నా రు. టీడీపీ నాయకులు భంజ్దేవ్, సంధ్యారాణి తదితరులను కూడా తాను ఎన్నడూ విస్మరించలేదని గుర్తుచేశారు. అయితే ఎమ్మెల్యేగా తన హక్కులకు అగౌరవం కలుగుతున్నందున్న భావనతోనే ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం ఫిర్యాదు చేసిన అధికారుల వివరాలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 6న మున్సిపల్ కౌ న్సిల్ సమావేశంలో తనకు కౌన్సిలర్ల మాదిరిగానే కమిషనర్ షేక్ సుభానీ కుర్చీని కేటాయించారని, ఏపీ ట్రాన్స్కోలో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల వివరాలు ఎమ్మెల్యేగా ఆ శాఖ సీఎండీ, ఎస్ఈ, డీఈలను లేఖ ద్వా రా సెప్టెంబరు 22న కోరితే నేటివరకు ఏ ఒక్కరి నుంచి సమాదానం రాలేదన్నారు. ఒక ఎమ్మెల్యే వివరాలు కోరితే 15 రోజుల్లో సమాధాన ం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. అలాగే అక్టోబర్ 24న రూ. 8 లక్షలతో గోముఖీ రెగ్యులేటర్ వద్ద మరమ్మతుల పనుల శంకుస్థాపన కు నీటిపారుదల శాఖ అధికారులు పిలవలేదన్నారు. అదే నెల 28న రూ. 43 లక్షలతో గురువినాయుడుపేట- మాతుమూరు గ్రామాల రహదారి నిర్మా ణం శంకుస్థాపన పనులకు, నవంబరు 3న మాతుమూరు- తాడూరు కాజ్వే పనుల శంకుస్థాపన పనులకు, అదేరోజున మో సూరు కాజ్వే నిర్మాణ పనులను ఆర్అండ్బీ అధికారులు తనకు సమాచారం ఇవ్వకుండానే ఇతరులతో శంకుస్థాపన జరిపారన్నారు. ఇకపై కూడా ఈ తరహా ప్రొటోకాల్ ఉల్లంఘన జరగదని భావిస్తున్నానన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ జరజాపు సూరిబాబు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గిరి రఘు, మాజీ కౌన్సిలర్ పిరాడి రామకృష్ణ, మాజీ ఏఎంసీ డెరైక్టర్ కర్రి పోలారావు, పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ను మంటగలుపుతారా..?
సాలూరు: రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఒకటైన ప్రోటోకాల్ను గౌరవించరా..? మాజీ ఎమ్మెల్యే అయిన మీకు ప్రోటోకాల్ వర్తించదన్న విషయం తెలియ దా..?, అంటూ సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర, అధికార పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భ ంజ్దేవ్ను నిలదీశారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా కనిపించిన ప్రోటోకాల్ ఉల్లంఘన వ్యవహారంపై భంజ్దేవ్, రాజన్నదొర మంగళవారం ఒకే వేదికపైకి రావడంతో బాహాటంగానే వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. స్థానిక ఏడీఏ కార్యాలయం వద్ద రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే రాజన్నదొరను వేదిక మీదకు ఆహ్వనించిన జేడిఏ ప్రమీల ఆతర్వాత మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్ను ఆహ్వనించడంతో రాజన్నదొర అభ్యంతరం తెలిపారు. పోటోకాల్ లేని వ్యక్తులను వేదికపైకి పిలవకండని జేడీకి సూచించారు. దీంతో కలుగజేసుకున్న భంజ్దేవ్ ప్రోటోకాల్ మెయింటెయిన్ చేయాల్సింది అధికారులని, ఈవిషయంపై వారినే ప్రశ్నించండని బదులిస్తూనే వేదికపై ఆశీనులయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ ప్రోటోకాల్ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దాన్ని పాటించకపోతే రాజ్యాంగం, శాసనసభ, చట్టం కల్పించిన హక్కులు దండగేనన్నారు. ఈ విషయంలో కలెక్టర్కు, స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని వెంగళరాయసాగర్ జలాశయం పరిధిలోని గోముఖి రెగ్యులేటర్ పనులతోపాటు, పాచిపెంటమండలంలోని రోడ్డు మరమ్మతుల పనులకు శంకుస్థాపనలు చేయడం ప్రోటోకాల్ ఉల్లంఘన కాదంటారా? అని ప్రశ్నించారు. అనంతరం భంజ్దేవ్ మాట్లాడుతూ తాము శంకుస్థాపనలు చేసిన పనులకు అనుమతులు రాలేదన్నారు. కానీ గోముఖి రెగ్యులేటర్ ఆయకట్టు రైతులకు నష్టం జరగకూడదని, పాచిపెంట మండలంలో రాకపోకలకు అంతరాయం కలగకూడదని భావించి సంబంధిత కాంట్రాక్టర్లను ఒప్పించి, నిధులు తర్వాత మంజూరవుతాయని చెప్పి పనులను ప్రారంభించేలా చేశామని వివరణ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడానికి మరో నెలా15రోజులు పడుతుందని, తర్వాత ప్రోటోకాల్ అమలు చేస్తారని సమాధానమిచ్చారు. దీంతో కలుగజేసుకున్న రాజన్నదొర బహిరంగంగా పనులు ప్రారంభించేటపుడు ప్రోటోకాల్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఒక్క ఎమ్మెల్యే చేసేదేమీ ఉండదని, అందరం కలిసికట్టుగా పనిచేసి, ప్రజలకు మేలు చేద్దామని కోరుతున్నానన్నారు. వీరి వాగ్వాదం తారస్థాయికి చేరడంతో అధికారులు, ఇతర నాయకులు జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేశారు. వ్యవసాయ ఉపకరణాల పంపిణీ స్థానిక ఏడీఏ కార్యాలయంవద్ద సాలూరు, పాచిపెంట, రామభద్రపురం మండలాలకు చెందిన 14 రైతు సంఘాలకు దాదాపు కోటి రూపాయల విలువచేసే టైరు బండ్లు, ట్రాక్టర్లను ఎమ్మెల్యే రాజన్నదొర మంగళవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో పట్టాలు పొందిన రైతులకు న్యాయం జరగడంలేదన్నారు. కౌలు రైతులకు నేరుగా పరిహారం అందించే పరిస్థితి లేదన్నారు. అనంతరం జేడీఏ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెప్పింది నిజమేనని అంగీకరించారు. వేర్వేరు సర్వే నంబర్ల భూముల్లో పంట నష్టం జరిగినా, ఒకే సర్వే నంబరును మాత్రమే సాఫ్ట్వేర్ గుర్తించిందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే భంజ్దేవ్ మాట్లాడుతూ రైతులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు గుమ్మిడి సంద్యారాణి, ఎంపీపీ బోను ఈశ్వరమ్మ, పీఏసీఎస్ అధ్యక్షుడు రెడ్డి సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాకి రంగ, లయన్స్క్లబ్ చైర్మన్ అభ్యర్థి గొర్లె మాధవరావు తదితరులు పాల్గొన్నారు. -
సాలూరులో బాణాసంచా పేలుడు
విజయనగరం: దీపావళి పండగ పురస్కరించుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణిచగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు చిన్నవీధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రుల తీరు బాధించింది!
సాలూరు:రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు వ్యవహరించిన తీరు తనతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ ఎంతగానో బా ధించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూ టీ ఫ్లోర్లీడర్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. వచ్చే సమావేశాల్లోనైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలపై చర్చించేలా చూడాలని కోరారు. గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు మూడు సభల్లో పాల్గొన్నానని, కానీ ఎప్పుడూ ఇలాంటి సభను చూడలేదన్నారు. మంత్రులు మాట్లాడే తీరు చాలా బాధి కలిగించిందని చెప్పారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సిన మంత్రులు అవమానకరంగా మాట్లాడడం, సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. బ్లాక్ మెయిల్కు దిగడం విచారకరమన్నారు. అందుకే తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షా ...ప్రభుత్వంలో ఉన్నది మేమా, లేక టీడీపీ వాళ్లా అన్న అనుమానం కలుగుతోందని స్పీకర్ను ప్రశ్నించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. పతి పక్షం, ప్రభుత్వంపై సమస్యలపై దాడి చేయడం పరి పాటని, కానీ ప్రజా సమస్యలు అడిగిన ప్రతిపక్షంపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం శోచనీయమన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు తమ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా బ్లాక్ మెయి ల్కు దిగుతున్నారన్నారు. గృహ నిర్మాణ రుణాలు మంజూరు కాక, మం జూరైన వారికి బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందు లు గురువుతున్నారని తాను సభ దృష్టికి తీసుకువెళితే జిల్లాకు చెందిన మంత్రి మృణాళిని సాలూరు నియోజకవర్గంలో కూడా అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారన్నారు. అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి కాని లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తాను తిప్పికొట్టాల్సి వచ్చిందన్నారు. ఇదే తీరు ప్రతి పక్ష సభ్యులందరిపైనా మం త్రులు కనపరిచారన్నారు. ఎంతసేపూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారే గాని ఆయనపై కేసులు విచార ణ దశలో ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోకుండా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూ డా చాలా ఆరోపణలున్నాయని, వాటిపై సీబీఐతో విచారణ జరిపించుకుని మచ్చలేని నాయకుడిగా నిరూపించుకున్నప్పుడే జగన్ను విమర్శించే నైతిక హక్కు టీడీపీ నాయకులకు ఉంటుందని తెలిపారు. ఏమీ లేకపోతే చంద్రబాబుపై విచారణకు హైకోర్టులో స్టే తెచ్చుకోవాల్సిన పని ఏమొచ్చిందని ప్రశ్నించారు. మొదటిసారిగా ఎన్నికైన గిరిజన ఎమ్మెల్యేలను శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశార న్నారు. తమది రైతు ప్రభుత్వమని చెబుతున్న టీడీపీ నాయకులు జిల్లాలోని ఎన్సీఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం దాదాపు 16 వేల మంది రైతులకు రూ. 28 కోట్ల చెల్లించకుండా రోడ్డెక్కేలా చేస్తే.. ఆ విషయమై చర్చిద్దామని సభలో అడిగితే కొట్టిపారేశారన్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహరించే తీరని ప్రశ్నించారు. మంత్రులు నిబద్దతతో వ్యవహరించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగుం టుందని సూచించారు. ఈఏడాది చివరలో జరగనున్న శాసన సభలోనైనా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. -
హత్యా రాజకీయూలు మానుకోవాలి
సాలూరు : టీడీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, సాలూ రు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. శనివారం ఆ యన అసెంబ్లీ సమావేశాల నుంచి ఫోన్లో ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే ఆయనపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు లేనిపోని ఆరోపణలకు దిగడం విచారకరమన్నారు. సభలో స్పీకర్ అనుసరిస్తున్న తీరు కూడా సరిగ్గా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వంద రోజుల కా ర్యాచరణ ప్రణాళికలో హత్యా రాజకీయాలను కూడా చేర్చినట్టుందని ఎద్దే వా చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత ప్రజా సంక్షేమంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోం దని ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. గిరిజను లు అధికంగా నివశిస్తున్న గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 25 ఏళ్లుగా ఈ డిమాండ్ ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టి ంచుకోవడం లేదన్నారు. జిల్లాలో 460 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా చేర్చాల్సి ఉందని 2012లో అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండాపోయిం దన్నారు. అలా చేయకపోవడం వల్ల గిరిజనులు రాజ్యాంగపరమైన హక్కులు కోల్పోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టంతో పాటు, పీసా చట్టం అమలుకు నోచుకోవడం లేదన్నారు. షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించడం వల్ల ఆయా గ్రామాల పరిధిలోని ఉద్యోగాలు వంద శాతం గిరిజనులకే దక్కుతాయని చెప్పారు. ప్రభుత్వపరంగా ఇస్తున్న అనేక రాయితీలు, రిజర్వేషన్ల ఫలాలు గిరిజనుల దరి చేరుతాయన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని తనతో పాటు అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు డిమాండ్ చేసినట్టు తెలిపారు. గిరిజనులకు ఏదైనా మేలు జరిగిందంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డి, ఎన్టీఆర్ హయూంలోనే జరిగిందని గుర్తు చేశారు. అలాగే పదో తరగతి పాసై ఇంటర్లో సీట్లు రాక మధ్యలో చదువు మానేస్తున్న గిరిజన విద్యార్థులపై ప్రభుత్వాన్ని నిలదీశామన్నారు. జిల్లాకు ఐదు గిరి జన గురకుల జూనియర్ కళాశాలలు మంజూరు చేయాల్సిన అవసరం వుందన్నారు. వీటిని తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. -
పాము కాటుకు...ముందు జాగ్రత్తే మందు
సాలూరు: వర్షాలు విస్తారంగా కురుస్తున్న సమయంలో అన్నదాతలే కాదు విష సర్పాలు కూడా పొలాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. గడ్డిమేటల వద్ద, తుప్పల్లోనూ ఇవి తలదాచుకుంటాయి. ఆదమరిచి వాటిని కదిలిస్తే రైతు ప్రాణానికే ప్రమాదం. అందుకే రైతులు ముందు జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. కాటేస్తే ఏం చేయాలి..? పాముకాటుకు గురైన వెంటనే పక్కన ఉన్న వారి సహకారంతో కాటు వేసిన చోటుకు పైభాగాన తాడుతో గానీ, వస్త్రంతో గానీ గట్టిగా కట్టి బిగించాలి. బాధితులను కంగారు పెట్టకూడదు. ఎంత తొందరగా వైద్యుని వద్దకు తీసుకువెళితే అంత మంచిది. సొంత వైద్యం, నాటు వైద్యం మంచిది కాదు. ప్రతి పది నిమిషాలకు కట్టును వదులు చేస్తూ ఉండాలి. భయంతోనే... ట పాము కాటుకు గురైన వారిలో అధిక శాతం మంది ఆందోళనకు గురి కావడం వల్లనే చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన వ్యక్తికి పక్కనే ఉండి ధైర్యం చెప్పడం ఎంతో అవసరం. బాధితుడు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. బాధితుడి వద్ద నానా రాద్దాంతం చేస్తే రక్త ప్రసరణ పెరిగి విషం ఇంకా వేగంగా పాకే అవకాశం ఉంటుంది. కరిచింది విష సర్పమైతే... విష సర్పాలు రెండు రకాలుగా మానవ శరీరంపై ప్రభావం చూపుతాయి. నరాలపై ప్రభావం చూపే విషాన్ని న్యూరో టాక్సిస్ పాయిజన్ అని అంటారు. ఈ తరహా విషం కోబ్రా జాతికి చెందిన నాగుపాము తదితర పాముల్లో ఉంటుంది. అలాగే నేరుగా రక్తం, గుండెపై ప్రభావం చూపే విషం కలిగిన పాములు కూడా ఉంటాయి. వీటిలో ఉన్న విషాన్ని కార్డియో టాక్సిస్ పాయిజన్గా పిలుస్తారు. ఇది పొడపాము, ఉల్లిపాముల్లో ఉంటుంది. ఒక్కోసారి కరిచింది విష సర్పమో, సాధారణమైనదో తెలిసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏ పాము విషానికైనా విరుగుడుగా పనిచేసే ఏంటీ స్నేక్ వీనమ్ మందులు వేస్తారు. ఇవి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అందుబాటులో ఉంటాయి. బాధితుడిని సాధ్యమైనంత తొందరగా ఆస్పత్రికి చేర్చితే ప్రాణాపాయం తప్పుతుంది. చాలా మంది కాటు వేసింది పామో లేక తేలో తేల్చుకోలేక అశ్రద్ధ చేయడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏది కరచినా తక్షణం వైద్య సేవలు పొందడం అనివార్యమని గుర్తుంచుకోవాలి. ఆ సమయం అర్ధరాత్రయినా, పగలైనా సరే. ఆస్పత్రిలో చేరిన తర్వాత మరణించినవారు చాలా అరుదు. పాము కాటుకు మొదట బాధ్యత వహించాల్సింది మనమే. వాటికి మనం ఏదైనా అపాయం తలపెడతామోనన్న భయంతోనే అవి కాటేస్తుంటాయి. వాటిని పొరపాటున కాలితో తొక్కేయడమో, లేక గడ్డి కోస్తున్నపుడు వాటిని పట్టుకోవడమో, తాకడమో చేయడంతోనే అవి కాటేస్తున్నాయని గుర్తించాలి. విష సర్పమేనా..? పాములన్నీ విష పూరితం కావనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పొలాల్లో తిరిగే కొన్ని పాములు కరిచినా పెద్ద ప్రమాదమేమీ ఉండదు. అందువల్ల ఏ పాము కరిచిందో వీలైతే తెలుసుకోవాలి. పాము తోక చివర బాగం సూదిగా మొనదేలి ఉంటే అది విషపుజాతి పామే. అలా కాకుండా బండదేలినట్టు, గుండ్రంగా వుంటే అది ప్రమాదరహితమేనని గుర్తుంచుకోవాలి. కాటు వేసిన చోట రెండు గంట్లు పడితే విష సర్పమే. అదే ఎక్కువ, చిన్నచిన్న గాట్లు పడితే అది విషపు జాతికి చెందనిదిగా తెలుసుకోవచ్చు. జాగ్రత్తలు అవసరం రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లేటపుడు మోకాళ్ల వరకు ఉండే గమ్ బూట్లను వేసుకుని వెళ్లడం మంచిది. పాములు కేవలం శబ్ద తరంగాలను గ్రహించి అప్రమత్తమవుతాయి. అందువల్ల శబ్దం చేసేలా అడుగులు వేయడం, ఏదోలా చప్పడు చేయడం వల్ల వాటిని గ్రహించి పాములు అప్రమత్తమై అక్కడ నుంచి వెళ్లిపోతాయి.పాదం వరకు కప్పి ఉంచే పంచెలు, లుంగీలు, ప్యాంట్లు వేసుకుని వెళ్లడం మంచిది. రాత్రిపూట పొలానికి వెళ్లాల్సి వస్తే టార్చిలైటు, కర్ర తీసుకువెళ్లడం తప్పనిసరి. కొన్ని మందులు, పాముకాట్ల నుంచి తప్పించుకునే పద్ధతులు తెలియడం కూడా అవసరమే. ఇళ్లలో ఉండే పసరు మందులు, నాటు వైద్యులు ఇచ్చే ఆకులు, అలములను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ముకోకూడదు. -
పని చేసిన అభివృద్ధి మంత్రం
సాలూరు, న్యూస్లైన్: సాలూరులో అభివృద్ధి మంత్రం బాగా పని చేసింది. తమ ప్రాంతాలను అభివృద్ధి చేసిన పీడిక రాజన్నదొరపై గిరిజన ప్రజలు నమ్మకం ఉంచారు. సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళే ఇందుకు ఉదాహరణ. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గిరిజన గ్రామాల్లో బూత్ల వారీగా పోలైన ఓట్లను పరి శీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. సాలూరు, పాచిపెంట మండలాల్లో అత్యధిక గిరి జన గ్రామాలున్నాయి. అందులో వైఎస్ఆర్ సీపీకి సా లూరు మండలంలో 3,100, పాచిపెంట మండలంలో 3వేల ఓట్లు ఆధిక్యం లభించింది. దీంతో సాలూరు మున్సిపాలిటీలో భంజ్దేవ్కు వచ్చిన దాదాపు 4వేల ఓట్ల ఆధిక్యతను రాజన్నదొర అధిగమించగలిగారు. మక్కువ మండలంలోని గిరిజన ఓటర్లు సైతం రాజన్నదొరను ఆదరించారు. నియోజకవర్గంలోని కొఠియా పోలింగ్ స్టేషన్లో అత్యల్పంగా 272 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అయినా ఆ పోలింగ్ కేంద్రంలో 158 ఓట్ల ఆధిక్యత రాజన్న వశమైంది. అలాగే కురుకుట్టి, సారిక, తోణాం, కందులపదం, పందిరిమామిడివలస, పి.కోనవలస, చెరకుపల్లి ఆలూరు, నూరువరహాలపాడు, కొండతాడూరు ఇలా గిరిజన గ్రామాల్లో మెజార్టీ ఓట్లు రాజన్నకే దక్కాయి. దీంతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి రాజన్నదొర హ్యాట్రిక్ గెలుపు సాధ్యమైంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ధనాన్ని నమ్ముకోగా, వైఎస్సార్ సీపీ మాత్రం జనాన్ని నమ్ముకుంది. దానికి తగ్గట్టే ప్రజ లు కూడా రాజన్నదొరపై నమ్మకం ఉంచి మరోసారి కుర్చీ ఎక్కించారు. -
రీపోలింగ్పై ఈసీ దిద్దుబాటు
హైదరాబాద్: విజయనగరం జిల్లా సాలూరులో రీపోలింగ్పై ఎన్నికల సంఘం(ఈసీ)తన పొరపాటును సరిదిద్దుకుంది. శాసనసభకు కాదు లోక్సభకే రీపోలింగ్ అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సాలూరులో 132 పోలింగ్ బూత్లో రీపోలింగ్ విషయమై కలెక్టర్ పొరపాటుపడ్డారు. లోక్సభ బదులు అసెంబ్లీకి రీపోలింగ్ జరపాలంటూ కలెక్టర్ ఈసీకి పొరపాటుగా నివేదిక ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆయన తన పొరపాటును గుర్తించారు. ఈ విషయం ఈసీకి తెలియజేశారు. దాంతో శాసనసభ స్థానానికి కాదు లోక్సభ స్థానానికి రీపోలింగ్ అని ఈసీ తెలియజేసింది.