sony
-
జపాన్ కంపెనీల హవా.. చైనా బ్రాండ్లకు దెబ్బ!
కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు భారత్లో జపాన్ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలు కొంతకాలంగా తగ్గిపోయాయి. ఇటీవల కాలంలో జపాన్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల వల్ల తిరిగి ఇండియాలో వాటి ఉత్పత్తుల అమ్మకాలు పుంజుకుంటున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. సోనీ , పానాసోనిక్, హిటాచీ వంటి జపాన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్లకు భారత్లో మంచి ఆదరణ ఉంది. కానీ కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు వాటి అమ్మకాలు స్థానికంగా తగ్గిపోయాయి. దాంతో జపాన్ కంపెనీలు కొత్త విధానాలను అమలు చేస్తూ తిరిగి వాటి ఉత్పత్తుల అమ్మకాలను పునరుద్ధరిస్తున్నాయి.ఎక్కువ మార్జిన్లు ఉండే ఉత్పత్తులు, బిగ్స్క్రీన్ టీవీలను విక్రయించడం, తక్కువ మార్జిన్లు ఉండే వాటిని నిలిపేయడం వంటి విధానాలను పాటిస్తున్నాయి. ప్రధానంగా జపాన్ కంపెనీలు ఇండియాలో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర గృహోపకరణాలను విక్రయిస్తున్నాయి. పానాసోనిక్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెరిగాయి. దాదాపు ఆరేళ్ల పాటు వృద్ధి, అమ్మకాల విషయంలో తిరోగమన పథంలో ఉన్న కంపెనీ ఉత్పత్తులు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 30% పైగా పుంజుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2,338 కోట్ల వ్యాపారంతో పోలిస్తే వినియోగదారుల విభాగంలో 2025లో రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.అమ్మకాలు జూమ్సోనీ ఇండియా గత ఎనిమిదేళ్లలో ఈసారి అత్యుత్తమ నికర లాభాన్ని నమోదు చేసింది. సోనీ బ్రావియా టెలివిజన్ల అమ్మకాల్లో 20% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో సోనీ ఇండియా అమ్మకాలు రూ.7,663 కోట్లుగా ఉన్నాయి. 2014-15లో గరిష్టంగా కంపెనీకి రూ.11,000 కోట్ల రెవెన్యూ సమకూరింది. తర్వాత ఈసారి వచ్చిన ఆదాయమే అధికంగా ఉంది.చైనా బ్రాండ్లతో పోటీపానాసోనిక్ ఇండియా బిజినెస్ ఛైర్మన్ మనీష్ శర్మ మాట్లాడుతూ..‘జపాన్ బ్రాండ్లు ధరల విషయంలో పోటీ పడటం లేదు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాయి. వైఫల్యాల రేటును గణనీయంగా తగ్గించుకోవాలనుకుంటున్నాం. భారత్లో క్రమంగా విక్రయాలు పెరుగుతున్నాయి. షావోమీ, హైసెన్స్, హాయర్ వంటి చైనీస్ బ్రాండ్లు, కొడాక్, థామ్సన్ వంటి ఆన్లైన్ కేంద్రీకృత బ్రాండ్ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలున్నాయి. కొరియన్ కంపెనీలైన ఎల్జీ, సామ్సంగ్లతో కూడా జపాన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటనఎయిర్ కండీషనర్ తయారీ రంగంలో ఉన్న జపాన్ కంపెనీ హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లాభాలు నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదిక 64% అమ్మకాలు పెరగడం ద్వారా రూ.1,392 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ తెలిపింది. -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్'కు మహాత్మా గాంధీ మునిమనవడు ప్రశంసలు
చారిత్రాత్మక స్వాతంత్య్రపోరాట నేపధ్యంలో తీసిన 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సోనీలివ్ వేదికగా ఓటీటీ వీక్షకుల ఆదరణ చూరగొంటోంది. దర్శకుడు నిక్కిల్ అద్వానీ విజన్ ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. తాజాగా మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈ సిరీస్ను చూడాల్సిందిగా సిఫారసు చేయడం విశేషం. ఆయన ఎక్స్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారిలా... ’ఫ్రీడం ఎట్ మిడ్నైట్’ చూడటం మొదలుపెట్టాను. ఇది బాపు – పండిట్ నెహ్రూ – మన ఫ్రీడమ్కు సంబంధించిన ఒక హిందూత్వ వెర్షన్ అని నేను అనుకున్నాను. కానీ నేను పొరపడ్డాను. ఇది ముందస్తు అంచనాలు ఉండవద్దనే పాఠం నాకు నేర్పింది. దీని గురించి చెప్పాల్సింది ఇంకా ఉంది. అయతే తప్పక దీన్ని చూడాల్సిందిగా నేను సిఫార్సు చేస్తున్నాను’’ తుషార్ గాంధీ మాత్రమే కాకుండా ఆలోచింపజేసే చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు సుధీర్ మిశ్రా కూడా ఈ సిరీస్కు సంబంధించి దర్శకుని కృషిని ఎంతగానో ప్రశంసించారు. లారీ కాలిన్స్, డొమినిక్ లాపియర్ రాసిన పుస్తకం ఆధారంగా ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ రూపొందింది. ఇందులో సిధాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా, మలిష్కా మెండోన్సా, రాజేష్ కుమార్, కేసీ శంకర్, ల్యూక్ మెక్గిబ్నీ, కార్డెలియా బుగేజా, అలిస్టెయిర్ ఫిన్లే, ఆండ్రూ కల్లమ్, రిచర్డ్ టెవర్సన్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో నెక్ట్స్తో కలిసి ఎమ్మే ఎంటర్టైన్ మెంట్ (మోనిషా అద్వానీ – మధు భోజ్వానీ) దీన్ని నిర్మించింది. ఈ సిరీస్కు నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు. -
బిగ్బీని కదిలించిన కేబీసీ 16 ‘కరోడ్పతి’ ఎమోషనల్ జర్నీ
బుల్లితెరపై రియాల్టీ, గేమ్, క్విజ్ షోలు చూసేటపుడు, పోటీదారులతోపాటు వీక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్విజ్లలో అయితే సమాధానం తెలిసినవారు ‘అబ్బ.. ఛ.! అదే నేనైతేనా అంటూ తెగ ఆరాటపడి పోతారు. కానీ అంత ఈజీ కాదు. అందుకే హాట్ సీట్ అయింది. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్న గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి( KBC). తాజా కేబీసీ 16వ ఎడిషన్లో కోటి రూపాయలు గెల్చుకున్నాడు ఓ కుర్రాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాష్ ఎమోషనల్ జర్నీని తెలుసుకుందాం.ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో యుపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న చంద్ర ప్రకాష్ అన్ని దశలను పూర్తి చేసుకుని కేబీసీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 24న చాలెంజర్ వీక్లో భాగంగా హాట్ సీట్లో బిగ్ బీ ముందు ధైర్యంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఈ సీజన్లో తొలి 'కోటీశ్వరుడు' అయ్యాడు. దీంతో పాటు ఒక కారును కూడా గెల్చుకున్నాడు. ఇక్కడి దాకా రావడానికి చందర్ పడ్డకష్టాలు గురించి తెలుసుకున్న బిగ్బీ కూడా చలించిపోయారు. చందర్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా చందర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు చందర్. ఆయన గుండె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏడు శస్త్రచికిత్సలు చేయించు కున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి వైద్యులు అతనికి ఎనిమిదో శస్త్రచికిత్స చేయించు కోవాలని సూచించారు. ఇన్ని సర్జరీలు, బాధల్ని దాటుకుని చందర్ విజేతగా నిలవడం విశేషం.చందర్ కష్టాలను విన్న అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ చెప్పిన ‘ప్రాణమున్నంత వరకు పోరాటం తప్పదు’ అనే మాటల్ని గుర్తు చేశారు. పట్టుదల, అంకిత భావమే మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిందంటూ విజేత చందర్ ప్రకాష్ను అభినందించారు. కోటి రూపాయల ప్రశ్న "ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు, కానీ 'శాంతి నివాసం' అని అర్ధం వచ్చే అరబిక్ పేరుతో ఉన్న ఓడరేవు? డబుల్ డిప్ లైఫ్లైన్ని అనే లైఫ్లైన్ని ఎంచుకుని దీనికి సరియైన టాంజానియాగా చెప్పాడు. దీంతో కోటి గెల్చుకున్నాడు. ఇక ఏడు కోట్ల ప్రశ్నకుచందర్ని రూ. 7 కోట్ల ప్రశ్న '1587లో ఉత్తర అమెరికాలో ఆంగ్లేయ తల్లిదండ్రులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు?'. లైఫ్లైన్లు లేకపోవడంతో, సమాధానం కచ్చితంగా తెలియక షో నుంచి క్విట్ అయ్యాడు. కానీ వర్జీనియా డారే అనే జవాబును సరిగ్గానే గెస్ చేశాడు. ఇలాంటి హృదయాలను కదిలించే కథలు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో అనేకం విన్న సంగతి తెలిసిందే. -
Brinda Web Series Review: 'బృంద' వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్సిరీస్: బృందవిడుదల: ఆగష్టు 2 నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్సామి రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల ఓటీటీ స్ట్రీమింగ్ : సోనీ లివ్జానర్: క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ఎపిసోడ్స్: 8స్ట్రీమింగ్ భాషలు: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లాసౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా త్రిష కొనసాగుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వెండితెరపై దూసుకుపోతుంది. గ్లామరస్ రోల్స్తో పాటు నటనకు అవకాశమున్న సినిమాలతో తనేంటో సత్తా చాటుతుంది. ఇండస్ట్రీలో సుమారు 25 ఏళ్లుగా పైగా రాణించిన త్రిష.. తొలిసారి బృంద అనే ఓ వెబ్సిరీస్లో నటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. బృందతో మెప్పించిందా..? అనేది తెలియాలంటే ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్లో ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.కథకథ పరంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేక్షకులకు తప్పకుండా క్రైమ్ థ్రిల్లర్ను అందిస్తుంది. ఇందులో దర్శకుడు సూర్య మనోజ్ విజయం సాధించారని చెప్పవచ్చు. సిరీస్ ప్రారంభంలోనే వీక్షకులను చూపు తిప్పుకోలేని పాయింట్తో కథ ప్రారంభం అవుతుంది. త్రిష చిన్నతనం ఎపిసోడ్స్తో మొదలైన స్టోరీ ఆమె పెద్ద అయ్యాక ఓ పోలీస్స్టేషన్లో ఎస్సైగా ఉద్యోగంలో చేరుతుంది. మహిళ అనే భావనతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. అంతే కాకుండా అప్పటికే అక్కడ పనిచేస్తున్న సీఐ సాల్మన్తో పాటు మిగిలిన సిబ్బందికి బృంద పనితీరు పట్ల అంతగా నమ్మకం ఉండదు. ఆమెను ఆఫీస్కే పరిమితం చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఓ రోజు పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం దొరుకుతుంది. గుండెల్లో సుమారు 16సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలుతుంది. దీంతో ఈ కేసును వదిలేయండి అంటూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చూపుతారు. అయితే, ఈ కేసును పట్టుబట్టి బృంద ఇన్వెస్టిగేషన్ చేయడం. అదే తరహాలో మొత్తం 16మంది అతి దారుణంగా చంపబడ్డారని ట్విస్ట్ రివీల్ అవుతుంది. దీంతో అధికారులు అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసి కేసును పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తారు. ఈ టీమ్ సాయంతో సీరియల్ కిల్లర్ను బృంద ఎలా పట్టుకుంది అనేది కథ. త్రిష గతం ఏంటి.. ఏం జరిగింది..? త్రిష చిన్నతనంలో జరిగిన మూఢ నమ్మకాల హత్యలకు వీటికి ఉన్న లింకేంటి..? చిన్న తనంలో తప్పిపోయిన తన అన్నయ్యను త్రిష కులుసుకుందా..? వీటితో పాటు హత్యల వెనుక ఉన్నదెవరు..? అసలు సీరియల్ కిల్లర్గా మారడం వెనుకున్న స్టోరీ ఏంటి..? తెలుసుకోవాలంటే బృంద ఇన్వెస్టిగేషన్ చూసేందుకు భాగం కావాల్సిందే.ఎలా ఉందంటే..కథ ప్రారంభం 1996 టైమ్లైన్ అయినప్పటికీ కొంత సమయం తర్వాత వర్తమానంలోకి పరిచయం అవుతుంది. గంగవరం అనే అటవీ ప్రాంతంలోని ఒక తెగలో బృంద చిన్నతనం గడుస్తుంది. అక్కడ తన తల్లిని, అన్నయ్యను కోల్పోయిన బృంద ఎలా నగరానికి చేరుతంది అనే మంచి ఓపెనింగ్ సీన్తోనే దర్శకుడు సిరీస్పై క్యూరియాసిటీ కలిగించాడు. ఒక మహిళ పోలీస్ ఉద్యోగానికి పనికిరాదని హేళన చేసిన తొటి ఉద్యోగుల చేతనే శభాష్ అనిపించుకునేలా బృంద పాత్ర చాలా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్గా త్రిష యాక్టింగ్ మెప్పిస్తుంది. మూఢనమ్మకాల వల్ల అన్యాయానికి గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్స్గా మారుతున్నారు అనే అంశాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. కథపరంగా చూస్తే.. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పోలీసు, కిల్లర్ మధ్య జరిగే సీన్స్ చాలా ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. త్రిష గతంతో పాటు వర్తమాన కాలంలోని అంశాలను జత చేస్తూ చూపిన స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అయింది. ఇన్వెస్టిగేషన్ పేరుతో నిడివి కాస్త పెరిగినట్లు అనిపించినా త్రిష నటనతో ఎంగేజ్ చేసింది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం కథ అయితే.. అందుకు తగ్గట్లుగా పోలీసు పాత్రలో నటించిన త్రిష, హంతకుడి పాత్రలో కనిపించిన ఆనందసామి నటన. వీరిద్దరితో పాటు ఇంద్రజీత్, రవీంద్ర విజయ్, ఆమని తదితరులు తమ పరిధి మేరకు నటించారని చెప్పవచ్చు. గతం, వర్తమాన అంశాలను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా మంచి స్క్రీన్ప్లే టెక్నిక్తో సిరీస్ను నడిపించారు. బృంద ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడ లాజిక్లు లేకున్నా సినిమా కదా అని చూస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్లో 4,5 ఎపిసోడ్స్ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కాస్త నిడివి తగ్గించుంటే బాగుండు అనే భావన కలుగుతుంది. ఫైనల్గా బృంద ఇన్వెస్టిగేషన్తో అదరగొడుతుంది. ఎలాంటి సందేహం లేకుండా ఈ వెబ్ సిరీస్ను చూడొచ్చు. అందరినీ థ్రిల్లింగ్కు గురిచేస్తుంది. -
సివిల్స్ కల జల సమాధి
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా): ఎలాగైనా ఐఏఎస్ కావాలని ఆ యువతి కన్న కల జల సమాధి అయ్యింది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్ను వరద ముంచెత్తిన దుర్ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన తానియా సోని (22) దుర్మరణం పాలయ్యింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..అందులో సోని ఉన్నట్లు అందిన సమాచారంతో శ్రీరాంపూర్లో విషాదం నెలకొంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్లోని ఔరంగాబాద్కు చెందిన విజయ్కుమార్ సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్సారీ్ప–1 గని మేనేజర్గా పని చేస్తున్నారు. నస్పూర్లోని సీసీసీ టౌన్షిప్ బీ–2 కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. విజయ్కుమార్– బబిత దంపతులకు ముగ్గురు సంతానం కాగా సోనిపెద్ద కుమార్తె. రెండో కూతురు పలక్ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బీటెక్ చేస్తోంది.కుమారుడు ఆదిత్యకుమార్ హైదరాబాద్లో పదో తరగతి చదువుతున్నాడు. సోని గతేడాదే ఢిల్లీలోని అగ్రసేన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. కలెక్టర్ కావాలనే తన కోరికను తండ్రికి చెప్పింది. తండ్రి ఆశ కూడా అదే కావడంతో మూడు నెలల క్రితం రావూస్ కోచింగ్ సెంటర్లో చేరి్పంచి శిక్షణ ఇప్పిస్తున్నారు. శనివారం ఏం జరిగింది..? ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్న భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు రావడం ప్రారంభమయ్యింది. విషయం గమనించిన విద్యార్థులు బయటపడేందుకు ప్రయతి్నంచారు. కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయి బేస్మెంట్లోని లైబ్రరీలో బయోమెట్రిక్ గేటు జామ్ అయింది. దీంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. బల్లలపై నిల్చుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.చూస్తుండగానే 10–12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడివారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. 14 మందిని తాళ్ల సహాయతో రక్షించారు. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున సోనితో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్ (22), కేరళకు చెందిన నెవిన్ డాలి్వన్ (29) మృతదేహాలను వెలికితీశారు. స్పందించిన సింగరేణి అధికారులు సమాచారం తెలిసిన వెంటనే సింగరేణి సీఎండీ, ఇతర డైరెక్టర్లు, శ్రీరాంపూర్లోని ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి స్పందించారు. ఢిల్లీలోని సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, కోల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ డీజీఎం అజయ్కుమార్ను అప్రమత్తం చేశారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సోని మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పోస్ట్మార్టమ్ అనంతరం మూడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రయాణంలో ఉండగా మరణ వార్త విజయ్కుమార్–బబిత దంపతులు రెండో కూతురు పలక్ను కాలేజీలో దింపడం కోసం శనివారం రైల్లో లక్నో బయల్దేరారు. కాగజ్నగర్కు చేరుకోగానే వారికి సోని మరణవార్త తెలిసింది. దీంతో వారు తీవ్ర విషాదంలోనే నాగ్పూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న సోనిని చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వస్థలమైన ఔరంగాబాద్కు తరలించారు. విజయ్కుమార్కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారి కేరీర్ గురించి ఎప్పుడు తమతో చర్చిస్తూ ఉండేవాడని తోటి అధికారులు తెలిపారు. 10 మందికి పైగా గల్లంతు? ముంపు ఘటన నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి నుంచే ఆందోళనకు దిగారు. 10 మందికి పైగా గల్లంతయ్యారని ఆరోపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో స్టడీ సర్కిల్ యజమాని స్టడీ సర్కిల్ యజమాని అభిõÙక్ గుప్తాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బేస్మెంట్లోకి నీరు చేరిందని గుప్తా పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్పందించింది. రావూస్ సంస్థకు బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహణకు తాము అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రాష్ట్ర మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆరా ఢిల్లీ దుర్ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బిహార్కు చెందిన సోని తండ్రి విజయ్కుమార్ మంచిర్యాలలో సింగరేణి సంస్థలో పని చేస్తున్నారని ఆయన వివరించారు. కాగా విజయ్కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్కుమార్ను ఫోన్లో పరామర్శించారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. -
ఓటీటీలో రియల్స్టోరీతో సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించిన సినిమాలు మలయాళం నుంచే ఉన్నాయి. 2024 శాండల్వుడ్ చిత్రపరిశ్రమకు బాగా కలిసొచ్చిన సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. ఈ క్రమంలో వచ్చిన మరొక చిత్రమే 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'. మే 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ఇందులో నటించారు. ఈ సినిమాను డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేశాడు. జనగణమన సినిమా హిట్ తర్వాత 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'ను ఆయన తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.మలయాళీ ఫ్రమ్ ఇండియా అనే చిత్రాన్ని యథార్థంగా జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని తెరకెక్కించారు. కథలో బలం ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే, ఈ సినిమా సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఆకతాయిగా ఉన్న ఒక యువకుడు ఊహించని ఘటనతో తన ఇల్లు వదిలి దుబాయ్ వెళ్లిపోతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది..? గ్రామంలో ఆకతాయిగా ఉన్న ఆ యువకుడి జీవితంలో వచ్చిన మార్పు ఏంటి..? ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ఎలా మెప్పించింది..? వంటి అంశాలు తెలియాలంటే మలయాళీ ఫ్రమ్ ఇండియా చూడాల్సిందే. ఫస్టాఫ్లో సినిమా కాస్త బోర్గా అనిపిస్తుంది. కొంత సమయం తర్వాతా చాలా ఆసక్తిగా కథ ఉంటుంది. మస్ట్ వాచెబుల్ సినిమా అని చెప్పవచ్చు. యథార్థ సంఘటనల ద్వారా తీసిన ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసేయ్యండి. చివరి 30 నిమిషాలు సినిమాకి ప్రధాన బలం అని చెప్పవచ్చు. -
రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. 'స్కామ్ 2010' వచ్చేస్తుంది
ప్రపంచాన్ని కుదిపేసిన స్కామ్ల గురించి ఇప్పటికే రెండు వెబ్ సిరీస్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హన్సల్ మెహతా నిర్మించిన ఈ సిరీస్లను తుషార్ దర్శకత్వం వహించారు. భారత స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్సిరీస్ 'స్కామ్ 1992'. ఎలాంటి అంచనాలు లేకుండా 2020లో సోనీ లివ్లో విడుదలైంది. కానీ, ఈ వెబ్ సిరీస్కు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. అదే తరహాలో 'స్కామ్ 2003' తెరకెక్కింది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ కథను తెర మీద చూపించారు. ఈ రెండింటికీ సోనీ లివ్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'సుబ్రతా రాయ్ సహారా' స్కామ్ గురించి హన్సల్ మెహతా మరో సిరీస్ను తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్కు 'స్కామ్ 2010 ది సుబ్రతా రాయ్ సాగా' అని హన్సల్ వెల్లడించారు. తమల్ బందోపాధ్యాయ రాసిన సహారా: ది అన్టోల్డ్ స్టోరీ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు.కేవలం రూ. 2000తో వ్యాపారం మొదలుపెట్టిన సుబ్రతా రాయ్.. రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే, ఆయనపై చిట్ ఫండ్ అవకతవకలు, నకిలీ ఇన్వెస్టర్ల ఆరోపణలో రావడంతో 2014లో ఆయనను అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించారు. ఆయన తల్లి మరణంతో అంత్యక్రియల కోసం 2016లో బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్పై బయటే ఉన్నారు. ఈ క్రమంలో గతేడాదిలో సుబ్రతా రాయ్ గుండెపోటుతో మరణించారు. సహారా స్కామ్లో దాగివున్న నిజాలను ఈ సిరీస్లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో విడుదల కానుంది. -
ఓటీటీలోకి 'ఏజెంట్' సినిమా.. ట్వీట్ చేసిన నిర్మాత
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఎజెంట్ నిర్మాత అనిల్ సుంకర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ముందు ఏజెంట్ సినిమాను ఓటీటీలో విడుదల చేయండి అంటూ కామెంట్లు చేశారు. దీంతో అనిల్ సుంకర రిప్లై ఇచ్చారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నట్లు అనిల్ తెలిపారు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. అతి త్వరలోనే ఏజెంట్ సినిమా సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుందని అనిల్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ సుమారు రూ. 85 కోట్లతో తెరకెక్కినట్లు సమాచారం. కానీ ఇందులో పది శాతం కలెక్షన్స్ కూడా సినిమా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎజెంట్లో మలయాళ టాప్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. దీంతో మలయాళంలో కూడా సినిమాను విడుదల చేశారు. కానీ అక్కడ కూడా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్ సుంకర చేసిన ట్వీట్తో ఏజెంట్ ఓటీటీ విషయంపై మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. I already informed couple of times. We sold the digital to B4U and they to Sony. Hopefully they will do it asap. https://t.co/5k0aFYKZbB — Anil Sunkara (@AnilSunkara1) April 8, 2024 -
900 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ
జపాన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సోనీ తన ప్లేస్టేషన్ విభాగంలో పనిచేస్తున్న దాదాపు 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించించి. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కష్టతరమైనప్పటికీ తప్పదని సంస్థ వర్గాలు తెలిపాయి. సంస్థ తాజా నిర్ణయంతో దాదాపు 8 శాతం ఉద్యోగులు తగ్గినట్లవుతుందని తెలిసింది. టెక్, గేమింగ్ రంగంలో లేఆఫ్లను ప్రకటించిన తాజా సంస్థ ఇదే. పరిశ్రమలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ జిమ్ ర్యాన్ పేర్కొన్నారు. యూకే, యూరోపియన్ స్టూడియోలలో ‘ప్లేస్టేషన్ స్టూడియోస్ లండన్ స్టూడియో’ను పూర్తిగా మూసివేయనున్నట్లు తెలిపారు. గెరిల్లా, ఫైర్స్ప్రైట్ విభాగాల్లో ఉద్యోగుల తగ్గింపులు ఉండనున్నాయని చెప్పారు. డిసెంబరు 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో ఐదు గేమింగ్ విభాగాల్లో విక్రయాలు మందగించడంతో సోనీ గ్రూప్ ఈ నెల ప్రారంభంలో వాటి ఆదాయ అంచనాను తగ్గించింది. యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలు అనంతరం 2,000 మంది సిబ్బందిని తొలగిస్తామని నెల కిందట మైక్రోసాఫ్ట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు రియోట్ గేమ్స్ సంస్థ జనవరిలో 11 శాతం ఉద్యోగులను తగ్గించుకొంది. ఇదీ చదవండి: ఆండ్రాయిడ్లో రానున్న అద్భుతమైన అప్డేట్లు.. గత ఏడాదిలో యూఎస్లో ఐటీ కంపెనీలు దాదాపు 2.40 లక్షల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 32,000 ఐటీ ఉద్యోగాలు పోయినట్లు తెలుస్తోంది. ఇటీవల స్నాప్ ఇంక్ అనే సంస్థ తన ఉద్యోగుల్లో 10 శాతాన్ని (దాదాపు 540 మంది) తగ్గించనున్నట్లు ప్రకటించింది. -
భారీగా 'భ్రమయుగం' కలెక్షన్స్.. బిగ్ మార్క్ను దాటేసిన మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. కళ్లు చెదిరే కలెక్షన్స్తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం మూడు పాత్రలతో అది కూడా బ్లాక్ అండ్ వైట్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని భాషలతో కలుపుకుని రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సితార ఎంటర్టైన్మెంట్ వారు ప్రకటించారు. సినిమా పట్ల మంచి టాక్ రావడంతో రూ. 100 కోట్ల మార్క్ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మమ్ముట్టి సత్తా చాటుతున్నాడు. భ్రమయుగం ఓటీటీ రైట్స్ కూడా సుమారు రూ. 25 కోట్లకు పైగా సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి చివరి వారంలో సోనీ లివ్లో భ్రమయుగం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
సోనీతో విలీనానికి మళ్లీ రెడీ.. అంతలోనే ‘జీ’కి భారీ షాక్..
మీడియా దిగ్గజం జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్)కు భారీ షాక్ తగిలింది. జీ సంస్థ భారీ మొత్తంలో నిధుల మళ్లించినట్లు మార్కెట్ రెగ్యులేటరీ బోర్డ్ సెబీ గుర్తించింది. ఫలితంగా ఆ సంస్థ షేర్లు పతనమవుతున్నాయి. జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్) తాజాగా సోనీ గ్రూప్ తో వీలిన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గత నెలలో రండు సంస్థల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన విలీన ప్రతిపాదన రద్దయిన నేపరథ్యంలో తాజా అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ తరుణంలో జీ వ్యవస్థాపకులపై సెబీ జరిపిన విచారణలో కంపెనీ నుండి సుమారు 20 బిలియన్ల ($241 మిలియన్లు) మొత్తాన్ని మళ్లించినట్లు తేలింది. నిధుల వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. జీలో నిధులు మళ్లించడం సెబీ ఊహించిన దానికంటే దాదాపు పది రెట్లు ఎక్కువ ఉందని సమాచారం. సెబీ రివ్యూ భారీ మొత్తంలో నిధులు మాయమవ్వడంపై జీ ఇచ్చే సమాధానాలపై సెబీ రివ్వ్యూ జరపనుంది. రివ్యూ జరిపేందుకు రెగ్యులేటరీ జీ ఫౌండర్ సుభాష్ చంద్ర, అతని కుమారుడు పునిత్ గోయాంక్తో పాటు ఇతర బోర్డ్ సభ్యులు హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే రివ్యూ అనంతరం పైన పేర్కొన్నట్లుగా జీలో నిధులు మళ్లీంపు, లేదంటే దుర్వినియోగం జరిగిందా అనే అంశంపై స్పష్టత రానుంది. -
‘జీ’కి మరో ఎదురు దెబ్బ.. న్యాయ పోరాటం చేయనున్న సోనీ
భారత్లో అంతర్జాతీయ క్రికెట్ ప్రసారాల విషయంలో జీ - డిస్నీ హాట్ స్టార్ మధ్య 1.4 బిలియన్ల డాలర్ల సబ్ లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నుంచి జీ బయటకు వచ్చింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు డిస్నీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిస్నీ మాతృసంస్థ సోనీ గ్రూప్ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో దావా వేసింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు సోనీకి తొలి విడతగా జీ గ్రూప్ 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించడంలో జీ విఫలమైంది.ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపింది. దీంతో జీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సోనీ గ్రూప్ ఉపక్రమించింది. కాగా, ఈ పరిణామాలపై జీ గ్రూప్, సోనీ గ్రూప్లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. -
శశి సోనీ ఎవరు? పద్మశ్రీ ఎందుకు వరించింది?
‘నిరంతర శ్రమతోనే విజయం సాధ్యం’ అని అంటారు. శశి సోనీని చూస్తే ఇది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. నేడు ఆమె రూ. 4 వేల కోట్లకు పైగా విలువైన కంపెనీకి యజమానిగా మారి, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శశి సోనీ రూ. 10,000 ప్రారంభ మూలధనంతో ఒక కంపెనీని ప్రారంభించారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. నాటి నుంచి నేటి వరకూ శశి సోనీ జీవిత ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా సాగింది. 2024 పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో శశి సోనీ పేరు కూడా ఉంది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. పాకిస్తాన్లోని లాహోర్లో 1941, ఏప్రిల్ 4న శశి సోనీ జన్మించారు. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం ఢిల్లీకి తరలివచ్చింది. ఢిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం సాగింది. శశి 1971లో తన 30 ఏళ్ల వయసులో తొలిసారిగా సొంత వ్యాపారం ప్రారంభించారు. రూ. 10,000 పెట్టుబడితో ఆమె ‘డీప్ ట్రాన్స్పోర్ట్’ను ప్రారంభించారు. దానిని 1975 వరకు నిర్వహించారు. ఆ తర్వాత 1975లో ముంబయిలోని ములుంద్ ప్రాంతంలో ‘దీప్ మందిర్ సినిమా’ పేరుతో మొదటి ఏసీ సినిమా థియేటర్ను ప్రారంభించారు. దీనిని శశి సోనీ 1980 వరకు నడిపించారు. దశాబ్ద కాలం పాటు శ్రమించిన శశి ఆ తర్వాత అమోఘ విజయాన్ని అందుకున్నారు. శశి సోనీ ‘ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. మైసూర్లో నెలకొల్పిన ఈ గ్యాస్ తయారీ కర్మాగారంతో ఆమెకు మంచి ఆదాయం సమకూరింది. అనంతరం ఆమె సాంకేతిక రంగంలో కాలుమోపారు. శశి సోనీ 2005లో ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియాలో హైటెక్ ఆటోమోటివ్, ఈ-రిటైలింగ్ సేవలను అందిస్తోంది. ఈ కంపెనీకి చైర్పర్సన్గా శశి వ్యవహరిస్తున్నారు. ఐజెడ్ఎంఓ లిమిటెడ్.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ జాబితాలో చేరింది. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.4,150 కోట్లకు చేరింది. శశి ‘దీప్ జనసేవా సమితి’ సభ్యురాలు. ఈ సంస్థ మహిళలకు ఉద్యోగాలు కల్పించడంలో సహాయం చేయడంతో పాటు, మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం, పెన్షన్ పథకాలు ప్రారంభించడం, వికలాంగుల కోసం నిధుల సేకరణ తదితర సేవా కార్యక్రమాలను చేస్తుంటుంది. ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీకి పలు అనుబంధ కంపెనీలు కూడా ఉన్నాయి. పద్మశ్రీ అవార్డుకు ముందు శశి సోనీ వ్యాపార, సామాజిక సంక్షేమ రంగాల్లో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 1990లో ఆమె మహిళా గౌరవ్ అవార్డును అందుకున్నారు. ఆమె ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ గ్యాస్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అలాగే ఆమె డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్లో కూడా సభ్యురాలిగా కొనసాగుతున్నారు. -
సోనీ - జీ ఒప్పందం రద్దు..!
జపనీస్ సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా మధ్య ఒప్పందం రద్దయింది. దీంతో 10 బిలియన్ డాలర్ల (రూ. 8,31,32,55,00,000) ఒప్పదం నిలిచిపోయింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం రద్దు కావడానికి కారణం ఏంటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా పేరును దాని మాతృ సంస్థ చాలా రోజుల కిందటే కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్గా మార్చింది. నిజానికి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీను సోనీ తనలో విలీనం చేసుకోవాలని ప్రారంభంలో అనుకున్నప్పటికీ, అది పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో ఒప్పందం పూర్తిగా రద్దయింది. సోనీ & జీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఒక నెల గ్రేస్ పీరియడ్తో కలుపుకొని, 2023 డిసెంబర్ 21లోపు అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు, ఆర్థిక లావాదేవీలు పూర్తి కావాలి. అనుకున్న విధంగా జరగకపోతే.. ఇరుపార్టీలు కలిసి ఈ కాలవ్యవధిని మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. ఆలా జరగకపోతే.. నోటీసు ఇచ్చి విలీనం నుంచి తప్పుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అంబానీ ఖరీదైన నివాసం.. అంతా రామమయం - వీడియో వైరల్ సోనీ-జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఇదివరకే ఫెయిర్ ట్రేడ్ రెగ్యూలేటర్ సీసీఐ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, సహా కంపెనీ వాటాదారులు, రుణదాతలు అందరూ ఆమోదం తెలిపారు. 2023 ఆగస్టులో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముంబయి బెంచ్ కూడా ఈ విలీనానికి అనుమతి ఇచ్చింది. కానీ రెండు కంపెనీలు గడువును ఒక నెల పొడిగించినప్పటికీ తమ విభేదాలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. -
Zee-Sony Merger Deal: సోనీతో విలీన డీల్కు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో (ప్రస్తుతం కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ – సీఎంఈపీఎల్) విలీన డీల్కు కట్టుబడి ఉన్నామని జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కృషి చేస్తున్నామని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలిపింది. విలీన సంస్థకు జీల్ సీఈవో పునీత్ గోయెంకా సారథ్యం వహించడం ఇష్టం లేని కారణంగా సోనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జీల్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీల్తో తమ భారత విభాగం సీఎంఈపీఎల్ను విలీనం చేసేందుకు జపాన్కు చెందిన సోనీ గ్రూప్ రెండేళ్ల క్రితం డీల్ కుదుర్చుకుంది. అప్పట్నుంచి వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. జీల్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన తనయుడైన గోయెంకా .. కంపెనీ నిధులను మళ్లించారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరిపింది. గోయెంకాను ఏ లిస్టెడ్ కంపెనీ బోర్డులో చేరరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అప్పిలేట్ న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది. అయితే, ఈ మొత్తం వ్యవహారాన్ని కార్పొరేట్ గవర్నెన్స్ వైఫల్యంగా భావిస్తున్న సోనీ.. విలీన సంస్థకు గోయెంకాను సీఈవోగా చేసేందుకు ఇష్టపడటం లేదని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఒప్పందం పూర్తి కావడానికి జనవరి 20 వరకు గడువు ఉండటంతో ఏం జరగనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సీఈఎస్ వేదికపై అట్రాక్ట్ చేస్తున్న 'అఫీలా' కారు - వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. -
జీకి భారీ షాక్.. ‘సోనీ సంచలన నిర్ణయం!’
ప్రముఖ మీడియా దిగ్గజం సోనీ గ్రూప్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. భారత్కు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)తో కుదుర్చుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జపాన్కి చెందిన డైవర్సిఫైడ్ దిగ్గజం సోనీ గ్రూప్.. జీతో పెట్టుకున్న విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందని, అందుకు ఆ సంస్థ ఫౌండర్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, కుమారుడు సీఈఓ పునిత్ గోయెంక్ కారణమని తెలుస్తోంది. 2021లో ఒప్పందం 2021లో ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. సోనీ - జీ విలీనం తర్వాత ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పునిత్ గోయెంకా బాధ్యతలు చేపట్టాలి. ఆయన నియామకాన్ని సోనీ గ్రూప్తో పాటు సోనీ పిక్చర్ నెట్ వర్క్ ఇండియా సీఈఓ ఎన్పీసింగ్తో పాటు ఇతర డైరెక్టర్లు ఆమోదం పొందాల్సి ఉంది. సెబీ మధ్యంతర ఉత్వరులు అయితే ఈ రెండు సంస్థల మధ్య విలీన ప్రక్రియ చివరి దశలో ఉందనగా.. గత ఏడాదిలో జీ మీడియా సంస్థ నుంచి నిధులు మళ్లించారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సెబీ జీ మీడియా యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించింది. జీ వ్యవస్థాకుడు సుభాష్ చంద్ర, సీఈఓ పునీత్ గోయెంకాపై సెబీ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. పునీత్ గోయెంకాకు సెబీ ఆదేశాలు అందులో గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర, ఆయన తనయుడు పునీత్ గోయెంకా ఏ నమోదిత సంస్థలోనూ డైరెక్టర్ లేదా ఇతర ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. దీంతో సుభాష్, గోయెంకాలు సెబీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎస్ఏటీ)ని ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది. దీంతో జీ, సోనీ విలీనం సందిగ్ధం నెలకొంది. పునిత్ నాయకత్వంపై నీలినీడలు తాజాగా పరిణామాలతో జీ సీఈఓ పునిత్ గోయెంకా విలీన సంస్థకు నాయకత్వం వహిస్తారా? లేదా? అనే అంశంపై ప్రతిష్టంభన కారణంగా సోనీ, జీ మీడియాతో పెట్టుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చూస్తోంది.కొత్త కంపెనీకి గోయెంకా నేతృత్వం వహిస్తారని 2021లో సంతకం చేసిన ఒప్పందం కాగా, సెబీ ఉత్వర్వులతో సోనీ ఆయనను సీఈఓ ఉండేందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. విలీనానికి అవసరమైన కొన్ని షరతులు నెరవేరలేదని పేర్కొంటూ, ఒప్పందాన్ని ముగించడానికి జనవరి 20 పొడిగించిన గడువులోపు రద్దు నోటీసును దాఖలు చేయాలని సోనీ యోచిస్తోంది. ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. గడువులోపు ఇంకా స్పష్టత రావొచ్చని సమాచారం. -
అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక గుడ్న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు ఉన్న చిక్కులు అన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా 'ఏజెంట్' చిత్రాన్ని 'సోని లివ్' ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వల్ల సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఏజెంట్ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు కూడా తీసుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ బ్రేక్ పడుతూ వచ్చింది. ఈసారైనా జనవరి 26న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా..? అంటూ సోషల్మీడియాలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తొలగించి.. మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్ను విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారట. -
కౌన్ బనేగా కరోడ్పతి మళ్లీ వచ్చేస్తుంది.. అమితాబ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తున్నారు. భారతీయ టెలివిజన్ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా 'కౌన్ బనేగా కరోడ్పతి'కి పేరుంది. తాజాగా సోనీ టీవీ తన ట్వీటర్ వేదికగా తెలియజేస్తూ.. కౌన్ బనేగా కరోడ్పతి ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి అయ్యాయి. 2000 నుంచి ఈ షో ప్రారంభమైంది. ఆగష్టు 14 నుంచి సీజన్-15 ప్రారంభం కానుంది. ఈ షో కోసం హోస్ట్గా వ్యవహరించేందుకు అమితాబ్ బచ్చన్ రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని షోలను ఆయనే విజయవంతంగా నడిపారు. అందుకు సంబంధించి అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. 2000లో ప్రారంభం అయిన మొదటి సీజన్ అత్యంత ప్రశంసలు పొందింది. షో మొదటి సీజన్లో ప్రైజ్ మనీ రూ.1 కోటి ఉండగా 2005లో వచ్చిన రెండో సీజన్లో ప్రైజ్ మనీ రెండింతలు పెరిగి రూ.2 కోట్లకు చేరింది. అలా మూడో సీజన్ వరకు అలాగే ఉంది. 2010లో సీజన్ 4 ప్రైజ్ మనీని మళ్లీ రూ.1 కోటికి తగ్గించారు. కానీ 2013లో వచ్చిన ఏడో సీజన్ నుంచి ప్రైజ్ మనీని ఒక్కసారిగా రూ.7 కోట్లకు పెంచారు. ఈసారి ఎంత ప్రైజ్ మనీ అనేది తెలియాల్సి ఉంది. అమితాబ్ రెమ్యునరేషన్ షో ప్రారంభ సమయంలో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.25 లక్షలు వసూలు చేశారు. మొదటి సీజన్ హిట్ కాగానే అమితాబ్ తన ఫీజును కోటి రూపాయలకు పెంచేశారు.పలు మీడియా కథనాల ప్రకారం ఆయన 6,7 సీజన్లలో రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు తీసుకున్నారు. కానీ 8వ సీజనలో అది కాస్త రూ.2 కోట్లకు చేరింది. ఎనిమిదవ సీజన్లో రాణి ముఖర్జీ, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే వంటి తారలు కూడా ఆ స్టేజీపైన మెరిశారు. ఆ తర్వాత 9వ సీజన్లో అమితాబ్ బచ్చన్ రూ.2.6 కోట్లు తీసుకున్నారు. ఆ సీజన్లో హాట్ సీట్లో క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి విద్యాబాలన్ అతిథులుగా కనిపించారు. 10వ సీజన్లో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్కు రూ.3 కోట్లు వసూలు చేశారు. ఆ సంవత్సరం ప్రత్యేక పోటీదారులలో ఆయుష్మాన్ ఖురానా, అమీర్ ఖాన్ ఉన్నారు. 11, 12, 13వ సీజన్లలో మెగాస్టార్ అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 3.5 కోట్లు తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 13వ సీజన్కు క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్లతో సహా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. ఈ సీజన్ కోసం రూ. 4 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటారని బాలీవుడ్ మీడియా తెలుపుతుంది. -
తుది దశలో సోనీ–జీ విలీనం
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), కల్వర్ మ్యాక్స్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా) విలీన అంశం తుది దశకు చేరుకుందని జీల్ ఎండీ పునీత్ గోయెంకా తెలిపారు. ప్రమోటర్లమైన తమకు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మధ్య నెలకొన్న వివాదం ఈ డీల్కు అడ్డంకి కాబోదని ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన వివరించారు. ఈ విలీన ఒప్పందానికి షేర్హోల్డర్లతో పాటు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ), స్టాక్ ఎక్సే్చంజీలు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కూడా ఇప్పటికే ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. ప్రమోటరు కుటుంబ స్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమకు మాత్రమే పరిమితమని, కంపెనీకి ఇబ్బంది కలిగించబోవని గోయెంకా వివరించారు. -
లోకల్’కు 120 కోట్ల నిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైపర్లోకల్ కంటెంట్, కమ్యూనిటీ, క్లాసిఫైడ్ వేదిక అయిన లోకల్ తాజాగా రూ.120 కోట్ల సిరీస్-బి ఫండింగ్ అందుకుంది. గ్లోబల్ బ్రెయిన్, సోనీ ఇన్నోవేషన్ ఫండ్, ఇండియా కోషెంట్ తదితర ఇన్వెస్టర్లు ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. లోకల్ సేవలు అందిస్తున్న మార్కెట్లలో వృద్ధికి, కొత్త విభాగాల పరిచయానికి తాజా నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు రూ.225 కోట్లకుపైగా ఫండింగ్ అందుకున్నట్టు లోకల్ ఫౌండర్, సీఈవో జానీ పాషా తెలిపారు. బెంగళూరు కేంద్రంగా 2018లో ప్రారంభమైన లోకల్ యాప్ 7 రాష్ట్రాల్లో 6 భాషల్లో అందుబాటులో ఉంది. డెయిలీ అప్డేట్స్, కమోడిటీ ధరలు, స్థానిక జాబ్స్, రియల్టీ, మ్యాట్రిమోనియల్, స్థానిక యాడ్లు, క్లాసిఫైడ్స్ సమాచారాన్ని అందిస్తోంది. 4 కోట్లకుపైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. (బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) -
పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపడింది!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన నేమ్తో పాటు ఫేమ్ను సంపాదించుకుంది ఐఫోన్. దీని తయారీ వెనుక ఏ విషయాన్ని యాపిల్ కంపెనీ బయటపెట్టేది కాదు. అయితే తాజాగా సంస్థ సీఈఓ ఐఫోన్లకు సంబంధించి ఓ పెద్ద సీక్రెట్ని రివీల్ చేశారు. అదేంటో తెలుసుకుందాం! ఐఫోన్ కెమెరాతో క్లిక్ చేస్తే ఫోటో అద్భుతంగా రావాల్సిందే. ఎందుకంటే దాని క్లారిటీ అలాంటిది మరీ. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ కెమెరాలకు సంబంధించి పెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఐఫోన్ కెమెరాలను సోనీ సంస్థ తయారు చేస్తుందని తెలిపారు. అత్యున్నత కెమెరా సెన్సర్ల కోసం దశాబ్ధకాలంగా సోనీ సంస్థతో తాము చేతులు కలిపామని కుక్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. తమ భాగస్వామ్యం నిరంతం కొనసాగుతుందన్నారు. సంవత్సరాలుగా, ఆపిల్ ఐఫోన్ మోడల్లలో ఉపయోగించే హార్డ్వేర్ గురించి పెదవి విప్పలేదు. అంతేకాకుండా ఏదైనా ఐఫోన్ మోడల్స్లో కూడా అధికారిక స్పెక్స్ షీట్న్ చూసినట్లయితే, కంపెనీ ర్యామ్, కెమెరా రిజల్యూషన్ సహా నిర్దిష్ట వివరాలను ఎప్పుడూ వెల్లడించలేదు. సోనీ ఐఫోన్ల కోసం కెమెరా సెన్సార్లను తయారు చేస్తుందన్న విషయాన్ని టిమ్ కుక్ తొలిసారిగా వెల్లడించడం గమనార్హం. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, సోనీ తన కెమెరా సెన్సార్ పనితనం మరింత పెంచేందుకు కొత్త సెమీకండక్టర్ ఆర్కిటెక్చర్ను ఉపయోగించే కొత్త ఇమేజ్ సెన్సార్ను అభివృద్ధి చేస్తోందట. We’ve been partnering with Sony for over a decade to create the world’s leading camera sensors for iPhone. Thanks to Ken and everyone on the team for showing me around the cutting-edge facility in Kumamoto today. pic.twitter.com/462SEkUbhi — Tim Cook (@tim_cook) December 13, 2022 చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
ఎలక్ట్రిక్ వాహనాల్లోకి సోనీ
టోక్యో: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వినోద రంగంలో ఉన్న జపాన్ సంస్థ సోనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం వాహన తయారీ దిగ్గజం హోండాతో చేతులు కలిపింది. సోనీ హోండా మొబిలిటీ పేరుతో ఏర్పాటైన కంపెనీ 2025 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనుంది. డెలివరీలు 2026 నుంచి మొదలు కానున్నాయి. తొలుత యూఎస్ మార్కెట్లో ఇవి రంగ ప్రవేశం చేయనున్నాయి. ఆ తర్వాత జపాన్, యూరప్లో అడుగుపెడతాయని సోనీ హోండా మొబిలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యసుహిదె మిజూనో వెల్లడించారు. పూర్తిగా కొత్తదనం ఉట్టిపడేలా రూపొందిస్తామన్నారు. యూఎస్లోని హోండా ప్లాంటులో ఈవీలను తయారు చేస్తారు. అయితే ఇది ఒక ప్రత్యేక మోడల్ అని, భారీ విక్రయాల కోసం ఉద్దేశించి తయారు చేయడం లేదని కంపెనీ అధికారులు తెలిపారు. చెరి 50 శాతం వాటాతో సంయుక్త భాగస్వామ్య కంపెనీ స్థాపించాలని 2022 మార్చిలో సోనీ గ్రూప్ కార్పొరేషన్, హోండా అంగీకరించాయి. ఇమేజింగ్, నెట్వర్క్, సెన్సార్, వినోద నైపుణ్యంతో సోనీ.. వాహనాలు, మొబిలిటీ టెక్నాలజీ, అమ్మకాలలో హోండాకు ఉన్న నైపుణ్యాన్ని ఒకచోట చేర్చే ఆలోచనతో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రెండేళ్ల క్రితం లాస్ వెగాస్లో జరిగిన సీఈఎస్ గ్యాడ్జెట్ షోలో సోనీ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది. -
సోనీ–జీ విలీనానికి షరతులతో ఆమోదం
న్యూఢిల్లీ: సోనీ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కాంపిటిషన్ కమిషన్ ఈ విలీనానికి షరతులతో కూడిన ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత విలీనానికి కొన్ని సవరణలతో ఆమోదం తెలియజేసినట్టు సీసీఐ ట్విట్టర్పై వెల్లడించింది. వినోద కార్యక్రమాల ప్రసారాల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న సోనీ, జీ విలీనం.. మార్కెట్లో ఆరోగ్యకర పోటీకి విఘాతమన్న ఆందోళన మొదట సీసీఐ నుంచి వ్యక్తమైంది. ఇదే విషయమై ఇరు సంస్థలకు షోకాజు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో తమ డీల్కు సంబంధించి కొన్ని మార్పులు, పరిష్కారాలను అమలు చేస్తామంటూ ఇరు పార్టీలు సీసీఐ ముందు ప్రతిపాదించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీంతో సీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో ప్రకటించిన మేరకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ విలీనం కానుంది. ఈ విలీనంతో సోనీ భారత మార్కెట్లో మరింత బలపడనుంది. స్టార్ నెట్వర్క్ నుంచి వస్తున్న పోటీని బలంగా ఎదుర్కోవడానికి అనుకూలతలు ఏర్పడనున్నాయి. అందుకే ఈ విలీనం పట్ల సోనీ, జీ రెండూ ఆసక్తిగా ఉన్నాయి. సీసీఐ అభ్యంతరాల నేపథ్యంలో అవసరమైతే కొన్ని చానల్స్ను మూసేయడానికి జీ ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు కూడా వినిపించాయి. -
విక్రమ్ ‘కోబ్రా’ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించించింది. మాజీ క్రికెటర్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రల్లో కనిపించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 31న థియేటర్లో విడుదలైంది. విక్రమ్ విభిన్న పాత్రల్లో అలరించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎప్పటిలాగే విక్రమ్ నటన మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్పై తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ తాజా బజ్ ప్రకారం తమిళం, తెలుగులో సెప్టెంబర్ 23 లేదా 30న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ -
ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో!
దుబాయ్: క్రికెట్కు కామధేనువు భారత మార్కెట్ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్ వేలం ద్వారా బీసీసీఐ జాక్పాట్ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్ డిజిటల్ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది. నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ, అండర్–19 వరల్డ్కప్లు కూడా ఇందులో భాగమే. హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్న్యూస్ -
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
బెస్ట్ గేమింగ్ టీవీ కోసం చూస్తున్నారా, ఇదిగో కళ్లు చెదిరే టీవీల లిస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఫెస్టివ్ సీజన్లో మంచి గేమింగ్ టెలివిజన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. ఇటీవలి కాలంలో మొబైల్స్, టీవీల్లో గేమింగ్ బాగా పాపులర్ అవుతోంది. తమ స్నేహితులతో కలిసి వర్చువల్గా మల్టీప్లేయర్ గేమ్స్తో కొత్త ప్రపంచాలని అన్వేషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మానిటర్ లేదా టీవీ చాలా ముఖ్యం. గేమింగ్ టీవీలు అధిక రిఫ్రెష్ రేట్ 4K డిస్ప్లేలు గేమ్లలో అద్భుతమైన విజువల్స్ను ఫిక్స్డ్ ఫ్రేమ్ రేట్తో అందిస్తాయి. ఈ టీవీలు శక్తివంతమైన ప్రాసెసర్లతో పాటు, VRR, G-Sync, FreeSync కి సపోర్ట్తో కస్టమర్లకు మంచి గేమింగ్ అనుభవాన్నిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నదిగ్గజ కంపెనీలుఎల్జీ, సోనీ, శాంసంగ్ , టీసీఎల్ తదితర ది బెస్ట్ టీవీలను ఒకసారి చూద్దాం ఎల్జీ సీ 2 ఎల్జీ సీ 2 OLED 4K స్మార్ట్ టీవీ C1కి సక్సెసర్ ఇది. α9 Gen5 AI ప్రాసెసర్తో వస్తుంది, 42, 48, 55 ,65,77 , 83 అంగుళాల సైజుల్లో లభ్యం. ఇది పిక్సెల్ డిమ్మింగ్కు మద్దతు ఇస్తుంది . 100 శాతం కలర్ ఫిడెలిటీతో మంచి గేమింగ్ అనుభవాన్నిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో Nvidia G-Sync, AMD ఫ్రీసింక్ , VRRలకు సపోర్ట్ దీని స్పెషాలిటీ. ఇది పీసీగానూ కన్సోల్ గేమింగ్కు పనికొస్తుంది. ఇండియాలో ఈ టీవీ ధర రూ. 1,39,990 నుండి ప్రారంభం. LG అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సోనీ X90J కంపెనీ ఫ్లాగ్షిప్ 4K LED స్మార్ట్ టీవీఇది. సోనీ X90J అనేది బ్యాక్లైటింగ్ లోకల్ డిమ్మింగ్తో గేమింగ్కోసం బెస్ట్ ఆప్షన్ ఇది. ఇమేజ్ క్వాలిటీని పెంపొందించే Bravia XR ప్రాసెసర్తో పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ VRRకి సపోర్టు చేస్తుంది. ఇందులోని ఫార్-ఫీల్డ్ మైక్స్తో మీ వాయిస్ని ఉపయోగించి ఆపరేట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో లభిస్తుంది భారతదేశంలో రూ. 1,18,740 నుండి ప్రారంభం. ఈ టీవీని క్రోమా ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ Q90B QLED TV అద్భుతమైన 4K చిత్రాలను అందించడానికి నియో క్వాంటం ప్రాసెసర్ని కలిగి ఉంది. క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ లైట్ని ఎడ్జస్ట్ చేసుకుని, 4K గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే ఈ టీవీకి VRR మద్దతు లేదు. 50, 55, 65, 75, 85 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,09,990 నుండి ప్రారంభం Samsung అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. TCL C835 4K TV క్వాడ్-కోర్ 4K ప్రాసెసర్, లోకల్ డిమ్మింగ్ , 144Hz వరకు రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ వస్తుంది. మినీ LED ప్యానెల్ అద్భుతమైన కాంట్రాస్ట్, VRR మద్దతును దీని స్పెషల్. TCL C835 TV 55,65 ,75 అంగుళాలలో అందుబాటులో ఉంది. ధర భారతదేశంలో రూ. 1,19,990 నుండి ప్రారంభం. TCL స్టోర్, క్రోమా, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ ది ఫ్రేమ్ 2022 శాంసంగ్ నుంచి మరో సూపర్ గేమింగ్ టీవీ శాంసంగ్ ది ఫ్రేమ్ 2022అద్భుతమైన డిజైన్తో అధునాతన ఫోటో ఫ్రేమ్గా కనిపిస్తుందీ టీవీ.120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో ఫ్రేమ్ 100 శాతం కలర్ వాల్యూమ్ను అందించే క్వాంటం డాట్ టెక్, క్వాంటం ప్రాసెసర్ కలిగి ఉంది. భారతదేశంలో రూ. 53,990 నుండి ప్రారంభం, దీన్ని Samsung స్టోర్, అమెజాన్ , ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు -
IPL: ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, వయాకామ్–18..!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్... షేర్ మార్కెట్... గత రెండు దశాబ్దాల్లో భారత్లో ఏ రంగంలోనైనా ఇంత విలువ ఒక్కసారిగా పెరిగిందా అనేది సందేహమే! ఆరంభంలో మ్యాచ్కు రూ. 13.6 కోట్లు... పదేళ్ల తర్వాత మ్యాచ్కు రూ. 55 కోట్లు... మరో ఐదేళ్ల తర్వాత చూస్తే మ్యాచ్కు రూ.107.5 కోట్లు! క్రికెట్ అభిమానులకు అమిత వినోదాన్ని అందిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు అంతులేని ఆదాయం తెచ్చి పెడుతూ కొత్త రికార్డులు కొల్లగొట్టింది. ఫలితంగా బీసీసీఐ ఆర్జనలో మరో అతి పెద్ద అడుగు పడింది ... ఈ–వేలం ద్వారా లీగ్ ప్రసారహక్కుల కోసం నాలుగు ప్యాకేజీలు ప్రకటిస్తే రెండు ప్యాకేజీలకే ఇప్పటి వరకు బోర్డు ఖాతాలో రూ. 44,075 కోట్లు చేరాయి. మూడో ప్యాకేజీ వేలం ఇంకా కొనసాగుతుండగా, నాలుగో ప్యాకేజీ నుంచి కూడా తుది మొత్తం నేడు ఖరారవుతుంది. అయితే హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారనే దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. టీవీ హక్కుల కోసం సోనీ, డిస్నీ స్టార్ తీవ్రంగా పోటీ పడగా... డిజిటల్ హక్కులు రిలయన్స్ సంస్థకు చెందిన ‘వయాకామ్–18’కు సొంతమైనట్లు వినిపిస్తోంది. ప్యాకేజీ ‘ఎ’: భారత ఉపఖండంలో టీవీ చానల్లో ఐపీఎల్ మ్యాచ్ల ప్రసార హక్కులు (మొత్తం రూ. 23,575 కోట్లు; ఒక్కో మ్యాచ్కు రూ. 57.5 కోట్లు). ప్యాకేజీ ‘బి’: భారత ఉపఖండంలో డిజిటల్ (ఆన్లైన్) ఐపీఎల్ మ్యాచ్ల ప్రసార హక్కులు(మొత్తం రూ. 20,500 కోట్లు; మ్యాచ్కు రూ. 50 కోట్లు). ప్యాకేజీ ‘సి’: ఎంపిక చేసిన మ్యాచ్ల నాన్ ఎక్స్క్లూజివ్ డిజిటల్ హక్కులు. ప్యాకేజీ ‘బి’ గెలుచుకున్న సంస్థతో పాటు మరో డిజిటల్ ప్లాట్ఫామ్పై ప్రసారం చేసుకునే హక్కు (ఇప్పటికి సుమారు రూ. 2000 కోట్లు లభించాయి. వేలం నేడు కూడా కొనసాగుతుంది. ఒక్కో మ్యాచ్కు రూ. 18.4 కోట్లు చెల్లించే అవకాశం). ప్యాకేజీ ‘డి’: ఉపఖండం మినహా ఇతర దేశాల టీవీ, డిజిటల్ హక్కులు (వేలం జరగాల్సి ఉంది) ఐదేళ్లలో జరిగే మొత్తం ఐపీఎల్ మ్యాచ్లు 410 నాన్ ఎక్స్క్లూజివ్ మ్యాచ్ల సంఖ్య (ప్యాకేజీ ‘సి’): 18+20+24 (నాన్ ఎక్స్క్లూజివ్ మ్యాచ్లు అంటే... ఆదివారాల సాయంత్రపు మ్యాచ్లు+ లీగ్ ప్రారంభ మ్యాచ్+ప్లే ఆఫ్లు +ఫైనల్). చదవండి: Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో! -
IPL-BCCI: సుమారు రూ. 50 వేల కోట్లు! జూన్ 12 నుంచి..
IPL Media Rights- ముంబై: ఐపీఎల్ మీడియా హక్కుల కోసం బీసీసీఐ టెండరు ప్రకటన జారీ చేసింది. 2023–2027 మధ్య ఐదేళ్ల కాలానికి బోర్డు హక్కులు అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఐపీఎల్ స్థాయి, విలువ ఎన్నో రెట్లు పెరగడంతో హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. రెండు అదనపు జట్ల రాకతో మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగింది. దాంతో మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ సుమారు రూ. 50 వేల కోట్లను ఆశిస్తోంది. జీ–సోనీ, రిలయన్స్ సంస్థలు ఎంత మొత్తం చెల్లించైనా హక్కులు సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత జూన్ 12 నుంచి బీసీసీఐ ఈ–వేలం ప్రక్రియ నిర్వహించి ఎవరికి హక్కులు దక్కాయో ప్రకటిస్తుంది. చదవండి: Nicholas Pooran: కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్ అయితే ఎలా? -
ఐఫోన్కు పోటీగా సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ఫోన్..! అది కూడా బడ్జెట్ రేంజ్లో
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రీమియం స్మార్ట్ఫోన్లలో బడ్టెట్ రేంజ్లో ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్కు చెక్ పెట్టే పనిలో ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం సోనీ నిమ్నగ్నమైంది. న్యూ ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్కు పోటీగా Sony Xperia Ace III స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సోనీ సన్నాహాలను చేస్తోంది. తాజాగా Sony Xperia Ace III సంబంధించిన ఫీచర్స్ ఆన్లైన్లో వైరల్గా మారాయి. సోనీ ఎక్స్పీరియా ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్లను 2019లో సోనీ లాంచ్ చేసింది. ప్రముఖ టిప్స్టర్ హెమ్మెర్స్టోఫర్ , జోల్లేజ్ షేర్ చేసిన రెండర్స్ ప్రకారం...సోనీ ఎక్స్పీరియా ఎస్ III వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్తో 5.5 అంగుళాల డిస్ప్లేతో రానుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను కల్గి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ లేత ఆకుపచ్చ,బ్లాక్ కలర్ వేరియంట్లలో లభించనుంది. సోనీ ఎక్స్పీరియా ఎస్ III స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 888 ఎస్ఓసీ చిప్తో రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ఫోన్లో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను పొందనుంది. యూఎస్బీ టైప్సీ ఛార్జింగ్ సపోర్ట్, 4500 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానున్నట్లు టిప్స్టర్స్ తమ రెండర్స్లో పేర్కొన్నారు. ఇక ధర విషయానికి వస్తే..కొత్తగా లాంచైన ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ. 33 వేలుగా ఉండగా..దీని కంటే తక్కువ ధరలో సోనీ ఎక్స్పీరియా ఎస్ III వచ్చే అవకాశం ఉందని టిప్స్టర్స్ అభిప్రాయపడ్డారు. చదవండి: అనూహ్య నిర్ణయం! అక్కడ ఏటీఎంలు అన్నీ బంద్..! కారణం ఇదే..! -
ఓటీటీలో స్కైలాబ్, రిలీజ్ ఎప్పుడంటే?
Skylab Movie Confirms OTT Release Date: సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్కైలాబ్. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డా. రవికిరణ్ సమర్పణలో బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు, నిత్యామీనన్ నిర్మించారు. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందన్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయాలకు కొంత కామెడీ జోడించి సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ బాట పట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సోనీ లైవ్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! Whatever the problem is Dr.Anand has a perfect solution for you. Get ready to meet him on his clinic in Skylab, streaming on Jan 14 only on SonyLIV.#SkylabOnSonyLIV #ThetaleofBandalingampalli@MenenNithya @ActorSatyaDev @eyrahul @VishvakKhander1 @prashanthvihari @javvadiAditya pic.twitter.com/oS1bXvGNJS — SonyLIV (@SonyLIV) January 11, 2022 -
ఇయర్ ఎండ్ సేల్: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..!
ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీదారు సోనీ ఇయర్ ఎండ్ సేల్ను గురువారం (డిసెంబర్ 16) నుంచి ప్రారంభించింది. ఈ సేల్లో భాగంగా పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, టీవీలపై భారీ ఆఫర్లను సోనీ ప్రకటించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్ 2022 జనవరి 3 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ఆఫ్లైన్, పలు ఎలక్ట్రానిక్ స్టోర్స్, సోనీ ఆన్లైన్ స్టోర్స్తో పాటుగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సోనీ ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా పలు బ్రావియా టీవీలపై 30 శాతం మేర తగ్గింపు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను , రెండేళ్ల వారంటీని కొనుగోలుదారులకు సోనీ అందిస్తోంది. వీటితో పాటుగా వైర్లెస్ ఇయర్బడ్స్, హెడ్ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్పై 60 శాతం మేర తగ్గింపును ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్లో భాగంగా సోనీ అందిస్తోన్న పలు ఆఫర్లు..! ►Sony Bravia XR-65A8OJ టీవీ కొనుగోలుదారులకు రూ. 2,65,990 కే రానుంది. దీని రిటైల్ ధర రూ. 3,39,900. Sony Bravia KD-55X8OJ మోడల్ టీవీ ధర రూ. 87,390కు రానుంది. దీని అసలు ధర రూ. 1,09,900 గా ఉంది. ►సోనీ WH-1000XM4 హెడ్ఫోన్స్ను కొనుగోలుదారులు రూ. 24,990 కే సొంతం చేసుకోవచ్చును. దీని అసలు ధర రూ. 29,990. సోనీ WH-H910N హెడ్ఫోన్స్పై ఏకంగా 60 శాతం తగ్గింపుతో రూ. 9,990కు రానుంది. దీని అసలు ధర రూ. 24,990 ►సోనీ WH-CH710N హెడ్ఫోన్స్ ధర రూ. 7,990కు, సోనీ WH-XB900N ధర రూ. 9,990 కే కొనుగోలుదారులకు లభ్యమవుతోంది. ►సోనీ వైర్లెస్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్పై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది, సోనీ WF-1000XM3 టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ రూ. 9,990 ధరకు, సోనీ WF-SP800N TWS ఇయర్బడ్స్ ధర రూ. 10,990కు, సోనీ WF-XB700 ధర రూ. 6,990 కు రానున్నాయి. ►సోనీ SRS-XB13 వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్పై రూ. 3,590 కు రానుంది. కంపెనీ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ఫోన్లపై కూడా తగ్గింపులను అందిస్తోంది, సోనీ WH-CH510 , WI-XB400 మోడల్స్ వరుసగా రూ. 2,990, రూ. 2,790 కే రానుంది. చదవండి: ఏసర్ ల్యాప్ట్యాప్స్పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..! -
ఇక ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్
నవంబర్ 1 నుంచి కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో పాటు ఐఓఎస్ ఫోన్లలో ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్ ఫారం వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 వినియోగిస్తున్నట్లైతే యూజర్లు వెంటనే అప్డేట్ చేసుకోవాలని వాట్సాప్ తెలిపింది. అప్డేట్ చేయని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని స్పష్టం చేసింది. నవంబర్ 1,2021 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.3 ఉంటే వాట్సాప్ పనిచేయదని చెప్పింది. ఇక యాపిల్ విషయానికి వస్తే ఐఓఎస్ 9 కంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ గల స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న జాబితా: ఆపిల్: iPhone 6, iPhone 6s plus, iPhone SE ఎల్ జి: Lucid 2, Optimus F7, Optimus F5, Optimus L3 II, Dual Optimus L5, Best L5 II, Optimus L5, Dual Best L3 II, Optimus L7, Optimus L7, Dual Best L7 II, Optimus F6, Enact Optimus F3, Best L4 II, Best L2 II, Optimus Nitro HD, Optimus 4X HD and Optimus F3Q. హువావే: Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, and Ascend D2. శామ్ సంగ్: Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core and Galaxy Ace 2. జడ్ టీఈ: Grand S Flex, ZTE V956, Grand X Quad V987 and Grand Memo. సోనీ: Xperia Miro, Xperia Neo L, and Xperia Arc S. Alcatel, Archos 53 Platinum, HTC Desire 500, Caterpillar Cat B15, Wiko Cink Five, and Wiko Darknight, Lenovo A820 UMi X2, Run F1, THL W8 వంటి బ్రాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి -
ఈ ఫోన్తో సినిమాటోగ్రఫీ రేంజ్లో వీడియో తీయొచ్చు..!
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ కంపెనీ సోనీ సరికొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. సోనీ ఎక్స్పీరియా సిరీస్లో భాగంగా సోనీ ఎక్స్పీరియా ప్రో-1 స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్తో సినిమాటోగ్రఫీ మోడ్లో వీడియోలను షూట్ చేయవచ్చును.ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్తో 1-అంగుళాల ఎక్స్మోర్ ఆర్ఎస్ సీఎమ్ఒఎస్ సెన్సార్ను సోనీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్కు కుడి వైపున షట్టర్ బటన్ను కూడా అమర్చారు. ఈ స్మార్ట్ఫోన్ కెమెరాలో జీస్ టెస్సార్ కాలిబ్రేటెడ్ ఆప్టిక్స్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్కు అదనంగా వ్లాగ్ మానిటర్ను కూడా లాంచ్ చేసింది. సోనీ ఎక్స్పీరియా ప్రో-1 12జీబీ ర్యామ్తో రానుంది. 30వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ. 1.35 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వ్లాగ్ మానిటర్ ధర రూ. 15 వేలు. డిసెంబర్ నుంచి నుంచి సోనీ రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. సోనీ ఎక్స్పీరియా ఫీచర్స్..! ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ 6.50 అంగుళాల 4కే హెచ్డీఆర్ ఒఎల్ఈడీ డిస్ప్లే క్వాలకమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ 12ఎమ్పీ+12 ఎమ్పీ+12 ఎమ్పీ ట్రిపుల్ రియర్ కెమెరా 8ఎమ్పీ ఫ్రంట్ కెమెరా 12జీబీ+512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ 5జీ, 4జీ సపోర్ట్ యూఎస్బీటైప్-సీ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ 4,500ఎమ్ఎహెచ్ బ్యాటరీ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: యాపిల్కు భారీ షాకిచ్చిన విద్యార్థులు..! -
జీ వాటాదారులు ఏకంకావాలి
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జీ ఎంటర్టైన్మెంట్(జీల్) యాజమాన్య మార్పిడికి డిమాండ్ చేస్తున్న ఇన్వెస్కో తాజాగా కంపెనీ వాటాదారులకు లేఖ రాసింది. సోనీ గ్రూప్తో జీల్ కుదుర్చుకున్న ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రమోటరేతర వాటాదారులంతా ఏకంకావాలంటూ అభ్యరి్థంచింది. ఈ డీల్ ద్వారా వాటాదారులను నష్టపరుస్తూ సుభాష్ చంద్ర కుటుంబం లబ్ది పొందే వీలున్నట్లు లేఖలో ఆరోపించింది. జీల్లో 7.74 శాతం వాటా ను కలిగిన ఇన్వెస్కో ఓపెన్ లెటర్ ద్వారా మరోసారి జీల్ బోర్డును పునర్వ్యవస్థీకరించాలం టూ డిమాండ్ చేసింది. ఇందుకు వీలుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాలని పేర్కొంది. జీల్ సీఈవో పునీత్ గోయెంకాసహా ఇద్దరు ఇతర డైరెక్టర్లను తొలగించమంటూ ఇన్వెస్కో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. డీల్ ఇలా..: గత నెలలో సోనీ గ్రూప్నకు చెందిన దేశీ విభాగం జీ కొనుగోలుకి తప్పనిసరికాని ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా రెండు సంస్థల విలీనాన్ని చేపట్టనుంది. తద్వారా విలీన సంస్థలో సోనీ ఇండియా వాటాదారులకు 53 శాతం వాటా లభించనుండగా.. మిగిలిన భాగం జీ వాటాదారులకు చెందనుంది. డీల్ ప్రకారం పోటీపడకుండా ఉండే క్లాజుతో చంద్ర కుటుంబానికి 2 శాతం అదనపు వాటాను బహుమతిగా ఇవ్వడాన్ని ఇన్వెస్కో లేఖ ద్వారా తప్పుపట్టింది. అంతేకాకుండా వీరి వాటాను 4 శాతం నుంచి 20 శాతానికి పెరిగేందుకు వీలు కలి్పంచడాన్ని అక్రమ చర్యగా పేర్కొంది. జీల్లో ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్ఎల్సీతో కలసి ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. కంపెనీ టేకోవర్కు ఆసక్తి ఉంటే 75 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను ప్రకటించమంటూ గత వారం సుభాష్ చంద్ర సవాల్ విసిరిన నేపథ్యంలో ఇన్వెస్కో తాజా లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇన్వెస్కో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు సుభాష్ చంద్ర పేర్కొన్నారు. -
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, ఇది ఎలా పనిచేస్తుందంటే
అందానికే అందం చిరునవ్వు. అది ఎల్లప్పుడూ అహ్లాదంగా ఉండాలంటే.. పెదవుల మధ్య తళతళలాడే పలువరుస ఉండాల్సిందే. గార, పిప్పి, పుచ్చు లాంటి పలు సమస్యలతో పాటు నోటి దుర్వాసన కూడా ఆ అందాన్ని కమ్మేస్తుందని బాధపడుతున్నారా? పరిష్కారం కోసం పేస్ట్లు, బ్రష్లు ఎన్ని మార్చినా.. ఫలితం కనిపించడం లేదని నిట్టూరుస్తున్నారా? అయితే చిత్రంలోని సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడాల్సిందే. ప్రత్యేకమైన ఇంటర్ డెంటల్ హెడ్ కలిగిన ఈ డివైజ్.. సుపీరియర్ సోనిక్ టెక్నాలజీతో పళ్లు, దంతాలను చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. నిమిషానికి 40 వేల స్ట్రోక్లను ఉత్పత్తి చేస్తూ.. సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. ఈ మెషిన్తో పాటు ఐదు స్పెషల్ నైలాన్ డ్యుపోంట్ హెడ్స్ లభిస్తాయి. అవి దంతాల ఆకృతికి సరిపోయే విధంగా రూపొందించడంతో.. క్లీనింగ్ చాలా సులభమవుతుంది. వైటెనింగ్, క్లీనింగ్, సెన్సిటివ్, పాలిషింగ్, మసాజ్ అనే ఆప్షన్స్తో ఫైవ్ క్లీనింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. రోజుకు రెండు సార్లు దీన్ని ఉపయోగించడానికి కేవలం రెండు నిమిషాల సమయం చాలు. నాలుగు గంటల పాటు దీనికి చార్జింగ్ పెడితే.. సుమారు 25 రోజుల పాటు పని చేస్తుంది. ఆన్ చేసిన ప్రతి 30 సెకండ్లకు క్లీన్ చెయ్యాల్సిన ప్రదేశాన్ని మార్చమని అలర్ట్ చేస్తుంది. పైగా 2 నిమిషాల తర్వాత ఆపినా ఆపకపోయినా ఆటోమెటిక్గా ఆఫ్ అవుతుంది. చివరిగా ఉపయోగించిన మోడ్ని గుర్తు చేస్తూ.. తిరిగి ఆన్ చేసినప్పుడు అదే మోడ్లో పని చేస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ టూల్ కావడంతో.. వినియోగించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. దీని ధర రూ. 15 వందలు. -
సోనీ టీవీ ఓటీటీ ప్లాట్ ఫాం ‘హెడ్’గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత
హైదరాబాద్: ఎంటర్టైన్మెంట్ రంగ దిగ్గజం సోనికి చెందిన ఓటీటీ విభాగం సోని లివ్ తెలుగు కంటెంట్, డిజిటల్ విభాగం హెడ్గా ప్రముఖ టాలీవుడ్ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ నియమితులయ్యారు. సోనిలివ్ తెలుగు విభాగం విస్తరణ ప్రణాళికల అమలుపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. దక్షిణాది మార్కెట్లో తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఆయన అనుభవం తోడ్పడగలదని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర టెక్ దిగ్గజాల్లో దాదాపు 11 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్.. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టారు. మధుర ఆడియో సంస్థను నెలకొల్పారు. పలు తెలుగు చిత్రాలకు దర్శక, నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియషన్, తెలుగు నిర్మాతల మండలి మొదలైన వాటిలో ఆయన సభ్యులుగా ఉన్నారు. చదవండి : కండీషన్స్ అప్లై, నెట్ ఫ్లిక్స్ లో సినిమాల్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు -
నది ఇచ్చిన కూతురు
లోకంలో ఎన్నో పెళ్లిళ్లు జరుగుతాయి. కాని మొన్న ఒడిసాలో జరిగిన పెళ్లి ఒక నది పట్టుబట్టి చేయించినట్టుగా ఉంది. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయి మహానదిలో మునిగిపోబోతే ఆ నది పరుపులా మారి 50 కిలోమీటర్ల దూరంలో ఒక బెస్తవాడికి ఆ అమ్మాయిని చేర్చింది. బెస్తవాడు పేదవాడు– హృదయానికి కాదు. పెంచుకున్నాడు. ఊళ్లో అందరూ ఆ అమ్మాయిని ‘మహానది అమ్మాయి’ అని దగ్గరకు తీశారు. ఐదేళ్లు గడిచాయి. ఊరంతా డబ్బు పోగేసింది. ఎం.ఎల్.ఏ కన్యాదాతగా కూచున్నాడు. ఓహ్... ఆ పెళ్లి ఎంత హృదయపూర్వకమైనది. ఒడిస్సా, చత్తిస్గఢ్లలో పారే మహానది పొడవు దాదాపు 900 కిలోమీటర్లు ఉంటుందిగాని సోని యాదవ్ విషయంలో ఆ నది 50 కిలోమీటర్లు చాల్లే అని అనుకున్నట్టు ఉంది. నదిలో కాళ్లు కడుక్కుంటూ పొరపాటున జారి మునిగిపోబోయిన ఆ అమ్మాయిని చత్తిస్గఢ్లోని రాయఘర్ నుంచి ఒడిసాలోని ఝర్సుగ్దా వరకూ చేర్చింది. అంత దూరం సోని యాదవ్ను ప్రాణాలతోనే ఉంచింది. చిత్రమే ఇది. 2016 సెప్టెంబర్లో మహానదిలో కొట్టుకొని వచ్చిన అనంతరం ఒరిస్సాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోని యాదవ్ 2016 సెప్టెంబర్ 14న చత్తిస్గఢ్లోని మహానది ఒడ్డున ఉండే చంద్రహాసిని దేవి ఆలయానికి 18 ఏళ్ల సోని యాదవ్ తన బంధువులతో వచ్చింది. అప్పటికే ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు. బంధువులే పెంచుతున్నారు. పూజ అయ్యాక నదిలో కాళ్లు కడుక్కుందామని దిగిన సోని పొరపాటున నదిలో పడిపోయింది. ప్రవాహ ఉధృతికి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అయితే చేయాల్సింది అంతా మహానదే చేసింది. పెంపుడు తల్లిదండ్రులతో సోని యాదవ్ సాయంత్రం నదిలో పడితే 12 గంటల పాటు చక్కగా సోనిని తేల్చుకుంటూ రాష్ట్రం దాటి పొరుగునే ఉండే ఒడిసాలోని ఝర్సుగ్దా జిల్లాలోకి తెల్లవారుజాముకు తీసుకెళ్లింది. ఆ జిల్లాలోని ‘కుశ్మేల్’ అనే గ్రామానికి చెందిన బెస్తవాడు సన్యాసి కాలో ఆ సమయంలో పడవతో మహానదిలో చేపలు పడుతున్నాడు. దూరంగా తేలుకుంటూ వస్తున్న మానవ ఆకారం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే పడవను చేర్చి సోని యాదవ్ను పడవలోకి లాగాడు. హడావిడిగా హాస్పిటల్కు తీసుకెళ్లాడు. సోని బతికింది. ‘నీళ్లల్లో పడ్డాక తల నీటిపైకి పెట్టి కాళ్లు ఆడించడమే నేను చేయగలిగాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు’ అని సోని అంది. 2021 ఏప్రిల్ 21న సోని వివాహం ఆ అమ్మాయి కోలుకున్నాక సన్యాసి కాలో ఆమె వివరాలు కనుక్కొని ఇంటికి దింపుతానని అన్నాడు. కాని సోని నిరాకరించింది. తనకు ఎవరూ లేరని, ఇక్కడే ఉండిపోతానని అంది. సన్యాసి కాలో ఆ అమ్మాయిని పెంపుడు కూతురు చేసుకున్నాడు. ఊళ్లో ఈ సంగతిని అందరూ ఆహ్వానించారు. అంతే కాదు ‘మహానది అమ్మాయి’ అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. గత ఐదేళ్లుగా ఆ చత్తిస్గఢ్ అమ్మాయి ఒడిస్సాలోని ఆ ఊరినే తన ఊరు చేసుకుంది. టైలరింగ్ నేర్చుకుంది. అందరి బట్టలూ కుట్టసాగింది. పెళ్లీడు వచ్చిన సోనికి తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామనుకున్నాడు కాలో. కాని అతనికి ఉన్నదే అంతంతమాత్రం. ఊళ్లో అందరూ బెస్తవారే. వారి దగ్గర కూడా ఏముంటుంది కనుక. కాని అందరూ సంతోషంగా నడము బిగించి ఉన్నంత లో తలో చేయి వేసి అబ్బాయిని వెతికారు. కుర్రాడు పురుషోత్తం యాదవ్ భవన నిర్మాణ కార్మికుడు. స్థానిక ఎం.ఎల్.ఏకు ఈ విషయం తెలిసి తాను కన్యాదాతగా కూచుంటానని ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 21న కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సోని వివాహం జరిగింది. సోని అసలు బంధువులు, మారుతండ్రి బంధువులు ఈ పెళ్లికి హాజరయ్యారు. అంపకాలు పెట్టే సమయంలో కాలో, అతని భార్య సోనిని సాగనంపుతూ కన్నీరు కార్చారు. మహానది ఏమీ ఎరగనట్టుగా పారుతూ ఒడ్డును ఒరుసుకొని కొంత నురగను అక్షింతలుగా చల్లే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
రూ 1.8లక్షలు ఖరీదైన సోనీ మొబైల్ విడుదల
సోనీ కంపెనీ చివరకు ఫ్లాగ్షిప్గా పిలవబడే ఎక్స్పీరియా ప్రో విడుదల చేసింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల కోసం ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రీ-వ్యూ కోసం ఫోన్లో డబుల్ మానిటర్ ఇందులో ప్రవేశపెట్టారు. దింతో పాటు ఫోన్కి మైక్రో హెచ్డిఎంఐ కనెక్టర్ అందించారు. దీని సహాయంతో సోనీ ఎక్స్పీరియా ప్రో యూజర్లు తమ ఫుటేజీని కెమెరా నుంచి ఎఫ్టిపికి బదిలీ చేసుకోవచ్చు. అలాగే కెమెరాను ఫోన్కు కనెక్ట్ చేసి4కె ఓఎల్ఈడి డిస్ప్లే మానిటర్ తరహాలో లైవ్ ఫీడ్ను చూడవచ్చు. సోనీ ఎక్స్పీరియా ప్రో 5జీ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది.(చదవండి: వాట్సాప్ పేకు గట్టి ఎదురుదెబ్బ) సోనీ ఎక్స్పీరియా ప్రో ఫీచర్స్: ఇందులో 6.5 అంగుళాల 4కే హెచ్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. సోనీ ఎక్స్పీరియా ప్రో ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6రక్షణతో వస్తుంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ను ఇందులో అందించారు. దీన్ని మైక్రోఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం సోనీ ఎక్స్పీరియా ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపీ ఎఫ్/ 1.7లెన్స్తో ఎక్స్మోర్ ఆర్ఎస్ను కలిగి ఉంది. మిగిలిన రెండు కెమెరాలు 124-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూ (ఎఫ్ఓవి)తో ఎఫ్ / 2.2 లెన్స్, ఎఫ్/2.4 లెన్స్తో 12 మెగాపిక్సెల్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్ల కోసం సోనీ ఎక్స్పీరియా ప్రో ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్తో 8 మెగాపిక్సెల్ కెమెరా కలిగిఉంది.(చదవండి: రిలయన్స్ జియోకు ఎయిర్టెల్ షాక్) సోనీ ఎక్స్పీరియా ప్రోలో కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5జీ, 4జీ ఎల్టిఇ, వై-ఫై6, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, మైక్రో-హెచ్డిఎంఐ, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీతో వస్తుంది. ఇది ఎక్స్పీరియా అడాప్టివ్ ఛార్జింగ్, యుఎస్బి పవర్ డెలివరీ(పిడి)ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంది. ఇది 225 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. సోనీ ఎక్స్పీరియా ధర: ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్తో ఉన్న ఈ వేరియంట్ ధరను $2,499(సుమారు రూ.1,82,500)గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్, బీఅండ్హెచ్ ఫొటో వీడియో, సోనీ ఆన్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. -
గేమింగ్ యూజర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: గేమింగ్ లవర్స్ ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నా ప్లే స్టేషన్ 5(పీఎస్ 5) విడుదల తేదీని చివరకు సోనీ ఇండియా వెల్లడించింది. ఇండియాలో ప్లే స్టేషన్ 5ను ఫీబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సోనీ సంస్థ. జనవరి 12 నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, గేమ్స్ ది షాప్, సోనీ సెంటర్ వాటి ఇతర స్టోర్లలో ప్రీ-ఆర్డర్లు కోసం అందుబాటులో ఉంటుంది అని తెలిపింది. గత మూడు నెలలుగా లాంచ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ప్లే స్టేషన్ 5 3.5గిగా హెర్ట్జ్(వేరియబుల్ ఫ్రీక్వెన్సీ) జెన్ 2 కోర్లతో ఆక్టా-కోర్ సీపీయూతో వస్తుంది. 10.28 కన్సోల్ 16జీబీ జీడిడీఆర్6 ర్యామ్తో వస్తుంది. ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ 825జీబీ వరకు ఉంటుంది. రెగ్యులర్ ఎడిషన్ 4కే యుహెచ్డి బ్లూ-రే డ్రైవ్తో వస్తుంది. కన్సోల్ యొక్క డిస్క్ వెర్షన్ ధర రూ.49,990, డిజిటల్ ఎడిషన్ ధర రూ.39,990గా నిర్ణయించారు.(చదవండి: షియోమీ న్యూ ఇయర్ 5జీ ఫోన్ ఇదే..!) -
మంచీ చెడు
రచయిత, నటుడు, దర్శక–నిర్మాత పా. విజయ్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరుద్ర’. మరో ప్రముఖ నటుడు కె. భాగ్యరాజా కీలక పాత్ర పోషించారు. మేఘాలీ, దక్షిత, సోని, సంజన సింగ్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రాన్ని జె.ఎల్.కె. ఎంటర్ప్రైజెస్ అధినేత కె.వాసుదేవరావు అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. క్లీ¯Œ యు సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. కె.వాసుదేవరావు మాట్లాడుతూ– ‘‘సామాజిక ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. తల్లిదండ్రులు, పిల్లలకు మంచి సందేశం ఇచ్చారు. ఆడ పిల్లలపై జరుగుతున్న అమానుష చర్యలకు ప్రతీకార దిశగా ఈ చిత్రం ఉంటుంది. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా చక్కగా చూపించారు. తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో తెలుగులోకి అనువదిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వరకాంతం సునీల్ రెడ్డి. -
మళ్లీ సోనీ ‘వాక్మాన్’!
న్యూఢిల్లీ: అప్పట్లో పాటల ప్రియులను అలరించి, డిజిటల్ ధాటికి కనుమరుగైన వాక్మాన్లను (పోర్టబుల్ పర్సనల్ క్యాసెట్ ప్లేయర్లు) సోనీ మళ్లీ కొత్త రూపులో ఆవిష్కరించింది. ఈసారి టచ్స్క్రీన్ సదుపాయంతో ఆండ్రాయిడ్ వాక్మాన్ ఎన్డబ్ల్యూ–ఎ105 మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 23,990. ఇందులో 16 జీబీ బిల్టిన్ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా ఎక్స్పాండబుల్ మెమరీ ఉంటుందని సంస్థ తెలిపింది. 3.6 అంగుళాల టచ్స్క్రీన్, ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్, 26 గంటల పాటు పనిచేసే బ్యాటరీ, వై–ఫై ద్వారా పాటలు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం, వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు టైప్–సీ పోర్టు, అత్యుత్తమమైన ఆడియో నాణ్యత ఇందులో ప్రత్యేకతలని వివరించింది. జనవరి 24 నుంచి ఈ వాక్మాన్లు అందుబాటులోకి వస్తాయి. -
రవిశేఖర్కు 2001 నుంచి నేరచరిత్ర ఉంది
-
సోనీ ఆండ్రాయిడ్ టీవీ...ధర వింటే
సోనీ సంస్థ అద్భుతమైన మరో ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఎక్స్9500జీ సిరీస్లో మరో బిగ్ టీవీని తీసుకొచ్చింది. 75 అంగుళాల స్క్రీన్తో సోనీ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ టీవీని ‘‘కేడీ75 ఎక్స్9500జీ’’ పేరుతో భారత మార్కెట్లో అవిష్కరించింది. దీని ధరను రూ. 4,49,990 గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సోనీ సెంటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ స్టోర్ల ద్వారా ఈ సూపర్ టీవీలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మామూలు ఎల్ఈడీ టీవీల కంటే ఆరు రెట్లు ఎక్కువ క్వాలిటీ పిక్చర్ అందిస్తుందని కంపెనీ చెప్పింది. ఆండ్రాయిడ్ 8.0 సపోర్టుతో లభిస్తున్న 75 అంగుళాల స్ర్కీన్, బెజెల్ లెస్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణ. ఇంకా 3840x2160 పీక్సెల్స్ రిజల్యూషన్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, ఎక్స్1 అల్టిమేట్ పిక్చర్ ప్రాసెసర్, ఫుల్ అర్రే లోకల్ డిమ్మింగ్ బ్యాక్లైట్, అల్ట్రా వైడ్ వ్యూయింగ్ యాంగిల్, నెట్ఫ్లిక్స్ కాలిబ్రేటెడ్ మోడ్, 16 జీబీ స్టోరేజ్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
టచ్ చేసే చిత్రం
ప్రస్తుతం మహిళలకు ఇంటా, బయటా రక్షణ లేకుండా పోయింది. ఎక్కువశాతం మంది శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని తమిళంలో రూపొందిన చిత్రం ‘ఆరుద్ర’. పా.విజయ్, కె.భాగ్యరాజ కీలక పాత్రల్లో, మేఘాలీ, దక్షిత, సోనీ, సంజన సింగ్ హీరోయిన్లుగా నటించారు. పా. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘ఆరుద్ర’ పేరుతో వరకాంతం సునీల్ రెడ్డి సమర్పణలో జె.ఎల్.కె. ఎంటర్ప్రైజెస్ తెలుగులోకి అనువదిస్తోంది. ‘‘ఈ సినిమాలో పిల్లలకు, పేరెంట్స్కు మంచి సందేశం ఇచ్చారు. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా బాగా చూపించారు. ప్రస్తుతం వెన్నెలకంటిగారి పర్యవేక్షణలో అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు సునీల్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్. -
వాటికి షాకే.. భారీ కెమెరాతో సోనీ స్మార్ట్ఫోన్
ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన నూతన స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనుంది. బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో ఫిబ్రవరి 25న దీన్ని లాంచ్ చేయనుందట. తాజా నివేదికల ప్రకారం 52 మెగాపిక్సెల్ మెగా కెమెరాతో ఎక్స్పీరియా ఎక్స్జడ్4 పేరుతో ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభించనుంది. దీంతో పాటు వెనుక భాగంలో మరో రెండు కెమెరాలను అంటే మొత్తం మూడు కెమెరాలను అమర్చినట్లు సమాచారం. 52+16 ఎంపీ టెలిఫోటో లెన్స్ + 0.3 ఎంపీ కెపాసిటీ ఉన్న 3డీ కెమెరాలను పొందపర్చడం విశేషం. అయితే ప్రస్తుతం హానర్ వ్యూ20, రెడ్మీ నోట్ 7 ఫోన్లలోమాత్రమే అతి పెద్ద రియర్ కెమెరా(48ఎంపీ)తో స్మార్ట్ఫోన్లు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీలకు పోటీగా సోనీ తన ఎక్స్పీరియా ఎక్స్జడ్4 ఫోన్ను తీసుకు రానుంది. ఈ స్మార్ట్ ఫోన ఆవిష్కారమైతే సోనీ ఈ విషయంలో టాప్లోకి దూసుకు రావడం ఖాయం. అటు ఈ ఫోన్కు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్ల ఇంకా స్పష్టత లేదు. అయితే మాత్రం అంచనాలు ఇలా ఉన్నాయి ఎక్స్పీరియా ఎక్స్జడ్ 4 ఫీచర్లు 6.5 అంగుళాల ఓల్ఈడీ డిస్ప్లే విత్ 21.9 యాస్పెక్ట్ రేషియో 1440×3360 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9పై 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీ -
మీడియా షాక్ : కుప్పకూలిన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: లాభాలతో ఉత్సాహంగా కొనసాగుతున్న స్టాక్మార్కెట్లు అకస్మాత్తుగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా మీడియా షేర్లలో అమ్మకాల వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. డబుల్ సెంచరీ లాభాలతో మొదలైన మార్కెట్లు తిరిగి 200 పాయింట్లు కోల్పోయాయి. మొత్తంగా దలాల్ స్ట్రీట్ 400 పాయింట్లు కుప్పకూలింది. మీడియా ఏకంగా 13శాతం కుప్పకూలింది. ఇందులో ప్రధానంగా ఎస్సెల్ గ్రూప్ కౌంటర్లలో భారీగా అమ్మకాలు ఊపందుకోవడం మార్కెట్లను దెబ్బతీసింది. పెద్ద నోట్ల రద్దు కాలంలో జీ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యం భారీగా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు వాటా కొనుగోలుకు సంబంధించి సోనీ, జీ ప్రమోటర్ అయిన ఎస్సెల్ గ్రూపుతో చర్చలు జరుపుతోందని వార్తలు తాజాగా వెలువడ్డాయి. దీంతో అమ్మకాలు జోరందుకున్నాయి. మీడియా కౌంటర్లలో జీ ఎంటర్టైన్మెంట్ 25 శాతం కుప్పకూలింది. దీంతో ఆల్టైం కనిష్టాన్ని తాకింది. డిష్ టీవీ 19 శాతం పతనమైంది. ఇంకా జీ మీడియా, సన్ టీవీ, ఈరోస్, టీవీ 18, జాగరణ్, పీవీఆర్, డీబీ కార్ప్ 6-2 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు ఈ వార్తలపై స్పందించేందుకు సోనీ ప్రతినిధి నిరాకరించారు. అటు జీ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేమని, ఈనేపథ్యంలో ఎలాంటి ఊహాగానాలను, పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరారు. చర్చలు కీలక దశకు చేరుకున్నాక కంపెనీ చేసే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా గత ఏడాది నవంబరులో అంతర్జాతీయ వ్యూహాత్మక ప్రణాళిలో భాగంగా జీలో మేజర్ వాటాను విక్రయించనున్నామని ఎస్సెల్ గ్రూపు ప్రకటించడం గమనార్హం. -
48 ఎంపీ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్!
పదేళ్ల క్రితం నోకియా తన మొబైల్స్లో కెమెరాలను అప్డేట్ చేస్తూ మొబైల్ మార్కెట్ను శాసించిన పరిస్థితులను చూశాము. గత కొద్ది నెలలుగా రిలీజవుతున్న మొబైల్స్ను గమనిస్తే ఈ ట్రెండ్ మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. ప్రతీ మొబైల్ కంపెనీ తమ ఫ్లాగ్షిప్ ఫోన్లలో కెమెరాలను అప్డేట్ చేస్తున్నాయి. గతవారం హువావే 40 ఎంపీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ రిలీజ్ చేసింది. ఇదే క్రమంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ ఇండియాలో భారీ మార్కెట్ను సాధించిన చైనా మొబైల్ దిగ్గజం షావోమీ జనవరిలో బెస్ట్ కెమెరాతో దుమ్మురేపే మొబైల్ను అందుబాటులోకి తీసుకురానుంది. 48 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో ఈ ఫోన్ను తయారు చేయనున్నట్లు షావోమీ ప్రెసిడెంట్ లిన్ బిన్ తెలిపారు. ప్రముఖ చైనా టెక్నాలజీ వెబ్సైట్ వీబోలో ఈ మేరకు వార్త వెలువడింది. తాను కొద్దివారాల పాటు ఈ మొబైల్ను ఉపయోగించినట్లు లిన్ వెల్లడించారు. 48 ఎంపీ సెన్సార్గా సోనీ ఐఎయ్ఎక్స్ 586ని గానీ శాంసంగ్ ఐసోసెల్ బ్రైట్ జీఎం1ని గానీ అమర్చే అవకాశముందని తెలిపారు. సోనీ సెన్సార్ సూపర్ స్లో మోషన్ను సపోర్ట్ చేయడం లేదని, అయితే ఏదో ఒకటి చేసి దానినే అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ కెమెరాలు రెండూ నాలుగు రెట్ల వరకూ దూరాన్ని జూమ్ ద్వారా స్పష్టంగా తీయగలవు. ఇప్పటివరకూ షావోమీ ఈ స్థాయి కెమెరా కలిగిన ఫోన్ తయారు చేయలేదు. ఇది ఎంతవరకు విజయం సాధించగలదో చూడాలంటే జనవరి వరకూ ఆగక తప్పదు. -
టాటా స్కై యూజర్లకు షాక్ : సోని ఛానల్స్ క్లోజ్
ముంబై : 1.6 కోట్ల టాటా స్కై సబ్స్క్రైబర్లకు షాకింగ్ న్యూస్. మీకు ఎంతో ఇష్టమైన, నిరంతరం చూసే సోని పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా(ఎస్పీఎన్)కు చెందిన 32 ఛానల్స్ను టాటా స్కై తన ప్లాట్ఫామ్ నుంచి తొలగించింది. అంతేకాక ఇండియా టుడే నెట్వర్క్కు చెందిన మూడు ఛానల్స్ను కూడా తన ప్లాట్ఫామ్ను నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై వెల్లడించింది. ధరల సమస్యలతో ఈ ఛానల్స్ను తన ప్లాట్ఫామ్ నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై ప్రకటించింది. టాటా స్కై ఆపివేసిన ఛానల్స్ల్లో పాపులర్ టీవీ ఛానల్స్ సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, ఎస్ఏబీ, మ్యాక్స్, ఏఎక్స్ఎన్, సోని పిక్స్, ఆజ్ తక్, ఇండియా టుడే ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి టాటా స్కైలో ఈ ఛానల్స్ను ప్రసారం చేయడం లేదు. ఈ విషయం తెలిసిన కొంతమంది సబ్స్క్రైబర్లు ఇప్పటికే టాటా స్కైపై మండిపడుతున్నారు. ట్విటర్, ఫేస్బుక్ వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు. టాటా స్కై నిర్ణయం దురదృష్టకరమైనదని సోని పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ప్రకటించింది. టాటా స్కైతో సోని పిక్చర్స్కు ఉన్న మూడేళ్ల డిస్ట్రిబ్యూషన్ డీల్ జూలై 31తో ముగిసింది. కొత్త డీల్పై ఇరు పార్టీలు చర్చించుకోవాల్సి ఉంది. కానీ ధరల విషయంలో ఈ రెండింటికీ పొంతన కుదరలేదు. మూడేళ్ల క్రితం టాటా స్కై సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆ సంఖ్య 1.6 కోటికి పైగా చేరింది. టాటా స్కై తమకు ఎక్కువ రెవెన్యూ ఇవ్వాలని సోని పిక్చర్స్ డిమాండ్ చేసింది. దానికి టాటా స్కై ఆమోదించలేదు. ‘సోని పిక్చర్స్తో ఉన్న వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి. ధరలు పెంచాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము కొన్ని ఛానల్స్ను తొలగించాలని నిర్ణయించాం. సబ్స్క్రైబర్లు అర్థం చేసుకోవాలి’ టాటా స్కై ఎండీ హరిత్ నాగ్పాల్ కోరారు. అయితే సోని పిక్చర్స్ మాత్రం టాటా స్కైపై తీవ్ర ఆరోపణలు చేసింది. వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టు టాటా స్కై వ్యవహరించడం లేదని, వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ను, లైవ్ స్పోర్టింగ్ యాక్షన్ను చూసే అవకాశాన్ని యూజర్లకు టాటా స్కై ఇవ్వడం లేదని సోని పిక్చర్స్ అధికారి ప్రతినిధి ఆరోపించారు. తమ ఛానల్స్ను చూడాలనుకునే వారు, తమకు సెపరేటుగా మిస్డ్ కాల్ ఇవ్వాలని తెలిపింది. అయితే మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ.. ఇచ్చిన నెంబర్ కలువడం లేదు. కస్టమర్ కేర్ సర్వీసు క్రాష్ అయింది. దీంతో సబ్స్క్రైబర్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అయితే 10 సోని పిక్చర్స్ ఛానల్స్ను మాత్రం టాటా స్కై అలానే ఉంచింది. టాటా స్కై తన ప్లాట్ఫామ్పై తొలగించకుండా ఉంచిన ఛానల్స్ల్లో ఎస్ఈటీ, ఎస్ఈటీ హెచ్డీ, సోని ఎస్ఏబీ, మ్యాక్స్, సోని సిక్స్, సోని టెన్, టెన్ 1 హెచ్డీ, సోని టెన్ 2 హెచ్డీ, సోని టెన్ 3, పిక్స్ హెచ్డీ, వన్ ఇండియా టుడే ఛానల్(ఆజ్ తక్) ఉన్నాయి. -
సోనీ ఎక్స్పీరియా ఎక్స్జెడ్2@రూ.72,990
న్యూఢిల్లీ: సోనీ ఇండియా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ’ఎక్స్పీరియా ఎక్స్జెడ్2’ బుధవారం విడుదలయింది. ప్రపంచంలోనే తొలిసారిగా 4కే హెచ్డీఆర్ మూవీ రికార్డింగ్ ఫీచర్ను అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.72,990. భారత్లో అందుబాటులో ఉన్న తమ కంపెనీ స్మార్ట్ఫోన్లలో ఇదే అత్యంత ఖరీదైన మొబైల్గా పేర్కొంది. 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 845 ప్రొసెసర్, 3180 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, సిక్స్ జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీని కలిగిన ఈ ఫోన్లో సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సదుపాయం ఉంది. ఆగస్టు 1 నుంచి ఎంపిక చేసిన సోనీ సెంటర్లు, రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుందని సోనీ ఇండియా ప్రకటించింది. -
అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ లాంచ్
న్యూఢిల్లీ : జపాన్కు చెందిన మొబైల్ తయారీదారి సోనీ, తన ఎక్స్పీరియా రేంజ్లో స్మార్ట్ఫోన్లను విస్తరిస్తూ వెళ్తోంది. తాజాగా ఎక్స్పీరియా రేంజ్లో ఎక్స్పీరియా ఎక్స్జెడ్2 పేరుతో ఓ కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. ఈ నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ప్రపంచంలో తొలి 4కే హెచ్డీఆర్ మూవీ రికార్డింగ్ ఫీచర్తో మార్కెట్లోకి వచ్చింది. దీని ధర 72,990 రూపాయలు. ఇదే కంపెనీ ఇప్పటి వరకు భారత్లో లాంచ్ చేసిన అత్యంత ఖరీదైన సోనీ స్మార్ట్ఫోన్. ఆగస్టు 1 నుంచి ఎంపిక చేసిన సోనీ సెంటర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుంది. సోనీ ఎక్స్పీరియా ఎక్స్జెడ్2 స్పెషిఫికేషన్లు.. 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 400 జీబీ వరకు విస్తరణ మెమరీ 19 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3180 ఎంఏహెచ్ బ్యాటరీ క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 ఫింగర్ప్రింట్ సెన్సార్, వైర్లెస్ ఛార్జింగ్, గూగుల్ కాస్ట్ IP65/IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫైడ్ -
సోని, కృష్ణలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తైక్వాండో చాంపియన్షిప్లో రింకూ సోని, కృష్ణ స్వర్ణాలను సాధించారు. వైఎంసీఏ నారాయణగూడలో జరిగిన ఈ టోర్నీలో సీనియర్ బాలికల విభాగంలో సోని విజేతగా నిలిచి పసిడిని గెలుచుకోగా... గౌతమి, పూజ వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. సీనియర్ బాలుర పూల్ ‘ఎ’ కేటగిరీలో బి. కృష్ణ, శ్లోక్, కరీమ్... పూల్ ‘బి’ విభాగంలో కరన్, వాసు, అనిల్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు జాతీయ టోర్నీలో తలపడే తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. మలేసియాలో ఆగస్టు 24 నుంచి 26 వరకు తైక్వాండో ఇంటర్నేషనల్ చాంపియన్షిప్ జరుగనుంది. ఇతర వమో విభాగాల విజేతల వివరాలు సబ్ జూనియర్ బాలురు: 1. ఆశ్రిత్, 2. ఆదిత్య, 3. అర్నవ్. క్యాడెట్ బాలురు: 1. వితేశ్, 2. అద్వైత్, 3. సలీమ్. జూనియర్ బాలురు: 1. అభిషేక్ లాల్, 2. విజేందర్ బాబు, 3. సాయి రిత్విక్. బాలికలు: 1. అహానా రాయ్, 2. అనన్య. -
ఆ స్మార్ట్ఫోన్పై రూ.10 వేల ధర తగ్గింపు
సోనీ మొబైల్స్ తన మూడు స్మార్ట్ఫోన్లపై శాశ్వతంగా ధర తగ్గించింది. ఎక్స్పీరియా ఎక్స్జెడ్ఎస్, ఎక్స్పీరియా ఎల్2, ఎక్స్పీరియా ఆర్1 స్మార్ట్ఫోన్లపై జూలై 6 నుంచి ధరలు తగ్గించినట్టు సోనీ ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం, ఎక్స్పీరియా ఎక్స్జెడ్ఎస్ స్మార్ట్ఫోన్ రూ.29,990 కు అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర 39,990 రూపాయలు. అంటే 10 వేల రూపాయల మేర ధర తగ్గింది. ఇక ఎక్స్పీరియా ఎల్2 స్మార్ట్ఫోన్ ధరను కూడా రూ.19,990 నుంచి రూ.14,990కు తగ్గించింది సోనీ కంపెనీ. ఎక్స్పీరియా ఆర్1 స్మార్ట్ఫోన్ను రూ.9,990 కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.10,990గా ఉండేది. ఈ ధరలు సోనీ అన్ని సెంటర్లలోనూ, అమెజాన్.ఇన్, ఫ్లిప్కార్ట్, ఇతర ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ చెప్పింది. ధర తగ్గక ముందు సోనీ ఎక్స్పీరియా ఎక్స్జెడ్ఎస్ స్మార్ట్ఫోన్ అమెజాన్.ఇన్లో రూ.39,990కు లభ్యమయ్యేది. ఎక్స్పీరియా ఎక్స్జెడ్ఎస్ గతేడాది మన మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత ఇదే అత్యంత ఖరీదైన ధర తగ్గింపు. ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 820 ఎస్ఓసీ, ఆండ్రినో 510 జీపీయూ, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 19 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. మిండ్రేంజ్ స్మార్ట్ఫోన్ అయిన ఎక్స్పీరియా ఎల్2, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ స్మార్ట్ఫోన్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6737టీ ఎస్ఓసీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలున్నాయి. ఇక చివరిగా ఎక్స్పీరియా ఆర్1 స్మార్ట్ఫోన్ గతేడాది అక్టోబర్లోనే స్టోర్లలోకి అందుబాటులోకి వచ్చింది. 5.2 అంగుళాల హెచ్డీ టీఎఫ్టీ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 ఎస్ఓసీ, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ ఈ స్మార్ట్ఫోన్లో ఉన్నాయి. -
సోనీ మూడు కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్
మల్టీ నేషనల్ టెలికమ్యూనికేషన్ కంపెనీ సోనీ మొబైల్స్ మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. లాస్ వెగాస్లో జరుగుతున్న సీఈఎస్ 2018లో వీటిని పరిచయం చేసింది. జనవరి 9నుంచి 12వ తేదీవరకు జరగనున్నఈ ఎక్స్పోలో సోనీ గత సంవత్సరం లాంచ్ చేసిన ఎక్స్పీరియా ఎక్స్ఏ1, ఎక్స్ఏ1 అ ల్ట్రా కొనసాగింపుగా ఎక్స్ఏ2, ఎక్స్ఏ2 అ ల్ట్రా, ఎక్స్పీరియా ఎల్ 2 పేరుతో లాంచ్ చేసింది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ఎల్ 2 స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. ఈ డివైస్లలో బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచింది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్ను వెనుకకు మార్చడం తప్ప పెద్దగా మార్పులేమీ చేయలేదు. మీడియా టెక్ ప్రాసెసర్లతో, ఎక్స్ఏ2, ఎక్స్ఏ2 అ ల్ట్రా క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 630 చిప్సెట్ను అమర్చింది. ఎక్స్ఏ2 ఫీచర్లు 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 23 ఎంపీ ప్రైమరీ కెమెరా 8ఎంపీ కెమెరా సెల్ఫీ లెన్స్ విస్తరించుకునే సదుపాయం 3,300ఎంఏహెచ్ బ్యాటరీ ఎక్స్ఏ2 అ ల్ట్రా ఫీచర్లు 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ విస్తరించుకునే సదుపాయం 23 ఎంపీ ప్రైమరీ కెమెరా 8+6 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా లెన్స్ 3,580 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ రెండు డివైస్లతో పాటు లాంచ్ చేసిన కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ ఎక్స్పీరియా ఎల్ 2 ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. ఎక్స్పీరియా ఎల్ 2 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ 3 జీబి ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ ఎక్స్పాండబుల్ మెమరీ 8ఎంపీ సెల్ఫీ కెమెరా 13ఎంపీ రియర్ కెమెరా 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా గ్లోబల్ మార్కెట్లో 2018, ఫిబ్రవరి మాసంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్ల రేట్లవివరాలు అందుబాటులోకి రావాల్సిఉంది. Brave, bold, borderless – #Xperia XA2 was made to free your inner creative. #SonyCEShttps://t.co/T1ZOpYDC6v pic.twitter.com/ocL4gMTpJS — Sony Xperia (@sonyxperia) January 8, 2018 -
కొత్త ఏడాదిలో వచ్చేసిన సోని స్మార్ట్ఫోన్లు
కొత్త ఏడాదిలో సోని రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. లాస్ వేగాస్లోని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎక్స్పీరియా ఎక్స్ఏ2, ఎక్స్పీరియా ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నట్టు సోని ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు గతేడాది ఎక్స్ఏ1, ఏక్స్ఏ1 ఆల్ట్రాలకు అప్గ్రేడెడ్గా మార్కెట్లోకి వచ్చాయి. బ్యాటరీ, కెమెరా, ప్రాసెసర్ను మెరుగుపరిచి వీటిని లాంచ్ చేసింది. మరో అతిపెద్ద డిజైన్ మార్పులో ఈ స్మార్ట్ఫోన్లకు వెనుకవైపు ఫింగర్ప్రింట్ సెన్సార్ను అమర్చడమే. అంతకముందు ఎక్స్ఏ1 స్మార్ట్ఫోన్లు మీడియోటెక్ ప్రాసెసర్లతో పనిచేయగా.. తాజాగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్లు ఎక్కువ శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్తో రూపొందాయి. ఎక్స్ఏ2 స్మార్ట్ఫోన్ 3జీబీ ర్యామ్ను, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉండగా.. ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యామ్ను, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు తమ స్టోరేజ్ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు. అంతేకాక బ్యాటరీ సామర్థ్యం కూడా అంతకముందు వాటి కంటే ఎక్కువగా ఎక్స్ఏ2 స్మార్ట్ఫోన్ 3,300 ఎంఏహెచ్ను, ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్ఫోన్ 3,580 ఎంఏహెచ్ను కలిగి ఉన్నాయి. ఆల్ట్రా-స్లిమ్ సైడ్ బెజెల్స్తో ఇవి రూపొందాయి. ఎక్స్ఏ2 స్మార్ట్ఫోన్ 5.2 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లేతో, ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్ఫోన్ 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో మార్కెట్లోకి వచ్చాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఎక్స్ఏ2 స్మార్ట్ఫోన్కు వెనుక వైపు 23ఎంపీ కెమెరా, ముందు వైపు 8 ఎంపీ కెమెరా, ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్ఫోన్ 16 ఎంపీ, 8ఎంపీతో డ్యూయల్ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు 23 ఎంపీ కెమెరాను కలిగి ఉన్నాయి. -
సోని కొత్త ఫోన్ ఆన్లైన్లో చక్కర్లు
సోని నుంచి కొత్తగా విడుదల కాబోతున్న స్మార్ట్ఫోన్ ఎక్స్పీరియా ఎక్స్ఏ2 ఆల్ట్రా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ డివైజ్ బార్సిలోనాలో జరుగబోతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018లో ఆవిష్కరించబోతున్నట్టు తెలిసింది. హెచ్4233 నెంబర్తో ఈ స్మార్ట్ఫోన్ ఆన్లైన్లో స్పాట్ అయింది. ఎక్స్పీరియా ఎక్స్ఏ1 ఆల్ట్రాకు సక్ససర్గా ఈ డివైజ్ను సోని మార్కెట్లోకి విడుదల చేయబోతుంది. ఈ స్మార్ట్ఫోన్కు కుడి, ఎడమ రెండు వైపుల పలుచైన బెజెల్స్ కలిగి ఉండనున్నాయి. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న రూమర్ల ప్రకారం సోని ఎక్స్పీరియా ఎక్స్ఏ2 ఆల్ట్రా స్మార్ట్ఫోన్ 6 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన ఫీచర్లు... 1920 x 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో రెండు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు కొన్ని నెలల కిత్రమే సోని తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఎక్స్పీరియా ఎక్స్జెడ్1ను భారత్లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ మెటల్ యూనిబాడీ డిజైన్తో మార్కెట్లోకి వచ్చింది. -
సోనీ నుంచి జంట ఫోన్లు, మిడ్-రేంజ్లోనే
సోనీ ఇండియా శుక్రవారం రెండు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎక్స్పీరియా ఆర్1 ప్లస్, ఎక్స్పీరియా ఆర్1 పేరుతో వీటిని తీసుకొచ్చింది. మిడ్-సెగ్మెంట్ కస్టమర్లను టార్గెట్గా చేసుకుని ఈ రెండు స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసినట్టు సోనీ పేర్కొంది. ఎక్స్పీరియా ఆర్1 ప్లస్ ధర రూ.14,990కాగ, ఎక్స్పీరియా ఆర్1 ధర 12,990 రూపాయలు. ఈ రెండు స్మార్ట్ఫోన్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండింట్లో అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ సెంటర్, మేజర్ మొబైల్ స్టోర్లలో విక్రయించనున్నారు. బ్లాక్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. ఎక్స్పీరియా ఆర్1 ప్లస్, ఆర్1 స్పెషిఫికేషన్లు... ఎక్స్పీరియా ఆర్1 ప్లస్కు 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ఎక్స్పీరియా ఆర్కు 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ 5.2 అంగుళాల హెచ్డీ టీఎఫ్టీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 ఎస్ఓసీ డ్యూయల్ సిమ్ డివైజ్లు 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 2620 ఎంఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ టైప్-సీ పోర్టు ఆండ్రాయిడ్ నోగట్తో రన్, కానీ ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ను కూడా కంపెనీ చేపట్టనుంది. -
సోనీ ఎక్స్పీరియా కొత్త ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: సోనీ మరో కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఎక్స్పీరియా ఎక్స్జెడ్1 పేరుతో ఎక్స్పీరియా ప్రీమియం సిరీస్ను విస్తరించింది. 3డీ క్రియేటర్తో లాంచ్ చేసిన తొలిమొబైల్గా ఇది నిలిచింది. దీని వలన వినియోగదారులు 3డీ స్కాన్లను నేరుగా సృష్టించవచ్చు, 3డీ ప్రింటర్లతో నేరుగా వీటిని ప్రింట్ చేయవచ్చు. అంతేకాదు ఇండస్ట్రీలో 19 ఎంపీ తొలి మోషన్ ఐ కెమెరా (విత్ హైబ్రీడ్ ఎఎఫ్)తో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను రూ.44,990 గా సోనీ ప్రకటించింది. ఐపి 68 సర్టిఫికేషన్తో వాటర్, అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. నీలం, నలుపు, సిల్వర్, గులాబీ రంగు ఆప్షన్స్లో సోనీ అధికార రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఎక్స్పీరియా ఎక్స్జెడ్1 ఫీచర్లు 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ హెచ్డీఆర్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 పొట్రెక్షన్ 19 ఎంపీ మోషన్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే సదుపాయం 2700 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆ సీరియల్కు షాక్!
తీవ్ర వివాదాస్పదమైన హిందీ సీరియల్ 'పెహ్రెదార్ పియా కీ'కు బ్రేక్ పడింది. సోనీ చానెల్ ఈ సీరియల్ ప్రసారాన్ని అర్ధంతరంగా నిలిపేసింది. తొమ్మిదేళ్ల బాలుడు 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకొనే కథాంశంతో రూపొందిన ఈ సీరియల్పై తీవ్ర విమర్శలు రావడంతో.. సోనీ చానెల్ సోమవారం నుంచి అర్ధంతరంగా దీని ప్రసారాలు నిలిపేసింది. సీరియల్ ఒక్కసారిగా నిలిచిపోవడం ఇందులో నటించిన నటీనటులకు, దర్శకనిర్మాతలకు షాక్నిచ్చింది. ఈ సీరియల్కు వ్యతిరేకంగా ఛేంజ్.ఓఆర్జీ వెబ్సైట్లో చేపట్టిన ఆన్లైన్ సంతకాల సేకరణకు పెద్దస్థాయిలో మద్దతు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ఈ సీరియల్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైట్స్ కౌన్సిల్ (బీసీసీసీ)కు లేఖ రాశారు. రంగంలోకి దిగిన బీసీసీసీ సీరియల్ ప్రసార సమయాన్ని మార్చాలని, బాల్యవివాహాలను ప్రోత్సహించడంలేదంటూ సీరియల్ ప్రారంభంలో ప్రకటన ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో సీరియల్లో కాలాన్ని కొంత ముందుకుతీసుకెళ్లి ప్రధాన పాత్రలు యుక్త వయస్సుకొచ్చిన తర్వాత ఎపిసోడ్స్ను ప్రసారం చేస్తారని భావించారు. కానీ, వివాదాల నేపథ్యంలో సోనీ చానెల్ ఏకంగా సీరియల్ ప్రసారాన్నే నిలిపివేయడం 'పెహ్రెదార్ పియా కీ' యూనిట్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సోనీ చానెల్ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తసున్నారు. ఈ సీరియల్లో 9 ఏళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతి కొన్ని పరిస్థితులరీత్యా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆపై జరిగే పరిణామాలు ఏంటన్నదే ఈ సీరియల్ కథ. బాలుడు యువతి వెంటపడుతున్నట్టు.. 'మొదటిరాత్రి' గురించి చెప్తున్నట్టు అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో ఈ సీరియల్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైమ్ టైమ్లో వస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు, పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చే ప్రమాదం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. -
సోనీ నుంచి మరో కొత్త ఫోన్: ఫీచర్లివే...
ఎక్స్పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం స్మార్ట్ఫోన్ను గత నెలలోనే లాంచ్ చేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోనీ, మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సోనీ ఎక్స్పీరియా ఎక్స్ఏ1 ఆల్ట్రా పేరుతో దీన్ని భారత్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర 29,990 రూపాయలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ స్టోర్లలోనూ ఇది అందుబాటులో ఉంది. బ్లాక్, వైట్, గోల్డ్ రంగుల్లో ఇది మార్కెట్లో లభ్యమవుతోంది. సోనీ ఎక్స్పీరియా ఎక్స్ఏ1 ఆల్ట్రా స్పెషిఫికేషన్స్... 6 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే క్వాడ్ కోర్ 2.3 గిగాహెడ్జ్+క్వాడ్ కోర్ 1.6 గిగాహెడ్జ్ ఎస్ఓసీ 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 23 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫ్లాష్ కెమెరా 2700ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ -
మార్కెట్లోకి సోనీ కొత్త ఫోన్...ధరెంతో తెలుసా?
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఎక్స్పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం పేరుతో దీన్ని గురువారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర 59,990 రూపాయలు. ఈ ఫోన్ జూన్ 12 నుంచి సోనీ సెంటర్, ఎంపికచేసిన రిటైల్ అవులెట్లు, అమెజాన్.కామ్ లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఫోన్ ప్రీబుకింగ్స్ కూడా రేపటి నుంచి ప్రారంభమై, మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్న ఒక్కరోజు ముందు అంటే జూన్ 11కు ముగుస్తాయని కంపెనీ పేర్కొంది. ఎవరైతే ఈ ఫోన్ ను ప్రీ-బుకింగ్ చేసుకుంటారో వారికి 8,990 రూపాయల విలువైన సోనీ ఎస్ఆర్ఎస్-ఎక్స్బీ 20 వైర్ లెస్ బ్లూటూత్ స్పీకర్ ఉచితంగా అందిస్తామని కంపెనీ చెప్పింది. సోనీ ఎక్స్పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం ఫీచర్లు... 5.50 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే 2160x3840 పిక్సెల్స్ రెజుల్యూషన్ హెచ్డీఆర్ 10 కంప్లైంట్ స్క్రీన్ ముందు, వెనుకవైపు గొర్రిల్లా గ్లాస్ 5 ఆక్టా-కోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ 3,230 ఎంఏహెచ్ బ్యాటరీ 19ఎంపీ మోషన్ ఐ రియర్ కెమెరా 13ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 7.0 డ్యూయల్ స్లిమ్ స్లాట్ 4జీ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్టు -
నన్నడగొద్దు ప్లీజ్
హలో అన్నయ్యా! నాదో చిన్న ప్రాబ్లమ్. ఒకబ్బాయిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాను. అతనే ప్రపోజ్ చేశాడు. తను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేరవుతున్నా. మా మధ్య చిన్న మిస్ అండర్స్టాండింగ్. మేము ఇప్పుడు నెల రోజులుగా మాట్లాడుకోవట్లేదు. నాకేమో ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆ అబ్బాయి గురించి ఇంట్లో చెబుదామంటే... మాకే అండర్స్టాండింగ్ లేదు, ఇక పెద్ద వాళ్లతో ఎలా చెప్పగలను... అని ఆలోచిస్తున్నాను. మా పేరెంట్స్ ఒప్పుకోరేమో అని భయంగా ఉంది. వాళ్లను ఎలా ఒప్పించాలి. అతడు చాలా మంచివాడు. బహుశా ఆఫీస్ పని ఒత్తిడి వల్ల కావచ్చు, నాతో మాట్లాడడం లేదు. బహుశా! అబ్బాయిలు ఇలాగే ఉంటారేమో! తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ప్లీజ్ అన్నయ్యా! సలహా ఇవ్వండి! – సోనీ గుడ్ మార్నింగ్! నన్ను మీరు ఇప్పటి దాకా కలవలేదు. నా పేరు అరటిపండు. తరచూ వీళ్లిద్దరూ నన్ను మింగేస్తూ ఉంటారు. అందుకే మాట్లాడే చాన్సు దొరకలేదు. ఇవాళ నా కష్టం చెప్పుకునే అవకాశం దొరికింది. పైన మచ్చలు ఉన్నా లోపల శుభ్రంగా ఉంటాను. పైన కరుకుగా ఉన్నా లోపల మెత్తగా ఉంటాను. పైన వగరుగా ఉన్నా లోపల తియ్యగా ఉంటాను. లవ్ కూడా అంతే. తోలు వలిస్తే కానీ విషయం తెలియదు. దాపరికాలు వద్దు... ఓపెన్గా మాట్లాడు సోనీ! అంతా మంచే జరుగుతుంది. నేను ఆన్సర్ చెప్పానని ‘ఆ ఇద్దరికీ’ చెప్పకు. తెలిస్తే నన్ను పెరుగులో నంజుకుంటారు. ఆల్ ది బెస్ట్. -
వరల్డ్ ఫాస్టెస్ట్ ఎస్డీ కార్డు లాంచ్
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్డీ కార్డు లాంచ్ అయింది. సోని ఇండియా ఎస్ఎఫ్-జీ సిరీస్ లో దీన్ని లాంచ్ చేసింది. ప్రొఫిషినల్ ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్ల కోసం స్పెషల్ గా దీన్ని డిజైన్ చేశారు. మూడు వేరియంట్లలో ఈ కార్డును లాంచ్ చేశారు. ఎస్ఎఫ్-జీ32/టీ1(32కెపాసిటీ) ధర రూ. 6700 కాగ, 64జీబీ కెపాసిటీ ఎస్ఎఫ్-జీ64/టీ1 ఐఎన్ కార్డు ధర రూ.11,000. 128జీబీ కెపాసిటీ కార్డు ధర రూ.19,9000. ఈ కార్డులన్ని ఐదేళ్ల వారెంటీతో ఏప్రిల్ 3 నుంచి వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. ఈ ఎస్డీ కార్డు రైటింగ్ స్పీడు సెకనుకు 299 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. అదేవిధంగా రీడింగ్ స్పీడు కూడా సెకనుకు 300ఎంబీపీఎస్ వరకు ఉంది. డిజిటల్ ఇమేజింగ్ డివైజ్లన్నింటికీ తమ ఎస్ఎఫ్-జీ సిరీస్ కార్డులు సపోర్టు చేస్తాయని సోని తెలిపింది. డీఎస్ఎల్ఆర్తో 4వేల వీడియోలను ఇది రికార్డు చేస్తోంది. ఈ కొత్త ఎస్డీ కార్డుతో పాటు ఎస్డీ మెమరీ కార్డు రీడర్ ను కూడా కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటితో డేటాను చాలా వేగంగా.. పర్సనల్ కంప్యూటర్లోకి ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. -
సోనీ కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!
సోనీ కంపెనీ తాజాగా తన ఎక్స్పీరియా శ్రేణిలో అత్యంత ఉత్తమమైన ఫోన్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ బాడీని అల్యూమినియం, గ్లాస్లతో తయారు చేశారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఎక్స్పీరియా శ్రేణికి చెందిన ఫోన్ల ఫీచర్లు పేపర్ మీద బాగున్నా.. పనితనంలో మాత్రం అంతంతమాత్రమేననే మాటలు మార్కెట్లో వచ్చాయి. అయితే ఆ మాటలకు తెరదించడానికి ఎక్స్జెడ్ను సోనీ మార్కెట్లోకి తెచ్చినట్లు తెలిసింది. ఈ ఏప్రిల్లో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్ ఫీచర్లు ఓ సారి చూద్దాం. ఎక్స్పీరియా ఎక్స్జెడ్ ఫీచర్లు: ప్రైమరీ కెమెరా: 19 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సల్ తొలిసారి స్లో మోషన్ వీడియా రికార్డింగ్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ తన అధికారిక వీడియోలో పేర్కొంది. ర్యామ్: 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ (256 జీబీ వరకూ పెంచుకోవచ్చు) బ్యాటరీ: 3230 ఎంఏహెచ్ బ్లూటూత్: 5.0 ధర: రూ.46,700(అంచనా మాత్రమే) -
భారీగా తగ్గిన సోనీ ఫోన్ ధర.. 14వేలు కట్!
సోనీ కంపెనీ భారత వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన టాప్ మోడల్ స్మార్ట్ఫోన్ ఎక్స్పిరియా ఎక్స్ ధరను ఏకంగా రూ. 14వేలు తగ్గించింది. దీంతో ఈ ఫోన్ ఇప్పుడు రూ. 24,990లకే లభిస్తోంది. ఎక్స్పెరియా ఎక్స్ ధరను మొదట 48,900గా నిర్ణయించిన సోనీ ఆ తర్వాత భారత వినియోగదారుల కోసం దీని ధరను రూ. 10వేలు తగ్గించింది. అయినా, పెద్దగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా రూ. 14వేలు కోత కోసింది. భారత్లోనే ఇంత తక్కువ ధరకు సోనీ ఫోన్ లభించనుంది. సోనీ ఎక్స్పెరియా ఎక్స్ ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఐదు అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎక్స్పాండబుల్ అప్టు 200జీబీ), 23 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2630ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్ఫోన్ లభించనుంది. ప్రస్తుతం గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్, రోస్ గోల్డ్, వైట్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో లభిస్తోంది. -
సోనిది హత్యే
► క్షణికావేశంలోనే తండ్రి ఘాతుకం ► పోలీసుల విచారణలో వెల్లడి ►నిందితుడి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన డీఎస్పీ చండూరు: నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పలకు చెందిన సోనిది ఆత్మహత్య కాదని, హత్యేనని తేలింది. క్షణికావేశంలో తండ్రే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం నల్లగొండ డీఎస్పీ సుధాకర్ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గట్టుప్పలకు చెందిన బొడిగే కృష్ణకు భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. గ్రామంలోనే మగ్గం నేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పెద్ద కుమార్తె స్వప్నకు వివాహం చేశాడు. రెండో కుమార్తె మానస, చిన్న కుమార్తె సోని(19) ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇటీవల కృష్ణ మద్యానికి బానిసగా మారి తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. కుమారుడు బైక్ తీసుకెళ్లాడని.. గట్టుప్పలను మండలం చేయాలని గ్రామంలో కొద్ది రోజులుగా ఆందోళనలు సాగుతున్నారుు. ఈ నెల 14న గ్రామంలో జరుగుతున్న దీక్ష వద్దకు కృష్ణ తన భార్యతో కలసి వెళ్లాడు. కాసేపటికి కృష్ణ ఒక్కడే ఇంటికి చేరుకున్నాడు. తన బైక్ కనిపించకపోవడంతో ఎవరు తీసుకెళ్లారంటూ కూతుళ్లను అడిగాడు. తమ్ముడు గణేశ్ తీసుకెళ్లాడని చెప్పడంతో వాడికి తాళం చేతులు ఎవరు ఇచ్చారంటూ ఆగ్రహానికి లోనై వాగ్వాదానికి దిగాడు. దీంతో రెండో కుమార్తె మానస ఏడ్చుకుంటూ పక్కనే ఉన్న నాన్నమ్మ ఇంటికి వెళ్లింది. చిన్న కూతురు సోని మాత్రం తమ్ముడే కదా తీసుకెళ్లింది.. అంటూ తండ్రితో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కృష్ణ.. కూతురు అనే కనికరం లేకుండా ఆమె తలను పట్టుకుని తలుపునకు బాదడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించి.. క్షణికావేశంలో కూతురిని హత్య చేసిన కృష్ణ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పథకం రచించాడు. కూతురు మృతదేహాన్ని స్నానాల గదిలో వేసి కిరోసిన్ పోసి నిప్పంటించి అక్క డి నుంచి వెళ్లిపోయాడు. దారిలో భార్య కనిపించడంతో కూతురు ఒక్కతే ఉంది.. ఇంటికి వెళ్లమని పురమాయించాడు. దీంతో ఆమె ఇంటికి చేరుకుని కూతురు మంటల్లో కాలిపోతుండడాన్ని గమనించి కేకలు వేయగా, ఇరుగుపొరుగు వారు వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కృష్ణ తన కూతురు మండలం కోసం ఆత్మహత్య చేసుకుందని నమ్మించాడు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా.. తలకు బలమైన గాయం కావడంతో సోని చనిపోరుుందని, అనంతరమే కిరోసిన్ పోసి నిప్పంటించారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ వివరించారు. -
ముందు పెళ్లాం.. తరువాతే సేవ
అహ్మదాబాద్: జీవితంలో అన్ని సుఖాలను త్యజించి సన్యాసి జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తికి.. ముందు నీ భార్య సంరక్షణ భాధ్యతలు చూసుకోనాయనా అంటూ.. కోర్టు ఝలక్ ఇచ్చింది. సన్యాసత్వం పుచ్చుకొని సంపాదనకు దూరంగా ఉంటున్నా సరే.. వదిలేసిన భార్యకు భరణం చెల్లించాల్సిందేనంటూ ఘాటుగా మందలించింది. సమాజానికి సేవచేయడానికి బయలుదేరడం మంచిదే గానీ.. మరి నీ భార్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది. వివరాలు..గుజరాత్కు చెందిన సునిల్ ఉదాసి అనే వ్యక్తి నుంచి విడాకులు పొందిన సోని భరణం కోరుతూ 2001లో కోర్టును ఆశ్రయించగా.. నెలకు రూ. 3500 భరణం ఇవ్వాలని ఉదాసికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఉదాసి కోర్టు చెప్పిన విధంగా భరణం చెల్లిస్తూ వచ్చాడు. అయితే 2011లో ఆయన జీవితంలో అనుకోని మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లిన ఉదాసి.. ఢిల్లీలో ఓ ఆశ్రమంలో చేరి సన్యాసత్వం స్వీకరించాడు. బ్యాంకు ఉద్యోగం మానేశాడు. సేవాకార్యక్రమాల్లో నిమగ్నమౌతూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో సంపాదన లేకపోవడంతో సోనికి చెల్లించాల్సిన భరణం కష్టమైపోయింది. దీంతో 'నేను ఇప్పుడు సంపాదించడం లేదు.. చెల్లించాల్సిన భరణాన్ని తగ్గించండి' అంటూ ఉదాసి కోర్టును ఆశ్రయించాడు. అయితే ఉదాసి వాదనను విన్న గుజరాత్ హైకోర్టు.. సమాజానికి సేవచేయటం మంచిదే కానీ.. ముందు సోని గురించి ఆలోచించమంటూ సలహా ఇచ్చింది. భరణం మాత్రం తగ్గించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. -
భారీగా తగ్గిన సోనీ స్మార్ట్ ఫోన్ల ధరలు!
న్యూఢిల్లీ: సోనీ ఇండియా కంపెనీ తన టాప్ మొబైల్ ఫోన్ల ధరలను గణనీయంగా తగ్గించింది. సోనీ ప్రతిష్టాత్మక ఉత్పత్తులైన ఎక్స్పీరియా ఎక్స్, జెడ్ 5 ప్రీమియం ధరలను ఏకంగా 21శాతం వరకు తగ్గించింది. తగ్గిన ధరలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. సోనీ ఎక్స్పిరియా ఎక్స్ ధర మొదట్లో రూ. 48,990 ఉండగా, ఇప్పుడు రూ. 10వేలు తగ్గి రూ. 38,990కి చేరుకుంది. అదేవిధంగా ఎక్స్పిరియా జెడ్5 ప్రీమియం ధర రూ. 55,990 కాగా, దీని ధరలో 14శాతం కోతపెట్టింది. దీంతో ఎనిమిది వేలు తగ్గి రూ. 47,990కే ఇది లభిస్తోంది. భారత్లో ప్రీమియం కేటగిరి స్మార్ట్ఫోన్ మార్కెట్లో సోనీ కంపెనీ సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్మార్ట్ఫోన్ మార్కెట్ భారత్లో ఉంది. పరిశోధన సంస్థ ఐడీసీ ప్రకారం 2016 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ 17శాతం వృద్ధి సాధించింది. 2.75 కోట్ల మొబైల్ యూనిట్లు భారత్కు షిప్పింగ్ అయ్యాయి. అందులో ప్రధాన వాటా చైనా కంపెనీలు లెనోవో, షియోమి, వివోలదే. భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 25.1శాతం వాటాతో శామ్సంగ్ది ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమాక్స్ (12.9శాతం), లెనోవో గ్రూప్ (7.7శాతం), ఇంటెక్స్ (7.1శాతం) ఉన్నాయి. -
మార్కెట్లోకి సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ఏ ఆల్ట్రా'
జపనీస్ టెక్ దిగ్గజం సోని, ఎక్స్పీరియా ఎక్స్ సిరీస్ లో భాగంగా తొలి స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించేసింది. ఎక్స్పీరియా‘ఎక్స్ఏ అల్ట్రా’ పేరుతో ఆరు అంగుళాల ఫాబ్లెట్ను మంగళవారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.29,990గా కంపెనీ నిర్ణయించింది. అన్నీ సోనీ సెంటర్లు, మేజర్ ఎలక్ట్రానిక్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించింది. వైట్, గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్, జూలై 27 నుంచి మార్కెట్లో లభ్యంకానుంది.10 నిమిషాల చార్జింగ్ తో 5.5 గంటల పాటు ఈ ఫోన్ పనిచేస్తుందని కంపెనీ చెప్పింది. ఎక్స్పీరియా ఎక్స్ఏ ఆల్ట్రా ఫీచర్లు... 6 అంగుళాల 1080పీ డిస్ప్లే స్క్రాచ్-రెసిస్టెంట్ కర్వ్డ్ 2.5 డీ గ్లాస్ 2గిగాహెడ్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటీ6755 హీలియో పీ10 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారిత ఎక్స్పీరియా యూఐ 3 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నెల్ మెమరీ 200 జీబీ వరకు విస్తరణ మెమరీ డ్యూయల్ సిమ్ ఫోన్ 21.5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్మార్ట్ సెల్ఫీ ఫ్లాస్ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ ఆప్షన్ 2700 ఎంఏహెచ్ బ్యాటరీ (రెండురోజుల బ్యాటరీ లైఫ్) -
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
కోటగిరి: చెరువలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరిలో శనివారం వెలుగు చూసింది. స్థానిక దామర చెరువులో శుక్రవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు అందులో మునిగి పోయారు. రంజాన్ సందర్భంగా కోటగిరిలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చిన సోహెల్(11), సోని(9) శుక్రవారం చెరువు దగ్గరకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా.. చెరువులో రెండు మృత దేహాలు లభించాయి. -
భర్తను సుత్తితో మోది చంపేసింది..
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య భర్తను చంపేసింది. ఆపై కట్టుకథలల్లి తప్పించుకోజూసింది. దర్యాప్తులో పోలీసులకు దొరికిపోయింది. ఈ సంఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కధనంమేరకు పెద్దకమేళాకు చెందిన సత్యనారాయణ, సోని దంపతులకు ఇద్దరు పిల్లలు కీర్తన రాజు(11)నవ్యశ్రీ (8) ఉన్నారు. సత్యనారాయణ పెయింటర్గా, సోని ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉండేవారు. ఈ దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భర్తను సోని తలపై దాదాపు ఇరవై సార్లు కొట్టింది. తీవ్ర రక్త స్రావం కావటంతో సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం 100 నంబర్కు ఫోన్ చేసి, తనను బంధించి తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు చంపారని కట్టుకథ చెప్పింది. ఈ మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకు... ఇద్దరు పిల్లలతో కూడా అదే కథ చెప్పించింది. అయితే, మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు..సోనిని అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా భర్తతో ఉన్న విభేదాల కారణంగా సుత్తితో మోది చంపినట్లు నేరాన్ని ఆమె అంగీకరించింది. -
సోనీ సూపర్ పవర్ ప్లే స్టేషన్ 4 'నియో'
ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ నుంచి ఓ కొత్త అద్భుతమైన, శక్తివంతమైన ప్లే స్టేషన్-4 అప్ గ్రే వినియోగదారుల ముందుకు రాబోతోంది. ప్లే స్టేషన్ 4 లో అప్ గ్రేడడ్ వెర్షన్ 'నియో' ను మార్కెట్లోకి విడుదల చేయనున్నామని సోనీ ఎంటర్ ట్రైన్ మెంట్ అధ్యక్షుడు, గ్లోబల్ సీఈవో ఆండ్ర్యూ హోస్ తెలిపారు. గత కొంత కాలంగా బెటర్ గ్రాఫిక్స్ కు, 4కే టెలివిజన్స్ కోసం సోనీ ప్రయత్నిస్తోందని మార్కెట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లకు తెరదించుతూ సోనీ ప్లేస్టేషన్ 4 ను అప్ డేట్ చేయబోతుందని సీఈవో ప్రకటించారు. దాన్ని నిక్ నేమ్'నియో' అని తెలిపారు. ఉత్సాహవంతమైన గేమర్లని, 4కే కంటెంట్ కోసం వేచిచూసే వినియోగదారుల్ని లక్ష్యంగా చేసుకుని దీన్ని ఆవిష్కరిస్తున్నామని వెల్లడించారు ఈ నెల 14-16న జరగబోయే గేమింగ్ ఇండస్ట్రీ మెగా ట్రేడ్ షోలో మాత్రం ఆవిష్కరించరట. పూర్తి సామర్థ్యంతో, మంచి అనుభూతిని అందించడానికి ఇప్పుడే ఈ ప్లే స్టేషన్ 4 అప్ గ్రేడెడ్ ను ఆవిష్కరించడం లేదని, ఆగస్టులో జరగబోయే యూరప్ ఎనలాగ్స్ గేమ్ షోల్లో అధికారికంగా ప్రకటిస్తామని సీఈవో తెలిపారు. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న ప్లేస్టేషన్ 4 ధర కంటే ఈ అప్ గ్రేడడ్ వెర్షన్ ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తోంది. హోమ్ వీడియో గేమ్ కన్సోల్ గా ప్లేస్టేషన్ 4 ను సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్ టైన్ మెంట్ అభివృద్ధి చేసింది. ఈ ప్లేస్టేషన్ 4ను రూ.26,789లకు 2013 నవంబర్ లో ఆవిష్కరించింది. ప్రస్తుతం దీని ధర రూ.23,437లకు అందుబాటులో ఉంది. . -
మార్కెట్లోకి సోనీ ‘ఎక్స్’ సిరీస్ స్మార్ట్ఫోన్స్
♦ ‘ఎక్స్పీరియా ఎక్స్’, ♦ ‘ఎక్స్పీరియా ఎక్స్ఏ’ ఆవిష్కరణ న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ సోనీ కొత్తగా ‘ఎక్స్’ అనే స్మార్ట్ఫోన్ సిరీస్ను ప్రారంభించింది. అందులోనే తాజాగా ‘ఎక్స్పీరియా ఎక్స్’, ‘ఎక్స్పీరియా ఎక్స్ఏ’ అనే రెండు స్మార్ట్ఫోన్స్ను ఆవిష్కరించింది. వీటి బ్యాటరీ రెండు రోజులు వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఈ స్మార్ట్ఫోన్స్లో ‘ఫాస్ట్ ఫోటో క్యాప్షర్’ ఫీచర్ను పొందుపరిచామని పేర్కొంది. ఎక్స్పీరియా ఎక్స్ ధర రూ.48,990గా ఉంది. ఇది జూన్ 7 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఎక్స్పీరియా ఎక్స్ఏ ధర రూ.20,990గా ఉంది. ఇది జూన్ మూడో వారంలో మార్కెట్లో లభ్యంకానున్నది. -
ఇక స్మార్ట్ఫోన్కు బై బై!
- 2021 నాటికి కనుమరుగు కానుందని అంచనా - వాటి స్థానంలో ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ సాధనాలు - ‘ఎరిక్సన్’ సర్వేలో అధిక శాతం ప్రజల అభిప్రాయం ఇంకో ఐదేళ్లలో స్మార్ట్ఫోన్లు అనేవి లేకుండా పోతాయా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ఆధారంగా పనిచేసే సాధనాలు రానున్నాయా.. అవుననే అంటోంది స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఎరిక్సన్. కొంతకాలం జపాన్కు చెందిన సోనీతో కలసి ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్లు తయారు చేసింది. ప్రస్తుతం ‘కన్జూమర్ ల్యాబ్స్’ అనే మరో సంస్థను నడుపుతోంది. వినియోగదారుల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను గుర్తించడమే ఈ సంస్థ లక్ష్యం. దాదాపు 40 దేశాలకు చెందిన లక్ష మందిపై సర్వే చేసి ఇటీవలే 2016కు సంబంధించిన అంచనాలను విడుదల చేసింది. 2021 నాటికల్లా స్మార్ట్ఫోన్లు ఉండకపోవచ్చని సర్వేలో తేల్చింది. సగానికి పైగా ప్రజలు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారని ఎరిక్సన్ పేర్కొంటోంది. ఈ సర్వేలోని మరికొన్ని విశేషాలు.. నిర్ణయాల్లోనూ ‘స్మార్ట్’.. ఇప్పుడు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా ఇంటర్నెట్ వాడకం విస్తృతమైంది. వ్యక్తులు తీసుకునే నిర్ణయాల్లోనూ ఇంటర్నెట్ ప్రభావం ఎక్కువవుతోందట. ఉదాహరణకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు అక్కడ ఏ హోటల్ బాగుందో తెలుసుకునేందుకు గతంలో అయితే ఎవరైనా తెలిసిన అడిగేవారు. ఇప్పుడు మాత్రం ఆయా హోటళ్లపై ఇంటర్నెట్లో వచ్చిన రివ్యూలను ఎక్కువగా నమ్ముతున్నారు. స్మార్ట్ఫోన్ లేని వారు కూడా వివిధ వెబ్సైట్ల ద్వారా తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూట్యూబ్లో గంటల కొద్దీ.. ఈ కాలం యువత ముఖ్యంగా 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారిలో 20 శాతం మంది రోజుకు కనీసం 3 గంటల పాటు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారని ఎరిక్సన్ స్పష్టం చేసింది. ఐదేళ్ల కింద ఇది 7 శాతం మాత్రమే ఉండేది. ఇటుక, కాంక్రీట్.. అన్నిట్లో సెన్సర్లు.. ఇంటి నిర్మాణానికి వాడే ఇటుకలు, కాంక్రీట్లోనూ భవిష్యత్లో సెన్సర్లు ఇమిడ్చే అవకాశం ఉందని దాదాపు 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో నిర్మాణ లోపాలే కాకుండా నీటి లేకేజీ, చెమ్మ, విద్యుత్ సంబంధిత సమస్యలను కూడా ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఐదేళ్లలో ఇళ్లలో గాలి, తేమ శాతం, ఉష్ణోగ్రతలు నియంత్రించే సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయని చాలామంది అభిప్రాయపడ్డారు. వాట్సాప్, ఫేస్బుక్లలో ఎమర్జెన్సీ నంబర్లు.. అత్యవసర పరిస్థితుల్లో 108 లేదా 100 నంబర్లకు ఫోన్ చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే రానున్న మూడేళ్లలో ఈ పరిస్థితి మారే అవకాశముందని, ఎమర్జెన్సీ సమయంలో వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించడం సర్వసాధారణమవుతుందని అధిక శాతం మంది నమ్ముతున్నారు. ఆరోగ్యంపై నిఘా.. ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకునేందుకు ఫిట్బిట్, స్మార్ట్ఫోన్ యాప్ వంటి వాడకం ఇటీవల పెరిగిపోయింది. అయితే భవిష్యత్లో ‘ఇంటర్నబుల్స్’ రంగంలోకి రానున్నాయి. చిన్న సైజులో ఉండే ఈ హైటెక్ పరికరాలు శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటూ ఆరోగ్య స్థితిపై నిత్యం నిఘా వేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ పరికరాలు ఇప్పటికే పరిశోధన దశలు దాటి వాణిజ్యపరంగా రూపుదిద్దుకుంటున్నాయి. - సాక్షి, హైదరాబాద్ -
మూతపడ్డ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లు
జపాన్ భూకంపం స్థానిక ఎలక్ట్రానిక్, ఆటో సంస్థలకు భారీగానే నష్టాలను తెచ్చిపెట్టింది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ తమ తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. జపాన్ లో వరుసగా సంభంవించిన భూకంపాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో సోనీ... తయారీ కేంద్రాలను మూసివేసింది. దక్షిణ ద్వీపప్రాంతం క్యుషు.. కుమామోటోలో నెలకొన్న సోనీ ప్రధాన ఉత్పత్తి కేంద్రానికి దగ్గరలో భూకంపం సంభవించడంతో తమ ప్లాంట్లలొ కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. యాపిల్ ఇంక్ సహా అనేక స్మార్ట్ ఫోన్ల తయారీదారులకోసం ఉత్పత్తి చేసే ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లను సోనీ తాత్కాలికంగా మూసి వేసినట్లు వెల్లడించింది. నాగసాకితోపాటు క్యుషులో ఉన్న తమ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేశామని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ఇంకా చెప్పలేమని ప్లే స్టేషన్ మేకర్ సోనీ తెలిపింది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తో కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చే 'కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్ సెమీ కండక్టర్' (సీఎంఓఎస్) ఇమేజ్ సెన్సార్లను క్యుషులోని సోనీ కేంద్రాల్లో తయారు చేస్తారు. ముఖ్యంగా యాపిల్ ఐ ఫోన్లలో వినియోగించే ఈ సెన్సార్లతో సోనీ.. 40 శాతం మార్కెట్ ను నియంత్రిస్తుంది. ప్రస్తుతం భూకంపంతో ప్లాంట్ల లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్లాంట్లను తిరిగి ఎప్పుడు తెరుస్తామో చెప్పలేమని సోనీ ప్రతినిధులు చెప్తున్నారు. తాము సప్లై నిలిపివేయడంవల్ల యాపిల్ వంటి కష్టమర్లపై ఎటువంటి ప్రభావం పడుతుందో చెప్పలేమంటున్నారు. మార్చి 2011 లో ఉత్తర జపాన్ లో సంభవించిన తీవ్ర భూకంపం, సునామీ.. ప్రభావం జపాన్ లోని ఆటో సరఫరా వ్యవస్థపై తీవ్రంగా పడింది. అప్పటినుంచీ కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి విధానాలను సవరించుకొని, భారీ నష్టాలు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతున్నాయి. ప్రస్తుతం భూకంపం ప్రభావంతో క్యుషులోని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలు కూడా తాత్కాలికంగా తయారీని నిలిపివేశాయి. జపాన్ లోని సెమీకండక్టర్ల ఉత్పత్తి సుమారు 25 శాతం వరకూ క్యుషులోనే జరుగుతుంది. దీంతో సోనీతోపాటు క్యుషులో స్థానికంగా నెలకొన్నఅనేక కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీని భూకంపం కారణంగా నిలిపివేశాయి. భూకంప నష్టాన్ని అంచనా వేసేవరకూ ఈ ప్లాంట్లు తిరిగి ప్రారంభించే అవకాశం కనిపించడంలేదు. శనివారం సంభవించిన ప్రకృతి విపత్తు ప్రభావం అనేక ఆటో మేకర్ సంస్థలపైనా పడింది. దీంతో ఆయా కంపెనీలు కూడ ఉత్పత్తిని నిలిపివేశాయి. హోండా మోటార్ కంపెనీ కూడ తమ కుమామోటో మోటార్ సైకిల్ ప్లాంట్ లో నష్టాన్ని అంచనా వేసేందుకుగాను తయారీని సోమవారం వరకూ నిలిపివేసినట్లు తెలిపింది. అలాగే టయోటా మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంట్ లో పెద్దగా నష్టం వాటిల్లకపోయినప్పటికీ పరిస్థితిని ఆదివారం వరకూ సమీక్షించాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపింది. -
‘యాంగ్రీబర్డ్స్’కు వాయిస్!
లాస్ ఏంజెల్స్: ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాక గేమ్స్ పూర్తి స్వరూపమే మారిపోయింది. ఆండ్రాయిడ్ ఓఎస్ లో ఓ గేమ్ యాంగ్రీబర్డ్స్ మన అందరికీ తెలిసిందే. అయితే యాంగ్రీబర్డ్స్ త్వరలో మాట్లాడబోతున్నాయని గేమ్ తెలిసిన వాళ్లు కాస్త ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అదేంటి యాంగ్రీబర్డ్స్ ఆటలో అవి మాట్లాడలేవు కదా.. కేవలం వాటి అరుపులు మాత్రమే వినిపిస్తాయి అని అనుకుంటున్నారా.. మీ సందేహం నిజమే. అయితే సోనీ పిక్చర్స్ సంస్థ త్వరలో యాంగ్రీబర్డ్స్ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతోంది. ఇందుకోసం హాలీవుడ్ ప్రముఖుల గొంతులను ఈ పక్షులకు అరువు ఇవ్వనుంది సోనీ. పెద్దగా ఎరుపు రంగులో ఉండే పక్షికి టెర్రెన్స్ అని పేరు పెట్టారు. ఆస్కార్ గ్రహీత సీన్ పెన్, టెర్రెన్స్కు గొంతునివ్వనున్నారు. జాసన్ సుడీకిస్, జోష్ గాద్, డాన్నీ మెక్బ్రైడ్, మ్యూజిక్ దిగ్గజం బ్లేక్ షెల్టన్, చార్లీ ఎక్స్సీఎక్స్లు కూడా తమ వాయిస్ను ఆ పక్షులకు ఇవ్వనున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. -
ఆమె.. విజయం
ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి... అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు.. ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. పురాణ, ఇతిహాసాల్లో చెప్పుకున్నట్లు ‘స్త్రీ.. శక్తి స్వరూపిణి’ అనే మాట నిజమవుతోంది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటున్న మహిళల స్ఫూర్తిదాయక కథనాలు... డాటర్ ఈస్ నాట్ ఏ టెన్షన్.. డాటర్ ఈస్ ఈక్వల్ టూ టెన్‘సన్స్’... ఈ కొటేషన్ ఇటీవల తరచూ సామాజిక మాధ్యమాల్లో లైక్లు, షేర్లు సంపాదించుకుంటోంది. వినడానికి, చదవడానికే కాదు ఈ కొటేషన్ నిజం కూడా! గతంలో మాదిరిగా తల్లిదండ్రులు కుమార్తె-కుమారులను వేర్వేరుగా చూడకపోరుునా అక్కడక్కడా అసమానతలు కనిపిస్తూనే ఉన్నారుు. అయితే, ఈ అసమానతలను కూడా జరుుస్తున్న వారెందరో ఉన్నారు. కుటుంబీకుల ప్రోత్సాహం, సమాజం నుంచి వస్తున్న అవకాశాలు వెరసి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థారుుకి చేరిన, కుటుంబాన్ని నడిపిస్తున్న కొందరు మహిళల విజయగాథలు నేటి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా పాఠకుల కోసం... ఫొటోగ్రఫీలో రా‘రాణి’ పోచమ్మమైదాన్ : క్షణం కన్నువాల్చకుండా ప్రయత్నిస్తేనే వినియోగదారుడు నచ్చేలా ఫొటో తీయడం సాధ్యమవుతుంది. దీనికోసం గంటల తరబడి నిల్చోవాల్సి వస్తుంది. అలాంటి ఫొటోగ్రఫీ రంగంలో పురుషులే నిలదొక్కుకోవడం కష్టం. కానీ వరంగల్కు చెందిన రాణి అలియాస్ సోని జిల్లాలోని మొదటి మహిళా ఫొటో, వీడియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుని ముందుకు సాగుతున్నారు. తొలుత ఫొటో.. ఆపై వీడియో 1997లో నగరంలోని దేశాయిపేటకు చెందిన పోలెపాక మధును రాణి వివాహం చేసుకుంది. అప్పటికే స్టూడియో నడిస్తున్న మధు.. నష్టాల కారణంగా మూసివేసి డీజిల్ మెకానిక్, డ్రైవర్గా జీవనం ప్రారంభించాడు. అయితే, ఇద్దరు కుమారులు జన్మించాక ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో పాలుపోని రాణి దృష్టి ఫొటోగ్రఫీ రంగం వైపు పడింది. అంతలోనే మధు దేశాయిపేట రోడ్డులో సోని పేరిట స్టూడియో తెరిచారు. అయితే, ఔట్ డోర్ కార్యక్రమాలకు భర్త వెళ్లినప్పుడు గిరాకీ వచ్చి తిరిగి వెళ్తుండడంతో బాధపడిన రాణి భర్త సహకారంతో ఫొటోగ్రఫీలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత వీడియో కూడా నేర్చుకుని పట్టు సాధించింది. ఇలా కార్యక్రమాలకు కూడా భర్తతో పాటు వెళ్తే ఆమె పలు అధునాతన కెమెరాలు ఆపరేట్ చేయడంలో కూడా నైపుణ్యం సాధించింది. ఈ మేరకు లయన్సక్లబ్, ఫొటోగ్రాఫర్స అసోసియేషన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారిక అవార్డు, యువజన సంక్షేమ శాఖ అవార్డులే కాకుండా ఎప్సన్ కంపెనీ ఫొటో షూట్లో సోని తీసిన ఫొటోకు ద్వితీయ బహుమతి లభించడం విశేషం. అలాగే, ఫొటోగ్రఫీ రంగంలో మరిన్ని మెళకువలు నేర్చుకునేందుకు హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో జరిగిన వర్కషాప్ల్లో రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవడం వల్లే ఫొటోగ్రఫీ రంగంలో రాణిస్తున్నట్లు తెలిపారు. మహిళలకే ప్రత్యేకమైన ఫంక్షన్లలో తనకే ప్రాధాన్యత ఇస్తుంటారని పేర్కొన్నారు. -
పేదల జీవితాలు మార్చేందుకే వారి పోరాటం
- మావోయిస్టు నేత కుమార స్వామి అంతిమ యాత్రలో వరవరరావు నర్సంపేట(వరంగల్ జిల్లా) నిరుపేదల జీవితాలను మార్చడానికే వూవోయిస్టులు పోరాటం చేస్తున్నారని విరసం నేత వరవర రావు అన్నారు. నాలుగు రోజుల క్రితం ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేట వుండలం భాంజిపేట గ్రామానికి చెందిన పుట్టపాక కుమార స్వామి... అతని భార్య సోనీ అంతిమ యాత్రలో వరవర రావు మాట్లాడారు. కుమారస్వామి, సోనీలు ప్రజల కోసం పోరాడుతూ మృతి చెందారని పేదల పక్షాన పోరాటం చేస్తూ.. శాఖ మూరి అప్పారావు, పుట్టపాక కుమారస్వామి, సోనీ లాంటి ఎందో మంది అమరులయ్యారని అన్నారు. కుమార స్వామి తన చిన్నతనంలో కలలు కన్న రాజ్యాన్ని ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేశాడన్నారు. విద్యార్థి దశలోనే కుమాక స్వామి రాడికల్ విద్యార్థి సంఘంలో చేరాడని, 1993లో అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిపారు.కుమార స్వామి దంపతుల మృత దేహాలు చూస్తే.. బుల్లెట్ గాయాలు, చిత్ర హింసలకు గురిచేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని అన్నారు. రాజకీయాల్లో పెత్తనం చేసే వారు.. కుమార స్వామి తల్లికి బదులు చెప్పాలన్నారు. ఎందరో అమరుల త్యాగాలతో రాజకీయ నాయకులు తెలంగాణలో అధికార పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. కాగా.. మావోయిస్టు దంపతులు పుట్టపాక కుమార స్వామి, అతని భార్య చింద్రీ లింగో అలియాస్ సోనీ అంత్యక్రియలు గురువారం స్వగ్రామంలో జరిగాయి. వీరి మృతదేహాలను గురువారం ఉదయం నుంచి భారీ ఎత్తున ప్రజలు సందర్శించుకున్నారు. కుమారస్వామి అన్న కుమారుడు దహన సంస్కారాలను నిర్వహించారు. అంతిమ యాత్రలో ప్రజాసంఘాల నాయకులు, అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు బాసిత్, వెంకన్న, రమేష్ చందర్, భారతక్క, సురేష్, పద్మకుమారి, భారతి, రంజిత్, అంజమ్మ, జ్యోతక్క, శాంత తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ బ్యాటరీ తయారు చేసిన సోనీ
స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల అవసరాల మేరకు శక్తిమంతమైన బ్యాటరీల తయారీ మొబైల్ఫోన్ కంపెనీలకు కష్టంగా మారింది. ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన కారణంగా ఒక రోజుకు సరిపడ బ్యాటరీ చార్జింగ్ ఉంచడం కష్ట సాధ్యమే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కొత్త సూపర్ బ్యాటరీని తయారుచేసినట్లు వెల్లడించింది. సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీల కంటే 40 శాతం ఎక్కువ శక్తిని ఈ బ్యాటరీలో నిల్వచేసే అవకాశం ఉన్నట్లు సోనీ ప్రకటించింది. ఈ బ్యాటరీల తయారీలో లిథియం- సల్ఫర్, మెగ్నీషియం-సల్ఫర్ మూలకాలను వాడినట్లు తెలిపింది. కొత్త విధానం ద్వారా బ్యాటరీలో తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని నిల్వచేసే అవకాశం ఉందని తెలిపిన సోనీ... ఇవి పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రావాలంటే మాత్రం 2020 వరకు ఆగాల్సిందే అని చెబుతోంది. గతంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కూడా సోనీ సంస్థ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.