-
రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. 'స్కామ్ 2010' వచ్చేస్తుంది
ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్ల గురించి ఇప్పటికే రెండు వెబ్ సిరీస్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హన్సల్ మెహతా నిర్మించిన ఈ సిరీస్లను తుషార్ దర్శకత్వం వహించారు. భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్సిరీస్ 'స్కామ్ 1992'. ఎలాంటి అంచనాలు లేకుండా 2020లో సోనీ లివ్లో విడుదలైంది. కానీ, ఈ వెబ్ సిరీస్కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. అదే తరహాలో 'స్కామ్ 2003' తెరకెక్కింది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద చూపించారు. ఈ రెండింటికీ సోనీ లివ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'సుబ్రతా రాయ్ సహారా' స్కామ్ గురించి హన్సల్ మెహతా మరో సిరీస్ను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్కు 'స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా' అని హన్సల్ వెల్లడించారు. తమల్ బందోపాధ్యాయ రాసిన సహారా: ది అన్టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు.కేవలం రూ. 2000తో వ్యాపారం మొదలుపెట్టిన సుబ్రతా రాయ్.. రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే, ఆయనపై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలో రావడంతో 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించారు. ఆయన తల్లి మరణంతో అంత్యక్రియల కోసం 2016లో బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్పై బయటే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాదిలో సుబ్రతా రాయ్ గుండెపోటుతో మరణించారు. సహారా స్కామ్లో దాగివున్న నిజాలను ఈ సిరీస్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది. -
ఓటీటీలోకి 'ఏజెంట్' సినిమా.. ట్వీట్ చేసిన నిర్మాత
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఎజెంట్ నిర్మాత అనిల్ సుంకర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ముందు ఏజెంట్ సినిమాను ఓటీటీలో విడుదల చేయండి అంటూ కామెంట్లు చేశారు. దీంతో అనిల్ సుంకర రిప్లై ఇచ్చారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నట్లు అనిల్ తెలిపారు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. అతి త్వరలోనే ఏజెంట్ సినిమా సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుందని అనిల్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ సుమారు రూ. 85 కోట్లతో తెరకెక్కినట్లు సమాచారం. కానీ ఇందులో పది శాతం కలెక్షన్స్ కూడా సినిమా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎజెంట్లో మలయాళ టాప్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. దీంతో మలయాళంలో కూడా సినిమాను విడుదల చేశారు. కానీ అక్కడ కూడా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్ సుంకర చేసిన ట్వీట్తో ఏజెంట్ ఓటీటీ విషయంపై మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. I already informed couple of times. We sold the digital to B4U and they to Sony. Hopefully they will do it asap. https://t.co/5k0aFYKZbB — Anil Sunkara (@AnilSunkara1) April 8, 2024 -
900 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ
జపాన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ తన ప్లేస్టేషన్ విభాగంలో పనిచేస్తున్న దాదాపు 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించించి. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కష్టతరమైనప్పటికీ తప్పదని సంస్థ వర్గాలు తెలిపాయి. సంస్థ తాజా నిర్ణయంతో దాదాపు 8 శాతం ఉద్యోగులు తగ్గినట్లవుతుందని తెలిసింది. టెక్, గేమింగ్ రంగంలో లేఆఫ్లను ప్రకటించిన తాజా సంస్థ ఇదే. పరిశ్రమలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ జిమ్ ర్యాన్ పేర్కొన్నారు. యూకే, యూరోపియన్ స్టూడియోలలో ‘ప్లేస్టేషన్ స్టూడియోస్ లండన్ స్టూడియో’ను పూర్తిగా మూసివేయనున్నట్లు తెలిపారు. గెరిల్లా, ఫైర్స్ప్రైట్ విభాగాల్లో ఉద్యోగుల తగ్గింపులు ఉండనున్నాయని చెప్పారు. డిసెంబరు 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో ఐదు గేమింగ్ విభాగాల్లో విక్రయాలు మందగించడంతో సోనీ గ్రూప్ ఈ నెల ప్రారంభంలో వాటి ఆదాయ అంచనాను తగ్గించింది. యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలు అనంతరం 2,000 మంది సిబ్బందిని తొలగిస్తామని నెల కిందట మైక్రోసాఫ్ట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు రియోట్ గేమ్స్ సంస్థ జనవరిలో 11 శాతం ఉద్యోగులను తగ్గించుకొంది. ఇదీ చదవండి: ఆండ్రాయిడ్లో రానున్న అద్భుతమైన అప్డేట్లు.. గత ఏడాదిలో యూఎస్లో ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 32,000 ఐటీ ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది. ఇటీవల స్నాప్ ఇంక్ అనే సంస్థ తన ఉద్యోగుల్లో 10 శాతాన్ని (దాదాపు 540 మంది) తగ్గించనున్నట్లు ప్రకటించింది. -
భారీగా 'భ్రమయుగం' కలెక్షన్స్.. బిగ్ మార్క్ను దాటేసిన మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. కళ్లు చెదిరే కలెక్షన్స్తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం మూడు పాత్రలతో అది కూడా బ్లాక్ అండ్ వైట్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని భాషలతో కలుపుకుని రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సితార ఎంటర్టైన్మెంట్ వారు ప్రకటించారు. సినిమా పట్ల మంచి టాక్ రావడంతో రూ. 100 కోట్ల మార్క్ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మమ్ముట్టి సత్తా చాటుతున్నాడు. భ్రమయుగం ఓటీటీ రైట్స్ కూడా సుమారు రూ. 25 కోట్లకు పైగా సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి చివరి వారంలో సోనీ లివ్లో భ్రమయుగం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
సోనీతో విలీనానికి మళ్లీ రెడీ.. అంతలోనే ‘జీ’కి భారీ షాక్..
మీడియా దిగ్గజం జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్)కు భారీ షాక్ తగిలింది. జీ సంస్థ భారీ మొత్తంలో నిధుల మళ్లించినట్లు మార్కెట్ రెగ్యులేటరీ బోర్డ్ సెబీ గుర్తించింది. ఫలితంగా ఆ సంస్థ షేర్లు పతనమవుతున్నాయి. జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్) తాజాగా సోనీ గ్రూప్ తో వీలిన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గత నెలలో రండు సంస్థల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన విలీన ప్రతిపాదన రద్దయిన నేపరథ్యంలో తాజా అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ తరుణంలో జీ వ్యవస్థాపకులపై సెబీ జరిపిన విచారణలో కంపెనీ నుండి సుమారు 20 బిలియన్ల ($241 మిలియన్లు) మొత్తాన్ని మళ్లించినట్లు తేలింది. నిధుల వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. జీలో నిధులు మళ్లించడం సెబీ ఊహించిన దానికంటే దాదాపు పది రెట్లు ఎక్కువ ఉందని సమాచారం. సెబీ రివ్యూ భారీ మొత్తంలో నిధులు మాయమవ్వడంపై జీ ఇచ్చే సమాధానాలపై సెబీ రివ్వ్యూ జరపనుంది. రివ్యూ జరిపేందుకు రెగ్యులేటరీ జీ ఫౌండర్ సుభాష్ చంద్ర, అతని కుమారుడు పునిత్ గోయాంక్తో పాటు ఇతర బోర్డ్ సభ్యులు హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే రివ్యూ అనంతరం పైన పేర్కొన్నట్లుగా జీలో నిధులు మళ్లీంపు, లేదంటే దుర్వినియోగం జరిగిందా అనే అంశంపై స్పష్టత రానుంది. -
‘జీ’కి మరో ఎదురు దెబ్బ.. న్యాయ పోరాటం చేయనున్న సోనీ
భారత్లో అంతర్జాతీయ క్రికెట్ ప్రసారాల విషయంలో జీ - డిస్నీ హాట్ స్టార్ మధ్య 1.4 బిలియన్ల డాలర్ల సబ్ లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నుంచి జీ బయటకు వచ్చింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు డిస్నీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిస్నీ మాతృసంస్థ సోనీ గ్రూప్ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో దావా వేసింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు సోనీకి తొలి విడతగా జీ గ్రూప్ 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించడంలో జీ విఫలమైంది.ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపింది. దీంతో జీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సోనీ గ్రూప్ ఉపక్రమించింది. కాగా, ఈ పరిణామాలపై జీ గ్రూప్, సోనీ గ్రూప్లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. -
శశి సోనీ ఎవరు? పద్మశ్రీ ఎందుకు వరించింది?
‘నిరంతర శ్రమతోనే విజయం సాధ్యం’ అని అంటారు. శశి సోనీని చూస్తే ఇది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. నేడు ఆమె రూ. 4 వేల కోట్లకు పైగా విలువైన కంపెనీకి యజమానిగా మారి, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శశి సోనీ రూ. 10,000 ప్రారంభ మూలధనంతో ఒక కంపెనీని ప్రారంభించారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. నాటి నుంచి నేటి వరకూ శశి సోనీ జీవిత ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా సాగింది. 2024 పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో శశి సోనీ పేరు కూడా ఉంది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. పాకిస్తాన్లోని లాహోర్లో 1941, ఏప్రిల్ 4న శశి సోనీ జన్మించారు. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం ఢిల్లీకి తరలివచ్చింది. ఢిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం సాగింది. శశి 1971లో తన 30 ఏళ్ల వయసులో తొలిసారిగా సొంత వ్యాపారం ప్రారంభించారు. రూ. 10,000 పెట్టుబడితో ఆమె ‘డీప్ ట్రాన్స్పోర్ట్’ను ప్రారంభించారు. దానిని 1975 వరకు నిర్వహించారు. ఆ తర్వాత 1975లో ముంబయిలోని ములుంద్ ప్రాంతంలో ‘దీప్ మందిర్ సినిమా’ పేరుతో మొదటి ఏసీ సినిమా థియేటర్ను ప్రారంభించారు. దీనిని శశి సోనీ 1980 వరకు నడిపించారు. దశాబ్ద కాలం పాటు శ్రమించిన శశి ఆ తర్వాత అమోఘ విజయాన్ని అందుకున్నారు. శశి సోనీ ‘ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. మైసూర్లో నెలకొల్పిన ఈ గ్యాస్ తయారీ కర్మాగారంతో ఆమెకు మంచి ఆదాయం సమకూరింది. అనంతరం ఆమె సాంకేతిక రంగంలో కాలుమోపారు. శశి సోనీ 2005లో ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియాలో హైటెక్ ఆటోమోటివ్, ఈ-రిటైలింగ్ సేవలను అందిస్తోంది. ఈ కంపెనీకి చైర్పర్సన్గా శశి వ్యవహరిస్తున్నారు. ఐజెడ్ఎంఓ లిమిటెడ్.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ జాబితాలో చేరింది. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.4,150 కోట్లకు చేరింది. శశి ‘దీప్ జనసేవా సమితి’ సభ్యురాలు. ఈ సంస్థ మహిళలకు ఉద్యోగాలు కల్పించడంలో సహాయం చేయడంతో పాటు, మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం, పెన్షన్ పథకాలు ప్రారంభించడం, వికలాంగుల కోసం నిధుల సేకరణ తదితర సేవా కార్యక్రమాలను చేస్తుంటుంది. ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీకి పలు అనుబంధ కంపెనీలు కూడా ఉన్నాయి. పద్మశ్రీ అవార్డుకు ముందు శశి సోనీ వ్యాపార, సామాజిక సంక్షేమ రంగాల్లో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 1990లో ఆమె మహిళా గౌరవ్ అవార్డును అందుకున్నారు. ఆమె ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ గ్యాస్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అలాగే ఆమె డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్లో కూడా సభ్యురాలిగా కొనసాగుతున్నారు. -
సోనీ - జీ ఒప్పందం రద్దు..!
జపనీస్ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య ఒప్పందం రద్దయింది. దీంతో 10 బిలియన్ డాలర్ల (రూ. 8,31,32,55,00,000) ఒప్పదం నిలిచిపోయింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం రద్దు కావడానికి కారణం ఏంటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా పేరును దాని మాతృ సంస్థ చాలా రోజుల కిందటే కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్గా మార్చింది. నిజానికి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీను సోనీ తనలో విలీనం చేసుకోవాలని ప్రారంభంలో అనుకున్నప్పటికీ, అది పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో ఒప్పందం పూర్తిగా రద్దయింది. సోనీ & జీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక నెల గ్రేస్ పీరియడ్తో కలుపుకొని, 2023 డిసెంబర్ 21లోపు అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి కావాలి. అనుకున్న విధంగా జరగకపోతే.. ఇరుపార్టీలు కలిసి ఈ కాలవ్యవధిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఆలా జరగకపోతే.. నోటీసు ఇచ్చి విలీనం నుంచి తప్పుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అంబానీ ఖరీదైన నివాసం.. అంతా రామమయం - వీడియో వైరల్ సోనీ-జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఇదివరకే ఫెయిర్ ట్రేడ్ రెగ్యూలేటర్ సీసీఐ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, సహా కంపెనీ వాటాదారులు, రుణదాతలు అందరూ ఆమోదం తెలిపారు. 2023 ఆగస్టులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముంబయి బెంచ్ కూడా ఈ విలీనానికి అనుమతి ఇచ్చింది. కానీ రెండు కంపెనీలు గడువును ఒక నెల పొడిగించినప్పటికీ తమ విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. -
Zee-Sony Merger Deal: సోనీతో విలీన డీల్కు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ – సీఎంఈపీఎల్) విలీన డీల్కు కట్టుబడి ఉన్నామని జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తున్నామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. విలీన సంస్థకు జీల్ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించడం ఇష్టం లేని కారణంగా సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జీల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీల్తో తమ భారత విభాగం సీఎంఈపీఎల్ను విలీనం చేసేందుకు జపాన్కు చెందిన సోనీ గ్రూప్ రెండేళ్ల క్రితం డీల్ కుదుర్చుకుంది. అప్పట్నుంచి వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. జీల్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన తనయుడైన గోయెంకా .. కంపెనీ నిధులను మళ్లించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరిపింది. గోయెంకాను ఏ లిస్టెడ్ కంపెనీ బోర్డులో చేరరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అప్పిలేట్ న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ వైఫల్యంగా భావిస్తున్న సోనీ.. విలీన సంస్థకు గోయెంకాను సీఈవోగా చేసేందుకు ఇష్టపడటం లేదని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఒప్పందం పూర్తి కావడానికి జనవరి 20 వరకు గడువు ఉండటంతో ఏం జరగనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సీఈఎస్ వేదికపై అట్రాక్ట్ చేస్తున్న 'అఫీలా' కారు - వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. -
జీకి భారీ షాక్.. ‘సోనీ సంచలన నిర్ణయం!’
ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్కు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జపాన్కి చెందిన డైవర్సిఫైడ్ దిగ్గజం సోనీ గ్రూప్.. జీతో పెట్టుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందని, అందుకు ఆ సంస్థ ఫౌండర్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, కుమారుడు సీఈఓ పునిత్ గోయెంక్ కారణమని తెలుస్తోంది. 2021లో ఒప్పందం 2021లో ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సోనీ - జీ విలీనం తర్వాత ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పునిత్ గోయెంకా బాధ్యతలు చేపట్టాలి. ఆయన నియామకాన్ని సోనీ గ్రూప్తో పాటు సోనీ పిక్చర్ నెట్ వర్క్ ఇండియా సీఈఓ ఎన్పీసింగ్తో పాటు ఇతర డైరెక్టర్లు ఆమోదం పొందాల్సి ఉంది. సెబీ మధ్యంతర ఉత్వరులు అయితే ఈ రెండు సంస్థల మధ్య విలీన ప్రక్రియ చివరి దశలో ఉందనగా.. గత ఏడాదిలో జీ మీడియా సంస్థ నుంచి నిధులు మళ్లించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సెబీ జీ మీడియా యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించింది. జీ వ్యవస్థాకుడు సుభాష్ చంద్ర, సీఈఓ పునీత్ గోయెంకాపై సెబీ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. పునీత్ గోయెంకాకు సెబీ ఆదేశాలు అందులో గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకా ఏ నమోదిత సంస్థలోనూ డైరెక్టర్ లేదా ఇతర ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. దీంతో సుభాష్, గోయెంకాలు సెబీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎస్ఏటీ)ని ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో జీ, సోనీ విలీనం సందిగ్ధం నెలకొంది. పునిత్ నాయకత్వంపై నీలినీడలు తాజాగా పరిణామాలతో జీ సీఈఓ పునిత్ గోయెంకా విలీన సంస్థకు నాయకత్వం వహిస్తారా? లేదా? అనే అంశంపై ప్రతిష్టంభన కారణంగా సోనీ, జీ మీడియాతో పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చూస్తోంది.కొత్త కంపెనీకి గోయెంకా నేతృత్వం వహిస్తారని 2021లో సంతకం చేసిన ఒప్పందం కాగా, సెబీ ఉత్వర్వులతో సోనీ ఆయనను సీఈఓ ఉండేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. విలీనానికి అవసరమైన కొన్ని షరతులు నెరవేరలేదని పేర్కొంటూ, ఒప్పందాన్ని ముగించడానికి జనవరి 20 పొడిగించిన గడువులోపు రద్దు నోటీసును దాఖలు చేయాలని సోనీ యోచిస్తోంది. ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. గడువులోపు ఇంకా స్పష్టత రావొచ్చని సమాచారం. -
అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక గుడ్న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు ఉన్న చిక్కులు అన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా 'ఏజెంట్' చిత్రాన్ని 'సోని లివ్' ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వల్ల సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఏజెంట్ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు కూడా తీసుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ బ్రేక్ పడుతూ వచ్చింది. ఈసారైనా జనవరి 26న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా..? అంటూ సోషల్మీడియాలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తొలగించి.. మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్ను విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారట. -
కౌన్ బనేగా కరోడ్పతి మళ్లీ వచ్చేస్తుంది.. అమితాబ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తున్నారు. భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా 'కౌన్ బనేగా కరోడ్పతి'కి పేరుంది. తాజాగా సోనీ టీవీ తన ట్వీటర్ వేదికగా తెలియజేస్తూ.. కౌన్ బనేగా కరోడ్పతి ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి అయ్యాయి. 2000 నుంచి ఈ షో ప్రారంభమైంది. ఆగష్టు 14 నుంచి సీజన్-15 ప్రారంభం కానుంది. ఈ షో కోసం హోస్ట్గా వ్యవహరించేందుకు అమితాబ్ బచ్చన్ రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని షోలను ఆయనే విజయవంతంగా నడిపారు. అందుకు సంబంధించి అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. 2000లో ప్రారంభం అయిన మొదటి సీజన్ అత్యంత ప్రశంసలు పొందింది. షో మొదటి సీజన్లో ప్రైజ్ మనీ రూ.1 కోటి ఉండగా 2005లో వచ్చిన రెండో సీజన్లో ప్రైజ్ మనీ రెండింతలు పెరిగి రూ.2 కోట్లకు చేరింది. అలా మూడో సీజన్ వరకు అలాగే ఉంది. 2010లో సీజన్ 4 ప్రైజ్ మనీని మళ్లీ రూ.1 కోటికి తగ్గించారు. కానీ 2013లో వచ్చిన ఏడో సీజన్ నుంచి ప్రైజ్ మనీని ఒక్కసారిగా రూ.7 కోట్లకు పెంచారు. ఈసారి ఎంత ప్రైజ్ మనీ అనేది తెలియాల్సి ఉంది. అమితాబ్ రెమ్యునరేషన్ షో ప్రారంభ సమయంలో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.25 లక్షలు వసూలు చేశారు. మొదటి సీజన్ హిట్ కాగానే అమితాబ్ తన ఫీజును కోటి రూపాయలకు పెంచేశారు.పలు మీడియా కథనాల ప్రకారం ఆయన 6,7 సీజన్లలో రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు తీసుకున్నారు. కానీ 8వ సీజనలో అది కాస్త రూ.2 కోట్లకు చేరింది. ఎనిమిదవ సీజన్లో రాణి ముఖర్జీ, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే వంటి తారలు కూడా ఆ స్టేజీపైన మెరిశారు. ఆ తర్వాత 9వ సీజన్లో అమితాబ్ బచ్చన్ రూ.2.6 కోట్లు తీసుకున్నారు. ఆ సీజన్లో హాట్ సీట్లో క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి విద్యాబాలన్ అతిథులుగా కనిపించారు. 10వ సీజన్లో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్కు రూ.3 కోట్లు వసూలు చేశారు. ఆ సంవత్సరం ప్రత్యేక పోటీదారులలో ఆయుష్మాన్ ఖురానా, అమీర్ ఖాన్ ఉన్నారు. 11, 12, 13వ సీజన్లలో మెగాస్టార్ అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 3.5 కోట్లు తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 13వ సీజన్కు క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్లతో సహా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ సీజన్ కోసం రూ. 4 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని బాలీవుడ్ మీడియా తెలుపుతుంది. -
తుది దశలో సోనీ–జీ విలీనం
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), కల్వర్ మ్యాక్స్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా) విలీన అంశం తుది దశకు చేరుకుందని జీల్ ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. ప్రమోటర్లమైన తమకు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మధ్య నెలకొన్న వివాదం ఈ డీల్కు అడ్డంకి కాబోదని ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన వివరించారు. ఈ విలీన ఒప్పందానికి షేర్హోల్డర్లతో పాటు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), స్టాక్ ఎక్సే్చంజీలు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కూడా ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. ప్రమోటరు కుటుంబ స్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమకు మాత్రమే పరిమితమని, కంపెనీకి ఇబ్బంది కలిగించబోవని గోయెంకా వివరించారు. -
లోకల్’కు 120 కోట్ల నిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైపర్లోకల్ కంటెంట్, కమ్యూనిటీ, క్లాసిఫైడ్ వేదిక అయిన లోకల్ తాజాగా రూ.120 కోట్ల సిరీస్-బి ఫండింగ్ అందుకుంది. గ్లోబల్ బ్రెయిన్, సోనీ ఇన్నోవేషన్ ఫండ్, ఇండియా కోషెంట్ తదితర ఇన్వెస్టర్లు ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. లోకల్ సేవలు అందిస్తున్న మార్కెట్లలో వృద్ధికి, కొత్త విభాగాల పరిచయానికి తాజా నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు రూ.225 కోట్లకుపైగా ఫండింగ్ అందుకున్నట్టు లోకల్ ఫౌండర్, సీఈవో జానీ పాషా తెలిపారు. బెంగళూరు కేంద్రంగా 2018లో ప్రారంభమైన లోకల్ యాప్ 7 రాష్ట్రాల్లో 6 భాషల్లో అందుబాటులో ఉంది. డెయిలీ అప్డేట్స్, కమోడిటీ ధరలు, స్థానిక జాబ్స్, రియల్టీ, మ్యాట్రిమోనియల్, స్థానిక యాడ్లు, క్లాసిఫైడ్స్ సమాచారాన్ని అందిస్తోంది. 4 కోట్లకుపైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. (బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) -
పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపడింది!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన నేమ్తో పాటు ఫేమ్ను సంపాదించుకుంది ఐఫోన్. దీని తయారీ వెనుక ఏ విషయాన్ని యాపిల్ కంపెనీ బయటపెట్టేది కాదు. అయితే తాజాగా సంస్థ సీఈఓ ఐఫోన్లకు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్ని రివీల్ చేశారు. అదేంటో తెలుసుకుందాం! ఐఫోన్ కెమెరాతో క్లిక్ చేస్తే ఫోటో అద్భుతంగా రావాల్సిందే. ఎందుకంటే దాని క్లారిటీ అలాంటిది మరీ. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ కెమెరాలకు సంబంధించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఐఫోన్ కెమెరాలను సోనీ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. అత్యున్నత కెమెరా సెన్సర్ల కోసం దశాబ్ధకాలంగా సోనీ సంస్థతో తాము చేతులు కలిపామని కుక్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తమ భాగస్వామ్యం నిరంతం కొనసాగుతుందన్నారు. సంవత్సరాలుగా, ఆపిల్ ఐఫోన్ మోడల్లలో ఉపయోగించే హార్డ్వేర్ గురించి పెదవి విప్పలేదు. అంతేకాకుండా ఏదైనా ఐఫోన్ మోడల్స్లో కూడా అధికారిక స్పెక్స్ షీట్న్ చూసినట్లయితే, కంపెనీ ర్యామ్, కెమెరా రిజల్యూషన్ సహా నిర్దిష్ట వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు. సోనీ ఐఫోన్ల కోసం కెమెరా సెన్సార్లను తయారు చేస్తుందన్న విషయాన్ని టిమ్ కుక్ తొలిసారిగా వెల్లడించడం గమనార్హం. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సోనీ తన కెమెరా సెన్సార్ పనితనం మరింత పెంచేందుకు కొత్త సెమీకండక్టర్ ఆర్కిటెక్చర్ను ఉపయోగించే కొత్త ఇమేజ్ సెన్సార్ను అభివృద్ధి చేస్తోందట. We’ve been partnering with Sony for over a decade to create the world’s leading camera sensors for iPhone. Thanks to Ken and everyone on the team for showing me around the cutting-edge facility in Kumamoto today. pic.twitter.com/462SEkUbhi — Tim Cook (@tim_cook) December 13, 2022 చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
ఎలక్ట్రిక్ వాహనాల్లోకి సోనీ
టోక్యో: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వినోద రంగంలో ఉన్న జపాన్ సంస్థ సోనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన తయారీ దిగ్గజం హోండాతో చేతులు కలిపింది. సోనీ హోండా మొబిలిటీ పేరుతో ఏర్పాటైన కంపెనీ 2025 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనుంది. డెలివరీలు 2026 నుంచి మొదలు కానున్నాయి. తొలుత యూఎస్ మార్కెట్లో ఇవి రంగ ప్రవేశం చేయనున్నాయి. ఆ తర్వాత జపాన్, యూరప్లో అడుగుపెడతాయని సోనీ హోండా మొబిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యసుహిదె మిజూనో వెల్లడించారు. పూర్తిగా కొత్తదనం ఉట్టిపడేలా రూపొందిస్తామన్నారు. యూఎస్లోని హోండా ప్లాంటులో ఈవీలను తయారు చేస్తారు. అయితే ఇది ఒక ప్రత్యేక మోడల్ అని, భారీ విక్రయాల కోసం ఉద్దేశించి తయారు చేయడం లేదని కంపెనీ అధికారులు తెలిపారు. చెరి 50 శాతం వాటాతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ స్థాపించాలని 2022 మార్చిలో సోనీ గ్రూప్ కార్పొరేషన్, హోండా అంగీకరించాయి. ఇమేజింగ్, నెట్వర్క్, సెన్సార్, వినోద నైపుణ్యంతో సోనీ.. వాహనాలు, మొబిలిటీ టెక్నాలజీ, అమ్మకాలలో హోండాకు ఉన్న నైపుణ్యాన్ని ఒకచోట చేర్చే ఆలోచనతో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రెండేళ్ల క్రితం లాస్ వెగాస్లో జరిగిన సీఈఎస్ గ్యాడ్జెట్ షోలో సోనీ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది. -
సోనీ–జీ విలీనానికి షరతులతో ఆమోదం
న్యూఢిల్లీ: సోనీ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కాంపిటిషన్ కమిషన్ ఈ విలీనానికి షరతులతో కూడిన ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత విలీనానికి కొన్ని సవరణలతో ఆమోదం తెలియజేసినట్టు సీసీఐ ట్విట్టర్పై వెల్లడించింది. వినోద కార్యక్రమాల ప్రసారాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోనీ, జీ విలీనం.. మార్కెట్లో ఆరోగ్యకర పోటీకి విఘాతమన్న ఆందోళన మొదట సీసీఐ నుంచి వ్యక్తమైంది. ఇదే విషయమై ఇరు సంస్థలకు షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో తమ డీల్కు సంబంధించి కొన్ని మార్పులు, పరిష్కారాలను అమలు చేస్తామంటూ ఇరు పార్టీలు సీసీఐ ముందు ప్రతిపాదించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీంతో సీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో ప్రకటించిన మేరకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ విలీనం కానుంది. ఈ విలీనంతో సోనీ భారత మార్కెట్లో మరింత బలపడనుంది. స్టార్ నెట్వర్క్ నుంచి వస్తున్న పోటీని బలంగా ఎదుర్కోవడానికి అనుకూలతలు ఏర్పడనున్నాయి. అందుకే ఈ విలీనం పట్ల సోనీ, జీ రెండూ ఆసక్తిగా ఉన్నాయి. సీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైతే కొన్ని చానల్స్ను మూసేయడానికి జీ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. -
విక్రమ్ ‘కోబ్రా’ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించించింది. మాజీ క్రికెటర్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రల్లో కనిపించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 31న థియేటర్లో విడుదలైంది. విక్రమ్ విభిన్న పాత్రల్లో అలరించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎప్పటిలాగే విక్రమ్ నటన మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్పై తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ తాజా బజ్ ప్రకారం తమిళం, తెలుగులో సెప్టెంబర్ 23 లేదా 30న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ -
ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో!
దుబాయ్: క్రికెట్కు కామధేనువు భారత మార్కెట్ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్ వేలం ద్వారా బీసీసీఐ జాక్పాట్ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్ డిజిటల్ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది. నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ, అండర్–19 వరల్డ్కప్లు కూడా ఇందులో భాగమే. హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్న్యూస్ -
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
బెస్ట్ గేమింగ్ టీవీ కోసం చూస్తున్నారా, ఇదిగో కళ్లు చెదిరే టీవీల లిస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఫెస్టివ్ సీజన్లో మంచి గేమింగ్ టెలివిజన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. ఇటీవలి కాలంలో మొబైల్స్, టీవీల్లో గేమింగ్ బాగా పాపులర్ అవుతోంది. తమ స్నేహితులతో కలిసి వర్చువల్గా మల్టీప్లేయర్ గేమ్స్తో కొత్త ప్రపంచాలని అన్వేషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మానిటర్ లేదా టీవీ చాలా ముఖ్యం. గేమింగ్ టీవీలు అధిక రిఫ్రెష్ రేట్ 4K డిస్ప్లేలు గేమ్లలో అద్భుతమైన విజువల్స్ను ఫిక్స్డ్ ఫ్రేమ్ రేట్తో అందిస్తాయి. ఈ టీవీలు శక్తివంతమైన ప్రాసెసర్లతో పాటు, VRR, G-Sync, FreeSync కి సపోర్ట్తో కస్టమర్లకు మంచి గేమింగ్ అనుభవాన్నిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నదిగ్గజ కంపెనీలుఎల్జీ, సోనీ, శాంసంగ్ , టీసీఎల్ తదితర ది బెస్ట్ టీవీలను ఒకసారి చూద్దాం ఎల్జీ సీ 2 ఎల్జీ సీ 2 OLED 4K స్మార్ట్ టీవీ C1కి సక్సెసర్ ఇది. α9 Gen5 AI ప్రాసెసర్తో వస్తుంది, 42, 48, 55 ,65,77 , 83 అంగుళాల సైజుల్లో లభ్యం. ఇది పిక్సెల్ డిమ్మింగ్కు మద్దతు ఇస్తుంది . 100 శాతం కలర్ ఫిడెలిటీతో మంచి గేమింగ్ అనుభవాన్నిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో Nvidia G-Sync, AMD ఫ్రీసింక్ , VRRలకు సపోర్ట్ దీని స్పెషాలిటీ. ఇది పీసీగానూ కన్సోల్ గేమింగ్కు పనికొస్తుంది. ఇండియాలో ఈ టీవీ ధర రూ. 1,39,990 నుండి ప్రారంభం. LG అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సోనీ X90J కంపెనీ ఫ్లాగ్షిప్ 4K LED స్మార్ట్ టీవీఇది. సోనీ X90J అనేది బ్యాక్లైటింగ్ లోకల్ డిమ్మింగ్తో గేమింగ్కోసం బెస్ట్ ఆప్షన్ ఇది. ఇమేజ్ క్వాలిటీని పెంపొందించే Bravia XR ప్రాసెసర్తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ VRRకి సపోర్టు చేస్తుంది. ఇందులోని ఫార్-ఫీల్డ్ మైక్స్తో మీ వాయిస్ని ఉపయోగించి ఆపరేట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో లభిస్తుంది భారతదేశంలో రూ. 1,18,740 నుండి ప్రారంభం. ఈ టీవీని క్రోమా ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ Q90B QLED TV అద్భుతమైన 4K చిత్రాలను అందించడానికి నియో క్వాంటం ప్రాసెసర్ని కలిగి ఉంది. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ లైట్ని ఎడ్జస్ట్ చేసుకుని, 4K గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ టీవీకి VRR మద్దతు లేదు. 50, 55, 65, 75, 85 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,09,990 నుండి ప్రారంభం Samsung అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. TCL C835 4K TV క్వాడ్-కోర్ 4K ప్రాసెసర్, లోకల్ డిమ్మింగ్ , 144Hz వరకు రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ వస్తుంది. మినీ LED ప్యానెల్ అద్భుతమైన కాంట్రాస్ట్, VRR మద్దతును దీని స్పెషల్. TCL C835 TV 55,65 ,75 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర భారతదేశంలో రూ. 1,19,990 నుండి ప్రారంభం. TCL స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ది ఫ్రేమ్ 2022 శాంసంగ్ నుంచి మరో సూపర్ గేమింగ్ టీవీ శాంసంగ్ ది ఫ్రేమ్ 2022అద్భుతమైన డిజైన్తో అధునాతన ఫోటో ఫ్రేమ్గా కనిపిస్తుందీ టీవీ.120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో ఫ్రేమ్ 100 శాతం కలర్ వాల్యూమ్ను అందించే క్వాంటం డాట్ టెక్, క్వాంటం ప్రాసెసర్ కలిగి ఉంది. భారతదేశంలో రూ. 53,990 నుండి ప్రారంభం, దీన్ని Samsung స్టోర్, అమెజాన్ , ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు -
IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, వయాకామ్–18..!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్... షేర్ మార్కెట్... గత రెండు దశాబ్దాల్లో భారత్లో ఏ రంగంలోనైనా ఇంత విలువ ఒక్కసారిగా పెరిగిందా అనేది సందేహమే! ఆరంభంలో మ్యాచ్కు రూ. 13.6 కోట్లు... పదేళ్ల తర్వాత మ్యాచ్కు రూ. 55 కోట్లు... మరో ఐదేళ్ల తర్వాత చూస్తే మ్యాచ్కు రూ.107.5 కోట్లు! క్రికెట్ అభిమానులకు అమిత వినోదాన్ని అందిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు అంతులేని ఆదాయం తెచ్చి పెడుతూ కొత్త రికార్డులు కొల్లగొట్టింది. ఫలితంగా బీసీసీఐ ఆర్జనలో మరో అతి పెద్ద అడుగు పడింది ... ఈ–వేలం ద్వారా లీగ్ ప్రసారహక్కుల కోసం నాలుగు ప్యాకేజీలు ప్రకటిస్తే రెండు ప్యాకేజీలకే ఇప్పటి వరకు బోర్డు ఖాతాలో రూ. 44,075 కోట్లు చేరాయి. మూడో ప్యాకేజీ వేలం ఇంకా కొనసాగుతుండగా, నాలుగో ప్యాకేజీ నుంచి కూడా తుది మొత్తం నేడు ఖరారవుతుంది. అయితే హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారనే దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. టీవీ హక్కుల కోసం సోనీ, డిస్నీ స్టార్ తీవ్రంగా పోటీ పడగా... డిజిటల్ హక్కులు రిలయన్స్ సంస్థకు చెందిన ‘వయాకామ్–18’కు సొంతమైనట్లు వినిపిస్తోంది. ప్యాకేజీ ‘ఎ’: భారత ఉపఖండంలో టీవీ చానల్లో ఐపీఎల్ మ్యాచ్ల ప్రసార హక్కులు (మొత్తం రూ. 23,575 కోట్లు; ఒక్కో మ్యాచ్కు రూ. 57.5 కోట్లు). ప్యాకేజీ ‘బి’: భారత ఉపఖండంలో డిజిటల్ (ఆన్లైన్) ఐపీఎల్ మ్యాచ్ల ప్రసార హక్కులు(మొత్తం రూ. 20,500 కోట్లు; మ్యాచ్కు రూ. 50 కోట్లు). ప్యాకేజీ ‘సి’: ఎంపిక చేసిన మ్యాచ్ల నాన్ ఎక్స్క్లూజివ్ డిజిటల్ హక్కులు. ప్యాకేజీ ‘బి’ గెలుచుకున్న సంస్థతో పాటు మరో డిజిటల్ ప్లాట్ఫామ్పై ప్రసారం చేసుకునే హక్కు (ఇప్పటికి సుమారు రూ. 2000 కోట్లు లభించాయి. వేలం నేడు కూడా కొనసాగుతుంది. ఒక్కో మ్యాచ్కు రూ. 18.4 కోట్లు చెల్లించే అవకాశం). ప్యాకేజీ ‘డి’: ఉపఖండం మినహా ఇతర దేశాల టీవీ, డిజిటల్ హక్కులు (వేలం జరగాల్సి ఉంది) ఐదేళ్లలో జరిగే మొత్తం ఐపీఎల్ మ్యాచ్లు 410 నాన్ ఎక్స్క్లూజివ్ మ్యాచ్ల సంఖ్య (ప్యాకేజీ ‘సి’): 18+20+24 (నాన్ ఎక్స్క్లూజివ్ మ్యాచ్లు అంటే... ఆదివారాల సాయంత్రపు మ్యాచ్లు+ లీగ్ ప్రారంభ మ్యాచ్+ప్లే ఆఫ్లు +ఫైనల్). చదవండి: Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో! -
IPL-BCCI: సుమారు రూ. 50 వేల కోట్లు! జూన్ 12 నుంచి..
IPL Media Rights- ముంబై: ఐపీఎల్ మీడియా హక్కుల కోసం బీసీసీఐ టెండరు ప్రకటన జారీ చేసింది. 2023–2027 మధ్య ఐదేళ్ల కాలానికి బోర్డు హక్కులు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఐపీఎల్ స్థాయి, విలువ ఎన్నో రెట్లు పెరగడంతో హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. రెండు అదనపు జట్ల రాకతో మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగింది. దాంతో మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ సుమారు రూ. 50 వేల కోట్లను ఆశిస్తోంది. జీ–సోనీ, రిలయన్స్ సంస్థలు ఎంత మొత్తం చెల్లించైనా హక్కులు సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత జూన్ 12 నుంచి బీసీసీఐ ఈ–వేలం ప్రక్రియ నిర్వహించి ఎవరికి హక్కులు దక్కాయో ప్రకటిస్తుంది. చదవండి: Nicholas Pooran: కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్ అయితే ఎలా? -
ఐఫోన్కు పోటీగా సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ఫోన్..! అది కూడా బడ్జెట్ రేంజ్లో
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రీమియం స్మార్ట్ఫోన్లలో బడ్టెట్ రేంజ్లో ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్కు చెక్ పెట్టే పనిలో ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం సోనీ నిమ్నగ్నమైంది. న్యూ ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్కు పోటీగా Sony Xperia Ace III స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సోనీ సన్నాహాలను చేస్తోంది. తాజాగా Sony Xperia Ace III సంబంధించిన ఫీచర్స్ ఆన్లైన్లో వైరల్గా మారాయి. సోనీ ఎక్స్పీరియా ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్లను 2019లో సోనీ లాంచ్ చేసింది. ప్రముఖ టిప్స్టర్ హెమ్మెర్స్టోఫర్ , జోల్లేజ్ షేర్ చేసిన రెండర్స్ ప్రకారం...సోనీ ఎక్స్పీరియా ఎస్ III వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్తో 5.5 అంగుళాల డిస్ప్లేతో రానుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను కల్గి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ లేత ఆకుపచ్చ,బ్లాక్ కలర్ వేరియంట్లలో లభించనుంది. సోనీ ఎక్స్పీరియా ఎస్ III స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 888 ఎస్ఓసీ చిప్తో రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ఫోన్లో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను పొందనుంది. యూఎస్బీ టైప్సీ ఛార్జింగ్ సపోర్ట్, 4500 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానున్నట్లు టిప్స్టర్స్ తమ రెండర్స్లో పేర్కొన్నారు. ఇక ధర విషయానికి వస్తే..కొత్తగా లాంచైన ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ. 33 వేలుగా ఉండగా..దీని కంటే తక్కువ ధరలో సోనీ ఎక్స్పీరియా ఎస్ III వచ్చే అవకాశం ఉందని టిప్స్టర్స్ అభిప్రాయపడ్డారు. చదవండి: అనూహ్య నిర్ణయం! అక్కడ ఏటీఎంలు అన్నీ బంద్..! కారణం ఇదే..!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్మెంట్ డే 4th June (ఫొటోలు)
ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
తప్పక చదవండి
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement