TS Assembly District Politics
-
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్రెడ్డి.. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన కొద్ది రోజులకే సీఎం రేవంత్రెడ్డి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్కు ఇన్చార్జ్ మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాలకు, సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రిగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లాకు ఒకే మంత్రిని.. అది ఇతర జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని నియమించింది. గతంలోనూ(రాష్ట్ర విభజనకు ముందు) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాంరెడ్డి వెంకట్రెడ్డిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కొనసాగించింది. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురించి.. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి .. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పాలేరు ఎమ్మె ల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్రెడ్డి 2016లో మృతి చెందారు. అదే సంవత్సరం పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాంరెడ్డి వెంకట్రెడ్డి మృతితో వచ్చిన ఉపఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్రావు బీఆర్ఎస్ నుంచి గెలుపొందాడు. తుమ్మల గెలుపులో శ్రీనివాస్రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తనకే తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తారని ఆశించగా.. నామా నాగేశ్వర్రావుకు కేటాయించడం పొంగులేటిని అసంతృప్తికి గురిచేసింది. పార్టీ నేతల జోక్యంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలో ఇమడ లేక పోయారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న శ్రీనివాస్రెడ్డి జూలై 2న కాంగ్రెస్లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖలు నిర్వహిస్తున్న ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. కాగా తాజాగా నియామకమైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏసీడీపీ తదితర నిధుల వినియోగం, ఎమ్మెల్యే, ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాల అమలును పర్యవేక్షిస్తారు. ఇవి కూడా చదవండి: ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క! -
ముగ్గురూ ముగ్గురే! ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నిక..
కామారెడ్డి: జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క బాన్సువాడలోనే సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మూడు దశాబ్దాల కాలంలో ఒక్కసారి తప్ప ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గానూ పనిచేశారు. అన్ని వ్యవస్థల మీద ఆయనకు అవగాహన ఉంది. కామారెడ్డి నుంచి తొలిసారి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. ఎల్లారెడ్డి నుంచి గెలిచిన కె.మదన్మోహన్రావుకు ప్రజాప్రతినిధిగా ఇది తొలి అనుభవం. ఆయన గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉన్నత విద్యావంతుడైన మదన్మోహన్రావు అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో రాణించారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాలపై 20 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలనూ కేస్ స్టడీస్గా చూపుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జుక్కల్లో తోట లక్ష్మీకాంతారావు కూడా తొలిసారి విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన లక్ష్మీకాంతారావు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలు.. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు తొలిసారి విజయం సాధించినప్పటికీ వ్యవస్థల మీద ఉన్న అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడానికి సహకరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా, అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరై పట్టణాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అక్రమాలకు తావులేకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నియోజకవర్గ కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం ఇటీవల కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో తప్ప మిగతా రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అలాగే ఎమ్మెల్యే హోదాలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇవి చదవండి: జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’! -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు చేశారు. ఇన్చార్జి మంత్రిగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై సమీక్షలు, సమావేశాల నిర్వహణ, ప్రజాపాలనపై పర్యవేక్షణ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రభుత్వ వ్యవహారాలన్నీ సమన్వయం చేస్తారు. వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఇన్చార్జి మంత్రిగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం ఎస్టీ రిజర్వు కావడంతో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ములుగు ఎమ్మెల్యేను సీతక్కను జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వ్యవహరించారు. ఇవి చదవండి: ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం -
T Congress: సీతక్కకు సవాల్.. ఆయనకేమో సులువు?
సాక్షి, ఆదిలాబాద్: వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. జనవరిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. ఆదిలాబాద్కు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను, పెద్దపల్లికి ఐటీ, అసెంబ్లీ వ్యవహా రాల శాఖ మంత్రి శ్రీధర్బాబును నియమించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలిచింది. రెండుచోట్ల బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇక పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నీ కాంగ్రెస్ కై వసం చేసుకుంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం శ్రీధర్బాబు పెద్దకష్టం కాదని ప్రచారం సాగుతోంది. శ్రీధర్బాబుకు సులువేనా.. ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీగా నియమితులైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఇదే నియోజకవర్గ పరిధిలోని మంథని శాసనసభ్యుడు. గతంలో కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. స్థానిక నేతలపై పట్టు ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ హవాతో అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్నేత ఎంపీగా గెలిచారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేసింది. చెన్నూర్, మంచిర్యాల, మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురిలో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో, మంచిర్యాల నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపుతుండగా, బీఆర్ఎస్ 2019 ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే ఇక్కడ పార్టీని గెలిపించడం శ్రీధర్బాబుకు సులువే అన్న చర్చ సాగుతోంది. ఈ బాధ్యత ఇన్చార్జీలదే.. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు బాధ్యతలను కూడా ఇన్చార్జీలే తీసుకోనున్నారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆరుచోట్ల ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్కడ ఆ పథకాల అమలు పరంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తారా.. లేక ఇతర ముఖ్య నాయకుల కు ప్రాధాన్యతనిస్తారనేది చూడాలి. ఇక పెద్దపల్లిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సంక్షే మ పథకాల అమలులో ఆ పార్టీకి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. డిసెంబర్ 28 నుంచి గ్రామసభలు నిర్వహించి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో ఇన్చార్జీలు కీలకం కానున్నారు. సీతక్కకు సవాలే.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీగా నియమితులైన సీతక్కకు ఇక్కడ సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయఢంకా మోగించింది. ఎంపీగా సోయం బా పూరావు విజయం సాధించారు. గడిచిన శాస న సభ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలోని ఆది లాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు కమలం ఖాతాలో చేరా యి. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీ ఆర్ఎస్ పార్టీ తమ ప్రాబల్యం నిలుపుకుంది. కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్ర మే కాంగ్రెస్ గెలిచింది. ఇదిలా ఉంటే గతంలో సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరి ధిలో పలుమార్లు పర్యటించారు. నాయకులు, పార్టీ స్థితిగతులపై అవగాహన ఉంది. అ యితే ప్రతికూల పరిస్థితుల నుంచి విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో లోక్సభ సీటును గెలిపించడం సీతక్కకు సవాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ! -
'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్ శంకర్నాయక్
మహబూబాబాద్: పార్టీ శ్రేణులు కసిగా పనిచేయకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు కన్నీరు కారుస్తున్నారని, ఓటు వేసే ముందు ఆలోచిస్తే బాగుండేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని, ఏం పాపం చేశామని ఎన్నికల్లో ప్రజలు మోసం చేశారో తెలియడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది స్వార్థపరులు పార్టీలో లబ్ధిపొంది ఎన్నికల ముందు బయటకు వెళ్లిపోయారని, మరి కొంతమంది పార్టీలో ఉంటూ మోసం చేశారన్నారు. అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక మీదట పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి, కసిగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ, నీలం దుర్గేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎండి.నజీర్అహ్మద్, ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, జాటోత్ హరీశ్నాయక్, ఊకంటి యాకూబ్రెడ్డి, సట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట -
సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం!
జగిత్యాల/పెద్దపల్లి: ప్రస్తుతం సర్కారు ఖజానాలో పైసల్లేవని, క్రమశిక్షణతో ఆదాయం పెంచుకుంటామని ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పది రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్బాబు ఆదివారం జిల్లాలో పర్యటించారు. తొలుత సుల్తానాబాద్ మండలానికి చేరుకున్న ఆయన.. పెద్దపల్లి, కమాన్పూర్, సెంటినరీకాలనీ మీదుగా మంథని చేరుకున్నారు. అడుగడగునా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్సింగ్ మంత్రి వెంట ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం! జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లి రూపురేఖలు మార్చుతామని, అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్బాబు అండదండలు ఉండాలన్నారు. గతంలోనూ తనకెంతో సహకారం అందించారని గుర్తుచేశారు. స్పందించిన మంత్రి శ్రీధర్బాబు.. సీఎం రేవంత్రెడి ఎమ్మెల్యే విజ్జన్నకు అత్యంత సన్నిహితులన్నారు. తామంతా కలిసే జిల్లా అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. ఆరు గ్యాంరెటీలు అమలు చేస్తాం! ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, మరో 15 రోజుల్లో ఇంకో రెండు అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ , పెద్దపల్లికి బైపాస్ రోడ్డు, బస్ డిపో, జిల్లా కోర్టు, 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయిస్తామన్నారు. కాగా, సుల్తానాబాద్ ర్యాలీలో పలువురు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్సులు చోరీచేశారు. ప్రజలు శాంతి కోరుకున్నారు.. కమాన్పూర్ మండలం గొల్లపల్లె వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు. కమాన్పూర్ ఎక్స్ రోడ్డు మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యామేలిందన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుని కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించారని అన్నారు. నాయకులు వైనాల రాజు, ఇనగంటి భాస్కర్రావు, కోలేటి మారుతి, తొట్ల తిరుపతియాదవ్, ఆకుల ఓదెలు, కట్కం రవీందర్, తొగరి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఇవి చదవండి: అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క! -
గండం గట్టెక్కేనా..? మున్సిపల్ పాలకవర్గాలు సతమతం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపల్ పాలకవర్గాలపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. పాలకవర్గాల్లో నెలకొన్న విభేదాలు, రాజకీయ కారణాలతో పదవీ కాలం పూర్తి కావడం సందేహంగానే కనిపిస్తోంది. ఇల్లెందు, వైరా మున్సిపల్ చైర్మన్లపై గతంలోనే పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందజేశారు. ఇల్లెందుకు సంబంధించి ఫార్మాట్లో లేదని కలెక్టర్ తిరస్కరించగా.. మరోసారి నోటీసు ఇచ్చారు. వైరా చైర్మన్పై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అందజేయగా.. చట్టంపై స్పష్టత లేకపోవడంతో నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో పాత మున్సిపల్ చట్టం ఆధారంగా అవిశ్వాస అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వైరా, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్లో, ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం మున్సిపల్ పాలకవర్గాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యాన ఎక్కడెక్కడ అవిశ్వాసం పెట్టే అవకాశముంది, తద్వారా పాలకవర్గాలు మారుతాయా అనే చర్చ జరుగుతోంది.' ఇక్కడా సందేహమే.. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు అన్నీ బీఆర్ఎస్సే గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఐదుగురు కాంగ్రెస్లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 18కి తగ్గింది. ఇక్కడ బీఆర్ఎస్కు చెందిన కూసంపూడి మహేష్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఇటీవల కాంగ్రెస్లో చేరిన తోట సుజలారాణి ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు చెందిన కాపు సీతాలక్ష్మి చైర్పర్సన్గా, వేల్పుల దామోదర్ వైస్చైర్మన్గా ఉన్నారు. చైర్పర్సన్పై వ్యతిరేకతతో బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు గతంలో అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించినా, ఇప్పుడెలాంటి కదలికా లేదు. ఇక్కడ 36 వార్డులకు గాను బీఆర్ఎస్కు 25, సీపీఐకి ఎనిమిది మంది, కాంగ్రెస్కు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల ముందు సీపీఐ కౌన్సిలర్లు ఐదుగురు బీఆర్ఎస్లో చేరగా ఆ పార్టీ బలం 30కి పెరిగింది. సీపీఐకి ముగ్గురే మిగిలారు. మధిరలో 22 వార్డులకు బీఆర్ఎస్కు 15 మంది, కాంగ్రెస్కు ఇద్దరు, టీడీపీ నుంచి ముగ్గురు, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు గెలిచారు. బీఆర్ఎస్కు చెందిన ఎరగ్రుంట లక్ష్మి, మొండితోక నాగరాణి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. స్వతంత్ర కౌన్సిలర్ గద్దల మాధురి ప్రమాణ స్వీకారానికి ముందే బీఆర్ఎస్లో చేరారు. 20వ వార్డు కౌన్సిలర్ ముత్తవరపు రాణి అనారోగ్యంతో మృతి చెందగా ఆ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్లో 13 మంది, కాంగ్రెస్కు నలుగురు, టీడీపీ ముగ్గురు, సీపీఎంకు ఒకరు ఉన్నారు. చైర్ పర్సన్ మొండితోక లత, వైస్ చైర్పర్సన్ శీలం విద్యాలత బీఆర్ఎస్లో గెలిచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. పాలకవర్గాల్లో విభేదాలు! ఏడాది కాలంగా పలు మున్సిపల్ పాలకవర్గాల్లో విభేదాలు పొడచూపాయి. పార్టీ తరఫున ఎన్నికై న చైర్మన్లకు, నాయకత్వానికి పొసగకపోవడం, కౌన్సిలర్లు – చైర్మన్కు మధ్య విభేదాల వంటి కారణాలతో అవిశ్వాసానికి అడుగులు పడ్డాయి. మరికొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానానికి నిర్ణయించినా సర్దుబాట్లతో ముందుకు సాగలేదు. ఇల్లెందు, వైరాలో మాత్రం అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందాయి. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలని చట్టంలో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని నాలుగేళ్లకు పెంచి గవర్నర్కు పంపించగా ఆమోదం లభించలేదు. దీంతో ఇల్లెందు, వైరా తీర్మానాలపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోలేదు. మరోసారి తెరపైకి.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అవిశ్వాస అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన నాలుగేళ్ల చట్టానికి గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో, మూడేళ్లు దాటిన పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గాలు 2020 జనవరిలో కొలువుదీరాయి. ప్రస్తుతం మూడేళ్లు దాటడంతో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది. గతంలో అవిశ్వాసానికి యత్నించిన వైరా, ఇల్లెందు మున్సిపాలిటీల చైర్మన్లు ప్రస్తుతం కాంగ్రెస్లో చేరడంతో బలాబలాలు మారాయి. మిగతా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నా.. వచ్చే నాలుగు నెలల్లో రాజకీయ సమీకరణలతో తమ బలం పెరుగుతుందన్న అంచనాలో కాంగ్రెస్ ఉంది. తద్వారా అవి శ్వాసం పెట్టి ఆయా మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటామని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మంపై రాజకీయ కాక.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్పై రాజకీయ కాక మొదలైంది. ఈ పాలకవర్గం 2021 మే 7న కొలువుదీరింది. 60 డివిజన్లలో బీఆర్ఎస్, సీపీఐ కలిసి పోటీ చేయగా.. బీఆర్ఎస్ 43, సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 10, సీపీఎం, స్వతంత్రులు రెండేసి స్థానాలు, బీజేపీ ఒక స్థానం దక్కించుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టగా, ఆ తర్వాత ముగ్గురు కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్లో చేరగా.. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 18కి చేరగా, బీఆర్ఎస్కు 37 మంది ఉన్నారు. వచ్చే ఏడాది మే 7తో కేఎంసీ పాలకవర్గం మూడేళ్లు పూర్తి చేసుకోనుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్కే బలం ఉన్నా, వచ్చే నాలుగు నెలల్లో మారే సమీకరణలతో తమ బలం పెరిగి కార్పొరేషన్ను ‘హస్త’గతం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే తమ కార్పొరేటర్లెవరూ కాంగ్రెస్ వైపు చూడరని బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. వైరా, ఇల్లెందుల్లో ఇలా.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్పై కలెక్టర్కు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్కు 16 మంది, కాంగ్రెస్కు ఇద్దరు, సీపీఎంకు ఒకరు, స్వతంత్ర కౌన్సిలర్ ఒకరు ఉన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్కు పదేసి మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే మరికొందరు కాంగ్రెస్లో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో ఏడాది కాలంగా చైర్మన్కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇక్కడ 24 వార్డులకు గాను చైర్మన్ డి.వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు 21 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచారు. సీపీఐ, న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్ రెబల్గా ఒక్కొక్కరు గెలుపొందారు. ఇటీవల బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్పై కలెక్టర్కు అవిశ్వాసం నోటీసు ఇచ్చినా ఫార్మాట్ ప్రకారం లేదనడంతో వారం క్రితం మళ్లీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ ప్రోద్బలంతో ఈ ప్రక్రియ సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఎన్నికల ముందు మున్సిపల్ చైర్మన్ సహా నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 17కు తగ్గింది. వైరా, ఇల్లెందులో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారు గెలవడం, ఆ పార్టీకే చెందిన చైర్మన్లు ఉండడంతో ఆ పార్టీ నేతలు ఎలా చక్రం తిప్పుతారో వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం! -
నామినేటెడ్పై ఆశలు.. జిల్లావ్యాప్తంగా తీవ్రమైన పోటీ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నామినేటెడ్ పదవుల జాతర కొనసాగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను ప్రభుత్వం రద్దు చేయడంతో నామినేటెడ్ పదవులను పొందేందుకు ఆశావహ నేతలు విస్త్రృతంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కని నేతలు, ఇతరుల కోసం ఎమ్మెల్యే టికెట్ను త్యాగం చేసిన ముఖ్యనేతలు ఆశావహుల్లో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్పదవులపై ఆశలు.. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. వీరిలో స్టేట్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా గట్టు తిమ్మప్ప, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా వేద సాయిచంద్ సతీమణి రజని, ముడా చైర్మన్గా గంజి వెంకన్న ముదిరాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్, మిషన్ భగీరథ చైర్మన్గా ఉప్పల వెంకటేశ్ గుప్తా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా రమావత్ వాల్యానాయక్, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్గా గోలి శ్రీనివాస్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఆంజనేయగౌడ్ పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం వీరి పదవులను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్లోని ముఖ్య నేతలంతా ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీకి కసిరెడ్డి రాజీనామా.. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేతలు, పార్టీ టికెట్ ఆశించిన ముఖ్యులకు ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవులను ఆఫర్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నామినేటెడ్ పదవులపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇవి చదవండి: ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం! -
మంత్రి యోగమెవరికో? ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ‘మంత్రి’ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గ మొదటి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ ప్రా తినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడత కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కేబినెట్తోపాటు ఇతర కీలక పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు మరో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. వీరందరిలో ప్రధానంగా ముగ్గురు సీనియర్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ‘గడ్డం’ సోదరుల పోటీ.. ‘గడ్డం’ సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై నమ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చెప్పుకొన్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు. అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని కేడర్లో చర్చ జరుగుతోంది. ‘పీఎస్సార్’కు ఖర్గే హామీ! ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) మంత్రి పదవి రేసులో ప్రముఖంగా ఉన్నారు. గత ఏప్రిల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ‘సత్యాగ్రహ’ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పీఎస్సార్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, కీలక హోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. అయితే తొలివిడతలో ఆయనకు అవకాశం రాలేదు. మరోవైపు మంత్రి పదవులు వరించిన వారి సామాజిక వర్గాలు చూస్తే, వెలమ కోటలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. ఇక ఎస్సీ కోటాలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, దామోదర రాజనర్సింహా ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల్లో భర్తీ చేయాల్సి వస్తే, సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. పోటీలో ఉన్న వారి సామాజిక కోటా పరిగణనలోకి తీసుకుంటే, ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ స్థాయి పదవులతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్తో పదవి దక్కని వారు నిరాశ పడకుండా సర్దుబాటు చేస్తారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి తదుపరి టీంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి చోటు ఉంటుందో, ఎవరికి నిరాశ కలుగుతుందోనని అధికార పార్టీ వర్గాల్లోనూ, ఇటు ఉమ్మడి జిల్లా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు ఇటు రాష్ట్ర పెద్దలతోపాటు అటు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలుస్తూ మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇవి చదవండి: సర్వజన రంజక పాలన.. గవర్నర్ తమిళిసై ప్రసంగం -
'ఎస్ఆర్ఆర్ నుంచే నా రాజకీయ జీవితం' : పొన్నం ప్రభాకర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల అని, రాజకీయ ఉద్ధండులు వైఎస్ రాజశేఖరరెడ్డి, జువ్వాడి చొక్కారావు, ఎమ్మెస్సార్, జి.వెంకటస్వామి, జైపాల్రెడ్డి నుంచి అక్షరాలు నేర్చుకున్నానని చెప్పా రు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బుధవారం పొన్నం ప్రభాకర్ కరీంనగర్ వచ్చారు. నగరంలోని ఇందిరాచౌక్లో ఏర్పాటు చేసిన వి జయభేరి సభలో ఆయన మాట్లాడుతూ సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ మంత్రి టి.జీ వన్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతామన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తమది చేతల ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం మారిందని, అధికారులు కూడా వ్యవస్థను మార్చుకోవాలని సూచించారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, తాను కరీంనగర్ బిడ్డనన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, ఎన్ఎస్యూఐ జిల్లా, రాష్ట్ర అ ధ్యక్షుడిగా, మార్క్ఫెడ్ చైర్మన్గా పనిచేశానన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ అయ్యానన్నారు. తన రాజకీయ గురువు జువ్వాడి చొక్కారావు 1973లో రవాణా శా ఖ మంత్రి అయితే, చొక్కారావు శిష్యుడినైన తాను 2023లో రవాణాశాఖ మంత్రి అయ్యానన్నారు. తా ను 1987లో రాజకీయ జీవితం ప్రారంభించానని, ఈ 36 ఏళ్లలో ఎక్కడా అవినీతికి తావులేదని, ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. కొంతమంది చేతగాక పార్టీలు మారినోళ్లు తనను విమర్శిస్తే, భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తాడని చెప్పానంటూ గుర్తు చేసుకున్నారు. తాను పార్టీ మారలేదని కాంగ్రెస్ అంటే పొన్నం, పొన్నం అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. తనకు ప్రజల ఆశీర్వాదమే టానిక్ అ ని, కేసీఆర్ వాడే టానిక్ కాదంటూ చమత్కరించా రు. ఎంపీగా తాను పార్లమెంట్లో తెలంగాణ కో సం కొట్లాడి, మా ఎంపీ పొన్నం అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా చేశానన్నారు. మానకొండూరు ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి ప్రజల ఆశలు నెరవేర్చిన నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో నాలుగు స్థానాలు గెలిపించుకున్నానని తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం మాట్లాడుతూ నియంతృత్వ ప్రభుత్వం కూలి పోయి, ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో కరీంనగర్, హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు పురుమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్, నాయకులు వైద్యుల అంజన్కుమార్, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మెనేని రోహిత్రావు, మంజులారెడ్డి, కటకం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. దారిపొడవునా నీరాజనం! మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్, అనుబంధ విభాగాలు, పొన్నం అభిమానులు, కుల, బీసీ సంఘాలు ఘనస్వాగతం పలికా యి. ఎమ్మెల్యేలు క వ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి ఓపెన్టాప్ వాహనంలో నగరానికి చేరుకున్న పొన్నం ప్రభాకర్కు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద పూలవర్షంతో నీరాజనం పట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోతిరాంపూర్, కమాన్చౌరస్తా, సిక్వాడీ, శ్రీపాదచౌక్ మీదుగా ఇందిరాచౌక్ వరకు అడుగడుగునా స్వాగతం పలికారు. కోలాటాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో మ హిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గొల్లకురుమలు గొంగడితో సత్కరించారు. సిక్లు కరవాలం బహుకరించారు. ఆర్టీసీ కార్మికులు గజ మాలతో సన్మానించారు. ఇందిరాచౌక్ వద్ద విజయభేరి సభ ముగిసిన తరువాత పొన్నం ప్రభాకర్ ర్యాలీగా డీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నాయకులతో సమావేశమయ్యారు. నాయకులు కట్ల సతీశ్, కొడూరి రవీందర్గౌడ్, మునిగంటి అనిల్, దన్ను సింగ్, ఖమర్, సిరాజొద్దిన్, మొహమ్మద్ అమీర్, బోనాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇవి చదవండి: రెగ్యులర్ కమిటీ లేనట్టేనా? ఇంతకీ చైర్మన్ ఎవరు? -
'డిసెంబర్ 31'లోగా అని మాటిచ్చారు.. మరవకండి!
సాక్షి, ఆదిలాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అధికారలోకి వచ్చిన నెలరోజుల్లోనే అంటే డిసెంబర్ 31లోగా బోథ్ను రెవెన్యూ డివిజన్ చేస్తాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాం. కార్యాలయాలను తిరిగి బోథ్లోనే ఏర్పాటు చేస్తాం’ బోథ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి అన్నమాటలివి. బోథ్లో ఎన్నికల ప్రచారం బోథ్ డివిజన్ ఏర్పాటు హామీలపైనే జరిగింది. ప్రముఖ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తాము అధికారంలోకి వస్తే బోథ్ను రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చాయి. ప్రతి గ్రామంలో నాయకులు తిరుగుతూ ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే బోథ్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు రెవెన్యూ డివిజన్ హమీ ఇవ్వడంతో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైనే భారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. రేవంత్రెడ్డి సీఎం కాబోతుండటంతో బోథ్ను రెవెన్యూ డివిజన్గా చేస్తారని ఇక్కడి ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ 31లోగా బోథ్ను డివిజన్గా ఏర్పాటు చేస్తామని చెప్పిన రేవంత్రెడ్డిపై బోథ్ను డివిజన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం.. బోథ్ను డిసెంబర్ 31లోగా డివిజన్గా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. బోథ్కు చెందిన కాంగ్రెస్ నాయకులు డివిజన్ ఏర్పాటుపై చొరవ చూపాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బోథ్లో బీఆర్ఎస్.. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతలు రేవంత్రెడ్డి, కేసీఆర్లు బోథ్ను డివిజన్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా బోథ్లో మాత్రం బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్ గెలుపొందారు. అయితే ఇరు పార్టీలు డివిజన్ చేస్తామని ప్రకటించాయని, కాబట్టి ఇరు పార్టీలు బోథ్ను డివిజన్ చేయడానికి చొరవ చూపాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. మాట ఇచ్చారు.. నెరవేర్చండి! తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బోథ్ను డివిజన్ చేస్తామని హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం డిసెంబర్ 31లోగా బోథ్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి. డివిజన్ ఏర్పాటుకు నాయకులు చొరవ చూపాలి. – అల్లం సాయికృష్ణ డివిజన్ చేయాల్సిందే.. బోథ్ అన్ని రంగాల్లో నిరాదారణకు గురైంది. బోథ్ను డివిజన్గా చేస్తే అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. బోథ్ డివిజన్ కావడానికి అన్ని అర్హతలున్నాయి. అన్ని పార్టీలు డివిజన్ చేస్తామని హామీలు ఇచ్చాయి. ఇచ్చిన హామీల ప్రకారం.. బోథ్ను డివిజన్ చేసి అభివృద్ధి చేయాలి. ఇందుకు నాయకులు చొరవ చూపాలి. – గట్ల బలరామకృష్ణ, బోథ్ కేసీఆర్, రేవంత్రెడ్డి ఇద్దరూ డివిజన్ హామీ ఇచ్చారు.. పీసీసీ అధ్యక్షుడిగా చెప్తున్నా గెలిచిన వెంటనే డిసెంబర్ 31లోగా రెవెన్యూ డివిజన్ చేస్తామని రేవంత్రెడ్డి బోథ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభలో పేర్కొన్నారు. మరుసటి రోజునే ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బోథ్ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇరు పార్టీలు రెవెన్యూ డివిజన్పై హామీ ఇవ్వడం, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావ్ సైతం తాను గెలిస్తే బోథ్ రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రధాన పార్టీలు డివిజన్పై హామీ ఇవ్వడంతో ఇప్పుటు డివిజన్ ఏర్పాటు చేయడం అనివార్యంగా మారింది. -
పదేళ్లలో మేడ్చల్పై పట్టుసాధించిన మర్రి, మల్లారెడ్డి
మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు. ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. తన మార్కు ఉండేలా 2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. -
‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’ అన్నట్లుగా ఎన్నికల ఫలితాల్లో పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరు కనిపించింది. జిల్లాలో తిరుగులేని మాస్ లీడర్గా ఉన్న ఆయన మరోసారి తన చరిష్మా చూపించారు. బీఆర్ఎస్పై తిరుగుబాటుతో.. వైఎస్సార్ సీపీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అక్కడ సరైన ప్రాధాన్యత లభించక ఈ ఏడాది ఆరంభంలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ ఆయన విసిరిన సవాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ను వీడిన తర్వాత పొంగులేటి రాజకీయ ప్రస్థానం ఏ దిశగా వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యాన బీజేపీలోకి వెళ్లాలని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ రాజకీయంగా ఓసారి దెబ్బతిన్న ఆయన తొందరపాటు నిర్ణయాలకు పోకుండా ఆచితూచి అన్ని అంశాలు బేరీజు వేసుకుని కాంగ్రెస్లో చేరారు. తగ్గేదే లే... కాంగ్రెస్లో చేరే సమయంలో పదింట ఎనిమిది సీట్లు పొంగులేటి వర్గీయులకే ఇస్తారనే ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. కమ్యూనిస్టుల కోసం కొత్తగూడెం సీటు వదులుకోవాల్సి వచ్చింది. పాలేరు, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట సీట్లు పొంగులేటి వర్గానికి దక్కాయి. గత అనుభవాలు నేర్పిన పాఠంతో ఓర్పుగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. ఓవైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే తన అనుయాయుల గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థుల గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు పొంగులేటి ఎంట్రీ ఇచ్చేవరకు కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆశించిన స్థాయిలో సఖ్యత కనిపించలేదు. ఒక్కసారి శ్రీనివాసరెడ్డి రాకతో పరిస్థితి మారిపోయింది. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారు. క్రాస్ ఓటింగ్కు అవకాశమే లేకుండా జాగ్రత్త పడ్డారు. వెరసి నాలుగు స్థానాల్లో విజయఢంకా మోగించడమే కాదు మెజార్టీలోనూ దుమ్ము రేపారు. -
గ్రేటర్ హైదరాబాద్లో మంత్రి పదవి వరించేదెవరిని...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో మంత్రి పదవి వరించేదెవరిని...ఎవరికి ఆ అవకాశం లభించనుంది అంటే ఇప్పట్లో గ్రేటర్ నుంచి మంత్రి పదవి లేనట్లే అని తెలుస్తోంది. తెలంగాణ అంతటా విజయదుందుభి మోగించినా గ్రేటర్ ఓటర్లు కాంగ్రెస్కు మొండిచేయి చూపారు. దీంతో ఇక్కడి నుంచి ఇప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రెండో విడుత కేటాయింపుల్లో భాగంగా ఎమ్మెల్సీ కోటాలో మాత్రమే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు మంత్రి పదవులను కేటాయించవచ్చు. మరోవైపు ఇప్పటికిప్పుడు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే శివార్లలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కానీ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సామాజిక వర్గాల వారిగా పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ కసరత్తును చేపట్టింది. ఈ క్రమంలో ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు కట్టబెట్టారనే చెడ్డపేరు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ రకంగా మల్రెడ్డికి ఈ దఫా అవకాశం లభించకపోవచ్చునని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేసేందుకు ప్రస్తుతం అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఎంపికై న తరువాత మాత్రమే నగరం నుంచి మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ వరించేదెవరిని... పదవీకాలం ముగిసిన వారితో పాటు, గవర్నర్ కోటా కింద త్వరలో ఎమ్మెల్సీల ఎంపిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, తాము గెలిచే స్థానాలను త్యాగం చేసి మరో చోట పోటీ చేయడంతో ఓడిన వాళ్లు, ఎంతోకాలంగా కాంగ్రెస్కు సేవ చేస్తున్న సీనియర్లకు ఎమ్మెల్సీ పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఈ జాబితాలో అంజన్కుమార్ యాదవ్, మధుయాష్కీగౌడ్, కేఎల్ఆర్, విజయారెడ్డి, వెన్నెల తదితరులు ఉన్నారు. అంజన్కుమార్ యాదవ్ సీనియర్ నాయకుడు. అలాగే ఆ సామాజిక వర్గం దృష్టిలో చూసినా ఎంతో ప్రాధాన్యం ఉన్న నేత కావడంతో ఆయనకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. మరోవైపు పోటీచేసి ఓడిపోవడమే కాకుండా, పార్టీలో క్రియాశీల నాయకుడిగా గుర్తింపు కలిగిన మధుయాష్కీ కూడా కీలకమే. ఇక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వదలిస్తే ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డిని ఎంపిక చేయవలసి ఉంటుంది. మరి కొందరు సీనియర్లు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీపడే అవకాశం ఉంది. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీల ఎంపికకు మరికొంత సమయం ఉన్న దృష్ట్యా ఆ ఛాన్స్ ఎవరిని వరించనుందో..వేచి చూడవలసిందే. -
దామోదర రాజనర్సింహకు కీలక పదవి..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన దామోదర రాజనర్సింహ ఉపముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయనకు రెండోసారి ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈయనకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హాయాంలోనూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత ీసీడబ్ల్యూసీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కొత్తగా కొలువు దీరనున్న కాంగ్రెస్ సర్కారులో ఆయనకు మంత్రి పదవి ఖయంగా కనిపిస్తోంది. ఈసారి కూడా ఆయనకు కీలక శాఖలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పట్లోళ్ల సంజీవరెడ్డి, మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ తొలిసారి గెలించారు. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ నేత కావడం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యుడు కావడంతో తప్పనిసరిగా ఆయనకు కీలక శాఖలు దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దామోదర్ గెలిస్తే ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే నినాదంతో కార్యకర్తలు, నాయకులు ప్రచారం కూడా చేశారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం.. దామోదర రాజనర్సింహకు దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1989లో తొలిసారిగా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం 35 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీతోనే సాగింది. 1989 తర్వాత మరో రెండుసార్లు ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఈ క్రమంలో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కూడా మూడోసారి విజయం సాధించిన దామోదర వైఎస్ఆర్, కొణిజేటి రోశయ్యల మంత్రివర్గాల్లో స్థానం పొందారు. 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా దామోదరకు చోటు దక్కింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇటీవలె సీడబ్ల్యూసీలోకి.. సోనియాగాంధీ, రాహుల్గాంధీ వంటి అగ్రనేతలు ఉండే కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో దామోదరకు స్థానం దక్కింది. 2023 ఆగస్టులో ఆయన్ను సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దామోదరకు ఈసారి డిప్యూటీ సీఎం పదవి తప్పనిసరిగా వరిస్తుందని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. -
ఆయా చోట్ల తమకు ఓట్లు తగ్గడానికి అసలు కారణమేంటి?
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్కు షాకిస్తూ బీజేపీ విజయం సాధించగా, బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓటమి పాలైన ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేపట్టాయి. పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల జాబితా ముందేసుకుని తాము ఎక్కడ ఫెయిల్ అయ్యామనే దానిపై నాయకులు పోస్టుమార్టం షురూ చేశారు. ఓట్లను రాబట్టుకోవడంలో అంచనాలు ఎక్కడ తప్పాయో దానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బూత్ల వారీగా ఓట్లపై అంతర్మథనం! ఆదిలాబాద్లో ఓటమి పాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బోథ్ నియోజకవర్గంలో పరాజయం చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం చేస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన ఓట్లను పరిశీలిస్తున్నారు. ఫలానా గ్రామంలో తమకు మెజార్టీ వస్తుందని భావించిన నాయకులకు ఓటర్లు షాకిస్తూ ఇతర పార్టీలకు అండగా నిలువడంపై ఆలోచనలో పడ్డారు. ఆయా చోట్ల తమకు ఓట్లు ఎందుకు తగ్గాయి, ప్రత్యర్థి పార్టీకి ఏ విధంగా పెరిగాయనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడం, పోల్మేనేజ్మెంట్లో వైఫల్యంతోనే తాము గెలుపునకు దూరమవ్వాల్సి వస్తోందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులన్న చోట కూడా పార్టీ ఓట్లపరంగా వెనుకబడి పోవడటానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మండలాల్లోనూ ఇదే ప్రక్రియ కొనసాగుతుండడం చూస్తుంటే ఓటరు నాడీని అందుకోవడంలో ఆయా పార్టీలు అంతగా సఫలీకృతం కానట్లుగా స్పష్టమవుతోంది. ఓటరు పల్స్ పట్టడంలో విఫలం.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో నాలుగు గ్రామీణ, ఆదిలాబాద్ అర్బన్తో కలిపి ఐదు మండలాలున్నాయి. అలాగే బోథ్ నియోజకవర్గంలో తొమ్మిది మండలాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓటర్లు సైతం ఆయా పార్టీలన్నింటికీ జై కొట్టారు. బీజేపీ తరఫున ఆదిలాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి అమిత్షా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రచారానికి రాగా, కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆదిలాబాద్, బోథ్లో జరిగిన బహిరంగ సభలకు హాజరయ్యారు. బీఆర్ఎస్ తరఫున మంత్రి హరీశ్రావు ఆదిలాబాద్లో జరిగిన బహిరంగ సభకు హాజరుకాగా, సీఎం కేసీఆర్ ఆదిలాబాద్, ఇచ్చోడలో జరిగిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ సభలన్నింటికీ జనం ఆయా పార్టీల నాయకులు ఆశించినదానికంటే ఎక్కువగానే వచ్చారు. ర్యాలీలకు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ స్థాయిలో ఓట్లను రాబట్టుకోలేకపోయామనే అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇవి చదవండి: 6 గ్యారెంటీల అమలుపై అనుమానాలు...? -
ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి జిల్లాలో తమదైన ముద్రవేసిన కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సామాజిక సమీకరణల ఆధారంగా జిల్లాకు మరో పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ములుగులో ఆదివాసి గిరిజనురాలైన అయిన సీతక్కకు క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే, లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కు కూడా చాన్స్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా సీనియర్లే నాగార్జునసాగర్లో, అంతకుముందు 2009లో రద్దయిన చలకుర్తి నియోజకవర్గం నుంచి మొత్తంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఈసారి పోటీ చేయలేదు. ఆయన గతంలో హోంశాఖ మంత్రిగానే కాకుండా 12 శాఖలకు మంత్రిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడు కుందూరు జయవీర్రెడ్డి అవకాశం ఇచ్చారు. సూర్యాపేట నుంచి ప్రస్తుతం పోటీ చేసి ఓడిపోయిన రాంరెడ్డి దామోదర్రెడ్డి గతంలో తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు, సూర్యాపేట నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు హుజూర్నగర్లో మూడుసార్లు, కోదాడలో రెండుసార్లు మొత్తంగా ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఇప్పుడు హూజూర్నగర్నుంచి ఆరోసారి గెలుపొందారు. ఇక నల్లగొండ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పుడు ఐదోసారి నల్లగొండ నుంచే గొలుపొందారు. వీరంతా ఇన్నాళ్లు జిల్లాలో పార్టీ పట్టు కోల్పోకుండా కాడాడటంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నలుగురైదుగురు ఉండగా, అందులో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నలమాద ఉత్తమ్మార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఉత్తమ్కుమార్రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఐటీ శాఖ మంత్రిగా సేవలందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా నుంచి ఈ ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయన్న నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రెండోసారి గెలుపొందిన ముగ్గురు ఈ ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, దేవరకొండ నుంచి బాలూనాయక్ కూడా రెండోసారి విజయం సాధించారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో జూనియర్లే. ఉమ్మడి జిల్లాలో పార్టీ నడిపిన నేతలు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజక వర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. అయితే, గత పదేళ్లుగా జిల్లాలో పార్టీ ఉనికికి ప్రమాదం రాకుండా సీనియర్ నేతలు కీలకంగా వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కోల్పోయినా, 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకొని పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్రెడ్డితో పాటు భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ అండగా నిలిచారు. -
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. ఐదు చోట్ల 50 వేలకుపైగా మెజారిటీ..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజారిటీ సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఐదుగురు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. మరో నలుగురు 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఇద్దరు 20 వేలకు పైగానే మెజారిటీ సాధించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డికి ఉమ్మడి జిల్లాలోనే అత్యల్పంగా 4,606 ఓట్ల మెజారిటీ లభించింది. ఉమ్మడి జిల్లాలో సరికొత్త రికార్డు! నకిరేకల్నుంచి గెలుపొందిన వేముల వీరేశం 68,839 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు. 1952 నుంచి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఎవరూ ఇంత మెజారిటీ సాధించలేదు. తొలిసారిగా వేముల వీరేశం 68,839 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. 50 వేలకుపైగా మెజారిటీ.. కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి 58,172 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్పై గెలుపొందారు. నాగార్జునసాగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్పై కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్రెడ్డి 55,849 ఓట్ల మెజారిటీ సాధించారు. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 54,332 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డిపై విజయం సాధించారు. తుంగతుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్కుమార్పై కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్ 51,094 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక ఆలేరులో బీర్ల ఐలయ్య 49,636, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి 48,782, హుజూర్నగర్లో నలమాద ఉత్తమ్ కుమార్రెడ్డి 44,888, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 40,590, దేవరకొండలో నేనావత్ బాలునాయక్ 30,021, భువనగిరిలో కుంభం అనిల్కుమార్రెడ్డి 26,201 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇవి చదవండి: 24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు! -
కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకకాలంలో అసెంబ్లీకి..
సాక్షి, యాదాద్రి: కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1999 నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా విజయం సాఽధించిన సమయంలో వెంకట్రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానానికి పోటీచేసి రాజగోపాల్రెడ్డి ఓడిపోయారు. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ సమయంలో వెంకట్రెడ్డి ఎమ్మెల్యేగా, రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో వెంకట్రెడ్డి నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓడిపోగా.. రాజగోపాల్రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వెంకట్రెడ్డి భువనగిరి ఎంపీగా గెలుపొందారు. 2022లో రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా ఉపఎన్నిలో ఓడిపోయారు. ఈ ఎన్నికలకు ముందు రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరి మునుగోడు నుంచి గెలుపొందగా, వెంకట్రెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరు సోదరులు ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఉత్తమ్ హుజూర్నగర్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో కోదాడ ఎమ్మెల్యేగా రెండు సార్లు, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం 6వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా మూడు సార్లు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరుసగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే మళ్లీ హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. -
24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు!
సాక్షి, మహబూబ్నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఐదుసార్లు ఓటమి చవిచూసిన కూచుకుళ్ల దామోదర్రెడ్డి కలను ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేష్రెడ్డి నెరవేర్చారు. పోటీ చేసిన మొదటిసారే గెలుపొందడం మరో విశేషం. కూచుకుళ్ల దామోదర్రెడ్డి 1999లో మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2004లో అప్పటి టీఆర్ఎస్ తరపున పోటీ చేసినా 1,449 స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. తర్వాత 2009, 2012 ఎన్నికల్లో సైతం నాగం జనార్దన్రెడ్డి చేతిలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2005లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్గా, 2016, 2022లో ఎమ్మెల్సీ పదవులు దక్కినా ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగా మారింది. అయితే తన కోరికను తన కొడుకు నెరవేర్చడంతో కూచుకుళ్ల దామోదర్రెడ్డి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇవి చదవండి: 20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు -
20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయి. 20 ఏళ్లలో ఏనాడూ చూడని స్పష్టమైన సీట్లు రావడం గమనార్హం. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో టీఆర్ఎస్–సీపీఐ పొత్తులతో కాంగ్రెస్ కూటమి 10 సీట్లు(కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 4, సీపీఐ 1) సాధించింది. ఇప్పుడు 8 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి కాంగ్రెస్–సీపీఐ కూటమి సత్తాచాటుకుంది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలను గెలుచుకుని క్లీన్స్వీప్ చేసింది. పొరుగునే ఉన్న ధర్మపురి, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్నూ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 2018 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్తో కలిపి ఐదో స్థానాలకు పరిమితమైంది. ఇక హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్లలో బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. బండి.. గంగుల నువ్వా–నేనా.. కరీంనగర్లో విజయం చివరి వరకూ దోబూచులాడింది. చివరి రౌండ్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో తొలుత స్వల్ప ఓట్లతో గంగుల కమలాకర్ విజయం సాధించారు. దీనిపై బండి సంజయ్ అభ్యంతరం తెలుపుతూ కౌంటింగ్ కేంద్రానికొచ్చా రు. పోలింగ్ బూత్ 43,289లో ఓట్ల లెక్కింపు చేపట్టలేదని ఆరోపించారు. సంజయ్ వినతిని పరిగణనలోకి తీసుకుని రేకుర్తిలోని లయోల బీఈడీ కాలేజీ రూమ్నంబర్ 3లోని 594 ఓట్లు, రాంపూర్లోని విద్యార్థి హైస్కూల్లోని పోలింగ్ బూత్లలోని 697 ఓట్లను లెక్కించారు. చివరికి 3,169 ఓట్ల మెజార్టీతో గంగుల విజయం సాధించడంతో ఉత్కంఠకు తెరపడింది. ► మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారా యణ విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మె ల్యే రసమయిపై ఏ దశలోనూ వెనకబడలేదు. ► చొప్పదండి– మేడిపల్లి సత్యం కూడా ప్రతీ రౌండ్లోనూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై ఆధిపత్యం చూపించారు. ► హుజూరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి తమ ప్రత్యర్థులపై ఆది నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్పై స్పష్టమైన ఆధిపత్యంతో గెలిచారు. ► పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంథని– శ్రీధర్బాబు, రామగుండం– మక్కాన్ సింగ్, పెద్దపల్లి– విజయరమణారావు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో క్లీన్స్వీప్ చేసింది. మక్కాన్సింగ్ మూడోసారి పోటీ చేయడం, రామగుండంలో కాంగ్రెస్కు వచ్చిన అనూహ్య ఆదరణ, స్థానికంగా సానుభూతి పనిచేశాయి. ► సిరిసిల్లలో కేటీఆర్(బీఆర్ఎస్) సునాయస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కేకే మహేందర్రెడ్డిని ఐదోసారి ఓడించారు. 2009 నుంచి వీరిద్దరూ పోటీ పడటం ఐదోసారి కావడం విశేషం. కాంగ్రెస్ హవా, సానుభూతి పనిచేయలేదు. ► వేములవాడలో ఊహించినట్లుగానే ఆది శ్రీనివాస్(కాంగ్రెస్) విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి పోటీ పడటం వరుసగా ఐదోసారి. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్బాబు పౌరసత్వం విషయంలో న్యాయపరంగా పోరాడినా ఫలించలేదు. ఎట్టకేలకు ప్రజల దీవెనతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వేములవాడ ఆలయ చైర్మన్గా పనిచేసిన వారు ఎమ్మెల్యేగా గెలవరంటూ దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయానికి తెరదించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, బీజేపీ అభ్యర్థి వికాస్రావులపై స్పష్టమైన మెజారిటీ సాధించారు. ► జగిత్యాలలో తొలుత జీవన్రెడ్డి పది రౌండ్ల వరకు ఆధిపత్యం కనిపించినా.. తర్వాత పుంజుకున్న సంజయ్ విజయం సాధించారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కె.సంజయ్ అనూహ్యంగా గెలిచారు. సమీప ప్రత్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ను ఢీకొట్టగలరా? అన్న ప్రచారం జరిగింది. ఎగ్జిట్పోల్స్ కూడా అరవింద్కే మొగ్గుచూపాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు ఉన్న పేరు, అనుభవం సంజయ్ గెలుపులో కీలకపాత్ర పోషించాయి. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తన చిరకాల ప్రత్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్పై విజయం సాధించారు. 2009 నుంచి వీరిద్దరూ తలపడటం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ హవా, లక్ష్మణ్పై సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత కలిసివచ్చాయి. విశేషాలు.. ► కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. వీరిద్దరూ బీజేపీ అగ్రనేతలుగా వెలుగొంది, పార్టీ ఆదేశాలతో అసెంబ్లీ బరిలో దిగారు. ► హుజూరాబాద్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ విజయం సాధించగా, జగిత్యాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఓడిపోయారు. ► రాష్ట్రంలో వరుసగా ఏడుసార్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎనిమిదోసారి పోటీలో ఓడారు. ఈసారి గెలిస్తే అత్యధికసార్లు శాసనసభకు ఎన్నికై న ఎమ్మెల్యేగా మరో కొత్త రికార్డు సృష్టించేవారు. ఆయన పోటీచేసిన హుజూరాబాద్, గజ్వేల్లో రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ► ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరో దఫా పోటీలో తొలిసారి ఓడిపోయారు. ఈయన గెలిచి ఉంటే ఈటల రాజేందర్ ఏడుసార్లు ఎమ్మెల్యే రికార్డు సమం అయ్యేది. ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఇలా.. 8 కాంగ్రెస్.. 5 బీఆర్ఎస్ కైవసం! కరీంనగర్: గంగుల కమలాకర్ (బీఆర్ఎస్), ఓట్లు: 92,174, మెజారిటీ 3,169, రెండోస్థానం: బండి సంజయ్ కుమార్ (బీజేపీ), ఓట్లు: 89,005, మూడో స్థానం: పురమల్ల శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 40,052 పెద్దపల్లి: విజయరమణరావు (కాంగ్రెస్), ఓట్లు: 1,18, 888, మెజారిటీ: 55,108, రెండో స్థానం: దాసరి మనోహర్రెడ్డి(బీఆర్ఎస్) ఓట్లు: 63,780, మూడో స్థానం:దాసరి ఉష(బీఎస్పీ), ఓట్లు 10,315 రామగుండం: రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ (కాంగ్రెస్) , ఓట్లు: 92,227 , మెజారిటీ: 56,794, రెండో స్థానం: కోరుకంటి చందర్(బీఆర్ఎస్), ఓట్లు: 35,433, మూడో స్థానం: కందుల సంధ్యారాణి(బీజేపీ), ఓట్లు: 12,966 మంథని: దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్), ఓట్లు: 1,03,822 మెజారిటీ: 31,380, రెండో స్థానం: పుట్ట మధు (బీఆర్ఎస్), ఓట్లు: 72,442, మూడో స్థానం: సునీల్ రెడ్డి (బీజేపీ), ఓట్లు: 5,779 మానకొండూరు: సత్యనారాయణ (కాంగ్రెస్ ) పొందిన ఓట్లు: 96,773 మెజారిటీ : 32,365, రెండో స్థానం: రసమయి బాలకిషన్ (బీఆర్ఎస్), ఓట్లు: 64,408, మూడో స్థానం : ఆరెపల్లి మోహన్ (బీజేపీ) ఓట్లు: 14,879 చొప్పదండి: మేడిపల్లి సత్యం, పార్టీ: కాంగ్రెస్ ఓట్లు : 90,395, మెజారిటీ: 37,439, రెండో స్థానం: సుంకే రవిశంకర్ పార్టీ: (బీఆర్ఎస్) ఓట్లు : 52,956, మూడో స్థానం : బొడిగె శోభ గాలన్న, (బీజేపీ) ఓట్లు : 26,669 హుజూరాబాద్: పాడి కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్) ఓట్లు : 80,333 , మెజార్టీ: 16,873, రెండోస్థానం: ఈటల రాజేందర్ (బీజేపీ), ఓట్లు : 63,460, మూడో స్థానం : ఒడితల ప్రణవ్ (కాంగ్రెస్) ఓట్లు :53,164 హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), ఓట్లు: 1,00,955 , మెజార్టీ:19,344, రెండో స్థానం: ఒడితల సతీశ్ కుమార్, ఓట్లు: 81,611, మూడో స్థానం: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఓట్లు: 8338 సిరిసిల్ల: తారక రామారావు, (బీఆర్ఎస్), ఓట్లు: 89,244, మెజారిటీ: 29,687, రెండో స్థానం: కేకే మహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు: 59,557, మూడో స్థానం: రాణిరుద్రమారెడ్డి(బీజేపీ) 18, 328 వేములవాడ: ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 71451.మెజారిటీ: 14,581, రెండో స్థానం: చెలిమెడ లక్ష్మీనర్సింహారావు (బీఆర్ఎస్). ఓట్లు: 56,870, మూడో స్థానం: చెన్నమనేని వికాస్రావు (బీజేపీ), ఓట్లు: 29,710. జగిత్యాల: సంజయ్కుమార్ (బీఆర్ఎస్), ఓట్లు: 70,243, మెజారిటీ: 15822, రెండోస్థానం : టి.జీవన్రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు : 54,421, మూడోస్థానం : బోగ శ్రావణి (బీజేపీ), ఓట్లు : 42,138 కోరుట్ల: సంజయ్ (బీఆర్ఎస్), ఓట్లు : 72,115, మెజారిటీ: 10,305, రెండోస్థానం: ధర్మపురి అర్వింద్ (బీజేపీ), ఓట్లు : 61,810, మూడో స్థానం : జువ్వాడి నర్సింగారావు (కాంగ్రెస్), ఓట్లు : 39,647 ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్కుమార్ (కాంగ్రెస్), ఓట్లు: 91,393, మెజారిటీ: 22,039, రెండోస్థానం: కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్), ఓట్లు: 69,354, మూడో స్థానం : ఎస్.కుమార్ (బీజేపీ), ఓట్లు: 7,345 ఇవి చదవండి: కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..! -
కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ గెలుపులో యువత కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువకులు దాదాపు హస్తానికి అండగా నిలిచినట్లు అవగతమవుతోంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల ఓటర్లలో సగం మంది వరకు యువకులు ఉండడం విశేషం. మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,33,454 ఓటర్లుండగా.. వారిలో 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల ఓటర్లు 3,56,964 మంది ఉండడం గమనార్హం. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 2,26,617 ఓటర్లుండగా.. వారిలో 1,11,446 మంది యువ ఓటర్లు, వరంగల్ తూర్పులో 2,46,282 ఓటర్లుండగా వారిలో 1,17,870 మంది యువ ఓటర్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,60,55 ఓటర్లుండగా వారిలో 1,27,648 యువ ఓటర్లు ఉన్నారు. ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్కు చెందిన దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖ, కేఆర్.నాగరాజు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వెంటాడిన నిరుద్యోగ సమస్య.. అధికార బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగ సమస్య వెంటాడినట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించడం, పేపర్ లీకులు, తర్వాత రద్దు చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లు, నిరుద్యోగ యువకులు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో యువత ఓట్లు కీలకంగా మారాయనే భావన వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: పోస్టల్ బ్యాలెట్లోనూ వీడని 'నోటా' ఓట్లు! -
తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పుతో ఈ ఎన్నికల్లో తమ వైవిధ్యాన్ని చాటారు. తూర్పున కాంగ్రెస్ హవా కొనసాగగా, పశ్చిమ జిల్లాలో కమలం వికసించింది. మధ్యలో కారు ప్రయాణం సాగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు సమన్యాయం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల చరిత్రలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో బీజేపీ పాగా వేయడం గమనార్హం. కలిసొచ్చిన ముక్కోణ పోటీ.. నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోణ పోటీ నెలకొంది. నిర్మల్లో ఏలేటి మహేశ్వర్రెడ్డి(బీజేపీ), అల్లోల ఇంద్రకరణ్రెడ్డి(బీఆర్ఎస్), కూ చాడి శ్రీహరిరావు(కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమంగా ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చివరికి బీజేపీ బయటపడింది. సిర్పూర్లో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ బరిలో ఉండడంతో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీతోపాటు బీఎస్పీ ఓట్లు పంచుకున్నాయి. ముథోల్లో బీఆర్ఎస్కు మై నార్టీ ఓట్లు కలిసి రాగా, ఇక్కడ కాంగ్రెస్ ఆశించిన ఓట్లు రాబట్టలేకపోవడంతో మిగతా వర్గం ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. ఆదిలాబాద్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 6వేల మెజార్టీతో బయటపడ్డారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. మొదట బోథ్ స్థానంలోనూ బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నిలిచింది. ఎంపీ సోయం బాపురావు బరిలో ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. చివరకు బీఆర్ఎస్ 22వేల మెజార్టీ సాధించింది. ఎస్టీ స్థానాల్లో బీఆర్ఎస్.. పది స్థానాల్లో ఎనిమిది చోట్ల చతికిల పడ్డ బీఆర్ఎస్ మూడు ఎస్టీ స్థానాల్లో బోథ్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆసిఫాబాద్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కోవ లక్ష్మీ, సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు కాదని అనిల్ జాదవ్కు అవకాశం ఇస్తే, గెలిచారు. ఈ మూడు స్థానాల్లో ఖానాపూర్ మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు అప్పటి టీఆర్ఎస్కు రాగా ఆసిఫాబాద్ ఎస్టీ స్థానం మాత్రమే కాంగ్రెస్కు వచ్చింది. ఇక్కడ ఈసారి బీఆర్ఎస్ గెలుచుకుంది. అసెంబ్లీకి కొత్త ముఖాలు.. రెండో ప్రయత్నంలో రామారావు పాటిల్ గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్బాబు, ఆదిలా బాద్ నుంచి పాయల్ శంకర్, బోథ్ నుంచి అనిల్ జాదవ్, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, మంచిర్యాల నుంచి ప్రేమ్సాగర్రావు, మాజీ ఎంపీ వివేక్ తొలిసారిగా శాసనభకు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి వినోద్, కోవ లక్ష్మీ, ఏలేటి మహేశ్వర్రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. సిట్టింగ్ల ఓటమి! సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా పది మంది ఓటమి పాలయ్యారు. నిర్మల్లో సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, నాలుగు సార్లు గెలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న, ముథోల్లో విఠల్రెడ్డి, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లి చిన్నయ్య, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘోర ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ నుంచి టికెట్లు రాకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. -
స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులందరూ అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని ఏమీ లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేయడం, మరికొందరు ఓటింగ్కు దూరంగా ఉండడం జరిగేది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈవీఎం బ్యాలెట్లలో నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్) బటన్ తీసుకొచ్చారు. ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థులు ఎవరూ సరైన వారు లేరని భావించిన పక్షంలో నోటాకు ఓటు వేయవచ్చు. అత్యధికంగా నోటాను వినియోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,254 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 17,327 మంది నోటాకు ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు వేశారు. ఇలా ఈవీఎంల్లోకి.. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. దీన్ని భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ రూపొందించింది. బోథ్: బోథ్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2565 మంది నోటాను వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి జంగుబాపుకు 2044 ఓట్లు, బీసీపీ పార్టీ అభ్యర్థి ఆడె సునీల్ నాయక్కు 677, ఆర్జేపీ అభ్యర్థి హీరాజీకి 1388, డీఎస్పీ అభ్యర్థి ఉమేష్కు 1011, జీజీపీ అభ్యర్థి బాదు నైతంకు 596, స్వతంత్ర అభ్యర్థులు భోజ్యా నాయక్కు 878, ధనలక్ష్మికి 1231 ఓట్లు పోల్ అయ్యాయి. ఇవి చదవండి: తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్.. -
పోస్టల్ బ్యాలెట్లోనూ వీడని 'నోటా' ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విద్యావంతులు సైతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3073 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ స్పష్టమైన అధిక్యతను కనబర్చారు. ఆయనకు 1140 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 595 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డికి 961 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలువడం గమనార్హం. కాగా నోటాకు 10మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం 1700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు అత్యధికంగా 718 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్కు 495 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అడే గజేందర్కు 371 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది మంది నోటాకు ఓటేయడం గమనార్హం. ఇవి కూడా చదవండి: స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు! -
ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డిదే?
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో తలపండిన నాయకులే కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఇక్కడ మరోసారి బరిలో ఉండటంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాంగ్రెస్ టికెట్ లభించని కారణంగా బీఎస్పీ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి తలపడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మల్రెడ్డి రంగారెడ్డి కేవలం 356 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న మల్రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో ఢీఅంటేఢీ అనే రీతిలో బరిలో నిలిచారు. అయితే ఇప్పుడు పోలింగ్ ముగియడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతోంది. ఎక్కడ ఎవరు కలిసినా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుకుంటున్నారు. కొంతమంది బీఆర్ఎస్ అంటుంటే మరికొంతమంది కాంగ్రెస్ గెలుస్తుందని అంటుండం చర్చనీయాంశంగా మారింది. బయటకు ధీమాగా ఉన్నా... ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుపై బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా...లోలోపల ఓటర్లు ఎవరికి ఓటువేశారో తెలియక తలలుపట్టుకుంటున్నారు. ఈసారి తప్పక విజయం తమనే వరిస్తుందనే ధీమాతో మల్రెడ్డి రంగారెడ్డి ఉండగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తనను మరోసారి గెలపిస్తాయని ధీమాగా ఉన్నారు. పోలింగ్ సరళిపై ఇరు పార్టీల అభ్యర్థులు తర్జనభర్జనలు పడుతూ కాకి లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరి ఓట్లు చీల్చుతారో.... సీపీఎం, బీజేపీ అభ్యర్థులు ఎవరి ఓట్లు ఎక్కువగా చీల్చుతారో అర్థంకాకుండా ఉంది. నియోజకవర్గంలో సీపీఎం, బీజేపీలు సుమారు 15వేల నుంచి 18వేల వరకు ఓటు బ్యాంకు కలిగిఉన్నాయి. 2018లో బీజేపీ అభ్యర్థికి 17 వేల పైచిలుకు ఓట్లు రాగా.. సీపీఎం అభ్యర్థికి 10వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అదేవిధంగా టీడీపీ నుంచి పోటీ చేసిన సామ రంగారెడ్డికి 18వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. ఈసారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండటం ఎవరికి కలిసోస్తుందో అంతుచిక్కకుండా ఉంది. వారి ఓట్లు ఏ వైపు, ఏ మేరకు దారి మరిలాయో అర్థంకాని పరిస్థితి. అయితే చాలావరకు బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన వారు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు సమాచారం. డబ్బుల ప్రభావం ఏ మేరకో.. ఇదిలాఉంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా డబ్బుల ప్రభావం కనిపించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటుకు ఇంత చొప్పున అని పంపిణీ చేసిన విషయం బహిరంగ రహస్యమే. ఈ డబ్బుల ప్రభావం అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేస్తుందా లేదా అనే విషయాన్ని ఫలితాలు వస్తేగాని స్పష్టంగా బయటపడదు. ఏదిఏమైనా ఎన్నికల ఫలితాలను ముందుగా ఉహించి చెప్పడం ఇబ్బందిగా మారింది. ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల జాతకాలు బట్టబయలు కానున్నాయి. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. -
ప్లస్సా.. మైనస్సా..? ఫలితాలపై అభ్యర్థుల బెంగ!
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఆదివారం ఫలితాలు రానున్నాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం నుంచే ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు గెలుపోటములపై బేరీజు వేసుకుంటున్నారు. ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు వస్తాయి.. మిగతా పార్టీలకు ఎన్ని ఓట్లు పడతాయి.. స్వతంత్రులు ఏమైనా ఓట్లు చీలుస్తారా.. అక్కడ మనకు ప్లస్సా.. మైనస్సా.. ఇలాంటి లెక్కలు వేస్తున్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ అభ్యర్థులు ఎన్నికల సంగ్రామం నుంచి కొంత సేద తీరినట్టే తీరి.. మరో పక్క ఇంటికి వచ్చే నాయకులు, కార్యకర్తల నుంచి పోలింగ్ బూత్ల వారీగా పరిస్థితిపై విశ్లేషణ చేసుకుంటున్నారు. మండలం, గ్రామం, పట్టణం, వార్డు ఇలా అన్నీ స్థాయిల్లో ఆయా పోలింగ్ బూత్ల వారీగా క్షేత్రస్థాయిలో మన పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి.. ఇతర పార్టీలకు ఎన్ని ఓట్లు పడవచ్చు.. మన పరిస్థితి బాగుందా.. లేదా.. ఇలా లెక్కల్లో మునిగితేలారు. మహిళల ఓట్లే అధికంగా పోల్.. పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా పోలయ్యాయి. ఈ లెక్కన అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళల ఓట్ల శాతం కీలకం కానుంది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో మహిళా ఓట్లే అధికంగా పోలయ్యాయి. కాగా, జిల్లాలో బోథ్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 177 బాబ్జీపేట్లో వంద శాతం ఓటింగ్ జరిగింది. జిల్లాలో వందశాతం ఓటింగ్ జరిగిన బూత్ ఇది ఒక్కటే కావడం విశేషం. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ప్రభుత్వ బీసీ (బాలుర) కళాశాల వసతి గృహంలోని పోలింగ్ కేంద్రంలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 47.86 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో 1,85,862 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో 1,65,793 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న 44.56 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గంలో ఫలితాలు ఎలా ఉండనున్నాయో.. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాల్సిందే. బోథ్ నియోజకవర్గంలో 1,72,397 ఓట్లు ఈ ఎన్నికల్లో పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో 1,54,487 ఓట్లు పోల్ కాగా, అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు 38.19 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే. మొత్తంగా రిజల్ట్స్ డేకు ఒకరోజు మాత్రమే వ్యవధి ఉండగా అందరు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పోలైన ఓట్లు: -మొత్తం ఓటర్లు: 4,48,374, -పోలైన ఓట్లు: 3,58,259, -శాతం: 79.86% పురుషులు, మహిళల ఓట్ల వివరాలు: ► పురుషుల ఓట్లు: 2,19,291 పోలైన ఓట్లు: 1,77,597 శాతం: 80.96% ► మహిళల ఓట్లు: 2,29,074 పోలైన ఓట్లు: 1,80,661 శాతం: 78.86% ఇవి చదవండి: కేసీఆర్ గజ్వేల్లో హ్యాట్రిక్ కొడతారా? -
డబ్బులు కాజేసిన వారిపై నేతల నజర్..
నల్లగొండ టూటౌన్ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెట్టిన విషయం బహిరంగ రహస్యమే. ప్రత్యర్థులను చిత్తు చేసి ఎలాగైనా గెలవాలనే టార్గెట్ పెట్టుకొని అభ్యర్థులు తమ పార్టీలకు చెందిన వార్డు, గ్రామ ముఖ్య నాయకుల (ఇన్చార్జి) ద్వారా ఓటర్లకు మద్యం, డబ్బులు, మాంసం పంపిణీ చేశారు. కానీ కొందరు చోటా నాయకులు డబ్బులు పంపిణీ చేసే సమయంలో డబ్బులను నొక్కినట్లు ఆయా పార్టీలకు చెందిన సొంత మనుషులే అభ్యర్థుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. అవకాశంపోతే మళ్లీ దొరకదనే విధంగా కొందరు ఓటర్లకు పూర్తిస్థాయిలో పంపకాలు చేయకుండా జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల జనాలను ఓటు వేయమని కూడా అడగలేదని ఓటర్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల సొంత పార్టీలకు చెందిన కార్యకర్తలకు సైతం డబ్బులు పంచకపోవడంతో.. ఇన్చార్జిల తీరు వివాదాస్పదంగా మారింది. నల్లగొండ పట్టణంలో కొందరు ఓటర్లు వార్డు ఇన్చార్జిలను డబ్బుల విషయంపై నిలదీసిన ఘటనలు సైతం ఉన్నాయి. డబ్బులు కాజేసిన వారిపై నేతల నజర్.. ఓటర్లకు పంచమని ఇచ్చిన డబ్బులు ఎంత మందికి చేరాయనే వివరాలను ఆయా పార్టీల అభ్యర్థులు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఎంత మందికి ఇచ్చారు.. ఇవ్వకుండా నొక్కిన డబ్బులు ఎన్ని, తమ దగ్గర డబ్బులు తీసుకొని ప్రత్యర్థి పార్టీకి సహకరించిన వారెందరు అనే వివరాలను రాబడుతున్నారు. అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు, వారికి వచ్చే ఓట్ల శాతం తదితర వివరాలను క్రోడీకరించడంతో పాటు స్థానిక నాయకత్వం ద్వారా సమచారం సేకరిస్తున్నారు. డబ్బులు నొక్కి తమకు హ్యాండ్ ఇచ్చిన వారికి రానున్న రోజుల్లో చెక్ పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బులు నొక్కిన వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తగా కొన్ని చోట్ల ఇప్పటికే సదరు నాయకులకు అభ్యర్థులు ఫోన్లు చేసి గట్టిగా క్లాస్ పీకినట్లు తెలిసింది. ఒకరిద్దరు అభ్యర్థులు అయితే డబ్బులు పంచని వారిపై తీవ్ర ఆగ్రహావేశాలతో అంతు చూస్తామని హెచ్చిరించినట్లు సామాజిక మాధ్యమాల్లో సైతం బహిర్గతం అయ్యాయి. -
అభ్యర్థులకు తడిసిమోపెడు..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపైడెంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థులు సభలు సమావేశాల నిర్వహణకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బుల పంపిణీపాటు గిఫ్ట్లు, చికెన్, మటన్, మందు వంటి వాటిలో ప్రలోభ పెట్టారు. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొందరు అభ్యర్థులు ధైర్యంగా ఖర్చు చేయగా, మరికొందరు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారు. ఇంకొందరైతే ఆ ఖర్చులను తట్టుకోలేక, ఓటర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక చేతులెత్తాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నామినేషన్ల రోజు నాటి నుంచే.. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచి ఖర్చుల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి అభ్యర్థులంతా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏ ఊరికి వెళ్లినా వందలాది మందిని పిలిపించుకున్నారు. ఒక్కోక్కరికి రూ.200 నుంచి రూ.300 చెల్లించారు. గ్రామాల్లో రోజూ ఆయా పార్టీల అభ్యర్థులు కొంత మందిని టీమ్గా ఏర్పాటు చేసి ఇల్లిల్లూ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని స్టిక్కర్లు అంటిస్తూ.. కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. బూత్ల వారీగా డబ్బుల పంపిణీ.. ప్రచార ఖర్చులకు తోడు బూత్లో ప్రచారం చేసే వారి ఖర్చుల నిమిత్తం రోజుకు ఒక పార్టీ బూత్కు రూ.5 వేల చొప్పున ఇవ్వగా, మరో పార్టీ రూ.10 వేలకు పైగా చెల్లించింది. వార్డు లీడర్లకు, ముఖ్యమైన వారికి సాయంత్రమైతే మందు పార్టీల ఖర్చు అదనంగా పెట్టుకోవాల్సి వచ్చిందని ఓ నాయకుడు వివరించారు. ఈ ఖర్చులను కొంత మంది అభ్యర్థులు తట్టుకోలేక నాలుగైదు రోజుల పాటు బూత్లలో డబ్బుల పంపిణీ నిలిపివేశారు. మందు, విందులు అదనం.. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచే గ్రామాలు, వార్డుల వారీగా కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో పాటు ఆయా వృత్తి సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వారికి మందు, విందు ఏర్పాటు చేశారు. కొందరు రూ.500 చొప్పున అక్కడే పంపిణీ చేశారు. పోలింగ్కు ముందు డబ్బుల పంపిణీ పోలింగ్కు ముందు రోజు నుంచి అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున లక్ష మందికిపైగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.వేయి, రూ.1500 పంపిణీ చేయగా, మరికొందరు రూ.200 నుంచి రూ.800 వరకు ఇచ్చారు. వీటితో పాటు మద్యం ఆఫ్, ఫుల్ బాటిళ్లను కూడా పంపిణీ చేశారు. కొందరు రూ.2 వేల చొప్పున పంపిణీ చేస్తే.. ఇంకొందరు రూ.2,500 పంపిణీ చేసినట్లు తెలిసింది. రెండు మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే డబ్బుల్లేక చేతులెత్తేసినట్లు చర్చ జరుగుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయని పార్టీల కోసం ఓటర్లు చివరి వరకు ఎదురుచూసి, డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిసింది. -
జిల్లాలో 6 నియోజక వర్గాలు.. తొలి ఫలితం మిర్యాలగూడదే!
నల్లగొండ: జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అంతా సిద్ధమైంది. జిల్లా కేంద్రం సమీపంలోని మిర్యాలగూడ రోడ్డులో దుప్పలిపల్లి గ్రామ శివారులోని గోదాముల్లో జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఆధారంగా.. రౌండ్లు వారీగా కౌంటింగ్ జరగనుంది. మిర్యాలగూడ నియోజకవర్గం లెక్కింపు ప్రకియ 19 రౌండ్లలోనే పూర్తికానుండడంతో.. అక్కడి ఫలితమే మొదట వెలువడనుంది. లెక్కింపు ఇలా.. 3వ తేదీన ఉదయం 7 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్రూమ్లను తెరుస్తారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అవి పూర్తయిన తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ ఓట్లు లెక్కింపు కోసం 4 టేబుళ్లను, సర్వీస్ ఓట్ల లెక్కింపునకు మరో టేబుళ్ల ఏర్పాటు చేశారు. రౌండ్ పూర్తయిన తర్వాత జనరల్ అబ్జర్వర్ అన్నీ పరిశీలించిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను వెల్లడించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ర్యాండమైజ్గా ప్రతి నియోజకర్గంలో రెండు పోలింగ్ బూత్లలో వచ్చిన ఓట్లకు సంబంధించి ఈవీఎంల ఓట్లను. వీవీ ప్యాట్ల ఓట్లను సరి చూస్తారు. రెండు సమానంగా వస్తేనే.. తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. దేవరకొండ ఫలితం 23 రౌండ్లలో.. జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో దేవరకొండ నియోజక వర్గం మినహా మిగతా నియోజక వర్గాల్లో 22 రౌండ్లలోపే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజక వర్గాల్లో 22 రౌండ్లు, మిర్యాలగూడ 19, నల్లగొండ 21 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. దేవరకొండ నియోజకవర్గంలో 23వ రౌండ్లో కౌంటింగ్ పూర్తవుతుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేందుకు 20 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. అభ్యర్థులు తక్కువగా ఉన్న చోట 20 నిమిషాల్లోపే ప్రక్రియ పూర్తి కానుంది. మునుగోడులో అభ్యర్థులు అధికంగా ఉండటంతో లెక్కింపు ఆలస్యం కానుంది. భద్రతను పరిశీలించే అవకాశం.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదట స్టేట్ పోలీస్, రెండో విడతలో స్టేట్ ఆర్ముడు పోలీస్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీఏపీఎఫ్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏజెంట్లు, అభ్యర్థులు వాటిని పరిశీలించుకునేందుకు అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్ల బయట ఏర్పాటు చేసిన సెంటర్లోకి వెళ్లి అక్కడ సీసీ కెమెరాల ద్వారా భద్రతను చూసుకోవచ్చు. పకడ్బందీగా ఓట్ల లెక్కింపు.. కలెక్టర్ ఆర్వి.కర్ణన్ నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వి.కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఆయన తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆదివారం ఉదయం 8 గంటలకు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఒక్కో హాల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్లోకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది చదవండి: పెరగని పోలింగ్.. ఈసారి 41,631 మంది ఓటుకు దూరం -
ఓటు వేయడానికి.. 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించవచ్చు
నల్లగొండ, త్రిపురారం: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఓటేసేందుకు ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్ కార్డు) తప్పనిసరని లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 కార్డుల్లో ఏదేని ఒక గుర్తింపు కార్డు ఉండాలని నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్ తెలిపారు. 1. ఆధార్ కార్డు 2. ఉపాధి హామీ జాబ్ కార్డు 3. బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటో పాస్బుక్ 4. కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు 5. డ్రైవింగ్ లైసెన్స్ 6.పాన్ కార్డు 7. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(ఆర్జీఐ) జారీ చేసిన స్మార్ట్ కార్డు 8. భారతీయ పాస్పోర్ట్ 9. ఫొటో గల పెన్షన్ పత్రాలు 10. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు 11.ఎంపీలు/ ఎమ్మెల్యేలు/ ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు 12. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి ఉండాలని పేర్కొన్నారు. ఇది చదవండి: ఓటేద్దాం రండి! -
'అధ్యక్షా..!' అనేదెవరో?
సాక్షి, వరంగల్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయా పార్టీల ప్రెసిండెట్లు తలపడుతుండగా పోటీ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్షా.. అంటారో అనే విషయంలో ఆయా పార్టీల నేతలతోపాటు ఓటర్లలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నాలుగు పర్యాయాలు వరంగల్ పశ్చిమ నుంచి విజయం సాధించి, ఐదో విజయం కోసం ధీమాగా ముందుకు సాగుతున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తొలిసారి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకుని అసెంబ్లీలో అడుగిడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదో విజయం కోసం దాస్యం వినయ్ భాస్కర్.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఐదో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉద్యమకారులకు అండగా నిలవడం, ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు ఉండడం, నిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వినయ్ భాస్కర్కు కలిసొచ్చే అంశాలు. ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బబ్దిదారులతో పాటు నియోజకర్గంలో వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందించారు. కార్మికులకు సొంతగా ప్రీమియం చెల్లించి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించి బీమా సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ నెల 28న నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ రావడంతో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. మొదటిసారి శాసనసభకు నాయిని రాజేందర్ రెడ్డి పోటీ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి మొదటిసారి శాసన సభ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడిన సమయంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. ఉమ్మడి వరంగల్, జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలో పార్టీని కాపాడి ఈసారి టికెట్ సాధించారు. 2014, 2018లో పార్టీ టికెట్ ఆశించారు. ఆ రెండు సార్లు రాకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో బరిలో దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉండడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, నాలుగు పర్యాయాలుగా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత నాయిని రాజేందర్ రెడ్డికి అనుకూలించే అంశాలు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జార్ఖండ్ సీఎం బూపేష్ భఘేల్, సినీ నటి విజయ శాంతి చేసిన ప్రచారం తనకు విజయం చేకూరుస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. 'పద్మ' విశసించేనా..!? వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రావు పద్మ, పశ్చిమ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. కాగా, రావు పద్మ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ అశించి చివరకు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. వరంగల్ మహానగరంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ, అమ్మత్, హృదయ్ పథకాల ద్వారా జరిగిన అభివృద్ది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్పై ఉన్న అసంతృప్తి, కాజీపేటలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్, వ్యాగన్ తయారీ పరిశ్రమ మంజూరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు అవకాశం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీకి ప్రజాదరణ ఉండడం, డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి, మహిళల ఓట్లు వంటివి రావు పద్మకు కలిపోచ్చే అంశాలు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ రాక, బీజేపీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి, మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, ఇతర అగ్ర నాయకుల ప్రచారం చేయడం వల్ల రావు పద్మ తాను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది! -
TS: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్రావు, బోయినపల్లి వినోద్కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది. ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్ -
నా బలం, బలగం ‘సాగర్’ ప్రజలే.. అవే నన్ను గెలిపిస్తాయి: ఎమ్మెల్యే భగత్
‘సాగర్ నియోజకవర్గ ప్రజలే నా బలం.. బలగం. నేను ప్రచారానికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గతంతో పోల్చితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ పథకాలు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సాక్షితో మాట్లాడారు. నల్గొండ: సాగర్ ఉప ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం వారికి అందుబాటులో ఉంటున్నా. ఇక్కడే స్థిరనివాసం ఏర్పచుకుని నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నా. సాగర్లో ఏడు సార్లు పాలించినవారు చేయని అభివృద్ధిని కేవలం రెండున్నరేళ్లల్లోనే నేను చేసి చూపెట్టా. బలహీనవర్గాల బిడ్డగా ప్రజలు మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. రూ.200 కోట్లతో అభివృద్ధి చేశా.. 2018లో తొలిసారిగా మా నాన్న నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలిచాక హాలియా, నందికొండను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలో 40 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాం. నేను గెలిచాక రూ.60 కోట్లతో హాలియా, నందికొండ పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. వరద కాల్వ పనులను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాం. నియోజకవర్గంలో 10 విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాం. నందికొండలో క్వాటర్స్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చాం. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశాం. సాగర్లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలోని మూడు పీహెచ్సీలకు రూ.25 లక్షల చొప్పున కేటాయించి అభివృద్ధి చేశాం. కంపాసాగర్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలను బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలగా ఏర్పాటు చేయడమే నాముందు ఉన్న ఏకైక లక్ష్యం. నెల్లికల్లు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. రూ.664 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దవూర మండలంలో సుమారు రూ.2.5 కోట్లతో డీ8, డీ9 లిఫ్ట్ పనులు పూర్తి చేశాం. దీని ద్వారా 7300 ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ.33.81 కోట్లతో చెక్డ్యాంల నిర్మాణం చేపట్టాం. ఇంకా త్రిపురారం, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో లిఫ్ట్లు, చెక్డ్యాంల ఏర్పాటు చేయాల్సి ఉంది. -
చార్మినార్ జోన్లోకి మెదక్జిల్లా..
నర్సాపూర్: ఈ ఎన్నికలలో గెలిచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలుపుతామని, ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతారెడ్డి హామీ ఇచ్చారు. తాము ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమకు అండగా ఉంటామని, పూర్తి మద్దతు తెలుపుతున్నారని ఆమె చెపుతున్నారు. మరింత మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుంచి స్పందన ఏమిటి? ఎమ్మెల్యే మదన్రెడ్డితో పాటు ఆయా మండలాల నాయకులు, గ్రామ నాయకులతో కలిసి గ్రామాల్లో ప్రచారం కోసం వెళితే ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. నాకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు నాకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజలు ఏయే సమస్యలను చెబుతున్నారు? చాలా గ్రామాల్లో పేదలు సొంత ఇళ్లు కావాలని అడిగారు. ఇప్పటికే మూడు వేలగృహలక్ష్మి ఇళ్లు మంజూరు అయ్యాయి. ఇటీవల సీఎం కేసీఆర్ నర్సాపూర్కు వచ్చినప్పుడు నియోజకవర్గానికి మరో ఐదు వేల ఇళ్లు కావాలని వి/్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్నికల అనంతరం పేదలందరికీ గృహలక్ష్మి ఇళ్లు మంజూరు చేస్తాం. పార్టీ మేనిఫెస్టోపై ప్రజల స్పందన ఎలా ఉంది? సీఎం కేసీఆర్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు బాగా స్వాగతిస్తున్నారు. అన్ని పథకాలకు స్పందన బాగుంది. సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.3 వేలు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, రైతుబంధు, రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్, అసైన్డ్ భూములకు, పోడు భూములకు పట్టాలు అందజేసి సర్వ హక్కులు కల్పించే పథకాలతో పాటు ఇతర పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారు. మీ విజయానికి ఏయే అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు? సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని అర్హులందరికీ అందాయి. లబ్ధిదారులంతా తమ పార్టీకి అండగా నిలిచారు. కొన్ని పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నాయి. ఆసరా పింఛన్లు, రైతుబంధు, మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీరు అందించాం. దీంతో తాగునీటి ఇబ్బందులు తొలిగిపోవడంతో మహిళల అండ మాకుంది. అలాగే ఆరోగ్య శ్రీ పథకం లాంటి పథకాలు నా విజయానికి దోహదపడతాయి. ఆ పథకాలే రాష్ట్రంలో బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తేగలవు. మీకు ఏ పార్టీతో గట్టి పోటీ ఉంది? మాకు కాంగ్రెస్తోనే గట్టి పోటీ ఉంది. అయితే ప్రజల ఆశీర్వాదం, మా పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితో నేనే తప్పక గెలుస్తాను. అసైన్డ్ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటుందని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుట్రలను ప్రజలు గుర్తించి ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చేదే తప్ప తీసుకునేది కాదని వారికి తెలుసు. ప్రజలకు మీరిచ్చే హామీలు? నేను గెలువగానే సీఎం కేసీఆర్, మంత్రులు సహకారంతో జిల్లాను సిరిసిల్లజోన్ నుంచి చార్మినార్ జోన్లో కలుపుతా. అలాగే నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. నర్సాపూర్లోని ఉస్మానియా పీజీ కాలేజీకి, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తాం. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాలు పూర్తి చేయడానికి, మైనారిటీ, బాలికల గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాను. ప్రభుత్వ ఆసుపత్రులలో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాను. గ్రామాలలో అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత ప్రకారం ప్రణాళికబద్ధంగా చేపడతాం. పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తాం. -
డీజే సౌండ్తో గుండెపోటుకు గురై మహిళ మృతి.. డీజే ఏర్పాటు చేసింది?
కొండమల్లేపల్లి: దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లిలో ఓ రాజకీయ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో డీజే సౌండ్ కారణంగా ఓ మహిళ గుండెపోటుకు గురై మృతి చెందింది. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన గుంటోజు అమృతమ్మ(51) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోర్ పిన్ డిజే సౌండ్స్తో తీవ్రమైన శబ్దాన్ని తట్టుకోలేక అమృతమ్మ గుండెపోటుకు గురై కుప్పకూలింది. దీంతో స్థానికులు ఆమెను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమృతమ్మను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని పోలీసులు తెలిపారు. కోళ్ల దాణా లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా మాడుగులపల్లి: కోళ్ల దాణా బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన మాడుగులపల్లి మండల పరిధిలోని టోల్ప్లాజా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి కోళ్ల దాణా(సోయాపొట్టు) బస్తాల లోడ్తో లారీ ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లాకు బయల్దేరింది. మార్గమధ్యలో మాడుగులపల్లి టోల్ప్లాజా సమీపంలో రోడ్డు దిగుడుగా ఉండడాన్ని డ్రైవర్ గుర్తించకపోవడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు ఎలాంటి గాయాలు కాలేదు. దాణా బస్తాలను మరో లారీలోకి లోడ్ చేసి క్రేన్ సాయంతో బోల్తా పడిన లారీని పైకెత్తారు. -
చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం దాడులు..
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా సాగిన ప్రచారపర్వం చివరిరోజు ఒక్క ఘటనతో ఉద్రిక్తంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని వైఎస్సార్కాలనీలో మంగళవారం ఉదయం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి, పార్టీ నాయకులతో ప్రచారానికి వెళ్లాడు. అదే సమయానికి బీఆర్ఎస్ నాయకులు ప్రచార వాహనంతో వచ్చారు. పోటాపోటీగా పాటలు పెట్టవద్దన్న అంశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ నాయకుల కూడా ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో వైఎస్సార్ కాలనీ ఉద్రిక్తంగా మారింది. పలువురు స్థానికులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, పురుషోత్తం వెంటనే అక్కడి చేరుకున్నారు. భారీసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు. అనంతరం బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి తన ప్రచారం కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: ‘గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు. కరీంనగర్లో నేను చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ములేని వ్యక్తి నాపై దొంగ వీడియోలు సృష్టించేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందింది. దొంగ వీడియోలు సృష్టిస్తే చరిత్ర హీనుడిగా మారతావు’ అంటూ కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. కార్యకర్తలే నా హీరోలు.. కరీంనగర్లో గెలిచేది బీజేపీ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం కరీంనగర్లో మహాబైక్ ర్యాలీ నిర్వహించారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కిసాన్నగర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్, రాజీవ్గాంధీ విగ్రహం, టవర్ సర్కిల్, శాసీ్త్రరోడ్, కమాన్, ఎన్టీఆర్ విగ్రహం, గణేశ్నగర్ బైపాస్, అంబేడ్కర్స్టేడియం, భగత్సింగ్ విగ్రహం, గోదాంగడ్డ, ఉమెన్స్కాలేజ్, రాంనగర్ మార్క్ఫెడ్, మంకమ్మతోట, శివ థియేటర్, జగిత్యాల రోడ్, అంబేడ్కర్ విగ్రహం మీదుగా రేకుర్తి వరకు సాగింది. ర్యాలీని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రారంభించారు. రేకుర్తి వద్ద ముగింపు కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కార్యకర్తలే తన హీరోలు అన్నారు. ప్రజా ఆశీర్వాదంతో కరీంనగర్లో భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఇది తట్టుకోలేక గంగుల కమలాకర్ తనపై దొంగ వీడియో, ఆడియోలు సృష్టించి వైరల్చేసే పనిలో పడినట్లు సమాచారం ఉందని అన్నారు. దమ్ముంటే నేరుగా కొట్లాడాలని, అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుపునిచ్చారు. భూకబ్జాలు, రౌడీయిజం తన దగ్గర చెల్లవన్నారు. ఫాంహౌజ్లో ఉన్న కేసీఆర్ను ధర్నాచౌక్కు తీసుకొచ్చానని, నువ్వెంత అంటూ గంగులకు సవాల్ విసిరారు. మీరు అధికారంలో ఉండేది మరో 48 గంటలే అని, 30న కరీంనగర్లో బీజేపీకే ఓటేయాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి దుకాణం బంద్ చేసుకున్నాడని తెలిపారు. భూకబ్జాదారులు, అవినీతి పరులుకావాలా? మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రజల కోసం పోరాడుతున్న తాను కావాలో? ఆలోచించండని అన్నారు. కమలంపువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మందకృష్ణ మాట్లాడుతూ.. బండి సంజయ్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలతోపాటు ఓసీ వర్గాలపై ఉందని అన్నారు. ఇప్పటి వరకు జనాభాలో 1,2 శాతం జనాభా కూడా లేనివాళ్లే 75 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, 50 శాతానికిపైగా ఉన్న బీసీల్లో ఒక్కరిని కూడా సీఎం చేయలేదన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి చదవండి: చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం దాడులు.. -
ష్.. గప్చుప్! ప్రచారంలో సైలెన్స్ పీరియడ్ మొదలు..
సాక్షిప్రతినిధి,కరీంనగర్/పెద్దపల్లి: ఎన్నికల పర్వంలో మరో ఘట్టం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్లో సీఎం కేసీఆర్తో మొదలైన సభల సందడి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ జైరాంరమేశ్తో ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే రాజకీయ చైతన్యానికి ప్రతీక. అందుకే, ఈ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించిన వారే రాజధానిలో అధికారంలో ఉంటారన్న నమ్మకం అనాదిగా వస్తోంది. అందుకే, ఈ జిల్లాపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లు ప్రత్యేక దృష్టి సారించి, సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. ప్రముఖుల సభలతో ఊపు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్కు ఉద్యమకాలం నుంచి ప్రత్యేక అభిమానం. అందుకే, ఆయన ఈ జిల్లాలో పలుమార్లు సుడిగాలి పర్యటన చేశారు. హుస్నాబాద్తో మొదలు పెట్టిన సీఎం కేసీఆర్ తరువాత విడతల వారీగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆఖరుగా వేములవాడతో ఉమ్మడి జిల్లా సభలు ముగించారు. అలాగే కేటీఆర్ కూడా 13 నియోజకవర్గాల్లో పర్యటించారు. – ప్రధాని మోదీ కరీంనగర్కు, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్షా (జమ్మికుంట), యూపీ సీఎం యోగి (వేములవాడ), మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (ధర్మపురి)లు బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు. – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, వేములవాడలో పర్యటించారు. వీరే కాక రేవంత్రెడ్డి, జైరాంరమేశ్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాగేల్ తదితరులు సభల్లో పాల్గొన్నారు. 50 రోజులు హోరెత్తిన ప్రచారం.. గతనెల 9న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దరిమిలా.. ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్థుల ఖరారు, నామినేషన్లతో జోరందుకున్న ప్రచారంలో మొత్తంగా దాదాపు 50 రోజులుగా అభ్యర్థులు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో దూసుకెళ్లారు. కొందరు అభ్యర్థులు భారీ బహిరంగ సభల ద్వారా బలప్రదర్శన చేయగా, మరికొందరు నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నమ్ముకున్నారు. ప్రజలకు తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలతో పాటు, తమదైన హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి యత్నించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు, వారి కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. సైలెన్స్ పీరియడ్ మొదలు.. ఉమ్మడి జిల్లాల్లో 13 నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సెలెన్స్ పీరియడ్గా ప్రకటించారు. అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్ ఎస్ఎంఎస్ల ప్రసారంపై నిషేధం ఉందని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారం తర్వాత తెర వెనుక పంపిణీలపై ఎన్నికల అధికారులు దృష్టిపెట్టారు. బల్క్ మెసేజ్లు, సోషల్ మీడియాలపైనా నిఘా పెట్టారు. నియోజకవర్గం.. పోలింగ్ స్టేషన్ల వివరాలు.. కరీంనగర్ నియోజకవర్గంలో 390 పోలింగ్ స్టేషన్లు, చొప్పదండిలో 327, మానకొండూరులో 316, హుజూరాబాద్లో 305, రామగుండంలో 259, మంథనిలో 288, పెద్దపల్లిలో 290, వేములవాడలో 170, సిరిసిల్లలో 287, కోరుట్లలో 262, జగిత్యాలలో 254, ధర్మపురిలో 269 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది! -
ఉమ్మడి వరంగల్.. ఎవరి వ్యూహాలు వారివే
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ఈనెల 15న ముగియగా.. సుమారు 13 రోజులపాటు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగించారు. నేతలు చివరి ప్రయత్నంగా ప్రలోభాలకు తెరలేపి, ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెబుతున్నారని సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 12 నియోజకవర్గాల నుంచి 36 మంది పోటీలో ఉన్నా రు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా? అన్నట్లు పోటీ సాగుతుండగా.. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు, శ్రేణులు రంగంలోకి దిగగా.. మరోవైపు ఎలాగైనా సత్తా చాటాలని స్వతంత్రులు పావులు కదుపుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో నేతలు, అభ్యర్థులు తమ చివరి వ్యూహాలకు పదునుపెడుతున్నారు. చివరిరోజున ఉమ్మడి జిల్లాలో సభలు, సమావేశాలు, బైక్ ర్యాలీలు, కులసంఘాల భేటీలతో పట్టభద్ర ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. గురువారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తమకు అనుకూలంగా పోలింగ్ చేయించుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఓరుగల్లు ప్రచారంలో అగ్రనేతలు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. అక్టోబర్ 16న ఉమ్మడి వరంగల్లో తొలి ప్రచార సభను జనగామలో నిర్వహించిన సీఎం కేసీఆర్ అప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్టోబర్ 18న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, కేంద్రమంత్రులు అమిత్షా, అనురాగ్ ఠాకూర్, అశ్వినికుమార్ చౌబే తదితరులు ఉమ్మడి వరంగల్లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. 27న ప్రధాని నరేంద్రమోదీ మహబూబాబాద్లో ప్రచారం నిర్వహించారు. కర్ణాటక, అస్సాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా పార్టీల తరఫున ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో తిరగ్గా.. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు క్యాంపెయిన్ నిర్వహించారు. ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్లలో డీకే శివకుమార్, రేవంత్రెడ్డి, విజయశాంతి పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో బీఎస్పీ పక్షాన ఆ పార్టీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రచారం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతుగా ప్రచారసభల్లో పాల్గొన్నారు. మొత్తంగా 13 రోజుల పాటు పోటాపోటీగా సాగిన ప్రచారం, డీజేలు, మైకుల మోత మంగళవారం సాయంత్రం నిలిచింది. ఎవరి వ్యూహాలు వారివే.. ఉమ్మడి వరంగల్లోని 12 నియోజకవర్గాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 216 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా వరంగల్ తూర్పు నుంచి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అత్యల్పంగా భూపాలపల్లి నుంచి 9 మంది ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 36 మంది 12 సెగ్మెంట్లలో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్లో మొత్తం 29,74,631 ఓటర్లుండగా.. 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారు 14,70,458 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో యువ, నవ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో సాగుతుండగా.. ఆ ఓటర్లను ఆకట్టుకోవడంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఆరు జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రోజుకోరీతిలో ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ప్రచారం పోరు రసవత్తరంగా సాగింది. ఎట్టకేలకు ప్రచార ఆర్భాటానికి మంగళవారం సాయంత్రం తెరపడడంతో రాత్రి నుంచి డబ్బులు, మద్యం, కానుకల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కాగా.. నగదు, మద్యం భారీగా పంపిణీ జరుగుతుందన్న ప్రచారం మేరకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 24 చెక్పోస్టుల ద్వారా సుమారు రూ.12 కోట్ల మేరకు నగదు, మద్యం, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు 144 సెక్షన్ను అమల్లోకి తెచ్చారు. -
Telangana Assembly Elections: ఓటర్లూ.. ఇవి తెలుసుకోండి
కల్వకుర్తి టౌన్: అసెంబ్లీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్కు ముందు ఓటర్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ►ఓటరు జాబితాలో పేరు ఉందా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో లేదా స్థానికంగా ఓటరు నమోదు కేంద్రంలో పరిశీలించుకోవచ్చు. ►ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఫొటో గుర్తింపు కార్డు, ఓటరు చీటి మీ వద్ద ఉంచుకోవాలి. ► మీ ఇంటి వద్దకే బూత్స్థాయి అధికారి వచ్చి ఓటరు చీటి ఇచ్చి వెళ్తారు. ► ఒకవేళ ఓటరు చీటి ఇవ్వకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉండే రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద పొందవచ్చు. ►పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చీటి, గుర్తింపు కార్డును చూపించాలి. ► పోలింగ్ అధికారుల్లో ఒకరు ఓటరు జాబితాలో గుర్తింపుకార్డుతో పాటు మీ పేరును పరిశీలిస్తారు. మరో అధికారి మీ వేలికి సిరా చుక్క అంటిస్తారు. ఆ తర్వాత ఒక చీటి ఇస్తారు. ► మూడో అధికారి ఆ చీటిని పరిశీలిస్తారు. ► ఆ తర్వాత ఈవీఎంపై మీరు ఎన్నుకోవాల్సిన అభ్యర్థికి కేటాయించిన బటన్పై నొక్కాలి. ►మీరు ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో నిర్దారణ చేసుకోవచ్చు. ►సీల్డ్ బాక్స్లోని గ్లాస్ కేసులో అది మనకు ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. -
గెలిచినా, ఓడినా.. ప్రజల కోసమే పనిచేస్తా
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలిగా ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఇప్పుడు హుజూర్నగర్ నుంచి సీపీఎం అభ్యర్థీగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మల్లు స్వరాజ్యం రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల తర్వాత అదే కుటుంబం నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. మహిళల సంక్షేమం, అభివృద్ధిపై వివక్ష.. మహిళా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. పాలకులెవరైనా కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెబుతున్నాయే తప్ప ఆచరణలో పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. మల్లు స్వరాజ్యం కోడలిగా ఆమె చూపిన బాటలో నడుస్తున్నా. ప్రజా పోరాటాలు చేసినా, ప్రజాస్వామిక ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపించవచ్చనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలిచాను. గెలిచినా, ఓడినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా. మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సమానత్వం, మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా. అత్తామామల ప్రోద్బలంతోనే.. మా అత్తామామ మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నా భర్త నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే ఇంతవరకు వచ్చాను. వివాహం అయ్యాక అత్తమామల ప్రోద్బలంతో కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకున్నా. డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశా. రాజకీయ అవగాహన ఉంది సీపీఎం అనుబంధ ప్రజా సంఘమైన ఐద్వాకు లీగల్ సెల్ కన్వీనర్గా పనిచేశా. ఐద్వా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. తెలంగాణ వచ్చిన తర్వాత ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి సీపీఎం తరఫున పోటీచేశా. పోరాటమే గెలిపిస్తుంది నిత్యం ప్రజల్లో ఉంటూ మహిళలు, కార్మిక సమస్యలపై పోరాడాను. సూర్యాపేట మండలం రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యాక, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా. నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశాను. పోలీసుల లాఠీచార్జ్లకు గురయ్యా.. జైలుకు వెళ్లా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడాను, ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నిరంతరం ప్రజల కోసం పోరాడా.. ఆ పోరాటమే నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉపాధిహామీ పనులను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసేలా కృషిచేస్తా. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న మిర్చి, పత్తి పంటలకు వాటికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. శీతల గిడ్డంగులు లేవు. హుజూర్నగర్లో మహిళా డిగ్రీ కళాశాల కావాలి. మండలానికి ఒక పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ ఉండాలి. సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్టులు సరిగా పనిచేయడం లేదు. పోడు భూములకు పట్టాలు లేవు. ఇలా నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తా. - చింతకింది గణేశ్ -
ఏడు చోట్లా బహుముఖం.. మిగిలిన చోట్లా నువ్వా నేనా
అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం తుదిఘట్టానికి చేరుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో ప్రధాన రాజకీయపార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. బీజేపీకి సంబంధించి ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, అఖిల భారత కాంగ్రెస్ నేతలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కలియ తిరుగుతున్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు, చేసిన, చేయబోయే అంశాలు వల్లె వేస్తూ ఉధృతంగా ఆయా పార్టీల నేతలందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధి 2 నెలల నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రెండుమూడు నెలల నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రావడం, నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన సంగతి విదితమే. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తయిన తర్వాత ఈనెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారరం తీవ్రస్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా మూడేసి రోజులపాటు రాష్ట్రంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ,, దేవేంద్ర ఫడ్నవీస్లతోపాటు పార్టీ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గతనెల 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 92 అసెంబ్లీ స్థానాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, ఆ పార్టీ సీఎంలు బఘేల్, సిద్ధరామయ్య తదితరులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ నుంచి సీఎంతోపాటు కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్రావులు రాష్ట్రం మొత్తం చుట్టి వస్తుంటే.. కవిత నిజామాబాద్ జిల్లాకు మాత్రమే పరిమితమై ప్రచారం సాగిస్తున్నారు. బీఎస్పీ నుంచి మాయావతి, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, బృందాకారత్, సీపీఐ నేత డి.రాజా తదితరులు ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీలు తమ ఎజెండాను ప్రజల ముందు ఉంచాయి. ద్విముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే గడిచిన ఎన్నికల్లో ఆయా పార్టీల ప్రభావం, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం తీరు తర్వాత మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంటే.. మరో 70 స్థానాల్లో ద్విముఖ పోరు నెలకొంది. మరో ఏడు స్థానాల్లో బహుముఖ పోటీ ఉంది. త్రిముఖ పోరులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీఉంటే, 70 స్థానాల్లో ద్విముఖ పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే నెలకొంది. ఇక ఏడు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఎంల మధ్య బహుముఖ పోటీ నెలకొంది. త్రిముఖ పోటీలోని 42 స్థానాల్లో ఆర్థిక బలం అదనపు ఆయుధంగా మారింది. అన్ని పార్టీల నేతలూ పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. త్రిముఖ పోటీ దాదాపు అన్ని జిల్లాల్లో రెండు నుంచి నాలుగు చోట్లా నెలకొంది. ఈ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అధికంగా ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోటీ ఉన్న స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏ పార్టీ చీల్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. బహుముఖ పోటీ ఎక్కడంటే బహుముఖ పోటీ ఉన్న వాటిలో ప్రధానంగా సిర్పూర్ కాగజ్నగర్, కొత్తగూడెం, పెద్దపల్లి, సూర్యాపేట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నల్లగొండ స్థానాలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లలో త్రిముఖ పోటీ త్రిముఖ పోటీ ఉన్న స్థానాల్లో ప్రధానంగా కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ గురించి చెప్పుకోవాల్సి ఉంది. సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి పోటీ పడుతున్నారు. మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. ► కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ► కోరుట్లలో బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ నుంచి నర్సింగ్రావు బరిలో ఉన్నారు. ► మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్రెడ్డి, బీజేపీ తరపున మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తనయుడు మిథున్రెడ్డి రంగంలో ఉన్నారు. ► బోథ్లో బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్, కాంగ్రెస్ నుంచి ఆడె జనార్దన్, బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపూరావుల మధ్య గట్టి పోటీ ఉంది. ► సంగారెడ్డిలో బీఆర్ఎస్ పక్షాన చింతా ప్రభాకర్, కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి, బీజేపీ నుంచి పులిమామిడి రాజు ఉంటే.. ముథోల్లో ప్రస్తుత ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, బీజేపీ నుంచి రామారావు పటేల్ పోటీ పడుతున్నారు. ► పటాన్చెరులో బీఆర్ఎస్ నుంచి గూడెం మహిపాల్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్గౌడ్, బీజేపీ నుంచి నందీశ్వర్గౌడ్ రంగంలో ఉన్నారు. ► ఖానాపూర్లో బీఆర్ఎస్ తరపున జాన్సన్ నాయక్, కాంగ్రెస్ నుంచి ఎడ్మ బొజ్జు, బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ ఉంటే, జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, బీజేపీ టికెట్పై మాజీ మున్సి పల్ చైర్పర్సన్ భోగ శ్రావణి, దుబ్బాకలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘునందన్రావు బీజేపీ నుంచి, ప్రస్తుత ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి(బీఆర్ఎస్), కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. ► వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నుంచి ఆరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి నాగరాజ్, బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్, మక్తల్లో బీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్రెడ్డి, కాంగ్రెస్ వాకాటి శ్రీహరి, బీజేపీ నుంచి జలంధర్రెడ్డి పోటీ పడుతున్నారు. ► నిజామాబాద్ అర్బన్లో బిగాల గణేశ్గుప్తా బీఆర్ఎస్ , షబ్బీర్ అలీ కాంగ్రెస్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ► వేములవాడలో లక్ష్మీ నర్సింహారావు బీఆర్ఎస్, ఆది శ్రీనివాస్ కాంగ్రెస్, సీహెచ్ వికాస్ బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంటకరమణారెడ్డి –బీఆర్ఎస్, గండ్ర సత్యనారాయణ– కాంగ్రెస్, చందుపట్ల కీర్తిరెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ► ఎల్బీ నగర్లో మధుయాష్కీ– కాంగ్రెస్, సుధీర్రెడ్డి –బీఆర్ఎస్, సామ రంగారెడ్డి బీజేపీ నుంచి, కుత్బుల్లాపూర్లో వివేకానంద –బీఆర్ఎస్, కూన శ్రీశైలంగౌడ్– బీజేపీ, కొలను హన్మంతరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే, ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డి – బీఆర్ఎస్, పరమేశ్వరరెడ్డి – కాంగ్రెస్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. ► మల్కాజిగిరిలో మర్రి రాజశేఖరరెడ్డి –బీఆర్ఎస్, మైనంపల్లి హన్మంతరావు –కాంగ్రెస్, రామచంద్రరావు– బీజేపీ, శేరిలింగంపల్లిలో అరికపూడి గాంధీ –బీఆర్ఎస్, జగదీశ్వర్రెడ్డి –కాంగ్రెస్, రవికుమార్ యాదవ్ బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. చేవెళ్లలో కాలె యాదయ్య –బీఆర్ఎస్, భీం భరత్– కాంగ్రెస్, కె ఎస్ రత్నం బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. -
తిట్లకు జామర్ను కనుగొనాల్సిన అవసరముంది!
‘‘డార్విన్ పరిణామ సిద్ధాంతమనేది రాజకీయాల్లో తిట్లక్కూడా వర్తిస్తుందేమో నాయనా’’ అంటూ విలక్షణమైన స్టేట్మెంట్ ఇచ్చారు స్వామీ ఎలక్షనానంద అలియాస్ స్వామీ సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలుండేవి. తర్వాత అవి కువిమర్శలయ్యాయి, అటు తర్వాత తిట్లు, ఆపైన బూతులు..తాజాగా ఇప్పుడు బండబూతులు. అందుకే పరిణామ క్రమం ఒక్క జీవులకే కాదు... తిట్లకూ ఉందనిపిస్తోంది. అంతేనా..‘యథా తిట్లూ... తథా యాడ్స్’ అన్నట్టుగా కొన్ని పార్టీల ప్రకటనలైతే ఎదుటివాడిపై అరుస్తున్నట్టు..ప్రేక్షకుణ్ణి కరుస్తున్నట్టూ ఉన్నాయి నాయనా’’ ‘‘మొదట్లో అరే..ఒరే అని తిట్టుకుంటున్నవాళ్లు కాస్తా..ఈమధ్య అంతకంటే ఘోరంగా ముందుకెళ్తున్నారు. మొన్న కేటీఆర్ రేవంత్ను తిట్టాడనుకో. నిన్న మళ్లీ రేవంత్ కేసీఆర్ను తిడతాడు. ‘నీకంటే చాలా పెద్దవాడు కదా..కేసీఆర్ను అలా తిట్టడం సబబేనా?’ అని అడిగితే..‘మరి కేటీఆర్కూ నాకు మధ్య అంతే ఏజ్ గ్యాప్ ఉంది కదా. అప్పుడు నేను కేసీఆర్ను అనడం సమంజసమే కదా’ అంటూ జస్టిఫికేషన్లు ఇచ్చుకుంటూ మరీ తిట్టుకుంటున్నారు. ఇక మైనంపల్లి తిట్లయితే..తాజాగా తెగ వైరల్. పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది స్వామీ’’ అన్నాడు శిష్యుడు దిగులుగా. ‘‘అలనాడెప్పుడో ప్రఖ్యాత సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, తాను రాసిన ‘క–రాజు కథలు’ అనే అద్భుత కథాసంపుటిలోని ‘పలుకుబడి’ అనే కథలో ‘తిట్లు మంచివే’ అంటాడు. పైగా తిట్టేవాడెప్పుడూ (సమాజంలో) పై అంతస్తులో ఉంటాడట. తిట్టేవారికే అందరూ మద్దతు పలుకుతారట. అందుకే (విద్యార్థులు)అందరితోనూ తిట్లు తెగ ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరముందనీ, ఎవరైతే తిట్లలో ప్రావీణ్యం సాధిస్తారో, వారి ‘పలుకుబడే’ రాజ్యంలో ఇంతింతై అన్నట్టుగా పెరుగుతుందని, దాదాపు పాతికేళ్ల కిందటే సెలవిచ్చారు. అదేదో యాడ్లో మరక మంచిదే అన్నట్టుగా... సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం ‘తిట్లూ మంచివేనేమో’నంటూ సర్దుకుపోవాల్సిందే నాయనా’’ ‘‘అలా ఎలా అన్నారు సింగీతం వారు..తిట్లు మంచివెలా అవుతాయి స్వామీ?’’ ‘‘ఆ హాస్య కథల్లో వ్యంగ్యంగా అన్నమాట అది. ‘భాష రాకపోయినా సరే..బేరాలాడే సమయంలో సైగలతోనైనా సర్దుకుపోతారు ప్రజలు. కానీ బేరం కుదరక కోపం వచ్చిందనుకో..తిట్టుకుంటారూ, ఆపైన కొట్టుకుంటారు. ఇయ్యరమయ్యర కొట్టుకోవడం కంటే..పొట్టుపొట్టుగా తిట్టుకోవడం బెటరంటారు సింగీతం వారు. అలా తిట్టుకుని తాము సాధించిన ‘పై అంతస్తు’తో ఇగో చల్లారిపోయిందనుకో..దాంతో కొట్టుకోవడం ఆగిపోతే అది మంచిదేగా అని ఉద్బోధిస్తారు నాయనా. మనవాళ్లూ తెగ తిట్టుకుని అక్కడితో అలా ఆగిపోతున్నారుగా. కాబట్టి సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం అది బెటరేగా’’ ‘‘అసలిలా ఇంతగా తిట్టుకోడానికి కారణం ఏమిటంటారు? ‘‘అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా నాయనా. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరని. దాని కోసమే ఇలా తిట్టుకుంటున్నట్టుంది. కానీ వీళ్లు గ్రహించాల్సిందేమిటంటే..ఎవడికి వాడు ఇదే లాస్ట్ పంచ్ అనుకుంటాడు తప్ప..ఆ లాస్ట్ అనేది ఎప్పటికీ రాదనీ, అదో చైన్ రియాక్షన్లా అలా సాగిపోతూనే ఉంటుందని ఎవరూ గ్రహించడం లేదు. అయినా పర్లేదులే ఇంకెంత..జస్ట్ రెండు రోజులేగా’’ ‘‘రెండ్రోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి సరే..ముందుంది మొసళ్లపండగ అన్నట్టు..మున్ముందు ఎంపీ ఎలక్షన్లూ, ఆ పైన స్థానిక ఎన్నికలూ, అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలూ..ఇలా ఎలక్షన్లూ, తిట్లూ ఎప్పటికీ ముగిసేవి కాదు స్వామీ. ఏం జరిగితే అవి ఆగుతాయో తెలియడం లేదు’’ బెంగగా అన్నాడు శిష్యుడు.‘‘అందుకే నాకనిపిస్తోంది నాయనా..బాంబులకు ఉన్నట్టే... బూతులకూ జామర్ కనుగొంటే బాగుండు’’ అంటూ తాను దిగులు పడ్డారు స్వామీ ఎలక్షనానంద. -
గ్రేటర్ కిరీటం ఎవరికో?
అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోకొచ్చే కోర్సిటీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలైన మలక్పేట, నాంపల్లి, కార్వాన్, చారి్మనార్, చాంద్రాయణగుట్ట, బహదూర్పురాల్లో ఎంఐఎం గెలుపును ఇప్పటివరకు నిలువరించిన వారే లేరు. ఇప్పటికీ అదే పరిస్థితి కాగా, ఈసారి నాంపల్లిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈసారి యాకుత్పురాలో ఎంబీటీ నుంచి ఎంఐఎంకు గట్టి పోటీ ఎదురవుతోంది. గోషామహల్లో ఈసారి బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. నగరంలో జరిగిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ అభ్యర్థులకు కలిసివచ్చేలా ఉండగా.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గృహలక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు అందని పేద, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది కాంగ్రెస్ అనుకూలంగా మలచుకొని పైచేయి సాధించాలని భావిస్తోంది. ఆ ట్రిక్తో కాంగ్రెస్ గెలుస్తుందా? లేక బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలు గ్రేటర్లో కలసి ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, విభిన్నవర్గాలు, మతాల వారు ఉండటం, అభ్యర్థులూ ఆర్థికంగా సంపన్నులు కావడం ఈ నియోజకవర్గాల్లో విశేషం. వీరిలో ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్లో టికెట్లు రానందున కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తున్నారు. అట్టడుగువర్గాల కూలీల నుంచి ఆకాశహర్మ్యాల సంపన్నుల వరకు ఓటర్లున్న మినీ దేశంలాంటి గ్రేటర్ హైదరాబాద్ పొలిటికల్ సీన్పై గ్రౌండ్రిపోర్ట్. - చెరుపల్లి వెంకటేశ్ ముషీరాబాద్ ముస్లిం ఓట్లు కీలకం ఈ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్యే ఉంది. బీజేపీ అభ్యర్థి ప్రభావం పెద్దగా లేకపోయినా, బీజేపీ జాతీయ నేత డా.లక్ష్మణ్ స్థానిక నియోజకవర్గం కావడంతో ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్, బీజేపీ అభ్యర్థి పూస రాజు ఇద్దరిదీ గంగపుత్ర సామాజిక వర్గం అయినందున నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న ఆ వర్గం ఓట్లు చీలిపోవడం గోపాల్కు నష్టం కలిగించనుంది. కాంగ్రెస్ అభ్యర్థీగా బరిలో ఉన్న అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోనే ఈ సెగ్మెంట్ కూడా ఉండటం, నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న యాదవసామాజిక వర్గం ఓట్లు ఆయనకు ఉపకరించనున్నాయి. బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మికి బీజేపీ టికెట్ రాకపోవడంతో వారి సామాజికవర్గం (కురుమ) ఓట్లు అంజన్కుమార్కు పడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో గోపాల్కు భారీ మెజారిటీ రావడానికి కారణమైన ముస్లిం మైనార్టీ ఓట్లు చీలి కాంగ్రెస్ వైపు మళ్లే పరిస్థితి కూడా ఉంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పోటీ తీవ్రంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో.. ఎల్బీనగర్: వీరుడెవరో పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన ఇక్కడ మూడు ప్రధానపారీ్టలూ హోరాహోరీగా పోరాడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సు«దీర్రెడ్డికి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇటీవల పరిష్కారం చూపిన నోటరీ స్థలాల రెగ్యులరైజేషన్, ప్రజలతో కలిసిపోవడం తదితర అంశాలు సానుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్నుంచి పోటీ చేస్తున్న మధుయాష్కీగౌడ్కు నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న బీసీల మద్దతు ఉన్నట్టు చెబుతున్నారు. వివిధ సంఘాలు, అసోసియేషన్ల వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయంటున్నారు. సీమాంధ్రుల ఓట్లు సైతం మధుయాష్కీకి పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి రంగంలో ఉన్న సామ రంగారెడ్డి కేంద్రంలోని బీజేపీ విధానాలు, తదితరమైనవాటితో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉపకరిస్తుందని చెబుతున్నారు.దాంతోపాటు నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న కార్పొరేటర్ల బలం కూడా కలిసి రాగలవని చెబుతున్నారు. గోషామహల్ గతానికి భిన్నంగా.. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన బీజేపీకి చెందిన రాజాసింగ్, బీఆర్ఎస్ అభ్యర్థీగా పోటీ చేస్తున్న నందకిశోర్వ్యాస్ బిలాల్ నడుమ పోటీ ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు కూడా ఇదే కావడంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఏర్పడింది. స్థానికంగా ఉండేది తక్కువ..ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటిస్తారనే అభియోగంతో ఈసారి రాజాసింగ్కు పరిస్థితులు కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న మార్వాడీలతో పాటు నార్త్ ఇండియన్స్లోని కొన్ని వర్గాలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. హిందూ నినాదాన్ని బాహాటంగా తలకెత్తుకున్న రాజాసింగ్కు హిందూ వర్గ ఓట్లు భారీ స్థాయిలో పడటంతో పాటు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆయన సామాజికవర్గమైన లోధి కుటుంబాల ఓట్లూ పడే అవకాశాలున్నాయి. ఎంఐఎం ఇక్కడ పోటీ చేయడం లేదు. బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఉన్నందున ముస్లింల ఓట్లు బీఆర్ఎస్కు ఉపకరిస్తాయనే అంచనాలున్నాయి. కాంగ్రెస్ ప్రభావం ఇక్కడ నామమాత్రమే. కంటోన్మెంట్ అంతు చిక్కని సెగ్మెంట్ ఈ నియోజవర్గంలో కాంగ్రెస్ నుంచి దివంగత ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత, బీజేపీ నుంచి శ్రీగణేశ్ పోటీలో ఉన్నారు. ఇటీవలి వరకు లాస్యనందితకు సాయన్న కుమార్తెగా ఉన్న సానుభూతి సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇటీవల తెరపైకొచి్చన అవినీతి ఆరోపణలతో నష్టం కలిగే ప్రమాదం ఉంది. గద్దర్ అభిమానులు, వివిధ ప్రజాసంఘాల సభ్యులు వెన్నెలకు మద్దతుగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న పొరుగురాష్ట్రాల ఓటర్లు, నియోజకవర్గంలో నిర్వహిస్తున్న స్వచ్ఛందసేవా కార్యక్రమాలు వంటివి తమిళుడైన బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్కు ఉపకరించగలవంటున్నారు. ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేది ఇప్పటికీ పజిల్గానే ఉంది. సికింద్రాబాద్ దక్కేదెవరికో... బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు బరిలో ఉన్నారు. గత రెండు పర్యాయాలు వరుసగా గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజలతో కలివిడిగా ఉండటం కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ నుంచి ఆదం సంతోష్కుమార్ పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో రైల్వే శాఖలో పనిచేయడం, ఓ కారి్మక సంఘానికి నేతగా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సెగ్మెంట్లో అధికసంఖ్యలో ఉన్న రైల్వే ఉద్యోగుల ఓట్లు కొంతమేర ఈయనకు పడే అవకాశాలున్నాయి. బీజేపీ అభ్యర్థీగా మేకల సారంగపాణి పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్యే పోటీ ఉంది. ఉప్పల్ పార్టీ గుర్తులే బలం బీఆర్ఎస్ సిట్టింగ్లకు టికెట్ ఇవ్వని నియోజకవర్గాల్లో ఇదొకటి. ఎమ్మెల్యేగా ఉన్న భేతి సుభాష్డ్డికి కాకుండా బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడంతో అసంతృప్తి ఏర్పడింది.పార్టీ అధిష్టానం నచ్చజెప్పడంతో సర్దుకున్నట్లే పైకి కనిపిస్తోంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గట్టెక్కే పరిస్థితులున్నాయి. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్రెడ్డిలకు కాకుండా పరమేశ్వర్రెడ్డికి టికెట్ లభించింది. దాంతో, వారిద్దరూ బీఆర్ఎస్లో చేరడంతో ఆపారీ్టకి ప్లస్గా మారింది. పరమేశ్వర్రెడ్డికి గతంలో కార్పొరేటర్గా పనిచేసిన అనుభవముంది. ప్రస్తుతం ఆయన భార్య రజిత కార్పొరేటర్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతో మాత్రమే గెలవాల్సిన పరిస్థితి. ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీచేస్తున్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, కేడర్, కొంతమేర ఓటు బ్యాంకు ఉంది. అవి ఆయనకు ఉపకరించే అంశాలు.ఈ నేపథ్యంలో మూడుపారీ్టల మ«ధ్యే పోటీ ఉంది. శేరిలింగంపల్లి హేమాహేమీల బరి రాష్ట్రంలోనే అత్యధికసంఖ్యలో ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హ్యాట్రిక్ కోసం కృషి చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జగదీశ్వర్గౌడ్ మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ప్రజలకు అందుబాటులో ఉండటం, నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న సెటిలర్ల ఓట్లతో గెలుపు ఖాయమనే ధీమాలో గాంధీ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జగదీశ్వర్గౌడ్, ఆయన భార్య పూజిత ఇద్దరూ సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉండటం వారికి కలిసివచ్చే అంశం. సుదీర్ఘకాలంగా కార్పొరేటర్గా ఉన్న తన పనితీరు, వివాదాల్లేకపోవడం, మార్పు కోరుకుంటున్న ప్రజలు .. తదితర అంశాలు కలిసిరాగలవని భావిస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన రవికుమార్యాదవ్ తండ్రి కాంగ్రెస్ నుంచి గతంలో ఓమారు ఎమ్మెల్యేగా, శేరిలింగంపల్లి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చైర్మన్గానూ వ్యవహరించారు. దాంతో వారి మద్దతుదారులూ ఉన్నారు. బీజేపీ విధానాలు తనను గెలిపిస్తాయని రవికుమార్ విశ్వసిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. అంబర్పేట జైకొట్టేదెవరికో ? బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీజేపీ అభ్యర్థీగా టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన సి.కృష్ణయాదవ్ మధ్య పోటీ ప్రధానంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రోహిణ్రెడ్డి కోరుకున్న నియోజకవర్గం ఖైరతాబాద్ కాగా ఇక్కడ టికెట్ ఇవ్వడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు తగిన సమయం లభించలేదు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్థానిక నియోజకవర్గం కావడంతో ఆయన ఓటు బ్యాంకు బీజేపీకి లాభం చేకూర్చనుంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మైనార్టీల ఆదరణ బీఆర్ఎస్కు ఉపకరించనున్నాయి. రెడ్డి సామాజిక ఓట్లు రోహిణ్రెడ్డికి అధికసంఖ్యలో పడే అవకాశముంది. మైనార్టీలను కూడా తన వైపు మళ్లించుకోగలిగితే పుంజుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కిషన్రెడ్డికి సవాల్గా మారింది. ఖైరతాబాద్ వరించేదెవరినో ? కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. సిట్టింగ్కు తిరిగి అవకాశం ఇవ్వవద్దని భావిస్తున్న ఓటర్లు కాంగ్రెస్వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విజయారెడ్డికి నియోజకవర్గంలో తన తండ్రి పీజేఆర్ అభిమానుల అండదండలున్నాయి. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మౌలిక సదుపాయాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. నాగేందర్కు నియోజకవర్గంలో ఉన్న బలం, తదితరమైనవి సానుకూలాంశాలుగా ఉన్నాయి. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం లేదు. పేదలు, సంపన్నులు రెండు వర్గాల ప్రజలూ అధికంగానే ఉన్న ఈ నియోజకవర్గంలో ఎవరిని గెలిపిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ విజేత ఎవరో ? కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మూడో పర్యాయం పోటీ చేస్తున్నారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు అధికసంఖ్యలో ఉండటం వల్ల అవి అజారుద్దీన్కు పోలవుతాయనే అంచనాలున్నాయి. బీఆర్ఎస్ చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు ముస్లింలను ప్రభావితం చేసే ఎంఐఎం మద్దతు బీఆర్ఎస్కుండటం కలిసి వచ్చే అంశం. ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉన్నా.. అది కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి ఉపకరిస్తుందనే వ్యూహంతో పోటీలో నిలిపారనే అభిప్రాయాలున్నాయి. బీఆర్ఎస్కు చెందిన మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్తోపాటు కొందరు కార్పొరేటర్లకు మాగంటికి మధ్య పొసగకపోవడంలేదు. అది బీఆర్ఎస్కు నష్టం కలిగించనుంది. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా రెండోస్థానంలో, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా మూడోస్థానంలో నిలిచిన నవీన్యాదవ్ కాంగ్రెస్లో చేరడం ఆపారీ్టకి ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠ రేపుతోంది. కూకట్పల్లి ఓటర్లు ఎటువైపో ? బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేనలు పోటీలో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణారావుకు ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండటం వంటివి కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మొన్నటి వరకూ బీఆర్ఎస్లో ఉండి శేరిలింగంపల్లి టికెట్ ఆశించిన బండి రమేశ్ కాంగ్రెస్లో చేరి పోటీకి దిగారు. నియోజకవర్గానికి కొత్త. క్షేత్రస్థాయి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదని స్థానికులంటున్నారు. నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న కమ్మ సామాజిక, సెటిలర్ల ఓట్లపై నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.జనసేన నుంచి పోటీ చేస్తున్న ప్రేమ్కుమార్ సైతం తన సామాజిక వర్గం కాపుల ఓట్లు, బీజేపీ బలం తనకు ఉపకరిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, జనసేలకు చీలిపోయే పరిస్థితులున్నాయి. అది బీఆర్ఎస్కు ఉపకరించే పరిస్థితులున్నాయి. సనత్నగర్ మంత్రి హ్యాట్రిక్ కొట్టేనా ? బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచి నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, ప్రత్యర్థులు కూడా హోరాహోరీగా పోరాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ మీడియా సెల్ చైర్మన్ పవన్ఖేరా భార్య కోట నీలిమ పోటీలో ఉండగా, బీజేపీ నుంచి మర్రి శశిధర్రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన శశిధర్రెడ్డికి ఉన్న స్థానిక బలం, కేంద్రంలోని బీజేపీ విధానాలు, మోదీ క్రేజ్ ఆయనకు ఉపకరించనున్నాయి. కోట నీలిమ.. తలసాని టార్గెట్గా మంత్రి చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువంటూ ప్రజల ముందుకెళ్తున్నారు. నెమ్మదిగా ఆమె పుంజుకుంటున్నారు. దీంతో పోటీ పెరిగింది. ఇంటింటికీ ప్రచారానికి వెళ్లడం తదితరమైనవి తలసానికి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. ముగ్గురూ ఎవరి వ్యూహాలతో వారు పోరాడుతున్నారు. మల్కాజిగిరి ఇద్దరికీ సవాల్ ఇక్కడ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు తన కొడుక్కి కూడా టికెట్ కావాలనే పంతంతో బీఆర్ఎస్ను వీడారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరికీ సవాల్గా మారిన నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఎన్.రామచంద్రరావు బరిలో నిలిచారు. మంత్రి మల్లారెడ్డికి సైతం ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారింది. అభ్యర్థీని అధికారికంగా ప్రకటించక ముందునుంచే ప్రచారం చేపట్టడంతో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా.. నేనా ? అన్నట్టు పోరాడుతున్నాయి. కుత్బుల్లాపూర్ గెలుపెవరిదో ? ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్గౌడ్కు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉపకరించనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గ మద్దతుతో తాము గెలవగలమని కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డి వర్గీయులు భావిస్తున్నారు. బీజేపీ బీసీ నినాదంతో కేంద్రంలోని మోదీ విధానాలతో ప్రజలు తమను గెలిపిస్తారని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ అనుయాయులు చెబుతున్నారు. మూడు పార్టీలూ వేటికవిగా హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ప్రజా సమస్యలు పట్టించుకోవాలి ధరణి వల్ల ఎన్నో సమస్యలున్నాయి. అసలైన భూయజమానులు కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునేవారు లేరు. కోవిడ్ తరుణంలో మూడునెలల కరెంట్ బిల్లులు ఒకసారి జారీ చేసి వెంటనే కట్టకపోతే కనెక్షన్ కట్చేస్తామని బెదిరించారు. ఉచిత నీటి సరఫరా అనేది పేరుకు మాత్రమే. మా అపార్ట్మెంట్కు అది అమలవడం లేదు. –సాయిచందర్ రామ్కోఠి, నగర వ్యాపారి, ఖైరతాబాద్ పనిచేసే వారిని ప్రోత్సహించాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయి. సనత్నగర్ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి జరిగింది.పనులు చేసే వాళ్లను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా పనులు చేస్తారు. –ధనుంజయ, చిరువ్యాపారి, సనత్నగర్ -
ఇచ్చింది ఎంత? పంచేది ఎంత?
హైదరాబాద్: రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికలకు ప్రధాన పార్టీల పోల్ మేనేజ్మెంట్ తుది దశకు చేరింది. వివిధ రకాల ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు తాయిలాలకు తెరలేపారు. అదే సమయంలో మద్యం, నగదు పంపిణీలో పలుచోట్ల కింది స్థాయి నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో ఓటర్కు రూ.3000 నుంచి రూ.5000 వరకు నగదు, రెండు మద్యం బాటిళ్ల చొప్పున అభ్యర్థుల నుంచి వసూలు చేసిన డివిజన్ స్థాయి నాయకులు అందులో సగం కూడా ఓటర్లకు ఇవ్వడం లేదని, దీంతో తాము పోల్మేనేజ్మెంట్లో భాగంగా ఓటర్లను కలవలేకపోతున్నామని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్ధులుఇచ్చిన డబ్బులో ద్వితీయశ్రేణి, డివిజన్ స్థాయి నాయకులే పెద్ద మొత్తంలో మింగేస్తున్నారని, దీంతో తాము ఓటర్లకు సమాధానం చెప్పకోలేని పరిస్థితి నెలకొందంటున్నారు. 48 గంటలే కీలకం.. గురువారం జరగనున్న ఎన్నికల దృష్ట్యా పోల్ మేనేజ్మెంట్కు మంగళ, బుధవారాలే ఎంతో కీలకం కానున్నాయి. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి వరకు ఓటర్లకు డబ్బు, మద్యం, కానుకలు పంపిణీ చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు దృష్టి సారించారు. కిందిస్థాయిలో పంపకాల్లో గందరగోళం నెలకొంది. కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో ఉండే వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులతో నిరంతరం సంబంధాలు కొనసాగించే తాము చివరకు పంపకాల వద్ద ముఖం చాటేయాల్సి రావడం ఇబ్బందిగా ఉందని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. సగానికి తగ్గించి ఇస్తున్నారు.. ‘ప్రతిపక్షాల వాళ్లు పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తున్నారంటూ అభ్యర్థుల నుంచి వారి ప్రధాన అనుచరుల నుంచి భారీగా రాబట్టుకుంటున్నారు. కానీ ఏవో ఒకటి, రెండు కాలనీల్లో పంపిణీ చేసి మిగతా కాలనీలకు మొండి చేయి చూపుతున్నారు’ అని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన పార్టీ కార్యకర్త చెప్పారు. తాము తిరిగి ప్రచారం చేసిన కాలనీల్లో పంపిణీ చేయాల్సిన ఓటర్ల జాబితాను రూపొందించుకొని డివిజన్ స్థాయి నాయకుల వద్దకు వెళితే సగానికి సగం తగ్గించి ఇస్తున్నారని, దీంతో జాబితాలోని పేర్ల ప్రకారం డబ్బులు అందజేయలేకపోతున్నట్లు చెప్పారు. చివరకు కొన్ని చోట్ల రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చేస్తున్నారు. కానీ అభ్యర్థుల నుంచి మాత్రం అంతకు రెట్టింపు మొత్తంలోనే వసూలు చేస్తున్నారు. ‘పార్టీ’ల్లోనూ అంతే.. ఎన్నికల ఘట్టం తుది దశకు చేరిన ప్రస్తుత తరుణంలో ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు మద్యం పంపిణీ కూడా అనివార్యంగా మారింది. ఈ క్రమంలో కాలనీలు, అపార్ట్మెంట్ల వారీగా రాత్రి పూట మందు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ చాలామంది ఓటర్లు ఇలాంటి పారీ్టలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన వ్యక్తులుగా ముద్ర పడకుండా ఉండేందుకు ఓటర్లు జాగ్రత్తలు పాటిస్తుండగా అనుచరగణాలు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నాయని, కార్యకర్తలకు మాత్రమే ప్రచారం అనంతరం ‘పార్టీ’లను ఏర్పాటు చేసి ఓటర్ల కోసం కేటాయించిన మద్యం బాటిళ్లను తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారని పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడక్కడా భగ్గుమంటున్నారు. పోల్ మేనేజ్మెంట్కు మరో రెండు రోజులు ఉన్న దృష్ట్యా ఈ రెండు రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే. -
ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే బల్క్ మెసేజ్లు బంద్! : రాజర్షిషా
సాక్షి, మెదక్: ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ తేదీకి 72 గంటల ముందు స్టాండింగ్ అవర్, 48 గంటల నుంచి నిశ్శబ్ద వ్యవధి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా తెలిపారు. సోమవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 28 సాయంత్రం 5 నుంచి పోలింగ్ ముగిసే వరకు నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని, కాబట్టి రెండు రోజుల ముందే పత్రికా ప్రకటనలకు అనుమతులు పొందాలని సూచించారు. అలాగే లోకల్ ఛానళ్లతో పాటు శాటిౖ లెట్ ఛానళ్లలో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయకూడ దని ఆదేశించారు. 28 నుంచి 30 సాయంత్రం 5 గంటల వరకు బల్క్ మెసేజ్లను నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా బల్క్ మెసేజ్లు పంపితే 73373 40816కు ఫోన్, లేదా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి.. 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల విధులకు వచ్చే సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని రాజర్షిషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో మెదక్ జిల్లాలోని నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు చెందిన ఆర్ఓలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లో సౌక ర్యాలు కల్పించాలని, పోలింగ్ సామగ్రి సరఫరా, పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు, భోజనాలు , వెబ్కాస్టింగ్, సీసీ కెమెరా, వీడియో రికార్డ్, సెక్యూరిటీ లాంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పకడ్బందీగా ఏర్పాట్లు! ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాజర్షిషా ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ, ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. అనంతరం రాజర్షిషా మాట్లాడుతూ పోలింగ్కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవి చదవండి: ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్! : హరీశ్రావు -
ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్! : హరీశ్రావు
సాక్షి, సిద్దిపేట: 'ఓటరన్న రిస్క్ తీసుకోవద్దని అంటున్నారు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీలు సాధించిన ఆయన మరోసారి సిద్దిపేట నుంచి బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను ‘సాక్షి’ పలకరించింది. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయడం అంటే మూడు గంటల కరెంట్కు ఒప్పుకోవడమే అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాదీ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి వెంట వెంటనే ఉద్యోగాలను భర్తీ చేస్తామంంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అండ, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి బీఆర్ఎస్సే గెలుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తాం. తద్వారా ఈ జిల్లా పార్టీ కంచుకోటగా మరోసారి నిరూపితమవుతుంది. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారు. నాడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితిని. నేడు బీఆర్ఎస్ పాలనలో పరిస్థితిని గుండె మీద చేయి వేసుకుని పరిశీలించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. నాడు కరువు, కాటకాలతో వలసల జిల్లాగా ఉన్న ఈ ప్రాంతం నేడు రెండు పంటలు పండే పచ్చని మాగాణిగా మారింది. నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో వలసలు వాపస్ వచ్చా యి. కర్ణాటక సరిహద్దుల్లో ఉండడం వల్ల ప్రజలకు స్పష్టత వచ్చింది. మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఆ రాష్ట్రంతో బాగా సంబంధాలుంటాయి. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు గ్యా రంటీలు అమలు కాలేదు. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెనం పై నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. 8 గంటల కరెంట్ కాస్తా 3 గంటలకే పరిమితమైంది. అక్కడి రైతుబంధులు ఆపేశారు. అలాగే స్కాలర్ షిప్లలో కోత, తాగు నీటికి, తిండి గింజలకు ఇబ్బందే ఉంది. అక్కడి బాధలు చూసి, ప్రత్యక్షంగా తెలుసుకుని బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. ► మార్పు అంటే 3 గంటల కరెంటా? కాంగ్రెస్ వాళ్లు మార్పు అంటున్నారు. 24 గంటల కరెంట్ నుంచి 3 గంటలకు తగ్గించడమే మార్పా? ప్రజల జీవన విధానం, ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రావాలి. కాంగ్రెస్ దేశంలో ఎక్కడా రూ. 1000 మించి పెన్షన్ ఇవ్వడం లేదు. నాడు అధికారంలో ఉన్న ప్పుడూ ఇవ్వలేదు. నేడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదు. తెలంగాణలో ఇస్తామనడం ఇక్కడి ప్రజలను మభ్యపెట్టడమే. ► నాన్ లోకల్స్.. కాంగ్రెస్ అధికారంలో వస్తే పైరవీకారులు, బ్రోకర్ల రాజ్యం వస్తుంది. రాహుల్, ప్రియాంక ఎన్నికల ముందే కనబడతారు. ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఉంటారు. నేడు కర్ణాటకలో రాహుల్ జాడలేడు. ప్రియాంక పత్తాలేకుండా పోయింది. ప్రజలకు ఇచ్చి హామీలు అమలు చేయడం లేదు. ► కేసీఆర్ అంటే నమ్మకం! కేసీఆర్ అంటే నమ్మకం. కాంగ్రెస్ అంటే మోసం. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రూ.400కే సిలిండర్, సౌ భాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు నెలకు రూ.3వేలు, ఆసరా రూ.5వేలు, పేదలకు సన్న బియ్యం అందిస్తాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15లక్షలకు పెంచుతాం. అసైన్డ్ భూములు పట్టా భూములుగా మార్చడం, గురుకులాలను డిగ్రీ కళాశాలకు అప్గ్రేడ్ చేస్తాం. కానీ అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ జిల్లా బిడ్డగా హామీ ఇస్తున్నా. ఒక్క గుంట భూమిని తీసుకోం. వాటికి పట్టాలిస్తాం. -
ప్రచారం.. నేటితో పరిసమాప్తం! ఇకపై గెలిచేవరకు మూగనోమే..
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్నుంచే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా.. ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రచారం ఊపందుకుంది. 20వ తేదీ నుంచి ఉమ్మడి వరంగల్కు అగ్రనేతలు వరుసకట్టడంతో ప్రచారం పతాకస్థాయికి చేరింది. అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల క్యాంపెయినర్లు, అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు చెమటోడ్చారు. రోజూ నేతల రోడ్షోలు, సమావేశాలు, మైక్ల మోతలతో ఉమ్మడి జిల్లా హోరెత్తింది. ప్రచారం ముగింపునకు ఒక్కరోజు ముందుగానే అగ్రనేతలు పోటెత్తారు. సోమవారం భారత ప్రధాని నరేంద్రమోదీ మహబూబాబాద్లో, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పరకాలలో, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏటూరు నాగారంలో రోడ్షోలు, సభలు నిర్వహించారు. ప్రముఖుల రాకతో ఉమ్మడి జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. సుమారు 13 రోజులపాటు ఉధృతంగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం కానుంది. చివరి రోజు మంగళవారంన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉమ్మడి వరంగల్లోని 12 నియోజకవర్గాల్లో ప్రచారం ముగింపు తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు వ్యూహరచనలో నిమగ్నం కానున్నారు. నోటిఫికేషన్ తర్వాత విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటించినప్పటికీ ప్రతికూల పరిస్థితులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోల్ మేనేజ్మెంట్పై నజర్ పెట్టిన ప్రధాన పార్టీలు ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మద్యం షాపులు మూడు రోజులు బంద్! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మద్యం అక్రమంగా విక్రయిస్తే చర్యలు తీసుంటామని హెచ్చరించారు. ఇవి చదవండి: ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే బల్క్ మెసేజ్లు బంద్! : రాజర్షిషా -
నల్లగొండలో కోమటిరెడ్డి, భూపాల్రెడ్డి మధ్యే కీలక పోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్కు గడువు దగ్గరపడింది. 30న ఉదయం నుంచే పోలింగ్ జరగనుండగా.. అభ్యర్థుల పోల్ మేనేజ్మెంట్కు సమయం రెండు రోజులు ఉంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. 29వ తేదీన కూడా సభలు సమావేశాలు మినహా ఇంటింటి ప్రచారం చేసుకునే వీలు ఉంది. అయితే ఇప్పటివరకు నిర్వహించిన ప్రచారం ఆధారంగా ఇంకా తాము ఏయే పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకొని పార్టీ శ్రేణులను రంగంలోకి దింపాయి. కొన్ని చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా, మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంది. నల్లగొండ జిల్లాలో మూడింట సై అంటే సై ►నల్లగొండ నియోజకవర్గంలో ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులైన కంచర్ల భూపాల్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్యే కీలక పోరు సాగుతోంది. బీజేపీ నుంచి మాదగోని శ్రీనివాస్గౌడ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) పార్టీ నుంచి పిల్లి రామరాజుయాదవ్ బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ సంప్రదాయ ఓట్లు బీజేపీకే పడనుండగా, ఆయన అదనంగా ఏ మేరకు ఓట్లను సాధిస్తారన్నది పోలింగ్ రోజే తేలనుంది. మరోవైపు పిల్లి రామరాజుయాదవ్ యాదవ సామాజికవర్గంతోపాటు బీసీల ఓట్లు తనకు పడేలా ప్రయత్నిస్తున్నారు. ఈయన చీల్చే ఓట్లు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రధానం కానున్నాయి. ► నకిరేకల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఇక్కడ చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి ధీమాగా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న జోష్, మాజీ ఎమ్మెల్యేగా తనకున్న వ్యక్తిగత అనుచరవర్గ బలంతో గెలుపు సాధిస్తానన్న ధీమాతో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. ► నాగార్జునసాగర్లోనూ ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కేడర్, తన తండ్రి జానారెడ్డి చరిష్మా తనను కచ్చితంగా గెలిపిస్తుందన్న ధీమాలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నియోజవర్గ అభివృద్ధికి తాను తీసుకుకొచి్చన నిధులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ, ఇతర పార్టీలు భారీ ప్రభావం చూపుతాయన్న అంచనాలు లేవు. మిర్యాలగూడ, మునుగోడు,దేవరకొండలో ట్రయాంగిల్ ► మిర్యాలగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగతంగా తమకున్న పట్టుతో గెలుస్తానని భావిస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి కూడా తన వ్యక్తిగత చరిష్మా, పార్టీ వేవ్ పైనే ఆధార పడ్డారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే, సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి తన వ్యక్తిగత చరిష్మాతోపాటు పార్టీకి ఉన్న బలంతో గెలుస్తానన్న ధీమాలో ఉన్నారు. ► మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి మధ్య పోరు నెలకొంది. ఉప ఎన్నికల తరువాత సీఎం ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో చేపట్టిన చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి భావిస్తుండగా, నియోజకవర్గంలో తనకున్న వ్యక్తిగత చరిష్మా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రేజ్ తనను గెలిపిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి భావిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సంప్రదాయ ఓట్లతోపాటు ఆయన చీల్చే ఇతర ఓట్లే ఈ ఎన్నికల్లో అక్కడ ప్రధానం కాబోతున్నాయి. ► దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్ మధ్య ప్రధాన పోటీ ఉండగా, బీజేపీ అభ్యర్థి కేతావత్ లాలూ నాయక్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. యాదాద్రిలో ముక్కోణం ► భువనగిరి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే ఆశ పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కుంభం అనిల్ కుమార్రెడ్డి తమ పార్టీకి ఉన్న వేవ్ పైనే ఆశ పెట్టుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతూ గెలుపొందాలని భావిస్తున్నారు. ► ఆలేరు నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే గత పదేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను మూడోసారి గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య.. పార్టీ జోష్, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. -
పొత్తులో కత్తులు! బీజేపీ, జనసేనల మధ్య వాగ్వాదం..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య నెలకొన్న ఎన్నికల పొత్తులో కత్తులు విచ్చుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు తనకు సహకరించడం లేదని జనసేన అభ్యర్థి ఆరోపణలు చేశారు. ప్రచారం ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు చేసిన ఈ ఆరోపణలు ఇరు పార్టీ వర్గాల్లో సంచలనంగా మారాయి. జనసేన జగడం.. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో గణనీయమైన ప్రభావం చూపే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ గడిచిన ఐదేళ్లుగా వ్యూహాలు రూపొందిస్తోంది. జిల్లాలో ఐదు స్థానాల నుంచి పోటీకి సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో జనసేనతో ఎన్నికల పొత్తు కుదరడంతో కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలు ఆ పార్టీకి కేటాయించారు. ఈ మేరకు జనసేనతో పాటు బీజేపీ అభ్యర్థుల కోసం స్టార్ క్యాంపెయినర్ పవన్కళ్యాణ్ జిల్లాలో ఓ ప్రచార సభలో కూడా పాల్గొన్నారు. ఇక ఒక్క రోజుతో ప్రచార పర్వం ముగుస్తుందనగా ఇరు పార్టీల మధ్య సఖ్యత లేదనే అంశం బట్టబయలైంది. అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచీ.. బీజేపీ నాయకత్వం తనకు సంపూర్ణ సహకారం అందివ్వడం లేదంటూ కొత్తగూడెం జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్ ఆరోపిస్తున్నారు. ఇదేం పంచాయితీ..? నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్చార్జ్లతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్ ఇంట్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో.. పొత్తు ధర్మం పాటించకుండా తనకు అన్యాయం చేస్తున్నారని లక్కినేని సురేందర్ ఏకంగా బీజేపీ జిల్లా నాయకత్వంపై ఆరోపణలు చేశారు. తన తరఫున బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్ ఒక్కరే ప్రచారం చేశారని, అప్పుడు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు. ఆ తర్వాత అగర్వాల్ బీజేపీని వీడి బయటకు వెళ్లారని, అనంతరం ప్రచారంలో బీజేపీ నేతల నుంచి తనకు సరైన సహకారం లేకుండా పోయిందని వాపోయారు. చివరకు తన తరఫున ఎవరైనా ప్రచారంలో పాల్గొన్నా వారిపై బీజేపీ జిల్లా నాయకులు ఒత్తిడి చేసి తనకు దూరం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్కు గడువు దగ్గర పడిన తర్వాత బూత్ కమిటీలు వేయడానికి కూడా బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లేదన్నారు. సుజాతనగర్ మండలంలో తప్ప మరెక్కడా కమలదళం నుంచి సరైన సాయం అందలేదన్నారు. పొత్తు ధర్మాన్ని అసలు పాటించకుండా తనను బలిపశువు చేశారంటూ విమర్శలు చేశారు. దబాయింపు సరికాదు! బీజేపీ పార్టీ నిర్దేశించిన లక్ష్యాలు, నిబంధనలు పాటించడంలో మేము ఎక్కడా పొరపాటు చేయలేదు. అలసత్వం వహించలేదు. పొత్తు ధర్మాన్ని పాటించడంలో పార్టీ అఽధిష్టానం నిర్ణయించిన విధివిధానాల మేరకే పని చేస్తున్నాం. కానీ జనసేన అభ్యర్థి మనసులో వేరే ఉద్దేశాలు, లక్ష్యాలు పెట్టుకుని బీజేపీపై బుదర జల్లుతున్నారు. ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు సమావేశంలో ఆయన దబాయించినట్టుగా మాట్లాడటాన్ని, అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నా. – కుంచె వెంకట రంగాకిరణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గ్లాసుకు పగుళ్లు.. ఎన్నికల పొత్తులో కొత్తగూడెం సీటు జనసేనకు కేటాయించిన సమయంలో ఆ పార్టీకి ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకుడు లేరు. ఆ పార్టీకి జిల్లాలో సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో అప్పటికే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన లక్కినేని సురేందర్ మరోసారి కండువా మార్చి జనసేనలో చేరారు. దీంతో ఆయన ఆ పార్టీ తరఫున కొత్తగూడెం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత రెండు వారాలుగా ‘గ్లాసు గుర్తుకే ఓటెయ్యండి’ అని ప్రచారం కూడా చేశారు. కానీ ఇంతలోనే పరిస్థితులు తారుమారయ్యాయి. సంస్థాగత నిర్మాణం, ప్రణాళిక లేకుండా బరిలో నిలిచిన ‘గాజు గ్లాసు’లో చివరి దశలో పగుళ్లు వచ్చాయి. ఇవి చదవండి: ఓట్ల వరకే మనుషులు, ఓటర్లు.. ఆ తర్వాత అంతా ఉత్తదే! : ఆదివాసీల ఆవేదన -
ఓట్ల వరకే మనుషులు, ఓటర్లు.. ఆ తర్వాత అంతా ఉత్తదే! : ఆదివాసీల ఆవేదన
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: భద్రాచలం కేంద్రంగా గిరిజన సమగ్రాభివద్ధి సంస్థ(ఐటీడీఏ) కొనసాగుతోంది. అయితే, ఐటీడీఏ పరిధిలోని భద్రాద్రి జిల్లాలో నివాసం ఏర్పర్చుకున్న ఆదివాసీ గూడేలలో అభివృద్ధి మాటేమో కానీ కనీస మౌలిక వసతులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఐటీడీఏ ద్వారా కొంత మేర ఫలితాలు వచ్చినా నూరు శాతం గిరిజనుల సమగ్రాభివృద్ధి జరగలేదని వారి జీవన స్థితిగతలను చూస్తే తెలిసిపోతుంది. పాలకులు ఐదేళ్ల కోసారి మారుతున్నా.. ఎన్నికల వేళ ఈ గూడేలకు బారులుతీరే నాయకులు ఆ తర్వాత ముఖం చూపకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. తొలుత ఖమ్మంలో ఏర్పాటు! 1975లో తొలుత ఖమ్మంలో ఐటీడీఏ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1979లో పాల్వంచకు మార్చా రు. ఇక 1993 ఫిబ్రవరి 9న భద్రాచలం కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటైంది. భద్రాచలం కొత్తగూడెం జిల్లా పరిధిలో 23 మండలాలు, ఖమ్మం జిల్లాలో ఐదు మండలాలు, ములుగు జిల్లాలోని రెండు మండలాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని రెండు మండలాలు కలిపి 9,674.42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐటీడీఏ పరిధి ఉంది. చట్టాలు ఉన్నా అమలేది? ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను అమలు చేస్తున్నాయి. కానీ, అవి సమగ్రంగా అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం గిరిజనుల సమగ్రాభివృద్ధికి ఐటీడీఏను ఏర్పాటుచేసి దశాబ్దాలు దాటినా ఆదివాసీల జీవనంలో మార్పులు మాత్రం రాలేదు. అడవిని నమ్ముకుని జంతువుల మధ్యే జీవనం సాగించే గిరిపుత్రుల నివాసాలకు వెళ్లేందుకు కనీస దారులు లేక తాగేందుకు గుక్కెడు నీళ్లు లభించని పరిస్థితులు కనిపిస్తాయి. ఇక విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్న గూడెంలు సైతం ఉన్నాయి. ఏళ్ల కిందట ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడకు వలస వచ్చిన ఆదివాసీలు స్థానికంగా నివాసం ఏర్పర్చుకున్నారు. కానీ, వీరిని ఎన్నికల సమయంలో మనుషులుగా, ఓటర్లుగా గుర్తిస్తున్న నాయకులు ఆ తర్వాత ఇటు ముఖం చూడకపోవడంతో సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయి. అటవీ ఫలసాయమే ఆధారం! గూడేలలో నివాసముంటున్న ఆదివాసీలు వ్యవసాయంతో పాటు అటవీ ఫలసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. కనీస రహదారి సౌకర్యం లేక నిత్యం కిలోమీటర్ల మేర కాలినడకన నడిచి వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిందే. వర్షాకాలంలో అయితే ఆ బాట కూడా ఉండకపోతే అనారోగ్యం ఎదురైతే దేవుడిపై భారం వేసి గడపాల్సి వస్తోంది. విద్యుత్ సౌకర్యం కోసం ఐటీడీఏ ద్వారా పలు ఆదివాసీ గ్రామాల్లో సోలార్ లైట్లు బిగించినా అందులో అత్యధికం పనిచేయడం లేదు. ఇక తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. అటవీ శాఖ నిబంధనలతో బోర్లు వేయడం సాధ్యం కాక వాగులు, వంకలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారైనా పార్టీ అభ్యర్థులు తమ సమస్యలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని.. అప్పుడే ఓట్లు వేస్తామని ఆదివాసీలు తేల్చిచెబుతున్నారు. భద్రాద్రి జిల్లాలో.. ఇవి కూడా చదవండి: ప్రచారం.. నేటితో పరిసమాప్తం! ఇకపై గెలిచేవరకు మూగనోమే.. -
కూనంనేనికే ఫార్వర్డ్ బ్లాక్ మద్దతు.. : సీపీఐ సభ్యుడు రామరాజు
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: కొత్తగూడెంలో మిత్రపక్షాలు బలపరుస్తున్న సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామరాజు తెలిపారు. సోమవారం శేషగిరిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీలు పోటీ చేసే చోట పోటీ చేయకూడదని నిర్ణయించిందని, ఇందుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించారని, పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు బీఫాం ఎలా కేటాయించారని ప్రశ్నించారు. నేతాజీ ఆశయాలతో పనిచేస్తున్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీ ఫామ్ వామపక్ష వ్యతిరేకికి ఇవ్వడం సరికాదన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు కూనంనేని విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: పొత్తులో కత్తులు! బీజేపీ, జనసేనల మధ్య వాగ్వాదం.. -
24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తప్పుకుంటా: కేసీఆర్కు ఈటల సవాల్
సాక్షి, సంగారెడ్డి/తూప్రాన్: బీజేపీ కండువా కప్పుకున్న వారికి సంక్షేమ పథకాలు రావని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని, పథకాలు మీ అయ్య జాగీరా? అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఆదివారం తూప్రాన్లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్రావు అధ్యక్షతన జరిగిన సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈటల మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కాషాయ కండువా కప్పుకున్న వారికి పెన్షన్లు, రైతుబంధు, డబుల్ బెడ్రూం రాదంటున్నారు. మిస్టర్ సీఎం కేసీఆర్.. మిస్టర్ హరీశ్.. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మీ అయ్య జాగీరా..? అని ప్రశ్నించారు. మీరు కేవలం ప్రజల ఆస్తులకు కాపాలదారులు మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసే జీతగాళ్లు అనే విషయం మరిచిపోతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. రాజకీయం నుంచి తప్పుకుంటా.. కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తమతోనే ఉద్యోగాలు, 24 గంటల విద్యుత్ సరఫరా అని మాట్లాడటం సిగ్గుచేటని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తే తాను రాజకీయల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కౌలు రైతు చనిపోతే రూ.లక్ష ఇచ్చే సోయి లేని కేసీఆర్.. పక్క రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో రైతులకు రూ.3 లక్షల చెక్కులు అందించి తెలంగాణ వ్యవసాయంలో ఆదర్శం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు విత్తనాలు, ట్రాక్టర్లు, పనిముట్లు తదితర వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. అలాగే ప్రతీ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్లు అందించడంతోపాటు రైతులు సాగు చేసిన ధాన్యానికి క్వింటాల్కు రూ.3,500 చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మురళీయాదవ్(నర్సాపూర్), నందీశ్వర్గౌడ్(పటాన్చెరు), రాజు (సంగారెడ్డి), శ్రీకాంత్రెడ్డి (సిద్దిపేట), విజయ్కుమార్ (మెదక్) మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్, నందారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్! -
TS Elections 2023: ఈసారైనా ‘కమలం’ వికసిస్తుందా.. సీపీఎంకు అవకాశం వస్తుందా?
ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికీ బీజేపీ బోణీ కొట్టలేదు. ప్రతి ఎన్నికల్లో పోటీచేస్తున్నా గెలుపు దరికి చేరుకోవడం లేదు. పీడీఎఫ్ నుంచి గెలిచిన అభ్యర్థులను పక్కన పెడితే.. సీపీఐకి మూడు నియోజకవర్గాల్లోనే ప్రాతినిధ్యం దక్కింది(1962 ఎన్నికల వరకు సీపీఐ, సీపీఎం కలిసే ఉన్నాయి). సీపీఎం ఇప్పటివరకు ఏడు నియోజకవర్గాల్లో ఒక్కసారి కూడా గెలుపొంద లేదు. ఈ ఎన్నికల్లోనైనా బీజేపీ బోణీ కొడుతుందా?, సీపీఎం ఏ మేరకు పట్టు సాధిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈసారి కాంగ్రెస్తో పొత్తు కారణంగా ఉమ్మడి జిల్లాలో సీపీఐ పోటీలో లేదు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజక వర్గాలున్నాయి. అయితే ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో ఒక్కసారి కూడా ఏ ఒక్క నియోజకవర్గం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం దక్కలేదు. 2004 ఎన్నికల్లో రామన్నపేట నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీలో ఉన్నడి. మల్లేశం, 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాత్రమే రెండో స్థానంలో నిలిచారు. మిగతా ఎవ్వరూ రెండో స్థానంలో కూడా నిలవలేదు. ఈసారి బీజేపీ అభ్యర్థులు 11 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నా గెలుస్తామా లేదా? అన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇందులో బీజేపీ కూడా తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలన్న లక్ష్యంతో జాతీయ నాయకులను రంగంలోకి దింపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జిల్లాలో ప్రచార సభలు, సమావేశాలు, రోడ్షోలలో పాల్గొంటున్నారు. ఈసారైనా ఉమ్మడి జిల్లాలో బీజేపీ బోణీ చేస్తుందా.. గెలుపు కలగానే మిగులుతుందా? అన్నది త్వరలోనే తేలనుంది. ఐదు చోట్ల గెలిచిన సీపీఎం.. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను ఏడు చోట్ల సీపీఎం అభ్యర్థులు ఒక్కసారి కూడా గెలువలేదు. మిగతా ఐదు నియోజకర్గాల్లో మాత్రమే సీపీఎం అభ్యర్థులు పలుమార్లు గెలుపొందారు. వాటిల్లో కొన్నిసార్లు పొత్తుల్లో భాగంగా, మరికొన్నిసార్లు ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఒంటరిగా బరిలో నిలిచారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా.. ఇక సీపీఐ(ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా ఉన్నప్పుడు)కి మూడు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం దక్కలేదు. 1962 ఎన్నికల వరకు సీపీఐ, సీపీఎంలు (సీపీఐగా) కలిసే ఉన్నాయి. సీపీఐగానే ఎన్నికల బరిలో నిలిచాయి. ఉమ్మడిగా ఉన్న సమయంలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎంగా) విడిపోయాక 1967 నుంచి జరిగిన ఎన్నికల్లో సీపీఐకి మూడు చోట్ల ప్రాతినిధ్యం దక్కింది. తొమ్మిది చోట్ల ఆ పార్టీ గెలుపొందలేదు. నియోజకవర్గాల వారీగా ఇదీ పరిస్థితి.. నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారి కూడా గెలువలేదు. నకిరేకల్ నియోజక వర్గంలో 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా బీజేపీ, టీడీపీకి ప్రాతినిధ్యం లభించలేదు. మునుగోడులో బీజేపీ, టీడీపీ, సీపీఎం ఒక్కసారి కూడా గెలువలేదు. దేవరకొండ నుంచి బీజేపీ, సీపీఎం, టీడీపీకి ఒక్కసారి కూడా విజయం దరిచేరలేదు. నాగార్జునసాగర్ (పాత చలకుర్తి)లో సీపీఎం, బీజేపీలకు ఒక్కసారి కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. మిర్యాలగూడలో బీజేపీ, టీడీపీ గెలువలేదు. సూర్యాపేట నియోజకవర్గంలో 15సార్లు ఎన్నికలు జరిగినా బీజేపీకి ఒక్కసారి కూడా విజయం వరించలేదు. తుంగతుర్తి నియోజకవర్గంలోనూ 13 సార్లు ఎన్నికలు జరగ్గా సీపీఐ, బీజేపీకి గెలిచే అవకాశం రాలేదు. హుజూర్నగర్లో పదిసార్లు జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, బీజేపీ, టీడీపీ ఒక్కసారి కూడా గెలుపొందలేదు. కోదాడలో పది సార్లు ఎన్నికలు జరగగా.. బీజేపీ, సీపీఎం, సీపీఐ ఒక్కసారి కూడా గెలుపొందలేదు. ఆలేరులో 16 సార్లు ఎన్నికలు జరగగా.. సీపీఎం, బీజేపీలకు ప్రాతినిధ్యం లభించలేదు. భువనగిరి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు సహా 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో సీపీఎం, బీజేపీ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయాయి. ఇది చదవండి: Telangana Assembly Elections: ఓటరు పరిశీలనలో ఏజెంట్లే కీలకం -
Telangana Assembly Elections: ఓటరు పరిశీలనలో ఏజెంట్లే కీలకం
మిర్యాలగూడ టౌన్: పోలింగ్ కేంద్రంలో అభ్యర్థుల తరఫున ఓటరు పరిశీలనలో పోలింగ్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకం అని చెప్పవచ్చు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లు బోగస్ వారా..? లేక నిజమైనా ఓటరా..? అని నిశితంగా పరిశీలిస్తారు. ఆయా పార్టీల అభ్యర్థు లు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించుకుంటారు. నిబంధనలు ఇవే.. ► పోలింగ్ కేంద్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు సంబధించిన పోలింగ్ ఏజెంట్లకు ప్రాధాన్య క్రమంలో కుర్చీలను వేస్తారు. ► ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రతి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ► పోలింగ్ ఏజెంట్ల ఫారంలో పోటీ చేస్తున్న అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్గా నియమితులైన వారికి ఏజెంట్ల పాసును జారీ చేస్తారు. ► ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు పాసులను జారీ చేసినా ఒక్కరు మాత్రమే బూత్లో కూర్చోవటానికి అనుమతి ఇస్తారు. ఓటరు జాబితాను బయటకు తీసుకెళ్లేందుకు వీలు ఉండదు. ► పోలింగ్ ఏజెంట్లు ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల సంఘం ఫొటో గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి. ► పోలింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారు ఓటింగ్ సమయానికి గంట ముందుగానే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్లినా అధికారులు వారి పనులను వారు కొనసాగిస్తారు. ఆలస్యం అయితే ఓటింగ్ యంత్రాల సీల్లో ఏజెంటు సంతకం చేయడం, పరిశీలన చేయలేకపోతారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎంల సీలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన తరువాతనే సంతకం చేయాలి. ► పోలింగ్ ఏజంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్, వైర్లెస్, కార్డ్లెస్ పరికరాలను తీసుకెళ్లరాదు. పార్టీ కండువాలు, గుర్తులను ధరించవద్దు. ఓట్లు వేయని ఓటర్ల సంఖ్యను సూచించి వెలుపలికి పంపడం వంటివి చేయవద్దు. ► పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి కదలిక, తతంగాన్ని పోలింగ్ ఏజెంట్లు నిశితంగా పరిశీలించి ఏ మాత్రం అనుమానం కలిగిన అధి కారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇది చదవండి: దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న కోస్గి.. దీనికి కారకులు ఎవరు? -
‘పేట’కు టెక్స్టైల్ పార్కు! : అమిత్ షా
సాక్షి, మహబూబ్నగర్/నారాయణపేట: ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు పెంచి.. జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు నారాయణపేట జిల్లాకేంద్రంలో చేనేత కార్మికుల కోసం టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకువస్తే బీసీ సీఎం అవుతారని.. రాబోయే రోజుల్లో కేంద్రంలో నరేంద్రమోదీని మరోసారి పీఎం చేద్దామంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వారి జీవన పరిిస్థితులపై నరేంద్రమోదీ అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. మక్తల్లో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాలకు నోచుకోలేదని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నాయకులు మక్తల్లో భూ కబ్జాలు, దాందాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే భీమా ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఊట్కూర్ చెరువుతోపాటు జాయమ్మ చెరువుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలు నెరవేరాలంటే జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మక్తల్లో మాదిరెడ్డి జలంధర్రెడ్డి, నారాయణపేటలో రతంగ్ పాండురెడ్డి, కొడంగల్లో బంటు రమేష్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీజేపీతోనే సంక్షేమ పాలన! బీజేపీతోనే ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జలంధర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, మక్తల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా.. ఓడినా.. పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కోలార్ ఎంపీ మునిస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్ చైర్మన్ అఖిలారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు బాల్రాంరెడ్డి, తిమ్మప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్, కనకరాజు, మండలాధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, మలికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ కర్నిస్వామి, ఉపాధ్యక్షుడు సోంశేఖర్గౌడ్, నాగప్ప, కౌన్సిలర్లు కౌసల్య, సత్యనారాయణ, అర్చన, కొండయ్య, నాయకులు లక్ష్మణ్, ప్రతాప్రెడ్డి, శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు! -
దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న కోస్గి.. దీనికి కారకులు ఎవరు?
కోస్గి: ఓటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్ది కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు ముదురుతుంది. ముఖ్యంగా కోస్గి మండలంలో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు నువ్వా నేనా అన్నట్లు కయ్యానికి కాలు దువ్వుకుంటున్నారు. ప్రచార హోరు పక్కన పెడితే ఏకంగా దాడులు, ప్రతిదాడులతో మండలంలో భయంకరమైన వాతావరణం సృష్టించడంతో ప్రజలు తీవ్ర భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే నరేందర్రెడ్డితో పాటు అతని కుమారుడు, అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కుమారుడు హితీష్రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ముదిరెడ్డిపల్లి, అమ్లికుంట్లకు వెళ్లాడు. అక్కడ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచడానికి వచ్చారంటూ వాహనాన్ని అడ్డుకోవడంతో వెనుదిరిగినప్పటికి అమ్లికుంట్ల, బోగారంలో రోడ్డుకు అడ్డంగా రాళ్లు వేసి వాహనాన్ని ఆపి దాడి చేశారు. వాహనం ధ్వంసమైంది. ఈ క్రమంలో అదేరోజు అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్ ఓ ఫంక్షన్హాల్లో పెళ్లి డెకరేషన్ పనులు ముగించుకొని వెళ్తున్న క్రమంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు అతన్ని ఆపి మూకుమ్మడిగా దాడి చేసి కారులో బలవంతంగా ఎత్తుకెళ్లి తీవ్రంగా కొట్టారు. తలపగిలి తీవ్ర గాయాలతో ఉన్న నరేష్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తన ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష ఇంటికి, ఇతర నాయకుల ఇళ్లకు వెళ్లి వాగ్వా దానికి దిగారు. రేవంత్రెడ్డి సోదరుడు బాధితుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, అతని కుమారుడు హితీష్రెడ్డితోపాటు మున్సిపల్ చైర్ పర్సన్ భర్త మ్యాకల రాజేష్, కౌన్సిలర్ బాలేష్, బోరబండ కార్పొరేషన్ బాబా ఫసీయోద్దీన్, వెంకట్నర్సింహులు, మీర్జాపూర్ రాజేందర్రెడ్డి, కోనెరు సాయప్ప, అమీర్ షేక్పై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా శనివారం అర్ధరాత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి తన అనుచరులతో వచ్చి ప్రతాప్రెడ్డి ఫాంహౌస్లో నుంచి వస్తున్న క్రమంలో తనపై, తన అనుచరులపై దాడి చేసి గాయపరచడంతోపాటు తన వాహనాన్ని వెంబడించి హత్యాయత్నం చేశారని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతవారం ఏకంగా పోలీసు స్టేషన్లోనే ఇరుపార్టీల నేతలు గొడవ పడి రాళ్లతో దాడులు చేసుకోవడం, ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజా దాడులు, ప్రతిదాడులతో కోస్గిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్న ఎన్నికల రణరంగంతో ప్రజలు తీవ్ర భయందోళకు గురవుతున్నారు. -
TS Elections 2023: ఇందిరమ్మ రాజ్యం రావాలి.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/స్టేషన్ మహబూబ్నగర్/దేవరకద్ర/నారాయణపేట: ‘జిల్లా అభివృద్ధి బాట పట్టాలన్నా.. సాగునీటి ప్రాజెక్టులతోపాటు జిల్లాలోని వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఉమ్మడి జిల్లా పరిధిలోని నారాయణపేట, దేవరకద్ర విజయభేరి సభలు, మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో క్లాక్టవర్ సెంటర్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరువ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, ఆదర్శ జిల్లాగా మార్చే బాధ్యత తనదేనన్నారు. పాలమూరును పసిడి పంటలతో కళకళలాడేలా చేస్తామని, నిరుద్యోగ సమస్యను నిర్మూలించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే డీడీలు కట్టిన యాదవులకు గొర్రెలు ఇవ్వదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కన్నా మరిన్ని మంచి పథకాలు అమలు చేస్తామన్నారు. హామీలు విస్మరించి మోసం.. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నియోజకవర్గానికి సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరు, వంద పడకల ఆస్పత్రి ఇచ్చిండా.. మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాడా, మొదటి ఎమ్మెల్సీ ఇచ్చాడా.. నారాయణపేట– కొడంగల్ పథకం పని మొదలు పెడతానని పెట్టిండా.. కృష్ణా– వికారాబాద్ రైల్వే లేన్ తెచ్చిండా అని ప్రశ్నించాడు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. పక్కాగా 6 గ్యారంటీల అమలు.. దేశం నుంచి నరేంద్రమోదీని పారదోలేందుకు రాహుల్గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారని రేవంత్ గుర్తు చేశారు. తాను పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గానికి రాహుల్గాంధీ ఇప్పటికే చేరుకున్నారని.. అయినా ఇక్కడున్న అరాచక శక్తులను వంద మీటర్ల గోతి తీసి పాతిపెడతానని చెప్పడానికి పాలమూరు గడియారం చౌరస్తాకు వచ్చానన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అధికారం మన చేతిలో ఉండాలని.. నిధుల కేటాయింపు మన చేతిలో ఉండాలని.. మనం సంతకం చేస్తే మన జిల్లాకు వేల కోట్లు వరదలై పారాలని.. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నారు. వడ్డించే వాడు మన వాడు అయితే ఏ పార్టీ ఉన్నా మనకు ఇంత బువ్వ దొరుకుతుందన్నారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసి, అన్ని వర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్: మధుసూదన్రెడ్డి దేవరకద్ర ప్రజల సమస్యల గురించి బీఆర్ఎస్ వాళ్లు పట్టించుకోవడం లేదని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యరి్థ, డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రాల్లో మెరుగైన ఆస్పత్రులు, కళాశాలలు లేవన్నారు. నియోజకవర్గ కేంద్రంలో సోయి లేకుండా ఆర్వోబీ నిర్మాణం చేసి పట్టణాన్ని రెండుగా విడగొట్టారని ధ్వజమెత్తారు. దీంతో పెద్ద వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం రూపురేఖలు కోల్పోయిందన్నారు. కనీసం అండర్పాస్ బ్రిడ్జి కట్టించాలనే ఆలోచన కూడా వారికి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మండలంలో 30 పడకలు, నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రితో పాటు డిగ్రీ కళాశాల, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోయిల్సాగర్ నీటిని మండలంలోని అన్ని గ్రామాలకు అందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి, అరవింద్రెడ్డి, విజయసారథిరెడ్డి, భాస్కర్రెడ్డి, నాగిరెడ్డి, శెట్టిశేఖర్, యుగంధర్గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ విగ్యారంటీ మాటలు.. యెన్నం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఆ పార్టీ మహబూబ్నగర్ నియోజకవర్గ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చెప్పేవి గ్యారంటీ మాటలని, సంక్షేమ పథకాల అమలు తమతోనే సాధ్యమన్నారు. ఉమ్మడి పాలమూరులో 14 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్కుమార్, సంజీవ్ ముదిరాజ్, నాయకులు ఎన్పీ వెంకటే ష్, సురేందర్రెడ్డి, ఆనంద్గౌడ్, రాఘవేందర్రాజు, మధుసూదన్రెడ్డి, సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు. ఇది చదవండి: TS Elections 2023: ఈసారైనా ‘కమలం’ వికసిస్తుందా.. సీపీఎంకు అవకాశం వస్తుందా? -
సమయం.. సరిపోవట్లే! రోజుకు 28గంటలు ఉంటే బాగుండు!
సాక్షి, మహబూబ్నగర్: ‘ప్రచారంలో అటు తిరిగి ఇటు వచ్చే లోగా రోజు గడిచిపోతుంది. ఏ రోజు అనుకున్న పనులు ఆ రోజు అవట్లేదు. సమయం సరిపోవడం లేదు. పోలింగ్ సమయమేమో దగ్గరపడుతోంది. రోజుకు 28గంటలు ఉంటే బాగుండు.’ ఇటీవల ఓ నాయకుడు తన అనుచరుల వద్ద చేసిన వ్యాఖ్య ఇది. ఈ ఒకట్రెండు రోజులు చెమటోడ్చి కష్టపడితే ఐదేళ్ల పాటు హాయిగా వీఐపీ హోదాలో దర్జాగా ఉండవచ్చు. శాసనసభలో ప్రధాన ప్రాత వహిస్తూ అధికార దర్పంతో హాయిగా బతకవచ్చు. కాలం కలిసి వస్తే మంత్రి పదవి రావొచ్చు. అలాంటి రాజకీయ జీవితం కోసం అభ్యర్థులు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఓవైపు ఉష్ణోగ్రతలు పడిపోయి గ్రామాలన్నీ మంచుదప్పటి పరచుకుని ఉంటే.. అభ్యర్థులు చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామునే ప్రచారం మొదలుపెడుతున్నారు. ఉదయం ఇంటి నుంచి బయల్దేరి రాత్రికి ఎప్పుడో తిరిగొస్తున్నారు. అభ్యర్థుల దినచర్య అత్యంత బిజీ షెడ్యూల్తో ప్రారంభమవుతోంది. అలసట, విశ్రాంతి అనే పదాలకు చోటులేకుండా ముందుకు సాగుతున్నారు. సహాయకుల పరిస్థితి అంతే.. ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా అభ్యర్థులు తమ షెడ్యూల్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం నిద్రించే సమయం తప్ప మిగతా సమయాన్ని మొత్తం ప్రచార పర్వానికే అంకితం చేస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీ పడుతున్నారు. బిజీ షెడ్యూల్తో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటినిండ నిద్ర కరువైంది. గ్రామీణ ప్రజలు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో వారిని కలిసేందుకు వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేలాది మందిని ప్రత్యక్షంగా పలకరిస్తున్నారు. ఈ సమయంలో వారి వ్యక్తిగత సహాయకుల పాత్ర కీలకమవుతుంది. నిర్దేశించుకున్న పనులను నిర్ణీత సమయానికి గుర్తు చేయడం, అందరినీ సయన్వయం చేయడం వంటి బాధ్యతలు వీరు నిర్వరిస్తున్నారు. అలా అభ్యర్థులకు సహకారం అందిస్తూ సమయాభావ సమస్యను ఎదుర్కొంటున్నారు. నెలరోజులుగా జనంలోనే.. అభ్యర్థుల ఇళ్ల వద్ద నిత్యం జనంతో కోలహలం కనిపిస్తోంది. ఉదయం నుంచే వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీల అభ్యర్థులతో మాట్లాడేందుకు క్యూ కడుతున్నారు. దీంతో నిద్రలేచింది మొదలు ప్రచారతంతు ప్రారంభమవుతోంది. కిందిస్థాయి నేతలతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాల్లో పరిస్థితిపై ఆరా తీసేందుకు కొంత సయమం కేటాయించాల్సి వస్తోంది. రోజు ఏదో ఒక చోటకు వెళ్లడం దిన చర్యలో తప్పనిసరిగా మారింది. నియోజకవర్గం మొత్తం చుట్టి రావడమే లక్ష్యంగా రోజువారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలకు రాకపోకల సమయంలోనూ ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై చర్చిస్తున్నారు. అలాగే ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు స్థానిక లీడర్ల సాయంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. నియోజకవర్గానికి ఎవరైనా ముఖ్యనేతలు వస్తే జనసమీకరణ తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం రోజులో ఎంతో కొంత సమయం కేటాయిస్తున్నారు. దిన చర్య ఇలా.. ► ఉదయం 5గంటలకు మేల్కొనడం ► 5నుంచి 6గంటల వరకు కాలకృత్యాలు తీర్చుకోవడం ► 6నుంచి 7లోగా స్నానం, టిఫిన్ చేయడం ► 7నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గ్రామాల్లో ప్రచారం, రోడ్ షోలు, చేరికలు, సభలు, ప్రెస్మీట్లు నిర్వహించడం ► 2నుంచి 4గంటల మధ్య మధ్నాహ్న భోజనం చేయడం ► సాయంత్రం 4నుంచి రాత్రి 10గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనడం ► రాత్రి 10గంటలకు రాత్రి భోజనం తర్వాత ముఖ్యులతో మాటామంతి ► రేపటి దిన చర్య కోసం ప్లాన్ వేసుకోవడం ఆ రోజు అన్ని పనులు పూర్తయితే నిద్రకు ఉపక్రమించడం. ఈ తతంగం ముగిసే వరకు రాత్రి 12నుంచి 2గంటలు దాటుతోంది. ఒక్కోసారి ముఖ్యనేతల బహిరంగ సభలు ఉంటే తెల్లవారుజాము వరకు మేల్కొనే ఉంటున్నారు. -
రహస్య స్నేహితులు! ‘కోవర్టు’ల కలకలం..!
సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సరిగ్గా మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ రంగులు మారుతున్నాయి. ఉదయానికున్న సమీకరణాలు.. సాయంత్రానికి తలకిందులవుతున్నాయి. పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థి వ్యూహాలను పసిగట్టడం, ప్రచారాలు, కార్యక్రమాలపై నిఘా పెట్టడం.. ఉల్లంఘనలుంటే వాటిపై అధికారులకు ఫిర్యాదు చేయడం వంటివి ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితోపాటు ప్రత్యర్థి పార్టీలో కొందరిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వారు చేసిన తప్పులను వీరికి తెలియజేసే పనిని వారికి అప్పజెబుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు పెట్టడానికై నా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఫలానా పార్టీ అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి ఇవి మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. కోవర్టుల కలకలం.. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే నానుడి ఉన్నదే. కొంతమంది నాయకుడి వెన్నంటే ఉండి.. నమ్మకంగా నటించి ఇక్కడి విషయాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారు. సంపాదనే పరమావధిగా ఈ పని చేస్తున్నారు. నాయకులు తనవెనుక ఉండే వారిలో ఇలాంటి వారు ఉన్నారని తెలిసినా వారెవరో గుర్తించలేకపోతున్నారు. ప్రత్యర్థుల చెంత నమ్మకంగా పని చేస్తున్నవారిని నాయకులు బుట్టలోకి లాగుతున్నారు. వారి ద్వారా అక్కడ జరిగే విషయాలను తెలుసుకుంటూ ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేతల వివరాలు, సభలు, సమావేశాల్లో జరిగే ఉల్లంఘనలు, ఎన్నికల్లో ధన, మధ్య ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ కోవర్టులు ఉపయోగపడుతున్నారు. మరికొన్ని చోట్ల ఒక్కడుగు ముందేసిన కోవర్టులు.. ఓ పార్టీకి చెందిన అభ్యర్థి ఇచ్చిన డబ్బులు పంచుతూ మరో పార్టీ అభ్యర్థికి ఓటేయమని చెబుతున్నారన్న చర్చ ఉంది. ఇందుకోసం ప్రత్యర్థులు భారీగానే ముట్టచెబుతున్నారని సమాచారం. ఏం చేశారు.. ఎవరికి పంచారు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆయా పార్టీల అధిష్టానం పంపిన పార్టీ ఫండ్పై పలు నియోజకవర్గాల్లో రచ్చ జరుగుతోంది. ‘ఎవరికి ఇచ్చారు.. ఎక్కడ పంచారు?’ అంటూ బహిరంగంగానే నిలదీతల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు రూ.10 కోట్ల నుంచి 25 కోట్ల వరకు అందినట్లు ఆపార్టీ ముఖ్యనేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రెండు విడతల్లో ఐదు రోజుల తేడాతో రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అందినట్లు ఆ పార్టీవర్గాల్లో జరుగతున్న చర్చ. అలాగే బీజేపీ అధిష్టానం అభ్యర్థులను బట్టి రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు అందించినట్లు ఆ పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అర్బన్ స్థానాల్లో పోటీ చేస్తున్న కొందరికి అంతకుమించే అందించినట్లు ప్రచారం. అయితే పార్టీ కార్యకర్తలు, ఓటర్ల కోసం పంపిణీ చేయాల్సి ఉండగా.. చాలా చోట్ల వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమను పట్టించుకోవడం లేదంటూ కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల డబ్బుల వ్యవహారంలో అభ్యర్థుల కుటుంబాల్లో ముదిరిన ఆధిపత్యం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పడరాని పాట్లు పడుతుంటే... మరోవైపు కోవర్టులు, పార్టీఫండ్, డబ్బుల పంపిణీ వివాదాలతో తలలు పట్టుకుంటున్నారు. కోవర్టులకు భారీ నజరానాలు! రహస్య స్నేహితులు(కోవర్టులు) అందించిన స మాచారాన్ని బట్టి వారికి నజరానాలు అందించేందుకు అన్ని పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్థులు సిద్ధమయ్యారు. ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు. ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితి, ప్రచార సమయంలో అభ్యర్థి వెంట తప్పనిసరిగా వీడియో బృందం ఉంటోంది. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు అభ్యర్థులంతా రహస్య పద్ధతులు అవలంబిస్తున్నారు. ఎన్నికల నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయాల్లో జరిగిన ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలతో సహా ప్రత్యర్థులకు చేరవేస్తే అందుకు తగ్గట్లుగా ప్రతిఫలం అందజేస్తున్నారు. కోవర్టుల స మాచారంతోనే ఎన్నికల సంఘాల వరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. భూపాలపల్లి, మహబూ బాబాద్, ములుగు, జనగామ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల్లో ఈ తరహా ఫిర్యాదులందాయి. పలుచోట్ల డబ్బులు తరలి స్తున్న వాహనాలు కూడా పోలీసులకు చిక్కాయి. ఇవి చదవండి: 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తప్పుకుంటా: కేసీఆర్కు ఈటల సవాల్ -
ఓటుకు వారు దూరమే..
సాక్షి, నిజామాబాద్: ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రవాసులకు ఓటు హక్కు వినియోగించుకునే వీలు లేకుండా పోతోంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ సిబ్బందికి, దేశ భద్రతను కాపాడుతున్న సైనికులకు సర్వీస్ ఓటింగ్ విధానం అమలు చేస్తున్న ఎన్నికల కమిషన్ ప్రవాసుల విషయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేకపోయింది. ఫలితంగా జిల్లాలో దాదాపు 2.90 లక్షల మంది గల్ఫ్ వలస కార్మికులతో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న వారు ఓటు హక్కుకు దూరమవుతున్నారు. విదేశాల్లో ఆన్లైన్ ఓటింగ్ విధానం అమలులో ఉంది. పోలింగ్ బూత్కు స్వయంగా వెళ్లి ఓటు వేయని వారు ఆన్లైన్లో ఓటింగ్కు పాల్గొనడానికి దరఖాస్తు చేసుకుంటే ఆయా దేశాల్లో ఓటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. మన దేశంలో వలస కార్మికుల కోసం ప్రాక్సీ ఓటింగ్ విధానం అమలు చేయడానికి గతంలో కసరత్తు చేశారు. సాంకేతిక కారణాలతో ఈ విధానం అమలులోకి రాకముందే స్వస్తి పలికారు. ప్రాక్సీ ఓటింగ్ విధానం అమలులోకి వచ్చి ఉంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న వలస కార్మికులతో పాటు ఇతర దేశాల్లో ఉపాధి పొందుతున్న ప్రవాసులకు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలు ఉండేది. కనీసం రానున్న స్థానిక సంస్థల, పార్లమెంట్ ఎన్నికల సమయంలోనైనా వలస కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునే వీలు కల్పించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇవి కూడా చదవండి: మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్రెడ్డి -
సమయం లేదు మిత్రమా! అభ్యర్థుల హైరానా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'శాసనసభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు మరింత హడావుడి పడుతున్నారు.' రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం కానుండడంతో భారీ ర్యాలీలతో ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్లతో అభ్యర్థులు గట్టి ప్రచారం చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జాతీయస్థాయి నేతలు పలుసార్లు రావడం గమనార్హం. బీజేపీ అగ్రనేతలు పీఎం మోదీ, అమిత్షా, జేపీ నడ్డాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఉమ్మడి జిల్లా లో మూడు సార్లు ప్రచారానికి రావడం విశేషం. సీఎం కేసీఆర్ సైతం అన్ని నియోజకవర్గాల్లో స భలు పూర్తి చేశారు. దీన్ని బట్టి జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఏ స్థాయి లో ఉందో తెలుస్తోంది. ఇప్పటికే ప్రచారం తారాస్థాయిలో నడుస్తోంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంతో పాటు కులసంఘాలతో పలుసార్లు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటింటి ప్రచారం సైతం నిర్వహిస్తూ వచ్చారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా భారీ ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో ఎక్కడ చూసినా సీ నియర్ సిటిజన్ల నుంచి ప్రతిఒక్కరూ ఎవరి విశ్లేషణ వారు చేస్తున్నారు. దీంతో ఓటరు నాడి అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పార్టీలు సోషల్ ఇంజినీరింగ్ పకడ్బందీగా చేస్తూ వస్తున్నారు. సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఇందూరు గడ్డ మీ ద నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. మరోవైపు జిల్లాలోని నియోజకవర్గాల అభ్యర్థు లు సైతం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ వచ్చారు. ఒకరిద్దరు నేతలైతే పరుష పదజాలం సైతం ఉపయోగంచడంతో రాజకీయ వాతావరణం మరింత వాడివేడిగా తయారైంది. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ మీద ప్రత్యేంగా దృష్టి పెట్టారు. సమయం తరిగిపోతుండడంతో అ భ్యర్థులు, నాయకులు ప్రతి నిమిషాన్ని పూర్తి స్థా యిలో సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళిక తో ముందుకు వెళ్తున్నారు. ఇవి కూడా చదవండి: ‘పేట’కు టెక్స్టైల్ పార్కు! : అమిత్ షా -
'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్
సాక్షి, నిజామాబాద్/హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్సిటీలో ఓవైసీలు టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ పాతబస్తీని మినీ పాకిస్థాన్గా మార్చారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తరఫున రోడ్షోలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు దుబ్బ చౌరస్తా నుంచి గంజ్ కమాన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, దేవీరోడ్, పూసలగల్లి మీదుగా గోల్ హనుమాన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోల్ హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ అర్బన్లో సూర్య నారాయణను గెలిపించుకుంటే కేంద్రం, రాష్ట్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొస్తాడని తెలిపారు. గణేశ్ గుప్తా కమీషన్లు తీసుకుంటాడని ఆరోపించారు. దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు, అరెస్టులు హైదరాబాద్లోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా హైదరాబాద్లో అల్లర్లు కాకుండా ఓవైసీ కాళ్లు పట్టుకుంటున్నారని, వాళ్లని అడుక్కునే అవసరమేముందని ప్రశ్నించారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి ఎన్ఐఏ అధికారులు వచ్చి ఆరుగురు టెర్రరిస్టులను పట్టుకున్నారని, అందులో ఒకరు ఓవైసీకి చెందిన కళాశాల ప్రొఫెసర్ అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఒక టెర్రరిస్టు ఏం పాఠాలు చెబుతాడని, కేవ లం టెర్రరిజం నూరిపోస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులకు మద్దతు తెలిపితే బుల్డోజర్లు వస్తాయన్నారు. హైదరాబాద్ తర్వాత ఎంఐఎం లక్ష్యం నిజామాబాద్ అని, ఇందూరు ప్రజలు ఆలోచించి ఓటే యాలన్నారు. కారు పార్టీ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్ను కాస్త బార్ అండ్ రెస్టారెంట్ సమితి (బీఆర్ఎస్)గా మార్చారన్నారు. మైనారిటీ మహిళల ఆత్మగౌరవం కోసం పీఎం నరేంద్రమోదీ ట్రిపుల్ తలాక్ను రద్దు చేయించారన్నారు. నగరాభివృద్ధి ఎక్కడ..? సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడని, 2014లో దళితుడి ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదన్నారు. గణేశ్ గు ప్తా అర్బన్ను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తున్నాడని, ఎక్కడ ఖర్చు పెట్టావో చెప్పాలని డి మాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కుందన్నారు. బీసీని సీఎం చేస్తానని ప్రకటించిందని బీజే పీ మాట నిలబెట్టుకుంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, జిల్లా ఇన్ఛార్జి క ళ్లెం బాల్రెడ్డి, నాయకులు, కార్పొరేటర్లు న్యాలం రా జు, స్రవంతిరెడ్డి, పంచరెడ్డి లింగం, వనిత, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శివప్రసాద్ తదితరులున్నారు. నేను గెలిస్తే హిందువులు గెలిచినట్లే.. అర్బన్లో తాను గెలిస్తే హిందువులందరూ గెలిచినట్లేనని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్య నారాయణ పేర్కొన్నారు. ఓవైసీ 15 నిమిషాలు సమయమిస్తే హిందువులు లేకుండా చేస్తానని గతంలో ప్రసంగించారని గుర్తుచేశారు. దమ్ముంటే అర్బన్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయాల ని సవాల్ విసిరానని, భయపడి రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీకి హిందూ వ్యతిరేక శక్తులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక వర్గం కోసం పని చేస్తున్నాయన్నారు. ఇవి చదవండి: ఓటుకు వారు దూరమే.. -
మూడోసారీ విజయం నాదే.. : వేముల ప్రశాంత్రెడ్డి
సాక్షి, నిజామాబాద్: 'రెండుమార్లు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు చూపిన ఆదరణతో, సీఎం కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో రూ.వేల కోట్ల నిధులు బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధికి తెచ్చాను. ఆ అభివృద్ధి పనులే నా హ్యాట్రిక్ విజయానికి బాటలు వేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనతో "సాక్షి" ఇంటర్వ్యూ.' – మోర్తాడ్(బాల్కొండ) ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? ► నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చేయాల్సిన పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేశాం. 2018 ముందస్తు ఎన్నికల్లో హామీ ఇవ్వని పనులు కూడా సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో పూర్తి చేశాం. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చేశాం. వారు ఆశించిన దానికంటే మరెన్నో పనులు పూర్తి చేసి సమస్యలే లేని నియోజకవర్గంగా బాల్కొండను తీర్చిదిద్దాం. బాల్కొండ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి..? ► తెలంగాణ ఆవిర్భావానికి ముందు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధమైన మార్పు వచ్చిందో ప్రజలకు స్పష్టంగా తెలుసు. నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు లేకుండా పెద్దవాగు, కప్పలవాగులో చెక్డ్యాంలను నిర్మించాం. తద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెంది సాగునీటి కష్టాలు లేకుండా పోయాయి. చౌట్పల్లి హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పూర్తయ్యాయి. చెరువులు, కుంటల్లో పూడిక తీయించి వర్షం నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు సాగునీటి కష్టాలు, విద్యుత్ కష్టాలు అంటూ ఏమి లేకుండా చేశాం. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న చోట గ్రామానికి ఒక విద్యుత్ సబ్స్టేషన్ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశాం. మళ్లీ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు..? ► నియోజకవర్గం ప్రజలకు వారు ఆశించినదానికంటే ఎక్కువ చేశాం. మూడోసారి ఎన్నికై తే వారి జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందేలా చేస్తాం. ఎవరికై నా పింఛన్లు రాకపోయినా, ఇంకా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోయినా వాటిని పక్కాగా ఇప్పించి ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తాం. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మంత్రిగా ఎలాంటి అనుభూతి పొందారు? ► బాల్కొండ ప్రజలకు కృతజ్ఞతలు. వారు ఆదరించడం వల్ల అసెంబ్లీలో అడుగుపెట్టాను. నా పనిత నం మెచ్చి సీఎం కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికై న నాకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా పెద్ద బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీరందించే పథకం బాధ్యతలను నెరవేర్చినందుకు ఎంతో తృప్తిగా ఉంది. రెండోసారి ఎమ్మెల్యేగా ఎంపిక కాగానే రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖలతో మంత్రిని చేశారు. రెండు పర్యాయాలు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎంకు, అందుకు ఆదరించిన బాల్కొండ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ► నాకు గెలుపుపై పూర్తి ధీమా ఉంది. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో జరుగని అభివృద్ధి బాల్కొండ నియోజకవర్గంలో చేసి చూపించాం. గెలుపు విషయంలో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మెజార్టీ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో 32 వేల మెజార్టీ లభించింది. ఈసారి చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలతో మరింత మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉంది. బాల్కొండ ప్రజల ఆశీర్వాదంతో తప్పక మూడోసారి విజయం మాదే. ఇవి కూడా చదవండి: 'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్ గాంధీ -
'ఆకాంక్షలు నెరవేరుస్తాం!' : రాహుల్ గాంధీ
సాక్షి, నిజామాబాద్/కామారెడ్డి: తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ‘ప్రజల తెలంగాణ’ కలను నిజం చేయడానికి కామారెడ్డి ప్రజలు రేవంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. రేవంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసుకుందామన్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడితే తనపై 24 కేసులు పెట్టారని, లో క్సభ సభ్యత్వం రద్దు చేసి, తన ఇంటిని లాగేసుకున్నారన్నారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో సీఎం కేసీఆర్ కుటుంబం అవినీతిపై ఫోకస్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పేపర్ లీకేజీల వరకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్యనున్న అనుబంధం తదితర అంశాలపై మాట్లాడారు. కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. సభలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, అర్బన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి అభ్యర్థులు షబ్బీర్అలీ, ఏనుగు రవీందర్రెడ్డి, మదన్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులున్నారు. ఇవి కూడా చదవండి: సమయం లేదు మిత్రమా! అభ్యర్థుల హైరానా.. -
జనమే మా బలం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసిన రోజే ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి నన్ను ఆశీర్వదించారు. ప్రియాంకాగాంధీ రోడ్డు షోకు సునామీలా వచ్చారు. దీంతో జనమే కాంగ్రెస్ బలమని నిరూపితమైంది. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో సీపీఐ గెలుస్తుంది. ఒక్క పాలేరు, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న నేపథ్యాన వచ్చేనెల 9న కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. పాలేరు ప్రజలకు భవిష్యత్లో ఏం కావాలో శ్రీనివాసరెడ్డికి తెలుసు, ఉపేందర్రెడ్డిని చూసో.. వారి బాస్ను చూసో నేనేం భయపడటం లేదు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు’ అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొంగులేటి ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. పాలేరు అక్కున చేర్చుకుంటోంది.. ప్రచారంతో పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పలుమార్లు తిరిగా. వారి కళ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పడిన ఇబ్బందులు కనిపించాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు తీరుతాయనే ఆనందాన్నీ చూశాను. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ బాధలను చెబుతున్నారు. తెలంగాణ తెచ్చుకుంది వీరిని బాధల్లోకి నెట్టడానికా? తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చేందుకే సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ ప్రజల కలలను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లలు చేసింది. మేం అధికారంలోకి రాగానే పాలేరులోనే కాదు.. రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరుతాయి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే... తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అందుకే కాంగ్రెస్ నేతల సంస్థలపై ఈడీ, ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారు. ఎవరేం చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్కు 75 నుంచి 78 సీట్లు తప్పకుండా వస్తాయి. డిసెంబర్ 9న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఆరు గ్యారంటీలను అమలుచేస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్, మా పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన సీపీఐ గెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, సీపీఐ నేతల పర్యటనతో ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలిపోయింది. ఈ జనసంద్రం రాష్టమంతా ఉంది. ప్రతీ కార్యకర్త కష్టపడాలి.. కార్యకర్తలు కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని అహర్నిశలు కష్టపడి, అవమానాలను, కేసులను ఎదుర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే సమయం ఉంది. ఆతర్వాత ఈ ప్రభుత్వాన్ని సాగనంపడమే. కార్యకర్తలు, అభిమానులు .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపు కోసం కృషి చేయాలి. బంధువులు, శ్రేయోభిలాషులంతా కాంగ్రెస్కు ఓటు వేసేలా చూడండి. వచ్చే ఐదేళ్లలో ఏ ఎమ్మెల్యేతోనూ అభద్రతాభావం ఎదురుకాదు. పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. తాగేందుకు నీరు లేని గ్రామాలు మినరల్ వాటర్ మాదిరి తాగునీరు ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెబుతున్నారు. కానీ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో 34 నుంచి 35 శాతం పైగా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. పాలేరు నియోకజకవర్గంలో కొన్ని గ్రామాలకు వెళ్తే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కావాలని కోరుతున్నారు. ప్రస్తుత పాలకులు ఇవన్నీ చేస్తే ఎందుకు అడుగుతారు? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితేంటి. డ్యామ్ నెర్రెలిచ్చింది. కేంద్ర అధికారులే నివేదికలు ఇచ్చారు. ఇలా ఏ పనినీ కేసీఆర్ ప్రభుత్వం సక్రమంగా చేయలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బందులు తీరుతాయనే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. -
కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’
సాక్షి, ఆదిలాబాద్/నిర్మల్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించా లని, బీజేపీని గెలిపించాలని బీజేపీ ఆది లాబాద్ అభ్యర్థి పాయల్ శంకర్ కోరారు. వారం రోజులుగా ఆదిలాబాద్లో బీజేపీ పుంజుకుంటోందన్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో వణుకు మొదలైందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉందని, బీసీని ముఖ్యమంత్రి చేసే బీజేపీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండే తోడుదొంగలన్నారు. నిజాయతీపాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు. "నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనాలు. బాసర సరస్వతీమాత చరణాలకు నా ప్రణామం. ఈ గడ్డపై పుట్టిన ఆదివాసీయోధులు కుమురంభీమ్, రాంజీగోండుకు నా నివాళులు. తన పోరాటంతో రాంజీ గోండు యువతకు ప్రేరణగా నిలిచారు.." అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ రోడ్డులో పాతక్రషర్ ఎదురుగా ఆదివారం నిర్వహించిన సకల జనుల విజయసంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్, రమేశ్రాథోడ్, పాయల్ శంకర్, సోయం బాపూరావు తరఫున నిర్వహించిన ఈ ఎన్నికలసభకు భారీగా జనం తరలివచ్చారు. సభాప్రాంగణం నుంచి కనుచూపు మేరంతా జనసంద్రమే కనిపిస్తోందని, కాంగ్రెస్ సుల్తానులు, బీఆర్ఎస్ నిజాంలు ఒక్కసారి వచ్చి చూస్తే.. రాంజీగోండు ప్రేరణ, బీజేపీ గెలుపు ఖాయమన్న విషయం తెలుస్తుందని మోదీ అన్నారు. తమకు తాము రాజకీయ తీస్మార్ఖాన్ అనుకుంటున్నారో, రాజనీతి జ్ఞానిగా భావిస్తున్నారో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడో కారు స్టీరింగ్ వేరేవాళ్లకు అప్పగించి ఫామ్హౌస్కు వెళ్లి పడుకుంటున్నాడన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రజలంతా బీజేపీ వైపు నిలిచారని మోదీ చెప్పారు. కొయ్యబొమ్మకు గ్యారంటీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మేడిన్ ఇండియా అన్న, మేకిన్ ఇండియా అన్న ఇష్టం ఉండదని ప్రధాని ఆరోపించారు. ఈ కారణంగానే ఘనమైన చరిత్ర కలిగిన నిర్మల్ కొయ్యబొమ్మల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మల్ కొయ్యబొమ్మలకు పూర్వవైభవం తీసుకువస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. నిజామాబాద్లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపుబోర్డుతో నిర్మల్ జిల్లా రైతులకూ మేలు కలుగుతుందన్నారు. ఇక్కడి పసుపురైతులు పండించే పసుపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని తెలిపారు. కోవిడ్ తర్వాత పసుపు విలువ ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. వరి రైతులకు మద్దతుగా ధాన్యం క్వింటాల్కు రూ.3,100 చెల్లిస్తామని ప్రకటించామన్నారు. తెలుగులో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడంతోపాటు మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అసలు ప్రధానమంత్రి ఇంతా బాగా తెలుగు మాట్లాడగలరా.. అనేలా భాషను ఉచ్చరించారు. ‘మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది..’ అని అనడంతో సభలో విశేష స్పందన వచ్చింది. ‘ప్రజలను కలవని, సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా..’ అంటూ తెలుగులోనే ప్రశ్నించారు. ‘మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యేది..’ అని చెప్పడం, ప్రతీసారి ‘నా కుటుంబసభ్యులారా..’ అని సంబోధించడం సభికులను ఆకట్టుకుంది. సభ ఆద్యంతం ‘మోదీ.. మోదీ..’ అన్న నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది. ఎంపీ సోయం గైర్హాజరు.. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు ఆదిలా బాద్ ఎంపీ, బీజేపీ బోథ్ నియోజకవర్గ అభ్యర్థి సోయం బాపురావు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన ఏ కారణాల వల్ల రాలేదనేది తెలియరాలేదు. ఇది చర్చనీ యాంశమైంది. మరోవైపు పార్లమెంట్ పరిధిలో ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. నిర్మల్, ముధోల్, ఖా నాపూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావుపటేల్, రమేశ్ రాథోడ్, పాయ ల్ శంకర్, అజ్మీరా ఆత్మారాంనాయక్ హాజరయ్యారు. అలాగే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఉమ్మడి ఆదిలాబా ద్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ మంత్రి అమర్సింగ్తిలావత్, మాజీ ఎమ్మెల్యే సుమన్రాథోడ్, తదితరులంతా పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: '30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్లు! -
'30వ తేదీన ఏముంది?' అందరికీ గుర్తుండేలా ‘స్వీప్’ హోర్డింగ్లు!
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే దిశగా ప్రజలను సన్నద్ధం చేసేందు కోసం స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన వినూత్న ప్రచారం అందరిని ఆలోచింపజేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే తేదీని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో 30వ తేదీన ఏముంది.. అనే శీర్షికన స్థానిక కలెక్టర్చౌక్, ఎన్టీఆర్చౌక్, రిమ్స్ వంటి ప్రధాన కూడళ్లలో అధికార యంత్రాంగం భారీ హోర్డింగ్లను ఏర్పాటు చేసింది. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆ తేదీన ఏముందని చర్చించుకుంటూ పోలింగ్ తేదీని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజున తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తుండటంతో ఈ ప్రచారానికి స్పందన లభిస్తోంది. ఇవి కూడా చదవండి: 'కారు పార్టీ' స్టీరింగ్ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్ -
ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్!
సాక్షి, కరీంనగర్: 'ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను ఎన్నుకోవడానికి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. పలువురు విద్యార్థులు, యువత ఇంటర్నెట్లో ఎన్నికల చట్టాలు– నిబంధనల గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎన్నికల చట్టాలను వివరించే కథనం.' సెక్షన్ 123: జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, ఒత్తిడికి లోను చేస్తే.. ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125: ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా రెండింటినీ విధించే అవకాశం ఉంటుంది. 126: ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలు లేదా జరిమానా విధిస్తారు. 127: ఎన్నికల సమావేశం సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా.. పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయొచ్చు. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా. 128: బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా. 129: ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, పోలీసులు పోటీచేసే అభ్యర్థికి సహకరించినా, ప్రభావం కలిగించినా శిక్షార్హులు. దీనికిగాను 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. 130: పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ఒకవేళ చేస్తే రూ.250 జరిమానా పడుతుంది. 131: పోలింగ్ కేంద్రానికి సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా, రెండూ అమలుచేయొచ్చు. 132: ఓటేసే సమయంలో నియమ నిబంధనలు పాటించనివారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా. 134: అధికార దుర్వినియోగానికి పాల్పడితే శిక్షార్హులే. ఇందుకు రూ.500 జరిమానా విధిస్తారు. 134(అ): ఠాణా పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం నిషేధం. అలా వెళ్లినవారికి 2 నెలల జైలుశిక్ష, జరిమానా వేస్తారు. 135: పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే శిక్షార్హులు. ఏడాది పాటు జైలుశిక్ష, రూ.500 జరిమానా. 135(ఇ): పోలింగ్, కౌంటింగ్ రోజున మద్యం విక్రయించడం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశచూపడం నేరం. అందుకు 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల వరకు జరిమానా. 133: ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష, జరిమానా. 135(ఆ): ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవుగా మంజూరు చేసినా శిక్ష, అందుకు రూ. 5వేల జరిమానా విధించొచ్చు. 49వీ: ఒక వ్యక్తి ఓటు మరొకరు వేస్తే పోలింగ్ ఆఫీసర్కు సదరు ఓటరు 49–వీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అధికారం కల్పిస్తారు. 134(అ): ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంటుగా గానీ పోలింగ్ ఏజెంటుగా గానీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. ఇవి కూడా చదవండి: కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’ -
అరగుండు.. అరమీసం..
ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎల్ఎఫ్ కు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి మేత్రి రాజశేఖర్ అరగుండు, అరమీసం, అరగడ్డంతో పాటు బిచ్చగాడి వేషధారణతో శనివారం వినూత్న ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల తీరు ప్రతిబింబించేలా తనీ వేషధారణతో ప్రచారం నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఆ పార్టీల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు మేలుకోవాలని, ప్రజలు కండ్లు తెరవాలని అన్నారు. ప్రధాన పార్టీల మేనిఫెస్టోలోని అంశాలను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ భిక్షాటన చేశారు. కొల్లాపూర్లో బర్రెలక్క శిరీషపై దాడికి పాల్పడం సరైంది కాదన్నారు. ఆమెకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మద్దతు తెల్పుతున్నట్లు చెప్పారు. యువతీ, యువకులు చట్టసభలకు రావాలన్నారు. -
ఇంతింతై.. రూ.40లక్షలై!
భద్రాచలం అర్బన్: శాసనసభ ఎన్నికల సమరంలో డబ్బు కీలకపాత్ర పాత్ర పోషిస్తుందన్నది ఎవరూ కాదనలేని అంశం! అయితే, ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థులు ఇష్టారీతిన డబ్బు ఖర్చు పెట్టడానికి వీలులేదు. ప్రస్తుత నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా రూ. 40 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ వ్యయ పరిమితి తొలినాళ్లలో రూ.లక్ష మాత్రమే ఉండగా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు రూ.40క్షలకు చేరింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి చూస్తే నలభై రెట్లు పెరిగినట్లయింది. నామినేషన్ రోజు నుంచే లెక్క 2014 అసెంబ్లీ ఎన్నికల సమయాన అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.28 లక్షలుగా ఉండేది. ఇక లోక్సభ ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించారు. నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ జరిగే వరకు అభ్యర్థి చేసే ప్రతీ ఖర్చును ఎన్నికల వ్యయంగానే పరిగణిస్తారు. అయితే, పార్టీ తరఫున జరిగే సభల ఖర్చును అభ్యర్థి ఖాతాలోకి తీసుకోరు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు చేసే ఖర్చులన్నీ ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి. అందుకోసం నామినేషన్ దాఖలు చేసే నాటికి కొత్త అకౌంట్ ప్రారంభించాలి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. తనిఖీల్లో పట్టుబడిన నగదు, ఇతర సామగ్రి ఎవరైనా అభ్యర్థిదని తేలితే ఆ అభ్యర్థుల వ్యయంలో చేరుస్తారు. రోజువారీగా అభ్యర్థులు చేసే వ్యయంతో పాటు పార్టీ జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, టోపీలు, కండువాలు, భోజనాలు, వాహనాల అద్దె, ఇంధన ఖర్చులు, సభా వేదికలు, మైకులు, పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు. వీటిలో ప్రతీదానికి బిల్లు సమర్పించాలి. అంతేకాక ఎన్నికల సంఘం నిర్దేశించిన ధరల ఆధారంగా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటారు. పెరుగుతున్న వ్యయపరిమితి 1952 సాధారణ ఎన్నికల సమయాన అభ్యర్థుల వ్యయపరిమితి రూ.లక్షగా ఉండేది. ఇది 1962 నాటికి రూ.3లక్షలకు, 1971 ఎన్నికల్లోరూ.4లక్షలకు, 1975 నాటికి రూ.5 లక్షలు చేరింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షలకు చేరగా... 1991 నాటికి రూ.12లక్షలకు పెంచారు. ఆతర్వాత 1999లో రూ.15 లక్షలు, 2004 నాటికి రూ.17 లక్షలు, 2009లో రూ.26 లక్షలు, 2014లో రూ.28 లక్షల వ్యయపరిమితిని నిర్ణయించారు. ఇది ప్రస్తుత ఎన్నికల్లో రూ.40 లక్షలకు చేరుకుంది. కాగా, ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చును రూ.40లక్షలుగా నిర్దేశించిన అంతకు మించి ఎన్నో రెట్లు ఖర్చవుతోందని ప్రస్తుత ప్రచారం తీరును చూస్తే అర్థమవుతోందని పలువురు చెబుతున్నారు. -
కాంగ్రెస్ ముఖ్యమంత్రి తొలిసంతకం దీనిపైనే..
సాక్షి, ఆదిలాబాద్: ‘బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. ఈ రెండు పార్టీలకు మూడో దోస్తు ఎంఐఎం.. ఈ ఎన్ని కల్లో ఆ పార్టీలను ఓడించాలని..’ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల స్కీంలపైనే తొలిసంతకం పెట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్లో శనివా రం నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ను అధికారంలోకి ఎందుకు తీసుకురావాలో వివరించారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏ ఆశయాలతో తెలంగాణ ఏర్పడిందో ఆ స్వప్నాన్ని నాశనం చేశారంటూ బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. దొరల తెలంగాణను పారదోలి ప్రజల తెలంగాణను ఏర్పా టు చేసుకుందామని పిలుపునిచ్చారు. అలాగే కేంద్రంలోని మోదీప్రభుత్వం సైతం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజల ఆశయాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం రాహుల్ను పలువురు సన్మానించారు. భారీగా జన సమీకరణ.. ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో కాంగ్రెస్ విజయభేరి సభ శనివారం నిర్వహించారు. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో రాహుల్ గాంధీ ఆదిలాబాద్ చేరుకున్నారు. నియోజకవర్గం నుంచి భారీగా జనంతరలివచ్చారు. హెలీ ప్యాడ్ నుంచి నేరుగా బహిరంగ సభస్థలికి వాహనంలో చేరుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ రాథోడ్ ప్రకాశ్, ఆదిలా బాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి, బోథ్ అభ్యర్థి ఆడె గజేందర్, సీనియర్ నేతలు గోవర్ధన్రెడ్డి, నరేశ్ జాదవ్, భరత్వాఘ్మారే, సైద్కాన్, శ్రీధర్ భూపెల్లి, సంతోశ్రావు, రూపేశ్రెడ్డి, జెడ్పీటీసీ గణేశ్ రెడ్డి, ఎస్టీ సెల్ పార్లమెంట్ కార్యదర్శి శాంతకుమారి, డేర కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు గంట పాటు సభలో ఉన్న రాహుల్ ప్రసంగం తర్వాత బయల్దేరి వెళ్లారు. మహిళ, చిన్నారిని వేదికపైకి పిలిచి.. రాహుల్ తన ప్రసంగం మధ్యలో ఆరు గ్యారంటీ ల స్కీంలపై ప్రస్తావిస్తూ సభలో ఉన్న ఓ మహిళ, చిన్నారిని వేదికపైకి రావాలనిఆహ్వానించారు. ఆ చిన్నారితో కార్డులోని ఆరు గ్యారంటీ స్కీంలను చదివిస్తూ వాటి అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించా రు. గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, యువవికాసం పథకాల ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాలను తీసుకొస్తున్నామన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి తొలిసంతకం దీనిపైనే ఉంటుందని వివరించారు. రాహుల్ సభ సక్సెస్తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. -
ఎల్లలు దాటిన రాజకీయ చైతన్యం! ఎన్నారై వాయిస్..
సాక్షి, కరీంనగర్: 'ఏ దేశమేగినా ఎక్కడున్నా ఓటే తమ అభిమతమని చాటుతున్నారీ యువత. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగమే తమ నినాదమని ధీమాగా చెబుతున్నారు. బాల్య వయసులో పాఠ్యాంశంలోని అంశాలు, యువ వయసులో జిల్లా, రాష్ట్ర, జాతీయ రాజకీయాలను గమనిస్తున్న సదరు యువత ఓటెత్తుతామని అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో దేశంలో ఉపాధి పొందుతున్నారు. ఏళ్లుగా అక్కడే స్థిరపడగా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలొచ్చాయంటే స్వదేశీబాట పడుతున్నారు. జిల్లా నుంచి వేల సంఖ్యలో అమెరికా, స్విట్జర్లాండ్, లండన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, రష్యా తదితర దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. సదరు దేశాల్లో ఓటు ప్రాధాన్యమెక్కు వ. ఓటేయకుంటే శిక్షలున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల క్రమంలో వందల మంది కరీంనగర్కు చేరుకోగా.. ఓటేసేందుకు మేమొచ్చాం.. మీరు ఓటేసేందుకు వస్తారుగా అంటూ సహచర స్నేహితులను చైతన్యపరుస్తున్నారు. ఈ సందర్భంగా వారి వాయిస్ వినిపించారు.' రాజకీయాలంటే ఆసక్తి! అమెరికాలోని పెన్సుల్వెనియా ప్రాంతంలో స్థిరపడిన ఉనుకొండ రాజీవ్కుమార్ది నగరంలోని విద్యానగర్. సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్నాడు. కంపెనీ అమెరికాలో అవకాశం కల్పించగా.. తన ప్రతిభతో అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నికలొచ్చాయంటే రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి చూపుతుంటాడు. ఆయా పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల నేర చరిత్ర తదితర వివరాలను ఆరా తీస్తూనే ప్రచార సరళిని పరిశీలిస్తుంటాడు. తీరా పోలింగ్ సమయానికి భారత్ రావడం.. ఓటేయడం ప్రతీసారి చేస్తుంటానని, ఇటీవలే మన దేశానికి వచ్చానని చెబుతున్నారు రాజీవ్. -
'ఈ లొల్లి మనకొద్దు బిడ్డో..' జర ఆలోచించు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల/వేములవాడ: 'అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రెండు వేర్వేరు పార్టీల నాయకులు ఎదురుపడితే దాదాపు గొడవకు దిగే పరిస్థితులు ఉంటున్నాయి. పల్లెల్లో వీటన్నింటిని గమనిస్తున్న ఓ తల్లి తన ఆవేదనను కొడుకుతో ఇలా పంచుకుంటుంది.' తల్లి : ఏరా బిడ్డ పొద్దున్నే తయారయ్యావు ఎక్కడికి పోతున్నావు? కొడుకు : ఇంకెక్కడికి అమ్మా ఎన్నికల ప్రచారానికి. ఈసారి అన్న గెలవాలి. తల్లి : మనకెందుకు రాజకీయాలు బిడ్డా. కష్టం చేస్తే కానీ ఇల్లు గడువదు. కొడుకు : అన్న గెలిస్తే మన కష్టాలన్నీ తీరుతాయమ్మా. తల్లి : చేండ్ల పత్తికి నీళ్లు పెట్టాలని, కల్లంలో వడ్లు ఉన్నాయని.. అయ్యా రోజు లొల్లి పెడుతుండ్రా. కొడుకు : పని ఎప్పుడూ ఉండేదేనే అవ్వ. ఓట్లు ఐదోళ్లకోసారి వస్తాయి. మనను నమ్ముకున్నోళ్ల కోసం మనం పనిచేయకపోతే అన్న ఎట్లా గెలుస్తాడే. తల్లి : యాబై ఏళ్లుగా చూస్తున్నాం. మన బతుకుల కన్న వారి బాగోగులే చూసుకుంటున్నారు. నీకు ఇంట్లో చెల్లె ఉంది. బాగా చదివించి పెళ్లి చేయాలే. ఒక్కగానొక్క కొడుకువి. నీకేమైన అయితే మా బతుకులు ఏమి కావాలి బిడ్డా. కొడుకు : ఏ.. ఎందుకు భయపడుతావు అవ్వా. తల్లి : బాగా ఆలోచించు కొడుకా.. మనవి చిన్న బతుకులు. ఆవేశంలో పోయి గొడవల్లో తలదూర్చితే మనకే నష్టం. నీవు గొడవలు పెట్టుకునేది కూడా ఎవరితోనే కాదు మన ఊరోళ్లతోనే. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత మనం చచ్చే వరకు ఊళ్లోనే ఉండాలే బిడ్డా..! మనకు ఏమైనా అవసరం ఉన్న ఈల్లే ముందుండాలే కదరా.. ఈ లొల్లి మనకెందుకు బిడ్డా. కొడుకు : అమ్మా.. నువ్వు చేప్పేది నిజమే. నేను ఎందుకు గొడవకు పోతానే. ఊళ్లో ఎవరూ కనిసించిన అత్తా.. మామ.. బాబాయ్.. పిన్ని.. అన్న.. అని పలకరిస్తా. వాళ్లతో నాకెందుకు గొడవ. తల్లి : నువ్వు చిన్నపిల్లగాడివి బిడ్డా. ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో.. గుర్తించి ఓట్లేద్దాం. డబ్బుకు, మద్యానికి లొంగకు, ఒక్కరోజు బిర్యానీ పెడితే ఐదేళ్లు కడుపు నిండదు. ఐదేళ్లపాటు మనకు కష్టాలు రాకుండా చూసుకుంటూ, మన కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకున్ని గెలిపించుకుందాం బిడ్డా. కొడుకు : అలాగే అమ్మా.. ఈ గొడవలు నాకొద్దు. మంచి చేసే వారికే ఓటేస్తాను. ఏ పార్టీ నాకొద్దు. ఇవ్వాల్లి నుంచి ఏ పార్టీ వాళ్లతోని తిరుగను. చేండ్లకు పోతున్న. నువ్వు చెప్పిట్లే మంచి నాయకునికే ఓటేద్దాం. ఇవి చదవండి: అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే.. -
కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్లకు చెమటలు పట్టిస్తున్న బీజేపీ అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తోంది. మూడు పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా బరిలో సమరోత్సాహం ప్రదర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బరిలోకి దిగగా వారిద్దరికీ దీటుగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు తనదేనంటూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో గెలుపు ఎవరిదన్నది అంతుపట్టని విధంగా తయారైంది. మూడు పార్టీల ఎత్తులు, పై ఎత్తులు, జాతీ య అగ్రనేతల పర్యటనలతో కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ► నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ మధ్య పోటాపోటీ నెలకొంది. ► బాల్కొండలో బీఆర్ఎస్ నుంచి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, కాంగ్రెస్ నుంచి ముత్యాల సునీల్రెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ► ఆర్మూర్ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్కు మంచి సానుకూలత ఉన్నప్పటికీ అభ్యర్థి వినయ్రె డ్డి స్పీడ్ తగ్గడంతో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రా కేశ్రెడ్డి ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ సిట్టింగ్ అ భ్యర్థి జీవన్రెడ్డి సైతం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ► బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్, బీజేపీ అభ్యర్థి మోహన్రెడ్డి మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. ► నిజామాబాద్ రూరల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడుస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్ నామమాత్రంగా పోటీలో ఉన్నారు. ఆయన డిచ్పల్లి మండలంలో మాత్రమే ప్రభావం చూపిస్తున్నారు. ► బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యరి్థ, స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి మంచి జోష్మీద ఉన్నారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మున్నూరుకాపు కావడంతో కలిసి వస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డికి సెటిలర్స్ మద్దతుతో బలం పెరిగినప్పటికీ, ఆయనపై దళితుల భూముల కబ్జా ఆరోపణలు ఉండడంతో ప్రభావం చూపిస్తోంది. ► ఎల్లారెడ్డిలో సిట్టింగ్, బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్, బీజేపీ అభ్యర్థి సుభాష్రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ► జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హ న్మంత్సింధే, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు, బీజే పీ అభ్యర్థి అరుణతార మధ్య పోటాపోటి నెలకొంది. -
చిట్టా విప్పాల్సిందే..! లేదంటే న్యాయపరమైన చిక్కులు!
సాక్షి, మెదక్: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమపై ఉన్న కేసుల చిట్టాను బయట పెట్టాల్సిందే.. ఎవరిపై ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎన్ని కేసులు ఉన్నాయి? అనే విషయాలు ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. దాని కోసం అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారు. నామినేషన్లు వేసిన సమయంలో తమ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని ప్రముఖ దినపత్రికల్లో ప్రకటిస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరించాలి.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి నేరచరిత్ర ఉన్నా బయట పెట్టాలన్న సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అభ్యర్థులు తమపై ఉన్న కేసులను బయట పెడుతున్నారు. జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ నియోజకవర్గం బరిలో 13 మంది అభ్యర్థులు ఉండగా, నర్సాపూర్ బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాలి. రాజకీయంగా పారదర్శకత పాటించే ఏ నాయకుడికీ ఈ ప్రకటనలు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రాజకీయ నాయకుడు అన్నాక కేసులు ఉండడం సర్వసాధారణమే. ప్రజా సమస్యల పోరాటంలో భాగంగా.. ఏదో ఒక సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసే సమయంలో కేసులు నమోదవుతుంటాయి. తెలంగాణ ఉద్యమంలో దాదాపు అన్ని పార్టీల నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. అందులో చాలా వరకు కొట్టివేయగా.. ఇంకొన్ని విచారణ దశలో ఉన్నాయి. రాజకీయ జీవితం మొదలు కాకముందు, రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత కారణాలతో నమోదైన క్రిమినల్ కేసులు కొందరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ముగ్గురు అందజేత.. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు పత్రికా ప్రకటనల ద్వారా కేసుల వివరాలు వెల్లడించారు. తర్వాత ఆ పేపర్ కటింగ్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఒకవేళ సదరు అభ్యర్థులపై కేసులు ఉండి పత్రికల ద్వారా వెల్లడించకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసుల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేసిన వారికి ఇది కలిసొచ్చే అంశం కాగా, ఉద్దేశపూర్వక నేరచరిత్రులకు మాత్రం ఇబ్బంది కలిగే అంశమని అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా చదవండి: వస్తారా.. రారా..? -
వస్తారా.. రారా..?
సాక్షి, మెదక్: టికెట్లు ఆశించి భంగపడిన నేతలు కొందరు, పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని మరికొందరు, ఇలా చాలా మంది వివిధ పార్టీల కండువాలు మార్చారు. అయితే, వారికి సంబంధించిన కేడర్ మాత్రం తమతోపాటు రాకపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమ వెంట వస్తే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీలు సైతం ఇస్తున్నారు. అది కూడా కుదరకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో కండువాలు మార్చిన నేతలు చాలా మందే ఉన్నారు. వీరితోపాటు వెళ్లడానికి కార్యకర్తలు మాత్రం వెనుకడుగు వేశారు. దీంతో ‘‘నిన్న, మొన్నటి వరకు నా వెంట ఉండి, పార్టీ మారాక నాతో రావా, నీ సంగతి చూస్తా’’అంటూ పార్టీ మారిన నాయకులు ధమ్కీ ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల నర్సాపూర్లో ఓ పార్టీనేత ఎమ్మెల్యే టికెట్ ఆశించగా అతడికి టికెట్ లభించలేదు. వెంటనే మరో పార్టీలోకి జంప్ అయ్యాడు. కానీ, ఆ నాయకుడి వెంట కేడర్ మాత్రం వెళ్లలేదు. పార్టీ సిద్ధాంతం నచ్చి వారు ఆ పార్టీతోనే కొనసాగుతున్నారు. దీంతో ఆ నాయకుడు ‘‘నా వెంట మీరు రావాల్సిందే’’అని పలు వురు కార్యకర్తలను బెదిరించగా వారు వాగ్వాదానికి దిగారు. మర్యాద కరువు.. పార్టీలు మారిన నేతల వెంట కేడర్ వెళ్లకపోవడంతో కొత్తపార్టీలో ఆ నేతకు మర్యాద కరువైందని, ఎవరూ తమకు విలువ ఇవ్వడంలేదని జంప్జిలానీలు తలలు పట్టుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు ప్రత్యర్థులుగా తిట్టుకున్న నేతలు ఒకేపార్టీలో చేరడంతో బలాలు, బలగాల లెక్కలపై పంచాయితీలు పెట్టుకుంటూ, జంప్ జిలానీలను సీనియర్ నాయకులు సూటిపోటీ మాటలతో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు మారిన నేతలు కొత్త పార్టీలో ఇమడలేక నామూ షీగా ఫీలవుతున్నట్లు సమాచారం. ఇవి చదవండి: కరీంనగర్కు రూ.9వేల కోట్లు తెచ్చా! : బండి సంజయ్ -
అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే..
సాక్షి, సిద్ధిపేట/దుబ్బాక: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అస్త్రం దుబ్బాక రెవెన్యూ డివిజనే. 2020 ఉపఎన్నికల సమయంలోనే డివిజన్గా ఏర్పాటవుతుందని ఆశించినా ప్రజలకు నిరాశే ఎదురైంది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అన్నివర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజన సమయంలో సిద్దిపేట జిల్లాగా, దుబ్బాకను రెవెన్యూ డివిజన్గా చేస్తారని ఈ ప్రాంతం వారు ఎదురుచూశారు. కానీ అలా జరగలేదు. పాత సమితి కేంద్రంగా, తాలుకాగా, నియోజకవర్గ కేంద్రంగా మున్సిపాలిటీగా ఉన్న దుబ్బాకకు రెవెన్యూ డివిజన్కు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. 2016లో రెవెన్యూ డివిజన్ చేయాలంటూ దుబ్బాక పట్టణంలో 45 రోజుల పాటు ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రజల ఆకాంక్ష దుబ్బాక రెవెన్యూ డివిజన్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఉండడంతో పాటు నియోజకవర్గ కేంద్రాలైన గజ్వేల్, హుస్నాబాద్లను రెవెన్యూ డివిజన్లుగా చేసి నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకను డివిజన్ చేయకపోవడం శోచనీయం. ఆరు మండలాలతో దుబ్బాక డివిజన్! దుబ్బాక నియోజక వర్గంలో ప్రస్తుతం 8 మండలాలు ఉండగా చేగుంట, నార్సింగ్ మండలాలు తూప్రాన్ డివిజన్లో ఉన్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, దౌల్తాబాద్, రాయపోల్, భూంపల్లి–అక్భర్పేట మండలాలతో డివిజన్ చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. 26న ప్రకటిస్తారని ప్రచారం.. దుబ్బాక రెవెన్యూ డివిజన్ డిమాండ్ను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు దృష్టికి ఇప్పటికే ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తీసుకెళ్లాడని, ఈ నెల 26 న దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో డివిజన్గా చేస్తున్నట్లు ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. హరీశ్ సైతం కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపించండి దుబ్బాక డివిజన్ చేస్తామని రోడ్ షోల్లో హామీలు ఇస్తున్నారు. రేవంత్ నోటా దుబ్బాక డివిజన్.. దుబ్బాకలో గురువారం జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సైతం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డిని గెలిపించండి దుబ్బాక రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది దుబ్బాక డివిజన్ను చేస్తామని రేవంత్రెడ్డి ప్రకటించారు. బీజేపీ సైతం దీనిపైనే ఫోకస్! దుబ్బాకలో మళ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావును గెలిపిస్తే తప్పకుండా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రఘునందన్రావు సైతం భూంపల్లి–అక్భర్పేట కొత్త మండలం ఏర్పాటు చేశానని, దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానంటూ ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇవి కూడా చదవండి: బడా నేతల ఆగమనం! -
interview: నా లక్ష్యం ఒక్కటే ప్రజాసేవ.. కారులోనే భోజనం చేసిన మంత్రి
‘ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం. పదేళ్ల పాలనా కాలంలో అన్నిరంగాలను అభివృద్ధి చేసి చూపించాం. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. వారి మాయమాటలు నమ్మి మోసపోతే గోసపడతాం. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగ ఫలాలు అందాలన్న ధ్యేయంతో పని చేస్తున్నాం. ఈ పదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగింది. ఈ కాలంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకొచ్చా. ఉమ్మడి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించి బీడు భూములను సస్యశ్యామలం చేశాం. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రూ.7500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించాం. సూర్యాపేటకు మూసీ మురికినీళ్ల నుంచి విముక్తి కల్పించి మిషన్ భగీరథతో కడుపు నింపుతున్నాం. మునుగోడు, దేవరకొండలో ఇప్పుడు ఫ్లోరోసిస్ సమస్య లేదు. రూ.30 వేల కోట్ల విద్యుత్ థర్మల్ ప్లాంట్ తీసుకొచ్చాం. అన్ని నియోజకవర్గాల్లో మినీట్యాంక్ బండ్లు, సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేశాం. యాదాద్రి ఆలయ పునః నిర్మాణం చేసుకున్నాం. బీఆర్ఎస్ పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయి. కాంగ్రెస్ నాయ కులు నోట్ల కట్టలతో వస్తున్నారు. ఆ పార్టీకి ఉమ్మడి జిల్లాలోనే ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారు. వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సూర్యాపేట రూపురేఖలు మారాయి సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ వచ్చాకే అభివృద్ధి జరిగింది. నా హయాంలో రూ.వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశా. సూర్యాపేట గతంలో ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. పట్టణంలో హిందూ శ్మశాన వాటిక ఒకప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు మహాప్రస్థానంగా ప్రక్షాళన చేశాం. సద్దుల చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చి బోటింగ్ సౌకర్యం తీసుకొచ్చాం. పుల్లారెడ్డి చెరువును కూడా మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతున్నాం. మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, లింకురోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాం. ఐటీహబ్, బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. కళాభారతి, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. 2014 ముందు సూర్యాపేట పట్టణ ప్రజలు మూసీ మురికి నీటిని తాగారు. ప్రపంచంలో ఒక నగరంలో వదిలిన నీటిని.. మరో పట్టణంలో ప్రజలు తాగడం ఎంత దురదృష్టకరమైన విషయమో జలసాధన సమితి నేత దుశ్చర్ల సత్యనారాయణే వెల్లడించారు. ప్రస్తుతం మిషన్ భగీరథతో కృష్ణా జలాలు ఆస్వాదిస్తున్నారు. ఇలా చెబుతూ పోతే లెక్కలేనంత అభివృద్ధి జరిగింది. నన్ను మరోమారు ఆశీర్వదించి గెలిపిస్తే సూర్యాపేట ఆర్థిక ముఖచిత్రమే మారుస్తా. వచ్చే ప్రభుత్వంలోనూ.. రాష్ట్రంలో మూడవసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా మా పాలకవర్గమే ఉంది. మధ్యలో కీలకమైన ఇరుసులాంటి శాసనసభ్యుడు లేకపోతే పైనుంచి కిందకు నిధులు ఏవిధంగా వస్తాయి..? నిధులు రావాలంటే ప్రభుత్వంలో కీలకంగా ఉండాలి. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్లీ ఉన్నత స్థానంలో ఉంటా. ఇప్పుడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా.. రేపు రూ.10 వేల కోట్లపైనే తీసుకురాగలుగుతా. పేట అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు దేశంలోనే ఆదర్శ పట్టణంగా సూర్యాపేటను అభివృద్ధి చేస్తా. మరో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఐటీ హబ్ ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి దొరుకుతుంది. యువత ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. డ్రైపోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పా టు చేసి పట్టణంలో వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతా. లింగమంతుల స్వామి, ఉర్లుగొండ గుట్టల మధ్య రోప్వే ఏర్పాటుతో వల్లభాపురం, గుంపుల తిరుమలగిరి, గుంజలూరు గ్రామాలు నూతన శోభ సంతరించుకోనున్నాయి. ఫణిగిరి, పిల్లలమర్రి శివాలయాలు, ఉర్లుగొండను టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దుతా. నల్లచెరువును నక్లెస్ రోడ్డుగా ఏర్పాటు చేసుకుందాం. చైనాలోని చాంజింగ్.. కెనడాలోని వాంకోవర్ సరసన సూర్యాపేట పట్టణాన్ని నిలబెట్టాలన్నదే నా కల. నాకు జన్మనిచ్చింది మా అమ్మ. జనం కోసమే నా జన్మ.. జనం కోసం బతకాలనుకున్నప్పుడు నేను తినే ఆ నాలుగు మెతుకులు ఇంట్లో కుటుంబ సభ్యులతోనే కలిసి తినాలనేమీ లేదు. అది గుడిలో కావచ్చు.. బడిలో కావచ్చు.. నన్ను గమ్యస్థానానికి చేర్చే నా ప్రచార వాహనమే కావచ్చు.. నా లక్ష్యం ఒక్కటే ప్రజా సేవ. నా ఆశయం ఒక్కటే.. అదే జన హితం. – బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, మంత్రి జగదీష్రెడ్డి ఇది చదవండి: TS Elections 2023: ఖర్చులకు ఇస్తాం.. ఓటేసిపోండి