Uday Kiran
-
హీరో ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలు.. ఈ రోజే ఎందుకంటే? (ఫొటోలు)
-
వెండితెరపై మరోసారి ఉదయ్ కిరణ్.. ఆ సూపర్ హిట్ సినిమా మళ్లీ!
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్. యూత్లో అతని మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని మనందరికీ దూరమయ్యారు. కానీ ఎప్పటికీ అతని నటించిన సినిమాలను ఇప్పటికి ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో నటించిన ఉదయ్ కిరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఉదయ్ కిరణ్ను మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం లభించింది. అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్కు సిద్ధమైంది. ఇటీవల టాలీవుడ్లో పాత సినిమాలను రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా మళ్లీ సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, అనిత జంటగా నటించారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతమందించిన ఈ సినిమా 2001వ సంవత్సరం ఆగస్టు 10న రిలీజై అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు అందుకున్నారు. తాజాగా మార్చి 21న థియేటర్స్లో రీ రిలీజ్ అవుతోంది. దీంతో ఉదయ్ కిరణ్ అభిమానులు మరోసారి థియేటర్లో తమ హీరోని చూడటానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నువ్వు నేను రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. -
మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్లో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకడు. లవ్ స్టోరీలతో చాలా తక్కువ టైమ్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన ఇతడు.. ఆ తర్వాత సరైన ఛాన్సుల్లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతడి పుట్టినరోజు లేదా వర్థంతి సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి జనరేషన్ కోసం ఉదయ్ కిరణ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఇతడి కల్ట్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?) ఉదయ్ కిరణ్, అనిత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'నువ్వు నేను'. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సునీల్ కామెడీ టైమింగ్, ఆర్పీ పట్నాయక్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రచ్చ లేపాయని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా 2001 ఆగస్టు 10న రిలీజైంది. తొలి ఆట నుంచే సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లో అద్భతమైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాని తిరిగి థియేటర్లలో ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. ఈ మార్చి 21న బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఒకవేళ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మ్యాజిక్ చూడాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కాకండి. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు) -
Uday Kiran Unseen Photos: తనదైన నటనతో మనల్ని అలరించిన ఉదయ్ కిరణ్ ఫోటోలు
-
నా జీవితంలో మరిచిపోలేని విషాదం.. అయినా వెనక్కి తగ్గలేదు!
టాలీవుడ్లో నువ్వు నేను సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాల్లో నటించింది. 2003లో కుచ్ తో హై సినిమా ద్వారా బాలీవుడ్లోనూ ప్రవేశించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించిన అనిత.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. (ఇది చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!) అయితే సినిమాలకు దూరమైనప్పటికీ బుల్లితెరపై సందడి చేసింది. హిందీ సీరియల్స్, టీవీ షోలతో బీ టౌన్ ఆడియన్స్ మనసు దోచుకుంది. అంతే కాకుండా యాడ్స్లోనూ నటిస్తూ అభిమానులను అలరించింది. 2014లో వ్యాపారవేత్త రోహిత్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా అనిత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. అనిత తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఈ రోజు నేను చేసింది కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు. నా కోసం, నేను చేసిన అద్భుతమైన ప్రయాణానికి గుర్తు ఇది. నాకు ఆ టీనేజ్ రోజులు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు నా జీవితం ఎన్నో కలలు, గందరగోళాల మధ్య సుడిగుండంలా గడిచింది. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా కేవలం ఒక డైరీలో నా ఆశలు గురించి రాసుకున్నా. కానీ నా జీవితంలో అప్పుడే ఓ విషాదం జరిగింది. నేను నా తండ్రి.. నా హీరోని కోల్పోయాను. ఆ సమయంలో నా దారులన్నీ మూసుకుపోయాయి. కానీ నేను వాటికి భయపడలేదు. కేవలం నా కోసమే కాదు.. నా కుటుంబానికి వెన్నెముకగా మారాను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నా. నా కుటుంబంతో గర్వంగా.. ఓ తల్లిగా, ప్రేమగల భర్త, నా బిడ్డే ఇప్పుడు నా ప్రపంచం. నా లైఫ్లో ప్రతిరోజును ఆస్వాదిస్తున్నా. అందుకే ఈ రోజు నుంచి నాకు నేనే కృతజ్ఞతలు చెప్పడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నా. నా లైఫ్ ఇంత హ్యాపీగా మారినందుకు నాకు నేనే రుణపడి ఉంటాను.' అంటూ పోస్ట్ చేసింది. తన జీవితంలో ఎన్నో బాధలు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందంటూ అనిత ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) -
ఉదయ్కిరణ్ డెత్ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం అహింస. గీతికా తివారి హీరోయిన్. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ అయి తేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా అతడికి దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించే ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే పాపం అనేశాడు తేజ. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి హీరో డెత్ మిస్టరీ రివీల్ చేస్తానన్నారు కదా సర్.. అని అడిగాడు. దీనికి తేజ స్పందిస్తూ.. 'చాలామందికి ఉదయ్ కిరణ్ మరణం వెనుక అసలు కారణం తెలుసు. కానీ ఎందుకు నాతోనే దాన్ని చెప్పించాలని చూస్తున్నారు. అందరూ ఏమీ తెలియనట్లు అమాయకంగా మీరే చెప్పండని ఎందుకు నటిస్తున్నారో అర్థం కావట్లేదు' అని బదులిచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. తనను త్వరలో హీరోగా పరిచయం చేస్తాను. అమ్మాయి తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది. ఆమెకు నేను పెళ్లి చేయను. నచ్చినవాడిని చూసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. ఆ తర్వాత దగ్గరివాళ్లను పిలిచి భోజనాలు పెడదామన్నాను. ఒకవేళ పెళ్లి తర్వాత నచ్చకపోతే విడాకులిచ్చేయ్.. నా ఇద్దరు పిల్లలకు అదే చెప్తా.. జీవితంలో సంతోషంగా ఉండటం కోసం ఏది చేయాలనిపిస్తే అది చేయండి.. అంతే తప్ప పక్కవాళ్ల కోసం ఆలోచించవద్దని చెప్తాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చులకన చేసే నోరు ఉంటే చురకలు వేసే నోరు కూడా ఉంటుంది -
'నీస్నేహం' మూవీలో ఉదయ్కిరణ్ ఫ్రెండ్ ఇప్పుడెక్కడ ఉన్నాడో తెలుసా?
ఉదయ్కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన సినిమా నీ స్నేహం. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను పరుచూరి మురళి దర్శకత్వం వహించిగా, కళాతపస్వి కె. విశ్వనాథ్ కీలక పాత్రలో నటించారు. 2002లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తారు విజయం సాధించింది. ముఖ్యంగా ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్గా నిలిచింది. ఈ మూవీలోని పాటలన్నిటినీ సిరివెన్నెల రాయడం విశేషం. స్నేహితులిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఆ తర్వాత నిజం తెలిసి ఫ్రెండ్ కోసం ప్రేమను త్యాగం చేయడం సినిమా కథాంశం. ఈ చిత్రంలో హీరోగా ఉదయ్కిరణ్ నటించగా, అతని ఫ్రెండ్ క్యారెక్టర్లో బాలీవుడ్ నటుడు జతిన్ అలరించాడు. మోడల్గా కెరీర్ ఆరంభించిన జతిన్ హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించాడు. తెలుగులో నీ స్నేహం సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. 2010లో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న జతిన్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. -
ఉదయ్ కిరణ్ చావుకు కారణం తెలుసు: తేజ సంచలన వ్యాఖ్యలు
ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు దర్శకుడు తేజ. తనను తెలియని విషయాల జోలికి వెళ్లడు కానీ.. తెలిసిని విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తేస్తాడు. ఇతరుల విషయంలోనే కాదు.. తనకు సంబంధించిన విషయాలో కూడా చాలా ఓపెన్గా ఉంటాడు. తాజాగా ఈ క్రియేటివ్ దర్శకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ చావుకు కారణాలేంటో తనకు తెలుసని అన్నాడు. తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్కిరణ్. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఉదయ్కి అవకాశాలు వరుసకట్టాయి. తదుపరి ‘నువ్వు నేను’ అంతకుమించి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'మనసంతా నువ్వే' కూడా భారీ విజయం సాధించడంతో స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ ఆ స్టార్డమ్ ఎక్కువ రోజులు ఉండలేదు. వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఉదయ్ కిరణ్కు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి.. 2014 జనవరి లో ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం తనుకు తెలుసని, చనిపోయేలోపు ఆ విషయాలు చెబుతానన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ కోల్పోయాడు. స్టార్డమ్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ మిస్ కావడం కామన్. నేను దాన్ని తల పొగరు అనుకోలేదు. అమాయకత్వం అనుకున్నా. తను ప్లాప్లతో సతమతమవుతున్న సమయంలో పిలిచి ‘ఔనన్నా కాదన్నా’ లో అవకాశం ఇచ్చా. ఆ సినిమా షూటింగ్ సమయంలో విచారం వ్యక్తం చేశాడు. ‘మీ విషయంలో నేను కాస్త పొగరుగా వ్యవహరించినా... గుర్తుపెట్టుకొని మరీ సినిమా అవకాశం ఇచ్చారు. మీ పాదాలు తాకుతా.. క్షమించానని ఒక్కసారి చెప్పండి చాలు’ అన్నారు. నేను అవేవి వద్దని చెప్పా. అతని జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నేను చనిపోయేలోపు ఈ విషయాలను వెల్లడిస్తా. ఇప్పుడు చెప్పడం సరైన పద్దతి కాదు’అని తేజ చెప్పుకొచ్చాడు. తేజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఉదయ్ కిరణ్తో 5 సినిమాలకు సంతకం చేశా, కానీ: పింకీ
బిగ్బాస్ 6 షోలో అందరికీ వంట చేసి పెట్టింది సుదీప. అంతేనా, అందరినీ కమాండ్ చేస్తూ బాస్ లేడీ అన్న ట్యాగ్ను కూడా సంపాదించింది. ఆరోవారంలో షో నుంచి ఎలిమినేట్ అయిన పింకీ బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా మొదటి సినిమా యమ్.ధర్మరాజు ఎమ్ఏ. ఈ సినిమా రచయిత వేమూరి సత్యానారాయణతో మా తాతగారికి పరిచయం ఉంది. ఈ మూవీ కోసం చెన్నై నుంచి తీసుకువచ్చిన వచ్చిన అమ్మాయి సమయానికి చేయనంది. రాజమండ్రిలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందంటే చూడటానికి వెళ్లినప్పుడు మా మనవరాలికి ఇంట్రస్ట్ ఉంది, ఏదైనా పాత్ర ఉంటే చెప్పండని తాతగారు అన్నారు. అలా చెన్నై అమ్మాయి హ్యాండివ్వడంతో నన్ను తీసుకున్నారు. సినిమా చాలా పెద్ద హిట్టయింది. 7జి బృందావన కాలనీ కోసం నల్లగా ఉండాలి, సన్నబడాలన్నారు. అందుకోసం రోజూ ఒక గంటసేపు ఎండలో నిలబడేదాన్ని. ఆ తర్వాత ఉదయ్ కిరణ్వి 9 సినిమాలు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. అందులో ఐదింటికి నేను సంతకం చేశా.. కానీ చాలా చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. అతడు చాలా సాఫ్ట్గా ఉంటాడు. మనం కొంచెం డల్గా కనిపిస్తే వెంటనే వచ్చి ఏమైంది? ఏం జరిగింది, ఏదైనా ఇబ్బందా? అని అడిగే తత్వం తనది. సంతోషాన్ని పంచుకోకపోయినా బాధను పసిగట్టి ఓదార్చే మనిషి. అతడితో నేను చేసిన చివరి చిత్రం వియ్యాలవారి కయ్యాలు. ఏ కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకుని అందరినీ వదిలేసి వెళ్లాడు. కానీ ప్రజల మనసులో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాడు' అని ఎమోషనలైంది సుదీప. చదవండి: పవిత్ర నరేశ్ బ్రేకప్, ఏమైందంటే? కన్ఫ్యూజన్ మాస్టర ఎలిమినేట్ చేదు అనుభవం, కెరీర్ ముగిసిపోయిందనుకున్నా -
'కెరీర్లో ఎక్కడో తప్పు జరిగింది'.. ఉదయ్కిరణ్ మృతిపై సదా కామెంట్స్
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. లవర్బాయ్ ఇమేజ్తో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రల్లో నటించిన ఉదయ్కిరణ్కి యూత్లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో కెరీర్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక డిప్రెషన్తో ఉదయ్కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉదయ్కిరణ్ మృతిపై హీరోయిన్ సదా మాట్లాడుతూ.. 'అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎప్పుడూ ఊహించలేదు. ఉదయ్ కిరణ్తో కలిసి 'ఔనన్నా కాదన్నా' సినిమా చేశాను. అతను ఎంతో మంచి వ్యక్తి. అంత మంచి నటుడ్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన కెరీర్లో ఎక్కడో తప్పు జరిగింది. కానీ ఏం జరిగినా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సినిమా అవకాశాల కంటే జీవితమే ముఖ్యం. సమస్యకు చావే పరిష్కారం కాదు.. ఒక యాక్టర్ గా మనం ది బెస్ట్ అవ్వాలి అంతే. ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది ' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
Chalo Premiddam: సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత
‘ఛలో ప్రేమిద్దాం` చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా సక్సెస్ మరెన్నో సినిమాలు చేయడానికి నాకు మంచి బూస్టప్ ఇచ్చింది’ అన్నారు నిర్మాత ఉదయ్ కిరణ్. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మించిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. ఈ చిత్రం ఈనెల 19న విడుదలై పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ థియేటర్స్ పెంచుకుంటోంది. ఈ సందర్భంగా ఈ రోజు సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మా ఆర్టిస్ట్స్ , టెక్నీషియన్స్ కారణం. అందరూ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. చిన్న సినిమాని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇకపైన కూడా మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలను ఈ విధంగానే ఆదరిస్తారని కోరుకుంటున్నా` అన్నారు. (చదవండి: ‘ఛలో ప్రేమిద్దాం’ మూవీ రివ్యూ) దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె మాట్లాడుతూ...‘మా సినిమాకు విడుదలైన అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పాటలు, నేపథ్య సంగీతం, దర్శకత్వం, కామెడీ , నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అంటున్నారు. ఆడియన్స్ తో కలిసి ఫస్ట్ రోజు సినిమా చూశాను. అదుర్స్ రఘు కామెడీ, పోసాని, హేమ మధ్య వచ్చే ఫన్, అత్తారింటికి దారిది ఎపిసోడ్ కు ఆడియన్స్ పడి పడి నవ్వుతున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ , శశాంక్ ,నాగినీడు, సిజ్జు పాత్రలు సినిమాకు హైలెట్ అంటున్నారు. సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మా టీమ్ సపోర్ట్ వల్లే. వర్షాల్లో కూడా మా సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ....‘ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎదురు చూశాను. అందరూ నా పర్ఫార్మెన్స్ , డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బావుందంటూ చాలా మంది కాల్స్ చేసి చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఇంత మంచి హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. -
లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఛలో ప్రేమిద్దాం’
`ప్రెజర్ కుక్కర్` ఫేమ్ సాయి రోనక్, `90 ఎమ్ ఎల్` ఫేమ్ నేహ సోలంకి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ శేఖర్ రేపల్లె దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను గతంలో రాజీవ్ కనకాలతో `బ్లాక్ అండ్ వైట్`, వరుణ్ సందేశ్ హీరోగా `ప్రియుడు` చిత్రాలు నిర్మించాను. ప్రియుడు సినిమా సమయంలో సురేష్ పరిచయం. ఆ సమయంలోనే తను ఒక మంచి కథ చెప్పాడు . ఆ కథ నచ్చి ` ఛలో ప్రేమిద్దాం` చిత్రం నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రజంట్ ట్రెండ్ కు కనెక్టయ్యే అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. ఇందులో మంచి లవ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. దర్శకుడు సినిమాను చాలా బాగా డీల్ చేశారు. ఇది అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.... ‘ఈ చిత్రంలో పంచ భూతాల్లాంటి ఐదు పాటలున్నాయి. భీమ్స్ అంటే ఇప్పటి వరకు అందరూ మాస్ సాంగ్స్ అనుకునే వారు. కానీ, ఈ సినిమాతో భీమ్స్ మాస్ తో పాటు, మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా చేయగలడని ప్రూవ్ చేసే విధంగా పాటలుంటాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా ఛలో ప్రేమిద్దాం చిత్రం ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. -
ఉదయ్కిరణ్, తరుణ్లతో నన్ను పోల్చకండి : వరుణ్ సందేశ్
Varun Sandesh : హ్యాపీడేస్ చిత్రంతో తొలిసారి తెలుగుతెరకు పరిచయం అయ్యాడు హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాతో మరో భారీ హిట్ను ఖాతాలో వేసుకున్న వరుణ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో వరుణ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనుకున్న సమయంలో బిగ్బాస్ రియాలిటీ షోతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వరుణ్ ఆటిట్యూడ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్బాస్-3 నుంచి బయటకు వచ్చిన అనంతరం వరుణ్ నటించిన తొలి సినిమా ఇందువదన. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న వరుణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన కెరీర్ను తరుణ్, ఉదయ్కిరణ్లతో పోల్చవద్దని తెలిపాడు. నాకు ఉదయ్, తరుణ్ బాగా తెలుసు. ఉదయ్కు అలా జరగడం చాలా బాధాకారం. కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. కెరీర్ను అలా పోల్చి చూడలేం. ఇక నా విషయానికి వస్తే..నేను కోల్పోయినదాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. బిగ్బాస్ తర్వాత కొన్ని కథలకు సైన్ చేశా. కానీ కోవిడ్ సహా మరికొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్స్ సెట్స్పైకి వెళ్లలేదు. ఇక తర్వాత నేను యూఎస్ వెళ్లి ఐటీ కోర్స్ చేశాను. వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాలనే ఆలోచన కూడా ఉంది అని వరుణ్ వివరించాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన చిత్రంలో ఫర్నాజ్ శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడదులైన మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై ఆకస్తిని కలిగించేలా ఉంది. -
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’.. పారితోషికం వేలల్లో, వసూళ్లు కోట్లలో
Uday Kiran First Remuneration: దివంగత నటుడు ఉదయ్ కిరణ్ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా ‘చిత్రం’. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్ తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్స్టోరీల్లో నటించి హ్యాట్రిక్ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్ బాయ్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎదిగిన ఉదయ్కిరణ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే స్టార్ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్లు, ప్లాప్లు అందుకున్న అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది. 2014లో అతడు ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తొలి సనిమాతోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ‘చిత్రం’ మూవీకి ఉదయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సింది. ఉషా కిరణ్ మూవీస్లో రామోజీరావు తెరకెక్కించిన ఈ మూవీ 42 లక్షల రూపాయల బడ్జెట్తో నిర్మించారట. 30 రోజుల్లోనే షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతూ 8 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అంతగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన ఈ ‘చిత్రం’ మూవీకి ఉదయ్ కిరణ్ కేవలం 11 వేల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకున్నాడట. అంతేగాక ఈ మూవీకి పని చేసిన డైరెక్టర్ తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్లు సైతం అతి తక్కవ రెమ్యునరేషన్ను తీసుకోవడం గమనార్హం. అయితే ఈ మూవీలో మొదట హీరోగా మరో వ్యక్తిని ఫైనల్ చేసి హీరో స్నేహితుడి పాత్రలో ఉదయ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నాడట. అయితే సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు హీరోగా చేయాల్సిన ఆ వ్యక్తి చివరకు హ్యాండ్ ఇవ్వడంతో తేజ ఉదయ్ కిరణ్ను హీరోగా పెట్టి ‘చిత్రం’ మూవీ రూపొందించి టాలీవుడ్కు బ్లాక్బస్టర్ హిట్ను అందించాడు. మరో విషయం ఎంటంటే ఈ మూవీ తర్వాత తేజ తీసిన నువ్వు-నేను సినిమాకు కూడా మొదట ఉదయ్ను అనుకోలేదట. హీరో మాధవన్తో ఈ మూవీ చేద్దామనుకున్నాడట. అప్పటికే మాధవన్ తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో మళ్లీ ఉదయ్ కిరణ్ను హీరోగా తీసుకుని ఈ ‘నువ్వు-నేను’ మూవీని తెరకెక్కించాడు. లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కూడా బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. -
ఉదయ్ కిరణ్ ఆగిపోయిన 10 సినిమాలు ఇవే!
ఒకప్పుడు టాలీవుడ్లో లవర్ బాయ్గా ఒ వెలుగు వెలిగాడు దివంగత నటుడు ఉదయ్ కిరణ్. నేడు(జూన్ 26) అతడి జయంతి. ఈ సందర్భంగా ఒకసారి ఉదయ్ సినీ కేరీర్పై ఓ లుక్కెద్దాం. ఉదయ్ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘చిత్రం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ఉదయ్ కిరణ్ సినిమాలన్ని మంచి విజయం సాధించాయి. అలా వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. ఈ క్రమంలో అతడు నటించిన శ్రీరామ్ మూవీ ప్లాప్ అవ్వడంతో కొంతాకాలం సినిమాలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ ‘ఔనన్నా.. కాదన్నా’ మూవీతో ఉదయ్కి మరో హిట్ అందించాడు. దీంతో మళ్లీ ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ గాడిన పడిందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా తర్వాత ఉదయ్కి ఆశించిన అవకాశాలు రాలేదు. చేసిన కొన్ని సినిమాలకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఉదయ్కి సినిమాల అవకాశాలు దగ్గడమే కాకుండా అప్పటికే ఉదయ్తో తీస్తాన్న పలు ప్రాజెక్ట్స్ కూడా నిలిచిపోయాయి. అయితే ఇందుకు కారణంగా లేకపోలేదు. అయితే ఉదయ్ ఆగిపోయిన ఆ పది క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ సారి చూద్దాం. నర్తనశాల బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో అప్పటి హీరోయిన్ సౌందర్య ప్రధాన పాత్రలో నర్తనశాల మూవీకి సన్నాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సౌందర్య ఆకస్మాత్తు మరణంతో ఈ సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. అయితే ఇందులోని కీలక పాత్ర అభిమాన్యుడి కోసం ఉదయ్కిరణ్ను అనుకున్నారని అప్పట్లో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో.. ఈ బ్యానర్లో ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమాకు తీయాలని భావించారు మేకర్స్. అంతేగాక ఈ చిత్రానకి లవర్స్ అనే టైటిల్ను కూడా ఖారారు చేశారట. ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా పట్టలెక్కలేకపోయింది. కాగా ఈ బ్యానర్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లో తెలుగుతో పాటు పలు తమిళం చిత్రాలు కూడా వచ్చాయి. అంజనా ప్రొడక్షన్స్ సినిమా కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఉదయ్ కిరణ్, అసిన్ జంటగా అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో ఒక సినిమా తీయాలని చర్చించుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ప్రత్యూష క్రియేషన్స్ ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ ఒక సినిమా మొదలు పెడదామని అనుకుని దీనిపై ప్రకటన కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాతా ఈ మూవీ అనుకొకుండా ఆగిపోయింది. చంద్రశేఖర్ యేలేటితో.. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన చంద్రశేఖర్ యేలేటి కూడా ఉదయ్ కిరణ్తో ఓ సినిమా అనుకున్నారట. ప్రేమంటే సులువు కాదురా ఉదయ్ కిరణ్ హీరోగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో ఓ సినిమా మొదలుపెట్టారు. దాదాపు 80 శాతం షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎందుకో తెలియదు కాదు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఆది శంకరాచార్య ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆదిశంకరాచార్య. ఈ సినిమా పట్టాలెక్కే సమయానికి ఉదయ్ కిరణ్ మార్కెట్ పడిపోయింది. దీంతో నిర్మాతలు సినిమాను ఆపేశారు. జబ్ వి మెట్ తెలుగు రీమేక్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా రూపొందిన బాలీవుడ్ చిత్రం జబ్ వి మిట్. ఈ మూవీతో హిందీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయ్ కిరణ్, త్రిష హీరోహీరోయిన్లుగా తెలుగులో ఈ మూవీని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ పట్టాలేక్కలేదు. అయితే తమిళంలో ప్రేమిస్తే భరత్, తమన్నాలతో ‘కందేన్ కందాలయి’గా ఈ మూవీని చిత్రీకరించగా.. తెలుగులోకి ‘ప్రియ.. ప్రియతమా’ పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజుతో ఓ సినిమా ఉదయ్ కిరణ్తో మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి సినిమాలు చేసి మంచి హిట్ అందించారు ఎంఎస్ రాజుజ దీంతో ఉదయ్ కిరణ్తో హ్యాట్రిక్గా మరో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది. తేజతో మరోసారి ఉదయ్ కిరణ్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజ. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘చిత్రం’, ‘నువ్వు నేను’ బ్లాక్బస్టర్గా నిలిచాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ డైలామా పడిన సమయంలో ‘ఔనన్నా కాదన్న’ సినిమా తీసి హిట్ అందించాడు తేజ. ఆ తర్వాత అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న ఉదయ్ కిరణ్ను మళ్లీ ఆదుకునేందుకు తేజ మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఉదయ్కి స్టోరీ లైన్ కూడా చెప్పాడు. ఇక ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ సిద్దం చేస్తుండానే ఉదయ్ అనుకొకుండా మృతి చెందాడు. ఉదయ్ మరణాంతరం ఇదే విషయాన్ని తేజ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఓటీటీలోకి రానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం -
ఉదయ్ కిరణ్ తొలి ‘చిత్రం’
టాలీవుడ్లో యువ నటుడు ఉదయ్ కిరణ్ది ఒక ప్రత్యేకమైన శకం. కెరీర్లో తొలి మూడు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించి.. ‘హ్యాట్రిక్ హీరో’ ట్యాగ్ను తన ముందర చేర్చుకున్నాడు. యూత్లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే తర్వాతి రోజుల్లో కెరీర్ డౌన్ ఫాలోతోనే కొనసాగి.. చివరికి ఉదయ్ కిరణ్ జీవితం విషాదంగా ముగిసింది. అయితే ఏ హీరోకైనా కెరీర్లో ఫస్ట్ మూవీ ప్రత్యేకం. అలాగే ఉదయ్కు కూడా ‘చిత్రం’ ఉంది. ఈ ట్రెండ్ సెట్టర్ మూవీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... వెబ్డెస్క్: ‘చిత్రం.. ది పిక్చర్’ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. కొత్త-పాత ఆర్టిస్టులు, కొత్త టెక్నిషియన్ల కలయికతో రూపుదిద్దుకుంది చిత్రం. కేవలం నెలన్నర రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఆర్పీ పట్నాయక్ అందించిన ఆడియో సాంగ్స్తో సగం హిట్ సాధించగా, తేజ యూత్ఫుల్ సబ్జెక్ట్ ప్రజంటేషన్తో సెన్సేషన్ హిట్ అయ్యింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్, చిత్రం శీను&కో.. ఇలా ఎందరో ఆర్టిస్టుల కెరీర్కు ఈ మూవీ ఒక పాథ్ను ఏర్పరిచింది. ఫ్రెండ్ నుంచి.. నిజానికి ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కంటే ముందే వేరే కుర్రాడిని హీరోగా అనుకున్నాడట డైరెక్టర్ తేజ. ఈ విషయాన్ని స్వయంగా తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఉదయ్ కిరణ్ ముందుగా ఫ్రెండ్స్లో ఓ క్యారెక్టర్. హీరోగా చేస్తానన్న వ్యక్తి వెనక్కి తగ్గడంతో.. ఉదయ్ను హీరోగా ముందుకు తెచ్చాడు తేజ. అయితే మళ్లీ ఆ కుర్రాడు ముందుకు రావడంతో.. ఉదయ్ను మళ్లీ ఫ్రెండ్ క్యారెక్టర్కే సెట్ చేశారు. అయితే షూటింగ్కి సరిగ్గా ముందురోజే మళ్లీ ఆ వ్యక్తిని వద్దనుకుని.. తేజ ఉదయ్ కిరణ్నే హీరోగా ఫైనలైజ్ చేశాడు తేజ. ఇక షూటింగ్ మొదట్లో ఉదయ్ కిరణ్ తడబడడంతో.. పక్కకు తీసుకెళ్లి తన స్టైల్లో క్లాస్ పీకాడట తేజ. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తనకు(తేజ) కావాల్సినట్లుగా యాక్ట్ చేయడం, ‘చిత్రం’ సూపర్ హిట్ కావడం జరిగిపోయానని తేజ ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. సబ్జెక్ట్ కొత్తదే, అయినా.. మిడిల్ క్లాస్ కుర్రాడు రమణ(ఉదయ్ కిరణ్), ఫారిన్ రిటర్ని జానకీ(రీమాసేన్).. ఈ ఇద్దరి టీనేజర్ల ప్రణయగాథే ‘చిత్రం’ థీమ్. టీనేజీ వయసులో ఇన్ఫాక్చుయేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది తనదైన ట్రీట్మెంట్తో ఇందులో చూపించాడు తేజ. పనిలో పనిగా కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, అందమైన పాటలు అందించాడు. అయితే కొద్దిపాటి అడల్ట్ థీమ్ ఉండడం, టీనేజీలో గర్భం, పైగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుంచి ఈ మూవీ రావడంతో క్రిటిక్స్ కొద్దిపాటి విమర్శలు చేశారు. కానీ, యూత్ థియేటర్లకు పోటెత్తడంతో 42 లక్షల బడ్జెట్తో తీసిన ఈ సినిమా బంపర్ సక్సెస్ సాధించింది. అప్పటికి ఇరవై ఏళ్ల వయసున్న ఉదయ్ కిరణ్.. ఫ్లస్ టూ స్టూడెంట్ రమణ క్యారెక్టర్తో అలరించి చాక్లెట్ బాయ్ ట్యాగ్కు తొలి బీజం వేసుకున్నాడు. కన్నడలో 125రోజులు చిత్రం సినిమాను రీమా సేన్కు కోలీవుడ్లో దక్కిన కొద్దిపాటి గుర్తింపు కారణంగా డబ్ చేశారు. అయితే కోలీవుడ్ వెర్షన్ కోసం మణివణ్ణన్, సెంథిల్, ఛార్లీ, మనోరమా, కల్పనలతో కొన్ని సీన్లను రీషూట్ చేశారు. ఇక 2001లో తెలుగు చిత్రం మూవీ కన్నడలో ‘చిత్ర’ పేరుతో రీమేక్ అయ్యింది. నాగేంద్ర ప్రసాద్, రేఖ వేదవ్యాస(ఆనందం ఫేమ్) లీడ్ రోల్లో నటించిన ఈమూవీ బ్లాక్బస్టర్ టాక్ దక్కించుకుని.. థియేటర్లలో 125 రోజులు ఆడింది. చదవండి: ఇరవై ఏళ్ల తర్వాత చిత్రం.. రిపీట్ -
ఓటీటీలోకి రానున్న ఉదయ్ కిరణ్ చివరి చిత్రం
దివంగత నటుడు, హీరో ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు ఏడేళ్లు అవుతుంది. చివరిసారిగా ఆయన నటించిన మూవీ ‘చిత్రం చెప్పన కథ’. ఉదయ్ కిరణ్ చనిపోయిన రెండు నెలలకు ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. కానీ ట్రైలర్ విడుదల అనంతరం ఇందులో హీరోయిన్గా నటించిన మదల్సా శర్మ తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీలలో కలిపి దాదాపు 15 సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ తన సినీ కేరీర్కు ప్లస్ అవుతుందని ఉదయ్ తన సన్నిహితులతో చెప్పుకున్నట్లు సమాచారం. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగానే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్నేళ్లకు ఈ మూవీని డిజిటల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అయితే 2020లో లాక్డౌన్లో విడుదల చేయాలని చూసినప్పటికీ రేటు విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా ఈ సెకండ్ వేవ్లో చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ చివరి సినిమా అయిన ‘చిత్రం చెప్పిన కథ’ కూడా ఎలాగైనా ఓటీటీలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు కాస్త గట్టిగానే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు అధికంగానే ఆఫర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల్లో సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీలో హీరో తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎదరయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. అలాగే ఉదయ్ కిరణ్ చివరి సినిమా కాబట్టి అభిమానులు కూడా చూస్తారని ఓటీటీ సంస్థలు నమ్ముతున్నాయి. మొత్తానికి 2013లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎనిమిదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న మాట. -
ఉదయ్ కిరణ్: అభిమానుల ‘మనసంతా నువ్వే’
-
మరోసారి వార్తల్లో ఉదయ్ కిరణ్!
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే చిత్రసీమలోకి ప్రవేశం.. అనతికాలంలోనే స్టార్డమ్.. ఆఫర్లు క్యూ కట్టాయి.. విజయాలు అతడి వాకిట నిలిచాయి.. అవార్డులు దాసోహయ్యాయి.. ‘హ్యాట్రిక్ హీరో’ అనే పదం పురుడుపోసుకుంది అతడిని చూశాకనే.. చిన్న వయసులోనే అసాధ్యం అనుకున్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు.. కమల్హాసన్ తర్వాత అతిచిన్న వయసులో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా గుర్తింపు పొందాడు.. కానీ ఎవరూ ఊహించని విధంగా త్వరగానే తనువు చాలించాడు.. అతడే హీరో ఉదయ్ కిరణ్.. మరణానికి కారణాలు ఏంటో తెలియవు.. ఉన్న అనుమానాలకు సాక్ష్యాలు లేవు.. నేడు ఉదయ్ కిరణ్ 40వ జయంతి.. ఫిల్మ్ ఇండస్ట్రీ మర్చిపోయినా.. హీరోహీరోయిన్లు తలచుకోకున్నా.. అభిమానులు తమ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ తమ అభిమాన హీరోను ఒక్కసారిగా గుర్తుచేసుకుంటూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. (మనసును కలిచివేస్తోంది: చిరంజీవి) ‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత చేసిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో హ్యాట్రిక్ హీరోగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ డైరెక్టర్లు, పెద్ద నిర్మాణ సంస్థలు, క్రేజీ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో సంచలనాలకు నాంది పలికాడు. సహచర నటీనటులతో మంచి సాన్నిహిత్యం.. ఎలాంటి రిమార్క్ లేని నటుడిగా పేరు గాంచాడు. కేరీర్ గ్రాఫ్ హైలెవల్లో ఉండగా కొన్ని ఊహించని మలపులు అతడి భవిష్యత్ను చిన్నాభిన్నం చేశాయి. ఆ తర్వాత కోలుకోలేదు. సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. నిర్మాణంలో ఉన్న సినిమాలు ఆగిపోయాయి. స్టార్డమ్ పోయింది.. చేతిలో సినిమాలు లేవు. దీంతో డిప్రెషన్ ఆవహించింది. జనవరి 5,2014న శ్రీనగర్లోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెలుగునాట పెద్ద సంచలనంగా మారింది. (మరి మీరు ఎటువైపు?: నాని) ఉదయ్ కిరణ్ తనువు చాలించి ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ జనం గుండెల్లో భద్రంగా నిలిచే ఉన్నాడు. ఏ యువ హీరో (బ్యాక్గ్రౌండ్ లేకుండా) సినిమా వచ్చినా.. సినిమా వాళ్లు ఎవరు మరణించినా.. ఆ క్షణం అందరికీ ఉదయ్ కిరణే గుర్తొస్తాడు. అభిమానులు కన్నీరు కారుస్తారు. తాజాగా బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత ఉదయ్ కిరణ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వీరిద్దరికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే చిన్నవయసులోనే అర్థంతరంగా వాలిపోయారు. ఇద్దరి మరణానికి ఒక్కటే కారణం డిప్రెషన్(అందరూ బయటకు చెప్పే కారణం). సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా మాదిరిగానే ఈ తెలుగు హీరో నటించిన చివరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’ కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. (మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..) -
రంగుల ప్రపంచం వెనుక విషాదాలెన్నో..
రంగుల ప్రపంచం వెనుక ఎన్నో విషాదాలు దాగిఉంటాయి. అవి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. అందమైన సినీ ప్రపంచానికి చెందిన ఎంతో మంది నటీనటుల కెరీర్ కష్టాల్లో పడగానే దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. తాజాగా జరిగిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కూడా అలాంటిదే. రంగుల ప్రపంచంలో ఎన్నో కలలు కని చివరికి అర్ధాంతరంగా జీవితాలను ముగించిన కొందరి జీవితాలను పరిశీలిస్తే.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ధోనీ సినిమాతో దేశవ్యాప్తగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో సడన్గా చనిపోవడం అందరినీ షాక్కు గురిచేస్తోంది. ఆయన సూసైడ్కి కారణం తెలియలేదు. కొద్ది రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 'పవిత్ర రిస్తా' టీవీ సీరియల్తో పాపులర్ అయిన 34 ఏళ్ళ సుశాంత్.. 'కైపోచే' మూవీతో తన సినీ ఆరంగ్రేట్రం చేశాడు. చివరిసారిగా 'డ్రైవ్' చిత్రంలో నటించాడు. ప్రేక్ష మెహతా యువ హిందీ నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రేక్ష బలవన్మరణానికి పాల్పడ్డారు. క్రైం పెట్రోల్, లాల్ ఇష్క్, మేరి దుర్గ వంటి టీవీ షోలలో ప్రేక్ష నటించారు. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ప్యాడ్ మ్యాన్లోనూ ఒక పాత్ర పోషించారు. 25 సంవత్సరాల చిన్న వయసులో 2020 మే 25న తన జీవితాన్ని ముగించింది. కుశల్ పంజాబీ హిందీ నటుడు కుశల్ పంజాబీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ రియాలిటీ షో జోర్ కా జట్కాలో విజేతగా నిలిచిన కుశల్ బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్ ఫాక్టర్, నౌటికా నావిగేటర్స్ ఛాలెంజ్, ఝలక్ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొని అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రంగనాథ్ ప్రముఖ సినీనటుడు, రచయిత రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్లోనూ నటించిన రంగనాథ్కి రచయితగా, సాహితీవేత్తగానూ మంచి పేరుంది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకి దాదాపు 15 ఏళ్లపాటు సపర్యలు చేసిన రంగనాథ్.. ఆమె మృతి తర్వాత ఒంటరితనానికి గురయ్యారు. ఆ డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. విజయ్ సాయి టాలీవూడ్ హాస్యనటుడు విజయ్ సాయి కూడా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. యూసఫ్ గూడ లో నివాసముంటున్న సాయి అతని అపార్ట్ మెంట్ లో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయిలు-అబ్బాయిలు, బొమ్మరిల్లు, మంత్ర, అల్లరి, ధనలక్ష్మి తలుపు తడితే, ఒకరికి.. ఒకరు తదితర చిత్రాల్లో విజయ్ సాయి నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడమూ, మానసిక ఒత్తిడే ఆత్మహత్యకు కారణమని వార్తలు వచ్చాయి. ఉదయ్ కిరణ్ ఈ పేరు వినగానే మనకు చిన్న చిరునవ్వు మొహంపై ఉన్న ఓ రూపం కళ్లముందు కనిపిస్తుంది. ఈ హీరో తెలుగు ఇండస్ట్రీలో వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు. కారణాలు తెలియదు కానీ అప్పటి వరకు చేతినిండా సినిమాలతో ఉన్న ఆయన ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. గొప్ప నటుడు అవుతాడనుకున్న ఉదయ్ కిరణ్ అర్ధంతరంగా వాలిపోయాడు. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు.. జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. -
రాత్రి ఫోన్ రావడంతో వెళ్లాడు.. తిరిగి రాలేదు
యాదాద్రి భువనగిరి, రాజాపేట (ఆలేరు) : యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బేగంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జెల్ల పెద్దోళ్లశ్రీనివాస్, వసంతకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు ఉదయ్కిరణ్ (19) రాజాపేటలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాగా ఆదివారం రాత్రి ఫోన్ రావడంతో ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ తరుణంలో తమ వ్యవసాయ బావివద్ద ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు ఇతరుల సాయంతో కిందికి దించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఉదయ్కిరణ్ మృతిపై అనుమానం ఉందని తండ్రి శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఉదయ్ కిరణ్ బయోపిక్.. స్పందించిన సందీప్
ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దివంగత హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కుతుందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో హీరో సందీప్ కిషన్ నటిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలను సందీప్ ఖండించారు. ఉదయ్కిరణ్ బయోపిక్ గురించి తనను ఎవరు సంప్రదించలేదని సందీప్ స్పష్టం చేశారు. ఇప్పట్లో తనకు బయోపిక్లు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు. కాగా, చిన్న వయసులోనే హీరోగా ఓ వెలుగు వెలిగిన ఉదయ్కిరణ్.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గతంలో కూడా దర్శకుడు తేజ.. ఉదయ్ కిరణ్ బయోపిక్ను తెరకెక్కిస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తేజ వాటిని ఖండించారు. -
సినీ నటుడు ఉదయ్ కిరణ్పై క్రిమినల్ కేసు
బంజారాహిల్స్: తప్పుడు పత్రాలతో ఇంటి కిరాయి అగ్రిమెంట్ చేసుకోవడమేగాక ఇల్లు ఖాళీ చేయాలని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్న సినీ నటుడు ఉదయ్ కిరణ్ నండూరి(ఫేస్బుక్ హీరో)పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్పేట్కు చెందిన శివ ప్రసాద్ కలాని అనే వ్యాపారికి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 59లోని నందగిరిహిల్స్ ఆదిత్యహిల్స్లో ఫ్లాట్ ఉంది. ఈ నెల 23న ఈ ఫ్లాట్ను అద్దెకు తీసుకునేందుకు సినీ నటుడు ఉదయ్ కిరణ్ నండూరి తప్పుడు గుర్తింపు పత్రాలు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. అగ్రిమెంట్ అనంతరం ఉదయ్ కిరణ్కు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా డ్రగ్స్, కారు దొంగతనం కేసుల్లో పీడీయాక్ట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చినట్లు గుర్తించాడు. దీంతో ఆయన ఉదయ్ కిరణ్కు ఫోన్ చేసి తాను ఫ్లాట్ను అద్దెకు ఇవ్వడం లేదని చెప్పగా, అయితే అప్పటికే లగేజీతో సహా ప్లాట్ వద్దకు వచ్చిన ఉదయ్కిరణ్ వాచ్మెన్ వద్ద తాళంచెవులు తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో వాచ్మెన్ను తోసేసి ఫ్లాట్లోకి వెళ్ళడమే కాకుండా తననే ఫ్లాట్ ఖాళీ చేయమంటావా అంటూ 20 మంది గూండాలతో కలిసి యజమాని శివప్రసాద్ కలానిని బెదిరించాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఖాళీ చేయబోనని హెచ్చరించారు. దుబాయ్లో ఉండే ఎన్ఆర్ఐ మంగీలాల్ కలారికి చెందిన ఈ ఫ్లాట్ వ్యవహారాలను తానే చూస్తుంటానని అక్రమంగా ఫ్లాట్లోకి చొరబడ్డ ఉదయ్కిరణ్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉదయ్ కిరణ్ బయోపిక్పై క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్ల క్రేజ్ కనిపిస్తోంది. మహానటి సక్సెస్తో మరిన్ని జీవితగాథలను వెండితెరపై తెరకెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే గత రెండు రోజులుగా ఆసక్తికర కథనాలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. దివంగత నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతుందని, దీనికి తేజ దర్శకత్వం వహించబోతున్నాడని, ‘కాబోయిన అల్లుడు’ అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశాడని ఆ కథనాల సారాంశం. అయితే ఆ వార్తలపై ఎట్టకేలకు దర్శకుడు తేజ స్పందించారు. ఉదయ్ కిరణ్ బయోపిక్ను తాను తీయట్లేదని, అదంతా రూమర్ అని ఆయన నవ్వేశారు. దీంతో పుకార్లకు పుల్స్టాప్ పడినట్లైంది. ఉదయ్ కిరణ్ కెరీర్కు తేజ సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన చిత్రం తీయబోతున్నాడంటూ కథనాలు అల్లేశారు. అయితే తన తర్వాతి చిత్రం మాత్రం యాక్షన్ బ్యాక్ డ్రాప్లోనే ఉండబోతుందని తేజ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి అర్థంతరంగా తప్పుకున్న తేజ.. దగ్గుబాటి రానాతో తేజ యుద్ధ నేపథ్యంలో ఓ చిత్రం ఫ్లాన్ చేస్తున్నాడంటూ ఆ మధ్య ఓ టాక్ వినిపించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి హీరో ఉదయ్ కిరణ్
పబ్పై దాడి కేసులో అరెస్టయిన 'ఫేస్బుక్' సినిమా హీరో ఉదయ్కిరణ్ను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో.. వెంటనే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని జడ్జి ఆదేశించారు. చంచల్గూడ జైల్లో ఉన్న ఉదయ్కిరణ్ బుధవారం కోర్టులో విచారణకు హాజరయ్యాడు. అయితే విచారణ సందర్భంగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా అతడు రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నాడని జైలు అధికారులు తెలిపారు. దాంతో వెంటనే అతడిని మానసిక వైద్యులకు చూపించి.. వారి నుంచి సమగ్ర నివేదిక తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. తనను పబ్లోకి అనుమతించడం లేదన్న ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి, లోపల నగ్నంగా నృత్యాలు చేసిన కేసులో ఉదయ్కిరణ్ను జూబ్లీహిల్స్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. మార్చి 23వ తేదీ రాత్రి అతడు ఓవర్ ద మూన్ పబ్కి వెళ్లగా.. గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు. దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు విసిరేసి బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఉదయ్కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు. -
పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు...?
హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ శాసన సభ హక్కులను కాలరాస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లజ్జగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నా ప్రశ్నించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు నోరు పెగలడం లేదని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్లో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించేవాడు ప్రశ్నగా మారితే జనం తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలన్నారు. సినిమా డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ జనాలకు చేసేదేమీ లేదని, అభిమానాన్ని ఆసరాగా తీసుకొని యువతను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఆయనది నిలకడ లేని మనస్తత్వమని ఎప్పుడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదన్నారు. అభిమానులను మోసం చేస్తే వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏపీలో ప్రజలు అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నా.. పవన్ ఒక్కదానిపై కూడా పోరాడలేదన్నారు. సమావేశంలో నాయకులు రాంచందర్, కామాచార్యులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
యువ హీరో ఉదయ్కిరణ్ కు రిమాండ్
జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటలో ఓవర్ ద మూన్ పబ్లోకి అనుమతించడం లేదని ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి పబ్లోకి వెళ్లి .. నగ్నంగా నృత్యాలు చేసిన కేసులో అరెస్టైన యువనటుడు నేమూరి ఉదయ్కిరణ్ను జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఈ నెల 23వ తేదీన రాత్రి ఓవర్ ద మూన్ పబ్కి వచ్చిన ఉదయ్కిరణ్ను గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు. దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు ఎత్తివేసి భీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్ లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఉదయ్కిరణ్ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. విచారణలో ఉదయ్ కిరణ్ గత చరిత్రంతా నేరాలమయమేనని తేలింది. ఇటీవలనే జూబ్లీహిల్స్లోని ఎయిర్పబ్ దగ్గర పిస్టల్తో సన్నిహితుడిపై దాడికి దిగాడు. మాదాపూర్లో నిర్భయచట్టం కింద అరెస్టు అయ్యాడు. కాకినాడ టూ టౌన్ పోలీస్స్టేషన్లో సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని ఓ మహిళను నమ్మించి ఆమె కూతురితో స్నేహం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో అరెస్టు అయ్యాడు. కాకినాడలోని జీఆర్పీ బార్లో కూడా గొడవ చేసిన ఘటనలో జైలుకు వెళ్లాడు. సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలోను క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తేలింది. అంతేకాదు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి స్నేహితులు, బంధువుల ఖరీదైన కార్లను అరువు తీసుకునే వాడని.. తిరిగి ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టేవాడని తెలిసింది. కాగా..ఉదయ్ కిరణ్ తల్లి నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్గా పని చేస్తున్నారు. ఫ్రెండ్స్బుక్, పరారే సినిమాల్లో హీరోగా నటించిన ఉదయ్కిరణ్ డ్రగ్స్ కేసులోనూ గతంలో పట్టుబడి జైలు జీవితం అనుభవించాడు. మోసాలకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తూ జల్సాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. -
టాలీవుడ్ హీరో అరెస్టు
బంజారాహిల్స్: పబ్లోకి రానివ్వలేదని అద్దాలు ధ్వంసం చేసి.. సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి బీభత్సం సృష్టించిన యువ హీరోను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మాదాపూర్లో ఉండే యువ హీరో ఉదయ్కిరణ్ (ఫ్రెండ్స్బుక్, పరారే ఫేం) బుధవారం రాత్రి 11.30కి జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో ఉన్న ఓవర్ ద మూన్ పబ్కు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో సెక్యూరిటీ గార్డులు ఉదయ్కిరణ్ను అనుమతించలేదు. దీంతో అతను ‘నేను హీరోని, నన్నే అనుమతించరా.. అంటూ సెక్యూరిటీ గార్డులతో వాగ్వాదానికి దిగి అద్దాలు ధ్వంసం చేసి లోనికి తీసుకెళ్లి మద్యం సీసాలు పగులగొట్టి, కుర్చీలు ఎత్తేశాడు. దీంతో పబ్లో ఉన్న కస్టమర్లు భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరుగుతీశారు. సెక్యూరిటీ గార్డులనుంచి తప్పించుకొని ఉదయ్కిరణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పబ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉదయ్కిరణ్ డ్రగ్స్ కేసులో మరో కథానాయకుడి సోదరుడు, నైజీరియన్లతో కలిసి పట్టుబడ్డాడు. తాజాగా మూడు నెలల క్రితం కాకినాడ టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు ఉదయ్కిరణ్పై రౌడీషీట్ తెరిచారు. అంతేకాకుండా పంజగుట్ట పీఎస్ పరిధిలోని ఓ బార్బర్ షాపులో దాడి ఘటనలో ఇతనిపై కేసు నమోదైంది. సీసీఎస్లో కూడా ఇతనిపై మరో కేసు ఉంది. వీటికి తోడు ఇటీవల మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోనూ ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుడిగా ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. కాగా రాత్రి దసపల్లా హోటల్లో బీభత్సం సృష్టించినందుకు ఉదయ్కిరణ్పై న్యూసెన్స్ కేసుతో పాటు సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడినందుకు కేసులు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ సామల వెంకట్రెడ్డి తెలిపారు. ఉదయ్కిరణ్ పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించాడని ఇన్స్పెక్టర్ చెప్పారు. -
నీకు నేను... నాకు నువ్వు...
సినిమా వెనుక స్టోరీ - 34 తేజ... తేజ... తేజ... ఎక్కడ విన్నా ఇదే పేరు. 40 లక్షల్లో ‘చిత్రం’ తీసి 9 కోట్లకు పైగా రాబట్టడమంటే ఇప్పటి ట్రెండ్లో నిజంగా చిత్రం భళారే విచిత్రమే! అప్పటి వరకూ కెమెరామ్యాన్గా ఉన్నవాడు ‘చిత్రం’తో ఒక్కసారిగా ఫేమస్ అయి పోయాడు. నిర్మాతలు ఎగబడ్డారు. తేజ కొంచెం చిత్రమైన మనిషి. రెమ్యునరేషన్ కన్నా ముందు మనిషి నచ్చాలి. మనిషి నచ్చితేనే సినిమా చేస్తాడు. అలా ఇద్దరికి గ్రీన్సిగ్నలిచ్చాడు. ఒకరు - సుంకర మధుమురళి, ఇంకొకరు - ‘జెమినీ’ కిరణ్. మధుమురళి బ్యానర్లో జగపతిబాబు హీరోగా ‘ఫ్యామిలీ సర్కస్’కు ప్లానింగ్ జరుగుతోంది. ఇటు ‘జెమినీ’ కిరణ్ సంస్థలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా చేయాలి. వెంకటేశ్కు కథ చెప్పి వచ్చాడు తేజ. ఆయన ‘ఎస్’ చెప్పలేదు. ‘నో’ చెప్పలేదు. కానీ పనులు ఆపలేదు తేజ. మ్యూజిక్ డెరైక్టర్ ఆర్.పి.పట్నా యక్, లిరిక్ రైటర్ కులశేఖర్కు సిట్యు యేషన్స్ చెప్పి రెండు పాటలు కూడా రెడీ చేయించేశాడు. అదిరిపోయేలా వచ్చాయి. ఒకటేమో ఫోక్ సాంగ్. ‘గాజువాక పిల్లా... మేం గాజులోళ్లం కాదా’, ఇంకొకటి డ్యూయెట్... ‘తుమ్మెదా... ఓ తుమ్మెదా’. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కానీ, వెంకటేశ్ ఏం తేల్చడం లేదు. ఆయన స్టూడియోకెళ్లాడు తేజ. అక్కడ సెట్వర్క్ జరుగుతోంది. వెంకటేశ్ కొత్త సినిమా కోసమట. విజయ్భాస్కర్ డెరైక్షన్లో ‘నువ్వు నాకు నచ్చావ్’ చేస్తున్నారట. తేజకు క్లారిటీ వచ్చేసింది. ఇక తన సినిమా ఉండదు. కారెక్కాడు. కారు స్పీడ్గా ఫిల్మ్నగర్ డౌన్ రోడ్డులోకి దూసుకెళ్తోంది. తేజ మైండ్ కూడా స్పీడ్గా ఆలోచిస్తోంది. సడెన్ బ్రేక్. ఎదురుగా గొర్రెల మంద. ఓ అమ్మాయి వాటిని అదిలిస్తూ రోడ్డు దాటుతోంది. అటుపక్క కాస్ట్లీ కారులో కూర్చున్న ఓ అబ్బాయి చాలా అసహ నంగా ఈ అమ్మాయివైపు చూస్తున్నాడు. ఆమె కంగారుగా గొర్రెలను పక్కకు తరిమేసింది. కారు ముందుకెళ్లిపోయింది. ఆఫీసులో అడుగుపెట్టాడు తేజ. బాగా ఆకలి వేస్తోంది. ఆఫీస్బాయ్ పెట్టే లోపు తనే వడ్డించేసుకుని తినేశాడు. ఇంతలో ‘జెమినీ’ కిరణ్ వచ్చాడు. ‘‘ఓ పావుగంటలో మీకో కథ చెబుతా. మీకు నచ్చితే దానితోనే సినిమా తీద్దాం. ఇక వెంకటేశ్ ప్రాజెక్టు ఉండనట్టే’’ అని చెప్పేశాడు తేజ. లంచ్ కంప్లీటయ్యాక, ఆ టేబుల్ మీదే తలవాల్చుకుని పావుగంట కునుకు తీశాడు. తర్వాత కిరణ్ రూమ్లో కెళ్లి కథ చెప్పడం మొదలుపెట్టాడు. గొర్రెలు కాసుకునేవాడి కూతురు హీరోయిన్. కృష్ణా ఒబెరాయ్ లాంటి రిచెస్ట్ మ్యాన్ కొడుకు హీరో. వాళ్లిద్దరి మధ్యనా లవ్స్టోరీ. సీన్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేసేశాడు. ‘జెమినీ’ కిరణ్ ఫ్లాట్. ‘‘ఇంతకూ ఈ సినిమాలో ‘గాజువాక పిల్లా’ పాట ఉంటుందా? లేదా?’’ ఆసక్తిగా అడిగాడు కిరణ్. తేజ నవ్వుతూ ఏదో చెప్ప బోయాడు. కిరణ్ మధ్యలోనే కల్పించుకుని, ‘‘ఎల్లుండే ఓపెనింగ్ పెట్టేద్దాం. చాలా మంచి ముహూర్తం ఉంది. మిగతా విషయాలు తర్వాత ప్లాన్ చేద్దాం’’ అని చెప్పేశాడు. ఆ రోజు జనవరి 2. అసోసియేట్ డెరైక్టర్ దశరథ్తో కూర్చుని తేజ చకచకా స్క్రిప్టు రెడీ చేసేశాడు. సినిమా పేరు ‘నువ్వు - నేను’. జనవరి 4నే షూటింగ్ స్టార్ట్. హీరో లేడు. హీరోయిన్ ఎవరో తెలియదు. ఫస్ట్డే... తనికెళ్ల భరణి, ‘తెలంగాణ’ శకుంతలపై సీన్స్ షూట్ చేసేశారు. ఆ తర్వాత రోజూ కొన్ని షాట్స్ తీశారు. ఇప్పుడు హీరో హీరోయిన్ల కోసం వేట మొదలైంది. సుమంత్ను కలిశాడు తేజ. వర్కవుటయ్యే పరిస్థితి లేదు. మాధవన్ని అడిగితే తెలుగు సినిమాలు చేయనంటాడు. తేజలో అసహనం. ఆ టైమ్లో ఉదయ్కిరణ్ వచ్చాడు ఆఫీసుకి. రోజూ వచ్చి తేజను కలిసి వెళ్తూంటా డతను. ‘చిత్రం’తో తనను హీరోను చేసిన తేజ అంటే ఉదయ్కిరణ్కు విపరీతమైన గౌరవం. ఏ సినిమా చేయాలో... ఎవరి దగ్గర కథ వినాలో... ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలో... ఏదైనా తేజ చెబితేనే వింటాడు. తేజ చెప్పడంతోనే తన సెకెండ్ సినిమా డేట్లు ‘నిధి’ ప్రసాద్కిచ్చాడు. ఆయన డెరైక్షన్లో ‘హోలీ’ చేయాలి. తేజ ఎదురుగా భక్తిభావంతో కూర్చున్నాడు ఉదయ్కిరణ్. నవ్వుతూ గలగలా మాట్లాడే తేజ, ఆ రోజెందుకో ముభావంగా ఉన్నాడు. మూడ్ బాలేదని అర్థమైంది. అందుకే ఉదయ్కిరణ్ కూడా కామ్గా ఉన్నాడు. కాసేపటి తర్వాత తేజ అన్నాడు. ‘‘ఉదయ్! జిమ్ బాగా చేసి బాడీ పెంచు. ‘నువ్వు - నేను’ నీతోనే చేస్తున్నా.’’ ఉదయ్కిరణ్కి సెకెండ్ టైమ్ కూడా బంపర్ లాటరీ కొట్టేసిన ఫీలింగ్. ‘నువ్వు - నేను’ హోల్డ్లో పెట్టి ‘ఫ్యామిలీ సర్కస్’ కంప్లీట్ చేస్తున్నాడు తేజ. వాళ్లేమో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. హడావిడిగా ఆ వర్క్ పూర్తి చేసేశాడు. తీరా సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. తేజ కూడా ‘సెకెండ్ ఫిల్మ్ సిండ్రోమ్’ని తప్పించుకోలేకపోయాడు. మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ తగ్గిపోలేదు కానీ, తేజలోనే ఏదో ఫీలింగ్. ఒక రకమైన కసి. ‘నువ్వు - నేను’ని బ్లాక్బస్టర్ చేయాలి. ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు తేజ. హీరోయిన్ సెలెక్షన్. ముంబై నుంచి అమ్మాయిలొచ్చారు. ఒకమ్మాయి బాగుంది. కాన్ఫిడెంట్గా ఉంది. ఈ సినిమాకు తనే దిక్కు అని అర్థమైపోయి నట్టుంది. ఫోజు కొడుతోంది. ఫైవ్స్టార్ హోటల్లో రూమ్ కావాలి.... ఇంతమంది అసిస్టెంట్స్ ఉండాలి... ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ టికెట్ కావాలి అంటూ డిమాండ్స్. తేజకు చిర్రెత్తుకొచ్చింది. మిగతా అమ్మాయిలందర్నీ చూపించి, ‘‘నీ దృష్టిలో వాళ్లల్లో లీస్ట్ ఎవరు?’’ అనడిగాడు. ఆమె ఆశ్చర్యపోతూ చాలా క్యాజువల్గా ఒకమ్మాయి వైపు వేలు చూపించింది. ‘‘నువ్వింక వెళ్లొచ్చు. నా సినిమాలో ఆ అమ్మాయే హీరోయిన్’’ అని తేజ చెప్పే సరికి, ఆమె షాకైపోయింది. అలా అనిత హీరోయిన్గా సెలెక్టయిపోయింది. హైదరాబాద్లోనే మ్యాగ్జిమమ్ షూటింగ్. ముంబై, వికారాబాద్ అడవుల్లో కొంత షూటింగ్ చేశారు. ఎమ్మెస్ నారాయణది కీ రోల్! ధర్మవరపు సుబ్ర హ్మణ్యంది చిన్న క్యారెక్టర్! కానీ రోజూ లొకేషన్కొచ్చి తేజతో కూర్చునేవాడు. ఇద్దరూ జోక్స్ చెప్పుకుంటుండేవారు. ఆయనలోని కామెడీ టింజ్కి తేజ ఫ్యాన్ అయిపోయాడు. అక్కడేమో ఎమ్మెస్ ఫుల్ బిజీ. కాల్షీట్లు కూడా టైట్. దాంతో, ఎమ్మెస్ క్యారెక్టర్ తగ్గించేసి, ధర్మవరపుది పెంచేశాడు. శోభన్బాబు రింగ్లా క్రాఫ్ సెట్ చేసి, ధర్మవరపు రోల్లో బాగా ఎంటర్టైన్మెంట్ చేర్చేశాడు. ‘తెలంగాణ’ శకుంతలది ఫుల్ నెగిటివ్ పాత్ర. ఆమె ఇంతకు ముందు అలాంటివి చేయలేదు. ఎంతవరకూ పండుతుందోనని తేజకే డౌట్. అందుకే ఆమెను పక్కన పెట్టేసి, ‘బెంగళూరు’ పద్మను పిలిపిం చాడు. ఆమెతో ఒకరోజు షూటింగ్ కూడా చేసేశాడు. ఇది తెలిసి తనికెళ్ల భరణి ఫీలైపోయారు. తేజతో ఆయనకు బాగా చనువు. ‘‘ఆమె సీనియర్ ఆర్టిస్ట్. పైగా డ్రామాల నుంచి వచ్చింది. ఇలా పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు’’ అని చెప్పారు భరణి. తేజ ఇంకేం మాట్లాడలేదు. తర్వాతి రోజు మళ్లీ ‘తెలంగాణ’ శకుంతల రంగంలోకి దిగారు. పరుచూరి రఘుబాబు నాటకోత్సవాల్లో సూటూ బూటూ వేసుకుని నటించిన వైజాగ్ ప్రసాద్ను హీరో తండ్రి పాత్రకి తీసుకున్నారు. చాలామంది ఇది రాంగ్ డెసిషన్ అన్నారు. తేజ వినలేదు. ఈ సినిమాలో 11 పాటలు. అన్ని అంటే చాలా కష్టం. తేజ మాత్రం అలాంటి లెక్కలు పెట్టుకోలేదు. పాటలు బాగుంటే.. కథలో ఇమిడిపోతే.. ప్రేక్షకుడు ఎన్నయినా పట్టించుకోడనేది తేజ సిద్ధాంతం. వెంకటేశ్ స్క్రిప్టు కోసం చేసిన రెండు పాటలూ ఇందులోకి షిఫ్ట్ చేశారు. ‘గాజువాక పిల్లా...’ యాజ్టీజ్. ‘తుమ్మెదా...’ పాటకు మాత్రం లిరిక్స్ మార్చేసి ‘ప్రియతమా... ఓ ప్రియతమా...’ అని సెట్ చేశారు. ‘గాజువాక పిల్లా’ అవుట్పుట్ సరిగ్గా రాలేదని మూడుసార్లు రీషూట్ చేశారు. ‘నా గుండెలో నీవుండి పోవా’ పాట పూర్తయిన రెండు నిమిషాల గ్యాప్కే ‘నాకు నువ్వు నీకు నేను’ అంటూ చిన్న సాంగ్ బిట్ పెట్టారు. ఇలా వెంట వెంటనే పాటలంటే ఓ రకంగా రిస్కే. కానీ తేజ మంచి ఫ్లోలో ఉన్నాడు. ట్రాక్ తప్పుతాడని అనిపించడం లేదు. వైజాగ్ ప్రసాద్ తన కొడుకుని, తన ప్రియురాలి కూతురుకిచ్చి పెళ్లి చేయాలనే ప్రపోజల్ సీన్కు ఆర్.పి., కులశేఖర్ బాగా అపోజ్ చేశారు. తేజ వినే మూడ్లో లేడు. కోటీ 63 లక్షలతో సినిమా రెడీ. ఎవ రికీ ఎలాంటి హోప్సూ లేవు. ఈ సినిమా హిట్టయితేనే తేజ ఉంటాడు. లేకపోతే అవుట్. అయినా తేజ టెన్షన్ పడలేదు. ఈ సినిమాతో మళ్లీ హిట్ సాధిస్తున్నానని మనస్సాక్షి ముందే చెప్పేసింది. ఫస్ట్డే మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్. ఎక్కడ చూసినా యూత్. థియేటర్లన్నీ కాలేజీ క్యాంపసుల్లా మారిపోయిన ఫీలింగ్. ఇప్పుడు తేజ స్టార్ డెరైక్టర్... ఉదయ్ కిరణ్ స్టార్ హీరో... ధర్మవరపు స్టార్ కమెడియన్... ఆర్.పి.పట్నాయక్ స్టార్ మ్యూజిక్ డెరైక్టర్. సినిమా ఎంత హిట్టయ్యిందో, పాటలూ అంతకన్నా హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘గాజువాక పిల్లా’ ఒక ఊపు ఊపేసింది. ‘నువ్వు యూత్ ఏంట్రా’, ‘మూసుకు కూర్చోరా పూలచొక్కా’, ‘మీ పెద్దోళ్లున్నారే’ లాంటి డైలాగులు బాగా పేలాయి. చాలా సాదా సీదా ప్రేమకథను టైట్ స్క్రీన్ప్లేతో, ఎమోషనల్ డెప్త్తో తేజ బాగా మేనేజ్ చేశాడు. మేజిక్ చేశాడు. 21 కోట్ల వరకూ కలెక్ట్ చేసిందీ సినిమా. మళ్లీ కాలేజీ సినిమాలు, లవ్స్టోరీల హవా మొదలైంది. తేజ కూడా ఇంకో లవ్స్టోరీ పనిలో ఉన్నాడు. ఓ కొత్తబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఘనవి‘జయం’ సాధించాలి. తేజ నిజంగా తలచుకుంటే ఏదైనా సాధించగలడు! * ఐదారు సీన్స్లో ఉదయ్కిరణ్ డబ్బింగ్ నచ్చక, మళ్లీ రీ-డబ్ చేయించా లనుకున్నారు. కానీ అతను ‘మనసంతా నువ్వే’ షూటింగ్లో బిజీ కావడంతో అలానే ఉంచేశారు. * క్లైమాక్స్లో వచ్చే ‘చినుకు చినుకు’ పాటను చివరి నిమిషంలో యాడ్ చేశారు. మిక్సింగ్ టైమ్లో తేజ అక్కడో పాట పెడితే బావుంటుందనుకున్నారు. అప్పటికప్పుడు కులశేఖర్తో పాట రాయించి పెట్టేశారు. * హిందీలో తుషార్ కపూర్తో ‘యే దిల్’ పేరుతో రీమేక్ చేశారు తేజ. -
ఉదయ్కిరణ్ సినిమా విడుదలపై కోర్టు స్టే
దివంగత టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన చిట్టచివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'కు కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. సినిమా విడుదలను ఆపాలంటూ సిటీ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది. 'నువ్వునేను' సినిమా హీరోయిన్ అనిత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. మోహన్ ఎల్లార్కే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మున్నా నిర్మాత. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమాను పెద్ద హిట్ చేసి ఉదయ్ కిరణ్కి నివాళి ఇవ్వాలనుకుంటున్నట్లు ఆ టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు అన్నారు. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాత, దర్శకుడు భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో దీనికి కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పుడు చిత్ర విడుదల అనుమానంలో పడింది. -
ఉదయ్కిరణ్ ఆఖరి కథ!
‘చిత్రం’ సినిమాతో కథానాయకునిగా రంగప్రవేశం చేసిన ఉదయ్కిరణ్ నటించిన చివరి చిత్రం ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’. ఉదయ్ నటించిన తొలి చిత్రం జూన్లోనే విడుదల కాగా, ఈ చివరి చిత్రం కూడా ఇదే నెలలోనే విడుదల కానుంది. ఈ నెల 26న ఉదయ్కిరణ్ జయంతి. ఆ సందర్భంగా ఉదయ్ అభిమానుల కోసం ‘చిత్రం చెప్పిన కథ’ను విడుదల చేయాలని ఆ చిత్రనిర్మాత మున్నా చాంద్గారి అనుకుంటున్నారు. ఉదయ్ కిరణ్ హీరోగా డింపుల్, మదాలసా శర్మ, గరిమ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మోహన్ ఎ.యల్.ఆర్.కె. దర్శకుడు. మున్నా కాశీ పాటలు స్వరపరిచారు. నిర్మాతగా తన మొదటి సినిమా ఉదయ్ కిరణ్కి చివరి సినిమా అవుతుందనుకోలేదని మున్నా అన్నారు. ఆయన గతంలో ఉదయ్కి మేనేజర్గా వ్యవహరించేవారు. ఉదయ్ కిరణ్తో సినిమా చేసిన అనుభవాన్ని మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ప్లే-మాటలు: అమరనేని నరేశ్. -
‘చిత్రం చెప్పిన కథ’ స్టిల్స్
-
వైఎస్ జగన్తో బీసీ నాయకుడు ఉదయ్ భేటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ కలిశారు. సోమవారం సాయంత్రం లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కార్యాయంలో ఉదయ్ కిరణ్ .. వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. ఈ నెల 29న శ్రీకాళహస్తిలో బీసీ సమస్యలపై నిరాహార దీక్ష చేయనున్నట్టు ఉదయ్ కిరణ్ చెప్పారు. చంద్రబాబు సర్కార్ బీసీలను విస్మరించిందని, బీసీల సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. -
వైఎస్ జగన్ దీక్షకు బీసీల మద్దతు: ఉదయ్ కిరణ్
అనంతపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు బీసీలంతా మద్దతు తెలపాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు బేరంగుల ఉదయ్ కిరణ్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో బీసీ వర్గీకరణ చేపడతానని చెప్పి అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటతప్పారని ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. -
' బీసీలకు ద్రోహం చేస్తున్న బాబు, కృష్ణయ్య '
అనంతపురం: సీఎం చంద్రబాబు, ఆర్.కృష్ణయ్యలు బీసీలకు ద్రోహం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.ఉదయకిరణ్ ఆరోపించారు. సోమవారం అనంతపురంలో ఉదయకిరణ్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు చంద్రబాబు బీసీలకు వరాలిచ్చి.. సీఎం అయి ఆరు నెలలైనా ఒక్కటీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. వాల్మీకులను ఎస్టీ కులాల జాబితాలో ఎందుకు చేర్చలేదని చంద్రబాబును ప్రశ్నించారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అడ్డంకిగా మారిన 101 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉదయకిరణ్ విజ్ఞప్తి చేశారు. -
వీడిన ఉదయ్కిరణ్ హత్యకేసు మిస్టరీ
-
వీడిన ఉదయ్కిరణ్ హత్యకేసు మిస్టరీ
హయత్నగర్ సమీపంలోని బాటసింగారంలో ఉదయ్ కిరణ్ అనే బాలుడిని కిడ్నాప్ చేసి, హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ఉదయ్ కిరణ్ ఇంటికి సమీపంలోనే ఉండే నవీన్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. డబ్బు కోసమే అతడీ పనిచేసినట్లు తెలిసింది. కేసు వివరాలను డీసీపీ రవివర్మ మీడియాకు తెలిపారు. ఉదయ్ కిరణ్ను కిడ్నాప్ చేసిన నవీన్.. అతడిని దూరంగా ఉన్న ప్రాంతానికి మోటారుసైకిల్పై తీసుకెళ్లాడు. తీరా అక్కడ పరిస్థితి ఇబ్బందిగా మారడంతో బాలుడి పీక నులిమి చంపేసి, బండరాయి కట్టి మన్సూరాబాద్ చెరువులో పారేశాడు. పుస్తకాల బ్యాగును కూడా పారేశాడు. బాబు ఐడెంటిటీ కార్డు అక్కడకు సమీపంలో కనిపిస్తే అనుమానిస్తారని దాన్ని వేరేచోట దాచాడు. చివరకు భయంతో సరూర్నగర్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. నవీన్తో పాటు అతడికి సహకరించిన ఉపేందర్, నర్సింహ, నవీన్కుమార్ అనే ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లలో నవీన్ కుమార్ మాజీ హోంగార్డు. మూడు నెలల పాటు అతడు హోంగార్డుగా పనిచేసినట్లు తెలిసింది. నలుగురిలో ఎవరికీ ఇంతకుముందు నేరచరిత్ర లేదని, తనకు సహకరించినందుకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఇస్తానని మాట ఇచ్చాడని కూడా పోలీసులు తెలిపారు. -
పెదనాన్న కొడుకే దారుణానికి పాల్పడ్డాడు
* బంధువులే యమపాశాలుగా మారుతున్నారు *మొన్న ఆరాధ్య.... తాజాగా ఉదయ్ కిరణ్ హైదరాబాద్: అయినవారే వారి.. పాలిట మృత్యువుగా మారుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారి ఆరాధ్య ఉదంతం మరవక ముందే ...అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. ఒకరేమో భార్యతో సన్నిహితంగా ఉండేందుకు చిన్నారి అడ్డు వస్తుందని బాబాయి పాశవికంగా చంపి పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తే...మరొకరు డబ్బు కోసం సోదరుడినే స్నేహితులతో కలిసి హతమార్చారు. బాటసింగారంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్ను హతమార్చింది కూడా స్వయానా పెదనాన్న కొడుకే. వివరాల్లోకి వెళితే బాటసింగారం బిల్కలెక్టర్ పెంటయ్య కుమారుడు ఉదయ్కిరణ్. పెద్దఅంబర్పేట్లోని రాజాశ్రీ విద్యామందిర్లో ఏడో తరగతి చదువుతున్నాడు. నిన్న స్కూల్కు వెళ్లిన ఉదయ్ కిడ్నాప్కు గురయ్యాడు. పెంటయ్య అన్న కొడుకు, మాజీ హోం గార్డు నవీన్తో పాటు మరో నలుగురు డబ్బు కోసం కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వనస్థలిపురం చెరువుకట్ట వద్ద విద్యార్థి మృతదేహం బయటపడింది. నిందితులు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఉదయ్కిరణ్ తమను గుర్తు పట్టేయడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడుతుందని భయపడి అతడిని గొంతు నులిమి, హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే ఉదయకిరణ్ దారుణహత్య
-
కిడ్నాపైన ఉదయకిరణ్ దారుణహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం బాటసింగారంలో ఓ దారుణం చోటుచేసుకుంది. 7వ తరగతి చదువుతున్న ఉదయ్ కిరణ్ అనే విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. కిడ్నిప్ చేసిన దుండగులు విద్యార్థిని గొంతు నులుమి హత్య చేశారు. బుధవారం నుంచి కనిపించకుండా పోయిన ఉదయ్ వనస్థలిపురం చింతలకుంట చెరువులో శవమై తేలాడు. రంగంలోకి దిగిన సరూర్ నగర్ పోలీసులు మాజీ హోంగార్డుతోపాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ తగదాలే కారణమని పోలీసులు తెలిపారు. విద్యార్థి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు స్నేహితులను, బంధవులను ఆరా తీశారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఉదయ్ కిరణ్ మృతిపై వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో ఉదయ్కిర ణ్ ఊపిరాడక మృతి చెందాడని, అంతకు ముందు అతడు మ ద్యం తాగాడని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నివేది క వెల్లడించింది. బంజారాహిల్స్ పోలీసులకు ఈ నివేదిక బుధవారం చేరింది. జనవరి 5న ఉదయ్కిరణ్ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం సమయంలో విస్రాను భద్రపర్చి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ల్యాబ్కు పంపించారు. సుదీర్ఘకాలం తరువాత ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఉదయ్కిరణ్ మరణానికి గల కారణాలు కూడా వెల్లడయ్యాయి. చిత్ర పరిశ్రమలో ఎదగలేకపోతున్నాననే మానసిక ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని దర్యాప్తులో తేలింది. గతంలో కూడా రెండుమూడ్లు సార్లు ఆత్మహత్యకు యత్నించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అనుమానాస్పద మృతి కేసును త్వరలో ఆత్మహత్య కేసుగా మార్చి మూసి వేసే అవకాశాలు ఉన్నాయి. -
ఉదయ్కిరణ్ ఆఖరి చిత్రం ఇదే అంటే బాధగా ఉంది : విషిత
‘‘ఉదయ్కిరణ్ హీరోగా 14 చిత్రాల్లో నటిస్తే, నేను 9 సినిమాలకు పాటలు స్వరపరిచాను. ‘చిత్రం’ సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’తో ముగియడం బాధాకరం. ఈ చిత్రానికి మున్నా కాశీ మంచి పాటలు ఇచ్చి ఉంటారని ఊహిస్తున్నా’’ అని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పారు. ఉదయ్కిరణ్ హీరోగా ఆయన మేనేజర్ మున్నా నిర్మించిన సినిమా ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’. డింపుల్, మదాలసా శర్మ, గరిమ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మోహన్ ఎ.యల్.ఆర్.కె. దర్శకుడు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న మల్టీ డైమన్షన్ వాసు సీడీని ఆవిష్కరించి ఉదయ్కిరణ్ భార్య విషితకు అందజేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు విజయం చేకూర్చి, ఉదయ్కి ఘన నివాళి ఇవ్వాలని కోరుకుంటున్నానని వాసు అన్నారు. ఉదయ్ ఆఖరి చిత్రం ఇదేనంటే చాలా బాధగా ఉందని, నిజజీవితంలోనూ తను హీరో అని విషిత చెప్పారు. ఉదయ్ నటించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్గా నిలిచాయని, ఈ చిత్రం కూడా ఆ కోవలోకి చేరాలనే తపనతో మంచి పాటలు ఇవ్వడానికి ప్రయత్నం చేశానని మున్నా కాశీ అన్నారు. నిర్మాతగా తన మొదటి సినిమా ఉదయ్కి చివరి సినిమా అవుతుందనుకోలేదని మున్నా అన్నారు. ఉదయ్తో సినిమా చేసిన అనుభవాన్ని మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. ఈ ఆడియో వేడుకలో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి, బావ ప్రసన్న కుమార్, వారి కుమారుడు తేజ, కుమార్తె మంజు కూడా పాల్గొన్నారు. -
'ఉదయ్ కిరణ్' చిత్రం చెప్పిన కథ ఆడియో ఆవిష్కరణ
-
చిత్రం చెప్పిన కథ ఆడియో విడుదల
-
రూటు మార్చింది!
‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా’... ఈ పాట వింటే ఉదయ్ కిరణ్ వెంటనే ఎలా గుర్తొస్తాడో, అనిత కూడా అలానే గుర్తొస్తుంది. ముద్దుగా, బొద్దుగా, చిన్న పోనీ టెయిల్ వేసుకుని ఆ సినిమాలో అందరినీ అలరించిందామె. ఆ తర్వాత తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్ వంటి కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ అక్కడ కానీ, ఇక్కడ కానీ సక్సెస్ కాలేకపోయింది. దాంతో తన రూటు మార్చేసింది. సినిమాల మీద ఆశ పెట్టుకోవడం అనవసరం అనుకుందో ఏమోగానీ బుల్లితెర వైపు అడుగులు వేసింది. సీరియల్స్తో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే వెండితెర మీద హీరోయిన్గా కనిపించిన ఆమె, బుల్లితెర మీద మాత్రం విలన్ వేషాలు వేస్తోంది. ‘యే హై మొహొబ్బతే’లో గర్విష్టి అయిన భార్యగా, మమతానురాగాలు తెలియని తల్లిగా, బాంధవ్యాలను సైతం అవసరానికి వాడుకునే స్వార్థపరురాలిగా అద్భుతంగా నటిస్తోంది అనిత. ఈ దెబ్బతో అనిత టీవీ ఇండస్ట్రీలో శాశ్వతంగా జెండా పాతేసేలానే ఉంది మరి! -
ఉదయ్ కిరణ్ స్వీట్ మెమోరీస్
-
చిత్రం చెప్పే కథ
-
ఉదయ్ కిరణ్ పాట పాడిన వీడియో
-
ఉదయ్కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ
చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, నీ స్నేహం... ఉదయ్కిరణ్ని నటునిగా ప్రేక్షకులకు చేరువ చేసిన సినిమాలివి. సముద్రపు అలలా ఉవ్వెత్తున పైకిలేచాడు. తోకచుక్క మాదిరి ఒక్కసారిగా నేల రాలాడు. నిజంగా ఉదయ్ జీవితమే ఒక చిత్రం. తను నటించిన చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’. మోహన్ ఏఎల్ఆర్కే దర్శకుడు. సీహెచ్ మున్నా నిర్మాత. ‘నువ్వు-నేను’ ఫేం అనిత ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గరిమ, డింపుల్, మదాలస శర్మ కథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను హైదరాబాద్లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఉదయ్ మనకు దూరమయ్యారు. తనకు కావల్సినట్టుగా అహర్నిశలూ కష్టపడి ఈ కథను మలుచుకున్నాడు ఉదయ్. ఆయనలోని కొత్తకోణం ఇందులో చూస్తారు. ఒక ప్రత్యేకగీతం, చిన్నప్పటి సన్నివేశాల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం. ఈ నెలాఖరున పాటల్ని, ఏప్రిల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఉదయ్కిరణ్లో ఇప్పటివరకూ చూడని కొత్తకోణం ఇందులో కనిపిస్తుందని, ఆయన అభిమానులకు ఇది గొప్ప కానుకని దర్శకుడు చెప్పారు. ఇది థ్రిల్లర్ చిత్రం కాబట్టి నేపథ్య సంగీతం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోమని ఉదయ్ సూచించారని సంగీత దర్శకుడు మున్నా కాశీ గుర్తు చేసుకున్నారు. ఇంకా మల్టీడైమన్షన్స్ వాసు, టి.ప్రసన్నకుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్, మాటల రచయిత నరేష్ అమరనేని తదితరులు మాట్లాడారు. -
చిత్రం చెప్పిన కథ మూవీ పోస్టర్స్
-
గొప్ప నటులను కోల్పోయాం....
వేటపాలెం : తెలుగు సినీపరిశ్రమ వరుసగా అక్కినేని నాగేశ్వరరావు, శ్రీహరి, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉదయ్ కిరణ్ వంటి గొప్ప నటులను కోల్పోయిందని నటుడు నవదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. వేటపాలం మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ హైస్కూల్లో ఆదివారం ఓ సావనీర్ను ఆవిష్కరించాడు. అనంతరం వేటపాలెంలో సన్నిహితుల ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నవదీప్ మాట్లాడుతూ కేవలం అయిదు నెలల వ్యవధిలో అయిదుగురు మంచి నటులను తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోవడం బాధగా ఉందన్నాడు. తాను సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు పూర్తయిందని, ఇప్పటివరకూ 25 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినట్లు తెలిపాడు. ప్రస్తుతం తాను నటించిన బంగారు కోట, అంతసీన్ లేదు, నటుడు చిత్రాలు రిలీజ్కి సిద్ధంగా ఉండగా, అంతా నీమాయ, పాగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నాడు. తనకు చందమామ, గౌతం, ఆర్య-2 చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలిపాడు. తాను చిన్నతనంలో చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా గడిపినట్లు నవదీప్ గుర్తు చేసుకున్నాడు. -
చుక్కల్లోకెక్కినారు
-
ఉదయ్ ఆత్మశాంతికై క్యాండిల్ లైట్ ర్యాలీ
-
ఉదయ్ని చూశాక డిసైడయ్యాను... గుణపాఠంలా మిగలకూడదని!
సెలబ్రిటీ కాలమ్: వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు ఒక ఉదయం అస్తమించిందన్న వార్తతో తెల్లారింది ఆ రోజు నాకు! ఉదయ్కిరణ్ ఇక లేడని దాని సారాంశం. ఇంగ్లిషు నవలల్లో సీరియల్ కిల్లర్లాంటి వాడెవడో అజ్ఞాతంగా సినిమా పరిశ్రమ మీద పగబట్టి వరుస హత్యలు చేయిస్తున్నట్టు అనిపించింది. అవి చదువుతున్న పాఠకుడిలాగ చెమటలు పట్టి భయం వేసింది. దేవుడైతే దయుంటుంది, దయ్యం అయితే నిర్దయుంటుందని చదివాం కదా! ఇది దేవుడి పని కాదు. విధివంచనతో అనారోగ్యం పాలై తనువు చాలించినవారు ధర్మవరపుగారు, శ్రీహరిగారు, ఏవిఎస్గారు అయితే, మానసిక అనారోగ్యంతో నిజ జీవితాన్ని బాధ్యతారాహిత్యంగా బలి తీసుకున్నవాడు ఉదయ్. నా మొదటి సినిమా ‘మనసంతా నువ్వే’లోను, నా రెండో సినిమా ‘శ్రీరామ్’లోను కథానాయకుడు తను. ‘‘యూ ఆర్ రిచ్ బై ఫ్రెండ్స్ అండీ’’ అనేవాడు నన్ను చూసి. నిజమే. ఫ్రెండ్స్ని మించిన ఆస్తి లేదు. అది లేకే తనీ రోజు నాస్తి అయిపోయాడు. తను చాలా బాగా మాట్లాడేవాడు, అంతకంటే బాగా మర్యాదగా ప్రవర్తించేవాడు. కానీ, స్నేహితుల్ని ఎందుకు కూడగట్టుకోలేకపోయాడో! ‘‘నేను ‘ఇంద్ర’ వందరోజుల ఫంక్షన్కి వెళ్లి, ఆయన అభిమానినని చెప్తే చిరంజీవి అభిమానులందరూ నా సినిమాలకి కూడా వస్తారని మా మేనేజర్ సలహా ఇచ్చారు. అతను చాలా మేధావండీ, మంచి సలహాలిస్తున్నాడు’’ అన్నాడొక రోజు. నేను, నా ఫ్రెండ్ కమ్ కో-డెరైక్టర్ శంకర్ కె. మార్తాండ్ ఉన్నాం. ‘‘జీవితంలో ఎప్పుడూ లెక్కలేసి ఏ పనీ చెయ్యొద్దు ఉదయ్. పైవాడు ఆల్రెడీ కొన్ని లెక్కలు వేసి మనని భూమ్మీదకి పంపాడు. మనం ఆ లెక్కలకి స్టెప్పులెయ్యాలి తప్ప మళ్లీ కొత్తగా లెక్కలెయ్యకూడదు, అలా వేస్తే ఆన్సర్ కచ్చితంగా రాంగవుతుంది’’ అని చెప్పాను. సక్సెస్లో ఉన్నప్పుడు తన దగ్గర చేరి, చెత్త సలహాలిచ్చేవాణ్ని నమ్మాడు. అతడి లెక్కలు తలకెక్కించుకున్నాడు. చివరికి అతని లెక్క తప్పింది. అతన్నుంచి స్ఫూర్తి పొందిన వేలమందికి రాంగ్ ఆన్సరిచ్చి వెళ్లిపోయాడు. సినిమా పరిశ్రమలో సంబంధాలన్నీ తొంభైశాతం అవసరానికే. అందువల్ల సినిమా పరిశ్రమ గురించి అవగాహన లేని ఇంట్లోవాళ్లు అనవసరంలా అనిపిస్తుంటారు అప్పుడప్పుడూ. ఆ అగాథం పెరగకుండా చూసుకోవడం చాలా కష్టం. ఉదయ్ని ఆ అగాథమే ఒంటరివాణ్ని చేసింది. ఆత్మన్యూనతకి గురి చేసి, ఆత్మహత్యకి ప్రేరేపించింది. అతనితో కెరీర్ ప్రారంభంలో మంచి రిలేషన్ ఉన్న నేను, ఎమ్మెస్రాజుగారు, తేజగారు, ఆర్పీపట్నాయక్... అందరం మళ్లీ సక్సెస్ బాట పట్టడానికి పోరాటం చేస్తున్నాం. మాలో ఏ ఒక్కరు సూపర్హిట్ కొట్టినా, అతన్ని కూడా బయటకి లాగేవాళ్లం. మాకన్నా నటుడిగా అతనికి అవకాశాలెక్కువ. టీవీ సీరియల్ చేసినా అవసరాలు గట్టెక్కేస్తాయి. పైగా ఉదయ్ సినిమాల్లో డబ్బు గడించడమే తప్ప, మాలాగా తన డబ్బు పెట్టిన దాఖలాల్లేవు. ఎన్నో అననుకూల పరిస్థితుల్ని మొండిగా ఎదుర్కొన్నవాడు. కనీసం యుద్ధంలో ఓడిపోయి మరణిస్తే వీరుడిగా మర్యాద ఉంటుంది. కానీ శత్రువుకి తలవంచాడు. అదే నచ్చలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, కృష్ణ, శోభన్బాబు, మోహన్బాబు, చిరంజీవి, శ్రీకాంత్, రవితేజ... ఇలా చాలామంది సినిమా పరిశ్రమకు చెందని కుటుంబాల నుంచి వచ్చారు ఉదయ్లాగా. వీరందరూ ఎప్పుడూ సక్సెస్లోనే లేరు. చాలా హిట్లూ ఫ్లాపులూ చూశారు. నాకు తెలిసి పదిమందికి స్ఫూర్తినిచ్చే ఏ లెజెండ్ లేదా సెలెబ్రిటీ లైఫ్ చూసినా... వాళ్ల హిట్లు, ఫ్లాపులు కాదు, అవి రెండూ వచ్చినప్పుడు వాళ్లు పాటించిన మెంటల్ బ్యాలెన్స్ మాత్రమే వాళ్ల సక్సెస్. అది గారడీ వాడు తీగ మీద నడిచిన దానికన్నా కష్టం. ఆ బ్యాలన్స్ తప్పి కిందపడ్డాడు ఉదయ్. నేను సినిమాల్లోకి రాకముందు మా అమ్మగారికి ఆవేశంగా చెప్పాను- ‘‘ఒక రిస్క్ తీసుకుంటానమ్మా... సక్సెస్ అయితే పదిమందికి పాఠంగా నిలబడతాను, ఫెయిలైతే పదిమందికి గుణపాఠంగా నిలబడతాను’’ అని. కానీ, ఉదయ్కిరణ్ని చూశాక కచ్చితంగా డిసైడ్ అయ్యాను, గుణపాఠంగా మిగలకూడదని. స్ఫూర్తి పొంది మొండిగా సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి తను స్ఫూర్తినిచ్చే స్థాయికి ఎదిగాక కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా ఉంటాయి. వాటిని తనకు నేర్పించడానికి ఉదయ్ ఒక గాడ్ఫాదర్ని ఏర్పరచుకోలేకపోయాడు. ఒక ఆత్మీయుణ్ని సంపాదించుకోలేకపోయాడు. ఇది అతని ఫెయిల్యూర్ అనలేను కానీ, అతన్ని ఫెయిల్యూర్ నుంచి కాపాడలేకపోయిన ఫ్యాక్టర్ అని అనుకోగలను. మనసు మరీ బాలేకపోతే తనతో కలిసిపని చేసిన సునీల్తో కాసేపు మాట్లాడినా, సునీల్ ద్వారా త్రివిక్రమ్ని కలిసినా స్వాంతన లభించేది. ఆర్పీతోనో, దశరథ్తోనో ఓ అరగంట స్పెండ్ చేసినా ఉపశమనం కలిగేది. తేజగారి దగ్గరికో, ఎమ్మెస్ రాజు గారి దగ్గరకో వెళ్లి కాసేపు కూర్చున్నా మనశ్శాంతి లభించేది. సీతారామశాస్త్రి గారింటికో, భరణి గారింటికో వెళ్లి కూర్చున్నా జీవనపోరాటం ఎలా చేయాలో అర్థమై ఉండేది. దాసరిగారో, రాఘవేంద్రరావుగారో చెప్పేది కొద్దిసేపు మౌనంగా విన్నా బోలెడంత ఎనర్జీ వచ్చేది. వాళ్లంతా పొగడరు. స్ఫూర్తి కలిగేలా సజెస్టివ్గా తిడతారు. వీళ్లందరినీ ఉదయ్ ఏదో ఒక సందర్భంలో కలిశాడు. కలిసినప్పుడల్లా వాళ్లు తనతో సినిమా చేస్తారా చేయరా అని పరిశీలించుకుని వచ్చేసేవాడే తప్ప వాళ్లతో తను మాట్లాడడం కానీ వాళ్ల మాటలు వినడం కానీ చేయలేదు. సక్సెస్లో ఉన్నప్పుడు సినిమాలు చేయడానికి మనకి మనుషులతో పర్సనల్గా అనుబంధం అక్కర్లేదు. కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మాత్రం అది చాలా అవసరం! ఎవ్వరితోనూ దాన్ని ఏర్పరచుకోలేకపోయాడు ఉదయ్. అదే తను జీవితంలో మిస్సైన విషయం! ఎవ్వరినీ అణగదొక్కేంత సీను పరిశ్రమలో ఎవరికీ లేదు. కానీ, ఎవరైనా మనని ప్రోత్సహించేంత రిలేషన్షిప్ మనకుందా లేదా అన్నది మనకు మనమే చెక్ చేసుకోవాలి. ఇది ఉదయ్కి తెలీలేదు. అనూహ్యమైన సక్సెస్ చిన్నవయసులోనే రావడం, తన జీవితంలో జరిగిన పరిణామాలలో తనే నిర్ణయాలు తీసుకోవడం, అతనికి ఎవరన్నా మంచో, చెడో చెప్పే అవకాశం లేకుండా చేశాయి. ఇతరులతో పోల్చుకోవడం, ప్రతి పని నుంచి/వ్యక్తి నుంచి మనకు అనుకూలంగా ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయడం... ఈ రెండు లక్షణాలూ ఎప్పుడూ మంచివి కావు. అవి ఎవర్నైనా తీవ్రమైన డిప్రెషన్కి గురి చేస్తాయి. అల్లరి నరేష్, శర్వానంద్, తరుణ్, నాని మంచి స్నేహితులు ఉదయ్కి. కానీ వాళ్లతో పోల్చుకోవడం వల్లే ఆత్మన్యూనతకి గురయ్యాడు. వీళ్లంతా ఉదయ్కన్నా ఎక్కువ కష్టపడ్డారు కెరీర్లో. నితిన్కి తండ్రి సపోర్ట్ ఉంది. కానీ నవదీప్ కుటుంబానికి సినిమాలతో సంబంధం లేదు. సినిమాలలో పెట్టుబడులూ లేవు. కానీ అతనికి ఇండస్ట్రీనిండా స్నేహితులే. ఈ ఎనాలిసిస్ అంతా ఉదయ్కి మాటల సందర్భంలో నేను చెప్పిన విషయాలే! ఇది ఇప్పుడు రాయడం వల్ల అతను తిరిగి రాడని తెలుసు. అయితే, ఈ పరిశ్రమలోకి వచ్చే కొత్తవాళ్లల్లో ఏ ఒక్కరైనా ఈ విషయాన్ని తెలుసుకుంటే అంతే చాలు! ఇండస్ట్రీలో సక్సెస్లో ఉన్నవాళ్లకి కూడా అది లేని అనుభవజ్ఞులతో ఏదో ఒక అవసరం వస్తుంటుంది. ఆ అవసరాన్ని క్యాష్ చేసుకుని కొన్నాళ్లు ఓపిగ్గా, స్థిరంగా ఉండాలి మనకి సక్సెస్ వచ్చేవరకూ. ఎప్పుడూ ఒక సినిమా తీసి ప్రూవ్ చేసుకోగలిగే అవకాశాన్ని మిగుల్చుకోవాలి. ఉదయ్ మంచివాడు. అమాయకంగా పరిశ్రమలోకి ఎంటరై, అనూహ్యంగా పెకైదిగాడు. తర్వాత విధి చేతిలో ఒరిగాడు. పెకైగిరాడు. ఈ ప్రస్థానంలో తప్పు పట్టాల్సినదేవన్నా ఉంటే తను తీసుకున్న నిర్ణయాలనే కానీ తనని కాదు. ఆ నిర్ణయాలకి బలవంతుడయ్యిందీ, బలయ్యిందీ కూడా అతనే! ఉదయ్ది ఒక ఉదంతం. ఒక మంచి కుర్రాడిచ్చిన చెడ్డ ఉదాహరణ! జీవితంలో నటిస్తే ఏర్పడే అగాథం ఒంటరితనం. భ్రమలో జీవిస్తే ఏర్పడే ఒంటరితనం అథఃపాతాళం. భగవంతుడు, జాతకం, అదృష్టం, మారుతున్న సమాజం... అన్నీ అందలమెక్కించాయి ఉదయ్ని. మన పక్కింటి కుర్రాణ్నో, మనింట్లో తమ్ముడ్నో చూసినట్టు మురిసిపోయింది అశేషాంధ్ర ప్రజానీకం. అందుకే అతని మరణాన్ని, దాన్ని అతను బలవంతంగా కోరుకున్న నిర్ణయాన్ని అంగీకరించలేకపోయింది. ఎవరినన్నా నొప్పిస్తే మన్నించండి! -
ఉదయ్ లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా: విషిత
దివంగత నటుడు ఉదయ్కిరణ్ సంస్మరణ సభ గురువారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. ఉదయ్కిరణ్ మేనేజర్ మున్నా ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ఉదయ్కిరణ్ భార్య విషిత, తండ్రి మూర్తి, అక్కాబావలు శ్రీదేవి, ప్రసన్న, నటుడు నాని దంపతులు, మల్టీ డైమన్షన్ వాసు, నటి ఢిల్లీ రాజేశ్వరి హాజరయ్యారు. ఈ సభలో ఉదయ్కిరణ్ భార్య విషిత మాట్లాడుతూ... ఒక్కసారిగా కన్నీటిపర్యంతమవ్వడం పలువురి హృదయాల్ని కలచివేసింది. ‘‘ఉదయ్ నా ఊపిరి. ఆయన లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను. రేపు ఎలా గడుస్తుందో తలచుకుంటే భయమేస్తోంది. ఉదయ్కి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. కానీ నిమిషం ఆలోచించలేకపోయాడు’’ అని బాధా తప్త హృదయంతో కన్నీరుమున్నీరయ్యారు విషిత. బాధలో ఉన్న తనకు తన వదిన శ్రీదేవి మోరల్ సపోర్ట్ అందించారని, రేపు ఆమె కూడా వెళ్లిపోతున్నారని విషిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్కిరణ్ అంతిమ యాత్రలో పాల్గొన్న అభిమానులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉదయ్కిరణ్ అక్క శ్రీదేవి మాట్లాడుతూ -‘‘ఉదయ్ చనిపోయిన బాధతో ఓ అభిమాని సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఇలాంటి చర్యలు అభిమానులకు తగదు. ఆ అభిమాని తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’’ అన్నారు. -
అంతులేని కథ!
-
ఉదయ్కిరణ్ను ఒక్కసారే కలిశా: సంగీత
-
ఉదయ్కిరణ్ను ఒక్కసారే కలిశా: సంగీత
* ఆయన మరణానికి నేను కారణం కాదు * నేను డబ్బులిచ్చింది మున్నాకే.. * తెలిసిన వారి దగ్గర రూ.17 లక్షలు వడ్డీకి తెచ్చి ఇచ్చా.. * మున్నా ఆచూకీ కోసం ఉదయ్కిరణ్ ఇంటికి వెళ్లా.. సాక్షి, హైదరాబాద్: సినీనటుడు ఉదయ్కిరణ్ ఆత్మహత్యకు తన వేధింపులే కారణమని వెలువడుతున్న వార్తల్లో వాస్తవం లేదని ఫైనాన్షియర్ సంగీత చెప్పారు. ఉదయ్కిరణ్ను తాను ఒక్కసారే కలిసానని, ఎప్పుడూ డబ్బుల విషయం మాట్లాడలేదని అన్నారు. ఆయన మరణానికి తానెంత మాత్రమూ కారణం కాదని చెప్పారు. ‘వారు పెద్ద వ్యక్తులు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నారుు..’ అని అన్నారు. తాను మున్నాకే డబ్బులు ఇచ్చానని, ఆయనకు సంబంధించిన చెక్కులు, ప్రామిసరీ నోటే తీసుకున్నానని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంగీత ఆదివారం సాక్షితో మాట్లాడారు. వాస్తవానికి తాను ఫైనాన్షియర్ను కాదన్నారు. స్వగ్రామం చిత్తూరు జిల్లా కుప్పంలో చీరల వ్యాపారం చేసే తనకు.. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చినప్పుడు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఉదయ్కిరణ్ మేనేజర్ మున్నా పరిచయమయ్యూడని తెలిపారు. ఐదారు నెలల స్నేహం తర్వాత తాను ఉదయ్కిరణ్తో ఓ సినిమా తీస్తున్నట్టు మున్నా చెప్పాడన్నారు. మీరు ఫైనాన్స్ చేస్తే బావుంటుందనడంతో అంత డబ్బు తన వద్ద లేదన్నానని, మీకు తెలిసిన వారెవరైనా ఉంటే వడ్డీకి ఇచ్చినా పర్వాలేదని చెప్పడంతో.. తెలిసిన ఇద్దరి దగ్గర ఐదారు రూపాయల వడ్డీ చొప్పున రూ.17 లక్షలు తెచ్చి మున్నాకు ఇచ్చినట్లు సంగీత చెప్పారు. సినిమా ప్రారంభం కావడానికి 3 నెలలు పడుతుందని, ఆ తర్వాత ఇస్తానని చెప్పాడన్నారు. సినిమాలో తమ బాబుకు పాత్ర ఇస్తానన్నాడని, కో ప్రొడ్యూసర్గా మీ పేరు వేస్తానని చెప్పినట్లు తెలిపారు. చీరల వ్యాపారం చేస్తున్నారు కాబట్టి సినిమాలో కాస్ట్యూమ్స్ కూడా మీవే వినియోగిస్తామని, తద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందనడంతో అంగీకరించానన్నారు. డబ్బులిస్తున్నప్పుడే ఉదయ్కిరణ్తో ఫోన్లో మాట్లాడి సినిమా తీస్తున్న విషయూన్ని ధ్రువీకరించుకున్నట్లు తెలిపారు. అప్పుడు మున్నానే ఫోన్ కలిపి ఇచ్చాడన్నారు. అరుుతే ఆరు నెలలైనా సినిమా ప్రారంభించకపోవడం, ఫోన్లు చేస్తే మున్నా ఎత్తకపోవడం, పైగా ఆఫీస్ ఎత్తివేశారని తెలియడంతో.. అతని ఆచూకీ కోసం కొద్దిరోజుల క్రితం తొలిసారి ఉదయ్ ఇంటికి వెళ్లినట్లు సంగీత తెలిపారు. వాచ్మన్ చెన్నై వెళ్లారని చెప్పడంతో వెనుదిరిగి వచ్చానని, మళ్లీ గతనెల 21న వెళ్లి ఉదయ్ను కలిశానని వివరించారు. మున్నా డబ్బులకోసం తిరుగుతున్నాడని, మీరు ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే మున్నాకు ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో.. అదే విషయం ఉదయ్కు చెప్పి, మీరైనా విషయం తెలియజేయండి అని కోరి వచ్చేశామన్నారు. -
ఉదయ్ కిరణ్ హామీ సంతకం చేయలేదు: సంగీత
హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సినీహీరో ఉదయ్ కిరణ్ తాను అప్పు ఇచ్చిన ఎటువంటి హామీ పత్రాలపైన సంతకం చేయలేదని ఫైనాన్షియర్ సంగీత స్పష్టం చేశారు. డిసెంబర్లో చివరలో ఉదయ్ని కలిసినట్లు ఆమె చెప్పారు. ఉదయ్ కిరణ్ మాజీ మేనేజర్, ప్రస్తుతం నిర్మాతగా మారిన మున్నా ఆఫీసు మూసేయడంతో ఉదయ్య దగ్గరకు వెళ్లినట్లు ఆమె తెలిపారు. వడ్డీ కట్టలేక తానే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పటి వరకు ఉదయ్ ఇంటికి తాను రెండుసార్లే వెళ్లినట్లు సంగీత తెలిపారు. -
ఏడాదిన్నర ప్రేమించుకున్నాం
-
ఉదయ్కిరణ్ ఆత్మహత్య బాధించింది
ఆత్మహత్య బాధాకరం: హీరో తరుణ్ దివంగత హీరో ఉదయ్కిరణ్ తనకు మంచి మిత్రుడని, అతని మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని హీరో తరుణ్ ఆవేదన చెందారు. శ్రీకాంత్ కలసి ఇక్కడికి వచ్చిన ఆయన తన మనస్సులోని భావాలను విలేకరులతో పంచుకున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదుకాని ఉదయ్కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. మంచి నటుడ్ని తె లుగు సినీ పరిశ్రమ పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. తెలుగు ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే శాసిస్తున్నాయన్న టాక్పై విలేకరులు ప్రస్తావించగా అలాంటిదేమి ఉండదన్నారు. ఎవరూ ఎవర్నీ ఏమీ చేయలేరన్నారు. మన సినిమా బాగుంటే అదే ఆడుతుందన్నారు. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు బాగున్నా ఆడడం లేదన్న విషయంలో కూడా నిజం లేదన్నారు. ఎన్ని చిన్న సినిమాలు బాగా ఆడడం లేదంటూ... ఇటీవల విడుదలై విజ యం సాధించిన కొన్ని చిన్న సినిమాల పేర్లను ఉదహరించారు. చిన్నవి, పెద్దవి అని కాదని లో బడ్జెట్, హై బడ్జెట్ అనేదే చూడాలన్నారు. ఎన్నో లో బడ్జెట్ సినిమాలు బాగా ఆడుతున్నాయన్నారు. సినిమా బాగుం టే ప్రేక్షులు వద్దన్నా వెళ్లతారన్నారు. వారినెవరూ ఆపలేరని చెప్పారు. ప్రస్తుతం వేట, యుద్ధం సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. -
పెళ్లికి ముందు ఉదయ్ కిరణ్, నేను ఏడాదిన్నర ప్రేమించుకున్నాం
సినీ హీరో ఉదయ్ కిరణ్, తాను తమ పెళ్లికి ముందు ఏడాదిన్నర ప్రేమించుకున్నామని ఆయన భార్య విషిత చెప్పారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురించి పోలీసులు మరోసారి విషితను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు వెల్లడించారు. ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి ఆరేళ్లుగా దూరంగా ఉంటున్నారని చెప్పారు. ఉదయ్ కిరణ్కు ఆర్థిక సమస్యలూ ఉన్నాయని విషిత చెప్పారు. ఆయన స్టార్ ఇమేజ్ చట్రంలో ఇరుకున్నారని, దాన్నుంచి బయటపడలేకపోయారని, ప్రతిక్షణం ఇమేజ్ ఆలోచించేవారని తెలిపారు. తెలుగు సినిమబా వందేళ్ల వేడుకకు ఆహ్వానించకపోవడంతో కలత చెందారని విషిత వెల్లడించారు. గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఆ రోజు రాత్రి ఉదయ్ భార్య తన స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఉదయ్ తాను మళ్లీ పార్టీకి వస్తానంటే వెళ్లానని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని విషిత చెప్పారు. -
ఉదయ్ని అనవసరంగా పెళ్ళి చేసుకున్నా:విషిత
-
ఉదయ్.. హీరో చట్రంలో బందీ అయ్యారు!
హైదరాబాద్, న్యూస్లైన్: ఎంతసేపు తాను స్టార్ హీరోనన్న చట్రంలో ఉదయ్ కిరణ్ బిగుసుకుపోయాడని, దాన్నుంచి బయటకు రాలేక తరచూ సతమతమయ్యేవాడని ఆయన భార్య విషిత పోలీసులకు చెప్పారు. సహచర నటులు మాట్లాడకపోవడం, సినీ కార్యక్రమాలకు పిలవకపోవడం, వందేళ్ల సినిమా పండుగకు సైతం ఆహ్వానం అందకపోవడం.. ఇవన్నీ ఉదయ్పై ప్రభావం చూపాయని వివరించారు. పలుచోట్ల విలువైన స్థలాలున్నా వాటిని అమ్మి పరిస్థితులను చక్కదిద్దుకోవడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఉదంతంపై మరింత సమాచారం సేకరించేందుకు బంజారాహిల్స్ పోలీసులు గురువారం మరోమారు విషిత, ఉదయ్ కిరణ్ మాజీ మేనేజర్ మున్నాలను వేర్వేరుగా ప్రశ్నించారు. పోలీసుల సమాచారం మేరకు.. తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు తనకు సినిమా అవకాశాలు లేకుండా చేస్తున్నారని గ్రహించిన ఉదయ్ కిరణ్ వచ్చేనెల 18న భార్య విషితతో కలిసి చెన్నై వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అక్కడ నెలకు రూ.25 వేల అద్దెతో ఓ ఇంటిని తీసుకున్నాడు. 3 నెలల అడ్వాన్స్ కూడా చెల్లించాడు. చెన్నై వెళ్లి తమిళ సినిమావకాశాల కోసం ప్రయత్నించాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విషిత పోలీసులకు తెలిపారు. విచారణలో తాను ఉదయ్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని పలుమార్లు నెత్తి బాదుకున్నారు. కూతురి జీవితం సర్వనాశనమైందంటూ ఆమె తండ్రి కూడా పోలీసుల ముందు వాపోయారు. కాగా, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ సినిమాను ఉదయ్ కిరణ్ హీరోగా నిర్మిస్తున్న మున్నా... సినిమా ఖర్చులకు ఉదయ్ పేరు చెప్పి చాలా మంది వద్ధ అప్పు వసూలు చేసినట్లు తేలింది. సుమారు 12 చోట్ల అప్పులు చేయడంతో వారంతా గత మూడు నాలుగు నెలలుగా ఉదయ్కిరణ్ ఇంటి చుట్టూ తిరిగారు. లిఫ్ట్కు వాడే తాడుతో ఉరి: ఉదయ్ కిరణ్ ఉరేసుకోవడానికి వాడిన తాడు ఎక్కడ్నుంచి వచ్చిందన్న అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేశారు. లిఫ్ట్ పాడైనప్పుడు లేదా ఆగినప్పుడు పైకి లాగేందుకు ఆ తాడును అపార్ట్మెంట్వాసులు వినియోగిస్తున్నట్లు తేలింది. అవసరం లేని సమయంలో ఆ తాడును టైపై ఓ మూలన పడేస్తారు. ఉదయ్ తాను ఉరేసుకోవడానికి ముందు తాడును ఇంట్లోకి తెచ్చుకొని ఉంటాడని పోలీసులు తెలిపారు. తాడు పొడవుగా ఉండడంతో ఉరికి సరిపోయేంత మేర కత్తిరించి, మిగతా తాడును మళ్లీ టైపై వేసి వచ్చినట్లు భావిస్తున్నారు. తొలుత భార్య విషిత చున్నీతో ఉరేసుకోవాలని భావించి, బీరువాలో ఉన్న రెండు చున్నీలను బయటకు తీశాడు. కానీ ఆ రెండు ఫ్యాన్ కొక్కానికి అందకపోవడంతో తాడును వినియోగించినట్లు తెలుస్తోంది. ఉరేసుకునే ముందు ఎలా చనిపోవాలన్న దానిపై కిరణ్ చాలాసేపు తర్జనభర్జన పడ్డట్లు అక్కడ లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ముందుగా చేతి మణికట్టు వద్ద కోసుకొని చనిపోవాలని భావించాడు. కత్తితో మణికట్టు తెంచుకునేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు పోలీసులు చెబుతున్నారు. -
ఆర్థిక ఇబ్బందులూ.. మానసిక వేదనే
ఉదయ్కిరణ్ ఆత్మహత్యకు కారణాలివి! సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పాటు మానసికంగా తీవ్ర వేదనతోనే సినీ నటుడు ఉదయ్కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ వి.సత్యనారాయణ మంగళవారం రాత్రి 9 నుంచి మూడు గంటల ఉదయ్కిరణ్ భార్య విషిత, కుటుంబీకులు, స్నేహితుల్ని వివిధ కోణాల్లో విచారించారు. బుధవారం కూడా కుటుంబీకులతో పాటు మరికొందరిని ప్రశ్నించారు. ఉదయ్కిరణ్ మాజీ మేనేజర్, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ చిత్ర నిర్మాత మున్నాతో పాటు ఆ చిత్రం కోసం రూ. 17 లక్షలు ఉదయ్కిరణ్ ద్వారా మున్నాకు అప్పుగా ఇచ్చిన మహిళనూ గురువారం ప్రశ్నించాలని పోలీసులు యోచిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దర్యాప్తులో తేలిన విషయాలు ఇలా ఉన్నాయి... దీర్ఘ కాలంగా సరైన అవకాశాల్లేక పోవడంతో ‘ఒక్క చాన్స్’ కోసం చాలామంది నిర్మాతలు, దర్శకుల్ని ఉదయ్ కలిశారు. వారు సరైన విధంగా స్పందించకపోవడం ఆయనను తీవ్రంగా కలచివేశాయి. ఈ నేపథ్యంలో ఉదయ్కిరణ్ తన ముందు మరో నటుడి నటనను ప్రశంసించినా తట్టుకోలేని స్థితికి చేరుకున్నాడట. కెరీర్ను అభివృద్ధి చేసుకోవడం పైనే దృష్టి పెట్టిన ఆయన పిల్లలు కూడా వద్దనుకున్నాడు. ఇటీవల చెన్నై వెళ్లి తమిళ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొంతమంది అతనెవ్వరో తెలియనట్లు ప్రవర్తించడం ఉదయ్ను మరింత కుంగదీసింది. మరోవైపు దాదాపు 4 నెలలుగా స్నేహితులు, సన్నిహితులు కలవకపోవడం, కనీసం ఫోన్లోనూ పలుకరించకపోవడం, కొంతమంది నిర్మాతలకు ఫోన్చేసినా వారి నుంచి స్పందన లేకపోవడం వంటి కారణాలు ఉదయ్ను మానసికంగా మరింతగా దెబ్బతీశాయి. ఇంటి అద్దె ఆర్నెల్లుగా బకాయి పడ్డారట. దీంతో ‘నీ సంపాదనపై బతకాల్సి వస్తోంది’ అంటూ భార్య విషిత వద్ద తరచూ బాధ పడేవాడట. ఆర్థిక కారణాలు కావు: మున్నా ఉదయ్కిరణ్ మాజీ మేనేజర్ మున్నా బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘ఉదయ్కిరణ్ ఎవరో అనుమానించారనో, అవమానించారనో, అప్పులు చెల్లించలేకో, సినిమాల్లో అవకాశాలు రాలేదనో ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదు. ఆయనకు ఉన్న భూముల్లో ఏ స్థలం అమ్మినా అప్పులు తీరిపోతాయి. ఆయన ఆత్మహత్య వెనుక ఫైనాన్సియర్ల ఒత్తిడి ఉందన్న వార్తల్లో వాస్తవం లేదు. ఆయనకు సినిమా అవకాశాలు వచ్చినా కథ నచ్చకపోవడం వల్లే అంగీకరించలేదు. చచ్చిపోయేంత బాధ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్తో ఆయనకు సంబంధం లేదు’’ అని వివరించారు. -
ఆత్మహత్య వెనుక అంతుచిక్కని ప్రశ్నలు
-
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక సవాలక్ష ప్రశ్నలు
సినిమా హీరో ఉదయ్ కిరణ్ మరణం పెద్దలను, యువతని అందరిని అందోళనలోకి నెట్టింది. ఆలోచనలను రేపింది. అనేకమంది కలత చెందారు. హీరోగా అందరికీ ఆదర్శప్రాయుడు కావాల్సిన ఉదయ్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడం దురదృష్ట కరమని యువ ఉద్యోగులు వాపోతున్నారు. కష్టాలనెదుర్కొని సినిమాలో నిలదొక్కుకున్న ఉదయ్ నిజ జీవితంలో పోరాడి ఓడిపోయాడని భావిస్తున్నారు. ఇలా ఎవ్వరు చేయకూడదని అందరూ అంటున్నారు. అనేక సినిమాలలో మనల్ని అలరించిన అందగాడు-లవర్బాయ్ చావు మిస్టరీగా మారింది. ఉదయ్ ఆత్మహత్య వెనుక సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనేక ప్రశ్నలకు సమాధానాలే లేవు. అంతుపట్టని ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. ఉదయ్ కిరణ్ వద్ద ఆఫీస్ బాయ్గా పనిచేసిన మున్నా తర్వాత మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి సొంతంగా సినిమాలు తీస్తున్నాడు. మున్నా నిర్మాతగా "దిల్ కపాడి'' సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఉదయ్ హీరో. రెండు పాటలు మినహా ఈ సినిమా మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఒక హీరోయిన్ పెట్టుబడి పెట్టారని చెబుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం మధ్యలో అర్ధంతరంగా ఆగిపోయింది. ఆత్మహత్య వెనుక అంతు చిక్కని ప్రశ్నలు: వృత్తి పరంగా సినిమా అవకాశాలు లేకపోవడమా? కుటుంబ సమస్యలా? ఆర్థిక లావాదేవీలా? వీటన్నిటి వల్ల మానసిక వత్తిడులకు లోనవడమా? ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉన్న మాట నిజమేనా? గడచిన మూడు వారాల్లో ఏం జరిగింది? ఉదయ్ శరీరంపై గాట్లు ఎందుకున్నాయి? ఇంతకుముందు ఆత్మహత్యాయత్నం చేశాడా? ఒకవేళ అదే నిజమైతే ఎందుకు చేశాడు? అతని మానసిక పరిస్థితి బాగోలేదా? అదే నిజమైతే కుటుంబ సభ్యులు ఎందుకు జాగ్రత్తపడలేదు? ఆదివారం సాయంత్రం ఏం జరిగింది? భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నాయా? అవి అంత తీవ్రమైనవా? ఆమె మణికొండ వెళ్లిందా? ఇంకెక్కడికైనా వెళ్లిందా? పార్టీకి వెళ్లిన మాట నిజమేనా? అది ఎవరి పార్టీ? విషిత బయటకు వెళ్లినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారా? వాళ్లు వెళ్లిపోయిన తర్వాతే ఉదయ్ చనిపోయాడా? ఆత్మహత్యకు ముందు ఉదయ్ ఎవరికి ఫోన్ చేశాడు? ఆ రోజు రాత్రి భోజనం చేయకపోడానికి కారణాలేంటి? ఆదివారం ఉదయం నుంచే భార్యాభర్తల మధ్య గొడవ మొదలైందా? అంతకు ముందే గొడవలు ఉన్నాయా? విషిత ఉద్యోగం చేసే విషయంలో ఉదయ్ అసంతృప్తికి లోనయ్యాడా? ఉదయ్ కిరణ్ చెన్నై వెళ్లిపోవాలని ఎందుకు అనుకున్నాడు? చెన్నై స్నేహితుడు ఎవరు? ఇప్పుడెక్కడున్నాడు? ఉదయ్ మేనేజర్ మున్నా సినిమా ఎందుకు ఆగిపోయింది? ఉదయ్ సినిమా కోసం పెట్టుబడి పెట్టిన హీరోయిన్ ఎవరు? డబ్బుల కోసం ఆ హీరోయిన్ ఉదయ్ పీకల మీద కూర్చుందా? ఉయద్కు స్థిరాస్తులు ఉన్నాయా? ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఎలా వచ్చాయి? అప్పులు తీర్చగలిగీ తొందరపడి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? కుటుంబ సభ్యుల మాటలలో ఎందుకు స్పష్టతలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకవలసి ఉంది. ఉదయ్కిరణ్ ఆత్మహత్య వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మర చేశారు. ఆర్థిక పరమైన లావాదేవీలపై కూపీలాగుతున్నారు. ఇవే కాకుండా కొత్తకోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యేనని వైద్యులు నిర్ధారించారు. ఇక ఆత్మహత్యకు కారణాలు తెలియవలసి ఉంది. కారణాలలో ప్రధానమైనది మానసిక వత్తిడేనని స్సష్టమవుతోంది. సమస్యలు ఒక్కసారిగా దాడి చేసినప్పుడు, శక్తికి మించి తట్టుకోలేని వత్తిడి ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి మానసిక పరిస్థితిలో మార్పు వస్తుంది. అతని మాటలు, ఆలోచనలు, ప్రవర్తన ద్వారా ఇంట్లోని వారు, మిత్రులు పసిగట్టవచ్చు. అప్పుడు తప్పనిసరిగా మానసిక వైద్యుడిని కలవాలి. మన దేశంలో చాలా మంది మానసిక వైద్యుడిని సంప్రదించడానికి వెనకాడతారు. ఒక వ్యక్తిలో మానసిక రుగ్మతలు వెలుగు చూసినప్పుడు కుటుంబ సభ్యులు జాగ్రత్తపడాలన్ని విషయాన్ని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గుర్తు చేస్తోంది. -
'అప్పుల బాధతోనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య'
-
ఉదయ్ కిరణ్ మృతిపై కోలీవుడ్ దిగ్భ్రాంతి
యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య టాలీవుడ్నే కాక కోలీవుడ్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉదయ్ కిరణ్ తమిళంలో పెణ్ సింగం, పొయ్, వంబుసండై చిత్రాల్లో నటించారు. అలాంటి నటుడి మృతి చాలా మంది తారల్ని ఆవేదనకు గురి చేసింది. పలువురు ఆయనకు నివాళి అర్పించారు. నటి ప్రియమణి మాట్లాడుతూ తాను సోమవారం ఉదయ్ కిరణ్ మరణవార్త వింటూనే నిద్రలేచానన్నారు. తనకు తెలిసిన స్నేహితుల్లో ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. ఉదయ్ కిరణ్ మరణం తన నెంతగానో బాధించిందన్నారు. నటి విమలా రామన్ మాట్లాడుతూ సినిమాలో తన తొలి హీరో ఉదయ్ కిరణ్ అని చెప్పారు. మంచి మనసున్న వ్యక్తిని కోల్పోయాం అన్నారు. ఇంకా నటుడు ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ తదితరులు ఉదయ్ కిరణ్ మృతికి సంతాపం తెలియజేశారు. -
'అప్పుల బాధ మోయలేకనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య'
హైదరాబాద్: సినిమా అవకాశాలు లేకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు, అప్పుల బాధ మోయలేకనే సినీ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యేనని ఉస్మానియా వైద్యులు నివేదికలో తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు దారి తీసిన అంశాలు, కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. విచారణలో భాగంగా భార్య విషిత, అత్తామామ, సోదరి, బావ, మిత్రుడు శరత్లను మంగళవారం సాయంత్రం వెస్ట్జోన్ పోలీసులు విచారించారు. -
తొందరపడి కొన్ని తారలు...
-
అభిమాన నటుడికి కన్నీటి వీడ్కోలు
-
ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులు
-
ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు పూర్తి.
-
ఉదయ్ కిరణ్ భౌతికాయాన్ని సందర్శించిన ప్రముఖులు
-
ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు పూర్తి
-
ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : అయినవారు, అభిమానుల అశ్రు నయనాల మధ్య సినీనటుడు ఉదయ్ కిరణ్ అంత్యక్రియలు ఎర్రగడ్డ స్మశాన వాటికలో జరిగాయి. ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి చితికి నిప్పు అంటించారు. అంత్యక్రియల కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ అభిమాన నటుడికి కడసారిగా కన్నీటితో వీడ్కోలు పలికారు. అంతకు ముందు ఫిల్మ్చాంబర్ నుంచి ఉదయ్ కిరణ్ పార్దీవశరీరాన్ని ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా స్మశాన వాటికకు తీసుకొచ్చారు. హీరో శ్రీకాంత్ ఆ వ్యాన్తో పాటే స్మశాన వాటికకు చేరుకున్నారు. ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యలతో పాటు యువ హీరోలు కొంత మంది దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా తరలిరావడంతో ఎర్రగడ్డ స్మశాన వాటిక కిక్కిరిసిపోయింది. గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది. -
రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన ఉదయ్ కిరణ్
హైదరాబాద్ : ఉదయ్ కిరణ్ రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడి అయ్యింది. ఉరి వేసుకునే ముందు అతను చేతి మణికట్టు నరాలు కోసుకునే ప్రయత్నం చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో బయటపడింది. రాత్రి 10.30 ....11.00 గంటల మధ్యలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఫోరెన్సిక్ సిబ్బంది తెలిపారు. అలాగే ఉదయ్ కిరణ్, అతని భార్య విషిత కాల్ డేటాను పోలీసులు తెప్పించారు. విషిత ఫోన్ నుంచే ఉదయ్ కిరణ్కు మెసేజ్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఉదయ్ కిరణ్ ఫోన్ నుంచి నాలుగు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాణ స్నేహితుడు శరత్కు రెండుసార్లు, భార్య విషితకు రెండుసార్లు అతను కాల్ చేసినట్లు తెలుస్తోంది. భార్యకు ఎలాంటి మెసేజ్ పంపలేదని....ఉదయ్ కిరణ్ కాల్ చేయగా.... తన ఫోన్ చెడిపోయిందని విషిత మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. కాగా గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది. -
సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ పై పోస్టులు
-
ఉదయ్ కిరణ్ అంతిమ యాత్ర ప్రారంభం
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఫిల్మ్ ఛాంబర్ నుంచి భౌతికకాయాన్ని ఎర్రగడ్డ స్మశాన వాటికకు తరలిస్తున్నారు. అంతకు ముందు ఉదయ్ కిరణ్ పార్థివ దేహాన్ని పలువురు సినీ ప్రముఖలు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. మరోవైపు తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. పలువురు మహిళలు ....ఉదయ్ కిరణ్ భౌతికకాయాన్ని చూసి దుఃఖం ఆపుకోలేకపోయారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున అభిమానులు, సినీ పరిశ్రమకు చెందినవారు పాల్గొన్నారు.