sarva shiksha abhiyan
-
శ్రమదోపిడీకి గురవుతున్నాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: విద్యాభివృద్ధి కోసం ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని సర్వశిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేత నం కూడా లేకుండా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయా లని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన సమ్మె బాట పట్టా రు. రాష్ట్రవ్యాప్తంగా 19,325 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకమైనప్పటి కీ మెరిట్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంలోనే నియమితులయ్యామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో తాము ఉద్యోగ భద్రతకు అర్హత కలిగి ఉన్నామని, వెంటనే తమ ఉద్యోగాలను క్రమబదీ్ధకరించాలని కోరుతున్నారు. కనీస వేతనాలు సైతం కరువు.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు సైతం అమలు చేయడంలేదని సర్వశిక్ష ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టమ్ అనలిస్ట్లు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డీఎల్ఎంటీ, మెసెంజర్స్, మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఐఈఆర్పీఎస్, మెసెంజర్స్, సీజీవీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో స్పెషల్ ఆఫీసర్లు (పీజీ హెచ్ఎం హోదా), కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్స్ (స్కూల్ అసిస్టెంట్ హోదా), పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్స్, క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, కుక్స్, వాచ్ఉమెన్స్, స్వీపర్లు, స్కావెంజర్లు, పాఠశాల స్థాయిలో పార్ట్టైం ఇన్స్ట్రక్టర్స్(ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్), భవిత కేంద్రాల్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్లుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీరికి కేవలం రెగ్యులర్ ఉద్యోగుల వేతనాల్లో నాలుగోవంతు జీతం మాత్రమే ఇస్తున్నారు. మెసెంజర్లకు రూ.11వేలు, సీఆర్పీలకు రూ.19,350 (ఏపీలో మాత్రం రూ.26వేలు), పీజీ హెచ్ఎం స్థాయిలో ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ.32 వేలు వేతనంగా ఇస్తున్నారు. టీఏ, డీఏలు ఇవ్వడంలేదు. పైగా ఏడాదిలో 10 నెలలు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. సర్వ శిక్షలో ఇప్పటివరకు 119 మంది మరణిస్తే కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. తమను రెగ్యులరైజ్ చేయాలని, రూ.10 లక్షల బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, మహి ళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 ప్రసూతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం, 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ. 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. -
వస్త్రోత్పత్తిపై కరోనా పడగ
సిరిసిల్ల: ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ఉంది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి’. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు వివిధ పథకాల్లో వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తోంది. ఈ మేరకు బట్ట ఉత్పత్తి చేస్తూ.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. వస్త్రోత్పత్తి రంగం ముందుకు సాగుతోంది. అంతా సాఫీగానే సాగుతుందని భావిస్తున్న తరుణంలో కోవిడ్–19 మహమ్మారి వస్త్రోత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలిస్టర్ బట్టను కొనేవారు లేక వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు అందక వస్త్రోత్పత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్లకు మొత్తంగా రూ.150 కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది మూలకు పడిన రంజాన్ బట్ట రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు కానుకగా అందించేందుకు సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు 26.23 లక్షల మీటర్ల షర్టింగ్ బట్టకు ఆర్డర్లు ఇచ్చారు. 2020 జనవరి 3వ తేదీన ఆర్డర్లు ఇచ్చిన జౌళిశాఖ అధికారులు.. ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రంజాన్ బట్టను వస్త్రోత్పత్తిదారులు తయారు చేశారు. 10 లక్షల మీటర్ల బట్టను కొనుగోలు చేశారు. మరో 16.23 లక్షల మీటర్ల బట్ట కార్ఖానాల్లోనే ఉంది. ఈలోగా కరోనా లాక్డౌన్ రావడంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి చేసిన రంజాన్ బట్ట నిల్వలు పేరుకుపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నూలు, కొనుగోలు చేసి, కార్మికులకు కూలి చెల్లించి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బట్టను జౌళిశాఖ కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం రంజాన్ పండుగకు కొత్త బట్టలను పంపిణీ చేయలేదు. దీంతో సుమారు రూ.5.40 కోట్ల విలువైన నిల్వలు సిరిసిల్లలో ఉన్నాయి. ఎస్ఎస్ఏది అదే కథ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో 1.30 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. వస్త్రోత్పత్తిదారులు ఆ మేరకు బట్ట ఉత్పత్తి చేశారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం భావించి ముందే ఆర్డర్లు ఇచ్చింది. దీంతో ఉత్సాహంగా ఎస్ఎస్ఏ బట్ట ఉత్పత్తి అయింది. రూ.50 కోట్ల విలువైన బట్ట ఉత్పత్తి చేశారు. ఆరు నెలల కిందట ఈ బట్టను కొనుగోలు చేసిన జౌళిశాఖ ఇటీవల రూ.30 కోట్ల మేరకు చెల్లించింది. ఇంకా రూ.20 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి బట్టల బిల్లులు సైతం రూ.3 కోట్ల మేరకు ఇలాగే పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు బతుకమ్మ చీరల ఉత్పత్తి పెట్టుబడిగా వస్త్రోత్పత్తిదారులు అప్పులు చేయాల్సి వస్తుంది. సిరిసిల్లలో ఏడు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టకు ఆర్డర్లు ఇవ్వగా దీని విలువ రూ.350 కోట్లు. 25 వేల మరమగ్గాలు, వెయ్యి ఆధునిక ర్యాపియర్ మగ్గాలపై 225 రంగుల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. మంత్రి కేటీఆర్ వస్త్రోత్పత్తి ఆర్డర్ల బిల్లులు ఇప్పించాలని వస్త్రవ్యాపారులు కోరుతున్నారు. రూ. 30 కోట్లు ఇచ్చాం రంజాన్కు సంబంధించి కొనుగోలు చేసిన వస్త్రానికి ఇటీవల రూ.30 కోట్లు ఇచ్చాం. బతుకమ్మ చీరలను ఇప్పుడే సేకరిస్తున్నాం. దానికి ఎప్పటిలాగే పేమెంట్ ఇస్తాం. వస్త్రం క్వాలిటీ కంట్రోల్ నివేదిక వచ్చిన తరువాత గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి జీఎస్టీ బిల్లులను చూసి 10 శాతం బిల్లులను అందరికీ క్లియర్ చేస్తాం. బట్టను తీసుకున్న ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా బిల్లులు రావాల్సి ఉన్నాయి. అవి రాగానే అన్నింటినీ క్లియర్ చేస్తాం. –శైలజా రామయ్యర్, జౌళిశాఖ డైరెక్టర్ -
నిధులున్నా.. నిర్లక్ష్యమే...
సాక్షి, విజయనగరం అర్బన్: ఓ వైపు సర్కారు విద్యకు పెద్ద పీట వేస్తూ... అందులోని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశిస్తుంటే... జిల్లా అధికారులు నిర్లక్ష్యం వల్ల కేజీబీవీ విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదరికంతో డ్రాపౌట్లుగా మారిన విద్యార్థినుల కోసం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను నెలకొల్పారు. వారిపై ఎలాంటి ఆర్థిక భారం మోపకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ జిల్లా అధికారుల నిర్వహణ లోపం వల్ల విద్యార్థినులే కాస్మొటిక్ చార్జీలు భరించాల్సి వస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు వసతితోపాటు స్టేషనరీ, కాస్మొటిక్ చార్జీలు వంటివాటిని యంత్రాంగం అందించాల్సి ఉంది. కానీ పాఠశాలలు పునఃప్రారంభమై నాలుగునెలలు కావస్తున్నా జిల్లా సర్వశిక్షాభియాన్ వాటిని అందివ్వలేదు. ఇందుకు సంబంధించిన నిధులు రెండు నెలల క్రితమే జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా... పర్చేజింగ్ టెండర్ చేపట్టడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సర్కారు చొరవ చూపుతున్నా... జిల్లాలో మొత్తం 33 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో 6,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినికి రెండు జతల యూనిఫాం, పాదరక్షలు, స్టేషనరీ, వారికి అవసరమైన నోట్ పుస్తకాలు, ప్లేట్లు, పెట్టెలు, కాస్మొటిక్ వస్తువులు, పాఠ్యపుస్తకాలు వంటివి విద్యాలయాల్లోనే ఇవ్వాలి. తొలుత జిల్లా స్థాయిలోని పర్చేజింగ్ కమిటీల ద్వారానే కొనుగోలు చేసి జూన్ నెలలోనే వాటిని పంపిణీ చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రస్థాయిలో టెండర్లు వేసి అన్ని జిల్లాలకు పంపి ణీ చేశారు. దానివల్ల ఆలస్యం అవుతోందని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా స్థాయిలోనే పర్చేజ్ చేసుకోమని రెండు నెలల క్రితమే నిధులు కేటాయించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఒక్కో విద్యార్థినికి కాస్మొటిక్ వస్తువుల కోసం నెలకు రూ.125, శానిటరీ నాప్కిన్స్ కోసం నెలకు రూ.35లు ఇవ్వాలని ఆదేశించారు. కానీ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా నాలుగునెలలవుతున్నా టెండర్ ఊసే లేదు. కనీసం డబ్బులు చెల్లించలేదు. విద్యార్ధినులు తమకు అవసరమైన వస్తువులను సొంత డబ్బు వెచ్చించి బయటే కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. విద్యార్థినులపై రూ. 41.6లక్షల భారం జిల్లాలో 33 కేజీబీవీల్లో 6,500 మంది విద్యార్థినులున్నారు. గడిచిన నాలుగు నెలల్లో వారు నెలకు కాస్మొటిక్ వస్తువులకోసం రూ.125, శానిటరీ నాప్కిన్స్కి రూ.35 వంతున రూ.41.6 లక్షల ఆర్థిక భారం మో యాల్సి వచ్చింది. కాస్మొటిక్ వస్తువులు పంపిణీ అయ్యేంతవరకు దుస్తులు శుభ్రపర్చుకోవడానికి నెలకు మూడు సబ్బులు, స్నానం సబ్బులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పేస్టులు, తలకు కొబ్బరి నూనె, ముఖానికి రాసుకునేందుకు పౌడర్ డబ్బాలు, షాంపూలు, బ్రష్లు కొనుగోలు చేయాలి. అయితే నాలుగునెలలుగా వీటికి డబ్బులు రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్చేజింగ్ టెండర్ దశలో ఉంది.. కాస్మొటిక్ కిట్స్ పర్చేజింగ్ బాధ్యత గతంలో రాష్ట్రస్థాయిలో ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పర్చేజింగ్ కమిటీకి అప్పగించిం ది. నిధులు వచ్చి రెండునెలలు అయింది. గిరిజన ఉత్పత్తులు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకే ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం వాటి కొనుగోలుకు సంబంధించిన పర్చేజింగ్ టెండర్ దశలో ఉంది. – ఎం.కృష్ణమూర్తినాయుడు, పీఓ, ఎస్ఎస్ఏ బయట షాపుల్లో కొని తెచ్చుకుంటున్నాం కాస్మొటిక్ వస్తువులు ఇవ్వడంలేదు. పాఠశాల ప్రారంభం నుంచి ఆ వస్తువులను ఇంటిదగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని బయట కొనుక్కుంటున్నాను. కొందరికి డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. త్వరగా ఇస్తే బాగుంటుంది. – బి.వి.లక్ష్మి, 9వ తరగతి, విజయనగరం కేజీబీవీ. -
సర్కారు బడులకు స్వర్ణయుగం
సాక్షి, విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నూతన ప్రభుత్వం వచ్చాక భవనాలు, సౌకర్యాల పరిస్థితులను పాఠశాలల నుంచి నేరుగా ఛాయాచిత్రాల ద్వారా తీసుకొనే ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసింది. వాటిని సమకూర్చే ప్రణాళికలు ఒకవైపు జరుగుతుండగా మరో వైపు గత ప్రభుత్వం విస్మరించిన అభివృద్ధి పనులను పూర్తి చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది యూ–డైస్ ద్వారా సేకరించిన మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుగా పరిశీలించింది. గత ప్రభుత్వం మూడేళ్లుగా పట్టించుకోని మరుగుదొడ్ల, మేజర్ మరమ్మతు పనులను ముందుగా పూర్తి చేయాలని సర్వశిక్షా అభియాన్ నిర్ణయింది. ఈ చర్యల్లో భాగంగా జిల్లాలోని 128 పాఠశాలలకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. వీటిని అత్యవసర పనులుగా సర్వశిక్షా అభియాన్ చేపట్టడానికి సిద్ధమయింది. గత కొన్నేళ్లుగా కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు మోక్షం లభించినట్లయింది. అవసరమైన చోట మరుగుదొడ్లు.. జిల్లాలోని 128 స్కూళ్లకు సర్వశిక్షా అభియాన్ రూ.2.5 కోట్లు నిధులు కేటాయించింది. వీటిలో 21 స్కూళ్లకు రూ.54.60 లక్షలతో బాలురకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. జిల్లాలోని గుర్ల మండలంలో 4, పార్వతీపురం మండలలో 3 స్కూళ్లకు, జామి, వేపాడ, ఎస్కోట, భోగాపు రం, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, సాలూరు, బొబ్బిలి, గరుగుబిల్లి, జియమ్మవల స, జీఎల్పురం, కొమరాడ మండలాల్లో ఒక్కో స్కూల్కి బాలుర మరుగుదొడ్డి నిర్మాణానికి ని ధులు మంజూరయ్యాయి. అదేవిధంగా 15 పా ఠశాలల్లో రూ.39 లక్షలతో బాలికలకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. వాటిలో అత్యధికంగా సాలూరు మండలంలో 4, పార్వతీపురం, పాచిపెంట మండలాల్లో రెండేసి స్కూళ్లు, మెరకముడిదాం, గరివిడి, గరుగుబిల్లి, కురుపాం, జీఎల్పురం, కొమరాడ మండలాల్లో ఒక్కొక్క స్కూల్ను గుర్తించారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.2.6లక్షల వంతున నిధులు కేటాయించారు. 92 స్కూళ్లకు మేజర్ మరమ్మత్తులు.. జిల్లాలోని 92 పాఠశాలల్లో మేజర్ మరమ్మతులు చేపట్టేందుకు రూ.1.53 కోట్లు మంజూరయ్యాయి. ప్రధానంగా బీటలు వారిన తరగతి గదుల గోడలు, స్లాబ్లకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తరువాత ప్రహరీలు, ఫ్లోరింగ్ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. గుర్తించిన 92 స్కూళ్లలో ఒక్కోదానికి కనీసం రూ.1.2 లక్షల నుంచి అధికంగా రూ.1.8 లక్షల వరకు నిధులు మంజూరు చేశారు. మౌలిక సదుపాయాలే తొలిప్రాధాన్యం.. జిల్లా వ్యాప్తంగా గతంలో పెండింగ్లో ఉన్న పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. వాటిని తక్షణమే నిర్మించాలని జిల్లాకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. గతంలోని రెండు సంవత్సరాలలోని యూ–డైస్ ద్వారా గుర్తించిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రస్తుతం తొలి ప్రాధాన్యమిస్తాం. – ఎం.కృష్ణమూర్తినాయుడు, పీఓ, సర్వశిక్షా అభియాన్ -
రూ.74కోట్ల స్వాహాకు టీడీపీ తిమింగలాల స్కెచ్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో జరిగిన అవినీతి విచ్చలవిడిగా సాగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేశ్, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పటి సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఎస్పీడీ (స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్) జి. శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు వర్ట్యువల్, డిజిటల్ తరగతుల ఏర్పాటు పేరిట రూ.74 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారు. భారీగా ముడుపులు దండుకునేందుకు రూ.2లక్షల నుంచి 2.5 లక్షలలోపు విలువ చేసే ఒక్కో యూనిట్ పరికరాలను రూ.6.19 లక్షలకు పైగా పెంచేసి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేలా పథకం పన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల ముందు ఈ తతంగాన్ని నడిపించారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్ల పంపిణీ పేరిట రూ.45 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులకు గండిపడేలా ప్రైవేటు సంస్థలకు ఆర్డర్లు ఇచ్చిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి మర్చిపోకముందే మరో బాగోతం బయటపడింది. రూ.50 కోట్లలోపు పరికరాలకు రూ.124 కోట్ల రేటు కాగా, బూట్ల దోపిడీని తలదన్నేలా ప్రభుత్వ పెద్దలు వరŠుచ్యవల్, డిజిటల్ తరగతుల పేరిట మరో భారీ అవినీతికి తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండువేల ప్రభుత్వ స్కూళ్లలో ఈ తరగతుల ఏర్పాటు పేరుతో పెద్ద స్కెచ్చే వేశారు. ఒక్కో యూనిట్ కేవలం రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల మేర మాత్రమే విలువ చేసే ఈ పరికరాల ఏర్పాటుకు రేటును మూడు రెట్ల మేర రూ.6.19లక్షలకు అమాంతం పెంచేసి సెల్కాన్ ఇంప్లెక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారీగా ముడుపులు దండుకుని ఆర్డర్లు ఇచ్చారు. ప్రముఖ కంపెనీల నుంచి వీటిని తీసుకున్నా అంతకూడా కాదని.. పైగా అది సెల్కాన్ కంపెనీ కాబట్టి పరికరాలు ఇంకా తక్కువ ధరే ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. మొత్తం రూ.50కోట్లలోపే విలువచేసే పరికరాలకు దాదాపు రూ.124కోట్లు చెల్లిస్తున్నారు. కాగా, మెలూహ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ కథను నడిపించారు. పనిచేయని పరికరాలు ఇదిలా ఉంటే.. 90 రోజుల్లోగా వీటిని ఏర్పాటుచేయించాలని ఒప్పందంలో షరతు విధించారు. కానీ, గడువు ముగిసినా కేవలం 780 స్కూళ్లకు మాత్రమే అందించారు. ప్రస్తుతం ఈ పరికరాలు పనిచేయకపోవడంతో అవన్నీ వృధాగా పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. అవినీతి రహిత పాలన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఈ డిజిటల్ పరికరాల బాగోతం వెలుగుచూసింది. దీంతో ఈ ఆర్డర్ను నిలిపివేయాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీగా బాధ్యతలు స్వీకరించిన వాడ్రేవు చినవీరభద్రుడు జులై 4న ఆదేశాలిచ్చారు. ఇది పసిగట్టిన టీడీపీ పెద్దలు రద్దు ఉత్తర్వులు రాకముందే సెల్కాన్, మెలూహ కంపెనీల ద్వారా హడావుడిగా మిగిలిన స్కూళ్లకు కూడా డిజిటల్ పరికరాలను ఆఘమేఘాల మీద డంప్ చేయించారు. పరికరాలు పంపిణీ పూర్తయినందున రూ.124 కోట్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో సర్వశిక్ష అభియాన్ దీనిపై నివేదికను ఇటీవల ప్రభుత్వానికి పంపింది. నిధుల కేటాయింపు లేకుండానే ఆర్డర్ నిజానికి వర్ట్యువల్, డిజిటల్ పరికరాల పంపిణీ ఒప్పందం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టమవుతోంది. ఎస్ఎస్ఏ ద్వారా ఏ పని చేపట్టాలన్నా అందుకు సంబంధించి ఆ సంస్థ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) నివేదికలో పొందుపరిచి ఉండాలి. కానీ, అలా జరగకపోవడమే కాక నిధుల కేటాయింపు కూడా లేకుండానే పంపిణీ ఆర్డర్ ఇచ్చేశారు. ఈ పరికరాల రేటు కూడా నిబంధనల ప్రకారం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాక.. పేద పిల్లలకు వినియోగించాల్సిన ఇతర కార్యక్రమాల నిధులనూ దీనికోసం దారిమళ్లించేలా అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఎస్ఎస్ఏ ఎస్పీడీ చేసినట్లు సమాచారం. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. కాగా, 2014లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇది లోకేశ్కు బినామీ కంపెనీ అన్న ఆరోపణలున్నాయి. ఈ సంస్థకు డిజిటల్, వర్ట్యువల్ తరగతుల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అనుభవమూ, సాంకేతిక పరిజ్ఞానమూ లేదు. దీంతో సెల్కాన్ ఇంప్లెక్స్ సంస్థను ముందు పెట్టి ఈ కంపెనీతో ఒప్పందాన్ని చేయించారు. రెండువేల స్కూళ్లలో ఈ డిజిటల్ తరగతుల పరికరాల ఏర్పాటు ఆర్డర్ను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు మార్చి 9న అప్పటి ఎస్ఎస్ఏ ఎస్పీడీ జి. శ్రీనివాస్ ఇచ్చారు. -
మా కొడుకు జాడ చెప్పండి
సాక్షి, పెద్దపల్లి : జిల్లా విద్యాశాఖలోని సర్వశిక్ష అభియాన్ విభాగంలో డివిజినల్ లెవల్ మానిటరింగ్ టీం మెంబర్ (డీఎంఎల్టీ)గా పనిచేస్తున్న ఎలగందుల రమేశ్ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. లేఖ రాసి గత శనివారం నుంచి ఆచూకీ లేకుండా పోయిన అతని ఉదంతం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రమేశ్ జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకొడుకు ఆచూకీ చెప్పాలంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు రమేశ్ చిత్రపటాలతో మంగళవారం ఆందోళనకు దిగారు. తమ కుమారుడు కనిపించకుండా పోవడానికి కారణమైన జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ కుమారుని ఆచూకీ దొరికే వరకు కదిలేది లేదని కార్యాలయం ఎదుట భీష్మించుకు కూర్చున్నారు. బాధ్యులను సస్పెండ్ చేయాలి.. తనకు రావాల్సిన సెక్టోరల్ అధికారి పోస్టును ఇతరులకు ఇప్పించడంతో మనస్థాపానికి గురైన ఎలగందుల రమేశ్ నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తన చావుకు కారణం జీసీడీవో పద్మ పేరును ప్రస్తావిస్తూ లేఖను రాసిన విషయం విధితమే. కుటుంబ సభ్యులకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచారు. రమేశ్కు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈవో జగన్మోహన్రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించి జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని కోరారు. స్పందించిన డీఈవో ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. కలిచివేసిన కన్నీళ్లు.. రమేశ్ ఆచూకీ కోసం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. రమేశ్ తల్లి మధునమ్మ తన కొడుకును క్షేమంగా తనకు అప్పగించాలని గుండెలవిసేలా రోధించింది. తాము పేదవాళ్లమని, అందుకే పోలీసులు, అధికారులు తమ కొడుకు కనిపించకుండా పోయినా పెద్దగా పట్టించుకోవడం లేదని క్షేమంగా వస్తే చాలని వేడుకుంది. రమేశ్ తమ్ముడు, చెల్లె, బంధువులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. -
సర్వశిక్షా అభియాన్లో అచ్చెంగా అవినీతి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్వశిక్షా అభియాన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకాల్లో ‘అచ్చెం’గా అక్రమాలు జరిగాయి. అచ్చెన్న...శీనన్న పేరు చెప్పి పోస్టులమ్మేసుకున్నారు. నాటి మంత్రుల కనుసన్నల్లోనే తంతంగం జరగడంతో కలెక్టర్ అనుమతి లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. అధికారులెవ్వరికీ తెలీకుండానే జాయిన్ చేసేసుకున్నారు. ఒక రోజున నాటి కలెక్టర్ ఆరా తీసే సరికి వారి బాగోతం బయటపడింది. తమ దృష్టికి తీసుకురాకుండా ఎలా నియమించారని ప్రశ్నించేసరికి అనుమతుల కోసం హడావుడిగా ఫైలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 3కోట్ల వరకు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. పద్ధతికి విరుద్ధంగా.. సాధారణంగా ఔట్ సోర్సింగ్ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఖరారు చేసే బాధ్యతలను కలెక్టర్ల నుంచి తప్పించి ప్రభుత్వమే ఏకపక్షంగా ఔట్ సో ర్సింగ్ ఏజెన్సీలను ఖరారు చేసింది. ఖరారు చేసిన ఏజెన్సీలు ఎప్పటినుంచో పనిచేస్తున్నవనుకుంటే పప్పులో కాలేసినట్టే. టీడీపీ నేతల బినామీ ఏజెన్సీలుగా అప్పటికప్పుడు ఏర్పాటైనవే. ఏ జిల్లాకు ఏ ఏజెన్సీకి, ఏ శాఖ ల ఔట్ సోర్సింగ్ పోస్టులు అప్పగించాలన్నది అమరావతి స్థాయిలోనే కేటాయింపులు చేసి జిల్లాలకు వాటి ఉత్తర్వులకు పంపించేవారు. ఇంకేముంది టీడీపీ మంత్రుల కనుసన్నల్లో ఆ పార్టీ నేతల బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కొక్క పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. ఏజెన్సీల ముసుగులో చెలరేగిపోయిన టీడీపీ నేతల బినామీలు.. సర్వశిక్షా అభియాన్ ఔట్సోర్సింగ్ పోస్టులు కూ డా టీడీపీ నేతల బినామీ ఏజెన్సీ ద్వారా అమ్ముకున్నారు. అయితే, తీగలాగితే డొంక కదిలినట్టు సర్వశిక్షా అభియాన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకాలను లోతుగా పరిశీలిస్తే నాటి ప్రభు త్వ ఘన కార్యం, పాలకుల నిర్వాకం, అధికా రుల తీరు కళ్లకు కట్టినట్టు స్పష్టమవుతోంది. గత డిసెంబర్లో 177 ఔట్ సోర్సింగ్ పోస్టులు వేసుకునేందుకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. అంతటితో ఆగకుండా ఆ పోస్టుల నియామక బాధ్యతలను స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీకి అప్పగించింది. ఆ మేరకు జిల్లా అధికా రులకు ఉత్తర్వులు పంపించింది. దీంతో 177పోస్టులకు అర్హత గల అభ్యర్థులను సమకూర్చాలని ఆ ఏజెన్సీకి నాటి కలెక్టర్ ధనుంజయరెడ్డి ఇండెం ట్ ఇచ్చారు. ఇంకే మంచి అవకాశం వచ్చిందని స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ ముసుగులో జిల్లా వ్యాప్తంగా బేరసారాలు జరిగాయి. లక్షల్లో పోస్టులకు ధర పలికింది. నిరుద్యోగం తీవ్రంగా ఉండటంతో అత్యధిక మంది అభ్యర్థులు సంప్రదింపులు చేసుకుని ముడుపులు ముట్ట జెప్పారు. ఇంకేముంది కొన్ని పోస్టులను పద్ధతిగా నియామకాలు చేసి, చాలా వరకు పోస్టులను అమ్మకాల ద్వారా నియామకాలు చేశారు. కలెక్టర్ అనుమతి లేకుండా 140 పోస్టులకు జాయినింగ్.. ఏజెన్సీ చేపట్టిన నియామకాల అభ్యర్థుల జాబి తాను కలెక్టర్కు అందజేసి, వారి అనుమతితో జాయిన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ 140 పోస్టులకు సంబంధించి అనుమతి తీసుకోకుండా నేరుగా జాయిన్ చేసుకున్నారు. కలెక్టర్కు తెలీకుండా తంతు అంతా నడిచిపోయింది. ఈ విషయాన్ని నాటి కలెక్టర్ ధనుంజయరెడ్డి ఆలస్యంగా తె లుసుకున్నారు. దీంతో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. 140 పోస్టులకు అనుమతి తీసుకోకుండా ఎలా జాయిన్ చేసేశారని నిలదీయడంతో అప్పటికప్పుడు హడావుడిగా ఫైల్ పెట్టారు. ఇదంతా ఫిబ్రవరిలో జరిగింది. ఇంతలో కలెక్టర్ ధనుంజయరెడ్డికి బదిలీ అయిం ది. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ హయాంలో వాటి కి అనుమతి లభించింది. ఈ లెక్కన డిసెంబర్లో జాయిన్ చేసుకుని ఫిబ్రవరి వరకు కలెక్టర్కు తెలీకుండా వారందరినీ కొనసాగించినట్టుగా భావించాలి. అలా ఎందుకు చేశారో నాటి సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసరే చెప్పాలి. ఇదంతా పాలకులు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ, సర్వశిక్షా అభియాన్ అధికారులు గూడు పుఠాణై నడిపిన బాగోతమే అన్నది తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో రూ. 3కోట్ల వరకు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
ఎన్నికల నిబంధనలు ఔట్.. అవినీతికి భలే సోర్సింగ్
ఔట్ సోర్సింగ్ పోస్టులు.. ప్రైవేటు ఏజెన్సీల ఇష్టారాజ్యాలు.. ఎన్నికల కోడ్ సమయంలోనూ గుడ్లు పెట్టిన అవినీతి బాతులు.. నియామక పత్రాలపై అధికారుల సంతకాలు.. గత ప్రభుత్వ పెద్దలు వెళుతూ వెళుతూ చేపట్టిన అడ్డగోలు బాగోతాలకు సజీవ సాక్ష్యాలు.. ప్రస్తుత కలెక్టర్ జె.నివాస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారికి సహకరించిన వారి ఆట కట్టింది. 37మందిపై వేటు పడింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల దందా అంతా కాదు. టీడీపీ నేతల బినామీలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలుగా అవతారమెత్తి, వారికి వివిధ శాఖల్లో ఉన్న పోస్టులను తాత్కాలిక పద్ధతిలో నియమించుకునే అధికారాన్ని దక్కించుకున్నారు. ఇంకేముంది చేతికొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను పట్టుకుని ఇష్టారీతిన నియామకాలు చేపట్టారు. నచ్చి నంత రేటు పెట్టి, పోస్టులు భర్తీ చేశారు. దాదా పు ప్రతి శాఖలో ఇదేరకంగా జరిగింది. కొంతవరకు నిబంధనలు అమలు చేసినా చాలావర కు ముడుపులే కొలమానంగా తీసుకుని నియామకాలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉం డగా సర్వశిక్షా అభియాన్లో చేపట్టిన నియామకాలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. సర్వశిక్షా అభియాన్లో ఏజెన్సీ అడ్డగోలు దందా.. సర్వశిక్షా అభియాన్లో గతేడాది 177 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ పోస్టులకు అభ్యర్థులను సరఫరా చేసే బాధ్యతను స్కాట్లాంట్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించింది. ఇంకేముంది అప్పట్లో సదరు ఏజెన్సీ చెలరేగిపోయింది. నియామకాల కోసం బేరసారాలు సాగించింది. కొంతవరకు పద్ధతిగా నియామకాలు చేపట్టగా, మరికొన్ని నియామకాల విషయంలో ముడుపులు ప్రామాణికంగా తీసుకుంది. వాస్తవానికైతే, ఆ నియామకాలు జరిగిన విధానంతో జిల్లా అధికారులకు సంబంధం లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక చేసిన అభ్యర్థులు నిబంధనల మేరకు ఉన్నారా లేదా అన్నది చూసుకుని ఉన్నతాధికారుల అనుమతితో సర్వశిక్షా అభియాన్ అధికారులు జాయిన్ చేసుకుంటారు. ఈ విధంగా తొలి విడతగా 140మందిని జాయిన్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా రెండో విడత నియామకాలకొచ్చేసరికి ఉల్లంఘనకు దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామకాలు.. దాదాపు 37మందిని ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జాయిన్ చేసుకున్నారు. వీరి నియామకాల ఉత్తర్వులపై 2019 ఫిబ్రవరి 18 తేదీ కూడా పేర్కొని ఉంది. వారిని జాయిన్ చేసుకున్నట్టుగా 2019 మార్చి 18న నియామక ఉత్వర్వులపై ప్రస్తుత పీఓ శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. వాస్తవానికైతే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎటువంటి నియామకాలు చేపట్టకూడదు. అలాంటిది స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చిన ఉత్తర్వులపై పీఓ సంతకం చేయడం అనుమానాలకు తావిచ్చింది. దీనికంతటికీ అప్పుడే బదిలీపై వచ్చిన పీఓపై నాటి పాలకుల ఒత్తిడి, ప్రలోభాలే కారణమని తెలుస్తున్నది. అసలు ఈ అడ్డగోలు దందాకు తెరలేచింది గత పీఓ హయాంలోనని స్పష్టమవుతున్నది. ఆయన కాలంలోనే అన్నీ జరిగిపోగా, నియామకాలకు అనుమతి ఇవ్వాల్సివచ్చేసరికి బదిలీపై వెళ్లడంతో ఆ ప్రభావం తర్వాత వచ్చిన పీఓపై పడింది. ఏదేమైనప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చిన నియామక ఉత్తర్వులపై సంతకం చేయడం ప్రస్తుత పీఓను బోనులో నిలబెట్టింది. 37 మందిపై వేటు.. వాస్తవానికి రెండో విడతగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ చేపట్టిన 37 నియామకాలకు సంబంధించి స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. కానీ వీరి విషయంలో అదేమీ జరగలేదు. ఏకపక్షంగా నియామకాలు చేపట్టేసి, విధుల్లోకి కూడా తీసుకున్నారు. దీంతో వారంతా అనధికారిక వ్యక్తులుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో వారికి జీతాలు విడుదల కాలేదు. అసలు అధికారిక అనుమతితో నియామకాలే జరగనప్పుడు వారికి జీతాలు ఎలా వస్తాయన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వ్యవహారం ప్రస్తుత కలెక్టర్ జె.నివాస్ దృష్టికి వెళ్లింది. జరిగినదంతా పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామకాలు చేపట్టడమేంటని, నిబంధనలకు విరుద్ధమని వారందరీ నియామకాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఇంకేముంది అనుమతి లేని 37మందిపై వేటు పడింది. వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. నియామక ఉత్తర్వులపై సంతకాలు చేశాక, రెండు మూడు నెలలు పనిచేశాక తొలగించడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్తామని గగ్గోలు పెడుతున్నారు. సర్వశిక్షా అభియాన్ను వెంటాడుతున్న ఆరోపణలు.. సర్వశిక్షా అభియాన్ను నిత్యం ఆరోపణలు వెంటాడుతున్నాయి. నాటి నాన్ టీచింగ్ నియామకాలతోపాటు ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ కళాశాలల పార్ట్టైమ్ ఉద్యోగాల నియామకాల విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల్లో చేతులు మారాయన్నది సర్వసాధారణమైన ఆరోపణ అయిపోయింది. ఇవి ఒకవైపు ఉండగా, మరోవైపు బదిలీల రగడ కూడా ఇబ్బందికరంగా మారింది. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండానే ఇష్టమొచ్చినట్టు బదిలీలు చేసేశారని విమర్శలొచ్చాయి. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై శాఖాపరమైన విచారణకు ఉపక్రమించినట్టు తెలిసింది. సర్దుబాటు మాత్రమే చేశాను.. ఎన్నికలకు ముందు జిల్లాకు వచ్చాను. అప్పటికే ఉన్నవారిని ఇతరత్రా అవసరాల కోసం సర్దుబాటు చేశాను. అంతే తప్ప ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన నియామకాలపై నేనెటువంటి సంతకం చేయలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు 37మంది నియామకాలను రద్దు చేశాం. – బి.శ్రీనివాసరావు, సర్వశిక్షా అభియాన్ పీఓ ఎన్నికల కోడ్ విరుద్ధ నియామకాల రద్దు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామకాలు చేపట్టారు. ఆ 37 నియామకాలను రద్దు చేశాను. అనుమతి లేకుండానే వారి నియామకాలు చేపట్టారు. తర్వాత జరిగిన నియామకాలపై పరిశీలిస్తాను. –జె.నివాస్, కలెక్టర్ -
ఎస్ఎస్ఏ పోస్టులకు పైరవీలు
సాక్షి, నెల్లూరు (టౌన్) : సర్వశిక్ష అభియాన్ పోస్టులకు జోరుగా పైరవీలు జరుగుతున్నాయి. పోస్టును దక్కించుకునేందుకు పలువురు జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సర్వశిక్ష అభియాన్లో అవుట్ సోర్సింగ్ కింద 102 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ బాధ్యతను రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించింది. దీంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోస్టును రూ.2 నుంచి రూ.3లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడంతో అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మెరిట్ ప్రకారం జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పోస్టులపై కదలిక వచ్చింది. రూపేష్ సంస్థ ఒక జాబితాను సిద్ధం చేసి సర్వశిక్ష అభియాన్కు పంపింది. ఈ జాబితాలో నగదు తీసుకుని అనర్హుల పేర్లును చేర్చారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. కాగా పోస్టులను దక్కించుకునేందుకు పలువురు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. 102 పోస్టుల భర్తీ సర్వశిక్ష అభియాన్లో అవుట్ సోర్సింగ్ కింద 102 పోస్టులను భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నవంబరు 11న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల భర్తీ బాధ్యతను రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించింది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.14 వేల నుంచి రూ.21వేల వరకు వేతనం ఇవ్వనున్నారు. ఎస్ఎస్ఏలో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీపీఓ)–1, డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఎంఆర్సీ)–1, ఎంఐఎస్ కోఆర్డినేటర్–1, డీఎల్ఎంటీఎస్–1, కేజీబీవీ అటెండర్–1, సీఆర్పీలు–27, ఆర్ట్ ఎడ్యుకేషన్–20, వర్క్ ఎడ్యుకేషన్–5, పీఈటీలు–45 పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టుల విద్యార్హతను నోటిఫికేషన్లో ప్రకటించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆరోపణలతో నిలిపివేత సర్వశిక్ష అభియాన్ అవుట్ సోర్సింగ్ పోస్టుల నియామకంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పోస్టుకు రూ.2లక్షలు నుంచి రూ.3 లక్షల వరకు ఏజెన్సీ నిర్వాహకులు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి కలెక్టర్ ముత్యాలరాజు తాత్కాలికంగా పోస్టుల భర్తీని నిలిపివేశారు. మెరిట్ ప్రకారం జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు జిల్లాల్లో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. మళ్లీ ఈ పోస్టులపై కదలిక వచ్చింది. పోస్టులను భర్తీ చేయాలని మార్చిలో రాష్ట్ర సర్వశిక్ష అభియాన్కు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో పోస్టుల నియామకాన్ని పూర్తి చేశారు. జిల్లాలో మాత్రం నియామకాలను చేపట్టలేదు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పోస్టుల భర్తీని నిలిపివేశామని ఎస్ఎస్ఏ అధికారులు చెబుతున్నారు. జోరుగా పైరవీలు సర్వశిక్ష అభియాన్లో అవుట్సోర్సింగ్ పోస్టుల నియామకాలపై జోరుగా పైరవీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు పోస్టును దక్కించుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల ద్వారా రూపేష్ సంస్థకు నగదు ఇచ్చినట్లు సమాచారం. వారంతో ఇప్పుడు పోస్టులు ఇవ్వాలంటూ రూపేష్ సంస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. మరికొందరు అభ్యర్థులు నాయకుల ద్వారా జిల్లా ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. రూపేష్ సంస్థ నిర్వాహకులు మాత్రం రెండు నెలల క్రితమే జాబితాను ఎస్ఎస్ఏ అధికారులకు చేర్చామంటూ చెబుతున్నారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఎస్ఎస్ఏ అధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్ వద్దకు ఇంకా జాబితాను చేర్చలేదు. ఈ జాబితాపై కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. పోస్టుల భర్తీ నియామకంలో పైరవీలకు అవకాశమిస్తారో లేక మెరిట్ జాబితాను సిద్ధం చేసి అర్హత ఉన్న అభ్యర్థులకే పోస్టులు ఇస్తారో వేచి చూడాల్సిందే. వివరాలను పరిశీలించాల్సి ఉంది రెండ్రోజుల క్రితమే ఇన్చార్జి పీఓగా బాధ్యతలు తీసుకున్నా. ఔట్ సోర్సింగ్ నియామకాల వివరాలు తెలియదు. త్వరలో పోస్టుల నియామకాలపై కలెక్టర్ను సంప్రదించి అర్హులైన అభ్యర్థులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. – జనార్దనాచార్యులు, ఇన్చార్జి పీఓ, ఎస్ఎస్ఏ -
ఏమిటీ శిక్ష?
సాక్షి, విజయనగరం: సర్వశిక్ష అభియాన్లో ఔట్ సోర్సింగ్ విధానంలో నాన్ టీచింగ్ స్టాఫ్గా ఎంపికైన యాభై ఎనిమిది మందికి నేటికీ నియామక పత్రాలు అందలేదు. గతంలో ప్రాజెక్టు ఆఫీసర్ చేపట్టిన నియామకాలపై అభ్యంతరాలున్నాయని ప్రస్తుత పీఓ అంటుంటే ... జిల్లా కలెక్టర్ అనుమతిచ్చినా ప్రాజెక్టు ఆఫీసర్ అడ్డుతగులుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. నిజానికి సమాధానం చెప్పాల్సిన ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ముఖం చాటేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. చేసేది లేక అభ్యర్థులంతా సర్వశిక్ష అభియాన్ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. జిల్లాలో సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలోని కేజీబీవీ పరిధి వివిధ కేటగిరీలో ఉన్న నాన్ టీచింగ్ 134 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి గతేడాది ఎంపిక ప్రక్రియ చేపట్టి, పూర్తి చేశారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ 58 మందిని వివిధ పోస్టులకు ఎంపిక చేసి జిల్లా కలెక్టర్కు అప్పగించింది. గతేడాది డిసెంబర్లో కలెక్టర్ ఆ జాబితా ను అనుమతించారు. ఈ మేరకు 58 మంది అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా అదే నెలలో విడుదల చేశారు. శాపంగా మారిన పాత పీఓ బదిలీ ఈ నియామక ప్రక్రియ జరిగిన సమయంలో ఎస్ఎస్ఏ పీఓగా ఉన్న బి.శ్రీనివాసరావు రాజకీయ కారణాలతో బదిలీ అయ్యారు. అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరా వు, కిమిడి కళావెంకటరావు మధ్య జరిగిన అంతర్యుద్ధ్ధం లో భాగంగా ప్రస్తుత పీఓ ఎం.కృష్ణమూర్తి నాయుడు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన వచ్చేనాటికే సిద్ధమైన 58 మంది జాబితాను విడుదల చేయకుండా రెండు నెలల పాటు తాత్సారం చేశారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ వెంటనే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చాయి. ఫలితంగా నియామక ఆదేశాలున్నప్పటికీ అభ్యర్థులకు పోస్టులు రాలేదు. ఇతర జిల్లాల్లో వీరితోపాటే ఎంపిక చేసిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి నా... ఇక్కడే పెండింగ్లో ఉండిపోయింది. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఎంపికైన అభ్యర్థులు పలుమార్లు కలెక్టర్ను కలిశారు. అప్పటి ఆదేశాల మేరకు పోస్టులను పీఓ ఇస్తారని ఆయన చెప్పడంతో అభ్యర్థులు పీఓ కృష్ణమూర్తి నాయుడు వద్దకు వెళ్లారు. కానీ అక్కడ వారికి ప్రతికూల సమాధానం వచ్చింది. తమకు న్యా యం చేయాలని వారంతా సర్వశిక్షాభియాన్ చుట్టూ తిరుగున్నారు. ఈ క్రమంలో ఈ నెల 30వ తేదీతో పాత ఏజెన్సీల కాలపరిమితి ముగుస్తుందని ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి వారు కలెక్టరేట్ గురువారం వచ్చి కలెక్టర్ని కలిసి వేడుకున్నారు. కొత్తగా ఆదేశాలివ్వక్కర్లేదని అప్పటి ఆదేశాలతో పోస్టులను పీఓ ఇవ్వాలని అభ్యర్థులకు కలెక్టర్ హరిజవహర్లాల్ వివరించారు. వారు మళ్లీ పీఓ వద్దకు వెళ్లారు. అక్కడ వారికి పాతకథే ఎదురైంది. అయితే గత పీఓ చేపట్టిన నియామక ప్రక్రియలో అభ్యం తరాలున్నాయని ప్రస్తుత పీఓ కృష్ణమూర్తి చెబుతున్నారు. అభ్యర్థులు న్యాయం అడగాల్సింది ఔట్సోర్సింగ్ ఏజెన్సీని లేదా పాత అధికారినేగాని తనను కాదని ఈయన చెబుతున్నారు. మొత్తమ్మీద వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
రెగ్యులర్ టీచర్లు ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పారా టీచర్ సహా ఏ రకమైన పేరుతో తాత్కాలిక టీచర్లు ఉన్నా ఆ వ్యవస్థను తొలగించాల్సిందేనని నూతన విద్యా విధానం ముసాయిదా రూపొందించిన కమిటీ సిఫారసు చేసింది. ‘సమాజంలో సుదీర్ఘకాలం ఉండే బలమైన బంధాన్ని కల్పించేది విద్యా వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో టీచర్లే కీలకం. పారా టీచర్, శిక్షా కర్మి, శిక్షా మిత్ర తదితర పేర్లతో ఉండే తాత్కాలిక టీచర్లు ఆ పనిని పక్కాగా చేపట్టలేరు. అందుకే 2022 నాటికి తాత్కాలిక టీచర్ల వ్యవస్థను రద్దు చేయాల్సిందే’అని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో గతంలో పారా టీచర్ల వ్యవస్థ ఉన్నా, సర్వ శిక్షా అభియాన్ వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో విద్యా వలంటీర్ల పేరుతో ఉపాధ్యాయ ఖాళీల్లో తాత్కాలిక టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపడుతోంది. రెగ్యులర్ టీచర్ల నియామకాలు ఆలస్యమైనప్పుడు, నియామకాలు సకాలంలో చేపట్టలేకపోయినప్పుడు, పాఠశాలల్లో టీచర్ల అవసరం ఏర్పడినప్పుడు విద్యా వలంటీర్లను నియమించి ప్రభుత్వం విద్యా బోధనను కొనసాగిస్తోంది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందాలన్నా, సమాజ నిర్మాణం సరిగ్గా ఉండాలన్నా రెగ్యులర్ టీచర్లతోనే సాధ్యం అవుతుందని కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లుగా లేని నియామకాలు.. రాష్ట్రంలో 2012 డీఎస్సీ నియామకాల తరువాత కొత్త టీచర్లు బడులకు రాలేదు. 2017లో నోటిఫికేషన్ జారీ చేసి 8,792 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినా నియామకాలు పూర్తి కాలేదు. న్యాయ వివాదాలు, ఎలక్షన్ కోడ్ పేరుతో కొన్నాళ్లు, విద్యా శాఖ అధికారులు పట్టించుకోక మరికొన్నాళ్లు ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్ వంటి కొన్ని పోస్టుల భర్తీ వ్యవహారం కూడా న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. దీంతో పోస్టుల భర్తీ ఆలస్యం అవుతూనే ఉంది. వివాదాలు లేని పోస్టుల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో బడులకు కొత్త టీచర్లు రాలేని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి వేలల్లో విద్యా వలంటీర్లు.. రాష్ట్రంలో గత ఏడేళ్లుగా రెగ్యులర్ టీచర్లు లేకపోవడంతో విద్యా వలంటీర్లతోనే పాఠశాలలను కొనసాగించాల్సి వస్తోంది. ఏటా కనీసం పది వేల మందికి తగ్గకుండా విద్యా వలంటీర్లను నియమిస్తూ పాఠశాలల్లో విద్యా బోధనను విద్యాశాఖ కొనసాగిస్తోంది. ఉపాధ్యాయ ఖాళీలు, అదనపు అవసరం ఉన్న స్కూళ్లలో మొత్తంగా గతేడాది 15,661 మంది విద్యా వలంటీర్లను నియమించి విద్యా బోధనను కొనసాగించిన విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే చర్యలు చేపట్టింది. చివరకు విద్యా వలంటీర్ల నియామకం విషయంలోనూ కోర్టు ఆదేశాలు ఇస్తే తప్ప ముందుగా నియమించలేని పరిస్థితికి చేరుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది కూడా గతేడాది నియమించిన విద్యా వలంటీర్ల సంఖ్యకు మించకుండా నియమించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో విద్యా వలంటీర్ల రెన్యువల్కు చర్యలు చేపట్టింది. సిఫారసుల మేరకైనా వేగవంతం చేయాలి.. రాష్ట్రంలోని పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్ల నియామకం విషయంలో గత ఏడేళ్లుగా తంటాలు తప్పడం లేదు. చివరకు హైకోర్టు జోక్యం చేసుకున్నా నియామకాల వ్యవహారం ముందుకు సాగడం లేదు. మహబూబ్నగర్లో టీచర్లు లేరంటూ హైకోర్టులో పిల్ దాఖలు అవ్వడంతో ప్రభుత్వం స్పందించి తాత్కాలికంగా విద్యా వలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తోంది. ప్రస్తుతం నూతన విద్యా విధానం ముసాయిదాలో 2022 నాటికి ఎలాంటి పేరుతోనూ తాత్కాలిక టీచర్లు ఉండొద్దని, ఆ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని, రెగ్యులర్ టీచర్లు ఉండాల్సిందేనని పేర్కొంది. అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత అయినా రాష్ట్రంలో రెగ్యులర్ టీచర్ల నియామకాలు వేగవంతం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అడ్డగోలు దోపీడీ
-
సమగ్ర (ఆకలి)శిక్షా అభియాన్ !
చిత్తూరు, పీలేరు : సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న కాం ట్రాక్ట్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. రెం డు నెలలుగా జీతాలు అందకపోవడంతో అతికష్టం పై బతుకు బండిని లాక్కొస్తున్నారు. జీతాలు ఎప్పు డు ఖాతాల్లో జమవుతాయోనని నిరీక్షిస్తున్నారు. జిల్లా సమగ్ర శిక్షా అభియాన్లో 807 మందికిపైగా పనిచేస్తున్నారు. వారిలో 350 మంది సీఆర్పీలు, 66 మంది ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, 66 మంది డేటా ఎంట్రీలు, 325 మంది పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లు, 120 మంది ఐఈఆర్టీ ఉపాధ్యాయులు, 66 మంది మెసెంజర్లు, 10 నుంచి 12 మంది డివిజనల్ మానిటరింగ్ బృందం, మరి కొంత మంది జిల్లా సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. సీఆర్పీలకు నెలకు రూ. 17,600, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లకు రూ. 19100, డేటా ఎంట్రీలకు రూ. 17,600, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లకు రూ. 14,200, ఐఈఆర్టీ ఉపాధ్యాయులకు రూ. 20250, ఆయాకు రూ. 4,500 జీతంగా చెల్లిస్తారు. ప్రతి నెలా 15వ తేదీపైన 30వ తేదీలోపు జీతాలు ఇవ్వడం సాధారణంగా మారింది. రెండు నెలలుగా వీరికి జీతాలు అందలేదు. మార్చి, ఏప్రిల్కు సంబంధించిన జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖలో వీరి పాత్ర కీలకం జిల్లా విద్యాశాఖలో సమగ్ర శిక్షాఅభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర కీలకమైంది. సీఆర్పీలు ప్రతి రోజూ ఒక పాఠశాలను సందర్శించి ఆన్లైన్ ద్వారా జిల్లా అధికారులకు సమాచారం పంపాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రతి కార్యక్రమంలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. విద్యాసంబంధమైన కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర పోషించాలి. బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం, వారి నమోదు తర్వాత నిలకడ కోసం కీలకంగా వ్యవహరించాలి. రెగ్యులర్ పాఠశాలల్లో వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణ, పరీక్షపత్రాల పంపిణీ, ఆధార్ సీడింగ్, ఎన్రోల్మెంట్ డ్రైవ్, జియో ట్యాగింగ్ సర్వే, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాల్లో కీలక పోత్ర పోషిస్తారు. డేటా ఎంట్రీలు రోజూ జిల్లా విద్యాశాఖకు సంబంధించిన గణాంకాలను పూర్తి చేయడం, ఉపాధ్యాయుల జీతభత్యాలు, సెలవుల నమోదు, మధ్యాహ్న భోజనం తదితర కార్యక్రమాలపై గణాంకాలు ఆన్లైన్ ద్వారా జిల్లా విద్యాశాఖకు పంపాలి. ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు...విద్యార్థుల నమోదు, పాఠశాలల పనితీరు, వివరాలు సేకరించాలి. ఆయా పాఠశాలల పరిధిలోని విద్యార్థుల సమగ్ర నివేదిక రూపొందించడం, వివిధ ప్రాంతాల నుంచి రోజువారీ విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ తదితర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా జిల్లా అధికారులకు పంపాల్సి ఉంటుంది. ఇంత చేస్తున్నా సకాలంలో జీతాలు అందలేదని పలుమార్లు సంబంధిత జిల్లా అధి కారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. టీఏ కూడా పెండింగ్ సీఆర్పీలకు 2018 జూలై నుంచి (దాదాపు 10 నెలలుగా) నెలనెలా రావాల్సిన టీఏ రూ. 600 ఇప్పటివరకూ మంజూరుకాలేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో టీఏ బిల్లులు చెల్లించినా చిత్తూరులో ఇవ్వలేదు. గతంలో నిర్వహించిన స్లాష్ పరీక్షలు, కోడింగ్కు చెల్లించాల్సిన నగదు ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. -
ష్.. గప్చుప్గా కానిచ్చేయండి..!
సాక్షి, ఒంగోలు టౌన్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పాత డేట్లతో పోస్టింగ్ ఆర్డర్లు జారీచేసి వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలంటూ ఆ శాఖ అధికారి నుండి ఫోన్లు వెళ్లాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే పాత తేదీలతో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చి సంబంధిత అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. వివరాలు.. సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేసేందుకు దఫాలు వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ మొదలుకొని కింది స్థాయి వరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టారు. కొన్ని పోస్టులను రాత పరీక్ష ద్వారా మరికొన్ని పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు, సీఆర్పీలు, పీఈటీలకు సంబంధించి 57 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి పోస్టుల భర్తీకి అవకాశం వచ్చిన్నా ఆ ఏజెన్సీతో సంబంధం లేకుండానే తాము అనుకున్న వారికి పాత డేట్లు వేసి పోస్టింగ్లు ఇవ్వడం వివాదాస్పదమైంది. పాత డేట్లతో పోస్టింగ్లు సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, క్లస్టర్ రీసోర్స్ పర్సన్, పీఈటీ వంటి పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఏమైందో ఏమోగానీ ఈ పోస్టులతో పాటు ప్రకటించిన స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అదే సమయంలో ఈ పోస్టులను తాత్కాలికంగా నిలిపేశారు. మొత్తం మీద ఆ పోస్టులను కూడా భర్తీ చేసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదాస్పదమైంది. రానా ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ చేసుకునేందుకు ఆ ఏజెన్సీకి ఈ నెల 10వ తేదీ అనుమతి వచ్చింది. అదేరోజు సాయంత్రం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయడంతో ఆ శాఖలో కీలకమైన వ్యక్తికి ‘మనీ’లాంటి ఆలోచన వచ్చింది. ఔట్ సోర్సింగ్ పోస్టులకు ఎలాగూ అనుమతి వచ్చింది కదా అని పాత డేట్లతో పోస్టింగ్ ఆర్డర్లను పుట్టించడం వివాదాస్పదమైంది. సంబంధిత పోస్టుల భర్తీకి పాత డేట్లు వేసి విధుల్లో చేరాలంటూ కొంతమంది ఎస్ఓలపై ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. కీలకమైన ఆ వ్యక్తి సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి 8, 9వ తేదీల్లో విధుల్లో చేరినట్లుగా చూపించాలని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. కొంతమంది ఆ ఫోన్లకు భయపడి పాత డేట్లతో విధుల్లో చేరినట్లుగానే చూపించేశారు. మరికొంతమంది మాత్రం ఎక్కడ మా ఉద్యోగాలు ఊడతాయోనన్న భయంతో కొద్దిగా సంశయించినా ఒత్తిడి అధికం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాత డేట్లతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని చేర్చుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు జిల్లాలోని అన్ని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో వాటి రక్షణకు సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఎవరు అడుగు పెట్టినా ఆ క్షణం నుంచే సీసీ కెమేరాల్లో రికార్డు అవుతోంది. జిల్లాలోని పలు కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా విధుల్లో చేరేందుకు పాత తేదీలతో వచ్చిన వారి కదలికలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ. సీసీ కెమెరాలను ఆధారం చేసుకొని సమగ్ర విచారణ జరిపితే కేజీబీవీల్లో ఏం జరుగుతుందో ఇట్టే అర్థమవుతోంది. సంబంధిత అభ్యర్థి ఏ రోజు విధుల్లో చేరారన్నది కూడా స్పష్టంగా తెలియనుంది. పైపెచ్చు ఔట్ సోర్సింగ్ ద్వారా పోస్టులను భర్తీ చేసే సమయంలో రోస్టర్ విధానాన్ని పాటించకుండా, ఓపెన్ కేటగిరి(ఓసీ)కి సంబంధించిన పోస్టులనే భర్తీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఓసీకి సంబంధించిన వారు అయితే తాము డిమాండ్ చేసిన విధంగా సమర్పిస్తారన్న ఉద్దేశంతో వన్సైడ్గా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ‘చిరు’ ప్రభావం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ కింద నిబంధనలకు విరుద్ధంగా పోస్టులను భర్తీ చేసిన విషయంలో ఆ శాఖకు చెందిన కీలకమైన అ««ధికారితో పాటు మరో కీలకమైన వ్యక్తి చక్రం తిప్పారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ శాఖకు చెందిన మంత్రికి అత్యంత దగ్గర బంధువైన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాల్లో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికితోడు ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసిన పోస్టుల్లో రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ కింద తీసిన వాటిలో ఓసీలకు సంబంధించిన పోస్టులకే పచ్చజెండా ఊపడం చర్చనీయాంశమైంది. ఓసీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఎక్కువగా తూగుతారని, ఇతరులైతే తాము డిమాండ్ చేసినంత ఇచ్చుకోలేరన్న ఉద్దేశంతో సరికొత్త విధానానికి తెరలేపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. -
పడకేసిన భవిత
విజయనగరం అర్బన్: ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రత్యేక బోధనా విధానం నిర్లక్ష్యానికి గురవుతుంది. దీంతో ప్రత్యేకావసరాల చిన్నారులు దానిపై ఆసక్తి చూపడం లేదు. మరోవైపు బోధన కోసం కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన పరికరాలు, నిర్మించిన భవనాలు అలంకార ప్రాయంగా మారాయి. వారి కోసం నియమించిన ఉపాధ్యాయుల (ఐఈఆర్టీ)ను సైతం వేరే అవసరాలకు వినియోగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలకు చికిత్స చేయాల్సిన ఫిజీషియన్ పోస్టులు భర్తీ చేయకపోవడం, పర్యవేక్షణ కొరవడడంతో ఈ కేంద్రాల భవిత అగమ్యగోచరంగా ఉంది. సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో.. జిల్లాలో సర్వశిక్షాభియాన్ ద్వారా మానసిక, శారీరక వికలాంగులైన చిన్నారులు దైనందిక కార్యక్రమాలను స్వయంగా నిర్వహించుకునేలా తర్ఫీదు ఇచ్చేందుకు 12 భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 6 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు శిక్షణ ఇచ్చేందుకు మండలానికి ఇద్దరేసి చొప్పున ఐఈఆర్టీలు నియమించారు. జిల్లాల్లో 34 మండలాలను కలుపుతూ 12 భవిత, 12 నాన్ భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 5 రకాల ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు 546 మంది ఈ కేంద్రాల్లో అభ్యన పొందుతున్నారు. గతేడాది చివర్లో ‘సహిత’ పేరుతో నిర్వహించిన సర్వేలో 6,923 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. కానీ సర్వే చేయడంలో చూపిన శ్రద్ధ వారిని భవిత కేంద్రాల్లో చేర్పించడంలో చూపలేదు. తాజా నమోదులో కేవలం 546 మంది మాత్రమే ఉండడంపై వాటి సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థమవుతుంది. ఐఈఆర్టీలు చిన్నారులతో ఆక్షరాలు దిద్దించడం, ఆటలు నేర్పించడం వంటివి చేయాలి. ఇందుకు అవసరమైన ఆట వస్తువులు కూడా సర్వశిక్షా అభియాన్ ద్వారా సరఫరా చేశారు. ఫిజీషియన్స్ లేకుండానే థెరిపీ చికిత్సలు.. జిల్లాలోని 34 మండలాల పరిధిలోని 12 భవిత, 12 నాన్ భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఫిజియోథెరిపీ చికిత్సలు ఇతరల సేవలు అందించడానికి 9 మంది ఫిజీషియన్ వైద్యుల అవసరం ఉంది. ప్రస్తుతం 5 మంది మాత్రమే భవిత కేంద్రాల పరిధిలోని చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. అన్ని కేంద్రాల్లో ఫిజియోథెరిపీ సేవలు అందిస్తున్నట్లు నివేదికలు చూపి నిధులు డ్రా చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిరుపయోగంగా పరికరాలు.. ప్రత్యేక అవసరాల చిన్నారులకు వ్యాయామం, విద్య అందించేందుకు జిల్లాలోని 12 భవిత కేంద్రాల్లో పదేసి లక్షల వ్యయంతో నిర్మించిన భవనాలు, చిన్నారుల హాజరుశాతం పడిపోవడంతో పరికరాలు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు విద్యను బోధించటానికి మండలానికి ఇద్దరేసి చొప్పున ఐఈఆర్టీలను నియమించాలి. జిల్లాలో ఇంకా ఐదు ఐఈఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరువైన ఆదరణ.. కేంద్రాలు ప్రారంభించిన తొలినాళ్లలో మానసిక, శారీరక వికలాంగులైన చిన్నారులకు కేంద్రాల్లో చక్కటి సేవలు అందాయి. వైద్య పరీక్షలు, వ్యాయామం, బోధన జరిగింది. తొలుత గ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిల్లల హాజరు శాతం తగ్గడంతో మండల కేంద్రాలకు తరలించారు. దీంతో ప్రత్యేకావసరాల పిల్లల తల్లిదండ్రులు వారిని తీసుకొచ్చేందుకు ఇష్టపడడం లేదు. అధికారుల లెక్కల ప్రకారం 6,600 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఉన్నా, కేవలం 546 మందికి మాత్రమే సేవలందిస్తున్నారంటే ఆ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఐఈఆర్టీలను ఇతర పనులకు వినియోగించడం కూడా ప్రస్తుత ఈ పరిస్థితి కారణం. ఐఈఆర్టీల విధులు.. ♦ గ్రామాల్లో ఇంటింటి సర్వే ద్వారా గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఆవాస ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయాలి. ♦ కేంద్రాలకు సమీపంలోని పిల్లలను భవిత కేంద్రాలకు తరలించి, విద్యా బుద్ధులు నేర్పించాలి. ♦ వీరికి సహాయకులుగా కేర్ గివింగ్ వలంటీర్ పనిచేస్తారు. పిల్లలను కేంద్రాలకు తీసుకువచ్చే తల్లిదండ్రులకు ప్రయాణ భత్యంగా నెలకు రూ.250 చెల్లిస్తారు. ♦ ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిన విద్యార్థులతో పాటు వీరికి కూడా మధ్యాహ్న భోజనం అందించాలి. యూనిఫాం ఇవ్వాలి. ♦ కదల్లేని, మెదల్లేని పిల్లలకు ఎస్కార్ట్ అలవెన్స్గా రూ.250 చెల్లిస్తారు. -
బడి బిల్లు కట్టేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లు చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రాథమిక విద్యాశాఖ విడుదల చేసిన నిధులు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఆ జిల్లాల్లోనే మగ్గిపోతున్నాయి. మరోవైపు పాఠశాలలు బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఏంచేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు. వాస్తవానికి గత విద్యా సంవత్సరం వరకు విద్యుత్ బిల్లులను కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించిన నిధులతో చెల్లింపులు జరిపేవారు. ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ), ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ద్వారా బిల్లులు చెల్లించేది. తాజాగా ఈ బిల్లు చెల్లింపులను ప్రభుత్వమే చేస్తుందని పాఠశాల విద్యాశాఖ(డీఎస్ఈ) స్పష్టం చేసింది. ఈమేరకు ఆ శాఖ సం చాలకులు టి.విజయ్కుమార్ గతనెలలో ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల వారీగా పెండింగ్ బిల్లుల సమాచారాన్ని సేకరించి ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీఎస్ఈ నుంచి ఉత్తర్వులు వచ్చి నెలరోజులు గడుస్తున్నా వాటిపై క్షేత్రస్థాయిలో విద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యుత్ బకాయిలు రూ.18 కోట్లు రాష్ట్రంలో 26,114 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు నెలకు సగటున రూ.500 వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ తరగతి గదుల నిర్వహణతో పాటు ఇతర ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాల వినియోగాన్ని బట్టి బిల్లుల్లో మార్పులు ఉంటున్నాయి. దీంతో సగటున ఒక ఉన్నత పాఠశాలలో నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు విద్యుత్ బిల్లులు నమోదవుతున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో దాదాపు ఆర్నెల్లకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో రూ.18 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఇటీవల 13 జిల్లాలకు రూ.1.04 కోట్లు చొప్పున విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.40 లక్షలు, ఉన్నత పాఠశాలలకు రూ.64 లక్షలు విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో పాఠశాలల వారీగా బకాయిల వివరాలు తెప్పించుకుని ఆమేరకు చెల్లించాలని డీఎస్ఈ ఆదేశించింది. కానీ, ఆ 13 జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి స్పష్టమైన సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరించలేదు. దీంతో డీఎస్ఈ విడుదల చేసిన నిధులు ఆయా జిల్లాల్లోనే మగ్గిపోయాయి. మరోవైపు ఆర్నెల్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్కో అధికారులు విద్యుత్ కనెక్షన్ను తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. -
పండగ పూటా పస్తులే..
రాయవరం (మండపేట) : పండగ వస్తుందంటే ఎవరికైనా సరదా ఉంటుంది. అందులోనూ దసరా పండగ అంటే అందరికీ సరదాయే. కానీ రెండు నెలలుగా వేతనాలకు నోచుకోని సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం దసరా పండగ సరదా లేకుండా సాగిపోయింది. రానున్న దీపావళికైనా తమ బతుకుల్లో వెలుగు విరబూస్తాయా అనే ఆశతో వీరంతా ఉన్నారు. అసలే అరకొర వేతనంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వీరికి, రెండు నెలలుగా జీతాలు రాక పోవడంతో వడ్డీలకు అప్పులు తెచ్చి జీవనం సాగిస్తున్నారు. రూ.6 కోట్ల బకాయిలు... జిల్లాలోని సర్వశిక్షా అభియాన్ పరిధిలో 64 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 64 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 322 మంది సీఆర్పీలు, 64 మంది మెసెంజర్లు, 736 మంది పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లు, 128 మంది ఐఈఆర్టీలు, 15 మంది డీఎల్ఎంటీలు, 250 మంది వరకు కేజీబీవీ సిబ్బంది, 24 మంది సైట్ ఇంజినీర్లు, 64 మంది భవిత కేంద్రాల ఆయాలు పని చేస్తున్నారు. వీరికి నెలకు సుమారుగా రూ.3 కోట్ల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. జూలై నెల వరకు వేతనాలు మంజూరయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి వేతనాలు మంజూరు కాలేదు. దీంతో జిల్లాలో ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6 కోట్ల వరకు వేతన బకాయిలు చేరుకున్నాయి. పండుగ పూటా పస్తులతోనే... రెండు నెలలుగా వేతనాలు రాక పోవడంతో దసరా పండుగ ఉసూరుమంటూ గడిపామని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అరకొరగా ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదంటున్నారు. హెచ్ఆర్ పాలసీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమతో సక్రమంగా పని చేయించుకుంటున్న ప్రభుత్వం మాత్రం సమయానికి వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నాం... రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పండుగ సమయంలోనైనా ముందుగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. చాలా మంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వెంటనే వేతన బకాయిలు చెల్లించాలి. – ఎం.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘం,అల్లవరం మండలం బడ్జెట్ రాగానే చెల్లిస్తాం... కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బడ్జెట్ ఇంకా రాలేదు. బడ్జెట్ రాగానే అందరు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తాం. ఉద్యోగుల ఇబ్బందులను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. – మేకా శేషగిరి, పీవో, సర్వశిక్షా అభియాన్, కాకినాడ -
చలో ప్రగతి భవన్.. ఉద్రిక్తత
-
స్కూళ్లకు సున్నాలు అంటూ నిధులకు కన్నాలు
-
బుక్కుల్లో బొక్కేశారు!
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీలనూ అధికార పార్టీ నేతలు వదలడం లేదు. గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోళ్ల పేరుతో రూ.4.66 కోట్ల సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులను మింగేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడితోపాటు ఓ ఉన్నతాధికారి ఇందులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదులు అందినా అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో విచారణ ముందుకు సాగడం లేదు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి వచ్చినా ఈ వ్యవహారానికి అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. అసలు రేట్లను భారీగా పెంచేసి... బెంగళూరుకు చెందిన ‘డ్రీమ్వరల్డ్ ఇండియా’ సీడీలు, డీవీడీలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపిణీ చేస్తామని రెండేళ్ల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావుకు 16 రకాల పుస్తకాలతో ప్రతిపాదనలు అందచేసింది. పుస్తకాల వాస్తవ ధరలపై 71 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామనడంతో ఎస్ఎస్ఏ ద్వారా పుస్తకాల కొనుగోలుకు మంత్రి ఆదేశించారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్ఈఆర్టీ) ఆధ్వర్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన తరువాత 11 రకాల పుస్తకాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇక్కడే గోల్మాల్కు తెరలేచింది. ముందుగా చెప్పిన్నట్లు కాకుండా పుస్తకాల ధరను పెంచేశారు. డిస్కౌంట్ను 71 శాతానికి బదులు 30 శాతానికి పరిమితం చేశారు. ఉదాహరణకు ప్రభుత్వానికి ముందుగా సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ‘స్పిరిట్ ఆఫ్ ఇండియా’ పుస్తకం ధర రూ.1495 ఉంటే ఎస్పీడీ ప్రతిపాదనల్లో అది రూ.2,495కి పెరిగింది. ‘ఓషన్ రిలీవింగ్ ద సీక్రెట్స్ ఆఫ్ డీప్’ పుస్తకం ధర రూ.1,000 నుంచి రూ.1995కి పెంచేశారు. ‘అట్లాస్ ఆఫ్ మై వరల్డ్’ పుస్తకం ధర రూ.695 నుంచి రూ.1,495కు పెంచేశారు. ‘డబుల్’ దందా! వాస్తవానికి తొలుత పేర్కొన్న ధరల ప్రకారం 11 పుస్తకాల సెట్టు ధర రూ.7,200 మాత్రమే. కానీ తరువాత ధరను అమాంతం రూ.13,489కి పెంచారు. రాష్ట్రంలోని 11,217 ప్రాథమికోన్నత పాఠశాలలకు పంపిణీ చేయడానికి రూ.15,13,06,113 అవుతుందని అంచనాలు రూపొందించారు. అయితే తరువాత స్కూళ్ల సంఖ్యను 7,413కి కుదించారు. ఆ ప్రకారం రూ. 9,99,93,957 అవుతుందని లెక్కగట్టారు. ఆమేరకు పుస్తకాలను పాఠశాలలకు అందించాలని జిల్లా ప్రాజెక్టు అధికారులకు ఎస్ఎస్ఏ ఎస్పీడీ ఆదేశాలు జారీచేశారు. మండల పాయింట్లకు డ్రీమ్వరల్డ్ సంస్థే పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉన్నా కేవలం జిల్లా కేంద్రాలకు అందించేలా ఎస్ఎస్ఏ వెసులుబాటు కల్పించడంతోపాటు జిల్లా కార్యాలయాల నుంచి చెల్లింపులు చేయించారు. ఫైల్ను ముందు ముఖ్యకార్యదర్శికి పంపి ఆమోదం పొందాల్సి ఉన్నా అందుకు భిన్నంగా ఆర్డర్లు ఇచ్చిన తరువాత ఫైలును పంపడం గమనార్హం. ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా... డ్రీమ్వరల్డ్ తొలుత ప్రభుత్వానికి అందించిన ధరల ప్రతిపాదనల పత్రాలు ఫైల్లో లేకపోవడం, వాటి స్థానంలో అధిక ధరలతో వేరే పత్రాలు ఉండడాన్ని ముఖ్యకార్యదర్శి గుర్తించారు. ముందుగా ఇచ్చిన ఆఫర్ ప్రకారం ఒక్కో సెట్టు వాస్తవ ధర రూ.7,200 కాగా రూ.6,289 చొప్పున అదనంగా రేటు పెంచి రూ.13,489 చేశారు. 11 పుస్తకాల సెట్టు రూ.7200 చొప్పున 7,413 సెట్లకు రూ.5,33,73,600 మాత్రమే అవుతుంది. అయితే ఎస్ఎస్ఏ ఎస్పీడీ కొత్త ధరల పట్టికను చూపిస్తూ రూ.13,489 చొప్పున రూ.9,99,93,957 చెల్లింపులు చేశారు. పుస్తక ధరలను నిర్ణయించేందుకు రాష్ట్ర పుస్తక ప్రచురణ విభాగం ఉన్నా దానితో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా ధరలను ఖరారు చేయించారు. ఎస్ఎస్ఏ ఫైల్లో ధరలు భారీగా పెరగడంపై ఉన్నతాధికారులు మంత్రికి నివేదించినా ఫలితం లేకపోయింది. అసలది పబ్లిషింగ్ సంస్థే కాదు.. డ్రీమ్వరల్డ్ సంస్థ ముందు ఇచ్చిన ఆఫర్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.5,33,73,600 మాత్రమే కాగా ధరలు పెంచి రూ.4,66,20,357 అదనంగా చెల్లించారు. విచిత్రమేమంటే డ్రీమ్వరల్డ్ ఇండియా సంస్థ అసలు పబ్లిషింగ్ సంస్థే కాదని కేవలం పంపిణీదారు మాత్రమేనని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ సంస్థ ప్యారగాన్ పబ్లిషింగ్ తదితర సంస్థల పుస్తకాలను పంపిణీ చేసి వాస్తవ ధరలను 50 శాతం వరకు పెంచిందని, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టారని ముఖ్యకార్యదర్శి పరిశీలనలో తేలింది. ఆర్డర్లు రద్దు చేసి బిల్లుల చెల్లింపును నిలిపి వేయాలని, డ్రీమ్వరల్డ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని, తొలుత ప్రతిపాదించిన ధరల కన్నా ఎక్కువ ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఎస్ఎస్ఏ ఎస్పీడీని ముఖ్యకార్యదర్శి ఆదేశించారు. -
ఎస్ఎస్ఏ ఎస్పీడీగా విజయ్కుమార్
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో టి.విజయ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్కుమార్ విద్యాశాఖ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
వృత్తి విద్యాబోధకులను క్రమబద్ధీకరించాలి
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్సెంటర్) : ఏపీ సర్వశిక్ష అభియాన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒప్పంద విధానంలో పనిచేయుచున్న ఆర్ట్, వర్క్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమావేశం ఆదివారం తాడేపల్లిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరాముల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు హాజరై మాట్లాడుతూ వృత్తి విద్యాబోధకులకు అండగా ఉంటామన్నారు. చేస్తున్న ఉద్యమాలకు తప్పక సహకరిస్తామన్నారు. ప్రభుత్వానికి వృత్తి విద్యా బోధకుల సమస్యలను తీసుకువెళతామన్నారు. వీర్ల శ్రీరాములు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలీచాలనీ వేతనాలతో తాము పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ప్రభుత్వం బేషరతుగా 60 ఏళ్లు వచ్చేవరకు ఉద్యోగ భద్రత కల్పించాలని, క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాస్, జిల్లా కోశాధికారి టి.చినబాబు, భాస్కరరావు, సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంతకుమారి, సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
మళ్లీ అక్రమ మార్గమే!
సాక్షి, మచిలీపట్నం : సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ ఏ)లో మళ్లీ అక్రమాలకు తెర లేచింది. అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. అక్రమ మార్గం ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు నేడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. కాగా ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్న ఉద్దేశ్యంతో కలెక్టర్ ఏర్పాటు చేసిన కమిటీ ఈ అక్రమాలను ఎందుకు నిర్మూలించలేకపోయిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ అనర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నారన్న విషయం తెలిసినా మిన్నకుండటం వెనుక ఆంతర్యం ఏమిటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... ఎస్ఎస్ఏ పరిధిలో కొన్ని జిల్లాస్థాయి ఉద్యోగాల భర్తీ ప్రధాన్యాంశంగా మా రింది. అందులో సెక్టోరియల్ పోస్టులు ఆరు, అసిస్టెంటెంట్ సెక్టోరియల్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. సెక్టోరియల్ పోస్టులు ఏఎంవో, ఏఎల్ఎస్వో, సీఎంవో, జీసీడీవో, ఎంఐఎస్ పీఎల్జీ కోఆర్డినేటర్, ఐఈడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులలో అర్హులైన గెజిటెడ్ ర్యాంకు కలిగిన వారితో భర్తీ చేయాలి. అదే విధంగా అసిస్టెంటెంట్ సెక్టోరియల్ పోస్టులైన ఏపీవో (అసిస్టెంటెంట్ ప్రొగ్రామింగ్ ఆఫీసర్), ఏఎస్వో(అసిస్టెంటెంటు సెక్టోరియల్ ఆఫిసర్) పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టులకు స్కూలు అసిస్టెంటెంట్ కేడర్కు చెందిన వారితో భర్తీ చేయాలి. ఆయా పోస్టులకు అర్హులైన వారికి ఇవ్వాలి. అదే విధంగా ఎస్ఎస్ఏలో గతంలో ఐదేళ్లు పని చేసిన వారికి ఇవ్వకూడదనే ఎస్పీడీ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇందుకు విరుద్ధంగా తక్కువ కేడర్ అయిన ఎస్జీటీలతో భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్ నియామకాలను రద్దు చేశారు. ఈ రద్దు కూడా కాగితాలకే పరిమితమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రద్దు చేసినా కొందరు ఆయా పోస్టు ఉద్యోగాల్లో కొనసాగినట్లుగా తెలు స్తోంది. ఇందుకు నిదర్శనం వారు డ్రా చేసిన జీతాల జాబితాలను చూస్తే అర్థమవుతుందనే వాదన ఎస్ఎస్ఏ కార్యాలయం వారే చెబుతుండటం గమనార్హం. రద్దు చేసినట్లు ప్రకటించి కొత్తగా మళ్లీ ఆయా పోస్టులను భర్తీ చేయడానికి జేసీ, డీఆర్వో, ఎస్ఎస్ఏ పీఓతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశా రు. ఆ కమిటీ ద్వారానే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కొంత కాలం మిన్నకుండిపోయిన అధికారులు ప్రస్తుతం తిరిగి అనర్హు లకే పోస్టులు కట్టబెట్టినట్లు తెలి సిం ది. కొనసాగుతున్న వారినే మళ్లీ తీసుకుంటున్నారనే వాదన కూడా ఉంది. ఇంత జరుగుతున్నా కమిటీ ఏం చేస్తోం దన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగిందంటే... సెక్టోరియల్ పోస్టులు గెజిటెడ్ వారితో, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్తో భర్తీ చేయాలి. దీనికి విరుద్ధంగా ఎస్జీటీ క్యాడర్తో భర్తీ చేసినట్లు సమాచారం. ఎస్ఎస్ఏ శాఖలో 5 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన వారు తిరిగి అదే శాఖలో విధులు నిర్వహించేందుకు అనర్హులు. ఇదే విషయాన్ని ఆ శాఖ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కానీ పోస్టు గ్రాడ్యుయేషన్ లేని వారిని సైతం ఉద్యోగాలకు ఎంపిక చేయడం వెనుక అంతర్యమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
‘వలస’ పిల్లలకు సీజనల్ హాస్టళ్లు
బొంరాస్పేట : డ్రాపౌట్స్ నివారణ కోసం గ్రామాల్లో వలస కుటుంబాల పిల్లలకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పీపుల్స్ సర్వీస్ సొసైటీ(పీఎస్ఎస్) స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని చౌదర్పల్లి జెడ్పీహెచ్ఎస్, రేగడిమైలారం ఎంపీహెచ్ఎస్లో సీజనల్ హాస్టళ్లను జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతిరెడ్డి, ఎంఈఓ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పరమేశ్వర్ మాట్లాడారు. సర్వశిక్షా అభియాన్ సహకారంతో పీఎస్ఎస్ ఆధ్వర్యంలో సీజనల్ హాస్టళ్లను నిర్వహించనున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన కుటుంబాల పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి, సాయంత్రం పూట ట్యూషన్ చెప్పించే ఏర్పాటు చేశామని వివరించారు. తద్వారా వలస కుటుంబాల విద్యార్థులు బడి మానేయకుండా చదువు కొనసాగిస్తారనే లక్ష్యంతో సీజన్ హాస్టళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని ప్రధానంగా గిరిజన కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ, ఎంఈఓ సూచించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు రమేశ్బాబు, వెంకటేశ్, ఉపాధ్యాయులు ఆనంద్రావు, మల్లికార్జున్ ఉన్నారు. -
ఆగిపోయిన విద్యా ప్రణాళికలు!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కీలకమైన పలు విద్యా పథకాల ప్రణాళికలు ఆగిపోయాయి. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ), టీచర్ ఎడ్యుకేషన్ పథకాల విలీన నిర్ణయం నేపథ్యంలో ఆయా పథకాల కింద రూపొందించాల్సిన 2018–19 విద్యా సంవత్సరం ప్రణాళికలను రాష్ట్ర విద్యా శాఖ నిలిపివేసింది. వాస్తవానికి ఈ నెల 13 నుంచి ఆయా పథకాలకు సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మూడు విద్యా పథకాల విలీనం కారణంగా కేంద్రం ఆయా పీఏబీల సమావేశాలను రద్దు చేసింది. దీంతో విద్యా శాఖ సైతం వాటికి అవసరమైన ఆర్థిక సంవత్సరపు ప్రణాళికల రూపకల్పనను నిలిపివేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన పథకాల విలీనం సమావేశంలో అన్ని రాష్ట్రాలు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం గురువారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో కొత్త పథకం పేరును ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యా పథకాలు, వాటికి అవసరమయ్యే ప్రణాళికలు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యా శాఖ భావిస్తోంది. -
గణితం కష్టమా..!
బద్వేలు: నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించేందుకు సర్వ శిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో నిత్యం ప్రత్యేక ప్రయోగాలు, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కష్టమనుకునే గణితాన్ని ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివేందుకు వీలుగా ఏపీ మ్యాథ్స్ ఫోరం ఆ«ధ్వర్యంలో ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. దీంతో విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు విద్యార్థి ఇష్టపడి చదివేలా అవసరమైన సూచనలు పొందొచ్చు. గణితంలో వచ్చే సందేహాలు, సమస్యలను ఉపాధ్యాయులు/విద్యార్థులు ఇతరులతో పంచుకుని పరిష్కరించుకోవచ్చు. ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యం మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు ఏటా వృత్యంతర శిక్షణలు నిర్వహిస్తుంటారు. పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని తరగతి గది బోధనలో గతేడాది నుంచి డిజిటల్/వర్స్వల్ తరగతుల ప్రవేశాన్ని ప్రారంభించారు. దీంతో ఉపాధ్యాయునికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరి అయింది. ఈ నేపథ్యంలో వేసవిలో రెండు రోజుల పాటు సమాచార సంబంధాల సాంకేతిక పరిజ్ఞానం (ఐసీటీ)పై ప్రతి ఉపాధ్యాయునికి శిక్షణనిచ్చారు. ఇందులో భాగంగానే గణితానికి సంబంధించి రూపొందించిన వెబ్సైట్ వినియోగంపై ప్రతి ఉపాధ్యాయునికి శిక్షణనిచ్చారు. దేశంలోనే తొలి ఆన్లైన్ గణిత చర్చా వేదిక ♦ ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ గణిత భావనలపై ‘ఏపీ మ్యాథ్స్ ఫోరం’ పేరు మీద వెబ్సైట్ రూపొందించింది. దీనిలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ♦ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఏటీహెచ్ఆర్జీఓఆర్యూఎం.కామ్ లాగిన్ అయి ఉపాధ్యాయులైతే న్యూ టీచర్, విద్యార్థులైతే న్యూ స్టూడెంట్ టు జాయిన్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థులు: యూజర్ నేమ్, పాస్వర్డు క్రియేట్ చేసుకోవాలి. తర్వాత విద్యార్థి పేరు చిరునామా, చదువుతున్న పాఠశాల వివరాలు, ఫోన్ నంబరు, ఈ మెయిల్ ఐడీ తదితర సమాచారం నమోదు చేసి, విద్యార్థి ఫొటో ఆప్లోడ్ చేసి సబ్మిట్ ఎంటర్ చేస్తే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఉపాధ్యాయులు: సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయ్యాలి. ఈ సెక్యూరిటీ కోడ్ కోసం 98490 45684 సెల్ నంబరును కాంటాక్టు చేసి కోడ్ తెలుసుకోవచ్చు. ఈ కోడ్ సహాయంతో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ప్రత్యేకతలు ♦ గణిత పరిజ్ఞానంపై నిపుణులు రాసిన అనేక ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పలువురు శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, గణితంలో సులువైన బోధనా పద్ధతులపై అనేక అర్టికల్స్ ఉంటాయి. ఎవరైనా రాసిన అర్టికల్స్ను కూడా ఆప్లోడ్ చేయవచ్చు. ♦ గణితంలోని వివిధ పాఠ్యాంశాలకు సంబం« దించిన నిపుణులు రాసిన పుస్తకాలు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ఉన్నాయి. వేదిక్ మ్యాథ్స్, గణితప్రయోగాలు వంటి రచనలు ఉంటాయి. ♦ గణిత బోధనపై తయారు చేసిన వివిధ మాడ్యూల్స్, యూట్యూబ్ వీడియోస్ ఆప్లోడ్ చేశారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవసరమైన గణిత మెటీరియల్ ఉంది. ♦ విద్యార్థులు తమ సందేహాలను పోస్టు చేస్తే నిపుణులు వాటిని అన్లైన్లోనే నివృత్తి చేస్తారు. -
లంబూ.. జంబూ!
ప్రభుత్వం వస్త్రం ఇచ్చింది.. ఎలాగోలా కుట్టేయే.. సరిపోతే మాకేం సరిపోకపోతే మాకేం అన్నట్టు కుట్టేశారు.. రెండేళ్ల క్రితం పిల్లల వద్ద తీసుకున్న కొలతలతోనే వస్త్రాలను కుట్టి పంపుతున్నారు. ఫలితంగా కుట్టిన దుస్తులు పిల్లలకు సరిపోక కొన్ని, లంబూ జంబూగా మరికొన్ని, మరీ బిగుసుగా కొన్ని రావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వీటి గురించి పర్యవేక్షించేవారు లేరు.. పట్టించుకునేవారు అసలే లేరు. ఫలితంగా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్ నిధులతో ప్రభుత్వం యూనిఫాం పంపిణీ చేస్తోంది. విద్యార్థుల్లో గైర్హాజరు శాతం తగ్గించి వారు పాఠశాలల వైపు ఆకర్షితులయ్యేలా చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం పక్కదారి పడుతోంది. వస్త్రం నాణ్యతను గాలికొదిలేయడంతో సరఫరాదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. నాసిరకం దుస్తులు ఇచ్చి పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నా విద్యాశాఖ యంత్రాం గానికి పట్టడం లేదు. ఎవరైనా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు ఆ దుస్తులు సరిగా లేవని వాటిని తీసుకోవడానికి తిరస్కరించినా పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 4 వందల చొప్పున యూనిఫాంకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఇచ్చేటప్పుడు ఆ వ్యయంతో నాణ్యమైన దుస్తులు సమకూర్చుకోవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో.. తొలుత ఎక్కడికక్కడ పాఠశాలల వారీగా వస్త్రం సమకూర్చుకొని ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో వాటిని కుట్టించి ఇవ్వడంతో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఈ పద్ధతి బాగున్నా కొందరు ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లకు నచ్చలేదు. ఇలాగైతే తమ జేబులు నిండవని ఈ విధానానికి స్వస్తి చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధానంలో వస్త్ర నాణ్యత మొదలుకుని దాని సరఫరా దాకా పరిశీలిస్తే అడుగడుగునా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పాఠశాలలు తెరిచి దాదాపు నాలుగు నెలలైనా ఇప్పటికి కేవలం 21 మండలాల్లోని పాఠశాలలకు మాత్రమే దుస్తులను సరఫరా చేశారు. ఇంకా 30 మండలాల్లో పంపిణీ చేయాల్సి ఉంది. అది కూడా రెండేళ్ల క్రితం తీసుకున్న కొలతలతో దుస్తులు కుట్టారు. పంపిణీ చేసిన వాటిలో చాలా మేరకు పిల్లలకు సరిపోవడం లేదని తెలిసింది. కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెనక్కు పంపుతున్నారు. జిల్లాలోని బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో చాలా పాఠశాలల్లో పిల్లలకు దుస్తుల సైజులు సరిపడక వెనక్కు పంపారు. తాజాగా కడప నగరం నాగరాజుపేట నగర పాలక పాఠశాలలో విద్యార్థులకు పంపిన దుస్తులు సరిపడక 8వ తరగతి చదివే విద్యార్థుల దుస్తులు 6వ తరగతి విద్యార్థులకు.. 6వ తరగతి చదివే పిల్లల దుస్తులు 4వ తరగతి వారికి పంపిణీ చేశారు. ఇందులోనూ ఒక్కో విద్యార్థికి రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం ఒక జతతోనే సర్దుబాటు చేశారు. జిల్లాలో మూడు కేంద్రాల్లో యూనిఫాం తయారీ పిల్లలకు సంబంధించి స్కూల్ యూనిఫాంను జిల్లాలో మూడు కేంద్రాలలో తయారు చేస్తున్నారు. కడపలో మెప్మా ఆధ్వర్యంలో, అలాగే ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని కుట్టు కేంద్రంతోపాటు ఖాజీపేటలోని నందిని ఫ్యాబ్రిక్స్లో పిల్లల యూనిఫాంలను కుడుతున్నట్లు అధికారులు తెలిపారు. 1లక్షా 76 వేల 180 మంది విద్యార్థులు ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లను కలుపుకుని 1 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు 1,76,180 మంది ఉన్నారు. వీరి నుంచి ముందస్తుగా సైజులు, కొలతలు తీసుకుని యూనిఫాం కుట్టించి ఇచ్చి ఉంటే దుస్తులు సరిపోవడం లేదు అనే సమస్య ఎదురయ్యేది కాదు. అలాగే ఒక్కో పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉన్నారు. వారికి సరపడా దుస్తులు ఇస్తున్నామా లేదా అనే లెక్క కూడా ఉండటం లేదు. వస్త్రం నాణ్యత మొదలుకుని కుట్టు, సరఫరా దాకా ప్రతి విషయంలోనూ లోపాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. -
ఎస్ఎస్ఏలో పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పరిధిలోని వివిధ విభాగాల్లో 15 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న, మిగిలిపోయిన దాదాపు 1000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాల్లో డీఈవోలు అక్టోబర్ 3న నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించింది. అలాగే వివిధ పోస్టుల భర్తీకి అక్టోబర్ 23న రాత పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (యూఆర్ఎస్), 84 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) స్పెషల్ ఆఫీసర్ (ఎస్వో), కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), అకౌంటెంట్, నర్సు పోస్టులను, ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు కార్యాలయాల్లో అసిస్టెంట్ ప్రోగ్రామర్, సిస్టమ్ అనలిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, ఐఈఆర్పీ పోస్టులను భర్తీ చే యనుంది. అలాగే 391 పాత కేజీబీవీల్లోనూ ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. సీఆర్టీ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి, మెరిట్తోపాటు రోస్టర్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా వాటిని భర్తీ చేయాలని వెల్లడించింది. మొత్తంగా అక్టోబర్ 30లోగా ఈ పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. జిల్లా యూనిట్గా డీఈవోలు నోటిఫికేషన్లను జారీ చేయాలని వెల్లడించింది. జిల్లా ఎంపిక కమిటీ ఏర్పాటు..: ఈ పోస్టుల భర్తీకి జిల్లా ఎంపిక కమిటీలను ఏర్పాటు చేసింది. మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ ఈ నియా మకాలను చేపట్టాలని వివరించింది. ఈ కమిటీకి చైర్ పర్సన్గా జాయింట్ కలెక్టర్, మెంబర్ కన్వీనర్గా డీఈవో వ్యవహరిస్తారు. సభ్యులుగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ, ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తే నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంట ర్కు చెందిన డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డైట్ ప్రిన్సిపాల్ లేదా అతని ప్రతినిధి కమిటీలో సభ్యులుగా ఉంటారు. భర్తీ చేయనున్న పోస్టులివే..: జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోగ్రామర్, జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో సిస్టమ్ అనలిస్టు, జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో/మండల రీసోర్సు సెంటర్లో డాటా ఎంట్రీ ఆపరేటర్, మండల రీసోర్సు సెంటర్లో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్సు పర్సన్ యూఆర్ఎస్లలో.. కేజీబీవీల్లో.. స్పెషల్ ఆఫీసర్, సీఆర్టీ, పీఈటీ, అకౌంటెంట్, నర్సు. ఇదీ షెడ్యూలు (అక్టోబర్ నెలలో..) 3న: నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 7న: దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు 10న: దరఖాస్తుల స్క్రూటినీ 11న: రాత పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత పొందిన వారి జాబితా ప్రకటన 23న: ఆన్లైన్/ఆఫ్లైన్లో రాత పరీక్ష నిర్వహణ 28న: ఫలితాల ప్రకటన 30న: ఎంపికైన వారిని విధుల్లోకి తీసుకోవడం -
పొంతన కుదరడం లేదు
► బడి బయట పిల్లల గుర్తింపులో తేడాలు ► స్థూల, నికర ప్రవేశాల మధ్య వ్యత్యాసం ► ప్రత్యేక సర్వే చేపడుతున్న సర్వశిక్ష అభియాన్ మదనపల్లె సిటీ: బడిఈడు పిల్లలంతా పాఠశాలలోనే ఉండేలా ఏటా బడి పి లుస్తోంది, అమ్మ ఒడి – ప్రభుత్వ బడి, మళ్లీ బడికి లాంటి కార్యక్రమాలను విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ సంయుక్తం గా నిర్వహిస్తున్నాయి. అ యినప్పటికీ జిల్లాలో బడిబయట పిల్లల సంఖ్య వందల్లో ఉన్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రజాసాధికార సర్వే గణాంకాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో 57 వేల మంది పిల్లలు బడి బయ టే ఉన్నట్లు నివేదికలు చూపుతున్నాయి. దీంతో సర్వశిక్ష అభియాన్ విద్యార్థి గణన పేరుతో 15 రోజులుగా ఊరూరా, ఇంటింటికీ సిబ్బందిని పంపి బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపడుతోంది. పక్షం రోజుల ప్రత్యేక కార్యక్రమం.. విద్యార్థి గణన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యా ప్తంగా పక్షం రోజుల పాటు ప్రత్యేకంగా చేపడుతున్నారు. ఆధార్ అనుసంధానం చేయని విద్యార్థులను గుర్తించి నమోదు చేయిస్తున్నారు. గుర్తింపులేని పాఠశాలల్లో చదివే విద్యార్థులను గుర్తించి, వారిని ప్రభుత్వ గుర్తింపు గల పాఠశాలల్లో చేర్పించేలా ప్రణాళికలు రూపొందించారు. బోధన కుంటుపడుతుందనే భావనతో ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను తప్పించా రు. కేవలం సర్వశిక్ష అభియాన్కే పరి మితం చేశారు. ప్రాజెక్టు అధికారి నుంచి క్లస్టర్ రిసోర్సుపర్సన్ల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో సర్వశిక్ష అభియాన్ సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ అధికారులు, డివిజనల్ లెవల్ మానిటరింగ్ టీమ్ సభ్యులు, క్లస్టర్రిసోర్సు పర్సన్లు, పరిమితకాలపు విద్యాబోధకులు, సహిత విద్య కో–ఆర్డినేటర్లు, ఎంఐఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విద్యార్థి గణనలో పాల్గొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను గుర్తించి వారి ఆధార్ నంబర్లు యూ డైస్తో అనుసంధానం చేస్తూ ఏపీజీఈఆర్ యాప్లో నమోదు చేస్తున్నారు. హౌస్ సర్వేలో చూపిన బడిబయట విద్యార్థుల సంఖ్యకు, విద్యాశాఖ డైస్ ప్రకారం చూపే బడిబయట పిల్లల సంఖ్యకు భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. సర్వే సమయంలో గణకులకు రోజువారీ సర్వేకు లక్ష్యాలను నిర్దేశించడంతో వారు ఇష్టారాజ్యంగా వివరాలను నమోదు చేసేశారని విద్యాశాఖ చెబుతోంది. చదువుతున్న విద్యా సంస్థ, డైస్ కోడ్ నమోదు వంటి ఆప్షన్ ఇవ్వకపోవడం కూడా తప్పుగా నమోదవ్వడానికి కారణమని సర్వశిక్ష అభియాన్ అధికారులు అంటున్నారు. ఇందులో విద్యాశాఖతో పాటు ఉపాధ్యాయుల తప్పిదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత విద్యా సంవత్సరంలోనే విద్యార్థికి ఆధార్ తప్పనిసరి చేశారు. అంతకుముందు ఉపాధ్యాయులు చెప్పిందే లెక్క. ఇదే అదునుగా కొన్ని పాఠశాలల్లో పోస్టులు పోతాయని లేని విద్యార్థులను ఉన్నట్లుగా దస్త్రాల్లో చూపారు. ఆధార్ అనుసంధానంతో ఇలాంటి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. ప్రజాసాధికార సర్వేతో మరిన్ని లోపాలు బయటపడినట్లు సంబంధిత అధికారులే చెబుతున్నారు. ఏదీ ఏమైనా సర్వేలో చూపిన విద్యార్థుల స్థితిగతులను తెలపాల్సిన బాధ్యత ఇప్పుడు విద్యాశాఖపై ఉంది. దీనికోసం సర్వశిక్ష అభియాన్ ప్రత్యేక దృష్టి సారించింది. బడిఈడు వయస్సు కలిగిన ఆరేళ్ల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటికీ పదుల సంఖ్యలో పిల్లలు బడి బయటే ఉన్నారని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. -
బడి బయట బాలలు 1,00,000
2015–16 లెక్కలు వెల్లడించిన కాగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014–15 విద్యాసంవత్సరంలో 36,519 మంది, 2015–16 విద్యా సంవత్సరంలో 46,391 మంది బాలలు బడి బయట ఉన్నారని కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడీఐఎస్ఈ) లెక్కల ప్రకారం 2014–15లో 2,50,581 మంది, 2015–16లో 1,12,991 మంది బాలలు బడి బయట ఉన్నారని తెలిపింది. జాతీయ స్థాయిలో విద్యా హక్కు చట్టం–2009 అమలుపై తాజాగా కాగ్ బహిర్గతం చేసిన నివేదికలో రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు, లోపాలను పొందుపరిచింది. అంశాల వారీగా పరిశీలిస్తే.. ► తెలంగాణలో రూ.5.73 కోట్ల సర్వ శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) నిధులను 2012–13 నుంచి 2015–16 మధ్యకాలంలో ఇతర శాఖలకు దారిమళ్లించడంతో దుర్వినియోగమయ్యాయని కాగ్ తప్పుపట్టింది. ► 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడంతో పాటు క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేసిన 21 పాఠశాలలకు 2014 మార్చి–డిసెంబర్ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిసులు జారీ చేయగా, అందులోని 9 పాఠశాలలకు రూ.15.29 కోట్ల జరిమానాలు విధించింది. ఈ జరిమానాలను ఇంత వరకు వసూలు చేయలేదు. ► రాష్ట్రంలో తనిఖీలు జరిపిన రెండు జిల్లాల్లో 67 మంది ఉపాధ్యాయులను బోధనేతర పనుల కోసం వినియోగించుకుంటున్నారు. ► 2012–13 మధ్యకాలంలో ఖమ్మం జిల్లాలోని 666 పాఠశాలల విద్యుదీకరణ కోసం రూ.1.03 కోట్లు విడుదల చేయగా, 2016 మార్చి వరకు ఈ నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. ► విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సలహా కమిటీని ఏర్పాటు చేయలేదు. -
సీఎం ఆమోదం తర్వాతే.. ‘సర్వశిక్షా’ సిబ్బంది వేతనాలు పెంపు!
రూ.2,195 కోట్ల బడ్జెట్కు పాలకమండలి ఆమోదం సాక్షి, హైదరాబాద్: సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) సిబ్బంది వేతనాల పెంపునకు పాలకమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రభుత్వ ఆమోదం తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఎస్ఎస్ఏ పరిధిలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వేతనాల పెంపుపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని పాలకమండలి పేర్కొంది. సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఎస్ఎస్ఏ పాలకమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎస్ఎస్ఏ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు చర్చించారు. గతంలో ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు ఆమోదించిన వేతనాల పెంపు ప్రతిపాదనలపై సీఎస్ ఆధ్వర్యంలోనే నిర్ణయం తీసుకొని అమలు చేసేవారు. అయితే, ఈసారి విద్యాశాఖ ఫైలు పంపిస్తే సీఎం పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఎస్ఎస్ఏ పరిధిలో సివిల్ వర్క్స్ చూసే ఇంజనీరింగ్ విభా గాన్ని తెలంగాణ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి సంస్థ(టీఎస్ఈడబ్ల్యూఐడీసీ)లో విలీనం చేయాలని నిర్ణయించారు. సివిల్ వర్క్స్ మానిటరింగ్కు ఈఈ నేతృత్వంలో ఒక విభాగాన్ని కొనసాగించాలని తీర్మానించారు. మరోవైపు కొత్తగా మంజూరైన కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ), 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, కేంద్రం ఓకే చెప్పిన రూ.2,195 కోట్ల ఎస్ఎస్ఏ బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా కమిషనర్ కిషన్, ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్రావు, కేజీబీవీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఏ కార్యాలయం మార్పు
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక విద్యుత్నగర్ సర్కిల్లోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయాన్ని టీవీ టవర్ వెనుక ఉన్న భవనంలోకి మార్చారు. ఈ సందర్భంగా సోమవారం నూతన భవనంలో పూజలు నిర్వహించారు. టీవీ టవర్ సమీపంలోని ఈ ప్రభుత్వ భవనం వినియోగంలోలేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుని, అన్యాక్రాంతం అవుతుండేది. అప్పటి కలెక్టర్ కోన శశిధర్ ఈ భవనాన్ని పరిశీలించారు. రూ.40 లక్షల దాకా ఎస్ఎస్ఏ నిధులతో భవనానికి మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దారు. నూతన భవనం సిద్ధం కావడంతో కలెక్టర్ వీరపాండియన్ ఆమోదముద్ర వేయడంతో ఎస్ఎస్ఏ కార్యాలయాన్ని అక్కడికి మార్చారు. పీఓ దశరథరామయ్య మాట్లాడుతూ కొత్త భవనం చాలా సౌకర్యవంతంగా ఉందన్నారు. -
వారికి పెరిగిన వేతనం అందేలా చూడండి
సర్వశిక్షా అభియాన్ పార్ట్టైం బోధకుల వేతనంపై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్లో పార్ట్టైం బోధకులుగా పనిచేస్తూ కోర్టునాశ్రయించిన వారికి పెరిగిన గౌరవ వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సర్వశిక్షా అభి యాన్ డైరెక్టర్ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ పి.నవీన్రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. సర్వశిక్షా అభియాన్ పార్ట్టైం బోధకుల గౌరవ వేతనాన్ని కేంద్రం రూ.12వేలకు పెంచిందని, దాన్ని తమకు వర్తింప జేయాలని కోరుతూ వరంగల్కు చెందిన రాజు, మరో 24 మంది హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు. పూర్తిస్థాయి సీజేను నియమించాలి హైకోర్టు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి పిల్ ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి (సీజే)ని నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అలాగే హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టు లనూ భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయ వాది సరసాని సత్యంరెడ్డి ఈ వ్యాజ్యాన్ని వేశారు. దీనికి నం బర్ కేటాయించాలా? వద్దా? అన్న విషయంపై న్యాయమూ ర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం... ఈ వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని ఆదేశాలిచ్చింది. -
204 పాఠశాలల్లో ఎర్నెట్ డిజిటల్ తరగతులు
శ్రీకాకుళం : జిల్లాలోని 204 ఉన్నత పాఠశాలల్లో ఎర్నెట్ డిజిటల్ తరగతులు జరుగుతున్నాయని సర్వశిక్షా అభియాన్ పీఓ ఎస్.త్రినాథరావు తెలిపారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ 204 పాఠశాలల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, గిరిజనాభివృద్ధితోపాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలకొండ డివిజన్లో 72, శ్రీకాకుళం డివిజన్లో 55, టెక్కలి డివిజన్లో మిగిలిన పాఠశాలలు ఉన్నాయని వివరించారు. ప్రతి పాఠశాలకు 10 కంప్యూటర్లు, ప్రింటర్, యూపీఎస్, ప్రొజెక్టర్, కుర్చీలు సరఫరా చేశామని తెలిపారు. 146 ప్రాథమికోన్నత పాఠశాలలను గుర్తించి సర్వశిక్షా అభియాన్ ద్వారా కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్ కోసం అవసరమైన సామగ్రిని సమకూర్చినట్లు చెప్పారు. ఫైబర్ గ్రిడ్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన వెంటనే దశల వారీగా పాఠశాలల్లో డిజిటల్ తరగతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గతంలో బోధనోపకరణాలు, ప్రయోగశాలలు ఉపయోగించి బోధించేవారని, ప్రస్తుత సీసీఈ విధానంలో పై రెండింటితోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉపాధ్యాయులు లేకపోయినా డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులు అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నారని, సైన్స్ ప్రయోగాలను,క్విజ్ పోటీలను, పోటీ పరీక్షలను సమర్థంగా ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. -
విద్యార్థుల వివరాలతోనే నిధుల విడుదల!
►ఆన్లైన్లో విద్యార్థుల నమోదుకు ఇదివరకే కేంద్రం ఆదేశాలు ►అయినా స్పందించని మదర్సాలు, ఎన్సీఎల్పీ కేంద్రాలు ►నిధుల దుర్వినియోగంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు ►నెలాఖరులోగా వివరాలు నమోదు చేయాలని ఎస్ఎస్ఏ గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, మదర్సాలు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు (ఎన్సీఎల్పీ) కేంద్రాల్లో విద్యార్థుల కోసం ఖర్చు పెట్టే నిధుల విషయమై ఇకనుంచి విద్యాశాఖ పక్కాగా వ్యవహరించనుంది. ఈ మేరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగానే నిధులను కేటాయించనుంది. ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నిధుల దుర్వినియోగం జరిగినట్లు అనుమానాలు! సర్వశిక్ష అభియాన్ ఆర్థిక సహాయంతో రాష్ట్రంలో 500 వరకు మదర్సాలు, ఎన్సీఎల్పీ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. వాటి నిర్వహణ కింద ఒక్కో విద్యార్థికి ఎస్ఎస్ఏ రూ. 6,500 వరకు నిధులను చెల్లిస్తోంది. ఇవికాకుండా సబ్జెక్టులు బోధించే వలంటీర్లకు ఒక్కొక్కరికి వేతనాలను కూడా ఎస్ఎస్ఏ ఇస్తోంది. ఇలా మొత్తంగా వాటి నిర్వహణకు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అయితే ఇన్నాళ్లూ వాటిల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోకపోవడం, మదర్సాల్లో వలంటీర్లను నియమించకుండానే నిధులను మింగేసినట్లు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో విద్యాశాఖ విచారణ కూడా జరిపింది. హైదరాబాద్లో ఈ అక్రమాల విషయంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు సస్పెండ్ కూడా అయ్యారు. మదర్సాల మౌనం... విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు మదర్సాలు ముందుకు రావడం లేదు. గతేడాది (2015–16) లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మదర్సాల్లో 57,321 మంది విద్యార్థులు ఉన్నట్లు నిర్వాహకులు వివరాలిచ్చారు. ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా అంతే మంది ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం 17,836 మంది వివరాలను మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. ఇంకా 39,485 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. వారంతా ఉన్నట్టా? లేనట్టా? అన్నది ప్రశ్నగా మారింది. నిజంగా లేకపోతే ఇన్నాళ్లూ పేపరుపై లెక్కలు చూపించి, నిర్వహణ సంస్థలు నిధులను మింగేశారా? అన్న అనుమానాలు అధికారుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 31వ తేదీలోగా విద్యార్థులు అందరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సర్వశిక్ష అభియాన్ తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆన్లైన్లో విద్యార్థుల వివరాలను నమోదైన 17,836 మందికి సంబంధించి ఆధార్ లింకు కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు అందులో కేవలం 8,804 మందికి సంబంధించి మాత్రమే ఆధార్ లింకు పూర్తయింది. ఇక ఆధార్తో అనుసంధానం చేస్తే విద్యార్థుల తాలూకు పూర్తి వివరాలు బయటపడునున్నాయి. -
సర్వశిక్ష అభియాన్పై ఆన్లైన్ పర్యవేక్షణ
► రాష్ట్రంలో అన్ని లెక్కలు ఆన్లైన్లో పొందుపరచాలన్న కేంద్రం ►విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ సాక్షి, హైదరాబాద్: సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) కార్యక్రమాలపై ఇకపై ఆన్లైన్ పర్యవేక్షణ ప్రారంభం కానుంది. పారదర్శ కత పెంచేందుకు వివిధ రాష్ట్రాల్లో ఎస్ఎస్ఏ కింద చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంబంధిం చిన వివరాలు, లెక్కలను ఆన్లైన్లో పొందు పర్చాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణరుుంచింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా షగున్ పేరుతో ప్రత్యేక వెబ్ పోర్ట ల్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ ఆన్లైన్ మానిటరింగ్కు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఎస్ఎస్ఏ కార్యకలాపాలను ఆన్ లైన్లో పొందుపరచాలంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకు ఎంహెచ్ఆర్డీ అదనపు కార్య దర్శి రైనారే ఇటీవల లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న అంశాలివే... షగున్ వెబ్పోర్టల్ను రెండు రకాలుగా చేస్తున్నాం. అందులో ఒకటి కార్యక్రమాల ఆన్లైన్ మానిటరింగ్. రెండోది సక్సెస్ స్టోరీ లు, బాగా అమలు చేసిన కార్యక్రమాలు, వాటి వీడియోలు, పేపరు క్లిప్పింగ్లు ఆన్లైన్ లో ఉంచుతాం. తెలంగాణకు సంబంధించిన అంశాలను తీసుకునేందుకు, ఎప్పటికప్పుడు సంప్రదించేందుకు ప్రత్యేకంగా రాష్ట్రంలో నోడల్ ఆఫీసర్ను నియమించండి. - ఆన్లైన్ మానిటరింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్(ssamis.nic.in) రూపొందిం చాం. రాష్ట్రాల్లో నియమించే నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు అవసరమైన ప్రొఫార్మాలను ఇందులో అందు బాటులో ఉంచుతాం. -
నేటి నుంచి ప్రాథమిక టీచర్లకు శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్ : బోధనాంశాలపై జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించి, మంగ ళ వారం నుంచి శిక్షణ చేపట్టాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి దశరథరామయ్య తెలిపారు. సోమవారం కార్యాలయంలో సెక్టోరియల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. 6,7 తేదీల్లో అనంతపురం, గుత్తి, 8, 9 తేదీల్లో ధర్మవరం, పెనుకొండ డివిజన్లలో ఈ సమావేశాలు నిర్వహి స్తారనాన్నరు. -
ప్రతి మండలంలో క్లస్టర్ స్కూళ్లు
పాఠశాల విద్యాశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ విభాగాల విభజనకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్న విభాగాలు, కొత్త జిల్లాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులపై రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి మొదలుకొని క్షేత్ర స్థాయిలో మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, వాటిలో పనిచేసే సిబ్బంది, వాటి పరిధిలో ఉండే క్లస్టర్ స్కూళ్ల లెక్కలు వేసింది. ప్రస్తుతం ఉన్న ఎంఈవో కార్యాలయాలను విభజించి కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయడం ద్వారా ఒక్కో ఎంఈవో కార్యాలయ పరిధిలో ఉండనున్న అధికారులు, సిబ్బంది లెక్కలను కూడా వేసింది. కొత్త జిల్లాల్లో ఒక్కో మండలంలో (కొత్త మండలాలు కలుపుకొని) రెండు లేదా మూడు క్లస్టర్ స్కూళ్లు ఉండేలా కసరత్తు చేస్తోంది. వీటితోపాటు సర్వశిక్షా అభియాన్కు (ఎస్ఎస్ఏ) చెందిన ఔట్సోర్సింగ్ సిబ్బంది ఒక ఎంఐఎస్ కోఆర్డినేటర్, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, మేసేంజర్ ఉండేలా చూస్తోంది. మరోవైపు కొత్త మండలాల్లోని మండల రీసోర్సు సెంటర్లలోనే (ఎంఆర్సీ) డీఈవో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్, డీఈవో కార్యాలయాలను కలిపేసేందుకు చర్యలు చేపడుతోంది. పీవోల వ్యవస్థను రద్దు చేసి, డీఈవో నేతృత్వంలోనే సర్వశిక్షా అభియాన్ కార్యకలాపాలను చూసేందుకు ఒక అధికారికి బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది. అలాగే మోడల్ స్కూళ్లు, ఆర్ఎంఎస్ఏ కార్యకలాపాలను కూడా డీఈవోల నేతృత్వంలోనే నిర్వహించనుంది. మరోవైపు కొత్త జిల్లాల్లో ఇన్చార్జి డీఈవోలను నియమించేందుకు చర్యలు చేపట్టింది. ఇన్చార్జి డీఈవో పోస్టుల కోసం జిల్లాల్లో పనిచేస్తున్న డిప్యూటీ డీఈవో, అసిస్టెంట్ డెరైక్టర్ల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. -
నాణ్యత ప్రమాణాలు పాటించండి
– కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): పాఠశాలల తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సర్వశిక్ష అభియాన్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతలోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దేశించిన సమయంలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ఓ ప్రణాళిక ప్రకారం పనులు చేయాలన్నారు. కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థినులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. లేనిపక్షంలో తల్లిదండ్రులు వారికి వివాహాలు చేసే అవకాశం ఉందన్నారు. విద్యాలయాల్లో వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి స్కూలుకు ప్రహరీ నిర్మించాలన్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు గురుకుల పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముత్యాలరాజు సూచించారు. అందుకోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. సమీక్ష సమావేశాల్లో జేసీ–2 రాజ్కుమార్, సర్వశిక్ష అభియాన్ పీఓ కనకనరసారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఏలో పెరిగిన వేతనాలు
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశమైన పాలకమండలి తీర్మానించింది. దీంతో క్లస్టర్ రిసోర్స్పర్సన్లకు రూ.14,500, అటెండర్లకు రూ.10 వేలు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్లకు రూ.15 వేలు, కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)ల్లోని స్పెషల్ ఆఫీసర్లకు రూ.21 వేలు, వంట కార్మికులకు రూ.7,500 వరకు వేతనాలు పెరిగాయి. ఎస్ఎస్ఏ కింద పనిచేస్తున్న 17 వేల మంది ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందని, ప్రతియేటా రూ.60 కోట్లు అదనంగా కేటాయించాల్సి వస్తుందని అదనపు ప్రాజెక్ట్ డెరైక్టర్ భాస్కర్రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మన్లు, అటెండర్ల నియామకం చేపట్టాలని డిప్యూటీ సీఎం(విద్య) నిర్ణయించడంతో మరో రూ.85 కోట్లు కేటాయించామని ఏపీడీ పేర్కొన్నారు. కేజీబీవీల్లో క్రీడల కోసం ప్రతి జిల్లాకు రూ.3 లక్షలు, రాష్ట్రస్థాయిలో ఆటలకు రూ.5 లక్షలు, వంటపాత్రల మరమ్మతులకు ప్రతి కేజీబీవీకి రూ.50 వేల చొప్పున కేటాయించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఆర్థికశాఖ కార్యదర్శులు రామకృష్ణారావు, నవీన్ మిట్టల్, ఎస్ఎస్ఎ ప్రాజెక్ట్ డెరైక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఏలో ‘కాంట్రాక్టు’ వేతనాలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న అటెండర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)లకు వేతనాలను పెంచాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అటెండర్లకు ప్రస్తుత వేతనం రూ.7500 ఉండగా, దీన్ని రూ.10 వేలకు, సీఆర్పీల రూ.9500 వేతనాన్ని రూ.11,400లకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం జరగనున్న ఎస్ఎస్ఏ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో పేరిణీ నృత్యం తరగతులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని విద్యా శాఖ యోచిస్తోంది. పేరిణీ నృత్యం కోర్సులు చేసిన వారిని తెలుగు యూనివర్సిటీలో ఆర్ట్ ఎడ్యుకేషన్ కింద ఇన్స్ట్రక్టర్లుగా నియమించాలని భావిస్తోంది. దీనిపై కూడా ఎస్ఎస్ఏ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. -
మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించిన మెస్సెంజర్లు
మోర్తాడ్ : సర్వశిక్ష అభియాన్ పథకం కింద మెస్సెంజర్లుగా పనిచేస్తున్న వారిని కొనసాగించకుండా జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని మెస్సెంజర్లు ఆశ్రయించారు. ఈమేరకు మెస్సెంజర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డప్పు దిలీప్ గురువారం మాట్లాడారు. సర్వశిక్ష అభియాన్ పథకం కింద దాదాపు 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను ఏడాదికి ఒకసారి కాంట్రాక్టు రెన్యూవల్ చేస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా రెన్యూవల్ చేయాల్సి ఉన్నా జిల్లా అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సర్వశిక్ష అభియాన్ కింద పనిచేస్తున్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి కాంట్రాక్టును రెన్యూవల్ చేయాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపారు. అయితే జిల్లాలో మాత్రం కాంట్రాక్టు రెన్యూవల్ చేయకపోగా బీఈడీ, డీఈడీ సర్టిఫికెట్లు పొందిన అభ్యర్థులను రెన్యూవల్ చేయాలని అధికారులు నిర్ణయించారని తెలిపారు. అధికారుల నిర్ణయం వల్ల జిల్లాలోని 36 మంది మెస్సెంజర్లు రోడ్డునపడాల్సి వస్తుందని వాపోయారు. ఏళ్ల తరబడి మెస్సెంజర్లుగా పనిచేసిన వారిని తొలగించడం వల్ల కుటుంబాలకు ఆధారం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల సంఘంలో జిల్లా అధికారులపై ఫిర్యాదు చేయగా ఈనెల 22న హియరింగ్ తేదీ ఇచ్చారని తెలిపారు. మానవహక్కుల సంఘంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని దిలీప్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఆదివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో పాఠశాల విద్య ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ అశోక్ విడుదల చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఫలితాలను www. bsetelangana. org, www.sakshieducation.com వెబ్సైట్లలో పొందవచ్చు. -
నేడు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ నెల 17 న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో ఈ ఫలితాలను పాఠశాల విద్య ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ అశోక్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఫలితాలను www. bsetelangana. org, www.sakshieducation.com వెబ్సైట్లలో పొందవచ్చు. -
‘ప్రాథమికం'.. అయోమయం!
ప్రాథమిక విద్యను బలోపేతం చేసి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన సర్వశిక్షా అభియాన్ ప్రస్తుతం సంకటంలో పడింది. కేంద్రం ఏటా నిధులు కోత పెడుతుండడంతో క్రమంగా ఉనికి కోల్పోతున్న ఎస్ఎస్ఏకు తాజాగా రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం షాకిచ్చింది. జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పనిచే స్తున్న సెక్టోరియల్, సహాయ సెక్టోరియల్, క్లరికల్ సిబ్బందిని ఒక్కసారిగా తొలగిం చింది. డిప్యుటేషన్పై పనిచేస్తున్న వీరిని వెంటనే సొంత శాఖకు పంపించాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లా ఎస్ఎస్ఏలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారు ఒకట్రెండు రోజుల్లో రిలీవ్ కానున్నారు. ఇక.. ఆ కుర్చీలన్నీ ఖాళీ కావడంతో ప్రాజెక్టు కార్యక్రమాల అమలు అగమ్యగోచరంగా మారనుంది. * మూకుమ్మడిగా సెక్టోరియల్, సహాయకుల తొలగింపు * గడువు ముగిసిందంటూ డిప్యుటేషన్లు రద్దు * ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ * కొత్త నియామకాలపై స్పష్టత కరువు * అటకెక్కనున్న విద్యా కార్యక్రమాలు * సంకటంలో సర్వశిక్షా అభియాన్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో విద్యాశాఖకు సంబంధించిన పలువురు అధికారులు డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. హోదాకు తగినట్లు వారికి బాధ్యతలు అప్పగించారు. కమ్యునిటీ మొబిలైజేషన్ ఆఫీసర్, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, బాలికావిద్య విభాగాలకు ముగ్గురు గెజిటెడ్ ఉపాధ్యాయులు సెక్టోరియల్ అధికారులుగా పనిచేస్తున్నారు. అదే విధంగా సహాయ గణాంక అధికారి, సహాయ ప్లానింగ్ అధికారి, సహాయ పర్యవేక్షణ అధికారులుగా స్కూల్ అసిస్టెంట్లు కొనసాగుతున్నారు. ఇదే విభాగంలో నలుగు జూనియర్ అసిస్టెంట్లుగా విద్యాశాఖకు చెందిన వారున్నారు. తాజాగా వారి డిప్యుటేషన్ రద్దు చేస్తూ ఎస్పీడీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొత్త వారిని నియమించొద్దని స్పష్టం చేశారు. టీచర్లంతా బడిలోనే పనిచేయాలనే ఆర్టీఈ నిబంధనలతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఔట్సోర్సింగ్ వాళ్లకు ఈ బాధ్యతలు అప్పగించేలా ఎస్ఎస్ఏ ఎస్పీడీ యోచిస్తున్నట్లు సమాచారం. కార్యక్రమాలు సాగేదెలా..? ఎస్ఎస్ఏలో కీలక విభాగాల అధికారుల తొలగింపుతో పలు కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. పాఠశాల యాజమాన్యాల ఏర్పాటు, బడిబాట, పిల్లల హక్కులు, స్కూల్ డ్రస్సులకు సంబంధించి కార్యక్రమాల పురోగతి అయోమయంలో పడింది. ప్రస్తుతం పాఠశాలల్లో పిల్లలకు యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. బాలికా విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిలిచిపోనున్నాయి. వార్షిక ప్రణాళిక తయారీ, అమలు, పాఠశాలల వారీగా గణాంకాల సేకరణ.. తదుపరి కార్యచరణ.. పాఠశాలల పర్యవేక్షణ.... ఇలా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రశ్నార్థకం కానున్నాయి. కొత్తగా ఔట్సోర్సింగ్ వాళ్లను నియమించే చర్యలు తీసుకున్నా.. అందుకు మరింత సమయం పడుతుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
బీ'టెక్కు'బాబు
చచ్చీచెడీ ప్రభుత్వోద్యోగం సాధించిన ఓ ప్రబద్ధుడు అక్కడితో సంతృప్తి చెందలేదు. పెత్తనం చేసే పైస్థాయి పోస్టు వస్తే.. హోదాకు హోదా.. సంపాదనకు సంపాదన.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టేయాలనుకున్నాడు. కానీ అధికారి స్థాయి పోస్టుకు కావాల్సిన విద్యార్హత లేదు. అలాగని కష్టపడి చదివే సత్తానూ లేదు. ఇవి లేకుండానే అనుకున్నది సాధించేందుకు ఓ స్కెచ్ వేశాడు. ఎక్కడో ఊరూ పేరూ లేని యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా కొనేసి.. దాన్ని చూపించి ప్రమోషన్ కొట్టేశాడు. ఆ తర్వాత ఇక్కడే ఎంటెక్ కూడా చేసేశాడు. ఆనక ఓ టీడీపీ ప్రజాప్రతినిధిని పట్టుకుని ఇటీవలే ఓ కీలక పోస్టులో దర్జాగా సెటిల్ అయిపోయాడు. అప్పటినుంచి అడ్డంగా వసూళ్లపై పడిపోతున్నాడు. ఆయనెవరు?.. ఏమిటాయన బీ‘టెక్కు’??.. మీరే చదవండి.. విశాఖపట్నం : డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడు పంచాయతీరాజ్ శాఖలో సూపర్వైజర్గా ఉద్యోగం సాధించాడు. తదనంతరకాలంలో ఆ శాఖలో సూపర్వైజర్ పోస్టులు రద్దు కావడంతో అసిస్టెంట్ ఇంజనీర్ హోదా కట్టబెట్టారు. అదే హోదాతో పాడేరు, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల్లో పనిచేశాడు. అసిస్టెంట్ ఇంజనీర్గా ఎన్నాళ్లు చేస్తాం.. ప్రమోషన్ సాధిస్తే పలుకుబడితో పాటు పైసలు సంపాదించొచ్చని ఆశ పడ్డాడు. కానీ పదోన్నతి కావాలంటే డిప్లొమా సరిపోదు ఇంజనీరింగ్ పట్టా కావాలి. అయితే కష్టపడి చదివేంత సీన్ అతగాడికి లేదు. దాంతో చదువు‘కొనేద్దామని’ ప్లాన్ వేశాడు. అనుకోవడమే ఆలస్యం.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గుర్తింపు లేని రాజస్థాన్కు చెందిన ఓ యూనివర్సిటీ నుంచి బీటెక్ పట్టా కొనేశాడు. రాజస్థాన్ రాష్ర్టంలోని వర్సిటీ నుంచి కరస్పాండెన్స్ కోర్సు ద్వారా చదివాడని అనుకుందామన్నా.. అప్పట్లో బీటెక్ సివిల్ విభాగం కోర్సుకు ఆ అవకాశం లేదు. పోనీ ఈయన గారే అక్కడకు వెళ్లి చదువుకున్నాడని అనుకుందామంటే.. ఇక్కడ ఉద్యోగానికి సెలవు పెట్టాలి. శాఖాపరమైన అనుమతి తీసుకోవాలి. కానీ అలాంటివేవీ ఆయన సర్వీసు రికార్డుల్లో లేవు. ఎలాగైతేనేం కొనేసిన బీటెక్ పట్టా చూపించి ప్రమోషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అప్పట్లో హైదరాబాద్లో స్క్రూటినీ చేసిన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఇతని బీటెక్ పట్టా చూసి అగ్గి మీద గుగ్గిలమైపోయారు, మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా.. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్లు చేస్తే అరెస్టు చేయిస్తాం.. అని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ప్రమోషన్ పోతే పోయింది... ఉన్న ఉద్యోగం మిగిలింది.. అదే చాలు.. ఇంకేమీ ఆలోచనలు పెట్టుకోకుండా ఆ ఉద్యోగం చేసుకోమని సహోద్యోగులు సలహా ఇచ్చారు. కానీ ఆయనగారి ఆశ చావలేదు.. ఆయనలోనూ మార్పు రాలేదు. ఈసారి మరో స్కెచ్ ఆ బీటెక్ సర్టిఫికెట్తోనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నాడు. కనీసం ఏ వర్సిటీ నుంచి బీటెక్ పట్టా పొందాడో కూడా పరిశీలించని ఏయూ అధికారులు అతనికి ఎంటెక్ సీటు.. రెండేళ్ల తర్వాత పట్టా ఇచ్చేశారు. ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంటెక్ పట్టా వచ్చిందంటే ఇంకేముంది.. వెంటనే ప్రమోషన్ కూడా వచ్చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండ కూడా తోడైంది. అంతే డిప్యుటేషన్పై విద్యాశాఖకు బదలీ అయ్యాడు.. ఇటీవలే సర్వశిక్ష అభియాన్లో కీలక పోస్టు కూడా దక్కించుకున్నాడు. ఆ విధంగా తన కలల పోస్టులో కూర్చున్నాడు. ఇక అడ్డు అదుపు లేకుండా వసూళ్ల దందాకు తెర లేపాడు. కేవలం నెలల వ్యవధిలోనే రూ.కోట్లకు పడగలెత్తాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నమొన్నటి వరకు తమ పక్కనే ఉన్న ఓ ఉద్యోగి నకిలీ పట్టాతో అడ్డగోలుగా దూసుకుపోతూ రూ.కోట్లకు పడగలెత్తడాన్ని జీర్ణించుకోలేని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు మనోడి బండారాన్ని బట్టబయలు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారట!. -
సీఆర్పీల వేతనాలు నిలుపుదల
హెచ్ఎంల నిర్లక్ష్యం ఫలితమే కారణం మోర్తాడ్: సర్వశిక్ష అభియాన్ పథకంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)ల వేతనాలను జిల్లా అధికార యంత్రాంగం నిలిపి వేసింది. గ్రామీణ విద్యా రిజిస్టర్లను పూర్తి చేసి ఇవ్వడంలో హెచ్ఎంలు జాప్యం చేసిన కారణంగా అధికార యంత్రాం గం సీఆర్పీలపై చర్యలు తీసుకుంది. జిల్లాలో 209 మంది సీఆర్పీలు పని చేస్తున్నారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలలకు, మండల రిసోర్స్ సెంటర్కు మధ్య సీఆర్పీలు సమన్వయం చేస్తారు. వీరికి ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా రూ.8,500 వేతనం చెల్లిస్తుంది. అయితే, ఏప్రిల్కు సంబంధించిన వేతనాన్ని మాత్రం సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారులు నిలపివేశారు. గ్రామీణ విద్యా రిజిస్టర్లను పూర్తి చేసి సర్వశిక్ష అభియాన్ పథకానికి అందించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉంది. కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ రిజిస్టర్లను అందించక పోవడంతో జిల్లాలోని అందరు సీఆర్పీల వేతనాన్ని అధికారులు నిలిపివేశారు. పాఠశాలలకు వేసవి సెలవులను ఇవ్వడంతో గ్రామీణ విద్యా రిజిస్టర్లను పూర్తి చేసివ్వడంపై హెచ్ఎంలు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు చేసిన తప్పిదానికి తమ వేతనం నిలిపి వేయడం ఎంతవరకు సబబు అని సీఆర్పీలు వాపోతున్నారు. వీరితో ఎంఐఎస్, కంప్యూటర్ ఆపరేటర్, మెస్సెంజర్ల వేతనాలను చెల్లించడం నిలిపివేసిన అధికారులు రెండ్రోజుల కింద సీఆర్పీలను మినహాయించి ఇతర ఉద్యోగుల వేతనాలు చెల్లించారు. ప్రభుత్వం స్పందించి తమకు కూడా వేతనాలు ఇప్పించాలని సీఆర్పీలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. గ్రామీణ విద్యా రిజిస్టర్లను అందచేయక పోవడంతో సీఆర్పీల వేతనాలు నిలిపి వే యాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. అందుకే వేతనాలు నిలిపివేశాం. తదుపరి ఆదేశాలు వస్తే వేతనాలు చెల్లిస్తాం. - రవికిరణ్, సర్వశిక్ష అభియాన్ ప్రతినిధి -
జిల్లాలో ‘పడే భారత్.. బడే భారత్’
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు * రూ.2 కోట్ల నిధుల మంజూరు * సర్వశిక్షా అభియాన్ ఏఎంవో సర్వేశ్వరరావు వెల్లడి ఆకివీడు: జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘పడే భారత్-బడే భారత్’ పథకాన్ని అమలు చేయనున్నట్టు సర్వశిక్షఅభియాన్ ఏఎంవో ఈ.సర్వేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎంఈవో కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాల్ని మరింత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని చెప్పారు. పథకం అమలు చేసేందుకు జిల్లాకు రూ.2 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. పథకం అమలులో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఏడు రోజులపాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్లు నిర్వహిస్తామని చెప్పారు. నెలకు ఒకటి చొప్పున ఎనిమిది కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. టీఎల్ఎం గ్రాంట్ పెంపు తెలుగు, ఇంగ్లిష్ భాషలపై జిల్లా, మండల, కాంప్లెక్స్, స్కూల్ స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తామని ఏఎంవో తెలిపారు. చదవడం, రాయడంతో పాటు లెక్కల్లో నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి టీచర్ గ్రాంట్ మంజూరు కానుందని చెప్పారు. గతంలో టీఎల్ఎంకు రూ.500 ఇచ్చేవారని రూ.1,000కు పెంచాలని ప్రతిపాదించామన్నారు. వచ్చే ఏడాది నుంచి టీఎల్ఎం గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏఎంవో పేర్కొన్నారు. 23 వరకు బడిబాట సంకల్పం-బడిబాట కార్యక్రమాన్ని ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్టు ఏఎంవో తెలిపారు. జిల్లాలో ఐదేళ్లు పైబడిన 25 వేల మందిని బడిలో చేర్పించడమే లక్ష్యంతో సాగుతున్నామని ఆయన చెప్పారు. -
స్థానిక సంస్థలకు నిధులలేమి
నిధులిచ్చి ఆదుకోవాలని ఆర్థిక సంఘ సభ్యులకు జెడ్పీ చైర్మన్ వినతి ఆదాయ మార్గాలున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వెల్లడి కర్నూలు సిటీ: స్థానిక సంస్థలు నిధులేమితో అభివృద్ధికి నోచుకోవడం లేదని, ప్రభుత్వం నిధులు కేటాయించి ఆదుకోవాలని జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, అధికారులు రాష్ట్ర నాలుగో ఆర్థిక సంఘం సభ్యులకు విన్నవించారు. శనివారం స్థానిక జెడ్పీ సీఈఓ చాంబర్లో ఆయా ప్రభుత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు, మెంబర్ సెక్రటరీ సీవీ రావు, జాయింట్ సెక్రటరీ శంకర్ రెడ్డి, చీఫ్ ఆకౌంట్ ఆఫీసర్ తఖీవుద్ధీన్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నామని,దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమపర్పిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే అందులో నుంచి ఎలా బయటపడాలో అధికారులును అడిగి వారి సలహాలను నివేదికలో పొందుపరుస్తామన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, నిధుల వినియోగంలో పరిపాలన అనుమతులు ఇచ్చేందుకు జెడ్పీకి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు, మండల పరిషత్లకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కోరారు. అదే విధంగా జనాభా లెక్కల ప్రకారం జిల్లాకు రావాల్సిన మేరకు తలసరి గ్రాంట్ రావడం లేదని, అలాగే గత రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసులు అమలు కావడం లేదన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, చేతి పంపుల నిర్వహణకు నిధులు ఇవ్వాలని ఆర్థిక సంఘానికి విన్నవించారు. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాల భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాలు సర్వశిక్ష అభియాన్ ద్వారా కాకుండా పంచాయతీరాజ్ ఇంజినీర్ల ద్వారా చేయించి, నిర్ణీత ఫీజుల్లో వాటా ఇవ్వాలని జెడ్పీ అధికారులు కోరారు. అనంతరం ఆర్థిక సంఘం సభ్యులు కంప్యూటర్ సెక్షన్ను తనీఖీ చేశారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ జయరామిరెడ్డి, జెడ్పీ ఏఓ భాస్కర్ నాయుడు, డీపీఓ శోభ స్వరూపరాణి, పీఆర్ ఎస్ఈ సురేంద్రనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పి.భాను వీర ప్రసాద్, ఎంపీడీఓలు అమృతరాజ్, ప్రతాప్ రెడ్డి, ఎంపీపీలు డి.రాజావర్దన్ రెడ్డి, ప్రసాద్ రె డ్డి, కొత్తపల్లి, పత్తికొండ జెడ్పీటీసీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, సుకన్య, ఈఓఆర్డీలు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఏలోనూ జన్మభూమి కమిటీల - పెత్తనం!
ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయంపాఠశాలల నిధులను కొల్లగొట్టేందుకేనంటున్నఉపాధ్యాయ సంఘాల నేతలు వెంటనే ఎస్ఎంసీలనుపునరుద్ధరించాలని డిమాండ్ సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు రాకతో పాఠశాల దశ,దిశ మారిందని చెప్పవచ్చు. ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ ఖర్చులకు నిధులను కేటాయిస్తోంది. ప్రాథమిక పాఠశాలకు రూ.7 వేలు, ఉన్నత పాఠశాలకు రూ.12 వేలు మంజూరు చేస్తుంది. వీటితోపాటు పాఠశాలకు మంజూరయ్యే భవనాలు, అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, బాత్రూంలు, నీటి సౌకర్యాలను కల్పించేందుకు విడుదలయ్యే నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆమోదంతో ఖర్చు చేయాలి. చెక్పవర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, పాఠశాల హెచ్ఎంకు ఉంటుంది. ఏడాది క్రితమే రద్దైన ఎస్ఎంసీలు పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒక్కరినీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా నియమిస్తారు. ఈయనతోపాటు మరికొంతమంది తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. కమిటీకి రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. గతంలో 2013-14, 2014-15 విద్యా సంవత్సరానికి ఎస్ఎంసీను నియమించారు. దీని కాలపరిమితి ముగిసి ఏడాదైంది. కొత్త కమిటీని నియమించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా ఎస్ఎంసీలు లేవనే సాకుతో ఇటీవల ఎస్ఎస్ఏ నిధులను వినియోగానికి జన్మభూమి కమిటీల అనుమతితో వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. జన్మభూమికమిటీల తీరుపై ఆరోపణల వెల్లువ ఇప్పటికే సంక్షేమ పథకాల అమల్లో జన్మభూమి కమిటీల అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుదారులు, లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో వాటి ప్రవేశంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వచ్చే అరకొర నిధుల్లో వాటా అడిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఎంసీల అకౌంట్లలో రూ.2.17 కోట్లు జమ గతంలో ప్రభుత్వం ఎస్ఎంసీల నుంచి తీసుకున్న 2.17 కోట్లను తిరిగి జమ చేసింది. స్కూల్ గ్రాంట్ కింద రూ. 93 లక్షలు, నిర్వహణ నిధుల కింద రూ. 1.24 కోట్లు జమైనట్లు పీఓ వై.రామచంద్రారెడ్డి తెలిపారు. -
మళ్లీ వస్తా!
పై స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయంటూ ప్రచారం ఆయన హయాంలో పలు అవినీతి ఆరోపణలు కొత్త అధికారి వస్తే బయటపడుతుందేమోనని ఆందోళన సిబ్బంది నోరు మెదపకుండా ముందస్తు జాగ్రత్త కర్నూలు: సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)లో గతంలో పనిచేసిన అధికారి వ్యవహారం హాట్టాపిక్గా మారింది. మళ్లీ ఎస్ఎస్ఏ అధికారిగా తానే వస్తానంటూ అక్కడి ఉద్యోగుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇందుకోసం తనకు పైస్థాయిలో ఆశీస్సులు కూడా ఉన్నాయని ఆయన చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన అధికారి మొదట్లో విధుల్లో చేరకుండా అడ్డుకోగలిగానని కూడా ఆయన వ్యాఖ్యానిస్తుండటం చర్చకు దారితీస్తోంది. రెండు నెలల్లోగా తానే మళ్లీ అధికారిగా వస్తానని ఆయన నిర్దిష్ట సమయాన్ని కూడా చెబుతుండటం దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఎస్ఎస్ఏ వ్యవహారాలపై ఆరోపణలు రావడం కూడా చర్చనీయాంశమవుతోంది . అన్నీ ఆరోపణలే.. వాస్తవానికి ఎస్ఎస్ఏ వ్యవహారంలో మొదటి నుంచీ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. అధికారుల పుణ్యమా అని 2015-16 ఆర్థిక సంవత్సరంలో అదనపు తరగతుల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇందుకు కారణం 2014-15లో కేంద్రం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేయకపోవడమే. దీంతో పాటుగా జిల్లాలో పాఠశాలన్నింటిలోనూ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామని ప్రభుత్వానికి ఎస్ఎస్ఏ అధికారులు నివేదించారు. అదేవిధంగా కేవలం ఈ విద్యా సంవత్సరంలో 700 పైచిలుకు పాఠశాలల్లోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించామని బిల్లులు కూడా చూపించారు. అయితే, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తాజాగా జిల్లాలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటించిన సందర్భంలోనూ ఇదే విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో కొత్త అధికారి రావడంతో తాను చేసిన మొత్తం వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న అనుమానం గతంలో పనిచేసిన అధికారికి కలుగుతోందని సమాచారం. -
సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో గోల్ మాల్
అనంతపురం: అనంతపురం జిల్లా సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో భారీ మొత్తంలో డబ్బును స్వాహా చేయడానికి యత్నించారు. కలెక్టర్ కోనా శశిధర్ అనుమతి లేకుండానే రూ.6.38 కోట్లు డ్రా చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ వ్యవహారంలో నిబంధనలు పాటించని పీఓ జయకుమార్ పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. -
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
- ఆర్వీఎం నియామకాల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు సంగారెడ్డి మున్సిపాలిటీ : సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు వారిని తిరిగి దొడ్డిదారిలో విధుల్లోకి తీసుకొంటూ రూ. లక్షలు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలన్నా, తొలగించాలన్న రాష్ట్ర ప్రాజెక్టు అధికారి అనుమతితోనే చేపట్టాల్సి ఉంటుంది. అయితే మామూళ్లు దండుకొని దర్జాగా కోరిన చోట పోస్టింగ్లు ఇస్తున్నారు. గత మార్చిలో ములుగు కస్తూర్బాగాంధీ బాలిక హాస్టల్ ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అప్పట్లో జిల్లా ఆర్వీఎం పీఓ ప్రకటించారు. అయితే అధికారులకు మామూళ్లు ముట్టడంతో జేసీడీఓ స్థాయి అధికారితో పాటు కార్యాలయంలోని ప్రధాన విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి డబ్బులు దండుకొని ఆ ప్రత్యేకాధికారికి చిన్న కొడూర్ మండలం అల్లీపూర్ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. చిన్న కోడూర్ మండలం అల్లీపూర్లో పనిచేస్తున్న ప్రత్యేకాధికారి తనకు దూరమవుతున్నందున ములుగు బదిలీ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఆమెకు అక్కడ కాకుండా రాయికోడ్కు బదిలీ చేశారు. నంగునూర్ మండల పరిధిలోని నర్మెటలో పనిచేస్తున్న హాస్టల్ ప్రత్యేక అధికారిపై విద్యార్థులు ఆరోపణలు చేయడంతో సిద్దిపేట ఆర్డీఓ విచారణ చేపట్టారు. దాని ఆధారంగా ఆమెను సెస్పెండ్ చేశారు. అనంతరం జేసీడీఓ ప్రకాశ్రావు శాఖా పరమైన విచారణ చేపట్టి ఆమెను తొలగించారు. అయితే 45 రోజుల తరువాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఇవి కేవలం కొన్ని ఉదహారణలు మాత్రమే. అయితే కింది స్థాయి సిబ్బందిని తొలగించి, తిరిగి తీసుకోవడంలో అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఇలా ప్య్రతేకాధికారుల వ్యవహరమే కాకుండా సీఆర్టీలో సైతం డబ్బులు దండుకొని బదిలీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై జేసీడీఓ ప్రకాశ్రావు మాట్లాడుతూ సస్పెన్షన్కు గురైన ఎస్ఓలు తమ తప్పును ఒప్పుకోవడంతో కలెక్టర్ వారిని తీసుకోవాలని సూచించడంవల్లే తీసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియమకాలు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసే నాన్ టీచింగ్ సిబ్బందిని గుర్తుంపు పొందిన ఏజెన్సీల ద్వారానే నియమించాలి. అయితే నిబంధనలను పట్టించుకోకుండా డబ్బులు దండుకొని ఇష్టానుసారంగా నియమాకాలు చేస్తున్నారు. ఎవరైనా అడిగితే మాత్రం ఏజెన్సీల ద్వారానే నియమించడం జరుగుతుందని సమాచార హక్క చట్టం కింద ఆర్వీఎం శాఖకు చెందిన జేసీడీఓ పేర్కొన్నారు. చిన్నకోడూర్ కేజీబీవీలో స్థానిక నాయకులు, ఆర్వీఎం జిల్లా అధికారులకు ముడుపులు చెల్లించడం వల్లే తీసుకోవడం జరిగిందనే ఆరోపణలున్నాయి. మరో వైపు స్థానిక ఎంఈఓ,ఎంపీడీఓ, ఎస్ఓ తదితరులు కుమ్మకై అడ్వయిజరీ కమిటీ పేరుతో డబ్బులు తీసుకొని అర్హత లేని వారిని నియమించారనే ఆరోపణలు వచ్చాయి. స్పందించని పీఓ ఎస్ఓలను తిరిగి విధుల్లో తీసుకునే విషయంలో ముడుపులు తీసుకుంటున్నారనే విషయమై పీఓను వివరణ కోరే ందుకు ప్రయత్నించినా స్పందించలేదు. -
ఇది పాఠశాలా..? మార్కెట్ యార్డా.. ?
లింగాలఘణపురం : మండలంలోని నెల్లుట్ల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో సర్వశిక్షా అభియాన్ పథకంలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, వాటి నిర్వహణ, తాగునీటి సౌకర్యంపై బుధవారం సీనియర్ కన్సల్టెంట్ సర్వశిక్ష అభియాన్, సర్వ విద్యాలయ్ నుంచి ఢిల్లీ ప్రతినిధి ఏ.ఎం చౌహాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం, వరండాల్లో ధాన్యం బస్తాలను చూసిన ఆయన ఒక్కసారిగా విద్యాలయాల్లో ఇదేం పరిస్థితి.. అనుమతి ఎవరు ఇచ్చారంటూ హెడ్మాస్టర్ ప్రభాకర్ను ప్రశ్నించారు. గతంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో అనుమతి ఇచ్చామని, సెలవులు కావడంతో ఏర్పాటు చేసుకున్నారని హెడ్మాస్టర్ చెప్పగా మళ్లీ పాఠశాల ప్రారంభమయ్యేలోగా పూర్తిగా పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులతో చేయించవద్దని, పాఠశాల ప్రారంభమైన తర్వాత ఇక్కడి ఫొటోలను తీసి వాట్సాప్లో పెట్టాలని హెడ్మాస్టర్ను ఆదేశించారు. సర్వశిక్ష అభియాన్లో మంజూరైన మరుగుదొడ్లను ఎన్టీపీసీ, ఆర్ఈసీల ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతున్న నెల్లుట్ల, పెంబర్తి, జనగామ ఉర్దూ పాఠశాలలో తనిఖీ చేశారు. సర్వశిక్ష అభియాన్ ఈఈ ఎం.రవీందర్రావు, డీడీ జె.జయశంకర్, ఏఈ రమేష్, పీఎస్ హెడ్మాస్టర్ అరుణ ఉన్నారు. పాఠశాలలను సందర్శించిన ఎంహెచ్ఆర్డీ కన్సల్టెంట్ విద్యారణ్యపురి : కేంద్ర మానవనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్ఆర్డీ) నుంచి కన్సల్టెంట్(స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విద్యాలయ) ఎం. చౌహాన్ జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణను బుధవారం పరిశీలించారు. కాజీపేటలోని బాలికల పాఠశాలను, స్టేషన్ఘనపూర్లోని సముద్రాల పీఎస్ను, ఎస్సీబీసీ కాలనీ పీఎస్ను, వెంకటాద్రిపేట యూపీఎస్, పెంబర్తి, మీదికొండ, విశ్వనాథపురం పాఠశాలను సందర్శించి అందులో మరగుదొడ్లను పరిశీలించారు. మురుగుదొడ్లు ఉన్నాయా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని ఉన్నాయనే అంశాలను పరిశీలించారు. -
సామర్థ్యం సన్నగిల్లిందే..!
ప్రాథమిక పాఠశాలల్లో లక్ష మందికి ‘సీ’ గ్రేడ్ చదవడం, రాయడం రాని వైనం సామర్థ్యాన్ని పెంచేందుకు వేసవిలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు 1,809 స్కూల్ కాంప్లెక్స్ల పరిధిలో ఏర్పాటు ఈ నెల 24 నుంచి మే 31 వరకు కొనసాగింపు సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు పాఠశాలల్లోని విద్యార్థుల్లో సామర్థ్యం మసకబారుతోంది. ప్రాథమిక విద్యపై కోట్లు ఖర్చుపెడుతున్నా.. విద్యార్థుల ప్రతిభ మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు. ఏడాది పొడవునా చదువు చెప్పినప్పటికీ ఒంట బట్టించుకోని విద్యార్థులపై సర్వశిక్షా అభియాన్ రాష్ట్రప్రాజెక్టు ప్రత్యేకదృష్టి సారించింది. వార్షిక పరీక్షల్లో పూర్తిగా వెనకబడిన (సీ-గ్రేడ్) విద్యార్థులకు 40 రోజులపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఒకటి నుంచి ఐదో తరగతిలో వార్షిక పరీక్షల్లో ‘సీ’ గ్రేడ్ వచ్చిన విద్యార్థులు మాత్రం ఈ నెల 24 నుంచి మే 31 తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.ఈ మేరకు ఎస్ఎస్ఏ రాష్ట్రప్రాజెక్టు డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకు మూడు గంటలు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో సమ్మెటీవ్-1 (త్రైమాసిక పరీక్షలు)లో సీ గ్రేడ్ వచ్చిన విద్యార్థులు 3,84,974 మంది ఉన్నారు. తాజాగా నిర్వహించిన సమ్మెటీవ్-3 (వార్షిక పరీక్షలు)లో సీ గ్రేడ్ వచ్చిన విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ ప్రణాళిక తయారు చేసింది. ఉదయం 8గంటల నుంచి 11 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1809 స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఒక్కో శిక్షణ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. ఒక్కో కేంద్రంలో కనీసం 50 మంది విద్యార్థుల చొప్పున 90,450 మంది కవర్ కానున్నారు. అయితే సమ్మెటీవ్-3 ఫలితాల ఆధారంగా శిక్షణ కేంద్రాల సంఖ్యలో మార్పులుంటాయి. చదవడం, రాయడమే లక్ష్యంగా.. వేసవిలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల లక్ష్యం విద్యార్థులకు చదవడం, రాయడం కోసమే. వాస్తవానికి ‘సీ’ గ్రేడ్లో నమోదు కావడమంటే వారికి చదవడం, రాయడం సైతం రావడం లేదని అర్థం. ఈ క్రమంలో ప్రత్యేక తరగతుల్లో ఆయా విద్యార్థులకు ఈ రెండు అంశాల అభ్యసన కోసం ప్రత్యేకంగా అభ్యాస పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. తెలుగు, ఆంగ్లం, గణితానికి సంబంధించి ఏ4 సైజులో ఉన్న 1,08,540 పుస్తకాలను విద్యాశాఖ ఇప్పటికే ముద్రించింది. వీటిని ప్రతి సెంటర్కు పంపిణీ చేయనుంది. సీ గ్రేడ్ విద్యార్థులకు బోధన, అభ్యాసన కోసం సీఆర్పీ (క్లస్టర్ రిసోర్స్ పర్సన్)లను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 2,609 మందిని ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఎంపిక చేసింది. వీరు ప్రత్యేక తరగతులు నిర్వహించినందుకుగాను రూ.800 గౌరవవేతనం కూడా ఇవ్వనుంది. -
‘లక్ష మంది’ లక్ష్యం నెరవేరేనా?
చిత్తూరు(ఎడ్యుకేషన్): ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి నిచ్చెన వేసిందన్న చందంగా ఉంది సర్వశిక్ష అభియాన్ నూతనంగా తలపెట్టిన మళ్లీ మనబడికి కార్యక్రమం. సర్కారు పాఠశాలల్లో చేరేందుకు పిల్లలకు సవాలక్ష ఆటంకాలు, అనుమానాలు ఎదురవుతున్నాయి. వీటిని బూచిగా చూపించి ప్రైవేటు విద్యాసంస్థలు పిల్లలను ఆకర్షించి వేలాది రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న లక్షమంది విద్యార్థులను రాను న్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కలెక్టర్ ఎస్ఎస్ఏ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. సర్కారు బడుల బలోపేతానికి కలెక్టర్ ఆలోచన ఆహ్వానించదగినదే అయినప్పటికీ దానికి తగిన సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 5,98,676మంది విద్యార్థులు చ దువుతున్నారు. 5,009 ప్రభుత్వ పాఠశాలల్లో 3,67,356మంది, 1,187 ప్రైవేటు పాఠశాలల్లో 2,31,320మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 0-10మంది లోపు విద్యార్థులు 180 పాఠశాలలు, 11-20 మధ్య విద్యార్థులు ఉన్న పాఠశాలలు 713 ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నా యి. 1,744 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోం ది. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయని తెలిసినా విధిలేని పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలను అందులోనే చేర్చాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠశాలలపై చర్యలేవీ? జిల్లాలో ప్రమాణాలను పాటిస్తున్న ప్రై వేటు పాఠశాలలను వేళ్లమీద లెక్కపెట్టొ చ్చు. ప్రమాణాలు పాటించని పాఠశాలలపై విద్యాశాఖ చేపట్టిన చర్యలు శూ న్యమనే చెప్పాలి. దీనికితోడు కొత్తగా ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుకు అనుమతులిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. కనీస విద్యార్హత లేనివారు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. విద్యాశాఖకు సమర్పిం చే రికార్డుల్లో మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు చూపుతున్నారు. బలవంతపు టార్గెట్లు సంస్థాగతంగా అనేక లోపాలున్న సర్కా రు బడుల వైపు విద్యార్థులను క్యూకట్టించడం అధికారులకు కత్తిమీద సాము లాంటిదే. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు బలవంతపు టార్గెట్లను నిర్ణయించి చేయమనడంపై అంతర్మథనం మొదలైంది. ఏదేమైనప్పటికీ ఈ బాధ్యతను విద్యా శాఖ ఏ మేరకు నెరవేరుస్తుందో తేలాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. -
సర్వ‘భక్షా’భియాన్
ఖమ్మం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు విడుదల చేసే సర్వశిక్ష అభియాన్ జిల్లాలో సర్వ భక్ష అభియాన్గా మారిందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో విద్యావలంటీర్ల వేతనాలు, ఇతర ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ పేరిట భక్షణ జరిగినట్లు బయటపడింది. ఏకరూప దుస్తులు, కేజీబీవీలు, భవిత సెంటర్ల వస్తువులు, బోధనోపకరణాల కొనుగోళ్ళలోనూ రూ.లక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అధికారులను బదిలీ చేశారు. మరికొందరి నుంచి డబ్బులు రికవరీ చేశారు. అయినా ఆశాఖ అధికారుల్లో మార్పు రాలేదని తెలుస్తోంది. కస్తూరిబా గాంధీ, సివిల్ వర్క్స్లో మరోమారు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వస్తున్నాయి. వాహనాల వినియోగం, ఇతర వస్తువుల కొనుగోళ్లలో బిల్లులు తారుమారు చేశారని తెలుస్తోంది. కోట్ల రూపాయల లావాదేవీల పనులను ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టడంపై జిల్లా ఉన్నతాధికారులు అభ్యంతరాలు చెప్పినా సదరు ఉద్యోగుల సెక్షన్లు మార్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. సంవత్సరాలు గడిచినా తేలని లెక్కలు.. నూతన భవనాల నిర్మాణం, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పన , పాఠశాలలో వివిధ కార్యక్రమాలు, సైన్స్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ సామగ్రి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తోంది. గత సంవత్సరం పాఠశాల గ్రాంట్స్, పాఠశాల నిర్వాహణ నిధులు, ఏకరూప దుస్తుల డబ్బులు, వాటి కుట్టుకూలి, ఉపాధ్యాయుడి గ్రాంట్స్, స్కూల్ కాంప్లెక్స్, సివిల్ వర్క్స్, ఎస్కాట్ అలవెన్స్, సీడబ్ల్యూ టాయిలెట్స్, వార్షికోత్సవ నిర్వాహణ నిధులు... సర్వశిక్ష అభియాన్ ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అకౌంట్లలో జమచేశారు. గత సంవత్సరం ఖర్చు అయిన డబ్బులు పోగా మిగిలిన డబ్బుల లెక్కలు చెప్పేందుకు పలువురు ఉపాధ్యాయులకు తమ అకౌంట్లలో ఎన్ని డబ్బులు ఉన్నాయి. అవి ఏ గ్రాంట్స్కు సంబంధించినవి అనేది తెలియడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధులలో ఖర్చుకాగా రూ. 10.63 కోట్లు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో రూ. 79,11,532కు లెక్క తేలక సదరు ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు. సర్వశిక్ష అభియాన్ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నుంచి విడుదలైన డబ్బులను పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 17 బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహిస్తూ వీటిని ఖర్చు చేస్తున్నారు. ఆయా బ్యాంకుల అధికారులతో ఎస్ఎస్ఏలో పనిచేసే ఉద్యోగులు కుమ్మక్కై వీటిని ఇష్టానుసారం డ్రా చేసే వారని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులనూ తప్పుతోవ పట్టించిన సందర్భాలు లేకపోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఇక్కడ పనిచేసిన పలువురు పీవోలు రూ.లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయా అధికారులపై రాష్ట్ర స్థాయిలో విచారణ సైతం జరిగింది. అక్కడ తమకు ఉన్న పలుకు బడిని ఉపయోగించుకొని సదరు అధికారులు బయటపడ్డారనే ప్రచారం సైతం జరిగింది. దీనిని గమనించిన రాష్ట్ర అధికారులు ఎస్ఎస్ఏ లావాదేవీలు అన్ని ఎస్బీహెచ్ ( స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్) ద్వారా జరపాలని ఆదేశించారు. ఈ బ్యాంకుల మార్పిడిలో జిల్లాలో సుమారు 12 పాఠశాలలు ముందుకు రాకపోవడం, పలు పాఠశాల హెచ్ఎంలు బ్యాంకులు మార్చినా తమ ఖాతాలో ఉన్న డబ్బుల వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. సుమారు 100కు పైగా పాఠశాలల హెచ్ఎంలు ఆడిట్ చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలువురు ఉద్యోగులు ఆడిందే ఆట విద్యాశాఖలో పనిచేస్తున్న నాన్టీచింగ్ ఉద్యోగుల పోస్టులు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో లేకపోవడంతో ఒకటి, రెండు సంవత్సరాలు బయట విధులు నిర్వహించినా మళ్లీ వచ్చి ఇక్కడే తిష్టవేస్తున్నారు. డీఈవో, ఆర్వీఎంలలో పనిచేయటం పరిపాటిగా మారింది. ఒకే సెక్షన్లో ఏళ్ల తరబడి పనిచేస్తుండటంతో లావాదేవీలు, వసూళ్లలో ఆరితేరుతున్నారనే అభియోగం ఉంది. పాఠశాల మౌలిక వసతులు, భవనాలు, మానిటరింగ్తో పాటు విద్యాశాఖ అధికారికి కలిపి పది వాహనాలకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. ఈ వాహనాలను పలువురు ఉద్యోగులు తమ సొంతానికి వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో ఉండే ఓ అధికారి తమ కుటుంబ సభ్యుల పేరున కారు పెట్టి వందల కిలోమీటర్లు తిరిగినట్లు ప్రతి నెల బిల్లులు తీసుకోవడం గమనార్హం. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం బి. శ్రీనివాస్, ఎస్ఎస్ఏ పీవో కార్యాలయం ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే స్పష్టమైన ఫిర్యాదులు ఎవరూ చేయలేదు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. సంవత్సరాల తరబడి ఒకే సెక్షన్లో ఉద్యోగులు ఉన్నారనేది వాస్తవం. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారితో కూడా చర్చించాను. త్వరలో జిల్లా కలెక్టర్గారి అనుమతితో సెక్షన్లు మార్పు చేస్తాం. -
ఎట్టకేలకు విదిల్చారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్వశిక్షా అభియాన్ జిల్లా విభాగం 2014-15 వార్షిక సంవత్సరానికిగాను రూ.192.69కోట్ల వార్షిక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారు ప్రణాళికను ఆమోదించినప్పటికీ.. ఒకసారి రూ.3కోట్లు విడుదలచేసి చేతులు దులుపుకుంది. దీంతో అందుబాటులో ఉన్న నిధులను ఖర్చుచేసిన అధికారులు.. నిధులు నిండుకోవడంతో పలు కార్యక్రమాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. వాస్తవానికి వార్షిక ప్రణాళికలో రూ.192.69కోట్లు పేర్కొనగా.. ఇందులో సిబ్బంది వేతనాల కోసం రూ.80.55కోట్లు, విద్యార్థుల యూనిఫాం, పుస్తకాల కోసం రూ.11కోట్లు, పాఠశాల, టీచర్ల గ్రాంట్ల కోసం రూ.10కోట్లు, మౌలికవసతుల కల్పనకు రూ.55కోట్లు కేటాయించారు. ప్రణాళికలో అన్ని ప్రాధాన్యత అంశాలే అయినప్పటికీ.. నిధులు విడుదల కాకపోవడంతో పలు కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో తాజాగా రూ.16.10కోట్లు విడుదల కావడంతో అధికారులకు పనికల్పించినట్లైంది. వచ్చింది పదిశాతమే.. వార్షిక సంవత్సరం ప్రారంభమై తొమ్మిదినెలలు గడిచింది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్లో మూప్పావువంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ నిధులు విడుదల కాకపోవడంతో పలుకార్యక్రమాలు అటకెక్కాయి. ఎస్ఎస్ఏకు రెండునెలల క్రితం రూ.3 కోట్లు విడుదల చేసిన సర్కారు.. తాజాగా రూ.16.10 కోట్లు ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు రూ.19.10 కోట్లు విడుదలయ్యాయి. అంటే వార్షిక ప్రణాళికలో కేవలం పదిశాతం మాత్రమే నిధులు వచ్చాయి. మార్చిలోగా ప్రణాళిక ప్రకారం నిధులు వస్తాయని అధికారులు చెబుతున్నప్పటికీ.. చివరి నిమిషంలో వచ్చిన నిధులను ఖర్చుచేసే అంశంపైనా సందేహాలు లేకపోలేదు. వారంలోగా బడుల ఖాతాల్లోకి.. తాజాగా వచ్చిన నిధుల్లో పాఠశాల నిర్వహణ నిధుల, ఇతర గ్రాంట్లు కలిపి రూ.3.15 కోట్లు విడుదలయ్యాయి. వీటిని పాఠశాలల ఖాతాల్లోకి పంపిణీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వారం రోజుల్లో పాఠశాలలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేయనున్నట్లు సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి కిషన్రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
నేటినుంచి ప్రత్యేక కార్యక్రమాలు
* వికలాంగుల దినోత్సవం సందర్భంగా.. మండల, జిల్లాస్థాయిలో పోటీలు * ప్రత్యేక అవసరాలుగల పిల్లలు, వారి తల్లిదండ్రులకు * సాధారణ పిల్లలతోపాటు ఉపాధ్యాయులకు కూడా.. చిలుకూరు : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి యేటా ప్రపంచ వికలాంగుల దినోత్పవం సందర్భంగా ప్రత్యేక అవసరాల పిల్లలకు మాత్రమే ఒక్క రోజు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసేవారు. కానీ ఈ ఏడాది నుంచి కార్యక్రమాల నిర్వహణలో మార్పులు చేశారు. వారం రోజుల పాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు అలాగే సాధారణ పిల్లలు, ఉపాధ్యాయులకు కూడా మండల జిల్లా స్థాయిలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. నేడు ఉపాధ్యాయులకు.. మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శుక్రవారం వివిధ అంశాలలో పోటీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, సహిత విద్యలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై వకృ్తత్వ పోటీలు , ప్రత్యేక అవసరాల పిల్లల స్థితిగతులపై క్రియేటివ్ ఆర్ట్ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన ఉపాధ్యాయులు వచ్చే నెల ఒకటవ తేదీన జిల్లా స్థాయిలో నల్లగొండలోని సర్వశిక్ష అభయాన్లో నిర్వహించే పోటీలలో పాల్గొనాలి. డిసెంబర్ 2వ తేదీన పిల్లలకు పోటీలు * వచ్చే నెల 2వ తేదీన ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో పాటు సాధారణ పిల్లలను కలిపి ఆటల పోటీలు నిర్వహిస్తారు. * త్రోబాల్, రింగ్స్ వేయడం, బోర్డు గేమ్, బ్యాలెన్స్ వాక్, రంగోలి, డ్రాయింగ్, పెయింటింగ్, పాటల పోటీలు నిర్వహిస్తారు. బుట్టలో బంతి వేయడం, సరళమైన ఆటలు నిర్వహిస్తారు. 3న తల్లిదండ్రులకు కూడా.. వచ్చే నెల 3వ తేదీన ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు కూడా పలు రకాల ఆటలు పోటీలు నిర్వహిస్తారు . రన్నింగ్, రంగోలి, పాటలు, డ్యాన్స్ల పోటీలు నిర్వహిస్తారు. కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించేందుకు మండలానికి ప్రత్యేకంగా రూ. 10 వేల చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఎంఈఓలకు పూర్తి స్థాయిలో సమాచారం అందించారు. -
కేజీబీవీల్లో నిరంతర విద్యుత్కు చర్యలు
విశాఖపట్నం : జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్భాగాందీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీ) 24 గంటలూ విద్యుత్ ఉండేలా ఎస్ఎస్ఏ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సింగిల్ ఫేస్తో నడుస్తున్న 18 కేజీబీవీలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండేలా త్రీ ఫేస్ అమర్చుతున్నారు. తొలుత కశింకోట, గొలుగొండ కేజీబీవీలకు ఈ సౌకర్యం కలగనుంది. త్వరలో త్రీ ఫేస్ దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్శాఖ అధికారులతో ఎస్ఎస్ఏ ఇంజినీరింగ్ అధికారులు మాట్లాడి త్రీ ఫేస్కు టాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు సమకూర్చాలని కోరారు. ఇందుకు అవసరమైన ఖర్చును ఎస్ఎస్ఏ అధికారులు భరిస్తారు. ప్రస్తుతం కశింకోట, గొలుగొండ మండలాల్లో ఉన్న కేజీబీవీలకు త్రీఫేస్ విద్యుత్ సమకూర్చనున్నారు. సింగిల్ ఫేస్తో చదువుకోవడానికి బాలికలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు విద్యుత్ సదుపాయం లేనప్పుడు మరుగుదొడ్లకు వెళ్లడానికి అవస్థలు పడడాన్ని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు పాఠశాలలకు త్రీఫేస్ ఇచ్చేందుకు ఇప్పటికే విద్యుత్శాఖకు డబ్బు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. మిగతా కేజీబీవీలకు త్వరలోనే త్రీ ఫేస్ సౌకర్యం కల్పించనున్నారు. వీరు తీసుకున్న చొరవతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కంప్యూటర్ ఆధారిత ‘మిథ్య’
* జిల్లాలో 113 స్కూళ్లలో 501 సిస్టమ్స్ * పనిచేసేవి కొన్నే.. బాగు చేసేదెప్పుడో? ఏలూరు సిటీ : పంచ పాండవులు మంచం కోళ్లలా ముగ్గురుంటారని రెండు వేళ్లు చూపించి ఒకటి అంకెను పలకపై రాశాడన్నట్టు ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య. జిల్లాలో 113 స్కూళ్లకు మొత్తం 501 కంప్యూటర్లు అందజేసినట్టు రాజీవ్ విద్యామిషన్ అధికారులు చెబుతున్నా కొన్నిచోట్ల అవి కనిపించడం లేదు. మరి కొన్నిచోట్ల పనిచేయవు. కొన్ని రాజీవ్ విద్యామిషన్ అధికారులే ప్రత్యేక పనుల నిమిత్తం పట్టుకెళ్లారని చెబుతున్నారు. దానాదీనా తేలిందేమంటే అయిదు ఉండవలసినచోట మూడే కనిపిస్తాయి. అందులో రెండు పనిచేయవు, మిగిలిన ఒక్క దాన్నీ కూడా కుస్తీ పట్టాల్సిందే! ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ విద్య అందిస్తున్నామని చెప్పుకోవడానికే మినహా దీనివల్ల ఒనగూరేది శూన్యమనే విషయం సోమవారం నిర్వహించిన ‘సాక్షి’ విజిట్లో తేటతెల్లమైంది. జిల్లావ్యాప్తంగా 113 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య అమలు చేస్తున్నారు. ఐదేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నా తూతూ మంత్రంగానే సాగుతోంది. ఒక్కో పాఠశాలకు ఐదు చొప్పున కంప్యూటర్లు అందించామని రాజీవ్ విద్యామిషన్ (సర్వశిక్ష అభియాన్) అధికారులు చెబుతున్నా.. స్కూళ్లలో మాత్రం అవి కన్పించడం లేదు. స్కూల్ ప్రధానోపాధ్యాయులను ప్రశ్నిస్తే ఇచ్చిన కంప్యూటర్లలో మూడో, నాలుగో సర్వశిక్ష అభియాన్కు ప్రత్యేక పనుల నిమిత్తం తీసుకువెళ్లారని జవాబిస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రం తీసుకువెళ్లిన కంప్యూటర్లు యధావిధిగా రావని, పూర్తిగా పనిచేయకుండా చేసి మా మొహాన కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో కంప్యూటర్లు ఉంటాయి గానీ ఏదీ పనిచేయదు. బాగు చేయించేందుకూ అవకాశం లేని కంప్యూటర్లను ఏమి చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. పనిచేయనివే ఎక్కువ సర్వశిక్ష అభియాన్ జిల్లాలో 501 కంప్యూటర్లు ఆయా పాఠశాలలకు అందించినట్టు రికార్డుల్లో పేర్కొంది. మరి ఈ కంప్యూటర్లన్నీ ఏమయ్యాయని ప్రశ్నిస్తే జవాబు ఉండదు. హైదరాబాద్ నుంచే ఈ కంప్యూటర్లు పంపుతున్నారని అధికారులు చెబుతున్నారు. అంటే అక్కడి నుంచే పనిచేయని వాటిని జిల్లాలకు పంపేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరులో పవర్పేట నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలకు ఐదు కంప్యూటర్లు ఇచ్చారు. రెండు పనిచేయడం లేదు. మిగిలిన మూడు ఎస్ఎస్ఏ అధికారులు పనుల కోసం తీసుకువెళ్లారని చెప్పారు. తూర్పువీధిలోని మరో ప్రాథమికోన్నత పాఠశాలకు వెళితే అక్కడ ఐదు కంప్యూటర్లు ఉన్నాయి. కానీ ఒక్కటీ పనిచేయట్లేదు. హనుమాన్నగర్లోని ఎంపీయూపీ స్కూల్ లో ఒక కంప్యూటరే ఉంది. దానిపైనే ఐదారుగురు బాలికలు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. సుంకరవారితోట స్కూల్లో ఒక్క కంప్యూటరూ పనిచేయట్లేదు. ఇది ఏలూరుకే పరిమితం కాదు జిల్లావ్యాప్తంగా 113 పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. బాగు చేయిస్తారా ఈ విషయమై రాజీవ్ విద్యామిషన్ పీఓ ఎం. విశ్వనాథ్ను వివరణ కోరగా పాడైన కంప్యూటర్లను బాగు చేయించేందుకు స్కూలుకు రూ.2,500లు చొప్పున ప్రభుత్వం కేటాయించిందని, నాలుగు రోజుల క్రితం టెండర్లు పిలిచామని తెలిపారు. అయితే జిల్లాలో ఎన్ని కంప్యూటర్లు పాడయ్యాయి? ఈ నిధులు సరిపోతాయా? అన్న ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేదు. ఎప్పుడు టెండర్లు ఆమోదిస్తారో ? ఏనాటికి వీటిని బాగు చేయిస్తారో? ఎప్పటికి విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత విద్య అందిస్తారో ప్రభుత్వానికే తెలియాలి! -
టీచర్ల పనితీరుకు రేటింగ్
నిజామాబాద్ అర్బన్: విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా సరికొత్త పథకాన్ని రూపొందించింది. ఇక నుంచి ఉపాధ్యాయుల పనితీరుకు రేటింగ్ నమోదు చేయనున్నారు. ఏడాదిలో నాలుగుసార్లు నమోదు చేసే రేటింగ్ వివరాలను ఆన్లైన్లోనే పొందుపరచనున్నారు. పాఠశాల వివరాలు, విద్యార్థుల స్థాయి, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పని తీరును పరిశీలిస్తారు. నైపుణ్యాలను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇదే నెలలో ప్రారంభించనున్నారు. ఇదివరకే విద్యాశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఫార్మాట్ను ప్రధానోపాధ్యాయులకు అందించారు. ఇదీ పరిస్థితి జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 263 ప్రాథమికోన్నత పాఠశాలలు, 478 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు 10 వేల మంది ఉపాధ్యాయు లు పనిచేస్తున్నారు. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్వశిక్ష అభియాన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల స్థాయి నుంచి ప్రధానోపాధ్యాల వరకు వారి సామర్థ్యాలు, పనితీరును మూడు నెలకోకసారి అంచనా వేసేందుకు మానిటరింగ్ టూల్స్ను రూపొందించారు. దీని ఆధారంగా పాఠశాల, విద్యార్థి ప్రమాణాలతోపాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును ఆన్లైన్లో ఉంచుతారు. వీటిని పరిశీలిస్తారు స్కూల్ మానిటరింగ్ కింద పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ పిల్లల చదువులు, పాఠ్యేతర అంశాలు, వినూత్న పథకాలు, గ్రంథాలయ వినియోగం తదితర వివరాలను నమో దు చేస్తారు. విద్యార్థి ప్రతిభ కింద సబ్జెక్టులవారీగా గ్రేడింగ్ నమోదు చేస్తారు. అలాగే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల ప్రతిభను నమోదు చేస్తారు. ఇందులో ఏ డు అంశాలు ఉంటాయి. ఒక్కో అంశానికి గరిష్టంగా నాలుగు రేటింగ్ పాయింట్లు ఉంటాయి. మొదట ఉపాధ్యాయులు తమకు తామే రేటింగ్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీటిని ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షక అధికారులు పరిశీలించి వారి రేటింగ్ ఇస్తారు. జూన్ నుంచి ఆగస్టు వరకు మొదటి క్వార్టర్, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు రెండవ క్వార్టర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మూడవ క్వార్టర్, మార్చి నుంచి మే వరకు నాల్గవ క్వార్టర్లో రేటింగ్ నమోదు చేస్తారు. గ తంలో ఉపాధ్యాయుల పనితీరుపై ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు రహస్య నివేదిక పంపేవారు. కొన్నేళ్ల నుంచి ఇది అమలు కావడం లేదు. రేటింగ్ విధానం తో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ పనితీరును బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా తగిన సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విద్యాబోధనలో మార్పులు, చేర్పులు చేసుకొని టీచర్లు తమ ప్రతిభను కూ డా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ప్రధానోపాధ్యాయులకు ఫార్మాట్ పంపాం ఉపాధ్యాయుల ప్రతిభను తెలుసుకునేందుకు ఓ ఫార్మాట్ను రూపొందించాం. దానిని ఇదివరకే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశాం. దాని ఆధా రంగా ఉపాధ్యాయుల ప్రతిభ నమోదు చేస్తాం. ఈ ప్రక్రియను సర్వశిక్ష అభియాన్ ద్వారా నిర్వహిస్తాం. -
ఇక టీచర్లకూ రేటింగ్!
మెదక్: జిల్లాలో 1,974 ప్రాథమిక, 423 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 2,899 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం కింద విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్వశిక్షా అభియాన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల స్థాయి నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు వారి సామర్థ్యాలు, పనితీరు అంచనా వేసేందుకు క్వార్టర్లీ మానిటరింగ్ టూల్స్ను రూపొందించారు. దీనికింద పాఠశాల మానిటరింగ్, విద్యార్థి ప్రమాణాలతోపాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును ప్రతి మూడు నెలలకోసారి ఆన్లైన్లో ఉంచుతారు. స్కూల్ మానిటరింగ్ కింద పాఠశాల వివరాలు, ఎస్సీ, ఎస్టీల పిల్లల చదువులు, పాఠ్యేతర అంశాలు, వినూత్న పథకాలు, లైబ్రరీ వినియోగం తదితర అంశాలను నమోదు చేస్తారు. విద్యార్థి పెర్ఫార్మెన్స్ కింద సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ న మోదు చేస్తారు. అలాగే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పెర్ఫార్మెన్స్ నమోదులో 7 అంశాలుంటాయి. ఒక్కో అంశానికి గరిష్టంగా 4 రేటింగ్ పాయింట్లు ఉంటాయి. వీటిని మొదట ఉపాధ్యాయుడు తనకు సంబంధించిన రేటింగ్ను తానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీటిని ప్రధానోపాధ్యాయులు, పాఠశాలకు వచ్చే పర్యవేక్షణాధికారులు మూల్యాంకనం చేస్తారు. ఈ మేరకు ప్రతి మూడు నెలలకోసారి ఏడాదికి నాలుగుసార్లు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మొదటి క్వార్టర్, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 2వ క్వార్టర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 3వ క్వార్టర్, మార్చి నుంచి మే వరకు 4వ క్వార్టర్ను నమోదు చేస్తారు. గతంలో ఉపాధ్యాయుల పనితీరుపై ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ పంపేవారు. కాని 20 యేళ్లుగా అలాంటి రిపోర్టులకు మంగళం పలికారు. అయితే ప్రస్తుతం రేటింగ్ విధానంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ పనితీరును బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా తగిన సూచనలిచ్చే ఆస్కారం ఉంటుంది. విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం క్వార్టర్లీ మానిటరింగ్ టూల్స్ ఆన్లైన్ ఆధారంగా విద్యా ప్రమాణాలుపెరిగే ఆస్కారం ఉంది. ప్రతి ఉపాధ్యాయుడు తన పనితీరును, నైపుణ్యాలను బేరిజు వేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సెకండ్ క్వార్టర్ ఈ నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మండలాలవారీగా సమావేశాలు ఏర్పాటుచేసి ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
మహిళకు భరోసానిద్దాం
టెక్నికల్గా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న భారతావని.. ఆడపిల్లల భద్రత విషయంలో పాతాళానికి దిగజారుతోంది. రాజధాని వీధుల నుంచి పల్లెసీమ వరకూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న దాడులతో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ(అగ్రికల్చర్ ప్రొడక్షన్) పూనం మాలకొండయ్య, హోంశాఖ సెక్రటరీ సౌమ్య మిశ్రా, ఐజీ (ట్రైనింగ్) స్వాతి లక్రా, సీఐడీ ఐజీ చారు సిన్హా తదితరులతో ఏర్పాటు చేసిన కమిటీ వివిధ రంగాల్లోని మహిళ ల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. శనివారం బషీర్బాగ్లోని సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్స్, టీచర్లతో సమావేశమైంది. మారేడ్పల్లిలోని పద్మశాలి కళ్యాణమంటపంలో పలువురు స్థానిక మహిళలు, బాలికల అభిప్రాయాలను తీసుకుంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం.. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని పూనం మాలకొండయ్య అన్నారు. కమిటీ తక్షణ నివేదికను ఈ నెల 20న ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నాలుగు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తామన్నారు. కమిటీ నివేదిక మహిళలకు భరోసా ఇస్తుందన్నారు. సమావేశంలో సలహాలు, సూచనలు - నైతిక విలువలు, సెక్స్ ఎడ్యుకేషన్పై ప్రత్యేకంగా పీరియడ్ ఏర్పాటు చేయాలి - సమాజంలో దుష్ర్పభావం కలిగించే సినిమాలు.. బాలికలను, మహిళలను కించపరిచే విధంగా వచ్చే టీవీ సీరియల్స్ను నియంత్రించాలి - పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగ టీచర్లను కఠినంగా శిక్షించాలి - దోషులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి - పాఠశాలల్లో సెల్ఫోన్లు నిషేధించాలి, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలి సెక్స్ ఎడ్యుకేషన్పై అవగాహన కల్పించాలి తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల కంటే 6, 7, 8 తరగతుల విద్యార్థులే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ను ముందుగానే నేర్పించాలి. తల్లిదండ్రులే పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. - శుభా శుక్లా, సైకాలజిస్టు, కౌన్సిలర్ ప్రత్యేక దృష్టి పెట్టాలి తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యాలు ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆపదలో పిల్లలే రియాక్ట్ అయ్యేవిధంగా శిక్షణ ఇవ్వాలి. అధికారులను, పోలీసులను కన్సల్ట్ చే సేలా చూడాలి. అవసరమయ్యే లీగల్ పాయింట్స్, ఫోన్ నంబర్లపై అవగాహన కల్పించాలి. - సంగీత వర్మ, ప్రధాన కార్యదర్శి, గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం సమాజంతో భయం మహిళలు ఎక్కువగా భయపడుతున్నది చుట్టూ ఉన్న సమాజం గురించే. కూతురుకు ఏదైనా జరిగితే బయటకు చెప్పుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. చట్టానికి తెలిసే లోపే సొసైటీలోని పెద్దలు తమ పలుకుబడితో దోషులకు అండగా నిలుస్తున్నారు. ఈ సమస్యను స్త్రీలే ఎదుర్కోవాలి. - భార్గవి, స్పెషల్ ఆఫీసర్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మార్పు ఇంటి నుంచే ముస్లిం యువతులపై ఇంటా, బయటా వివక్ష ఉంటోంది. మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి. పెళ్లి చేస్తే ఆడపిల్ల భారం తగ్గుతుందనుకునే తల్లిదండ్రులు మారాలి. వారిని బాగా చదివించడంతో పాటు అన్ని విధాలా ప్రోత్సహించాలి. - సబియా సుల్తాన, టీచర్ - కేజీ బీవీ - ముషీరాబాద్/కంటోన్మెంట్ -
కంటితుడుపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)కు కొత్త చిక్కు వచ్చిపడింది. నిన్నటివరకు నిధుల లేమితో సతమతమైన జిల్లా ఎస్ఎస్ఏ ప్రాజెక్టుకు తాజాగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కొత్త వార్షిక సంవత్సరం మొదలై దాదాపు ఆర్నెల్లు కావస్తున్న తరుణంలో.. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అధికారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వార్షిక సంవత్సరం మొదలై ఆర్నెల్లు కావడం.. సర్కారు పైసా విదల్చకపోవడంతో ఎస్ఎస్లో పలు విభాగాల్లో బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం భారీగా నిధుల అవసరం ఉన్న తరుణంలో.. ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యగా రూ.3 కోట్లు విడుదల చేయడంతో ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలనే అంశం అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రూ.25 కోట్లు అవసరం... 2014-15 సంవత్సరం బడ్జెట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రాజెక్టుకు రూ.3 కోట్లు విడుదల చేసింది. ఇందులో నిర్మాణ(సివిల్) పనులకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలని, మిగతా రూ.కోటి సాధారణ ఖర్చులకు వెచ్చించాలని సూచించింది. నిధుల విడుదలతో సర్కారు చేతులు దులుపుకోగా.. క్షేత్రస్థాయిలో అధికారులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టులో భాగంగా తలపెట్టే పలు కార్యక్రమాలకు నిధులు లేక నిలిచిపోయాయి. అదనపు తరగతి గదుల (ఏసీఆర్) నిర్మాణ పనులకు సంబంధించి రూ.16 కోట్ల బకాయిలున్నాయి. బ్రిడ్జి కోర్సులకు సంబంధించి బిల్లుల చె ల్లింపులు నిలిచిపోగా.. యూనిఫాంలకు సంబంధించి బకాయిలు సైతం ఆగిపోయా యి. ఇవన్నీ సాధారణ ఖర్చుకు సంబంధించినవి. ఇవి దాదాపు రూ.9 కోట్లు బకాయిలున్నట్లు ప్రాజెక్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా సిబ్బంది, ఇతర ఉద్యోగుల వేతనాలకు ప్రతినెలా రూ.65 లక్షలు అవసరం. ఇంతటి వ్యయమున్న ఎస్ఎస్ఏకు ప్రభుత్వం కేవలం రూ.3కోట్లు విడుదల చేయడం గమనార్హం. ఏం చేద్దాం..? బకాయిలు కుప్పలుగా పేరుకుపోయిన ఎస్ఎస్ఏకు రాష్ట్ర ప్రభుత్వం అత్తెసరుగా కరుణించిన నేపథ్యంలో ఆలోచనలో పడింది. ప్రస్తుతం ఇచ్చిన రూ.3 కోట్లను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఈ నిధి ఏ మూలకూ చాలనప్పటికీ.. అత్యవసరమున్న కేటగిరీకి వీటిని ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రెండ్రోజుల్లో ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి కిషన్రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. జిల్లా ప్రాజెక్టు వార్షిక ప్రణాళిక.. సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు కింద 2014-15 వార్షిక సంవత్సరానికి రూ.192.69 కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. ఇందులో ఉపాధ్యాయులు, కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకు రూ. 80.55 కోట్లు కేటాయించారు. అదేవిధంగా విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలకు రూ.11 కోట్లు, పాఠశాల గ్రాంట్లు, టీచర్ల గ్రాంట్లతో పాటు శిక్షణ కోసం రూ.10 కోట్లు కేటాయించగా, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.55 కోట్లు ఖర్చు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లా ప్రాజెక్టుకు పైసా అందకపోవడంతో పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. జిల్లా ప్రాజెక్టు వద్ద ఉన్న రూ.2కోట్ల నిధులతో నెట్టుకొస్తుండగా.. ప్రస్తుతం ఈ నిధి నిండుకుంది. -
నిధులు ఫుల్... ఖర్చు నిల్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా:సాధారణంగా ఏ శాఖ వద్దనైనా నిధులు అందుబాటులో ఉంటే ఏం చేస్తారు..? నిర్దేశించిన వార్షిక ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టి పురోగతిపై దృష్టి పెడతారు.. అవసరానికి మించినిధులుంటే మరిన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కానీ ‘సర్వ శిక్షా అభియాన్’లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. అందుబాటులో కోట్ల రూపాయల నిధులున్నా.. పైసా ఖర్చు చేయకుండా నెలనెలా కేవలం జీతభత్యాలు లాగించేసి చేతులు దులుపుకుంటున్నారు. 2014-15 వార్షిక సంవత్సరం మొదటినుంచి ఇప్పటివరకు ఆ ప్రాజెక్టులో ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో వార్షిక ప్రణాళికలో రూపొందించిన పలు కార్యక్రమాలు ఎక్కడివక్కడ పెండింగ్లో కొనసాగుతోంది. దీంతో వార్షిక ప్రణాళికలో రూపొందించిన పలు కార్యక్రమాలు ఎక్కడివక్కడ పెండింగ్లో ఉండిపోయాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పీడీ వద్ద పుష్కలం.. పీఓల వద్ద ఖాళీ! 2014-15 వార్షిక సంవత్సరంలో క్షేత్రస్థాయిలో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను క్రోడీకరిస్తూ ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ రూపొందించిన పూర్తి ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాదాపు రూ. రెండువేల కోట్లతో రూపొందించిన వార్షిక ప్రణాళికకు సంబంధించి తొలి త్రైమాసిక నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులను ప్రాధాన్యత ప్రకారం జిల్లా ప్రాజెక్టులకు పంపిణీ చేస్తే.. ఆ మేరకు ప్రణాళిక అమలుకు ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపడతారు. కానీ ఈసారి ఎస్పీడీ నుంచి జిల్లా ప్రాజెక్టులకు పైసా అందలేదు. వార్షిక సంవత్సరం సగం గడుస్తున్నా ఇప్పటివరకు నిధులు అందకపోవడంతో జిల్లా ప్రాజెక్టులు చతికిల పడ్డాయి. గతేడాది మిగులు నిధులను జిల్లా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతభత్యాలతో సరిపెట్టాల్సి వస్తోంది. జిల్లాలో ఇదీ తీరు.. రంగారెడ్డి జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కింద 2014-15 వార్షిక సంవత్సరానికి గాను రూ.192.69 కోట్లతో ప్రణాళిక తయారు చేశారు. ఇందులో ఉపాధ్యాయులు, కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకు రూ. 80.55 కోట్లు కేటాయించారు. అదేవిధంగా విద్యార్థుల యూనిఫాం, పుస్తకాలకు గాను రూ.11 కోట్లు, పాఠశాల గ్రాంట్లు, టీచర్ల గ్రాంట్లతో పాటు శిక్షణలకోసం రూ.10 కోట్లు కేటాయించగా, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన కోసం రూ.55 కోట్లు ఖర్చు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. అయితే జిల్లా ప్రాజెక్టుకు పైసా అందకపోవడంతో పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే జిల్లా ప్రాజెక్టు వద్ద ఉన్న రూ.2కోట్ల నిధులతో నెట్టుకొస్తుండగా.. ప్రస్తుతం ఈ నిధి రూ.50లక్షలకు చేరింది. ఈ నెల వేతనాలు చెల్లిస్తే పీఓ ఖాతా నిండుకోనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రాజెక్టు వద్ద నిధులున్నాయని, జిల్లాల వారీగా మిగులు నిధులు, ఖర్చుల లెక్కలు వచ్చిన వెంటనే ఎస్పీడీ నుంచి మరిన్ని నిధులు విడుదల చేస్తామని ఎస్పీడీ కార్యాలయంలోని ఆర్థిక అధికారి విజయ్శంకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఒక్కొక్కటిగా రద్దు..!
- సర్వశిక్షా అభియాన్లో పథకాలన్నీ రద్దు - మిగిలింది కేజీబీవీల నిర్వహణే - బాలిక విద్యాభివృద్ధికి మంగళం - ఉపాధ్యాయులకు శిక్షణ లేదు - రెండేళ్ల నుంచి ప్రహరీ లేదు.. అదనపు గదుల్లేవ్ సాక్షి, కరీంనగర్ : ఎన్నో లక్ష్యాలు.. మరెన్నో ప్రణాళికలతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సర్వశిక్షా అభియాన్ అచేతనంగా మారింది. అధికారుల నిర్ణయాలతో సిబ్బందికి ప్రస్తుతం పని లేకుండాపోయింది. ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలపై శిక్షణ.. విద్యాభివృద్ధికి ప్రణాళికలు.. విద్యార్థులకు ప్రోత్సాహకాలు.. సర్కారు స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు పేరుకే పరిమితమైంది. ఆశించిన ఫలితాలు కానరాకో..? అమలవుతున్నవి నిష్ర్పయోజన పథకాలు అనుకున్నాయో? తెలియదు గానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులోని కీలక పథకాలన్నీ ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్నాయి. సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో గ తంలో ప్రతి విద్యాసంవత్సరం 13 నుంచి 19 వినూత్న కార్యక్రమాలు.. పథకాలు కొనసాగాయి. ప్రస్తుతం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) మాత్రమే మిగిలాయి. మూడేళ్లలో ఆరుకు పైగా కీలక పథకాలు రద్దయ్యాయి. దీంతో మిగిలిన సిబ్బంది సాధారణ పనులకే పరిమితమయ్యారు. ఇంకొందరు గత పథకాల ప్రగతిపై సమీక్ష .. గతంలో మిగిలిన పనుల పూర్తిపై దృష్టిపెట్టారు. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.20 కోట్ల మేర నిధులు జిల్లాకు వచ్చాయి. పథకాల ప్రారంభమిలా.. చదువుకు దూరమవుతున్న బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాల నే ఉద్దేశంతో 2003లో కేంద్రప్రభుత్వం బాలికల విద్యాభివృద్ధి (నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవల్ (ఎన్పీఇజీఇఎల్)) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. ఇతర కారణాలతో చదువుకు దూరమవుతున్న విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెం పొందించి.. తమ కాళ్లపై తాము నిలబడేలా 6, 7, 8 తరగతుల వారికి టైలరింగ్, మగ్గం పను లు, క్యాండిళ్లు.. చాక్పీస్.. న్యాప్కిన్ల తయారీ వంటి వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుం ది. వీరితోపాటు 3, 4 ,5 తరగతి విద్యార్థినులకు రెమిడియల్ తరగతులు నిర్వహించి.. చదువులో వెనకబడిన వారికి మెటీరియల్ ఇచ్చి చదవడం.. రాయడం నేర్పించాలి. ఇందుకోసం ఎనిమిది స్కూళ్లతో క్లస్టర్ స్కూల్ను ఏర్పాటు చేసి పథకాన్ని అమలు చేశారు. ఇలా జిల్లాలో 384 క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 70వేల మంది బాలికలు ఈ పథకంతో లబ్ధిపొందారు. ఇలాంటి పథకాన్ని 2011-12 విద్యా సంవత్సరంలో రద్దు చేశారు. సమాజంలో లింగవివక్ష, మూఢనమ్మకాలు, బాలికల సంరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంలో గతంలో బాలిక ‘చేతన’ పథకాన్ని అమలు చేశారు. పథకంలో భాగంగా.. ఉపాధ్యాయినులకు పైఅంశాల్లో శిక్షణ ఇచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు అవగాహన కల్పించారు. పథకంతో విద్యార్థినులు ఎంతోమందికి లబ్ధి చేకూరింది. గ్రామాల్లో లింగవివక్ష, మూఢ నమ్మకాలు కొంచెకొంచెం తగ్గుముఖం పట్టాయి. ఈ పథకానికి మూడే ళ్ల క్రితమే బ్రేక్ వేశారు. బోధించేందుకు సరిపడా ఉపాధ్యాయులు లేక పీఎస్, యూపీఎస్ స్కూళ్లు మూతబడుతుండడంతో ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో విద్యావాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. తక్కువ వేతనాలతో ఉన్నత విద్యనభ్యసించిన వారిని ఎంపిక చేసి విద్యార్థులకు చదువు చెప్పించింది. ఇలా జిల్లాలో 1500పై చిలుకు మంది వీవీలుగా పనిచేశారు. ఈ వ్యవస్థను ప్రభుత్వం గతేడాది రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. జిల్లాలో ముఖ్యంగా మండల, గ్రామాల్లో నివసించే కుటుంబాలో తల్లీదండ్రులు కూలీ, వ్యవసాయ, ఇతర పనులకు వె ళ్తారు. ఆ సమయంలో ఇంట్లో చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు అమ్మాయిలను కాప లా పెడతారు. దీంతో బడికి వెళ్లాల్సిన అమ్మాయి ఇంటికే పరిమితం అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం గతం లో ‘పూర్వ ప్రాథమిక విద్య’కు శ్రీకారం చుట్టింది. నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న చిన్న పిల్లల కోసం కేంద్రాలు ఏర్పాటు చేసింది. బడీడు వచ్చిన అమ్మాయిలు తన తమ్ముళ్లు, చెళ్లెళ్లను ఈ కేంద్రాల్లో విడిచి స్కూలుకు వెళ్లేవారు. అలాంటి కేంద్రాలకు ప్రభుత్వం మూడేళ్లక్రితమే తాళం వేసింది. దీంతో పరిస్థితి మొదటికొచ్చింది. పెవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు స్కూళ్లలో మెరుగైన, నాణ్యమైన విద్య అం దించాలనే ఉద్దేశంతో అభియాన్ ఏటా విద్యా సంవత్సరం పునఃప్రారంభ సమయంలో మూడు మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధన మెలకువలపై ఆరురోజుల పాటు వృత్త్యంతర శిక్షణ ఇచ్చేవారు. ఈ శిక్షణతో ఉపాధ్యాయులు ఎంతగానో నేర్చుకుని తరగతి గదిలో విద్యార్థులకు బోధించే వారు. ఈ శిక్షణకు రెండేళ్లుగా పత్తా లేదు. ఇటు గ్రాంట్ల విషయంలోనూ ప్రభుత్వం చేతులెత్తేసింది. తరగతి గదిలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో బోధించేలా గతంలో ప్రతి ఉపాధ్యాయుడికి రూ.500 చొప్పున.. స్కూల్కు రూ.2,500కు మించకుండా గ్రాంట్ ఇచ్చేది. దీనిని గత విద్యా సంవత్సరం నుంచి నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న స్కూల్ కాంప్లెక్స్లకు ఏటా రూ.27వేల చొప్పున గ్రాంట్ విడుదల చేసిన సర్వశిక్షా అభియాన్.. గత విద్యా సంవత్సరం నుంచి రూ.10 వేలకే పరిమితం చేసింది. స్కూల్ కాంప్లెక్స్లకు నిధుల సమస్య తలెత్తుతోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకూ ప్రాజెక్టు వెనకడుగు వేసింది. విద్యార్థులు ఎక్కువగా ఉండి.. తరగతి గదులు కొరతగా ఉన్న చోట అదనపు గదుల నిర్మాణం.. ప్రహరీ లేని పాఠశాలలకు ప్రహరీ నిర్మిం చాల్సి ఉండగా గత విద్యా సంవత్సరం ఒక్క అదనపు తరగతిగానీ.. ప్రహరీగానీ మంజూరుకాలేదు. ఈ విద్యా సంవత్సరం అదనంగా 220 అదనపు గదుల మంజూరయ్యాయి. ప్రహరీల ఊసు మాత్రం లేదు. అలాగే అంగవైకల్యం ఉన్న వారికి రెండేళ్ల నుంచి ట్రైసైకిళ్లు, వీల్చైర్ల మంజూరు కాలేదు. పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరందించే ‘జలమణి’ యూనిట్ల మంజూరు రెండేళ్ల నుంచి లేదు -
ప్రణాళికాబద్ధంగా పని చేస్తే నాలుగేళ్లలో రాష్ట్రాభివృద్ధి
మార్టూరు : ప్రణాళికాబద్ధంగా పని చేస్తే నాలుగేళ్లలో నూతన రాష్ట్రాభివృద్ధి సాధ్యమేనని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో ఉపాధ్యాయులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. రాజీవ్విద్యామిషన్, సర్వశిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా అభియాన్ పేరుతో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. అయినా నిర్థిష్టమైన ప్రణాళికలు లేకపోవడంతో ప్రాథమిక విద్యారంగం నేటికీ సంక్షోభంలోనే ఉందన్నారు. రాష్ట్రంలో 150 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయన్నారు. డీఎస్సీ తరువాత ఉపాధ్యాయులు రైషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీపతి వెంకట సుబ్బయ్య, విజయరాజు, మార్టూరు మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విద్యకు విశేష ప్రాధాన్యత
‘బడి పిలుస్తోంది’లో మంత్రి కొల్లు రవీంద్ర చిలకలపూడి (మచిలీపట్నం) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం విద్యకు విశేష ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సర్వశిక్షా అభియాన్, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడి పిలుస్తోంది ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక హిందూ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. మంత్రి కొల్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసి ఎక్కువ నిధులను కేటాయించనుందని తెలిపారు. జిల్లాలో 1207 మంది బాలురు, 1016 మంది బాలికలను బడిబయట పిల్లలుగా గుర్తించినట్లు అధికారులు చెప్పారన్నారు. వీరిలో 901 మందిని బడిలో చేర్పించినట్లు చెబుతున్నారని, మిగిలిన 1323 మందినీ బడిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీలు కెఎస్.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య తీరటంతో పాటు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకోవచ్చునన్నారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు ,బందరు ఆర్డీవో పి.సాయిబాబు, డీఈవో డి.దేవానందరెడ్డి,సర్వశిక్షా అభియాన్ పీవో డి.పుష్పమణి మాట్లాడుతూ బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయా మండలస్థాయిల్లో ఆగ స్టు2వ తేదీ వరకు అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తొలుత మెదక్జిల్లాలో రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రూపొందించిన సీడీలను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా అధ్యక్షత వహంచిన కార్యక్రమంలో బందరు జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, ఆయా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో చేనేత మెగా క్లస్టర్లు.... చల్లపల్లి : జిల్లాలో చేనేత మెగా క్లస్టర్ ఏర్పాటుచేసేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో చేనేత క్లస్టర్ల అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. రవీంద్ర మాట్లాడుతూ ఇప్పటికే ఒంగోలు, గుంటూరులో మెగా క్లస్టర్లు ఏర్పాటు చేశామని, జిల్లాలో ఇలాంటి క్లస్టర్లను ఏర్పాటు చేసి చేనేత రంగానికి జవసత్వాలు నింపేందుకు కృషిచేస్తామన్నారు. ఒక్కో మెగా క్లస్టర్కు రూ.70కోట్లు నిధులు కేటాయించి ప్రజలు మెచ్చే దుస్తులను తయారుచేసేలా ప్రత్యేక శిక్షణ, మార్కెట్ సదుపాయాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖర్ ప్రసాద్, చేనేత, జౌళిశాఖ జేడీ కె.శ్రీకాంత్ ప్రభాకర్, వీవర్స్ సర్వీసెంటర్ డీడీ విశేష్లోక్య, ఏడీ షేక్ జిలాని, ఆప్కో డీఎంవో వీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’
కర్నూలు విద్య: ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు ఆఫీసర్ మురళీధర్రావు తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ ఏడాది మే నెల వరకు జిల్లాలో 5,192 మంది బడి ఈడు పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని గుర్తించామన్నారు. 2014-5 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నుంచి ఆయా శాఖల అధికారుల సహకారంతో ఈనెల 19వ తేదీ వరకు 4,548 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించామన్నారు. మిగిలిన 644 మంది పిల్లలను బడి పిలుస్తోందిలో భాగంగా ఈనెల 25 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రోజు వారీ ప్రత్యేక కార్యక్రమాలతో పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి శుక్రవారం సునయన ఆడిటోరియంలో ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంటుందన్నారు. చైర్మన్గా జిల్లాలోని సీనియర్ మంత్రి, వైఎస్ చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా జెడ్పీ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, డీఈఓ, అసిస్టెంట్ లేబర్ అధికారి.. కన్వీనర్గా సర్వశిక్ష అభియాన్ పీఓ వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో ఎంఈఓ అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకంలో ఇష్టారాజ్యం
నిబంధనలకు విరుద్ధంగానే... చక్రం తిప్పుతున్న ఎంఈవోలు మచిలీపట్నం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు కళలు, చేతివృత్తుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సర్వశిక్షా అభియాన్ ద్వారా పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామకం జరుగుతోంది. ఈ నియామకాల్లో నిబంధనలను పక్కనపెట్టి ఎంఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఆరోగ్య విద్య, కుట్లు, అల్లికలు, నృత్యం, నైతిక విద్య తదితరాలను విద్యార్థులకు నేర్పేందుకు జిల్లావ్యాప్తంగా 230 మంది ఇనస్ట్రక్టర్లను నియమించేందుకు అనుమతులొచ్చాయి. ఆర్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో 99, పీఈటీలు 19 మంది, వర్క్ ఎడ్యుకేషన్ 112 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. వీరు 7, 8, 9 తరగతులు చదివే విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాల్సి ఉంది. వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో వీరి నియామకం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 230 పాఠశాలలను ఈ విద్యాసంవత్సరంలో గుర్తించి అక్కడ పార్ట్ టైం ఇనస్ట్రక్టర్లను నియమించాలని నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలను సర్వశిక్షా అభియాన్ విడుదల చేసింది. ఎంపికైన ఇనస్ట్రక్టర్లకు నెలకు రూ. 6వేల వేతనం చెల్లిస్తారు. నిబంధనలు ఉల్లంఘన... వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలున్న ప్రాంతం నుంచే ఈ ఇనస్ట్రక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్న నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేయాలి. ఈ బాధ్యతలను పాఠశాల కాంప్లెక్స్ చైర్మన్, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ తీసుకుంటుంది. మండల పరిధిలో ఉన్న పాఠశాలల్లో పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామక పర్యవేక్షణా బాధ్యతలను ఎంఈవోలకు అప్పగించారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకున్న ఎంఈవోలు స్కూలు కాంప్లెక్స్ చైర్మన్, హెచ్ఎం, పాఠశాల యాజమాన్య కమిటీలను పక్కనపెట్టి తమ చిత్తానుసారం తమను ప్రసన్నం చేసుకున్న వారికి ఈ పోస్టులను కేటాయిస్తున్నారనే రోపణలు వస్తున్నాయి. పూర్తయిన జాబితాలను కలెక్టర్, డీఈవో, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారికి సమర్పించాల్సి ఉంది. వారు ఈ జాబితాలు సక్రమంగా ఉన్నాయో, లేదో పరిశీలించి తుది జాబితాను విడుదల చేస్తారు. అయితే పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల ఎంపికలో ఎంఈవోలకు కేవలం పర్యవేక్షణా బాధ్యతలను అప్పగించినప్పటికీ వారే అన్నీ తామై వ్యవహరిస్తూ జిల్లాలోని అధిక మండలాల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ప్రతిభావంతులైన అభ్యర్థులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టిసారించి పార్ట్ టైం ఇనస్ట్రక్టర్ల నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.