Surabhi
-
వేడుకగా బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి జ్యోతి- సుమిత్ సూరి పెళ్లి (ఫొటోలు)
-
ప్రియుడిని పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోయిన్
ప్రముఖ హిందీ సీరియల్ నటి సురభి జ్యోతి పెళ్లి చేసుకుంది. దాదాపు ఐదేళ్లుగా ప్రేమిస్తున్న నటుడు సుమిత్ సూరితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఉత్తరాఖండ్లోని ఓ రిసార్ట్లో ఆదివారం వేదమంత్రాల సాక్షిగా ఈ శుభకార్యం జరిగింది. ప్రకృతి ఒడిలోనే వివాహం చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: 'కొండల్' సినిమా రివ్యూ (ఓటీటీ))ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్ బాజ్, కోయి లౌట్ కే ఆయా హై తదితర సీరియల్స్తో సురభి గుర్తింపు తెచ్చుకుంది. సుమిత్ సూరి విషయానికొస్తే.. 30కి పైగా యాడ్స్లో నటించాడు. 2013లో నటుడిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలు.. ద టెస్ట్ కేసు, హోమ్ వెబ్ సిరీసుల్లోనూ నటించాడు.ఐదేళ్ల క్రితం హాంజి-ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో సురభి-సుమిత్ కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది మేలో తమ బంధం గురించి బయటపెట్టారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే సహనటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
Surabhi Yadav: జ్ఞాపకాలకు జీవం..
ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైనా మరణిస్తే వారు వాడిన వస్తువులను జ్ఞాపకంగా భద్రపరచుకుంటాం. కొందరు ఆ వస్తువులు ఎందుకులే అని ఎవరికైనా ఇవ్వటమో.. అమ్మేయడమో చేస్తుంటారు. మీరట్కు చెందిన సురభి యాదవ్ మాత్రం తన అత్తగారు మరణించాక ఆమె గుర్తుగా ఉన్న వస్తువులను ఉపయోగంలోకి తెచ్చి, వాటికి తిరిగి జీవం పోయాలనుకుంది. అత్తగారి జ్ఞాపకాలుగా మిగిలిన వస్తువుల్లో 300 రకాల మొక్కలను పెంచుతూ.. ఇంటికి కొత్త కళను తీసుకొచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘మా అత్తగారు కోవిడ్ సెకండ్ వేవ్లో పోయారు. ఆవిడ లేని మా ఇల్లు కళ కోల్పోయినట్టు.. దిగులుగా అనిపించేది. ఇంట్లో మా అత్తగారు ఉపయోగించినవి, ఆమె సేకరించిన పాత్రలు చాలా ఉన్నాయి.అవి ఆమె 30ఏళ్ల కష్టానికి ప్రతీకలు. ఆవిడ జ్ఞాపకాలు. వాటికి కొత్తరూపం ఇచ్చి రోజువారీ వాడకంలోకి తెస్తే ఆవిడ మా మధ్య తిరిగినట్టే ఉంటుంది కదా.. ఎప్పటిలాగే ఇల్లు కళకళలాడుతుంది కదా అనిపించింది. అంతేకాదు దానివల్ల ఎంతోకొంత పర్యావరణానికి మా వంతు సాయం చేసినట్టవుతుంది అనిపించింది. అందుకే మా అత్తగారి కాలంనాటి సీసాలు, పాత్రలు, లాంతర్లు, ఫ్యాన్.. వంటివాటిని అందమైన ప్లాంటర్స్గా మార్చాను. నాకు ఎంతో ఊరట కలిగింది. ఒక అవగాహనా వచ్చింది.దాంతో మిగిలిన వస్తువుల్లో కొన్నిటిని అందమైన బొమ్మలుగా మార్చాను. ఇంకొన్నిట్లో మొక్కలను పెంచడం మొదలుపెట్టాను. ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్లో పూలు, కూరగాయలు సహా 300 రకాల మొక్కలున్నాయి. నేనేం పెద్ద గార్డెనర్ని కాదు. నాకు తోచినట్టుగా ఓ చిన్నతోటతో మా అత్తగారి ప్రపంచాన్ని సజీవంగా మార్చేశాను!’ అని చెబుతుంది సురభి యాదవ్. -
ధనశ్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశావ్! 'ఆమెతో ఉన్నదెవరు?'
ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది.. అలా ప్రేమ పక్షులకు పెద్దలనొప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. బుల్లితెర లవ్ బర్డ్స్ సురభి చందన- కరణ్ శర్మ 13 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దల సమ్మతితో జైపూర్లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మార్చిలో పెళ్లిపీటలెక్కిన ఈ జంట వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా సురభి.. స్విమ్మింగ్ పూల్లో భర్తతో జలకాలాటలు ఆడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.రోజుకో వ్యక్తితో..ఇది చూసిన కొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు. సురభిని.. క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీగా పొరపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇన్ఫ్లూయెన్సర్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితమే వేస్ట్ అవుతుంది. డిప్రెషన్లోకి వెళ్లిపోతావు. తను రోజుకో వ్యక్తితో ఎంజాయ్ చేస్తుంది' అని ఓ యూజర్ ఆగ్రహం వెళ్లగక్కాడు. మరో నెటిజన్.. 'ఈమె ధనశ్రీయా? నమ్మలేకపోతున్నాను.. సారీ చాహల్.. నువ్వు ఆమెను భాగస్వామిగా ఎంచుకుని తప్పు చేశావు' అని రాసుకొచ్చాడు.చాహల్ను ట్యాగ్ చేస్తూ..మరో వ్యక్తి ఏకంగా చాహల్ను ట్యాగ్ చేస్తూ.. 'నిన్ను ట్యాగ్ చేస్తున్నందుకు వెరీ సారీ.. కానీ చూశావ్గా.. ఇన్ఫ్లూయెన్సర్ను పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలా ఉంటుంది. అసలు ఇలా ఎవరైనా చేయగలరా?' అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధనశ్రీతో ఉన్న వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. ఇది చూసిన నటి అభిమానులు.. ఆమె ధనశ్రీ కాదు.. నటి సురభి చందన అని కామెంట్స్తో క్లారిటీ ఇస్తున్నారు.సీరియల్ కెరీర్సురభి చందన విషయానికి వస్తే.. 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్', 'ఖుబూల్ హై', 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' ధారావాహికల్లో నటించింది. బాబీ జాసూస్ చిత్రంతో వెండితెరపైనా మెరిసింది. కరణ్ శర్మ.. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే ధారావాహికలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Surbhi Chandna (@officialsurbhic) చదవండి: OTT: ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు.. వీకెండ్లో ఓ లుక్కేయండి! -
దేవుడు నాకోసమే పంపాడు, ముంబై వెళ్లిపోతున్నా: హీరోయిన్
మలయాళ హీరోయిన్ సురభి సంతోష్ పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్ను పెళ్లాడింది. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కొత్త లైఫ్ ప్రారంభిస్తున్న సురభికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి అనంతరం సురభి మాట్లాడుతూ.. 'మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మేము ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా నెలలు కావస్తోంది. ఒక ఆర్టిస్టును పెళ్లాడాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చివరకు ఆ కల నెరవేరింది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ అతడిని కలిసినప్పుడే నచ్చేశాడు.. తర్వాత ఇద్దరం ఒకరిగురించి ఒకరం తెలుసుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లయిపోయిందని సినిమాలకు దూరంగా ఉండిపోను. తర్వాత కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాను. అతడు నాకెంతో సపోర్ట్గా ఉంటాడు. ప్రస్తుతం నేను ముంబైకి షిఫ్ట్ అవుతున్నాను. హనీమూన్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు. అతడు నెక్స్ట్ మంత్ ఏదో షో కోసం హాంగ్కాంగ్ వెళ్తున్నాడు. నేనూ తనతోపాటు వెళ్తున్నాను. ఫస్ట్ టైమ్ అతడి లైవ్ షో చూడబోతున్నాను. నాకెలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్నానో అచ్చం అలాంటి మనిషినే ఆ దేవుడు నాకోసం పంపించాడు' అని సంబరపడిపోయింది. లాయర్ కాబోయి హీరోయిన్ కాగా తిరువనంతపురంలో పుట్టిపెరిగిన సురభి లాయర్ కాబోయి యాక్టర్ అయింది. బెంగళూరులో న్యాయవిద్యనభ్యసిస్తున్న సమయంలో తనకు అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీవైపు అడుగులేసింది. కుట్టనాదన్ మర్పప్పా, మై గ్రేట్ ఫాదర్, నైట్ డ్రైవ్, కినవల్లి, ఎన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ వంటి పలు చిత్రాలతో మెప్పించింది. అటు ఎల్ఎల్బీ కూడా పూర్తి చేసింది. చదవండి: పిచ్చి కుక్కలా జైల్లో వేద్దామనుకున్నారంటూ నటి ఆవేదన.. గీతూ రాయల్పై పరువునష్టం దావా! -
హీరోయిన్ సురభికి తప్పిన ప్రమాదం
హీరోయిన్ సురభికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఫలితంగా గాల్లో ఉన్న విమానం కంట్రోల్ తప్పి కిందపడబోయింది. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పి..ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని సురభి ఇన్స్టా వేదికగా తెలియజేస్తూ.. చావు నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చింది. ‘నేను విమానంలో ప్రయాణిస్తుండగా ఎప్పుడూ జరగని సంఘటన ఎదురైంది. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను. నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఫ్లైట్ కంట్రోల్ లో లేకుండా పోయింది. నాతో పాటు ఫ్లైట్ లో ఉన్నవాళ్ళంతా చాలా భయపడ్డారు. కానీ పైలెట్ జాగ్రత్త వల్ల సురక్షితంగా ల్యాండ్ చేశారు.కానీ కొన్ని గంటల తర్వాత పైలెట్ సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ చేశారు. ఆ ఘటనని ఊహించుకుంటేనే భయంగా ఉంది. చావు నుంచి తప్పించుకున్నాను. జస్ట్ మిస్. ఇలా జరగడంతో నాలో ఉన్న పాజిటివ్ థింకింగ్ మీద నాకు మరింత నమ్మకం పెరిగింది’ అని సురభి రాసుకొచ్చింది. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది సురభి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా సురభికి తగిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ కోలీవుడ్కి షిఫ్ట్ అయింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తోంది. చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తోంది. -
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
Women At Leisure: తీరిక వేళలో.. తీయటి జ్ఞాపకాలలో...
‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి తీరిక సమయాన్ని మించిన విలువైన సమయం లేదు’ అంటుంది సురభి యాదవ్. పని ఒత్తిడి లేని తీరిక సమయం మహిళలకు ఎలాంటిది? పాట నుంచి ఆట వరకు ప్రతి విన్యాసం, ప్రతి క్షణం అపురూపం. అలాంటి అపురూప కాలాన్ని ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ అందంగా అద్దం పడుతుంది.... మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన సురభి యాదవ్ ఐఐటీ–దిల్లీలో బయో కెమికల్ ఇంజనీరింగ్ చేసింది. పెద్ద చదువు చదువుకున్న తొలి మహిళగా తనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఊరు దాటి ఐఐటీ–క్యాంపస్లోకి అడుగుపెట్టిన సురభికి పెద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. ఎంతోమంది వ్యక్తులు, వందలాది పుస్తకాలు, కళలు... తన ఆలోచనలను విశాలం చేశాయి.. ‘థింకింగ్... రీడింగ్... రైటింగ్’ అనేది తన ప్రధాన వ్యాపకంగా మారింది. పై చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లిన సురభి అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత ఒక ఎన్జీవోలో కొంతకాలం పనిచేసింది. ఆ తరువాత ‘సఝే సప్నే’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ‘సామాజిక సేవ అనేది ప్రయోజనాన్ని ఆశించి చేసేది కాదు. అది మన జీవనవిధానంలో భాగం’ అని తండ్రి చెప్పిన మాటలు సురభి సామాజిక సేవారంగంలోకి రావడానికి కారణం అయ్యాయి. స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యే సురభి యాదవ్లో మంచి ఫోటోగ్రాఫర్ ఉంది. ఆమె తాజా ప్రాజెక్ట్ ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ తన తల్లి జ్ఞాపకాల స్ఫూర్తితో చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి గురించి బంధువులు, పరిచయస్తులతో మాట్లాడుతున్న క్రమంలో తల్లికి సంబంధించి తనకు తెలియని కొత్త విషయాలు ఎన్నో తెలిసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే తల్లిలో ఒక సరదా మనిషి ఉన్నట్లు తెలియదు. ఆమెకు ఈత వచ్చు అనే విషయం తెలియదు. ‘ఇలాంటి తల్లులు ఇంకా ఎంతమంది ఉన్నారో?’ అని ఆలోచిస్తున్నప్పుడు ‘ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. తీరికవేళలలో సురభి తల్లి తన పేరు ‘బసంతి’ని పేపర్ మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఆమె చదువుకోలేదు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులపై సంతకం పెడుతున్నప్పుడు ఆమె కళ్లలో గొప్ప వెలుగు కనిపించేది. ‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని తీరిక సమయంలో పరిశీలించాలి. అయితే పని ఒత్తిడి వల్ల ఆ తీరిక సమయాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకుంటే అరుదైన సందర్భాలను రికార్డ్ చేయవచ్చు. బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్ అలాంటి ప్రయత్నమే’ అంటుంది సురభి. ‘ఉమెన్ ఎట్ లీజర్’లో ఉన్న వెయ్యికిపైగా చిత్రాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసినవి. -
తెలుగు ప్రేక్షకులు రియల్ సినిమా లవర్స్
సంతానం, సురభి ప్రధాన తారాగణంగా ఎస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘డీడీ రిటర్న్స్’. ఈ చిత్రం ఈ ఏడాది జూలై 28న విడుదలై, తమిళంలో ఘన విజయం సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్లు కలిసి ఈ చిత్రాన్ని ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’ పేరుతో తెలుగులో ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో సంతానం మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులు రియల్ సినిమా లవర్స్. ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’ ఓ రోలర్ కోస్టర్ ఫన్ రైడ్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘రాజమౌళిగారి తమిళ వెర్షన్ ‘ఈగ’ సినిమాలో సంతానంగారు ఓ కీలక ΄ాత్ర చేశారు. ఆ సినిమాకు నేను డైలాగ్స్ రాశాను. దర్శకుడిగా ‘డీడీ రిటర్న్స్’ నా తొలి చిత్రం. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు ప్రేమ్ ఆనంద్. ‘‘మంచి కంటెంట్ ఉన్న డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఈ కోవలోనే ఈ చిత్రాన్ని ఆదరించి, విజయవంతం చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎన్వీ ప్రసాద్. -
మళ్లీ కామెడీ బాట పట్టిన సంతానం
నటుడు సంతానం ఇంతకు ముందు హర్రర్ డార్క్ కామెడీ నేపథ్యంలో రూపొందిన దిల్లుక్కు దుడ్డు, డీడీ–2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఆ తరువాత కామెడీకి భిన్నంగా నటించిన కొన్ని చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. దీంతో సంతానం మళ్లీ తనకు కలిసివచ్చిన కామెడీతోనే చేసిన చిత్రం డీడీ రిటర్న్స్. ఆర్కే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రమేష్కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో సురభి హీరోయిన్గా నటించారు. నటుడు మారన్, సేతు, మొటై రాజేంద్రన్, ఫెప్సీ విజయన్, మునీష్ కాంత్, ప్రదీప్ రావత్, రెడిన్ కింగ్స్ లీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రేమ్ ఆనంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఆప్రో సంగీతాన్ని, దీపక్ కుమార్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సంతానం మాట్లాడుతూ.. నేను నటించిన కొన్ని చిత్రాలు సంతానం సినిమాల మాదిరిగా లేవని కామెంట్లు వినిపించాయి.. అయితే డీడీ రిటర్న్స్ పూర్తిగా సంతానం చిత్రంలా యూనిట్ సభ్యులందరి సహకారంతో రూపొందించినట్లు చెప్పారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో ఒక్కో దెయ్యం ఒక్కో విధంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించారని పేర్కొన్నారు. చదవండి: ఈ బస్ డ్రైవర్ బిగ్బాస్లోకి -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్లో 2000 మీటర్ల స్టీపుల్చేజ్లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
హీరోయిన్ సురభి లెహంగా ధర తెలిస్తే గుడ్లు తేలేయాల్సిందే!
‘చలిగాలి చూద్దూ తెగ తుంటరీ.. (జెంటిల్మన్ సినిమా)’ అంటూ యువతను గిలిగింతలు పెట్టిన నటి సురభి పురాణిక్ గుర్తుండే ఉంటుంది.. వరుసగా మూడు సినిమాలు చేసి కాస్త స్లో అయింది. లాక్డౌన్ తర్వాత మళ్లీ బిజీ అయిపోయింది.. కన్నడ, తమిళ సినిమాలతో పాటు తెలుగు తెర మీదా కనిపించబోతోంది. తన యూనిక్ స్టయిల్ కోసం ఈ స్టార్ ఏ బ్రాండ్స్ను అనుసరిస్తుందో చూద్దాం.. కీర్తి కదిరె హైదరాబాద్కు చెందిన కీర్తి కదిరె సెలబ్రిటీస్కు ఫేవరెట్ డిజైనర్. తన పేరు మీదే ఫ్యాషన్ లేబుల్ను క్రియేట్ చేసుకుంది. వెడ్డింగ్ కలెక్షన్స్కు పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయ నేత కళ, ఆధునిక ప్రపంచ పోకడ.. ఈ రెండింటి పర్ఫెక్ట్ మ్యాచ్, మన్నికైన ఫాబ్రికే ఆ బ్రాండ్కి వాల్యూ. నాణ్యత, డిజైన్ను బట్టే ధరలు. ఆన్లైన్లో లభ్యం. ఫాష్యన్ జ్యూయెలరీ ఇది కూడా హైదరాబాద్కు చెందిన బ్రాండే. వ్యవస్థాపకురాలు ఐశ్వర్య. 2017లో ఇన్స్టాగ్రామ్, వాట్సప్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తన బ్రాండ్ జ్యూయెలరీ సేల్స్ను స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఇవే ఆ జ్యూయెలరీ అవుట్ లెట్స్. ఈ అవుట్ లెట్స్లాగే ఈ జ్యూయెలరీ ధరలూ అందుబాటులోనే ఉంటాయి. ఒకరకంగా అదే ఆ బ్రాండ్ వ్యాల్యూ. లెహెంగా సెట్ బ్రాండ్: కీర్తి కదిరె ధర: రూ. 1,28,000 జ్యూయెలరీ: గులాబీ రంగు ముత్యాల సెట్ బ్రాండ్: ఫ్యాషన్ జ్యూయెలరీ వెబ్ సిరీస్ ట్రెండ్ కూడా ఫాలో అవుతున్నాను. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ విషయంలో విజయశాంతే నాకు స్ఫూర్తి. – సురభి పురాణిక్ -
Surabhi Bharadwaj: విజయ వీచిక
సురభి తొమ్మిదో తరగతి వరకు అమ్మకూచి. ఎన్సీసీలో చేరింది... రెక్కలు విచ్చుకుంది. రైఫిల్ చేతిలోకి తీసుకుంది... టార్గెట్కు గురిపెట్టింది. లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా తీర్మానించుకుంది. ఆ లక్ష్యాల్లో ఓ మైలురాయి.. ప్రపంచ స్థాయి రజత పతకం జర్మనీలో ఎగిరిన త్రివర్ణ పతాకమే అందుకు నిదర్శనం. మధ్య తరగతి కుటుంబం నుంచి స్పోర్ట్స్ పర్సన్ తయారు కావడం అంటే సాధారణమైన విషయం కాదు. తనలో నేర్చుకోవాలనే తపన, సాధన చేయాలనే కసి తనలో రగిలే జ్వాలలాగ ఉంటే సరిపోదు. తల్లిదండ్రులకు కూడా అదే స్థాయిలో ఆకాంక్ష ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు ఉండాలి. పిల్లల క్రీడాసాధన, పోటీలకు తీసుకువెళ్లడం, స్కూల్లో ప్రత్యేక అనుమతులు తీసుకోవడం, మిస్ అయిన క్లాసుల నోట్స్ తయారీ వంటి పనుల కోసం పేరెంట్స్లో ఒకరు ఆసరా ఇవ్వాలి. కొన్ని క్రీడలకైతే ఖర్చు లక్షల్లో ఉంటుంది. స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితులుంటాయి. కఠోర సాధనకు తోడుగా ఈ సౌకర్యాలన్నీ అమరినప్పుడే క్రీడాకారులు తయారవుతారు. ఇన్ని సమ్మెట దెబ్బలకు ఓర్చి మెరిసిన వీచిక రాపోలు సురభి భరద్వాజ్. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ పోటీల్లో రజతంతో అంతర్జాతీయ వేదిక మీద మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించింది. ఇద్దరూ షూటర్సే! ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ వరల్డ్ కప్ 2022 పోటీలు జర్మనీలోని సూల్లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన సురభి హైదరాబాద్లో పుట్టి పెరిగింది. తండ్రి విష్ణు భరద్వాజ్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి. కుటుంబంలో క్రీడానేపథ్యం లేని సురభికి రైఫిల్ షూటింగ్కి బీజం ఆమె చదివిన కేంద్రీయ విద్యాలయ, ఉప్పల్ బ్రాంచ్లో పడింది. కుటుంబ సభ్యులతో సురభి సురభి కంటే ముందు ఆమె అక్క వైష్ణవి రైఫిల్ షూటింగ్లో చేరింది. అక్క స్ఫూర్తితో సురభి కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఢిల్లీలో ఎన్సీసీ షూటింగ్ పోటీల్లో ఇద్దరూ పాల్గొన్నారు. కేరళలో 2017లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇద్దరూ పాల్గొని నేషనల్స్కి క్వాలిఫై అయ్యారు. ఖరీదైన క్రీడాసాధనలో ఇద్దరిని కొనసాగించడం కష్టం కావడంతో తల్లిదండ్రులు సురభి ప్రాక్టీస్ మీద మాత్రమే దృష్టి పెట్టగలిగారు. సురభి శ్రమలో అమ్మానాన్నతోపాటు అక్క కూడా భాగం పంచుకుంటోంది. కాల పరీక్ష! సురభి డైలీ రొటీన్ ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది. వార్మప్ ఎక్సర్సైజ్లు చేసుకుని ఏడు– ఏడున్నరకంతా ఇంటి నుంచి ప్రాక్టీస్ కోసం గచ్చిబౌలికి బయలుదేరుతుంది. నాగోలులో మెట్రో రైలు, ఆటోరిక్షాలు పట్టుకుని పది గంటలలోపు హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న షూటింగ్ రేంజ్కు చేరుకుంటుంది. పది నుంచి ప్రాక్టీస్ మొదలవుతుంది. ఒంటి గంటకు లంచ్ బ్రేక్. తిరిగి రెండున్నర నుంచి ఐదున్నర వరకు ప్రాక్టీస్, ఇంటికి చేరేటప్పటికి రాత్రి తొమ్మిదవుతుంది. కోచ్ సూచించిన విధంగా ఆహారాన్ని సిద్ధం చేసి బాక్సులు పెడుతుంది తల్లి లావణ్య. మెట్రో లేని రోజుల్లో, సిటీ బస్సులో వెళ్లాల్సిన రోజుల్లో అయితే దినచర్య ఐదింటికే మొదలయ్యేది. సురభి షూటింగ్ ప్రాక్టీస్తోపాటు ఉస్మానియాలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతోంది. మినిమమ్ అటెండెన్స్ చూసుకుంటూ ఎక్కువ సమయం ప్రాక్టీస్కే కేటాయిస్తోంది. మెట్రోలో ప్రయాణించే సమయంలో పాఠాలను పూర్తి చేసుకుంటోంది. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నప్పటికీ కాలం పరీక్షల రూపంలో ప్రత్యేక పరీక్ష పెడుతుంది. షూటింగ్ పోటీలు, కాలేజ్ పరీక్షలు ఒకే సమయంలో వచ్చాయి. దాంతో ఐదవ సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోయింది. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్ ఫర్ గ్లోరీ నిర్వహిస్తున్న ప్రత్యేక లీప్ ప్రోగ్రామ్లో శిక్షణ తీసుకుంటోంది. ఖర్చు లక్షల్లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహించిన సురభి బంగారు పతకాన్ని సాధించింది. సౌత్ జోన్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్లో రజతాలను మూటగట్టుకుంది. రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్లో వాడే బుల్లెట్ దాదాపుగా 30 రూపాయలవుతుంది. కాంపిటీషన్లకు ముందు ప్రాక్టీస్లో రోజుకు యాభై నుంచి వంద బుల్లెట్లు వాడాల్సి ఉంటుంది. బ్లేజర్, ట్రౌజర్, షూస్, గ్లవుజ్ వంటివన్నీ కలిపి రెండు లక్షలవుతాయి. ఇక సురభి ఉపయోగించే పాయింట్ టూటూ వాల్టర్ రైఫిల్ ధర ఇరవై లక్షలు ఉంటుంది. సొంత రైఫిల్ లేకపోవడంతో సురభి అద్దె రైఫిల్తోనే ఇన్ని పోటీల్లో పాల్గొన్నది, పతకాలు సాధించింది. ఆమె ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కు అర్హత 2018లోనే సాధించింది. కానీ వెపన్ లేకపోవడంతో కొన్ని అవకాశాలను చేతులారా వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి క్రీడాకారులను మానసిక క్షోభకు గురి చేస్తుంది. సురభి వాటన్నింటినీ నిబ్బరంగా అధిగమించింది. మంచి రైఫిల్ అమరితే దేశానికి మరిన్ని పతకాలను తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. రైఫిల్ కావాలి! కాంపిటీషన్ల కోసం కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి, ఆహారానికి అలవాటు పడడం ప్రధానం. అలాగే విండ్ అసెస్మెంట్ కూడా గెలుపును నిర్ణయిస్తుంది. మన గురి లక్ష్యాన్ని చేరడంలో అసలైన మెళకువ గాలి వీచే వేగాన్ని కచ్చితంగా అంచనా వేయగలగడమే. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్లో మనదేశానికి పతకాలు సాధించడం నా ముందున్న లక్ష్యం. మా పేరెంట్స్ ఇప్పటికే వాళ్ల శక్తికి మించి ఖర్చు చేసేశారు. ప్రభుత్వం కానీ ఇతర స్పాన్సర్లు కానీ వెపన్కి సపోర్ట్ చేస్తే నేను నా ప్రాక్టీస్ మీద పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతాను. – రాపోలు సురభి భరద్వాజ్, షూటర్, వరల్డ్ కప్ విజేత – వాకా మంజులారెడ్డి. -
సోల్ ట్రేడ్..: ఉత్తమ అత్తాకోడళ్లు
చెన్నైలోని ఎస్ఆర్యం యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో సురభి సొంత వ్యాపారం గురించి కల కనేది. నిజానికి ఆమెది వ్యాపారనేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, తన ఆలోచనకు కుటుంబసభ్యులు పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ‘ఉద్యోగం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కాలం కలిసొస్తే అమెరికా వెళ్లి స్థిరపడిపోవచ్చు. వ్యాపారం చేయడమనేది పెద్ద రిస్క్. అందరికీ అది సాధ్యం కాదు’ అంటుండేవారు. అంతమాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సురభి. నిర్మాణ్ షాతో వివాహం అయిన తరువాత ఆమె ఇండోర్ (మధ్యప్రదేశ్)కు వెళ్లింది. అక్కడ అత్త రూపంలో తనకొక ‘అదృష్టం’ పరిచయం అయింది. అత్త చేత్న షా తనతో ఒక స్నేహితురాలిలా ఉండేది. అత్తగారితో తన ఆలోచన పంచుకుంది సురభి. ‘ఎందుకమ్మా రిస్క్’ అని అత్తగారు అనలేదు. కోడలి ఉత్సాహానికి మరింత ప్రోత్సాహం ఇచ్చింది. అలా ‘కారాగ్రీన్’స్టార్టప్కు అంకురార్పణ జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరిగే నష్టాల గురించి పుస్తకాల్లో చదవడమే కాదు, ఆ విషాదాన్ని కళ్లతో చూసింది సురభి. ‘ఎవరికి వారు ఇది నా సమస్య కాదు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అనుకుంటే సమస్య మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనలో నుంచి వచ్చిందే కారాగ్రీన్’ అంటుంది సురభి. ‘కారాగ్రీన్’ అనేది బయోడిగ్రేడబుల్ అంకుర సంస్థ. పర్యావరణహితమైన పెన్నులు, పెన్సిల్స్, సీడ్ పేపర్ డైరీలు, క్యాలెండర్లతో పాటు ప్యాకింగ్ సామాగ్రిని తయారు చేస్తారు. ఊహల్లో ఉన్న ప్రాజెక్ట్ కాగితం మీదికి రావడానికి, అక్కడి నుంచి వాస్తవరూపం దాల్చడానికి మధ్యలో సందేహాలు, సమస్యలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కోడలికి అండగా నిలిచి ముందుకు నడిపించింది చేత్న షా. ‘వ్యాపారంలో మన కుటుంబసభ్యుల అండ అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది సురభి. కట్ చేస్తే... షార్క్ ట్యాంక్ ఇండియా (బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్)లో ‘కారాగ్రీన్’ 50 లక్షల ఫండింగ్ ఆఫర్ను గెలుచుకుంది. -
ఆది సాయికుమార్కు భారీ షాక్.. ‘శశి’విడులైన తొలి రోజే..
హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన సినిమా ‘శశి’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మార్చి 19న (శుక్రవారం) ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా గత వారం మార్చి 12న విడుదలైన జాతిరత్నాలు మూవీకి షాక్నిస్తూ విడుదలైన తొలి రోజే పైరసి భూతం తాకింది. అయినప్పటికి బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కలెక్షన్ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఈసారి ‘శశీ’ మూవీకి కూడా భారీ షాక్ తగిలింది. విడుదలైన మొదటి రోజే ఈ మూవీ పైరసీ బారిన పడింది. ఇక ఈ మూవీతో పాటు ‘చావు కబురు చల్లగా’, ‘మోసగాళ్లు’ సినిమాలు కూడా విడుదల కావడం.. ఇప్పుడు ఈ పైరసీ భూతం వెంటడాటంతో ‘శశి’ మూవీ టీంకు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. అంతేగాక దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై పడే ప్రమాదం ఉంది. కాగా పైరసి వెబ్సైట్లు మూవీరూల్స్, తమిళరాక్స్తో పాలు పలు పైరసి వెబ్సైట్లలో ఈ మూవీ లింకులు వచ్చేశాయి. దీంతో ప్రేక్షకుల్లో అంతగా పాజిటివ్ టాక్ లేకపోవడంతో ఈ మూవీని థీయేటర్లో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చదవండి: బిగ్బాస్ భామకు కరోనా పాజిటివ్ పైరసీ కారణంగా రూ.2,100 కోట్ల నష్టం ‘జాతిరత్నాలు’ టీమ్కి భారీ షాక్ -
గ్లామర్ పాత్రలు రావడం లేదు: ‘శశి’ హీరోయిన్
‘‘శశి’ చిత్రనిర్మాతలు మొదట నాకు ఫోన్ చేసి కథ వినమన్నారు. ఆ తర్వాత దర్శకుడు శ్రీనివాస్ వచ్చి మూడు గంటలు ‘శశి’ కథ చెప్పారు. కథ వినగానే చాలా థ్రిల్ అయ్యి నటించేందుకు ఒప్పుకున్నాను’’ అని హీరోయిన్ సురభి అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురభి విలేకరులతో మాట్లాడుతూ -‘‘శశి’ రెగ్యులర్ ప్రేమకథా చిత్రం కాదు. అన్ని రకాల అంశాలున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తల్లితండ్రులు, కూతురు మధ్య ఉన్న ప్రేమను ఈ చిత్రంలో బాగా చూపించారు. నిజ జీవితంలోనూ నా తల్లితండ్రులకు నేనొక్కదాన్నే కావడంతో శశి పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. కూతురు పట్ల ఓ తండ్రి ఎంత రక్షణగా, బాధ్యతగా ఉంటాడన్నది ఆకట్టుకుంటుంది. నా తండ్రి పాత్రలో రాజీవ్ కనకాలబాగా నటించారు. ఈ సినిమాలో ఆది పాత్ర రగ్డ్గా ఉంటుంది. తన పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. నేను కూడా రెండు వేరియేషన్స్లో నటించడం కొత్తగా అనిపించింది. గ్లామర్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ‘ఓటర్’ సినిమాలో నాది గ్లామర్ పాత్రే. ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది. ‘శశి’ సినిమా విడుదల తర్వాత నాకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయనుకుంటున్నాను. తమిళంలో చేస్తుండడం వల్ల తెలుగులో ఎక్కువగా చేయలేకపోయా. తెలుగులో కొన్ని కథలు వింటున్నా. తమిళంలో 3 సినిమాలు చేస్తున్నాను. కన్నడ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఎంట్రీ ఇస్తున్నా. గోల్డెన్ స్టార్ గణేష్తో నటిస్తున్నాను’’ అన్నారు. -
'శశి' ట్రైలర్ విడుదల చేసిన పవన్ కల్యాణ్
హీరో ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన సినిమా 'శశి' లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ను పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 'మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభవుతుంది. ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం' 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆది లుక్స్ కొత్తగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. రాజీవ్ కనకాల హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. వెన్నెల కిశోర్ , తులసి, జయప్రకాష్, అజయ్, వైవా హర్ష , సుదర్శన్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రంలోని 'ఒకే ఒక లోకం నువ్వే' పాట ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూట్యూబ్లో ఇప్పటికే 60 మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకుపోతుంది. చంద్రబోస్ రచించిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మార్చి 19న ఈ చిత్రం థియేటర్స్లో విడుదల కానుంది. ఇక చాన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఆదికి 'శశి' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. చదవండి : (రణ్బీర్కి కరోనా... క్వారంటైన్లో ఆలియా!) (పవన్ కల్యాణ్ న్యూలుక్.. ఫొటో వైరల్) -
ఆవును సంరక్షించడంతో నా జీవితం మలుపు తిరిగింది
‘గంగి గోవు పాలు గరిటెడైనను చాలు..’ అంటూ వేమన శ్రేష్టమైన ఆవు పాల ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు. నాటు (దేశీ జాతి) ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి సర్వోత్తమమైనవన్న భావన ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. వీటినే ‘ఎ2 మిల్క్’ అని పిలుస్తూ.. అనేక దేశాల్లో అమృతసమానంగా చూస్తున్నారు. ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఎ2 పాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దేశీ ఆవు ఆర్గానిక్ పాల ఉత్పత్తిని పెంపొందించి, ఎ2 పాల ఉత్పత్తులను ‘ఏపీ గోపుష్టి’ పేరుతో దేశ విదేశాల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. నాటు ఆవుల సంతతిపై అవ్యాజమైన ప్రేమతో, అనురక్తితో ‘సురభి గోశాల’ ను నిర్వహిస్తున్న వల్లూరు రవికుమార్ ఈ పథకానికి సలహాదారుగా నియమితులయ్యారు. నాటు ఆవు పాల ఉత్పత్తితో పాటు శాస్త్రీయ పద్ధతిలో సంతతిని పెంపొందించుకునే పద్ధతులపై తన సుసంపన్నమైన అనుభవాలను ఆయన ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు. దేశీ ఆవుల్లో కొన్నే ‘గంగి గోవుల’ని ఆయన సూత్రీకరిస్తున్నారు.. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వల్లూరు రవి కుమార్(47) హైదరాబాద్లో ఓ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు. ఒక రోజు తమ ఇంటి ఎదుట ఒక నాటు ఆవుపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ ఆవును సంరక్షించి సపర్యలు చేయడంతో రవి జీవితం మలుపు తిరిగింది. తదనంతరం గుజరాత్లోని తోడల్లుడి దగ్గరకు వెళ్లినప్పుడు దేశీ గోజాతుల గురించి మరింత ఆసక్తి కలిగింది. దేశీ గోజాతుల సంరక్షణకు రవి కృషి అనుకోకుండా అలా ఆరంభమైంది. ఏడేళ్ల క్రితం ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వగ్రామం పేరికలపాడులో ‘సురభి గోశాల’ను రవి 4 ఆవులతో ప్రారంభించారు. 21 ఎకరాలు.. 125 ఆవులు.. సురభి గోశాలలో ఇప్పుడు 125 ఆవులు, ఆంబోతులు ఉన్నాయి అనే కంటే.. వాటితో రవి పూర్తిగా మమేకమై అనుదిన జీవనాన్ని పంచుకుంటున్నారు అంటే బావుంటుంది. 2.35 ఎకరాల్లో షెడ్లున్నాయి. వివిధ జాతుల గోవులు, ఆంబోతులకు అందులో వేర్వేరుగా ప్రత్యేక ఆవాస విభాగాలున్నాయి. పక్కనే ఉన్న 6 ఎకరాల్లో సూపర్ నేపియర్ గడ్డి పెంచుతున్నారు. 45 రోజులకోసారి కోస్తూ నిరంతరం పచ్చి గడ్డి అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. ఆవుల పేడను గుంతలో వేసి, చివికిన తర్వాత పొలాల్లో వేస్తున్నారు. గోమూత్రం బక్కెట్లతో పట్టుకుంటేనే స్వచ్ఛత, ఔషధ గుణాలు చెడకుండా ఉంటాయని రవి అన్నారు. వరి గడ్డి కొని మేపుతున్నారు. 60% పచ్చిమేత, 40ఋ% ఎండుమేత ఉండేలా చాప్ కట్టర్తో ముక్కలు చేసి రెండూ కలిపి ఆవులకు పెడుతున్నారు. పదెకరాల్లో సజ్జలు, పచ్చజొన్న, జె7 జొన్న, 3 ఎకరాల్లో పుల్ల శనగ, 3 ఎకరాల్లో వేరుశనగ పండించి.. దాణాకు వాడుతున్నారు. గిర్ జాతి ఆవులు ఎక్కువ సంఖ్యలో 79తోపాటు 7 ఆంబోతులు ఉన్నాయి. కాంక్రేజ్ ఆవులు 18, ఆంబోతులు 2 ఉన్నాయి. పుంగనూరు ఆవులు 3, ఒక ఆంబోతు ఉంది. రెడ్ సింధి ఆవులు 3, థార్పార్కర్ ఆవులు 3, ఒక ఆంబోతు ఉన్నాయి. 3 ఒంగోలు ఆవులు ఉన్నాయి. 115 ఆవుల్లో ఏ సీజన్లో అయినా కనీసం 30 ఆవులు పాలు ఇస్తూ ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా చూడి కట్టించడం చేస్తున్నామని రవి కుమార్ తెలిపారు. 15 చూడితో ఉంటాయి. 30 దూడలు (మూడేళ్ల లోపు) ఉంటాయి. వత్తిడి లేని గోపాలన నాటు ఆవుల పెంపకం పాల దిగుబడి వరకే పరిమితం చేసుకోకుండా దేశీ గో జాతుల జన్యు స్వచ్ఛత పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం రవి ప్రత్యేకత. వత్తిడి లేని గోపాలన పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారు. ఆవులను వేరే ప్రాంతం నుంచి కొని తెచ్చిన తర్వాత కొత్త మనుషులకు అలవాటు పడటానికి కనీసం 15 రోజులు పడుతుంది. రైతు స్వయంగా రోజుకు కనీసం 4–5 గంటల పాటైనా ఆవులతో మమేకం అవ్వాలి. ప్రతి ఆవుకు పేరు పెట్టాలి. ఆ పేరుతోనే పిలుస్తూ గంగడోలు సవరిస్తూ ఉంటే.. కొద్ది రోజుల్లోనే నాటు ఆవులు మచ్చిక అవుతాయి. వత్తిడి నుంచి బయటపడతాయి. ఆవులను ప్రేమగా నిమరాలి. రోజూ నిమిరే వ్యక్తిని గుర్తు పెట్టుకొని.. పేరుతో పిలవగానే పరుగెత్తుకుంటూ దగ్గరకు వస్తాయని రవి తెలిపారు. ఈ అనుబంధం ఏర్పరచుకుంటే ఆవులు వత్తిడికి గురికాకుండా.. సౌమ్యంగా, ఆనందంగా ఉంటూ అధిక పాల దిగుబడినిస్తాయన్నారు. ఫ్రీ లోఫింగ్ సిస్టం జన్యు స్వచ్ఛతను పరిరక్షించుకోవడానికి ‘ఫ్రీ లోఫింగ్ సిస్టమ్’ను రవి అనుసరిస్తున్నారు. కట్టేసి మేపరు. అన్నిటినీ కలిపి ఆరు బయట తిరగనివ్వరు. అలా తిరగనిస్తే రక్త సంబంధం ఉండే ఆవులను ఆంబోతులు ‘దాటే’ అవకాశం ఉంటుంది. దాని వల్ల ‘ఇన్బ్రీడింగ్’ జరిగి, జన్యు స్వచ్ఛత తగ్గిపోతుంది. పిడిగ్రీ నియమాలు ఇందుకు అనుమతించవు. అంటే.. ఏ జాతికి ఆ జాతిని వేర్వేరుగా ప్రత్యేక దొడ్ల(ఎన్క్లోజర్)లో ఉంచుతున్నారు. పాలిచ్చే ఆవులు, 7 నెలలు నిండిన చూడి ఆవులు, 9 నెలల లోపు దూడలు, మూడేళ్ల లోపు దూడలు, ఆంబోతులు.. ఇలా విభజించి వేర్వేరు విభాగాల్లో ఉంచుతున్నారు. ప్రతి ఆవుకు 15 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా 65“60 అడుగుల విస్తీర్ణంలో దొడ్లను నిర్మించారు. నీడనిచ్చే షెడ్తో పాటు ఎండ తగిలే ఖాళీ ప్రదేశం కూడా ఈ దొడ్డిలో ఉంటుంది. ఆవు తన ఇష్టం మేరకు ఎండలో, నీడలో బంధించినట్లు లేకుండా తిరుగాడుతూ స్వేచ్ఛగా ఉండటం వల్ల వత్తిడి ఉండదు. 4 ఏళ్లుగా పిడిగ్రీ నమోదు రవి ఏడేళ్లుగా సురభి గోశాలను నిర్వహిస్తున్నారు. అనేక విషయాల్లో అనుభవం గడించిన తర్వాత దేశీ గోజాతుల జన్యు స్వచ్ఛత పరిరక్షణకు ఉపక్రమించారు. గత నాలుగేళ్లుగా పిడిగ్రీ(జన్యు వంశకత)ని నమోదు చేస్తున్నారు. ప్రతి ఆవు, ఆంబోతు తల్లిదండ్రులు ఎవరు? వాటి లక్షణాలు, పాల ఉత్పత్తి సామర్థ్యం తదితర వివరాలను, వాటి ఫోటోలను శాస్త్రీయంగా నమోదు చేసి, కంప్యూటరీకరిస్తున్నారు. దేశీ గోజాతుల బ్రీడింగ్లోను, నాణ్యమైన పాల ఉత్పత్తిలోనూ రవి కుమార్ సాధించిన విజయం అసామాన్యం. పట్టుదల, శ్రద్ధ రవిని ఎ2 డెయిరీ రంగంలో విజయ తీరాలకు నడిపించాయి. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ దూడలే రైతుకు ఆస్తి దేశీ గోజాతులను పెంచే రైతులకు దూడలే పెద్ద ఆస్తి అని రవి భావిస్తున్నారు. పిడిగ్రీ ప్రకారం, పోషణ లోపం లేకుండా పెంచితే మూడేళ్ల పెయ్య దూడ ఒక్కోటి రూ. లక్షకు అమ్ముడు పోతుందని, అదే రైతుకు మంచి ఆదాయాన్ని ఇస్తుందని ఆయన స్వానుభవంతో చెబుతున్నారు. దూడకు ఒకటి లేదా రెండు రొమ్ముల పాలు పూర్తిగా వదిలెయ్యాలి. ఒక నెల అటు వైపు రొమ్ములు, మరో నెల ఇటు వైపు రొమ్ములు దూడకు అలవాటు చెయ్యాలి. 3 నెలల తర్వాత దూడ పాలు తాగటం తగ్గిస్తుంది. 6వ నెల నుంచి రోజుకు కిలో దాణా పెట్టాలి. ఆవు లేదా దూడ ఆరోగ్యం ఎలా ఉందో వాటిని, పేడను చూసి తెలుసుకోగలిగే అవగాహన రైతుకు ఉండాలి. టీకాలు షెడ్యూలు ప్రకారం వేసుకుంటూ.. మూడేళ్ల వరకు దూడలను కనిపెట్టుకొని ఉండాలి. ఈనిన తర్వాత 90 రోజుల్లో ఆవును కట్టించాలి. ఏడాదికో దూడ పుట్టాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే డెయిరీ రంగంలో నష్టాలకు ఆస్కారమే ఉండదు. గంగి గోవు నెయ్యిలో ‘కెరోటిని’ 3.2% రోజుకు 240 లీటర్ల పాల దిగుబడి వస్తోంది. ఉదయం పూట పాలను విజయవాడలో ఇంటింటికీ (లీ. రూ. వంద) పంపుతున్నారు. సాయంత్రం పాలను తోడుపెట్టి, మజ్జిగ చిలికి సంప్రదాయ బద్ధంగా వెన్న తీస్తారు. 40 డిగ్రీలకు మించని వేడితో కాచి నాణ్యమైన నెయ్యినిæతయారు చేస్తున్నారు (కిలో రూ. 2,700 – 3 వేలు). ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. నిబంధనల మేరకు 3 నెలలకోసారి పాలు, నెయ్యిలకు లాబ్ పరీక్షలు చేయిస్తారు. పాలలో ఎస్.ఎన్.ఎఫ్. 8–8.5%, కొవ్వు 4–4.5% వస్తుంటాయి. నెయ్యిలో ఇతర పౌష్టికాంశాలతో పాటు ‘కెరోటిని’ 3.2% ఉంటుంది. మనిషి దేహానికి విటమిన్ ‘ఎ’ సమృద్ధిగా సమకూరేందుకు ఇది దోహపడుతుంది. ఇది గంగి గోవు నెయ్యిలోనే ఉంటుంది. గేదె నెయ్యిలో ఉండదు అన్నారు రవి. మజ్జిగను దూడలకు కుడితిలో పోస్తారు. పుల్ల మజ్జిగను పంటలపై అవసరం ఉన్నప్పుడు పిచికారీ చేస్తారు. ఆవుతో రోజూ మాట్టాడాలి! నాటు ఆవులు సున్నితంగా ఉంటాయి. కొట్టకూడదు. ముల్లుగర్రతో పొడవ కూడదు. తిట్ట కూడదు. ముక్కుతాడు, సిగమారు వెయ్యకూడదు. రైతు రోజూ 4–5 గంటలు ఆవులతో ఉండాలి. పేరుతో పిలుస్తూ ప్రతి రోజూ కొద్ది నిమిషాలు నిమరాలి. ఆవులతో మమేకం కాగలగాలి. మేత కన్నా ఈ ప్రేమ ముఖ్యం. ఇలా చేస్తుంటే ఆవుపై వత్తిడి ఉండదు. పాల దిగుబడి బాగుంటుంది. ఆరోగ్య సమస్యలూ పెద్దగా రావు. కష్టపడే తత్వం ఉన్న రైతుకు నాటు ఆవుల గోశాల సంతృప్తిని, లాభాలను అందిస్తుంది. ఏ పేరు గల ఆవు ఎప్పుడు చూడి కట్టింది, ఏ రోజు ఎంత పాలిచ్చింది, ఆరోగ్య స్థితిగతులు.. అన్నీ రైతు స్వయంగా రోజూ డైరీలో రాసుకోవాలి. దానికి అనుగుణంగా ఏయే మార్పులు, చేర్పులు చేసుకోవాలో అర్థమవుతుంది. ఆవు ఆరోగ్య రక్షణ, మేత–దాణా లభ్యత, దూడల పోషణ, వత్తిడి లేని సంరక్షణ పద్ధతులు.. ఇవే నాటు ఆవు గోశాలల సక్సెస్ మంత్రాలు. గోశాలలో ఉన్న ఆవుల్లో మూడో వంతు ఆవులు రోజుకు 10 లీటర్ల పాలిచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. లీటరుకు రూ. 50 ధర లభిస్తే చాలు రైతు నిలబడతాడు. ఏపీ ప్రభుత్వ గో పుష్టి పథకం రైతులకు చాలా ఉపయోగకరమైనది. గోశాల వల్ల ఆర్థిక పుష్టితో పాటు సమాజంలో ఎంతో పెద్ద వారి నుంచి కూడా గౌరవ మర్యాదలు పొందుతున్నాను. భార్యా పిల్లల తోడ్పాటు నా విజయానికి మరో ముఖ్య కారణం. – వల్లూరు రవి కుమార్ (90300 17892), సురభి గోశాల వ్యవస్థాపకులు, పేరకలపాడు, కంచికచర్ల మం., కృష్ణా జిల్లా,ఏపీ ప్రభుత్వ గోపుష్టి ప్రాజెక్టు సలహాదారు. నాటు ఆవుల్లో గంగి గోవులు వేరు.. దేశీ జాతుల ఆవుల్లోనూ అన్నీ శ్రేష్టంగా ఉండవంటారు రవి. 100% సకల సద్గుణాలు కలిగిన ఆవును గంగి గోవు అంటారు. విశాలమైన గంగడోలు, మంచి మోపురం, సాధు స్వభావం, మనిషిని గుర్తుపట్టే నైజం.. ఈ లక్షణాలు 100% ఉంటే ‘గంగి గోవు’. ఈ లక్షణాలు 50–65% ఉంటే ‘గోవు’. ఈ లక్షణాలు అసలు లేకపోతే ‘ఆవు’ మాత్రమేనని రవి అంటున్నారు. -
ఒక లోకం... రెండు కోట్లు
‘‘పోలీస్ స్టోరీ’ సినిమా 25 సంవత్సరాల వేడుకకి వెళ్లినప్పుడు బెంగళూరులో ‘శశి’ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటని కన్నడలో తర్జుమా చేసి, వింటున్నారు. తమిళనాడులో కూడా ఈ పాటకు స్పందన చాలా బాగుంది. ఆది కెరీర్లో బెస్ట్ సాంగ్ ఇది. ఈ పాటలాగే ‘శశి’ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, సురభి హీరోయిన్గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించారు. అరుణ్ సంగీతం అందించారు. చంద్రబోస్ రాసిన ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట రెండు కోట్లకు పైగా వ్యూస్ దాటింది. ఈ సందర్భంగా ‘ఒకే ఒక లోకం..’ పాట సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘పాటను ఇంతలా ఆదరించినవారికి థ్యాంక్స్. మా నిర్మాతలు చాలా ప్యాషన్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ నాయుడు నందికట్ల. ‘‘2021లో ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాట అందరి మనసుల్ని గెలిచి రంజింపజేస్తో్తంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అరుణ్, కెమెరామేన్ అమర్నాథ్ బొమ్మిరెడ్డి, మాటల రచయిత రవి, స్క్రీన్ ప్లే రైటర్ మణి, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, నిర్మాత ఆర్.పి. వర్మ, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
నా బర్త్డే కేక్ నేనే తయారు చేసుకున్నా
‘ఎక్స్ప్రెస్ రాజా’ (2016), ‘జెంటిల్మేన్’ (2016), ‘ఒక్కక్షణం’ (2017) చిత్రాల్లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకున్నారు హీరోయిన్ సురభి. ఆ తర్వాత కెరీర్లో కాస్త నెమ్మదించినా ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడలో సినిమాలకు సైన్ చేసి, ఫుల్ స్పీడ్లో ఉన్నారు. నేడు సురభి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సురభి చెప్పిన విశేషాలు. ► గత ఏడాది నా బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గానే జరిగాయి. కానీ ఈ ఏడాది లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లలేం. ముంబైలో వర్షాలు కూడా పడుతున్నాయి. సో... ఈ ఏడాది నా బర్త్డే వేడుకలు ముంబైలోని మా ఇంట్లో మా తల్లిదండ్రుల సమక్షంలో జరుగుతాయి. ప్రతి ఏడాది నా బర్త్డే వేడుకల్లో నా స్నేహితులు పాల్గొనేవారు. ఈసారి వారిని బాగా మిస్ అవుతున్నాను. ► లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నాం. చాలా సమయం కూడా దొరికినట్లయింది. దీంతో కొత్త వంటకాలు నేర్చుకున్నాను. వంటలు చేయడానికి మా అమ్మగారు హెల్ప్ చేస్తున్నారు. పానీపూరి, చాట్, వడపావ్.. ఇలా చాలా ఐటమ్స్ చేశాను. విశేషం ఏంటంటే... నా బర్త్డేకి నా కేక్ను నేనే తయారు చేసుకున్నాను. కుకింగ్ కాకుండా ఇంకా పెయింటింగ్స్ వేశాను. గార్డెనింగ్ పనులు చూసుకుంటున్నాను. సమ్మర్ హాలీడేస్లా అనిపిస్తోంది. కుటుంబంతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. నా గురించి కూడా నేను ఆలోచించుకునే వీలు దొరికింది. ► ‘ఒక్కక్షణం’ తర్వాత నాకు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ కథలు నచ్చలేదు. అయితే వేరే భాషల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా చేస్తోన్న ‘శశి’ చిత్రంలో నటిస్తున్నాను. ‘శశి’ మంచి ప్రేమకథా చిత్రం. వైజాగ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. లాక్డౌన్ తర్వాత వాటిని పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇంకా తమిళంలో జీవీ ప్రకాష్కుమార్, కన్నడలో గణేశ్ హీరోలుగా చేస్తోన్న సినిమాల్లో నటిస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. లాక్డౌన్ తర్వాత వాటిపై స్పష్టత వస్తుంది. ► ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించాలని ఉంది. ఇటీవలే ఓ కథ విన్నాను. ఇంకా ఫైనలైజ్ కాలేదు. పోలీసాఫీసర్ పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలని ఉంది. ఈ విషయంలో నాకు విజయశాంతిగారు స్ఫూర్తి. యాక్షన్ సినిమాల్లో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేశారు. తెలుగులో నా ఫేవరెట్ యాక్టర్స్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్చరణ్, నాని, శర్వానంద్... ఇలా చాలామంది ఉన్నారు. ► వెబ్ సిరీస్ ట్రెండ్ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్కు స్కోప్ ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్ సిరీస్ కూడా చేస్తాను. -
శశి కథేంటి?
డిసెంబర్ 23 ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తాజా చిత్రం ‘శశి’ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు చిత్రబృందం. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు. ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. గుబురు గడ్డంతో కోపంతో అరుస్తున్న పోజులో ఉన్న ఫొటోను ఫస్ట్ లుక్గా విడుదల చేశారు. ‘‘లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో ఆది డిఫరెంట్గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: అరుణ్ చిలువేరు, కెమెరా: అమర్నాథ్ బొమ్మిరెడ్డి. -
ఇదీ భారతం
బహుముఖ సాంస్కృతిక భారతాన్ని..ఆచారాల భారతాన్ని.. సహజీవన భారతాన్ని.. ఆధ్యాత్మిక భారతాన్ని.. బహుజనుల భారతాన్ని మొదటిసారి దూర్దర్శన్లో చూపిన షో ‘సురభి’. సిద్ధార్థ్ కక్, రేణుకా సహాని యాంకర్లుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ♦ భారతీయ సంగీత దర్శకుడు, వయోలినిస్ట్ డా.ఎల్ సుబ్రమణ్యమ్ సురభికి సంగీతాన్ని అందించారు ∙ఈ కార్యక్రమాన్ని అమూల్ సంస్థ స్పాన్సర్ చేయడంతో ‘అమూల్ సురభి’ అని పేరు పడిపోయింది ♦ దీర్గకాలం ప్రసారమైన సాంస్కృతిక సీరీస్గా సురభి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు చేసుకుంది. ఇప్పుడంటే వంటకాలకో చానెల్, సంగీతానికో చానెల్, భక్తికి ఓ చానెల్, పర్యటనకు ఓ చానెల్.. ఇలా ప్రతీ అంశానికి సంబంధించిన చానెల్స్ విడివిడిగా ఉన్నాయి. కానీ, దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇవన్నింటినీ ఓ ప్రోగ్రామ్ ద్వారా అందించింది దూరదర్శన్. భారతీయ సంస్కృతిని వెలుగులోకి తెచ్చి కొత్తగా దేశభక్తిని ఆవిష్కరించింది. ఈ నేలలో పాదుకున్న నీతి, సామాజిక విలువలను కళ్లకు కట్టింది. ఈ థీమ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియన్ టెలివిజన్ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన, అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమంగా ‘సురభి’ అలా ఇండియన్ టెలివిజన్ చరిత్రలో సగౌరవంగా నిలిచిపోయింది. ఎంచుకున్న అంశాలు విభిన్న స్వభావాలతో కూడినవి కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ‘సురభి’ అపార ఖ్యాతిని పొందింది. ఎక్కువకాలం ప్రసారం ప్రతి ఆదివారం బుల్లితెర స్క్రీన్పై యాంకర్లుగా సిద్ధార్ద్ కక్, రేణుకా సహానీలు చిరునవ్వులు చిందిస్తూ 30 నిమిషాల సేపు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. కొత్త కొత్త వ్యక్తులను, ప్రదేశాలను, సంప్రదాయాలను, మనిషి సృష్టించిన అద్భుతాలను చూపేవారు. ఆ సమయంలో సీరియల్సన్నీ సాధారణ కుటుంబ సంబంధాల నేపధ్యంతో వచ్చేవి. సురభి ఒక్కటే వీటికి భిన్నంగా వచ్చింది. 1990లో మొదలైన సురభి 2001 వరకు దాదాపు 415 ఎపిసోడ్లతో అత్యంత ఎక్కువ కాలం ప్రసారమైన షో గా రికార్డులను సొంతం చేసుకుంది. పోస్ట్.. పోస్ట్ ‘సురభి’ షో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందడం వెనుక మరో కృషి ఉంది. షో చివరలో తామడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపమని ప్రేక్షకులను కోరడంతో పోస్టుకార్డు వ్యవస్థ కొత్త ఊపిరి పోసుకుంది. ప్రతీవారం ప్రేక్షకులను క్విజ్ కాంటెస్ట్లో పాల్గొనెలా చేయడంతో ‘సురభి’ రేటింగ్ అమాంతం రాకెట్లా దూసుకుపోవడం ఆరంభించింది. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడంతో జనం 15 పైసల పోస్టుకార్డును ఇలాంటివాటికి ఉపయోగించేవారు. వారానికి దాదాపు పదిన్నర లక్షల పోస్టుకార్డులు ప్రేక్షకుల నుంచి దూరదర్శన్కి అందేవి. ఈ పోటీలో పాల్గొనడానికి ఒక్కో కార్డ్కు 2 రూపాయల ధరతో ‘కాంపిటిషన్ పోస్ట్కార్డ్స్’ను పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా జారీచేయాల్సి వచ్చింది. అలా ఇండియన్ టెలివిజన్ చరిత్రలో ప్రజల నుంచి అత్యధిక ఆదరణ పొందిన కార్యక్రమంగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుచేసుకుంది సురభి. 90ల కాలంలో ఒక బెంచ్ మార్క్ షోగా మారింది. ఈ షో తర్వాత కక్ ఫోర్డ్ ఫౌండేషన్ సహాయంతో సురభి ఫౌండేషన్ను ఏర్పాటు చేసి, సాంస్కృతిక కళాఖండాలను పరిరక్షించే ప్రాజెక్ట్ను ప్రారంభించారు. చిరునవ్వుల సురభి ఆమె చిరునవ్వు సురభికి ఒక నక్షత్రంలా అమరింది. అప్పటికే ఆమె 1989లో టెలివిజన్ సీరియల్ సర్కస్లో నటించింది. ఆ సీరియల్ మంచి ప్రజాదరణ పొందింది. అటు తర్వాత సురభితో ప్రజాదరణను సుస్థిరం చేసుకుంది. సురభి మొదలైన రెండేళ్లకు ఆమె ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 350 ఎపిసోడ్లను తన ఖాతాలో జమ చేసుకుంది. ఆమె.. నటి, దర్శకురాలు రేణుకా సహానీ. సురభి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహానీ ‘మళ్లీ అలాంటి రోజులను, అలాంటి షోను తిలకించలేం. దేశ సంస్కృతి, చరిత్రకి అసలు సిసలు భాష్యం చెప్పింది నాటి దూరదర్శన్. గతాన్ని చూపుతూ భవిష్యత్తుకు బంగారంగా నిలిచింది’ అన్నారు. నిర్మాత, వ్యాఖ్యాత ఈ షో గురించి నిర్మాత, వ్యాఖ్యాత సిద్ధార్థ్ కక్ మాట్టాడుతూ ‘నాటి రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా మాట్లాడే స్వేచ్ఛ మాకు ఉండేది. దీని వల్లే విస్తృతంగా ప్రేక్షకులతో సంభాషించాం. భారతీయ సంస్కృతి సమగ్ర దృక్పథాన్ని సరైన సందర్భంలో ప్రదర్శించాం. ఈ ప్రయాణంలో మాకున్నది తక్కువ కమ్యూనికేషన్ కానీ ప్రజలతో కలిసి ఎక్కువ కాలం ప్రయాణించాం. ముందే ఎంచుకున్న ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ చిన్న చిన్న వివరాలు సైతం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని చిత్రించేవాళ్ళం. చివరికి మా కష్టం ప్రేక్షకులకు అర్ధమైంది. దీంతో వారు మాకు సహకరించారు’ అని ఆనందంగా గతాన్ని గర్తు చేసుకుంటారు సిద్ధార్థ్. ఒక్క చిరునవ్వు సురభి ప్రయాణంతో రేణుకా సహానీ ‘హమ్ ఆప్ హై కౌన్, తున్ను కి టీనా.. వంటి సినిమాలోనూ నటించింది. 2009లో మరాఠీ చిత్రం ‘రీటా’కు దర్శకత్వం వహించింది. రేణుకా సహానీ సినిమాలలో నటించినా, సామాజిక, రాజకీయ సమస్యలపై బలమైన అభిప్రాయాలను వినిపించినా ఇప్పటికీ సిసలైన గుర్తింపు అంటే అది ‘సురభి’ వల్లే. రేణుకా సహానీ మాట్లాడుతూ ‘మొబైల్ ఫోన్లు, టెక్నాలజీ ఇప్పుడున్నంతగా అప్పుడు లేదు. ప్రజలు వినోదం, మంచి కథలు ఉన్న కార్యక్రమాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. మేం వాటికనుగుణంగా కంటెంట్లో సర్దుబాటు చేశారు. మొదట మా వ్యాఖ్యాన్యం చాలా సాధారణంగా ఉండేది. సురభి మొదలైన రెండేళ్లకు నేను వచ్చాను. కొన్ని ఎపిసోడ్స్ పూర్తయ్యాక సిద్దార్థ గారు, నేను షోను ప్లెజెంట్గా మార్చాలంటే ఏం చేయాలని ఆలోచించాం. అందుకు చిరునవ్వుతో యాంకరింగ్ చేయాలన్నారు. అలా మొదలైంది నా ప్రయాణం. ఒక్క చిరునవ్వు నా జీవితాన్నే మార్చేసింది. బాంబేలో పుట్టి పెరిగిన నేను విదేశాల్లో చదువుకున్నాను. ఈ షో ద్వారా నేను నా దేశం గొప్పతనాన్ని స్వీయ అన్వేషణతో తెలుసుకోగలిగాను. దేశమంతా తిరిగాను. నాగరికత ఆనవాళ్లు, తరాతరాల గొప్పతనం తెలుసుకున్నాను. ఈ ఉద్యమంలో నేనూ భాగమైనందకు గర్వంగా ఉంది’ అన్నారు . వారపత్రిక వారం వారం అనేక సాంస్కృతిక అంశాలతో అలంరించే సురభిని ఒక వీక్లీ మ్యాగజైన్తో పోల్చుతారు. భారతీయ సంస్కతిలో భాగమైన సంగీతం, నృత్యం, శిల్పం, ప్రజల జీవనవిధానం, వంటకాలు, చేతిపనులు.. ప్రతీ అంశాన్ని ఈ షోలో కవర్ చేశారు. అవన్నీ ఇప్పుడు ఎన్నో చానెల్స్ అనుసరిస్తున్నాయి. ఆ కాన్సెప్ట్ ఇప్పటికీ రకరకాల చానెల్స్లో నడుస్తూనే ఉంది. ఇన్ని కార్యక్రమాలకు ‘సురభి’ ఒక్కటే సమాధానమైంది. అంతేకాదు, సురభిని సాధ్యం చేసిన మరో విషయం ఏమిటంటే సామాన్య ప్రజల నుండి ఈ షోకు లభించిన భారీ మద్దతు. పట్టణ కేంద్రాలకే కాదు మారుమూల ప్రాంతాలకు ప్రయాణించింది సురభి. అక్కడి ప్రజలు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సంస్కృతి, చరిత్ర మనకు వారసత్వంగా వచ్చింది. వాటిని మనం మార్చలేం. ప్రజలే స్వయంగా వచ్చి సంస్కృతిని అందించడానికి సహాయపడ్డారు. కొన్నింటిని ప్రజలే నేరుగా వచ్చి మార్పులు చేయడానికి సహకరించారు. తమ ఆలోచనలను షో నిర్వాహకులతో పంచుకున్నారు.– ఎన్.ఆర్. -
నీ చూపే చల్లని చిరుగాలై...
‘బీరువా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సురభి... ఎక్స్ప్రెస్రాజా, ఎటాక్, జెంటిల్మెన్... సినిమాలతో సుపరిచితమయ్యారు. తాజాగా ‘ఓటర్’ సినిమాతో ఆకట్టుకున్న సురభి ముచ్చట్లు... నా బలం: పేరెంట్స్ ఇష్టమైన నటి: మాధురీ దీక్షిత్ కష్టమైన పాత్ర: మొదటి సినిమాలో చేసింది. నటి కాకపోయి ఉంటే: కచ్చితంగా నటినే! మరో సందేహమే లేదు!! సమయం దొరికితే: మ్యూజిక్ వింటాను. నెట్ఫ్లిక్స్ చూస్తాను. సౌత్లో నచ్చిన నటి: అనుష్కా శెట్టి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్: సహనం. నాలో ఓపిక, సహనంలాంటివి చాలా తక్కువ. సినిమాల పుణ్యమా అనే సహనాన్ని అలవర్చుకున్నాను. నచ్చిన డైరెక్టర్లు: ఈ జాబితా చాలా పెద్దది గురూ! ఫ్యాషన్ సెన్స్: సింపుల్గా ఉండాలి. బాడీకి సూట్ కావాలి. అతిగా ఉండకూడదు. నచ్చిన ప్రదేశం: గ్రీస్ నచ్చిన గాయని: లతా మంగేష్కర్ నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్: ఏఆర్ రెహమాన్ హైదరాబాదీస్: 1. సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. 2. భోజనప్రియులు. 3. మంచి మనసున్న మనుషులు బాగా ఆడే ఆట: క్యారమ్స్ బాగా చూసే ఆట: రేసింగ్ గేమ్స్ మ్యూజిక్లో ఇష్టపడే జానర్: జాస్ నచ్చే పేరు: లిపిక ఫస్ట్ క్రష్: హృతిక్ రోషన్ నచ్చే పానీయం: స్ట్రాబెర్రీ బలహీనత: నా స్వీట్నెస్? సూపర్ పవర్ ఉంటే?: ఎదుటి వాళ్ల మనసులను చదువుతాను. ఫెవరైట్ స్పైస్: గ్రీన్చిల్లీ ఫెవరెట్ టీవీ షో: కపిల్శర్మ షో బోధించడానికి ఇష్టపడే సబ్జెక్ట్: సైకాలజీ ఊత పదాలు: సా...ర్, అచ్ఛా చేయాలనుకునే రోల్స్: ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్: ఇది వ్యక్తులను బట్టి మారుతుంది. రెండిట్లో ఏది ఉత్తమం అనేదాన్ని పక్కన పెడితే...పెళ్లికి ముందు భాగస్వామి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఎలాంటి భర్త కావాలి: జెంటిల్మెన్గా ఉండాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. తాను చేసే పనిని గౌరవించాలి. ‘ఆడవాళ్లు వంటింటికే పరిమితం’ అనే భావం ఉండకూడదు. ఇష్టమైనది: ప్రకృతి ఆరాధన. -
ఆంధ్ర నాటకానికి నవ వసంతాలు
ఆంధ్ర నాటక కళాపరిషత్... నాటక కళ క్షీణ దశకు చేరుతున్న తరుణంలో నాటక పునరుజ్జీవం లక్ష్యంతో భారతదేశంలోనే తొలిగా తెనాలిలో ఏర్పాటైన నాటక సంస్థ. రంగస్థల నాటకానికి పునర్వికాసం కల్పించి తెలుగుదేశాన నాటక కళ పరిఢ విల్లేందుకు అవిరళ కృషే చేసింది. ఆధునిక సమాజంలో ఇంకా నాటకం అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నదంటే ఇలాంటి సంస్థల కృషి ఫలితమే. ఇంతటి ఘనచరిత్ర కలిగిన సంస్థను దశాబ్దకాలం కిత్రమే పునరుద్ధరించారు. ఎనిమిది దశాబ్దాల ఉత్సవాలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 90 వసంతాల వేళ, విజయవాడ మొగల్రా జపురంలోని సిద్ధార్థ కళాపీఠంలో గురువారం నుంచి నాలుగురోజులపాటు జాతీయ బహుభాషా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నందున ఆంధ్ర నాటక కళాపరిషత్ ఆవిర్భావం, కృషిని గుర్తు చేసుకోవటం సందర్భోచితం... ఇతర రాష్ట్రాల నుంచి... పూర్వం ఇతర రాష్ట్రాల నుంచి నాటక కంపెనీలు వచ్చి ఆంధ్ర దేశంలో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. 1880 తర్వాత తెనాలితో సహా అయిదారు పట్టణాల్లో నాటక కంపెనీలు ఏర్పాటయ్యాయి. పురాణాల నుంచి కథాంశాలను ఎన్నుకొని నాటకాలను తీసుకొచ్చారు. జాతీయోద్యమ ప్రభావంతో పౌరాణిక అంశాలతో నాటకాలను రూపొందించి, సందర్భోచితంగా బ్రిటిష్ వారిని దుయ్యబడుతూ వచ్చారు. ఆ రకంగా తెలుగునాట నాటక ప్రదర్శనలు విస్తారంగా జరుగుతున్న 1919లోనే నాటక పోటీలు ఆరంభమయ్యాయి. నాటక ప్రాభవం క్రమేపీ తగ్గిపోవడానికి, అపసవ్య ధోరణులకు ఈ పోటీలే దారితీయటం విశేషం! ఏ నటుడు ఎక్కువసేపు రాగం తీస్తే, ఆ నటుడికే ప్రేక్షకుల నుంచి ‘వన్స్మోర్’ వస్తుండటంతో నాటకానికి అర్ధం మారింది. నటనకు ప్రాధాన్యత తగ్గి గానం, సంగీతమే ప్రధానమైంది. నాటకాలు పాటకచేరీలు అన్నట్టుగా తయారయ్యాయి. నటులను సంస్కరిస్తే నాటకాలు బాగుపడతాయన్న భావనతో 1924లో తొలిసారిగా విజయవాడలో నాటక పాఠశాల ఏర్పాటుచేసి శిక్షణనిచ్చిన తర్వాత కూడా పద్ధతి మారలేదు. నటులు వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడారు. వైషమ్యాలు పెరిగి, నాటక సమాజాలు నష్టాల్లో పడ్డాయి. క్రమంగా మూతపడ్డాయి. సినిమాలు అప్పుడప్పుడే వస్తున్నందున కొందరు ఆ రంగానికి వెళ్లారు. నాటకరంగం అధోగతిలో పడింది. నాటక రంగంలోని అపసవ్య ధోరణులను అరికట్టడానికి అనేకులు రకరకాలుగా ప్రయత్నించారు. ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం’ అనే ఆశయంతో ఔత్సాహికులు రంగంలోకి దిగి తెలుగు నాటకం ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషిచేశా రు. నాటక సంస్కరణలకు మార్గాలను అన్వేషించారు. ఇలాంటి తరుణంలో ‘సురభి’ నాటక కంపెనీ పితామహుడు వనారస గోవిందరావు ఆరునెలలపాటు కష్టపడి రాష్ట్రంలోని ప్రముఖులను కూడగట్టి, ఎంతో వ్యయంచేసి ‘ఆంధ్ర నాటక కళా పరిషత్’ ఆవిర్భావానికి దోహదపడ్డారు. సంస్థ ఆవిర్భావ సభలు 1929 జూన్ 19, 20, 21 తేదీల్లో తెనాలిలో వైభవంగా నిర్వహించారు. దశమార్చిన మారిన సభలు మూడురోజుల సభలతో ఆంధ్ర నాటక కళాపరిషత్, తెలుగు నాటక రంగానికి దశ, దిశానిర్దేశం చేసింది. స్పష్టమైన నియమాలను రూపొందించింది. పరిషత్ నిర్వహణతో రాష్ట్రంలో ఔత్సాహిక సమాజాలు వందలకొద్దీ పుట్టుకొచ్చాయి. కొత్త రచయితలు, నటీ నటులు, సంగీత కళాకారులు నాటక రంగంలోకి అడుగుపెట్టారు. పరిషత్తుల్లో బహుమతులు సాధించిన రచయితలు, నటులకు సినిమారంగంలో ప్రవేశం లభించింది. మొదటి సభలకు అతిథులు వీరే.. బుర్రా శేషగిరిరావు, వక్కలంక అచ్యుతరావు, భమిడిపాటి చిన యజ్ఞనారాయణ శర్మ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు సుబ్బారావు, తల్లావఝుల శివశంకరశాస్త్రి, కాళ్లకూరి గోపాలరావు, బళ్లారి రాఘవ ప్రభృతులు హాజరయ్యారు. మొదటిరోజు ‘నాటక రచన’, రెండోరోజు ‘నటన’, చివరిరోజున ‘నాటక ప్రయోగం’ అంశంపై చర్చలు జరిగాయి. ప్రతిరోజు రాత్రి నాటకాలను ప్రదర్శించారు. ముగింపు సభలో ‘దేశోద్ధారక’ కాశీనాధుని నాగేశ్వరరావు, గోవిందరావు, ఆచంట సాంఖ్యాయన శర్మ, చట్టి చినపూర్ణయ్య పంతులు, విశ్వనాధ కవిరాజు, కొత్తపల్లి లక్ష్మయ్య, నీలంరాజు వేంకట శేషయ్యతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వనారస గోవిందరావును ‘ఆంధ్ర నాటక కళోద్ధారక’ బిరుదుతో సత్కరించారు. తెనాలి నేపధ్యమే ప్రేరణ.. ‘సురభి’ నాటక సమాజం నాటక ప్రదర్శనలిస్తూ తెనాలికి వచ్చిన సందర్భంలో ఆ కంపెనీ నిర్వాహకుడు వనారస గోవిందరావుకు ఇక్కడి సాంస్కృతిక వాతావరణం నచ్చింది. అందుకే ఇక్కడ కళాపరిషత్ ఆవిర్భావానికి కృషి చేశారు. సాహితీ సమితి ఏర్పాటై ఉంది. రచయితలు, కళాకారులు, నాటక సమాజాలు ఉన్నాయి. తెనాలి నుంచి అప్పట్లో 20 వరకు దిన, వార, మాసపత్రికలు వెలువడుతుండేవి. ఇంత అనుకూలంగా ఉన్నందునే పరిషత్ విజయవంతమైంది. – నేతి పరమేశ్వరశర్మ, సీనియర్ కళాకారుడు పరిషత్ అనుమతిస్తే గొప్పే! ఆ రోజుల్లో ఆంధ్ర నాటక కళాపరిషత్లో ప్రదర్శనకు ఏదైనా నాటకానికి అనుమతి లభించిందంటే గొప్ప గౌరవంగా భావించేవారు. ‘కాళరాత్రి’, ‘మరో మొహంజదారో’, ‘ఎన్జీవో’, ‘ఈనాడు’, ‘దొంగవీరడు’, ‘పల్లెపడుచు’, ‘అన్నాచెల్లెలు’, ‘మావూరు’, ‘ఎదురీత’, ‘పెత్తందారు‘, ‘నటనాలయం’, ‘కనక పుష్యరాగం’, ‘కళ్లు’ వంటి అద్భుత కళాఖండాలు తెలుగు నాటక రంగంలో వెలుగులోకి రావడానికి కళాపరిషత్ దోహదపడింది. తర్వాత 1951 లో మున్సిపల్ చైర్మన్ నన్నపనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మళ్లీ తెనాలిలో నాలుగురోజులు ఆంధ్ర నాటక కళాపరిషత్ సభలు జరిగాయి. ఆవిర్భావ సభల్లో పాల్గొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సభలను, పోటీ నాటకాలను సినిమా దర్శకుడు వైవీ రావ్ ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్, ఆ నాటి సభల్లో నృత్యం చేయటం మరో విశేషం. కళారంగంలో జాజ్వలమానంగా ప్రకాశించేందుకు ఎంతో కృషిచేసిన ఈ పరిషత్ పదేళ్లు విరామం అనంతరం, బొల్లినేని కృష్ణయ్య, అన్నమనేని ప్రసాదరావు సారధ్యంలో పూర్వవైభవానికి కృషిని కొనసాగిస్తోంది. ఆ క్రమంలో 2009లో తెనాలిలో ఎనిమిది పదుల నాటకోత్సవాలను జరుపుకోవటం విశేషం. -
బెదిరింపులతో ఓటర్ని ఆపలేరు
‘‘ఓటర్’ సినిమా విడుదల కాకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాని ఆపాలని బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆపేది లేదు. అనుకున్న ప్రకారం నేడు విడుదల చేస్తున్నాం’’ అన్నారు ప్రశాంత్ గౌడ్. మంచు విష్ణు, సురభి జంటగా నటించిన చిత్రం ‘ఓటర్’. కార్తీక్ దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో అడ్వకేట్ వేణుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో జాన్ సుధీర్ పూదోట, కార్తీక్పై 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థ కోర్టులో కేసు వేసింది. సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. సినిమా విడుదల విషయంలో అభ్యంతరం చెప్పకుండా కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది’’ అన్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘12ఏళ్లుగా డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా, ఫైనాన్షియర్గా ఉన్నాను. నాపై ఇప్పటివరకూ ఎలాంటి వివాదాలు లేవు. ఓటర్ విలువ చెప్పే చిత్రం ఇది. ఈ పాయింట్ నచ్చి కొనుక్కున్నా. లీగల్గా విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్తో ఉన్న పరిచయాలతో సినిమాని విడుదల చేస్తున్నా’’ అన్నారు. -
నాయకుడు పనిచేయకపోతే!
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ముఖ్యమైనది. అటువంటి ఓటు విలువను తెలియజేసేలా రూపొందిన చిత్రం ‘ఓటర్’. విష్ణు, సురభి హీరోహీరోయిన్లుగా నటించారు. రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహించారు. సార్థక్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయనుంది. ‘‘పదవిలో ఉన్న నాయకుడు సరిగా పని చేయకపోతే అతనితో ఎలా పనులు చేయించుకోవాలో తెలిపే చిత్రం ఇది. ఓటు హక్కు, ఓటర్ విలువను తెలియజేస్తూనే, ఈ చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా కార్తీక్ బాగా తెరకెక్కించాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సార్థక్ మూవీ సంస్థ మా సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఎస్ఎస్. తమన్ స్వరకర్త. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమాల. -
సందేశం + వినోదం
విష్ణు మంచు ఓటర్గా మారారు. ఓటర్గా ఓటు ప్రాముఖ్యతను చెప్పదలిచారు. ఇదంతా ‘ఓటర్’ సినిమా కోసమే. విష్ణు మంచు, సురభి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఓటర్’. జి.ఎస్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ పూదోట నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూ/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాను జూన్లో రిలీజ్ చేయనున్నాం అని నిర్మాత తెలిపారు. ఈ సందర్బంగా నిర్మాత సుధీర్ మాట్లాడుతూ –‘‘ఓటు విలువ, ఓటర్ గురించి చెప్పే చిత్రమిది. చక్కని సందేశంతో పాటు వినోదం పంచే చిత్రం. దర్శకుడు కార్తీక్ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు. సంపత్, నాజర్, ప్రగతి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
మారాలి.. మార్చాలి
‘ఓటర్’... ఈ టాపిక్తోనే ప్రస్తుతం దేశ రాజకీయాలు హాట్ హాట్గా ఉన్నాయి. అతి త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ‘ఓటర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మంచు విష్ణు. రమా రీల్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. జి.ఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. ‘అహింసా మార్గం ద్వారా ఒక్క బులెట్ కూడా కాల్చకుండా స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది.. మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు... మార్పు మనలో రావాలి.. మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయాల నాయకులని..’ అంటూ ఆవేశంతో విష్ణు ఈ టీజర్లో డైలాగ్స్ చెప్పారు. టీజర్లో హీరోతో విలన్ ‘నన్ను ట్రాక్లో పెట్టటానికి ఎవడ్రా నువ్వు’ అంటే... ఓటు వేసిన వేలును చూపిస్తూ ‘చుక్క కనపడట్లేదా... ‘ఓటర్’ అంటాడు హీరో. విలన్ ‘ఆఫ్ట్రాల్ ఓటర్’ అంటే ‘ఆఫ్ట్రాల్ ఓటర్ కాదు, ఓనర్’ అంటుంది విష్ణు పాత్ర. మంచు విష్ణు సరసన సురభి జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి యస్.యస్. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల. -
ఏప్రిల్లో ఓటింగ్
రాజకీయ నాయకులు పదవిలోకి రావాలన్నా, పోవాలన్నా ఓటే ముఖ్యం. అది వేసే ఓటర్ మరింత ముఖ్యం. ప్రస్తుతం ఓటును, ఓటర్ బాధ్యతను గుర్తు చేస్తూ మంచు విష్ణు ఓ చిత్రంలో నటించారు. ‘ఓటర్’ అనే టైటిల్తో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాకు జి.ఎస్.కార్తిక్ దర్శకత్వం వహించారు. సురభి కథానాయిక. జాన్సుధీర్ పూదోట నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత జాన్ సుధీర్ మాట్లాడుతూ – ‘‘మంచు విష్ణు తొలిసారి నటించిన పొలిటికల్ డ్రామా ఇది. ఓటు విలువను తెలియజేసే చిత్రం. షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: రాజేష్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల. -
అరె కలరుఫుల్లు చిలకా!
‘బీరువా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సురభి... ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘ఎటాక్’, ‘ఒక్క క్షణం’... సినిమాలతో మరింత చేరువయింది. ‘ఓటర్’ సినిమాతో మరోసారి పలకరించనున్న సురభి ముచ్చట్లు... పాడుతా తీయగా! చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఇష్టం. పాటలు పాడటం, పియానో ప్లే చేయడం, పెయింటింగ్ వేయడం, డ్యాన్స్ చేయడం...ఇలా రకరకాల అభిరుచులు ఉండేవి. పేరెంట్స్ ప్రోత్సాహం బాగా ఉండేది. ఇప్పటికీ నా స్ట్రెంత్ పేరెంట్సే. నా అభిమాన తార మాధురిదీక్షిత్. ఢిల్లీలో ఉన్నప్పుడు మోడలింగ్ చేశాను. నటనలో కూడా శిక్షణ తీసుకున్నాను. గజిని 2లో... మోడలింగ్ చేస్తున్న టైమ్లో ఒక తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. నటి కావాలనే నా కల అలా నిజమైంది. ఇప్పటికీ టఫ్ రోల్ అంటే నా తొలి సినిమాలో చేసిన ‘మాలిని’ పాత్ర అంటాను. పేజీల కొద్ది తమిళ డైలాగులు నోటికి చెప్పేదాన్ని. లిప్సింక్ చక్కగా కుదిరేది. దీంతో దక్షిణాది సినిమాల్లో నటించగలను అనే నమ్మకం ఏర్పడింది. ‘‘ఇక్కడ ఎక్కువమందితో ఫ్రెండ్షిప్ చెయ్, వారితో తమిళ్లోనే మాట్లాడు...అప్పుడు చకచకా మాట్లాడగలవు’’ అని డైరెక్టర్ మురగదాస్ సలహా ఇచ్చారు. అప్పుడు నేను... ‘‘సార్, గజిని 2 ఎప్పుడు తీస్తున్నారు? అందులో నన్ను తీసుకుంటారు కదా!’’ అన్నాను. ఆయన నవ్వారు. పాఠాలేన్నో నేర్చుకొని... సులభంగా ఏది దరికి చేరదు అని నమ్ముతాను. సినిమాల్లో నటించాలనేది నా కల. నా కల కోసం అవకాశాలు వెదుక్కుంటూ రావు కదా! అందుకే ఎన్నో ఆడిషన్ టెస్ట్లకు హాజరయ్యాను. ఫలితం మాట ఎలా ఉన్నా పట్టుదలగా ముందుకు వెళ్లాను. ప్రతి ఆడిషన్ టెస్ట్ నుంచి పాఠాలు నేర్చుకున్నాను. తీరికవేళల్లో సంగీతం వింటాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కదా! ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలా అనుకున్నారు... చిన్నప్పుడు సంగీతం మీద నా ఆసక్తిని చూసి... ‘‘మా అమ్మాయి భవిష్యత్లో మ్యూజీషియన్ అవుతుంది’’ అనుకున్నారు పేరెంట్స్. బొమ్మలు వేయడం చూసి... ‘‘పెయింటర్ అవుతుంది’’ అనుకున్నారు! కానీ ‘‘నువ్వు ఇది కావాలి.... అది మాత్రమే చదవాలి’’ అని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. మా పేరెంట్స్ అడ్వర్టైజింగ్ రంగానికి చెందినవారు. ఆ క్రియేటివ్ జీన్స్ నాకు వచ్చాయేమో! డిస్కవరింగ్ ‘నువ్వు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేయవచ్చు కదా!’ అని సన్నిహితులు సలహా ఇస్తుంటారు. ‘ఎలాంటి పాత్ర చేయాలి?’ అనే దాని గురించి నాకేమీ గందరగోళం లేదు. నటిగా ముందు నన్ను నేను డిస్కవరింగ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నా. -
కొత్త లవ్స్టోరీ
ఆది సాయికుమార్, సురభి జంటగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొంద నున్న సినిమా ప్రారంభోత్సవం రీసెంట్గా జరిగింది. పి.ఆర్. వర్మ సమర్పణలో చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మించనున్నారు. ‘‘తొలిసారిగా ఆది, సురభి కలిసి నటించనున్నారు. లవ్స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ఆరంభం కానుంది. రావు రామేష్, ప్రియా, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆదితో జతకట్టనున్న సురభి!
శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఆది జోడిగా సక్సెస్ఫుల్ హీరోయిన్ సురభి నటించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతమందిస్తున్న ఈ మూవీలో రావు రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
శ్రీనివాస కల్యాణంలో?
‘బీరువా, ఎక్స్ప్రెస్ రాజా, జెంటిల్మతన్, ఒక్క క్షణం’ చిత్రాల్లో అందం, అభినయంతో ఆకట్టుకున్న సురభి తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నార ట. నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయిలకు చోటు ఉందట. ఓ హీరోయిన్గా పూజా హెగ్డేని ఖరారు చేశాయట చిత్రవర్గాలు. మరో హీరోయిన్గా సురభిని సెలెక్ట్ చేశారని ఫిల్మ్నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
నవ్వుల ఝరిలో...
రాజమహేంద్రవరం నగరం నవ్వుల విరిజల్లుల్లో తడిసి ముద్దయింది. వైశ్యా హాస్టల్ నూతన భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్టార్ నైట్ కార్యక్రమంలో బుల్లితెర హాస్య కళాకారులు ఆద్యంతం నవ్వులు పండించి, ప్రేక్షకులను ఆనందాల గోదారిలో ముంచెత్తారు. సినీ హాస్యనటుడు బ్రహ్మానందంతోపాటు, హీరోయిన్ సురభి, హాస్యనటులు, యాంకర్లు ఆలీ, ఆది, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రష్యన్ కళాకారుల ప్రదర్శన ఆకట్టుకొంది. తాడితోట (రాజమహేంద్రవరం): వైశ్య హాస్టల్ నూతన భవనం నిర్మాణానికి ఏర్పాటు చేసిన స్టార్ నైట్ అలరించింది. ఆదివారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివ రామసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో లాలా చెరువులో వైశ్య హాస్టల్ నూతన భవనం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్టార్ నైట్ అలరించింది. హాస్టల్ విద్యార్థుల సౌజన్యంతో స్టార్ నైట్ నిర్వహించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందం పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీఘాకోళపు శివ రామ సుబ్రహ్మణ్యంను అభినందించారు. తాను ఒంగోలులో వైశ్య హాస్టల్లో చదువుకున్నానని, వైశ్యులంటే తనకు అపార గౌరవమని పేర్కొన్నారు. ప్రముఖ హాస్య నటుడు ఆలీ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఏ కార్యక్రమం జరిగినా తనకు ఆహ్వానం అందుంతుందని, తాను పాల్గొన్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. జబర్దస్త్ బృందం సభ్యులు ఆది, రాంప్రసాద్, పొట్టి రమేష్, రోబోలు పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయని సునీత, ప్రముఖ టీవీ యాంకర్లు రవి, శ్రీముఖి, నటి సురభి పాల్గొన్నారు. రష్యన్ కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ కళాకారులు సినిమా పాటలకు నృత్యాలు చేశారు. అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, అడిషనల్ ఎస్పీ రజనీకాంత్ రెడ్డి, సెంట్రల్ డీఎస్పీ కులశేఖర్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ భరత్ మాతాజీ, శ్రీనివాసరావు, వైశ్య హాçస్టల్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కోట్ల కనకేశ్వరరావు, కార్యదర్శి సత్యవరపు సత్యనారాయణ మూర్తి, కోశాధికారి మడవిల్లి శివ, వైశ్య ప్రముఖులు మన్యం ఫణికుమార్, వంకాయల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నా నమ్మకం నిజమైంది – అల్లు శిరీష్
‘‘నా కెరీర్లో 2017కి చాలా ప్రత్యేకత ఉంది. మలయాళ సినిమా ‘1971 బియాండ్ బోర్డర్’లో మోహన్లాల్గారితో నటించా. నా పాత్రకి మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 28న విడుదలైన ‘ఒక్కక్షణం’ నాకు మరచిపోలేని సినిమాగా నిలిచింది’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘గౌరవం’ సరైన విజయం అందుకోలేదు. దాంతో కొత్తగా చేద్దామనే ఆలోచన తగ్గిపోయింది. ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ వంటి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశాక మళ్లీ ధైర్యం తెచ్చుకుని, ఏదైనా కొత్తగా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ‘ఒక్కక్షణం’ చేశా. ఈ రోజు నా నమ్మకం నిజమైంది. సినిమా చూసినవారందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్లోనూ మంచి సినిమాలు చేయాలనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులు సహా అందరికీ థ్యాంక్స్. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు, సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఒక్కక్షణం’ సక్సెస్తో 2018కి మేం సంతోషంగా స్వాగతం పలికేలా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సీరత్ కపూర్. నిర్మాత చక్రి చిగురుపాటి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
కసి ఉన్నవాళ్లతో పనిచేస్తే ఎనర్జీ వస్తుంది
‘‘ఒక్కక్షణం’ సినిమాకి వస్తున్న ఫీడ్బ్యాక్, రెస్పాన్స్తో హ్యాపీగా ఉన్నా. ప్రత్యేకించి ఈ సినిమాలోని కథతో పాటు హీరో గురించి మాట్లాడుతున్నారు. ఓ యాక్టర్గా అది నాకు బాగా అనిపించింది. గత సినిమాలకంటే ఈ సినిమాలో నటుడిగా ఎదిగావు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయంటుంటే వెరీ హ్యాపీ’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఈ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన విశేషాలు. ► ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడా. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నప్పుడు ఆనంద్ ‘ఒక్కక్షణం’ కథ తీసుకొచ్చారు. తను కథ చెప్పిన విధానం నచ్చి వెంటనే ఓకే చెప్పేశా. ఆ తర్వాత నాన్నగారు (అల్లు అరవింద్) కథ విని బాగుందన్నారు. అన్నయ్యకి (అల్లు అర్జున్) స్టోరీ లైన్ తెలుసు. కథ పూర్తిగా తెలీదు. ఫస్ట్ కాపీ చూసి బాగుందన్నారు. ► ‘ఒక్కక్షణం’ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యమైంది. అయితే సినిమాపై నమ్మకంతో వేరే ఏ సినిమా నేను ఒప్పుకోలేదు. ప్యారలల్ లైఫ్ పాయింట్ కొత్తగా అనిపించింది. కథను నేను బాగా నమ్మడంతో ఇన్వాల్వ్ అయి చేశా. కథకి అవసరం మేరకే మూడు ఫైట్స్ ఉన్నాయి. అవి అనవసరం అనిపించవు. ► ఆనంద్ చెప్పిన కథని అంతే చక్కగా తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత ఆయనపై నాకు మరింత గౌరవం పెరిగింది. అమ్మ సెంటిమెంట్ సీన్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. కెమెరామ్యాన్ శ్యాం కె.నాయుడుతో పనిచేయాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరింది. మరో సినిమాకి ఆయనతో పనిచేయనున్నా. ఈ చిత్రంలో సంగీతం కంటే నేపథ్య సంగీతానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మణిశర్మగారు చాలా బాగా చేశారు. ఆయనలా ఎవరూ చేయలేరు. ► ప్రమోషన్ సాంగ్ను ఇంటర్వెల్ తర్వాత పెట్టాలని షూట్ చేశాం. లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. ఎండింగ్ టైటిల్స్ అప్పుడు ఆ పాట ఉంటుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు తీసేశాం. ► లవ్స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టం. అన్నీ అటువంటివే చేయాలని కాదు. నా పాత్ర కొత్తగా ఉండాలి. వైవిధ్యమైన సినిమాలు చేస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. ► మంచి పాత్ర అయితే వేరే హీరోల సినిమాలో చేయడానికి రెడీ. నా సినిమాలో ఏ హీరో చేయడానికైనా అభ్యంతరం లేదు. మల్టీస్టారర్ మూవీ కథలను రచయితలు రాయడం లేదు. మలయాళంలో ‘1971’ సినిమాలో మోహన్లాల్గారితో కలిసి నటించడం మరచిపోలేను. ‘ఒక్కక్షణం’ మలయాళంలో డబ్బింగ్ చేయడానికి అక్కడివారు ముందుకొచ్చారు. ► ఓ నిర్మాత కొడుకుగా అది కావాలి.. ఇది కావాలి.. అంటూ నేను నిర్మాతలను డిమాండ్ చేయను. ప్రాజెక్ట్పై ఎంత శ్రద్ధ ఉంటుందో పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్పైనా అంతే శ్రద్ధ పెట్టమని చెబుతానంతే. ► నాన్నగారు వేరే హీరోతో హిట్ సాధించారంటే ఓ కొడుకుగా సంతోషిస్తా. అదే నేను హీరోగా చేసిన సినిమా హిట్ అయిందంటే నాకు మరో పది రెట్లు సంతోషంగా ఉంటుంది (నవ్వుతూ). ► కొత్త డైరెక్టర్లతో పనిచేయాలనే ఎగై్జట్మెంట్ ఉంది. ఇప్పుడొస్తున్న మంచి సినిమాలన్నీ కొత్తవారి నుంచి వస్తున్నవే. ఆనంద్ ఓ కొత్త డైరెక్టర్లా కష్టపడ్డాడు. అంత కసి ఉన్నవాళ్లతో పనిచేస్తుంటే ఎనర్జీ వస్తుంది. కొత్త, పాత డైరెక్టర్లు చెప్పిన రెండు మూడు కథలు విన్నా. నెలలోపు ఫైనలైజ్ చేస్తా. నేను క్రమశిక్షణతో పనిచేస్తా. కొత్త ఏడాది నుంచి మరింత క్రమశిక్షణగా పనిచేయాలనుకుంటున్నా. -
'ఒక్క క్షణం' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక్క క్షణం జానర్ : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తారాగణం : అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : విఐ ఆనంద్ నిర్మాత : చక్రి చిగురుపాటి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ అల్లు వారబ్బాయి కాస్త గ్యాప్ తీసుకొని ఓ డిఫరెంట్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎక్కడిపోతావు చిన్నవాడా లాంటి హర్రర్ థ్రిల్లర్ ను రూపొందించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించాడు. సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు జీవితాలు ఒకే విధంగా ఉండటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అల్లు శిరీష్ కు మరో విజయాన్ని అందించిందా..? విఐ ఆనంద్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఆకట్టుకుందా..? కథ : జీవా (అల్లుశిరీష్) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగి. అమ్మా నాన్నలతో సరదాగా కాలం గడిపే జీవాకు ఓ రోజు ఇనార్బిట్ మాల్ లోని బేస్మెంట్ పార్కింగ్ పిల్లర్ నంబర్ బి 57 దగ్గర జ్యోత్స్న(సురభి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. తరువాత వాట్సప్ చాటింగ్ లతో మరింత దగ్గరవుతారు. వారి ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. తనచుట్టూ ఉన్న మనుషులను చూస్తూ టైం పాస్ చేసే జ్యోకి తమ అపార్ట్మెంట్ లోని పక్క పోర్షన్ లో ఉంటున్న శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్)ల మధ్య ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన జీవా, జ్యోత్స్నలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. (సాక్షి రివ్యూస్) సరిగ్గా ఏడాది క్రితం శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఏ సంఘటనలు అయితే జరిగాయో అవే సంఘటనలు జీవా, జ్యోత్స్నల జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతుంటాయి. మహ్మద్ ఆస్తేకర్ (జయప్రకాష్) అనే ప్రొఫెసర్ ద్వారా ప్యారలల్ లైఫ్ గురించి తెలుసుకొని తన జీవితం కూడా స్వాతి జీవితం లాగే అవుతుందని భయపడుతుంది జ్యో. అదే సమయంలో స్వాతి తన అపార్ట్మెంట్ లో హత్యకు గురవుతుంది. ఆ హత్య శ్రీనివాసే చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. దీంతో జీవా తనను చంపుతాడని మరింత భయపడుతుంది జ్యో.. స్వాతిని నిజంగా శ్రీనివాసే చంపాడా..? ఆత్మహత్య చేసుకుందా..? స్వాతి లాగే జ్యోత్స్న కూడా చనిపోతుందా..? విధిని ఎదిరించి చేసే పోరాటంలో జీవా విజయం సాధించాడా..? నటీనటులు : శ్రీరస్తు శుభమస్తు సినిమాతో ఆకట్టుకున్న అల్లు శిరీష్.. ఈసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్రతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తను ప్రేమించిన అమ్మాయి చనిపోతుందని తెలిసి ఆమెను కాపాడుకునేందుకు పోరాటం చేసే యువకుడి పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే నటనపరంగా శిరీష్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. లవ్ రొమాంటిక్ సీన్స్ తో పరవాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం శిరీష్ నటన తేలిపోయింది. చాలా సన్నివేశాల్లో అల్లు అర్జున్ ను ఇమిటెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన సురభి ఆకట్టుకుంది. అభినయంతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. కథకు కీలకమైన పాత్రల్లో అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ లు తమ పరిధి మేరకు మెప్పించారు. (సాక్షి రివ్యూస్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సీరత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యాక్టింగ్ తో పాటు గ్లామర్ షోలోను హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. కథ అంతా నాలుగు పాత్రల చుట్టూ నడుస్తుండటంతో ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అతిధి పాత్రలో నటించిన దాసరి అరుణ్ మంచి విలనిజాన్ని పండించాడు. విశ్లేషణ : తన ప్రతీ సినిమాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించే విఐ ఆనంద్ ఈ సారి ప్యారలల్ లైఫ్ అనే సైన్స్ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సమయాల్లో ఒకే విధమైన సంఘటనలు జరగటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెర మీద ఆవిష్కరించటంలో సక్సెస్ సాధించాడు. అయితే కథనంలో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగం లోపించింది. ఫస్ట్ హాప్ స్లోగా నడిచినా ఇంట్రస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కథనం వేగం పుంజుకుంది. స్వాతి మరణానికి కారణం వెతికే సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇంకాస్త వేగంగా నడిచుంటే బాగుండనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్) మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తన మార్క్ చూపించలేకపోయాడు. ఎండ్ టైటిల్స్ లో వచ్చే మాస్ సాంగ్ తప్ప మిగిలిన పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇంటర్వెల్ లాంటి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప మణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టకోలేదు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ లోని మలుపులు ఇంటర్వెల్ బ్యాంగ్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా వేగం తగ్గిన కథనం సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు’
‘‘ఓ కొత్త కథను అరటిపండు వలిచినట్టు అందరికీ అర్థమయ్యేలా అందంగా చెప్పారు ఆనంద్. తను చెప్పిన కథ వినగానే నేను ఎగ్జయిట్ అయ్యా. ‘ఒక్క క్షణం’ వంటి మంచి సినిమాను శిరీష్తో తెరకెక్కించినందుకు ఆనంద్గారికి థ్యాంక్స్. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా హిట్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘ఒక్క క్షణం’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘నిర్మాతగారి అబ్బాయిలుగా నిర్మాత విలువేంటో నాకు తెలుసు. నిర్మాత లేకుంటే ఇండస్ట్రీయే లేదు. నేను ‘దిల్’ రాజుగారితో జర్నీ స్టార్ట్ చేసినట్లే.. చక్రిగారితో శిరీష్ జర్నీ స్టార్ట్ చేశాడు. తన జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్గా కొనసాగాలి. ఆనంద్గారి ‘టైగర్’ సినిమా చూశా. చాలా బాగుందని శిరీష్కి చెప్పా. తను పెద్దగా విన్నట్లు కనపడలేదు. తర్వాత ఓ రోజు నన్ను కలిసి నేను ఆనంద్గారితో సినిమా చేయబోతున్నాను అని అన్నాడు. అలా ఈ సినిమా ప్రారంభం కావడంలో నేను కూడా ఓ చిన్న పాత్ర పోషించాననిపిస్తోంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా నేను గర్వపడే చిత్రం అవుతుందనుకుంటున్నా. జనవరి 1న టీజర్ రిలీజ్ అవుతుంది’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో చక్రిగారు సినిమా మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 14 నెలలుగా శిరీష్ ఈ సినిమా కోసమే వర్క్ చేశారు’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ప్యారలల్ లైఫ్ అనే కాన్సెప్ట్తో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు కొత్త రకం సినిమా అవుతుంది’’ అన్నారు అల్లు శిరీష్. నటుడు నాగబాబు, సురభి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్షణం ఊహించలేరు
ఊహించలేరట.. ఎవరూ ఊహించలేరట. ‘ఒక్క క్షణం’ స్క్రీన్ప్లేని సినిమా చూస్తున్నప్పుడు ఎవరూ ఊహించలేరట. ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత అల్లు శిరీష్ హీరోగా సురభి హీరోయిన్గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ జంటగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 28న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రెండు జంటల మధ్య జరిగే సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మొదటి రీల్ నుంచి చివరి రీల్ వరకు ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం ప్యారలల్ లైఫ్తో ముడిపడి ఉంటుంది. ఒక జంటది ప్రజెంట్, మరొకరిది ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎవ్వరూ ఊహించలేని స్క్రీన్ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని అన్నారు. కాశీ విశ్వనాథ్, రోహిణి, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: అబ్బూరి రవి, కో–ప్రొడ్యూసర్స్: సతీష్ వేగేశ్న, రాజేష్ దండ. -
ఆనంద్ మార్క్ సినిమా ఇది – అల్లు శిరీష్
అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్ ముఖ్య పాత్రల్లో వీఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్బీ నరసింహా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగరుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. టీజర్ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ‘‘టీజర్లో చెప్పిన ‘నేను ప్రేమిస్తే.. ’ డైలాగ్ శాంపిల్ మాత్రమే. సినిమాలో ఇంకా సస్పెన్స్ ఉంది. మణిశర్మగారి సంగీతం సినిమాకు ఫ్లస్. దర్శకుడి మార్క్ చూసించే సినిమా ఇది’’ అన్నారు హీరో అల్లు శిరీష్. ‘‘సినిమా కోసం శిరీష్ చాలా కష్టపడ్డారు. గతేడాది నవంబర్లో హీరోకి, నిర్మాతకు కథ చెప్పా. వాళ్లు నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు ఆనంద్. ‘‘ కథకు తగ్గ టైటిల్ పెట్టాం. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాం’’అన్నారు చక్రి. ‘‘ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే సినిమా’’అన్నారు రచయిత అబ్బూరి రవి. -
'ఒక్క క్షణం' ఫస్ట్ లుక్
గౌరవం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అల్లూ వారబ్బాయి శిరీష్, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఓ మలయాళ సినిమాలో అతిథి పాత్రలో మాలీవుడ్ కు కూడా పరిచయం అయిన ఈ యంగ్ హీరో త్వరలో ఒక్క క్షణం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ వర్సెస్ డెస్టినీ అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సీరత్ కపూర్ మరో కథానాయిక నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Presenting the first look of #OkkaKshanam. December 2017. pic.twitter.com/mQ6DhLbkjJ — Allu Sirish (@AlluSirish) 29 November 2017 -
కన్నడ పవర్స్టార్ @ అల్లు శిరీష్ సెట్స్
అల్లు శిరీష్ హీరోగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లు. శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడికి కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు దర్శకుడు వీఐ ఆనంద్ సినిమా గురించి వివరించారట! ‘‘శిరీష్ హార్డ్ వర్కర్. నటుడిగా తనకు మంచి భవిష్యత్ ఉంది. కథ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని థియేటర్లో చూడాలనుకుంటున్నా’’ అని పునీత్ చిత్రబృందంతో చెప్పారట! ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ– ‘‘రాజ్కుమార్గారి ఫ్యామిలీకీ, మా ఫ్యామిలీకీ ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇటీవలే శివన్న (శివ రాజ్కుమార్) ‘తగరు’ టీజర్ లాంచ్కి నేను వెళ్లా. ఇప్పుడు పునీత్ మా సెట్స్కి రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘వెన్నెల’ కిశోర్, సత్య, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాతలు: సతీష్ వేగేశ్న, రాజేశ్ దండ, సంగీతం: మణిశర్మ, కెమెరా: సుజిత్ వాసుదేవ్, మాటలు: అబ్బూరి రవి. -
ఒక్క క్షణం!
ఏదైనా అర్జంటు పని మీద ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే.. ‘వన్ సెకండ్ ప్లీజ్’ అంటుంటాం. ఇప్పుడు అల్లు శిరీష్ అలానే అంటారని టాక్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో సురభి, శీరత్ కపూర్ కథానాయికలు. సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఈ సినిమాకి ‘ఒక్క క్షణం’ టైటిల్ పెట్టనున్నారని ఫిల్మ్నగర్ టాక్. అసలు సంగతి అదండీ. కథకి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం ఆలోచన అట. ఈ చిత్రానికి ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య ఓ వార్త వచ్చింది. ఇప్పుడు ‘ఒక్క క్షణం’ సీన్లోకి వచ్చింది. వన్ సెకండ్నే ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. -
ఐర్లాండ్ టు ఇండియా
మంచు విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓటర్’. సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మాత. ఇటీవలే ఐర్లాండ్లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న యూనిట్ ఇండియా వచ్చింది. సుధీర్కుమార్ పూదోట మాట్లాడుతూ– ‘‘ఒక పాట మినహా సినిమా పూర్తయింది. ప్రత్యేకమైన సెట్లో ఈ పాట చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విష్ణు కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలవడంతో పాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తుంది. త్వరలోనే టైటిల్ లోగో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ నిర్మాత: కిరణ్ తనమాల. -
'ఓటర్'గా మంచు విష్ణు
మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ 'ఓటర్'. 'హీరో ఆఫ్ ది నేషన్' అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఐర్ ల్యాండ్ లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని చిత్ర బృందం ఇండియా వచ్చింది. మిగిలిన ఒక పాటను ఓ ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధీర్ కుమార్ పూదోట (జాన్) మాట్లాడుతూ.. 'తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న 'ఓటర్' చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ఐర్ ల్యాండ్ లో రెండు రోమాంటిక్ సాంగ్స్ ను మంచు విష్ణు, సురభిల కాంబినేషన్ లో తెరకెక్కించాం. ఇంకా ఒక పాట మిగిలి ఉంది. టాకీ పార్ట్ పూర్తయ్యి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 'ఓటర్' చిత్రం మంచు విష్ణు కెరీర్ లో మైలురాయిగా నిలవడంతోపాటు మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకువస్తుంది. త్వరలోనే టైటిల్ లోగోను విడుదల చేసి.. ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం' అన్నారు. -
ప్లీజ్ మేడమ్...త్వరగా టచప్ చేసుకోండి!
...మరీ ఈ రేంజ్లో రిక్వెస్ట్ చేస్తున్నది హీరోయిన్గారి అసిస్టెంట్ లేదా మేకప్మేన్ కాదు, హీరో అల్లు శిరీష్. సెట్టింగు, లైటింగు, సినిమా వింగ్ వింగు మొత్తం రెడీ. కానీ, హీరోయిన్ సురభి రెడీగా లేరు. మేకప్కి మెరుగులు అద్దుతూ టచప్ చేసుకుంటుండడంతో అందరూ వెయిటింగు అన్నమాట! కరెక్టుగా అప్పుడు సెట్లో ఓ కెమెరా క్లిక్మంది. ఆ ఫొటోనే మీరు చూస్తున్నారు. అల్లు శిరీష్, సురభి జంటగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు కదా. ఈ సీన్ ఆ సెట్లోది అన్నమాట. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. సీరత్ కపూర్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త. -
సైన్స్... రొమాన్స్!
ఆత్మలు ఉన్నాయా... లేవా! మనిషి బరువు ఎంతున్నా మరణానంతరం 21 గ్రాముల తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. ఈ అంశాలతో దర్శకుడు వీఐ ఆనంద్ తీసిన సైంటిఫిక్, రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి హిట్టయ్యింది. మళ్లీ అలాంటి ఓ వినూత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వీఐ ఆనంద్. అల్లు శిరీష్ హీరోగా లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వీఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించనున్న సినిమా ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ‘‘సైంటిఫిక్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు అల్లు శిరీష్. చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని వీఐ ఆనంద్ తెలిపారు. సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: సతీశ్ వేగేశ్న, రాజేశ్ దండ. -
ద్విభాషా చిత్రంలో మంచు విష్ణు
రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు, సురభి హీరో హీరోయిన్లుగా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారితెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. మంచు విష్ణు, సురభిలపై భారీ సెట్ లో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ సందర్భంగా వచ్చే లవ్ సీన్స్ కావటంతో ఈ సీన్ కోసం భారీ సంఖ్యలో వెహికల్స్ ను ఉపయోగించి షూటింగ్ చేస్తున్నారు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తికానుంది. జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ట్రాఫిక్లో రొమాన్స్!
ఎవరైనా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతే ఏం చేస్తారు? చిరాకు పడటం కామన్. కానీ, మంచు విష్ణు, సురభి మాత్రం ట్రాఫిక్ జామ్లో.. తమ చుట్టూ ప్రపంచాన్ని మరచిపోయి ఎంచక్కా ప్రేమించుకున్నారు. అయితే ఇదంతా రియల్ లైఫ్లో కాదు లెండి. రీల్ లైఫ్లోనే. విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘చక్కని వాణిజ్య అంశాలున్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. తమన్ నేతృత్వంలో పాటల రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం‘ అన్నారు. సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్, ప్రగతి, బ్రహ్మాజీ, సుప్రీత్, ఎల్.బి.శ్రీరాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ నిర్మాత: కిరణ్ తనమాల. -
తమిళసీమలో.. విష్ణు ఎంట్రీ!
ఇప్పటి వరకూ తెలుగు చిత్రాలు మాత్రమే చేసిన మంచు విష్ణు ఇప్పుడు తమిళంపై కూడా దృష్టి పెట్టారు. ఆయన హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రం గురువారం ప్రారంభమైంది. విష్ణు, సురభి జంటగా జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో రమా రీల్స్ పతాకంపై సుధీర్కుమార్ పూదోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు మోహన్బాబు క్లాప్ ఇచ్చారు. రచయిత విజయేంద్రప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో నిర్మించనున్న ఐదో చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తాం. ఈ చిత్రం ద్వారా విష్ణు తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు’’ అని తెలిపారు. సంపత్రాజ్, పోసాని, నాజర్, ప్రగతి,బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ యాదవ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్.కె.నయూమ్, సహ నిర్మాత: కిరణ్ తనమాల. -
అంతా..మాయ!
- రంగస్థలంపై... రంజైన దృశ్యం... – రంగస్థలంపై వర్షం, పున్నమి వెన్నెల – సూర్యోదయం, పక్షుల విహారం – యుద్ధాల్లో అస్త్రాల వింతలు – మాయాబజార్ సినిమాకు ప్రామాణికం – కర్నూలులో సురభి కళానైపుణ్యం కర్నూలు(కల్చరల్) : ఘటోత్కచుడు వియ్యాల వారి విందుకు వచ్చి..తన చేతిని అలా ఊపగానే..అక్కడి లడ్డూలు, జిలేబీలు..జంతికలు అతని నోట్లోకి వెళ్లడం, పరచిన చాపలు, జంఖానాలు వాటంతట అవే చుట్టుకోవడం, మాయల పకీరు ఓం.. హ్రీం.. హరోం హర! అని మంత్రాలు పఠించగానే ఉన్న వస్తువులు మాయమై కొత్త వస్తువులు ప్రత్యక్షం కావడం., ఉన్నపళంగా వాన కురవడం.,తంబూరా వాయిస్తూ మేఘాల్లోంచి నారదుడు నేలకు దిగడం. ఇవన్నీ సినిమాల్లో అయితే మామూలే. కానీ రంగస్థలంపై.. ప్రేక్షకుల కళ్లెదుట ఈ దృశ్యాలు జరుగుతుంటే ఆశ్చర్యపోవాల్సిందే. పౌరాణిక నాటకాల్లో దేవతలు ప్రత్యక్షం కావడం, యుద్ధంలో ఇరువైపుల నుంచి అస్త్రాలు ఢీ కొని మెరుపులు పుట్టడం చూస్తే ఆ అనుభూతే వేరు. వేదికపైకి నేరుగా గుర్రాలు, రథాలు రావడం, గాలిలో తేలియాడడం లాంటి దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటే ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకొని చూడాల్సిందే. నిజమైన వినోదానికి ప్రతీకలైన ఇలాంటి దృశ్యాలు కేవలం సురభి వారి సొంతం. రంగస్థలంపైనే మంటలు రావడం, వాన కురవడం, సూర్యుడు అస్తమించడం, పక్షులు ఎగిరిపోవడం వంటి దృశ్యాల్లో పదుల కొద్దీ సాంకేతిక నిపుణులు పని చేస్తుంటే ఇలాంటివి ఆవిష్కృతమవుతాయి. కడప నుంచి కర్నూలుకు.. 'సురభి' పేరు తెలియని తెలుగువారు ఉండరు. తెలుగు పౌరాణిక నాటకానికి తమ సాంకేతిక నైపుణ్యంతో వినూత్న జవసత్వాలు తొడిగి ప్రేక్షకులను రంగస్థలం వైపుకు ఆకర్షించి కళారంగంలో విజయపతాక ఎగరేసిన సురభి నాటక సమాజం తెలుగు వారి సృజనాత్మకతకు నిదర్శనం. వైఎస్ఆర్ కడప జిల్లా సురభి గ్రామంలో మొగ్గ తొడిగిన ఈ కళానైపుణ్యం ఆంధ్ర దేశమంతా తన సుగంధాన్ని వెదజల్లింది. మూడు దశాబ్దాల క్రితం సురభి నుంచి కర్నూలు జిల్లాకు తరలివచ్చిన కళాకారుల కుటుంబం ఇక్కడ పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం రోజారమణి అనే కళాకారిణి సురభి కుటుంబం నుంచి వచ్చి కర్నూలులో స్థిరపడి ఇప్పటికీ నాటకాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. రోజారమణి అక్క కుమారుడైన సురభి శంకర్ ప్రస్తుతం రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పౌరాణిక నాటకాలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తూ రంగస్థలంపై మాయలు మంత్రాల ఎఫెక్ట్స్ సృష్టికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. కర్నూలు లలిత కళాసమితి ప్రదర్శిస్తున్న పౌరాణిక నాటకాల్లో అద్భుతమైన వింతలకు ఈయనే రూపకర్త. 2013లో స్వర్ణ నంది సాధించిన 'బభ్రువాహన విజయం'లో వీరిది ప్రధాన పాత్ర. ‘మాయాబజార్’కు నడక నేర్పింది సురభియే... 1950 దశకంలో రాయలసీమకు చెందిన దర్శకుడు కె.వి.రెడ్డి రూపొందించిన మాయాబజార్ చిత్రంలో అద్భుతాలను ప్రవేశపెట్టే ముందు ఆయన సురభి నాటక సమాజాన్ని సంప్రదించారు. రంగస్థలంపై ఈ నాటక సమాజం ప్రదర్శిస్తున్న మాయలు, మంత్రాలు వాటి వెనక ఉండే సాంకేతిక నిపుణుల పనితనాన్ని ఆయన సమగ్రంగా పరిశీలించారు. మాయాబజార్ కథను జనరంజకంగా తెరకెక్కించేందుకు సురభి నైపుణ్యాలను ప్రామాణికంగా తీసుకున్నారు. స్టేజీపై మంటలు.. వర్షం.. రంగస్థలంపై కొన్ని సందర్భాల్లో మంటలు చెలరేగే దృశ్యాలు ప్రదర్శించాల్సి వస్తుంది. పెట్రోలులో ముంచిన తాడును వేదికపై అమర్చి విద్యుత్ తీగలతో మధ్యలో ఫ్లాష్ వెలిగేటట్లు చేస్తే మంటలు చెలరేగుతాయి. ఇదంతా ప్రేక్షకుడికి తెలియకుండా, గమనించకుండా ఆకస్మికంగా మంటలు ఎగిసి వచ్చినట్లుగా ప్రదర్శిస్తారు. వర్షం ఎఫెక్ట్ కోసం తెర వెనుక ఒక పెద్ద క్యాన్లో నీరు పోసి ఉంచి సబ్ మెర్సిబుల్ మోటార్తో పైకి పంప్ చేస్తారు. ఈ నీరు రంధ్రాలున్న ఒక సన్నని పైపులోకి ప్రవహిస్తాయి. పైపు వెనక లైటింగ్ ఎఫెక్ట్ ఏర్పాటు చేస్తారు. మోటర్ ఆన్ చేయగానే వేదికపై సన్నని జల్లులు కురుస్తాయి. గదలు, అస్త్రాలు ఢీ.. యుద్ధ రంగంలో గదలు, అస్త్రాలు ఢీకొనడం.. వెంటనే మెరుపులు పుట్టడం మనం పాత సినిమాల్లో చూశాం. సరిగ్గా ఇదే ఎఫెక్ట్ను రంగస్థలంపై చూస్తాం. దీని వెనుక అనేక దారాలు, కరెంటు తీగలు పనిచేస్తాయి. ఆకాశం నుంచి దిగడం... భూమి మీద నుంచి పైకి రావడం... నారదుడిని మేఘాల నుంచి కిందకు దింపేందుకు కనిపించని తాళ్లతో కట్టి కప్పీపై లాగుతూ, వదులుతూ దాదాపు పది మంది సాంకేతిక కళాకారులు పనిచేస్తారు. భూమని అకస్మాత్తుగా పైకి ఉబికి వచ్చినట్లు చూపిస్తారు. దీనికి స్టేజి కింది భాగం నుంచి ఆపరేట్ చేసే సాంకేతిక నిపుణులుంటారు. వైఎస్సార్ చొరవతో సురభి కళాకారులకు బీసీ హోదా : సురభి శంకర్ జన హృదయ నేత అలనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి చొరవ వల్లే మా సురభి కళాకారులకు బీసీ హోదా సాధ్యమైంది. మేము ఎన్నో ఏళ్లుగా అసలు కులమే లేక అష్టకష్టాలు పడ్డాం. మా పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడ్డారు. మాకు ఒక కులము లేదు. మా పిల్లలను పాఠశాలల్లో చేర్పించేటప్పుడు కులం పేరు రాయించడంలో చాలా ఇబ్బందిగా ఉండేది. ముప్పై ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అయితే వై.ఎస్.రాజశేఖర్రెడ్డి గారు 'సురభి నాటకాల వాళ్లు' అనే కులం కింద చేర్చి బీసీ–బీ హోదా ఇచ్చారు. దీంతో మాకు సమాజంలో గుర్తింపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు అన్నీ అందుకునే అవకాశం ఏర్పడింది. కర్నూలు నుంచే నా విజయ ప్రస్థానం... 2000 దశకంలో కర్నూలు మున్సిపల్ పాఠశాలలో ప్రదర్శించిన 'పడమటి గాలి' సాంఘిక నాటకానికి నేను సాంకేతిక సహకారం అందించాను. రైతుల కడగండ్లను కళ్లకు కట్టినట్లుగా రూపొందించిన ఈ నాటకంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, వర్ష బీభత్సంతో పంట నాశనం కావడం లాంటి దృశ్యాలు చాలా శ్రమకోర్చి చేశాను. దానితో నాకు మంచి పేరొచ్చింది. కర్నూలు టీజీవీ కళాక్షేత్రం స్టేజి డిజైనింగ్ కూడా మేమే చేశాం. రాష్ట్రంలో మూడు చోట్ల సురభి థియేటర్స్ ప్రత్యేక డిజైనింగ్ మేమే చేశాం. -
సినీ నటి సురభి సందడి
కాకినాడ కల్చరల్ : ప్రముఖ సినీ నటి, జెంటిల్మన్ ఫేమ్ సురభి శనివారం కాకినాడలో సందడి చేశారు. మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్లతో కాసేపు ముచ్చటించారు. కాకినాడ రావడం తనకు తొలిసారని, ఈ నగరం చాలా ఆహ్లాదకరంగా, అందంగా ఉందని అన్నారు. తాను నటించిన జెంటిల్మన్, ఎక్స్ప్రెస్ రాజా, బీరువా తదితర చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్రాలన్నా, తెలుగు ప్రజలన్నా తనకు ఎంతో అభిమానమని అన్నారు. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు. -
ఇనార్భిట్ మాల్లో సురభి సందడి
మాదాపూర్ : జెంటిల్మెన్ సినిమా ఫేమ్ సురభి మాదాపూర్లోని ఇనార్భిట్ మాల్లో సందడి చేసింది. ఒప్పో మొబైల్ ఎఫ్–1 సెల్ఫీ ప్రొమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. వివిధ పోటీల ద్వారా గెలుపొందిన విజేతలకు మొబైల్స్ను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓఫో మొబైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన సురభి నాటక ప్రదర్శనలు
విశాఖ,కల్చరల్ పౌరాణిక జాన పద రంగస్థలానికి వన్నెతెచ్చి ప్రేక్షకుల్ని çమధురానుభూతి కల్గించాయి. మూడు రోజుల నుంచి రంగస్థాయి నాటక ఉత్సవాల్లో భాగంగా సురభి నాటకం ప్రదర్శనలు కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం ముగిశాయి. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారులు, నగర ప్రేక్షకుల కోరిక మేరకు మాయాబజారు నాటకాన్ని శుక్రవారం ఒకే రోజు రెండు ప్రదర్శనలు చేశారు. విశేష ప్రేక్షక ఆదరణ పొందిన ఈ నాటకం నగరంలో మొత్తం మూడు ప్రదర్శనలు ఇచ్చారు. తొలిరోజు ప్రారంభంలోను, మళ్లీ ముగింపు రోజైన శుక్రవారం రెండు ప్రదర్శినలిచ్చి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు. ముగింపు కార్యక్రమంలో మాయాబజారు తొలు ప్రదర్శనను సినీరచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు జ్యోతిప్రజ్వలన చేశారు. మలి ప్రదర్శనను వాణిజ్య పన్నుల విభాగం అధికారిణి కవితారావు, విజయనిర్మాణ్కంపెనీ అధినేత డాక్టర్ సూరపునేని విజయకుమార్,ఆర్.వి.ఆర్.ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్. సత్యనారాయణ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముగింపు కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయుడు ఆర్. నాగేశ్వరరావు వ్యాఖ్యతగా వ్యహరించారు. -
ముగిసిన సురభి నాటక ప్రదర్శనలు
-
సురభి‘మాయా’బజార్,పాతాళా భైరవి
-
సురభి .. మాయాజాలం
కెమెరా జిమ్మిక్కులు లేవు.. కంప్యూటర్ గ్రాఫిక్స్లూ లేవు.. అయినా వాటిని తలదన్నేలా మాయలు, మంత్రాలు చేశారు. రెప్ప వేసి తెరిచేలోగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. స్పెషల్ ఎఫెక్ట్స్తో రంగ స్థలంపై మంటలు పుట్టించడం, వర్షం కురిపించడం, వస్తువులను అదశ్యం చేయడం.. ఔరా అనిపించాయి. సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా మాయాబజార్ ప్రదర్శన సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. విశాఖ–కల్చరల్: కళాభారతి ఆడిటోరియంలో బుధవారం సురభి నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. రంగసాయి నాటక సంఘం నేతత్వంలో మూడు రోజులపాటు జరిగే సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా తొలిరోజు మాయాబజార్ నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 131 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీవేంకటేశ్వర నాట్యమండలి(సురభి–హైదరాబాద్) కళాకారులు ప్రదర్శించిన మాయాబజార్ నాటకం ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అబ్బురపరిచిన సెట్టింగ్లు ఈ నాటకంలో ఘటోత్కచుడు గుహ సెట్టింగ్ ఆకట్టుకుంది. అభిమన్యుడు, ఘటోత్కచుడు మాయా యుద్ధంలో ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్ర ప్రభావంతో మంటలు, నీరు స్టేజ్పై ఆకస్మాత్తుగా రావడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఒకే వేదికపై శశిరేఖ–అభిమన్యుడు వేర్వేరు దశ్యాలలో విరహ గీతాలాపన మైమరిపించింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, శశిరేఖ, అభిమన్యుడు, నారదుడు తదితర పాత్రల్లో ఆయా కళాకారులు చక్కటి ఆహార్యంతో తమ హావభావాలను ప్రదర్శిస్తూ పద్యాలు పాడుతూ రక్తికట్టించారు. ప్రతి కళాకారుడు మనస్సుకు హత్తుకుపోయే విధంగా ప్రదర్శించి ఆయా పాత్రల్లో లీనమైపోయారు. మల్లాది వేంకటకృష్ణ శర్మ దర్శకత్వంలో ఎ.మనోహార్, ఆర్.నాగేశ్వరరావు(బాబ్జీ)ల నిర్వహణలో అద్భుత దృశ్యాలు సష్టించారు. వెంకటేశ్వరరావు సారథ్యంలో 65 మంది కళాకారులు ఈ నాటకానికి జీవం పోశారు. తొలుత ఈ నాటక ప్రదర్శనను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, విజయ నిర్మాణ్ కంపెనీ అధినేత ఎస్.విజయకుమార్, టి.సరస్వతీదేవి, ఆదాయ పన్నుల శాఖ అధికారి హర్షవర్థన్, సురభి రథసారథి బాబ్జీ, రంగసాయి నాటక సంఘం అధ్యక్షుడు బాదంగీర్ సాయి తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
అలాంటి సినిమాలు చేయను!
‘‘అందం, అభినయం.. నాకు రెండూ ముఖ్యమే. నటనలో రెండూ భాగమే. కథానాయికను కేవలం అందాల బొమ్మగా చూపించే చిత్రాలు, గ్లామర్ పాత్రలు చేయను’’ అని కథానాయిక సురభి స్పష్టం చేశారు. నాని, సురభి, నివేదా థామస్ నటీనటులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్మన్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల సురభి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ - ‘‘ నాని పక్కన నటిస్తే మన నటన మెరుగవుతుంది. అందుకే తనతో మరిన్ని చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నాను. ఈ సినిమా చిత్రీకరణలో నివేద, నేను మంచి స్నేహితులయ్యాం. మా ఇద్దరి మధ్య ఎటువంటి పోటీ లేదు. మరో కథానాయికతో కలసి తెరను పంచుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నాకు ఎటువంటి పాత్రలు సూటవుతాయో.. అవే ఎంపిక చేసుకుంటున్నాను. నా చిత్రాలన్నీ వరుసగా విజయం సాధించడం సంతోషంగా ఉంది. నటనతో పాటు నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. ఖాళీ సమయాల్లో బొమ్మలు గీస్తుంటా. పెయింటింగ్లో కోర్స్ కూడా చేశాను’’ అన్నారు. -
కొత్త ఫోర్మ్యులా
సినిమా హిట్కు టాలీవుడ్లో ఇన్నోవేటివ్ కథలకు కొత్త తరహా సినిమాలకు కరువేమో గానీ గ్లామర్కు లోటుంటదు. ఎప్పుడూ కొత్త హీరోయిన్లతో కళకళలాడుతుంటుంది ఇండస్ట్రీ. ఈ అందాలే మన సినిమాను రీఫ్రెష్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు తెరపైకి అలా దూసుకొచ్చిన తారలు హెబ్బా పటేల్, నివేదా థామస్, సురభి, రష్మీ గౌతమ్. వీళ్లకు ‘ఫ్యూచర్ స్టార్స్’ అయ్యే లక్షణాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక హిట్ సినిమాకు వీళ్లే కొత్త ఫోర్మ్యులా. కుమారి సూపర్ కొన్ని పాత్రలు ఒప్పుకోవాలంటే సాహసం కావాలి. అయితే మంచి పేరొస్తుంది లేకపోతే అంతే సంగతులు. ‘కుమారి 21 ఎఫ్’లో హెబ్బా పటేల్ చేసిన పాత్ర అలాంటిదే. సుకుమార్లాంటి దర్శకుడు తయారు చేసిన కథ కావడంతో హెబ్బా నమ్మకంగా ఈ చిత్రం ఒప్పుకుని ఉంటారు. ఒప్పుకోవడం వరకూ ఓకే.. కానీ, ‘కాంట్రవర్షియల్ క్యారెక్టర్’ అయిన కుమారి పాత్రలో నటించడం అంటే కచ్చితంగా ప్రతిభ ఉండాల్సిందే. మోడ్రన్ యాటిట్యూడ్, ఫ్రీ మూవింగ్, లిబరల్గా ఉండాలనుకునే లక్షణాలతో సుకుమార్ రాసుకున్న ఈ కుమారి క్యారెక్టర్ను అక్షరాలా రిఫ్లెక్ట్ చేసి... టైటిల్ రోల్ను జస్టిఫై చేశారు హెబ్బా పటేల్. చాలా హాట్గా కనిపించడంతో పాటు కొన్ని సన్నివేశాల్లో హార్ట్ని టచ్ చేసే విధంగా కూడా నటించడం హెబ్బాకి ప్లస్ అయింది. ‘అలా ఎలా’తో పరిచయమైనప్పటికీ, హెబ్బాకు కెరీర్కు హెల్ప్ అయింది మాత్రం ‘కుమారి 21ఎఫ్’ సినిమానే. ఈ చిత్రం తర్వాత చాలామంది హెబ్బాని కుమారి అని పిలవడం మొదలు పెట్టారంటే ఈ పాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఊహించుకోవచ్చు. ఇక, ‘ఈడోరకం ఆడోరకం’ కూడా కమర్షియల్ హిట్ కావడంతో హెబ్బాకి మరింత క్రేజ్ పెరిగింది. దాంతో అవకాశాలు కూడా పెరిగాయి. ఇప్పుడామె తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్లో ఒకరు. వాస్తవానికి ఈ ముంబై బ్యూటీ ముందు ‘అధ్యక్ష’ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయిక అయ్యారు. ఆ తర్వాత ‘తిరుమణమ్ ఎనుమ్ నిక్కా’ అనే చిత్రం ద్వారా తమిళ తెరపై మెరిశారు. ఇప్పుడు తెలుగులో బిజీ కావడంతో ఇతర భాషలపై హెబ్బా పెద్దగా దృష్టి పెట్టడంలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘మిస్టర్’ సినిమాతో పాటు నిఖిల్ కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ! ‘ఇలాంటి స్కిన్ టోన్ కూడా ఉంటుందా?’ అని తమన్నాను మొదటిసారి చూసినవాళ్లు ఆశ్చర్యపోతారు. ముట్టుకుంటే మాసిపోయే రంగుతో చూడగానే ఆకట్టుకుంటారు కాబట్టే తమన్నాని అందరూ ‘మిల్కీ బ్యూటీ’ అంటారు. తమన్నా తర్వాత సురభిని అందరూ అలా అంటున్నారు. కొంచెం బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటారామె. ఢిల్లీలో పుట్టి, పెరిగిన సురభి హీరోయిన్ కావాలని చిన్నప్పట్నుంచీ అనుకున్నారు. అందుకే యాక్టింగ్ నేర్చుకున్నారు. కొన్ని యాడ్స్కి మెడల్గా కూడా నటించారు. వాటి ద్వారా తమిళ దర్శక-నిర్మాతల దృష్టిలో పడ్డారు. తమిళ చిత్రం ‘ఇవన్ వేరమాదిరి’తో కథానాయికగా పరిచయమయ్యారు. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో పాటు సురభి అంచదందాలు, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అక్కడ చేసిన ‘వేలై ఇల్లాపట్టదారి’ కూడా సురభికి మంచి గుర్తింపే తెచ్చింది. ‘జీవా’లో చేసింది అతిథి పాత్రే అయినా ఆకట్టుకోగలిగారు. ముచ్చటగా మూడు సినిమాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న సురభి ‘బీరువా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా సక్సెస్ ‘బీరువా’ తెరవకున్నా సురభికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక, ‘ఎక్స్ప్రెస్ రాజా’ విజయంతో ఈ బ్యూటీ కెరీర్ బండి పట్టాలెక్కేసింది.. ‘అటాక్’ తెచ్చుకున్న బ్యాడ్ టాక్ వదిలేస్తే ... కొత్త సినిమా ‘జెంటిల్మన్’ సక్సెస్ సురభిని మళ్లీ రేసులో నిలబెట్టింది. ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ దక్షిణాది అమ్మాయిలానే అగుపించడం సురభికి ఉన్న ప్లస్ పాయింట్స్లో ఒకటి. మొత్తం మీద ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ యంగ్ హీరోయిన్స్లో సురభి పేరు కూడా చేరింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బోల్డన్ని ఆఫర్లు వరిస్తున్నాయి. సో.. భవిష్యత్తులో ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్లో సురభిని చూడొచ్చు. మరో నిత్యామీనన్! కేరళ కుట్టిలు నటనకు కేరాఫ్ అడ్రస్ అని ఇప్పటికే అసిన్, మీరా జాస్మిన్, కల్యాణి, నిత్యామీనన్, నయనతార, సమంత తదితరులు ప్రూవ్ చేసేశారు. ఈ వరసలో నివేదా థామస్ కూడా చేరారు. ‘జెంటిల్మన్’ చిత్రం ద్వారా తెలుగు తెరకొచ్చిన ఈ మలబార్ బ్యూటీ ఇప్పుడు తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్. ‘ఒక్క సినిమాతోనే టాలెంట్ నిరూపించేసుకుంది’ అని నివేదాకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ యువకథానాయికకు ఎప్పుడో చిన్నప్పుడే ‘భేష్’ అనిపించుకున్నారు. ‘ఉత్తర’ అనే మలయాళ చిత్రం ద్వారా బాల నటిగా పరిచయమయ్యారామె. ఆ తర్వాత ‘రిలాక్స్’ చిత్రంలో మెరిశారు. మూడో చిత్రం ‘వెరుతే ఒరు భార్య’లో హీరో జయరామ్ కూతురిగా నటించారు. ఈ చిత్రంలో బుల్లి నివేదా అద్భుతమైన నటన కనబర్చడంతో తిరుగు లేని బాలతార అయింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో చిన్ని నివేద నటించింది. ఇటీవల మలయాళ ‘దృశ్యం’ తమిళ రీమేక్ ‘పాపనాశం’లో కమల్ కూతురిగా నటించారు. కథానాయికగా మలయాళంలో నటించింది ఒకే ఒక్క సినిమాలో మాత్రమే. ఆ తర్వాత తెలుగులో ‘జెంటిల్మన్’ చేశారు. విశేషం ఏంటంటే... నాని ఏ సినిమాలో నటించినా నటనపరంగా తనదే డామినేషన్. కానీ, ఈ చిత్రంలో నివేదా కూడా నానీకి గట్టి సవాల్నే ఇచ్చారు. క్యాథరీన్ క్యారెక్టర్లో ఈ బ్యూటీ కనబర్చిన అభినయం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా తను ప్రేమంచిన అబ్బాయి చనిపోయాడని తెలుసుకున్న సన్నివేశంలో నివేద ఆర్థ్ర పూరిత నటన ప్రేక్షకుల కళ్లు చెమర్చేలా చేసింది. కథానాయకుడి మరణం మిస్టరీని ఛేదించే ప్రయత్నాల్లో చూపించిన నటన కూడా ఆకట్టుకుంటుంది. అందుకే మరో నిత్యామీనన్ అన్న పేరుని నివేద తెచ్చుకోగలిగారు. మొదటి సినిమాకే మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో నివేద కొన్నాళ్ల పాటు తెలుగు తెరను ఏలే అవకాశం ఉంది. బ్యాక్ టు బిగ్ స్క్రీన్ మామూలుగా ఎవరైనా చిన్ని తెర నుంచి పెద్ద తెరకు వస్తారు. ఒక్కోసారి ఇది రివర్స్ అవుతుందనుకోండి. పెద్ద తెరకు రావడానికి చిన్ని తెర ఓ వారధిలా ఉపయోగపడతుంది. అయితే, రష్మీకి మాత్రం చిన్ని తెరపైకి రావడానికి పెద్ద తెర వారధి అయింది. ‘హోళీ’ , ‘కరెంట్’ , ‘బిందాస్’ లాంటి సినిమాల్లో నటించిన రష్మీ గౌతమ్కు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో చిన్నితెరకు వచ్చిన అవకాశాన్ని ఒప్పుకోక తప్పలేదు. మరి.. ‘జబర్దస్త్’ ఒప్పుకున్నప్పుడు రష్మీ తన కెరీర్కు ఆ షో మంచి బాట అవుతుందని ఊహించారో లేదో కానీ, ఆమె కెరీర్కు మాత్రం ఆ షో మంచి హెల్ప్ అయింది. రష్మి మాతృభాష ఒరియా. పుట్టింది వైజాగ్లో అయినప్పటికీ తెలుగు భాష తెలియదు. పట్టుదలగా తెలుగు నేర్చుకుని,యాంకర్గా తన సత్తా చాటుకున్నారామె. అసలు సిసలు తెలుగమ్మాయేమో అనే ఫీల్ కలిగేలాఈ రష్మి తెలుగు మాట్లాడతారు. బుల్లితెరపై ఆమె చేసిన సందడి పెద్ద తెరవాళ్లనూ ఆకట్టుకుంది. అంతే.. రష్మీకి బిగ్ స్క్రీన్ మరోసారి వెల్కమ్ చెప్పింది. కమ్ బ్యాక్ మూవీగా ‘గుంటూరు టాకీస్’ ఒప్పుకున్నారామె. విడుదలకు ముందే ఈ చిత్రం పోస్టర్ల ద్వారా రష్మి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇందులో రష్మి చేసిన సువర్ణ క్యారెక్టర్ యూత్ హార్ట్ను గిటార్ వాయించింది. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో రష్మీకి అవకాశాలు పెరిగాయి. ఈ చిత్రం రష్మీకి ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిందంటే.. సినిమా సేలబిల్టీపరంగా రష్మి చిన్న సినిమాలకు పెద్ద ఆప్షన్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆమె నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ‘తను వచ్చెనంట’, ‘చారుశీల’, ‘అంతం’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలు కాకుండా రష్మి కొత్త సినిమాలు కూడా కమిట్ కానున్నారు. మొత్తం మీద సిల్వర్ స్క్రీన్ రష్మీకి చెప్పిన రెండో వెల్కమ్ ఆమెకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. -
మేం టచ్లోనే ఉన్నాం!
‘‘కథ వింటా. నచ్చితే హీరో, డెరైక్టర్ ఎవరని ఆలోచిస్తా. కథ ఎంపికలో తుది నిర్ణయం నాదే. తర్వాత వచ్చే గెలుపోటములకు నా బాధ్యత కూడా ఉందని భావిస్తా. ఓటమి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. దానివల్లే చిత్రాలు విజయవంతం అవుతాయన్నది నేను నమ్మను. గ్లామర్ కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే నా ప్రాధాన్యం’’ అని కథానాయిక నివేదా థామస్ అన్నారు. నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్మన్’ చిత్రం ద్వారా టాలీవుడ్కి పరిచయమయ్యారామె. ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిందని నివేదా థామస్ చెబుతూ - ‘‘కో-డెరైక్టర్ సురేష్గారు నేను నటించిన మలయాళం, తమిళ చిత్రాలు చూసి మోహనకృష్ణగారికి చెప్పారు. ఆయనకు కూడా ఈ చిత్రంలో క్యాథరిన్ పాత్రకు సరిపోతానని అనిపించడంతో తీసుకున్నారు. మోహనకృష్ణసార్ కథ చెప్పగానే నచ్చి, ఎలాగైనా ఈ చిత్రం చేయాలనుకున్నా. నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. కమల్హాసన్గారి ‘పాపనాశం’లో మంచి పాత్ర చేశా. నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయన తర్వాత నాకిష్టమైన యాక్టర్ నానీనే. తన సినిమాలన్నీ చూశాను. నాని నటన సహజంగా ఉంటుంది. ఈ చిత్రం చేసేటప్పుడు హీరోయిన్ సురభితో మంచి స్నేహం కుదిరింది. నేను చెన్నై, తను ఢిల్లీలో ఉంటాం. ఫోన్ ద్వారా టచ్లోనే ఉన్నాం. ఈ చిత్రం షూటింగ్లోనే తెలుగు నేర్చుకున్నా. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నా. పరీక్షలు ఉండటంతో కుదరలేదు. నెక్ట్స్ సినిమాకు తెలుగులో డబ్బింగ్ చెబుతా. ప్రస్తుతం ఆర్కిటెక్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నా. ప్రస్తుతానికి తెలుగు, తమిళం, మలయాళంలో కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు’’ అన్నారు. -
'జెంటిల్మన్' మూవీ రివ్యూ
టైటిల్ : జెంటిల్మన్ జానర్ : థ్రిల్లర్ తారాగణం : నాని, నివేదా థామస్, సురభి, అవసరాల శ్రీనివాస్ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాధ్ వరుస సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న నాని హీరోగా, అతడిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెంటిల్మన్. వరుసగా ప్రయోగాలు చేస్తూ వస్తున్న నాని ఈ సినిమాతో కూడా మరోసారి అదే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ టైమ్ నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో నాని కనిపించటంతో, పాటు దర్శకుడు మోహనకృష్ణ కూడా తొలిసారిగా థ్రిల్లర్ సబ్జెక్ట్ను డీల్ చేశాడు. మరి ఈ ఇద్దరి ప్రయత్నం ఫలించిందా..? నాని జెంటిల్మన్గా అభిమానులను మెప్పించాడా.? కథ : జయరామ్ ముళ్లపూడి (నాని) చిన్న వయసులోనే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా అవార్డ్ అందుకున్న పెద్ద బిజినెస్ మన్, జైగౌరీ కంపెనీ అధినేత. మంచి బిజినెస్ మన్ గానే కాదు.. మంచి మనిషిగా కూడా పేరున్న జైని తన ఇంటి అల్లుడు చేసుకోవాలనుకుంటాడు ఐశ్వర్య ఇండస్ట్రీస్ ఓనర్. జై కూడా ఐశ్వర్య(సురభి)తో పెళ్లికి ఒప్పుకుంటాడు. కొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్ని కలవటానికి లండన్ వెళుతుంది ఐశ్వర్య. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో కలిసిన క్యాథరిన్(నివేదా)కు కొద్ది సమయంలోనే మంచి స్నేహితురాలవుతుంది. ఫ్లైట్ దిగిన ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జయరామ్, అచ్చు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్(నాని) లాగే ఉండటం చూసి షాక్ అవుతుంది క్యాథరిన్. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుస్తుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని, ఎవరో చంపారని ఓ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్న క్యాథరిన్, గౌతమ్ మరణం వెనక మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. మరి అనుకున్నట్టుగా క్యాథరిన్, గౌతమ్ను చంపింది ఎవరో కనిపెట్టిందా..? అసలు జయరామ్కు, గౌతమ్కు సంబంధం ఏంటి..? నిజంగా నాని హీరోనా..? విలనా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : జయరామ్గా రిజర్వర్డ్గా, గౌతమ్గా ఎనర్జిటిక్గా రెండు పాత్రల్లోనూ నాని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన నాని నేచురల్ స్టార్గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేదా థామస్ ఆకట్టుకుంది. బాయ్ ఫ్రెండ్ను పొగొట్టుకొని, ఆ బాధలోనే అతని మరణం వెనక రహాస్యాన్ని ఛేదించే అమ్మాయిగా మంచి నటన కనబరిచింది. సురభి పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో అందంతో అభినయంతో మెప్పించింది. మరో ప్రధాన పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ రోటీన్ కు భిన్నంగా కొత్త తరహా పాత్రలో మెప్పించాడు. ఇతర పాత్రలలో రోహిణి, తనికెళ్ల భరణి, ఆనంద్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్లు తమ పరిధి మేరకు పాత్రలకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఇప్పటి వరకు అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు ఆ తరువాత లాంటి క్లాస్ లవ్ స్టోరీస్ను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ తొలిసారిగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ అంతా తనకు బాగా పట్టున్న క్లాస్ ఫార్మాట్లో నడిపించిన మోహనకృష్ణ, సెకండ్ హాఫ్లో థ్రిల్లర్ ఎలిమెంట్స్ను కూడా అద్భుతంగా డీల్ చేశాడు. ముఖ్యంగా నాని పాత్రను మలచిన తీరు ఆకట్టుకుంటుంది. లాస్ట్ సీన్ వరకు అభిమానులను కట్టి పడేసేలా అద్భుతమైన స్క్రీన్ప్లేతో ఆకట్టుకున్నాడు మోహనకృష్ణ. సినిమాకు మరో ప్లస్ పాయింట్ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం. ప్రతీ సీన్ను తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మరింత ఇంట్రస్టింగ్గా మలిచాడు, అయితే పాటల విషయంలో మరింత కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. పిజి విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ సినిమా స్థాయిని పెంచాయి. ప్లస్ పాయింట్స్ : నాని పర్ఫామెన్స్ స్క్రీన్ప్లే నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ పాటలు ఓవరాల్గా జెంటిల్మన్ నాని స్థాయిని పెంచే పర్ఫెక్ట్ థ్రిల్లర్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
జయహో సురభి!
ఛత్రపతి శివాజీ అస్తమించాడు. మరాఠా సామ్రాజ్యం చెల్లాచెదురైపోయింది. చెట్టుకొకరు... పుట్టకొకరు... సైనికులకు పని లేదు. వాళ్లకు బతుకుతెరువు కావాలి. వలస వెళ్లిపోవాల్సిందే! అలా ఓ ముఠా మరాఠీ సీమ నుంచి రాయలసీమకొచ్చింది. ఇక్కడే కథ స్టార్ట్. 2 ముఠా పెద్ద... వనారస సంజీవరావు. మంచివాడు, కానీ మహా కోపిష్ఠి. వ్యవసాయం మొదలెట్టాడు. దానికి తోడు సారా వ్యాపారం. పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు. బోలెడంత మంది బంధువులు. మరాఠా నేల మీద ఆరెకాపులు అంటే గొప్ప. ఇక్కడ వీళ్లనెవరు పట్టించుకుంటారు! ఆ ఏడాది వానల్లేవు. అమ్మవారికి ఎవరో ఒకరు బలి అయితేనే వానలు పడతాయట! వనారస సంజీవరావు ముందూ వెనుకా ఆలోచించలేదు. అమ్మవారికి తనే బలిపశువు. పాపం పిల్లలు బికారులైపోయారు. ఇక్కడే కథకు టర్నింగ్. 3 వాళ్లకు దేవుడు కూసింత సంగీత జ్ఞానమిచ్చాడు. దాంతోపాటు ఇంగిత జ్ఞానమిచ్చాడు. ఇప్పుడు వాళ్లు తోలుబొమ్మలాడుతున్నారు. పొట్టకూటి కోసం పోరాటం చేయాలి కదా! ఊరూరూ తిరుగుతున్నారు. తోలుబొమ్మలాట బాగానే గిట్టుబాటు అవుతోంది. కడప ఏరియాలో ఓ పల్లెటూరికెళ్లారు. పకీరన్న అనే అనాథ తగిలాడు. పాపం కుర్రాడికి మశూచి. వీళ్లకు జాలేసింది. తమతో పాటే తీసుకెళ్లిపోయారు. తమలోనే కలిపేసుకున్నారు. ఆ పిల్లాడి బతుకు మారిపోయింది. పేరు కూడా మారిపోయింది. ఇప్పుడతని పేరు గోవిందప్ప. ఔ! ఇతనే ఈ కథకు నాయకుడు... నావికుడు! 4 గోవిందప్ప మృదంగం నేర్చుకున్నాడు. వయొలిన్ కూడా వాయించగలడు. ఆ ట్రూప్లో అతనే చలాకీ. బొమ్మలాటయ్యాక ఇంటింటికీ తిరిగి ధాన్యం, బట్టలు అడుక్కోవడం నచ్చలేదు అతనికి! ఇలా ఎదురు తిరిగినప్పుడల్లా ఓ మొట్టికాయ పడేది. పాపం కుర్రాడు కదా... తట్టుకోలేకపోయాడు. చూసి చూసి విసుగేసి నంద్యాల పారిపోయాడు. అక్కడ జ్యోతి సుబ్బయ్య వీధి నాటకాల కంపెనీలో చేరాడు. ఆరేడు నెలలు అక్కడే ఉండి, వేషాల గుట్టూ మట్టూ తెలుసుకోగలిగాడు. చివరకు ఆచూకీ కనిపెట్టి, ఇంట్లోవాళ్లు తమతో పాటే లాక్కెళ్లిపోయారు. ఇక్కడ పడింది కథకు అసలు ట్విస్టు! 5 ఆ ఊరి పేరు సురభి. పూర్వకాలంలో ‘సొరుగు’ అనేవారంట. అల్లపురెడ్డి చెన్నారెడ్డి ఆ ఊళ్లోనే పెద్ద రైతు. వాళ్లింట్లో పెళ్లి. పెళ్లంటే తోలుబొమ్మలాట ఉండాల్సిందే! గోవిందప్ప ట్రూపు దిగింది. చెన్నారెడ్డిని బతిమిలాడుకుని, ‘‘బాబ్బాబు... తోలు బొమ్మలాట కాదు. నాటకం వేస్తాం’’ అని ఒప్పించాడు. నాటకం పేరు ‘కీచక వధ’. ముహూర్తం అదిరిపోయింది. దాంతో నాటకం కూడా అదిరిపోయింది. చెన్నారెడ్డి ఫుల్ ఖుష్ అయిపోయి, వాళ్లకో బిల్డింగిచ్చేసి నాటక సమాజం పెట్టుకోమన్నాడు. ఇది 1885 నాటి మాట. ‘శ్రీశారద మనో వినోదిని సంగీత నాటక సమాజం’ పేరుతో ‘సురభి’ నాటక ప్రస్థానం అలా మొదలైందన్న మాట. ఇక అక్కడి నుంచీ ఈ కథకు తిరుగు లేకుండా పోయింది. 6 ‘సురభి’ అంటే చెట్టు కాదు. ఓ మహావృక్షం. కాదు కాదు... కల్పవృక్షం. దీని పేరు చెప్పి ఎంతమంది ఎదిగారో! దీని నీడలో ఎంతమంది సేద తీరారో! తెలుగు నేల నలు చెరగులా సురభి వీరవిహారం చేసేసింది. తెలుగు నాట నాటకమంటే ‘సురభి’... సురభి అంటే నాటకం. కుటుంబాలు పెరిగి పెద్దయ్యి, ఎవరికి వాళ్లు సొంతంగా సమాజాలు పెట్టుకున్నా, వీళ్లందర్నీ కలిపి ఉంచిన దారం మాత్రం ‘సురభి’. ఏం రోజులవి? ఏం నాటకాలవి? ‘సురభి’ నాటకం చూడకుండా ఆంధ్ర దేశం మేల్కోలేదంటే నమ్మండి! 7 వాళ్లు మనవాళ్లు కాదు. కాదు కాదు... మనవాళ్లే! అలా వాదిస్తే మనవాళ్లే కొడతారు కూడా! పొట్టకూటి కోసం వచ్చినవాళ్లు ఒక కళను ఇన్నేళ్ల పాటు వారసత్వంగా నిలుపుకోవడమంటే మాటలు కాదు. వాళ్లది మామూలు జన్మ కాదు. శాపవశాత్తూ ఇక్కడికొచ్చిన గంధర్వులేమో! వాళ్లకు కులం లేదు. సురభి నాటకమే వాళ్ల కులం. ఇది నిజంగా నిజం. వాళ్ల సర్టిఫికెట్లు ఒకసారి చూడండి. వాళ్లది మన భాష కాదు. మన ప్రాంతం కాదు. కానీ నాటక కళతో వాళ్లు మన మూలాల్ని పట్టేసుకోగలిగారు. అదీ లెక్క. వాళ్లు మనలో కలిసిపోయారు. మనల్ని వాళ్ల కళతో మమేకం చేసేసుకోగలిగారు. ‘రావు’ అనేది వాళ్ల పేరే! ప్రతి పేరు చివరా ‘రావు’ అని ఉంటుంది. వాళ్లని చూసి మనమూ ‘రావు’ను తగిలించేసుకున్నాం. మంచిదేగా! 8 ప్రపంచంలో ఎక్కడా లేని స్పెషాల్టీ ‘సురభి’ వాళ్ల దగ్గరుంది. వాళ్లో నాటకం వేశారంటే - అందులో పాత్రధారులంతా కుటుంబ సభ్యులే! బయటోడు ఒక్కడుంటే ఒట్టు. నూట పాతికేళ్ల నుంచి ఈ ఆనమా తప్పలేదు వాళ్లు. ఎవడో నాలాంటివాడు చేస్తానన్నా కూడా బోలెడన్ని కండిషన్స్! ఈ టైమ్లో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. నాలుగేళ్ల క్రితం... హైదరాబాద్లో ‘సురభి’ నాటకం 125 సంవత్సరాల మహోత్సవం జరిగింది. నేను ‘పాతాళ భైరవి’ నాటకంలో మాయల ఫకీరు వేషం వేశా. పది రోజులు రిహార్సల్స్కు వెళ్లా. రోజూ షూటింగ్ అయిపోగానే, రాత్రిళ్లు వాళ్లతోటే గడిపేవాణ్ణి. వాళ్లకు నా మీద నమ్మకం రావడం కోసం ‘మాయాబజార్’ నాటకంలో చిన్న కామెడీ వేషం కూడా వేశా. నాతో పాటు షఫీ కూడా చేశాడు. వాళ్లకప్పుడు నా మీద నమ్మకమొచ్చింది. ‘పాతాళ భైరవి’ నాటకాన్ని రవీంద్రభారతిలో వేసినప్పుడు టిక్కెట్లు పెట్టాం. జనం బాగానే వచ్చారు. ఆ డబ్బంతా వాళ్లకే ఇచ్చేశాం. ఆ ఒక్కసారే నేను వాళ్లతో కలిసి నటించింది. ఆ ఒక్క నాటకంతోనే వాళ్లు పడే కష్టం తెలిసొచ్చింది. అలాగని వాళ్లేమీ దాన్ని కష్టంగా ఫీలవ్వరు. కలిసి - వంట వండుకుంటారు. కలిసి - భోంచేస్తారు. కలిసి - నాటకం వేస్తారు. అంతా ఓ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. కాపురాలూ అక్కడే! పురుళ్లూ అక్కడే! చావులూ అక్కడే! వాళ్లకు రంగస్థలమే బడి, గుడి. అమ్మా, నాన్న, తాతయ్య, నానమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు, బామ్మర్ది... ఇలా అందరూ కలిసిపోయి నాటకం వేయడం ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా జరగలేదు!! జరగదు కూడా!! అది చాలా కష్టం కూడా! ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా ఒక వృత్తినే నమ్ముకోవడమంటే చాలా కష్టం. అదీ ఈ రోజుల్లో. అందుకే చాలా నాటక సమాజాలు కనుమరుగైపోయాయి. మిగిలినవి చాలా కొన్నే. అయినా కూడా వాళ్లు ఎంత శ్రద్ధగా, దీక్షగా, భక్తితో పనిచేస్తారో! నాకు మళ్లీ మళ్లీ వాళ్లతో నటించాలని ఉంది. కానీ అన్ని పనులూ మానుకుని కాన్సన్ట్రేట్ చేయాలి. 9 అసలు విషయం చెప్పడం మరిచేపోయాను. వాళ్ల సెట్టింగులు చూడాలి. ట్రిక్స్ చూడాలి. ఆ రోజుల్లోనే ఎన్ని వండర్స్ చేశారో! ఇవాళ గ్రాఫిక్కులూ, స్పెషల్ ఎఫెక్టులూ వచ్చాక అవి మనకు ఆనకపోవచ్చేమో కానీ, వాళ్ల టెక్నికల్ నాలెడ్జ్ సామాన్యమైనది కాదు. ఇంకో చిత్రం ఏంటంటే, ఓ నాటకంలో ఓసారి వాడిన టెక్నిక్ని మళ్లీ వాడరంతే! ఆగ్నేయాస్త్రం, నాగాస్త్రం అంటూ బాణాలు విసురుకోవడం, ఠకీమని మనుషులు మాయమైపోవడం, పక్షుల్లా ఎగరడం... ఇవన్నీ స్టేజ్ మీద చేసి చూపించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. చిత్రమేమిటంటే - వాళ్లే యాక్టర్సు, వాళ్లే టెక్నీషియన్స్ కూడా! ఉదాహరణకు శకుని పాత్ర చేసేవాడు ఈ సీన్లో లేడనుకోండి. వాడు తెర వెనుక వైర్ వర్క్ చేస్తుంటాడు. రాముడు లేడనుకోండి. వాడు వెనకాల మ్యూజిక్ కొడుతుంటాడు. అసలు వాళ్లు నాటకం వేసేటప్పుడు జరిగే ప్రాసెస్ని ఎవరైనా డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది. తొలి తరం సినిమాలకు ‘సురభి’ వాళ్లే ఆధారం. ఎంతమంది ఆర్టిస్టులో ఇక్కడనుంచి అక్కడికెళ్లారు. మన తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’లో చేసినవాళ్లు ‘సురభి’ వాళ్లే. 10 ‘సురభి’ అంటే పురాణాల్లో కామధేనువు. ఎప్పుడూ పాలధారలు కురిపిస్తూనే ఉంటుంది. ఈ సురభికీ ఆ పేరు సరిగ్గా సరిపోతుంది. ఈ కామధేనువు వల్లే కదా... తెలుగు నాటకం ఇంతెత్తుకి ఎదిగింది! అలాంటి కామధేనువుకి ఇప్పుడు కష్టాలు ముంచుకొచ్చాయి. ప్రజలూ పట్టించుకోవడం లేదు. పాలకులు అంతకన్నానూ! హైదరాబాద్లో తెలుగు లలిత కళాతోరణం పక్కన వాళ్లు తాత్కాలికంగా ఉండడానికీ, రోజూ నాటకాలు వేయడానికీ జాగా ఇచ్చారు. అప్పట్లో నటి జమునగారు కొంతమందికి క్వార్టర్స్ ఇప్పించినట్టు గుర్తు. సురభి సంస్థకు ఇప్పుడో సైనాధ్యక్షుడున్నాడు. పేరు ‘సురభి’ నాగేశ్వరరావు. అందరూ ‘బాబ్జీ’ అంటుంటారు. ఆయన చేతిలో అయిదు సభ్య సమాజాలున్నాయి. ఆయనకి ఆ మధ్య ‘పద్మశ్రీ’ ఇచ్చారు. ఆ వార్త తెలియగానే గుండె నిండిపోయింది. వాళ్లు కూడా మనస్ఫూర్తిగా ప్రేక్షకులు కొట్టే చప్పట్లే తప్ప కోటానుకోట్లు కావాలనుకోరు. 11 ‘సురభి’ మన తెలుగుజాతి సంపద! దయచేసి దాన్ని మ్యూజియమ్లో పెట్టే పరిస్థితి రానీయొద్దు! ఈ కామధేనువుని వట్టి పోనివ్వద్దు! సురభీ... నువ్వు నిండు నూరేళ్లు కాదు, వెయ్యేళ్లు వర్థిల్లాలి. జయహో సురభి! ప్రజల ఆదరణే సురభి ఊపిరి... 1885లో చిన్న గ్రామంలో పుట్టింది సురభి నాటకం. దినదిన వర్ధమానం చెంది అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదిగింది. తొలుత దీన్ని డాక్టర్ గోవిందరావు, చిన్న రామయ్యలు ప్రారంభించారు. సురభి గ్రామ పెద్ద రామిరెడ్డి చెన్నారెడ్డి ద్వారా సురభి నాటకం ఆడించేవారు. క్రమక్రమంగా ఉమ్మడి ఏపీ అంతటా సురభి వ్యాపించింది. ప్రజల ఆదరణ అప్పటికీ ఇప్పటికీ ఒకేలాగా ఉంది. నేను 1969లో చదువుకునే వయసులోనే సురభి నాటక వేషాలు వేయటం ప్రారంభించాను. అప్పట్లో ఖర్చు తక్కువ. ఇప్పుడు ఆదాయం రెండు రేట్లు పెరిగితే ఖర్చులు వంద రెట్లు పెరిగాయి. ఆ ఖర్చులకు తట్టుకోలేక నాటక సమాజాలు కట్టేస్తున్నారు. ఐదు సమాజాలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు శ్రీవేంకటేశ్వరనాట్య మండలి, శ్రీ శారద విజయ నాట్యమండలి, శ్రీ విజయభారతి నాట్యమండలి, శ్రీ వినాయక నాట్య మండలి, శ్రీ బీఎన్ మండలి ఆధ్వర్యంలో సురభి నాటకాలు ప్రదర్శితమవుతున్నాయి. సురభి నాటకం... కుటుంబ నాటకం. 60 నుంచి 70 మంది నాటకం వేస్తారు. చంటి బిడ్డ నుంచి 90 ఏళ్ల వయసు వృద్ధుడి వరకు వేసే నాటకం ఇది. 1991లో ప్రధాని పీవీ నరసింహరావు ఢిల్లీకి పిలిపించుకుని ఐదు నాటకాలు వేయించారు. ఢిల్లీ ప్రజలు నాటకం చూసి మురిసి పోయారు. నాటకం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. తెలుగు ప్రజలు నేటికీ టికెట్ కొని చూసే నాటకం ఏదైనా ఉందా అంటే అది సురభి ఒక్కటే. 2013లోఫ్రాన్స్లో కూడా 40 రోజుల పాటు సురభి నాటకాలు ప్రదర్శించాం. శ్రీ వేంకటేశ్వర నాట్య మండలికి ఈ ఏడాదితో 80 ఏళ్లు నిండనున్నాయి. - పద్మశ్రీ సురభి బాబ్జీ (నాగేశ్వరరావు) సురభికి ప్రోత్సాహం అందిస్తాం! 1991లో ఉమ్మడి ఏపీ కల్చరల్ డెరైక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వేంకటేశ్వర నాట్య మండలి వారిని హైదరాబాద్కు రప్పించి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నాటకాలు ప్రదర్శించేలా చేశాను. దానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వెంట్లను ఆహ్వానించాను. దాంతో ఆ సమాజం దినదిన వర్థ మానం చెందింది. ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్సలో వారికి స్థావరం కల్పించేం దుకు కృషి చేశాను. చందానగర్ సమీపంలో సురభి కాలనీ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమంతటా సురభి నాటకాలు ప్రదర్శితమయ్యేలా చూస్తున్నాను. ఇలాంటి సమాజాలు జీవించాలి. ఎప్పటికీ జీవించే ఉండాలి. - డా॥కె.వి.రమణాచారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు తమదైన టెక్నిక్ సురభి సొంతం! 130 ఏళ్ల పైబడి చరిత్ర ఉన్న నాటక అకాడెమీ సురభి. మారుమూల పల్లె నుంచి విదేశాల వరకు నాటకాన్ని పాకేలా చేసింది. సురభి నాటకాన్ని ఓ సంప్రదాయ నాటకంగా ప్రజలు ఆదరిస్తున్నారు. సురభి నాటకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ దైన టెక్నిక్తో ప్రత్యేకత సాధించుకుంది. తెలంగాణ ప్రభుత్వం సురభికి సంబంధించి ఐదు నాటక సమాజాలను ఎప్పటికప్పుడు ప్రొత్సహిస్తోంది. మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవలే సురభి నాటకాలను ప్రదర్శించారు. మిగతా జిల్లాల్లో కూడా ప్రదర్శనలు జరిగేలా చూస్తాం. రంగస్థలంపై అధ్యయనానికి, కొత్త ఆలోచనల కోసం వర్క్షాపులు నిర్వహిస్తున్నాం. - మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ర్ట భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు -
రాక్షసుణ్ణి నిద్రలేపాను!
‘‘ఈ సినిమాకు ముందు సి. కల్యాణ్గారు నన్ను కలిసి ‘నువ్వు చేయాల్సిన సినిమాలివి కావు’ అంటూ రెండు గంటలు క్లాస్ పీకారు. నా నుంచి డ్రామా, యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు ఆశిస్తున్నారన్నారు. చిరంజీవిగారి ‘కొట్టండి, తిట్టండి..’ అనే ఓ పాటను బేస్ చేసుకుని ఈ సినిమాలో ఓ పాట రాయించాను. అయితే ఈ పాట వేరే స్టయిల్లో ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నాకున్న యాటిట్యూడ్తో అందరిలోని రాక్షసుణ్ణి నిద్రలేపా’’ అని దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. మంచు మనోజ్, సురభి, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్రాజ్ ప్రధానపాత్రల్లో శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో వరుణ్, తేజ, శ్వేతలానా, సి.వి. రావు నిర్మించిన చిత్రం ‘ఎటాక్’. రవిశంకర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. రామాయణం, మహాభారత కథలను గుర్తుకు తెచ్చేలా సాగే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. ‘‘ఫిల్మ్ మేకింగ్లో రామ్గోపాల్వర్మ ఓ యూనివర్సిటీ లాంటి వ్యక్తి. కల్యాణ్గారి బ్యానర్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని మంచు మనోజ్ తెలిపారు. ఈ వేడుకలో కథానాయికలు సురభి, పూనమ్ కౌర్, లైన్ నిర్మాత ప్రసాద్ గుమ్ములూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సహ నిర్మాత మలినేని లక్ష్మయ్య చౌదరి, గాయకుడు ‘గజల్’ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ రోల్తో నాని 'ధమాకా'!
టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని. ఎవడే సుబ్రహ్మణ్యం, భలేభలే మగాడివోయ్ చిత్రాలతో విజయాన్నందుకున్న ఈ హీరో.. తాజాగా 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతోనూ మంచి వసూళ్లే రాబడుతున్నాడు. ఈ సినిమా పట్ల హిట్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాలో డబుల్ రోల్తో డబుల్ 'ధమాకా' ఇవ్వడానికి నాని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు 'ధమాకా' అని టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంద్రగంటి మోహనకృష్ణతో చాలాకాలం తర్వాత నాని మళ్లీ సినిమా చేస్తున్నాడు. 'అష్టాచెమ్మా' లాంటి హిట్ సినిమాతో నాని చిత్రసీమకు పరిచయం చేసింది మోహనకృష్ణనే. వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదిత థామస్, సురభి హీరోయిన్లుగా కనిపించనున్నారని సమాచారం. నివేదిత చివరిసారిగా కమలహాసన్ 'పాపనాశనం' చిత్రంలో కనిపించగా.. 'ఎక్స్ప్రెస్ రాజా'గా సురభి విజయాన్నందుకుంది. -
అమాయక పాత్రలు ఇక వద్దు
అమాయక పాత్రలు ఇక వద్దు అంటోంది నటి సురభి. కలలు కనడం సాధారణమే వాటిని సాధించుకోవడం మాత్రం అంత సులభం కాదు. వర్ధమాన తార సురభి నటిగా చాలానే ఆశపడుతోంది. ఈ భామ ఏకంగా వీరనారి ఝాన్సీరాణిగా నటించాలని కోరుకుంటోంది. ఇంతకు ముందు లేడీ సూపర్స్టార్గా వెలుగొందిన విజయశాంతి నుంచి చాలా మంది నటీమణులు ఝాన్సీరాణిగా తెరపై కనిపించాలని ఆశించారు. అయితే వారెవరి కోరిక నెరవేరలేదు. ఇప్పుడు నటి సురభి అలాంటి అసాధారణ కోరికనే వ్యక్తం చేస్తోంది. ఇవన్ వేరమాదిరి చిత్రం ద్వారా కోలీవుడ్లో రంగప్రవేశం చేసిన సురభి ఆ తరువాద వేలై ఇల్లా పట్టాదారి చిత్రాల్లో నటించినా అంతగా పేరు తెచ్చుకోలేక పోయింది. దీంతో టాలీవుడ్పై కన్నేసింది. అక్కడ అవకాశాలు బాగానే ఉన్నాయట. దీని గురించి సురభి మాట్లాడుతూ ఇవన్వేరమాదిరి చిత్రంలో పక్కింటి అమ్మాయిలా చాలా ఇన్నోసెంట్ పాత్రను పోషించానని, అదే విధంగా పుగళ్ చిత్రంలో ఆత్మ విశ్వాసం కలిగిన ధైర్యవంతురాలి పాత్రలో నటించినట్లు చెప్పింది. అయితే ఇక నటనకు అవకాశం ఉన్న పాత్రలోనే నటించాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. ఇవన్వేరమాదిరి చిత్రంలో మాదిరిగా ఇన్నోసెంట్ పాత్రలు వద్దని అంది. ప్రస్తుతం తమిళంలో అవకాశాలు లేకపోయినా తెలుగులో చేతినిండా చిత్రాలు ఉన్నాయని తెలిపింది. అక్కడి వారు చాలా ప్రేమగా మసలుకుంటున్నారని చెప్పింది. అయితే చెన్నైను చాలా మిస్ అవుతున్నానని, నటనకు అవకాశం ఉన్న మంచి పాత్ర లభిస్తే తమిళంలో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. హిందీ చిత్రం బాజీరావు మస్తానీ లాంటి చారిత్రక కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నానంది. ముఖ్యంగా ఝాన్సీరాణి పాత్రను పోషించాలని ఆశిస్తున్నట్లు సురభి తన కోరికను వ్యక్తం చేసింది. -
వినోదమే... ఎక్స్ప్రెస్!
తారాగణం: శర్వానంద్, సురభి, సప్తగిరి, ‘ప్రభాస్’ శ్రీను, కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ ఆద్యంతం వినోదం పంచే సినిమాలకు ఆదరణ లభిస్తున్న రోజులివి. అందుకని ఎంటర్టైన్మెంటే వెండితెరకు వేదమైంది. ఆ పంథాలోనే వచ్చిన కొత్త ప్రయత్నం - ‘ఎక్స్ప్రెస్ రాజా’. కథగా చెప్పాలంటే, వైజాగ్లో పనికిమాలిన వాడనే ముద్రపడ్డ హీరో రాజా (శర్వానంద్). అతను తండ్రి (నాగినీడు)నీ, కుటుంబాన్నీ వదిలి, హైదరాబాద్కొస్తాడు. అక్కడ పొట్టపోసుకుంటూ ఉంటాడు. అమూల్య అలియాస్ అమ్ము (సురభి) అతనికి తారసపడుతుంది. హీరోయిన్కు కుక్క లంటే ప్రేమ. హీరోకు కుక్కలంటే చీకాకు. తీరా ఆమెతో ప్రేమలో పడతాడు. మునిసిపాలిటీకి పట్టిచ్చిన హీరోయిన్ కుక్కను ప్రేమ కోసం వెనక్కి తేవడానికి బయలుదేరతాడు. హీరోయిన్ను పెళ్ళా డాలని సిద్ధపడే విలన్ (హరీష్ ఉత్తమన్), కుక్క బెల్ట్లో 75 కోట్ల విలువైన వజ్రం దాచే బినామీ బ్రిటిష్ (సుప్రీత్) - ఇలా అనేక పాత్రలు ఆ జర్నీలో ఎదురవుతాయి. హైదరాబాద్, నెల్లూరు, కావలి, ఒంగోలు మీదుగా కథ ఎటు తిరిగినా, అందరి పాట్లూ ఆ కుక్క కోసమే. చివరకు, హీరో ఆ కుక్కను తిరిగి ఎలా తెచ్చి, హీరోయిన్ను పెళ్ళాడాడన్నది మిగతా కథ. ఎందుకూ పనికిరాడనుకున్న రాజా పాత్ర నుంచి హైదరాబాద్లో ప్రేమికురాలి ప్రేమ కోసం ‘కుక్క’పాట్లు పడే ప్రేమికుడిగా శర్వానంద్ నేచురల్ యాక్టింగ్ చేశారు. చూడముచ్చటగా ఉండే అవసరాన్ని సురభి తీర్చారు. హీరో పక్కనే ఉండే పాత్రల్లో ప్రభాస్ శ్రీను, సప్తగిరి కామెడీకి పనికొచ్చారు. దుష్టపాత్రల్ని కూడా కామెడీకి వాడుకున్నారు. ఎమ్మెల్యే కావాలని ఆశపడే నెల్లూరు కేశవరెడ్డి పాత్రలో హరీశ్ ఉత్తమన్, అతని అనుచరుడైన బినామీ బ్రిటీష్గా సుప్రీత్ కనిపిస్తారు. ఊర్వశి కూడా వినోదం పండించారు. చిత్ర సాంకేతిక వర్గంలో ప్రధానంగా చెప్పాల్సినది కెమేరామన్ కార్తీక్ ఘట్టమనేని ప్రతిభ. గత చిత్రాల్లానే దీనిలోనూ లైటింగ్, చిత్రీకరణ విధానాల్లో అతని ప్రతిభ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎన్నారై ప్రవీణ్ లక్క రాజు సంగీతంలో సెకండాఫ్ మొదట్లో వచ్చే పాట బాగుంది. అలాగే జాతరలో వచ్చే రికార్డింగ్ డ్యాన్స పాట, చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. తొలి చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో ఆకర్షించిన దర్శకుడు మేర్లపాక గాంధీకి ఇది రెండో ప్రయత్నం. తొలి సినిమా చూశాక, పెరిగిన అంచనాలతో ప్రేక్షకులు హాలుకీ వెళతారు. కానీ ఈసారి ఆయన కథగా కన్నా పాత్రలు, వాటి మధ్య సన్నివేశాలు, సంభాషణల మీదే దృష్టి పెట్టారు. ఇనప వస్తువుల్ని దొంగతనం చేసే ‘ఇనుము’ (ధన్రాజ్), చిరంజీవి లాంటి స్టార్స్ని అనుకరిస్తూ రికార్డింగ్ డ్యాన్స్లు చేసే ట్రూప్ యజమాని (‘షకలక’ శంకర్), కుక్కల్ని పట్టగల గిరి (సప్తగిరి) - ఇలా చిత్ర విచిత్రమైన అలవాట్లున్న పాత్రల్ని సృష్టించుకున్నారు. వీటన్నిటికీ మధ్య లింకుగా ‘కుక్క’ అనే కామన్ ఎలిమెంట్ను పెట్టుకున్నారు. పాత్రలు, జరిగే సంఘటనలన్నీ యాదృచ్ఛికంగా ఒక చోట కలగలిసిపోవడమనే స్క్రీన్ప్లే టెక్నిక్ అనుసరించారు. దాంతో, కథ కన్నా సంఘటనలే ఎక్కువ. కాబట్టి, ఎక్కడ నుంచి చూసినా దాదాపు కథ అర్థమవుతూనే ఉంటుంది. ఇక, ఈ సినిమా ద్వారా తెలుగు తెరకొచ్చిన కొత్త ఆయుధం - డిక్షనరీ. హీరో హైదరాబాద్లో కాలేజీలు తిరిగి డిక్షనరీలమ్మే పనిలో ఉంటాడు. కాబట్టి, అందుకు అనుగుణంగా లావాటి డిక్షనరీలు చదువుకోవడానికే కాదు...విలన్ను గ...ట్టిగా కొట్టి, పడగొట్టడానికీ పనికొస్తాయని సినిమాలో చూపెట్టారు. జాగ్రత్త, ఓపిక ఉంటే, ఇలా రొటీన్కు భిన్నమైనవి సిన్మాలో చాలా వెతుక్కోవచ్చు. అందుకే, ‘ఎక్స్ప్రెస్ రాజా’ వినోద ప్రియ ప్యాసిం జర్స మహారాజా. తెరపై కుక్కపాట్లను తీరికగా కూర్చొని, చూడాల్సిన కాలక్షేప కామెడీ. - రెంటాల జయదేవ -
ప్రభాస్ ప్రశంస మర్చిపోలేను
‘ఎక్స్ప్రెస్ రాజా’ మనసిచ్చిన రాణి ఎలా ఉంటుంది? అందానికి ఆధార్ కార్డ్లా ఉంటుంది. పేరు అమూల్య. మరి సెలైంటా అంటే కాదు తేడా వస్తే ఇరగదీస్తుంది కూడా. అందుకే తనను ఏడిపించాలని చూసిన కొంత మందిని ఓ మార్కెట్లో అందరి ముందూ చితక్కొట్టేస్తుంది. అదే అమూల్య ఇంట్రడక్షన్ సీన్’’ అని కథానాయిక సురభి అంటున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్, సురభి జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు నిర్మించిన ‘ఎక్స్ప్రెస్ రాజా’ ఈ గురువారం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సినిమా విశేషాలు...! తెలుగులో నా మొదటి సినిమా ‘బీరువా’. ఆ తర్వాత రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఎటాక్’ కూడా చేశాను. కానీ ఇది ముందు రిలీజ్ అవుతోంది కాబట్టి ‘ఎక్స్ప్రెస్ రాజా’ నా రెండో సినిమా. ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. లక్కీలీ అమూల్య పాత్ర నాకే రాసి పెట్టి ఉందేమో అందుకే నన్నే వరించింది. ఇక శర్వానంద్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ‘జర్నీ’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి చిత్రాల్లో ఆయన యాక్టింగ్కు నేను ఫ్యాన్ను. పైగా సినిమాలో మా జంట ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ కలిగిస్తుంది. ఇప్పటివరకూ నేను కాస్త హోమ్లీ పాత్రలే చేశాను. నటి అంటే అన్ని రకాల పాత్రలు చేయగలగాలి. ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్, శర్వానంద్ యాక్షన్, మేర్లపాక గాంధీ డెరైక్షన్ అన్నీ ఈ సినిమాకు పర్ఫెక్ట్గా కుదిరాయి. అందరం కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశాం. హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. నేను ప్రభాస్గారికి పెద్ద అభిమానిని. ఈ సినిమాలోని ‘కలర్ ఫుల్ చిలకా’ పాటలో బాగున్నానని చెప్పిన ప్రశంస మర్చిపోలేను. త్వరలో రానున్న ఎటాక్లో కూడా దర్శకుడు రామ్గోపాల్వర్మ నాకు మంచి రోల్ ఇచ్చారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో కార్ మెకానిక్ రోల్ చేశాను. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో నాని సరసన నటిస్తున్నాను. తమిళంలో జై హీరోగా ఓ సినిమాలో నటించాను. విడుదలకు సిద్ధంగా ఉంది. -
'ఎక్స్ప్రెస్ రాజా' కథ ఇదేనా..?
భారీ సినిమా రిలీజ్ అయిన వారం తరువాత కూడా తమ సినిమా రిలీజ్ చేయడానికి ఆలోచిస్తారు చిన్న సినిమా నిర్మాతలు. అలాంటిది మూడు భారీ చిత్రాలు బరిలో ఉన్నా.. అదే సమయంలో రిలీజ్కు రెడీ అవుతున్నాడు 'ఎక్స్ప్రెస్ రాజా'. శర్వానంద్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న విడుదలవుతోంది. అంత ధైర్యంగా సినిమా రిలీజ్ చేయడానికి ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో ఏముందన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అందుకు తగ్గట్టుగానే ఇదే ఎక్స్ప్రెస్ రాజా కథ అంటూ ఓ లైన్ ప్రచారంలోకి వచ్చింది. ఎక్స్ప్రెస్ రాజా కథ అంతా ఓ కుక్క చుట్టూ తిరుగుతుంది. కుక్కలంటే అస్సలు గిట్టని హీరో రాజా, తన కుక్కను ప్రాణంగా చూసుకునే సురభితో ప్రేమలో పడతాడు. అదే సమయంలో ఆ కుక్క తప్పిపోతుంది. దానిని వెతికే ప్రయత్నంలో ఎన్నో పాత్రలు వస్తాయి. ఇంతమంది ఆ కుక్క కోసం ఎందుకు వెతుకుతున్నారో అర్థం కాక హీరో తికమకపడుతుంటాడు. అయితే చివరగా ఆ కుక్క మెడలో ఓ డైమండ్ ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఫైనల్గా ఆ కుక్కను పట్టుకొని హీరోయిన్ ప్రేమను గెలుచుకుంటాడు. ఇదే ఎక్స్ప్రెస్ రాజా కథ అన్న విషయం అఫీషియల్గా తెలియకపోయినా.. ఈ కథ అయితే బాగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో కేవలం ఒక జర్నీనే కథగా మలిచి ఎంటర్టైన్ చేసిన మేర్లపాక గాంధీ వినోదం పంచటానికి ఎంతో స్కోప్ ఉన్న ఈ తరహా కథతో అయితే మ్యాజిక్ చేయటం గ్యారెంటీ అంటున్నారు సినీ అభిమానులు. మరి ఎక్స్ప్రెస్ రాజా కథ ఇదేనా..? కాదా..? తెలియాలంటే ఫస్ట్ షో పడే వరకు వెయిట్ చేయాల్సిందే. -
సినిమా షూటింగ్లో అపశ్రుతి
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి హైదరాబాద్: యువ నటుడు నాని నటిస్తున్న సినిమా షూటింగ్లో అపశ్రుతి చోటు చేసుకుంది. షూటింగ్ స్పాట్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన పత్తిలికాయ తిరుపతి (25) కొండాపూర్లోని సిద్దానగర్లో నివసిస్తూ సినిమా షూటింగ్ వాహన క్లీనర్గా, లైట్వున్గా పనిచేస్తున్నాడు. శ్రీదేవి మూవీస్ పతాకంపై యువ హీరో నాని, సురభి థామస్లు జంటగా కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ గత రెండు రోజులుగా సంఘీనగర్లోని సంఘీనగర్ సర్పంచ్, సంఘీ స్పిన్నర్స్ యజమాని అమిత్సంఘీ గెస్ట్హౌస్లో జరుగుతోంది. శనివారం ఉదయం 8.30 గంటలకు షూటింగ్ ప్రారంభం కాగానే బస్సును శుభ్రపరుస్తుండగా తిరుపతి అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ఫిట్స్ వచ్చాయనే అనుమానంతో తోటి కార్మికులు అతని చేతిలో తాళాలు ఉంచి హయత్నగర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా తిరుపతి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మృతి చెందాడని, షూటింగ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి సొంత గ్రామానికి తరలించే ప్రయత్నం చేశారని వదంతులు పుట్టాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని మృతదేహాన్ని పోలీస్స్టేషన్కు తీసుకురావాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కు చేరుకున్న మృతుని బంధువులు తిరుపతికి ఇప్పటివరకు ఎలాంటి ఫిట్స్ రాలేదని, ఆరోగ్యంగా ఉన్నాడని.. హఠాత్తుగా ఎలా చనిపోయాడని ప్రశ్నిస్తున్నారు. షూటింగ్కు అనుమతులు లేవు అమిత్సంఘీ గెస్ట్హౌస్లో జరుగుతున్న సినిమా షూటింగ్కు ఎలాంటి అనుమతులు లేవని హయత్నగర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారణాలు తెలుసుకుంటామని అన్నారు. అనుమతులు లేకుండా షూటింగ్ నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
'ఎక్స్ప్రెస్ రాజా'గా శర్వానంద్
'రన్ రాజా రన్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' లాంటి వరుస సూపర్ హిట్స్ తరువాత చిన్న బ్రేక్ తీసుకున్న శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సినిమా సెలక్షన్లో ఎప్పుడు కొత్త దనం చూపించే శర్వానంద్ మరోసారి అదే తరహా కథా కథనాలను ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తన నెక్ట్స్ సినిమాకు 'ఎక్స్ప్రెస్ రాజా' అనే టైటిల్ను ఫైనల్ చేశాడు. 'ఎక్స్ప్రెస్ రాజా' అన్న టైటిల్ వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అందుకే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఎక్స్ప్రెస్ ను రన్ రాజా రన్ నుంచి రాజాను తీసుకొని ఈ సినిమాకు ఎక్స్ప్రెస్ రాజా అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాను కూడా రన్ రాజా రన్ ను నిర్మించిన యువి క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కించనున్నారు. బీరువా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సురభి ఈ సినిమాలో శర్వానంద్కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆయనతో నటించడం థ్రిల్లింగా ఉంది
కవ్వించే గుండ్రటి అందమైన కళ్లు, తాకితే కందిపోతాయన్నంతగా బుగ్గలు, ఆకర్షణీయమైన పెదాలు మొత్తంగా బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అంటారే అలాంటి సొగసైన చిన్నది సురభి. కోలీవుడ్లో తొలి చిత్రం ఇవన్ వేరమాదిరితోనే సక్సెస్ఫల్ నటిగా పేరు తెచ్చుకున్న ఈ వన్నెల చిన్నదానికి టైమ్ బాగుంది. రెండు మూడు చిత్రాలతోనే బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. ఇవన్ వేరమాదిరి చిత్రం తరువాత సురభి ధనుష్ సరసన వేలైఇల్లాద పట్టాదారి చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. తాజాగా నటుడు జయ్తో పుగళ్ చిత్రంలో నటిస్తోంది. ఫిలిం డిపార్ట్మెంట్ పటాకంపై శుశాంత్ నిర్మిసున్న ఈ చిత్రానికి మణిమారన్ దర్శకుడు. ఈ చిత్రంలో నటించిన అనుభవం తదితర విషయాల గురించి సురభి ఏం చెబుతుందో చూద్దాం. పుగళ్ చిత్రంలో భువన పాత్రలో నటిస్తున్నాను. ఇది చాలా బోల్డ్ క్యారెక్టర్. నిజ జీవితంలో ఎలా ఉంటానో అలానే ఏ విషయాన్నయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే పాత్ర. బహుశ అందుకేనేమో ఈ పాత్ర నాకు బాగా నచ్చింది. చిత్ర హీరో జయ్తో నటించడం చాలా థ్రిల్గా ఉంది. జయ్ ఏ కార్యం తలపెట్టినా అందులో పూర్తిగా ఏకాగ్రత పెట్టి శ్రమించే వ్యక్తి జయ్. కారు రేస్లో కూడా పాంటున్నారు. అజిత్లాగా జయ్ కూడా పలు కారు రేసులో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇక పుగళ్ చిత్రంలో నటించడం మంచి అనుభవం. దర్శకుడు మణిమారన్ మంచి ప్రతిభావంతుడు. చిత్రాన్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కస్తున్నారు. తాను రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న అటాక్ హిందీ చిత్రంలో నటిస్తున్నాను. ఆ చిత్రానికిది తర్ఫీదులా ఉంది. అటాక్ చిత్రంలో బైక్ మెకానిక్గా నటిస్తున్నాను. ఇలాంటి పాత్రను నిజ జీవితంలో చూడలేదు. అందువల్ల ఈ పాత్రను సవాల్గా తీసుకుని నటిస్తున్నాను. కాగా పుగళ్ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం జరగనుంది అని నటి సురభి తెలిపారు -
సురభి ఎదురు చూపులు
నటి సురభి పుగళ్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ చిత్రంతో కోలీవుడ్లో తన స్థాయి పెరుగుతుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నది. విక్రమ్ ప్రభు సరసన ఇవన్ వేర మాదిరి చిత్రం ద్వారా కోలీవుడ్లో అడుగు పెట్టిన సురభి ఆ తర్వాత ధనుష్ చిత్రం వేలైఇల్లాద పట్టదారి చిత్రంలో నటించారు. ఆ తర్వాత అవకాశాలు ఆశించిన మేరకు రాలేదు. దీంతో టాలీవుడ్పై దృష్టి పెట్టే పనిలో పడ్డారు. అక్కడ ఓ చిత్రంలో నటించి, మళ్లీ కోలీవుడ్కు తిరుగు పయనమయ్యారు. ప్రస్తుతం జై సరసన పుగళ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అంగీకరించినప్పుడు గ్లామరస్గా నటించనని తొలుత కండీషన్ పెట్టిన సురభి, తర్వాత పాటల సన్నివేశాల్లో మాత్రం అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పుగళ్ రాజకీయ నేపథ్యం కథా చిత్రం కావడంతో జైతో పాటుగా తనకు ఈ చిత్రం మంచిపేరు తెచ్చి పెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. అందువల్ల చిన్న చిన్న చిత్రాల అవకాశాలు వచ్చినా తోసి పుచ్చి పెద్ద హీరోల చిత్రాల్లో రెండో హీరోయిన్ అయినా, నటించేందుకు సిద్ధం అని అంటున్నట్టు కోలీవుడ్లో టాక్. -
'వర్మ సార్తో పనిచేయడం నా అదృష్టం'
చెన్నై: బీరువా సినిమా డెబ్యూ హీరోయిన్ 'సురభి'... దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పొగడ్తలతో ముంచెత్తుతోంది. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ఎటాక్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఆమె .. వర్మ సార్ తో పనిచేయడం తన అదృష్టమంటూ తెగ సంబరపడిపోతోంది. బీరువా సినిమాలో్ తన నటన చూసి ఇంప్రెస్ అయ్యి..తనకు ఈ అవకాశం ఇచ్చారని ఆమె పొంగిపోతోంది. అంతేకాదు..."ఇప్పటిదాకా అందమైన, అమాయకమైన పక్కింటి అమ్మాయి పాత్ర ల్లో చూసిన తనను ఇకముందు డిఫరెంటు గెటప్స్ లో చూస్తారు.. నాలో ఇంకో కోణాన్ని చూస్తారంటూ ఊరిస్తోంది. ఎటాక్ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ కార్లను రిపేర్ చేసే మెకానిక్ పాత్రలో రౌడీలాగా వెరైటీగా కనిస్తానంటోంది'' సురభి. జగపతిబాబు, మంచు మనోజ్ లాంటి సీనియర్ నటులతో నటించడం చాలా సంతోషంగా ఉందంటోంది. గ్లామరస్ పాత్రల్లో హీరోయిన్లను దోచుకుంటాడన్న ఆరోపణలను ఖండిస్తోంది ఈ యువనటి. రాంగోపాల్ వర్మ హీరోయన్లను ఎంత సెక్సీగా చూపిస్తాడో అంత అందంగానూ ప్రొజెక్ట్ చేస్తారంటోంది. ఆయన ఆడవాళ్ళను ప్రేమిస్తారు, హీరోయిన్లను ఒక పెయింటింగ్ లాగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది. రంగీలా సినిమా అప్పటినుంచి తాను వర్మ అభిమానినని వెల్లడించింది ఈ బీరువా భామ. ఆయనతో చేసిన ఫోటో షూట్ ను చాలా ఎంజాయ్ చేశానని.. తెరమీద తను ఎంత అందంగా ఉన్నానో చూడాలని ఆరాటంగా ఉందంటూ మురిసిపోతోంది. హీరోయిన్లను తెరమీద అందంగా ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసంటూ తెగ కితాబులిస్తోంది. ప్రస్తుతం సురభి ఒక తమిళ సినిమాలో కూడా చేస్తోంది. -
ఇది ఖాళీ 'బీరువా'!
చిత్రం: బీరువా, తారాగణం: సందీప్ కిషన్, సురభి, నరేశ్, ముఖేశ్ రుషి, అజయ్, ఛాయాగ్రహణం:ఛోటా కె. నాయుడు, దర్శకత్వం:కన్మణి స్వయంగా చిత్ర నిర్మాణ, పంపిణీ వసతులు, అనుభవం, సొంతంగా టీవీ చానల్ - అన్నీ ఉన్న ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, మరో టీవీ చానల్ గ్రూప్ అండదండలున్న చిత్ర నిర్మాణ సంస్థతో కలసి ఒక చిత్ర నిర్మాణం చేపట్టిందంటే...! ఆ చిత్ర కథకూ, సినిమాకూ ఏదో ఒక విశేషం ఉండే ఉండాలి. 'ఉషాకిరణ్ ఫిల్మ్స్, అలాగే 'జెమినీ' టీవీ కీలక బాధ్యులకు చెందిన 'ఆనంది ఆర్ట్స్' - రెండూ కలసి సంయుక్తంగా రూపొందిస్తున్న సినిమా కాబట్టి, 'బీరువా' చిత్రంపై ఆసక్తి నెలకొంది. దానికి తోడు టీవీ చానల్స్లో వచ్చిన 'బీరువా' ట్రైలర్లు మరింత ఉత్సుకత పెంచాయి. మరి ఇంతకీ హాలులోకొచ్చిన 'బీరువా' లో ఏమున్నట్లు? కథేమిటంటే... ఒక ఇంట్లో కొన్న బీరువాలో ఒక వ్యక్తి బయటకొస్తాడు. బీరువాలో మనిషి ఉండడమని ఆశ్చర్యపోతుండే సరికి, బీరువాలో నుంచి ఊడిపడ్డ సదరు హీరో గారు తన ఫ్లాష్బ్యాక్ చెబుతాడు. అనగనగా ఒకబ్బాయి. పేరు సంజు (సందీప్ కిషన్). ఇంట్లో అమ్మా నాన్న (అనితా చౌదరి, నరేశ్)ల మాట వినకుండా గాలికి తిరిగే రకం. అతను చేసే ప్రతి పనితో వాళ్ళ నాన్నకు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంటుంది. సదరు తండ్రి సూర్యనారాయణ (నరేశ్)ని ఒకడు నమ్మించి, ఒకడు మోసం చేస్తాడు. ఆ రూ. 40 కోట్లు తిరిగి పొందడానికి విజయవాడలోని బడా రౌడీ కమ్ రాజకీయవాది ఆదికేశవులు నాయుడు (ముఖేశ్రుషి)ని ఆశ్రయిస్తాడు - తండ్రి. తీరా ఆ ఆదికేశవులు కూతురు స్వాతి(సురభి)నే హీరో ప్రేమిస్తుంటాడు. మొదట్లో హీరోను హీరోయిన్ దూరం పెట్టినా, ఆ 40 కోట్ల వ్యవహారం ఆదికేశవులు సెటిల్ చేసే సమయానికి, వాళ్ళ ప్రేమ పిందె పండవుతుంది. హీరో, హీరోయిన్లిద్దరూ కలసి పరారవుతారు. కొడుకు తెచ్చిన కొత్త సమస్యతో తండ్రికి షాక్కు గురవుతాడు. అక్కడికి ఫస్టాఫ్ అయిపోతుంది. ఇక, సెకండాఫ్ అంతా - ఆదికేశవులు బారి నుంచి తప్పించుకోవడానికి హీరో హీరోయిన్లు పడే కష్టాలు, హీరో తెలివిగా వ్యవహరించి, హీరోయిన్ను కాపాడడం. చివరకు హీరోయిన్ తండ్రి తన తప్పు తెలుసుకొని, 'అమ్మాయికి కావాల్సింది శాసించే రూలర్ కాదు, ప్రేమించే ఫాదర్' అని గ్రహించి, వారిద్దరికీ పెళ్ళి చేస్తాడు. ఎలా నటించారంటే... 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' లాంటి విజయాలు తెచ్చిన ధీమాతోనో ఏమో యువ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు పాత్రకు, కథకు అవసరమైన పరిధికి దాటి మరీ నటిస్తున్నారు. అదొక కొత్త రకం ఈజ్గా బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. అయితే, అది భ్రమే తప్ప, నిజం కాదని ఆయన త్వరగా గ్రహిస్తే దీర్ఘకాల కెరీర్కు బాగుంటుంది. ఆ 'అతి' ని పక్కనపెడితే, మిగిలిన అంశాల్లో అతనికి మార్కులు పడతాయి. ఇక, కథానాయిక సురభి పెద్దగా నటించడానికి అవకాశమున్న సీన్లు స్క్రిప్టులో పెద్ద లేవు. కాకపోతే, మిగిలిన మసాలాలకు ఆమె పనికొచ్చింది. మిగిలిన ముఖేశ్ రుషి, నరేశ్ లాంటి వారందరూ సీజన్డ్ ఆర్టిస్టులే. ఈ చిత్రానికి ప్రధానమైన బలం - ‘షకలక’ శంకర్, సప్తగిరి లాంటి కొత్తతరం కమెడియన్లే. ముఖ్యంగా, ఉత్తరాంధ్ర మాండలికంలో తోటి నటీనటుల్ని సైతం కెమేరా ముందు తేలిపోయేలా చేసిన 'షకలక' శంకర్కు బాగా మార్కులు పడతాయి. త్వరలోనే ఆయన మరింత పెద్ద స్థాయికి ఎదిగే సూచనలున్నాయి. ఇంతకీ, ఎలా ఉందంటే... చండశాసనుడైన హీరోయిన్ తండ్రిని ఎదిరించి, హీరోయిన్ను హీరో ప్రేమించడం... వారిద్దరూ చెట్టపట్టాలేసుకొని తిరగడం... చివరకు తండ్రికి అతని తప్పు తెలిసేలా చేసి, హీరో హీరోయిన్లు ఏకం కావడం - ఈ తరహా కథలు కొత్తేమీ కాదు. అయితే, ఆ కథలో కీలకమైన మరో పాత్రధారిగా బీరువాను పెట్టుకొని, తద్వారా కథ నడపడమనేది కొత్తే! కాకపోతే, ఇలాంటి వాటికి కథ కన్నా కథనం బలంగా ఉండాలి. ఈ సినిమాలో అదే బలహీనంగా ఉంది. ఫస్టాఫే అంతంత మాత్రంగా సాగితే, పూర్తిగా బీరువా చుట్టూ తిరుగుతూ, కథనం మీద ఆధారపడాల్సిన సెకండాఫ్ విషయం లేక విసుగనిపిస్తుంది. అయితేనేం, ఈ సినిమాకు ఛాయాగ్రహణం ఎస్సెట్. ఛోటా కె. నాయుడు (కెమేరా) లాంటి సీనియర్ల ప్రతిభ మామూలు ఎప్పుడూ చూసే రామోజీ ఫిల్మ్ సిటీ (ఆర్.ఎఫ్.సి)ని సైతం తెరపై నిండుగా, కనువిందుగా చూపింది. మామూలు దృశ్యాలను కూడా అందంగా, ఆకర్షణీయంగా చూపడంలో డి.ఐ (డిజిటల్ ఇంటర్మీడియట్) ద్వారా అద్దిన రంగులూ బాగా ఉపకరించాయి. అలాంటి కొన్ని అంశాలు సరుకు కొద్దిగానే ఉన్న ఈ 'బీరువా'కు శ్రీరామరక్ష. మునుపటి 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' లాంటి వినోదం ఆశించకుండా, కథతో సంబంధం లేకుండా కాసేపు అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్లతో నవ్వుకుందామంటే, రెండు గంటల పైచిలుకు మాత్రమే ఉన్న ఈ నిడివి తక్కువ సినిమా ఓ కాలక్షేపం. - రెంటాల జయదేవ -
బీరువా మూవీ ప్రెస్ మీట్
-
బీరువా మూవీ స్టిల్స్
-
త్రిష అవుట్ - సురభి ఇన్
జయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో త్రిష హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ఆ చిత్రం నుంచి హీరోయిన్గా త్రిషను తొలగించి ఇవన్వేరే మాదిరి చిత్రం ఫేమ్ సురభిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కారణం త్రిష వివాహ నిశ్చితార్థమేనన్నట్లు సమాచారం. వివరాల్లో కెళితే ఉదయం ఎన్ హెచ్-4 చిత్రం తరువాత దర్శకుడు మణిమారన్ తదుపరి చిత్రాన్ని జయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మొదట నటి త్రిషను ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఆమె నిశ్చితార్థం విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మణిమారన్ తన చిత్రాన్ని వేగంగా పూర్తి చేయదలచారట. దీంతో త్రిష వ ల్ల చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంగా ఆమెను చిత్రం నుంచి తొలగించి ఇప్పుడు సురభిని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయం గురించి దర్శకుడు మణిమారన్ వద్ద ప్రస్తావించగా తాను చిత్రంలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ను ఎంపిక చేయలేదని అయితే నటి సురభితో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. చెన్నైలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్లో సురభి ఈ వారంలో పాల్గొంటుందని కోలీవుడ్ తాజా వార్త. -
‘బీరువా’లో ఏముంది?
సమస్యలు ఎదురైనప్పుడు స్నేహితులు ఆదుకోవడం సహజం. కానీ సంజుగాణ్ణి మాత్రం ఓ ‘బీరువా’ ఆదుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఈ సంజుగాడు ఎవరు? ప్రాణం లేని బీరువా సంజుగాణ్ణి ఆదుకోవడమేంటి? ఈ నేపథ్యంలో ‘బీరువా’ చిత్రం రూపొందింది. ఉషాకిరణ్ ఫిలింస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, సురభి జంటగా నటించారు. కణ్మణి దర్శకుడు. నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో కెమేరామేన్ ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ -‘‘ఇద్దరు అగ్ర నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ చిత్రం విభిన్నంగా, వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. బీరువా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తోందనీ, సందీప్ పాత్ర వినోదభరితంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమా కమర్షియల్గా కొత్తగా ఉంటుందని, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని సందీప్కిషన్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: తమన్, నిర్మాత: రామోజీరావు. -
ఈ అమ్మాయి ఆల్రౌండర్!
అమెరికాలో ఉంటున్న భారతీయసంతతి అమ్మాయి సురభిని చూస్తే ముచ్చటేస్తుంది. పదిహేనేళ్ల సురభి బెరివాల్ బహుముఖ ప్రజ్ఞాశాలి. రైటర్, డ్యాన్సర్, ఫైటర్గా రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్న సురభి చదువులో కూడా దూసుకుపోతోంది. స్పానిష్ భాష నేర్చుకొని ‘నేషనల్ స్పానిష్ ఎగ్జామ్’లో బంగారు పతకాన్ని అందుకుంది. ‘‘రచన అంటే నాకు చాలా ఇష్టం’’ అని చెబుతున్న సురభి కోల్కతాలో జన్మించింది. మూడు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో పాటు పెన్సిల్వేనియా(అమెరికా)కు వచ్చింది. వ్యాసాలు, నాటికలు, కవిత్వం రాయడం అంటే సురభికి చాలా ఇష్టం. ‘ఆస్క్ ఆల్సన్’ పేరుతో ఆమె రాసిన నాటికకు మంచి పేరు వచ్చింది. వివిధ సామాజిక సమస్యపై సురభి రాసిన వ్యాసాలకు ఎన్నో బహుమతులు వచ్చాయి. గత సంవత్సరం ఫోర్త్-డిగ్రీ బ్లాక్బెల్ట్ తీసుకోవడం ద్వారా కరాటేలో తన సత్తా చాటింది సురభి. స్కూల్ ‘స్పీచ్ అండ్ డిబేట్ టీమ్’కు సెక్రటరీగా మంచి మార్కులు కొట్టేసింది. స్వచ్ఛంద సేవ అంటే సురభికి చాలా ఇష్టం. స్థానిక రోటరీ క్లబ్, స్కూల్లోని ‘నేషనల్ హానర్స్ సొసైటీ’ తరఫున ఎన్నో రకాల సేవా కార్యక్రమాలలో పాల్గొంది. ‘‘ప్రతి విషయంలోనూ నా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. గాంధీ, మార్టిన్ లూథర్కింగ్ బోధనల గురించి ఎప్పుడూ చెబుతుంటారు’’ అంటుంది సురభి. తన సోదరుడు సంజీత్ తరచుగా గుర్తు చేసే వాక్యం- ‘కల కను. కలను నిజం చేసుకో’ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న యువతను ఉద్దేశించి ఒక నవల రాసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉంది సురభి. -
మరో చాన్స్
ఇవన్ వేరమాదిరి చిత్రంలో కోలీవుడ్కే చెందిన కన్నడ బ్యూటీ సురభి నటించింది. ఈ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా మంచి నటనను ప్రదర్శించి మార్కులు కొట్టేసిన ఈ భామకు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాయి. రెండవ చిత్రంగా దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆదలాల్ కాదల్, పాండియనాడు వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సుశీంద్రన్ దర్శకత్వం వహించనున్న చిత్రానికి జీవా అనే టైటిల్ను ఖరారు చేశారు. విష్ణువిశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్పైకి రానుంది. మరో విషయమేమిటంటే సుశీం ద్రన్, విష్ణువిశాల్ కాంబినేషన్లో ఇంతకు ముందు వెన్నెలకబడికుళు వంటి హిట్ చిత్రం వచ్చింది. ఈ చిత్రం కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కగా తాజా చిత్రం క్రికెట్ బ్యాక్డ్రాప్లో రూపొందటం విశేషం. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం గురించి నటి సురభి మాట్లాడుతూ సుశీంద్రన్, విష్ణు విశాల్ కాంబినేషన్లో నటించడానికి చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఈ చిత్రం తప్పకుండా వేరే స్థాయికి తీసుకు వెళుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. తన తొలి చిత్రం ఇవన్ వేర మాదిరికి ఈ చిత్రం పూర్తి డిఫరెంట్గా ఉంటుందని పేర్కొంది. ఇందులో తాను సిటీ అమ్మాయిగా నటించనున్నట్లు తెలిపింది. నటుడు విష్ణు విశాల్ మాట్లాడుతూ సుశీంద్రన్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితమే వీర ధీర సూర అనే చిత్రంలో నటించాల్సి ఉందన్నారు. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ప్రారంభంకాలేదని వెన్నెల కబడ్డికుళు చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడు జీవా చిత్రాన్ని సుశీంద్రన్ దర్శకత్వంలో చేయడం సంతోషంగా ఉందన్నారు.