air strikes
-
ఆప్ఘనిస్తాన్ టార్గెట్గా పాక్ దాడులు.. 15 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్(Pakistan) వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల కారణంగా దాదాపు 15 మంది మరణించినట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో పాక్, ఆప్ఘన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఆఫ్ఘనిస్థాన్లోని(Afghanistan) పక్టికా ప్రావిన్స్లో ఉన్న బర్మాల్ జిల్లాపై మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. లామన్తో సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో 15 మంది మృతిచెందగా పలువురు గాయపడినట్టు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించినట్టు అక్కడి మీడియా ఖమా నివేదించింది. ఈ బాంబు పేలుళ్లకు పాకిస్తాన్ జెట్ విమానాలే కారణమని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. పాక్ వైమానిక దాడులు తీవ్రమైన పౌర ప్రాణనష్టం, విస్తృత విధ్వంసానికి కారణమయ్యాయి. దాడుల కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.మరోవైపు.. బర్మాల్, పక్టికాపై జరిగిన వైమానిక దాడికి(Air Strike) ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆప్ఘన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు అని పేర్కొంది. పాక్ వైమానిక దాడులను ఖండించింది. పాక్ లక్ష్యంగా దాడులు చేసిన వారిలో వజీరిస్థానీ శరణార్థులు కూడా ఉన్నారని తెలిపింది.Aftermath of precision airstrikes conducted by the Pakistan Air Force, eliminating over 40+ TTP terrorists and crippling militant infrastructure in Paktika province Afghanistan.A significant step taken by Pakistan Armed forces in counter-terrorism efforts reaffirming their… pic.twitter.com/x6AZgOx5JB— Global Defense Agency (@Defense_GDA) December 24, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. అయితే, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కు చెందిన ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ క్రమంలో దాడులకు చేసినట్టు తెలుస్తోంది. ఇక, పాకిస్తాన్ అధికారులు అధికారికంగా వైమానిక దాడిని ధృవీకరించ లేదు. సరిహద్దుకు సమీపంలో ఉన్న తాలిబాన్ రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సైనిక సన్నిహిత భద్రతా వర్గాలు సూచించాయి. -
లెబనాన్లో 52కు చేరిన మృతులు
బీరుట్: లెబనాన్లోని బెకా లోయపై ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 52కు చేరింది. మరో 72 మంది గాయపడ్డారు. బాల్బెక్ నగరం సహా కనీసం 25 పట్టణాలు, గ్రామా ల్లోని లక్ష్యాలపై దాడులు జరిగాయి. భవనా లు శిథిలాల దిబ్బలుగా మారాయని, ఇంకా చాలా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని స హాయక సిబ్బంది అంటున్నారు. పర్వత శ్రే ణుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని కుగ్రా మాల్లో వ్యవసాయమే ప్రధానవృత్తి. ఆలివ్, ద్రాక్ష తోటలు, మద్యం తయారీ యూనిట్లకు ప్రసిద్ధి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఆర్మీ ఈ ప్రాంతం జోలికి వెళ్లలేదు. ఒక్కసారిగా జరిగిన భీకర వైమానిక దాడులతో భీతిల్లిన జనం ఇళ్లు విడిచి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. Smoke seen rising from several high-rise buildings in the Al-Hosh area of Tyre, Lebanon, following Israeli airstrikes. Footage captured the aftermath, with planes still circling overhead pic.twitter.com/saPah5YiZG— RT (@RT_com) November 2, 202424 గంటల్లో 84 మంది గాజా ఉత్తరప్రాంతంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 24 గంటల వ్యవధిలో 50 మంది చిన్నారులు సహా 84 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది వరకు గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. ఖాన్యూనిస్లో జరిపిన దాడిలో హమాస్ సీనియర్ అధికారి ఇజ్ అల్– దిన్ కస్సబ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. దీనిపై హమాస్ స్పందించలేదు. -
భయానక వీడియో.. ఇజ్రాయెల్ భీకర దాడులు
బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులకు సంబంధించిన భీకర వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భయానక బాంబు దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇక, తాజాగా ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. భూగర్భంలో ఉన్న హిజ్బుల్లా నేతలను టార్గెట్ చేసి దాడులు చేసింది. బాంబు దాడిలో అక్కడున్న నివాసాలు అన్ని ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆహారం మరియు కమ్యూనికేషన్ పరికరాల ఉన్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై ఇజ్రాయెల్ నేరుగా విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు.. జోర్డాన్, సిరియా, ఇరాక్ గగనతలాల మీదుగా దాదాపు 2,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఇరాన్లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. It's mind-boggling how obsessed the Zionists are with destruction and death. Israel's Channel 12 publishes the massive explosion in south Lebanon that triggered an earthquake alert in the north yesterday morning pic.twitter.com/zmOfZcx2Ec— Abier (@abierkhatib) October 27, 2024 -
ఇరాన్పై దాడి.. మూడు దేశాల గగనతలం మూసివేత
టెహ్రాన్:తమపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున పెద్దఎత్తున దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు. ఫ్లైట్ రాడార్ 24, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. మూడు దేశాలు( ఇరాన్, ఇరాక్, సిరియా) మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు.ఈ మూడు దేశాల మధ్య విమనాలు ప్రయాణించే గగనతలం మూసివేశారు. అయితే.. దాడులు ముగిసిన అనంతరం గగనతలంలో విమాన సర్వీసుల ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా కొన్ని గంటల పాటు జోర్డాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.The airspace of #Iran, #Iraq, #Jordan, #Syria and #Israel is closed as Israeli war planes attack various locations in Iran for the last few hours. pic.twitter.com/5MEcNGaiNk— Hamdan News (@HamdanWahe57839) October 26, 2024అక్టోబర్ 1న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్పై 200కుపైగా రాకెట్లు, క్షిపణుల ప్రయోగించింది. ఇరాన్ వైమానిక దాడులకు ప్రతీకంగా ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది. ఇజ్రాయల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇలామ్, ఖుజెస్తాన్, టెహ్రాన్లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడులు పరిమిత నష్టాన్ని మాత్రమే కలిగించాయి" అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 33 మంది మృతి
గాజాలో హమాస్ అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసింది. శుక్రవారం సాయంత్రం జబాలియా క్యాంప్లోని అనేక ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో సుమారు 33 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మృతిచెందిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. శిథిలాలు, భవనాల కింద చిక్కుకున్న అనేక మంది బాధితు ఉన్నారని పేర్కొంది. మొత్తం మరణాలు సంఖ్యల కూడా 50కి పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. బాంబుల దాడిలో 85 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. అయితే.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా స్పందించకపోవటం గమనార్హం.IT DOESN’T STOP #SaveNorthGaza At least 33 Palestinians were killed and 50 wounded in an Israeli strike on Jabalia refugee camp in north Gaza.Numbers expected to rise— Dr. Renee Levant (@ReneeLevant) October 19, 2024 అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్ సరిహద్దు గుండా హమాస్ విధ్వంసానికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్లో హమాస్ను అంతం చేయటమే టార్గెట్గా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటివరకు 42,500 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.చదవండి: సిన్వర్ మృతి వీడియోతో పాలస్తీనా కట్టలు తెగిన ఆగ్రహం -
మిస్టరీగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ కీలక నేతలను అంతం చేయాటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులను జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ మిస్టరీగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఆయన బతికే ఉన్నారా? లేరా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే యాహ్యా సిన్వార్కు సంబంధించి.. ఖతార్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం మొదటి నుంచి ఖతార్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గత వారం రోజులుగా సిన్వార్ తమకు టచ్లో లేరని ఖతార్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం.. తమతో ఆయన కమ్యూనికేషన్కు సంబంధించి కీలక విషయాలను వింటారనే భయంతో సిన్వార్ ప్రస్తుతం పెన్, పేపర్లతో మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనతో మధ్యవర్తిత్వ చర్చలకు జరపడానికి తమకు సవాల్గా మారిందని తెలిపారు. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు హమాస్ స్పందించలేదు.ఇక.. సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణగా పెట్టుకొని ఉన్నారని ఇజ్రాయెల్ స్థానిక మీడియా ఓ నివేదిక ప్రచురించింది దీంతో హమాస్ చీఫ్ వైమానిక దాడిలో మరణించి ఉండవచ్చనే ఊహాగానాలకు తెరపడినట్లైంది. మరోవైపు.. కాల్పుల ఒప్పందానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడులతో హత్యల విధానాన్ని కొనసాగిస్తోందని ఖతార్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మాజీ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతం చేసింది. ప్రస్తుతం హమాస్కు కీలకమైకన నేతగా ఖలీద్ మషాల్ ఉన్నారు. ఆయన హనియే కంటే చాలా బలవంతుడని ఖతార్ అధికారులు తెలిపారు.చదవండి: మీరెన్ని చెప్పినా.. ఇరాన్పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని -
బీరూట్పై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురి మృతి
ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని బీరూట్లో మరోసారి దాడులతో విరుచుకుపడింది. తాజాగా గురువారం తెల్లవారుజామున బచౌరా జిల్లాలోని హెజ్బొల్లా రెస్క్యూ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. బీరూట్లోని దాహియాలో హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చిన ప్రదేశంలోనే ఇజ్రాయెల్ సైన్యం మూడు మిసైల్స్తో దాడి జరిపింది.#WATCH | A plume of smoke billows into the sky in Beirut, Lebanon.Reuters reports that Israel bombed central Beirut in the early hours of 3rd Oct, killing at least six people, after its forces suffered their deadliest day on the Lebanese front in a year of clashes against… pic.twitter.com/UiHcoe0AFr— ANI (@ANI) October 3, 2024వారం రోజుల్లో లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన రెండో దాడి ఇది. హెజ్బొల్లాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉత్తర సరిహద్దును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో బీరూట్ ప్రాంతంలో పొగలు తీవ్రమైన పొగలు కమ్ముకున్నాయి.మరోవైపు.. లెబనాన్లో తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన ఓ పౌరుడు మృతి చెందినట్లు అమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది. మృతి చెందిన అమెరికా పౌరుడు కామెల్ అహ్మద్ జావెద్కు సంతాపం ప్రకటించినట్లు వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి.చదవండి: ‘హత్యకు ముందే కాల్పుల విరమణకు నస్రల్లా అంగీకారం’ -
ఇజ్రాయెల్ దాడిలో 105 మంది మృతి
బీరూట్ : లెబనాన్ తీవ్రవాద గ్రూప్ హెజ్బొల్లాను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వడివడిగా అడుగులు వేస్తోంది భూతల,వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా, లెబనాన్ రాజధాని బీరూట్లో తొలిసారి జనావాసాల్లో హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆదివారం జరిపిన దాడుల్లో సుమారు 105 మంది మరణించారు. 359 మందికిపైగా గాయపడ్డారు.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో ఘోరమైన వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. తూర్పు, దక్షిణ, బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాలలో డజన్ల కొద్దీ మంది మరణించారని చెప్పారు. సోమవారం బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.రెండు వారాల క్రితం ఇజ్రాయెల్..హెజ్బొల్లా సభ్యులపై దాడుల ముమ్మరం చేసిన నాటి నుండి 1,000 మందికి పైగా మరణించారని, 6,000 మంది గాయపడ్డారని లెబనాన్ పేర్కొంది.రాయిటర్స్ ప్రకారం, బీరుట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిన ప్రాంతంలో హెజ్బొల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్.. 20 మంది హెజ్బొల్లా అగ్రనేతల్ని హత మార్చింది. వారిలో నస్రల్లా,నబిల్ కౌక్తో పాటు ఇతర నేతలు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్పై దాడిని కొనసాగించాలని ఆదేశించారు. హెజ్బొల్లాపై చేస్తున్న దాడుల కారణంగా సామాన్యులు నష్టపోకూడదని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. -
టార్గెట్ ఐసిస్..సిరియాపై అమెరికా దాడులు
వాషింగ్టన్:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఓ పక్క లెబనాన్పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుండగానే సిరియాలో ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అగ్రదేశం ప్రకటించింది.మరణించిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐసిస్),అల్ఖైదాతో లింకున్న సంస్థలకు చెందినవారని అమెరికా వెల్లడించింది.హతమైన వారిలో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలిపింది.అల్ఖైదాతో లింకున్న హుర్రాస్ అల్దీన్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు టార్గెట్గా వాయువ్య సిరియాపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇదీ చదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
హెజ్బొల్లా వారసుడు హషీం?
ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల ధాటికి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కకావికలవుతోంది. ముఖ్యంగా అగ్ర నాయకత్వమంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్, తర్వాత టాప్ కమాండర్ ఫౌద్ షుక్ర్. ఇప్పుడు తాజాగా ఏకంగా సంస్థ అధినేత నస్రల్లా. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అగ్ర నేతలందరినీ రోజుల వ్యవధిలోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్. శుక్రవారం నాటి దాడుల్లో నస్రల్లాతో పాటు కనీసం మరో ఇద్దరు అగ్ర నేతలు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో ఇప్పటికే ఈ మేరకు కథనం కూడా వెలువడింది. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాల చీఫ్గా ఉన్నాడు. శుక్రవారం నాటి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ లక్షిత దాడుల్లో అతను కూడా మరణించినట్టు తొలుత వార్తలొచి్చనా అదేమీ లేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు తేల్చాయి. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలు చూడటమే గాక సంస్థ జిహాద్ కౌన్సిల్లో కీలక సభ్యుడు కూడా. 2017 లోనే అమెరికా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పైగా హెజ్బొల్లాకు కొమ్ముకాసే ఇరాన్తో అతనికి అతి సన్నిహిత సంబంధాలున్నాయి. 2020లో అమెరికా మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ కూతురు జైనబ్కు హషీం మామ అవుతాడు. నస్రల్లా మాదిరిగానే ఇతను కూడా మతాధికారే. తలపాగతో అచ్చం నస్రల్లాను తలపిస్తాడు. 1964లో దక్షిణ లెబనాన్లో పుట్టాడు. 1990ల్లో ఇరాన్ లో ఉన్నత చదువులు చదువుతుండగానే హెజ్బొల్లా అతన్ని వెనక్కు పిలిపించింది. తర్వాత ఏడాదికే నస్రల్లా హెజ్బొల్లా్ల చీఫ్ అయ్యాడు. రెండేళ్లకే హషీం సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సార థి అయ్యాడు. నాటినుంచే నస్రల్లా వారసునిగానూ గుర్తింపు పొందుతూ వస్తున్నాడు. విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు తదితరాలు చూసుకుంటున్నాడు. మారిన పరిస్థితుల్లో హెజ్బొల్లాకు సారథి కావాలంటే సంస్థ ఇతర అగ్ర నేతలతో పాటు ఇరాన్ మద్దతునూ హషీం కూడగట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ హతం
బీరూట్ : హిజ్బుల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఇప్పటికే సోమవారం హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హత మార్చగా.. మంగళవారం హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ ప్రాణాలు తీసినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరూట్లో దక్షిణ శివారు ప్రాంతమైన దహియే జిల్లాలో హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం ఖుబైసీ లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇబ్రహీం ఖుబైసీ మరణించారని తెలుస్తోంది. ఆయన మరణంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.హిజ్బుల్లా రాకెట్,క్షిపణి విభాగానికి కమాండర్ ఇబ్రహీం ఖుబైసీపై దాడి జరిగిన సమయంలో ఆయనతో పాటు మరో ఐదుమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా,లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సోమవారం మరణించిన వారి సంఖ్య 558కి పెరిగింది. అదే సమయంలో, 1835 మంది తీవ్రంగా గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ తెలిపారు.🔴LEBANON 🇱🇧-ISRAEL 🇮🇱| Several sources claim that one of the Hezbollah Commander, Ibrahim #Qubaisi, was killed during an Israeli airstrike on Tuesday 09/24 in Dahiya, #Beirut. Ibrahim Qubaisi was until then the commander of #Hezbollah's rocket division. #MiddleEastTensions pic.twitter.com/iKJpGaNZ6c— Nanana365 (@nanana365media) September 24, 2024చదవండి : వ్యతిరేకిస్తే అంతే.. న్యూస్ లైవ్ టెలీకాస్ట్లో జర్నలిస్ట్పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి -
అవును.. తప్పు చేశాం: ఇజ్రాయెల్ ప్రధాని
టెల్ అవీవ్: రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణహోమం.. అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన చేశారు.‘‘సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు.మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, మరోవైపు అమెరికా సహా ప్రపంచమంతా కోరుకుంటున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో దాడులు జరిపింది. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. ఆదివారం రాత్రి రఫాపై జరిగిన ఈ భీకర వైమానిక దాడిలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.మిత్రదేశాల ఖండనఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్ర స్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్’ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ పేర్కొన్నారు. Outraged by the Israeli strikes that have killed many displaced persons in Rafah.These operations must stop. There are no safe areas in Rafah for Palestinian civilians.I call for full respect for international law and an immediate ceasefire.— Emmanuel Macron (@EmmanuelMacron) May 27, 2024 మరోవైపు.. ‘‘భూమి మీద ఉన్న నరకం గాజా, గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్ఆర్డబ్ల్యూఏ పేర్కొంది. -
రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అర్ధరాత్రి ఆర్తనాదాలు..
ఇజ్రాయెల్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ తాజాగా దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.కాగా, ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రఫా నగరంపై బాంబు దాడులకు తెగబడింది. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో దాదాపు 35 మంది చనిపోయినట్టు గాజా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. ఇక, అధిక సంఖ్యలో ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంపై బాంబు దాడుల జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.మరోవైపు.. రఫాపై తాము దాడులు చేయలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులతో తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. రఫాలో ఏం జరుగుతుందో తమకు తెలియదని చెప్పుకొచ్చింది. మరోవైపు.. అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెలీ అవీవ్పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. కాగా, గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగానే తాము ప్రతిదాడులు చేసినట్టు హమాస్ తెలిపింది. قطعت رؤوس الأطفال وحرقت الأجساد 😭😭جنون اسرائيل لن ينتهي الا باقتلاعه من الجذورونهايتهم قريب باذن الله#رفح_الان #Rafah #ابو_عبيدة pic.twitter.com/BjbNdA9aRF— حماة الأقصى في بلاد الحرمين (@aqsa_saudi3n) May 27, 2024 ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్ను ఆదేశించింది. దాడులను ఆపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీజే ఆదేశాలను పట్టించుకోకుండా తాజాగా మరోసారి బాంబు దాడులకు తెగబడింది. Israel commits a massacre in #Rafah this evening, dropping several 2,000 pound bombs on civilian tents and #UN compounds, murdering dozens of civilians seeking shelter. This was Israel’s response to the @CIJ_ICJ ruling Friday that it must halt its offensive on Rafah. pic.twitter.com/vS1ouUU8Oj— Husam Zomlot (@hzomlot) May 26, 2024 ఇక, గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ వారాంతంలో ఇజ్రాయెల్, యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ మధ్య జరిగే సమావేశాల తర్వాత కాల్పుల విరమణ చర్చపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
సిరియాలో ఇరాన్ ఎంబసీపై దాడి.. 11 మంది మృతి
గాజా సంక్షోభ నేపథ్యంలో.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి జరపగా.. 11 మంది మృతి చెందారు. గాజా యుద్ధంలో ఇరాన్ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్, సిరియా దౌత్య విభాగాలు ఇది ఇజ్రాయెల్ దాడేనని ధృవీకరించాయి. ఆరు మిస్సైల్స్ ఎంబసీ భవనంపైకి దూసుకొచ్చాయని.. ఎఫ్-35 ఫైటర్ జెట్స్ ద్వారా ఇజ్రాయెల్ రక్షణ దళం ఈ దాడికి తెగబడిందని ప్రకటించాయి. మరోవైపు బ్రిటన్ తరఫున సిరియాలో పని చేస్తున్న మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఒకటి ఈ క్షిపణి దాడిపై ప్రకటన చేసింది. దాడిలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని.. ఎనిమిది మంది ఇరాన్, ఇద్దరు సిరియా, ఒక లెబనీస్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలోనే సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ జరిపిన ఐదో దాడి ఇది.సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు ఇరాన్ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి. అందుకే ఇజ్రాయెల్ సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అయితే.. గాజా సంక్షోభం తర్వాత ఈ దాడుల ఉధృతిని పెంచింది. మిస్ టార్గెట్?సిరియాలో ఇరాన్ ఎంబసీ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ దాడి ఇరాన్ దౌత్య కార్యాలయం లక్ష్యంగా జరగలేదని.. దానిని ఆనుకుని ఉన్న భవనం టార్గెట్గా జరిగి ఉండొచ్చని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఇస్తున్నారు. భవనానికి ఖాసీం సోలెయిమానీ భారీ కటౌట్ ఉండడంతో అందులో ఉన్న సభ్యుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపి ఉంటుందని సదరు కథనాల సారాంశం. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మిలిటరీ ఆపరేషన్స్కి సోలెయిమానీని ఆద్యుడిగా పేర్కొంటారు. అయితే.. 2020లో సిరియా భూభాగంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో సోలెయిమానీ చనిపోయాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదుసిరియా రాజధానిలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణుల దాడిని లెబనాన్ రెబల్ గ్రూప్ హిజ్బుల్లా ఖండిచింది. ఐఆర్జీసీ సభ్యుల మరణానికి కారణం అయినందుకు ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. గాజా యుద్ధంలో హమాస్కు ఇటు హిజ్బుల్లా, అటు ఐఆర్జీసీలు మిత్రపక్షంగా ఉన్నాయి. -
Russia: ఉక్రెయిన్ దాడుల్లో భారత యువకుడి మృతి
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ యువకుడు ఒకరు మరణించాడు. రష్యా ఆర్మీ వద్దసెక్యూరిటీ హెల్పర్గా పనిచేస్తున్న గుజరాత్కు చెందిన హేమిల్ అశ్విన్భాయ్(23) ఈ నెల 21న ఉక్రెయిన్ జరిపిన వైమానిక దాడుల్లో మృతి చెందాడు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని భారత్కు చెందిన మరో సెక్యూరిటీ హెల్పర్ సమీర్ అహ్మద్ తెలిపారు. అయితే హేమిల్ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత విదేశీ వ్యవహరాల శాఖ స్పష్టం చేసింది. సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారత యువకులను ఉక్రెయిన్తో యుద్ధంలో చురుగ్గా పాల్గొనాలని రష్యా బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే హేమిల్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించాడు. గతేడాది రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించింది. అయితే వీరందరూ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అడ్వైజరీ కూడా చేసింది. ఏజెంట్ల మోసం వల్లే భారత యువకులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేయాల్సి వస్తోందని ఇటీవల ఎంఐఎం చీఫ్, అసదుద్దీనన్ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి విషయంలో భారత విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. . ఇదీ చదవండి.. అమెరికా నౌకపై హౌతీల మిసైల్ దాడి -
ఇరాన్పై ప్రతీకారదాడి.. పాక్ అమెరికాను సంప్రదించిందా?
పాకిస్తాన్లోని జైష అల్ అదిల్ మిలిటెంట్లు లక్ష్యంగా ఇరాన్ జరిపిన మెరుపు వైమానిక దాడులకు గురువారం పాకిస్తాన్ కూడా ప్రతికార దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే పాక్ ప్రతీకార వైమానిక దాడులకు ముందు అగ్రరాజ్యాన్ని సంప్రదించిందా? అని మీడియో అడిగిన ప్రశ్నను అమెరికా దాటవేసింది. మీడియా ప్రశ్నకు అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సమాదానాన్ని నిరాకరించారు. ఈ వ్యవహారంలో ఏం జరగవచ్చో లేదా జరగకపోవచ్చో అనేదానిపై తాను ప్రస్తుతానికి ఏం మాట్లాడలేనని స్పష్టం చేశారు. అమెరికా ఎల్లప్పుడూ మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి, భద్రతతో కూడిన పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసమే అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య దౌత్యపరమైన శాంతి కోసం యత్నిస్తున్నామని తెలిపారు. ఇక.. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్-గాజా దాడులు కోనసాగుతున్నాయి. అప్పటి నుంచి యెమెన్లో పనిచేసే హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలోని ఇజ్రాయెల్, ఇతర దేశాలకు సంబంధించిన పలు వాణిజ్య నౌకలపై దాడులకు తెగపడినట్లు తెలిపారు. దీంతో అమెరికా, బ్రిటన్ బలగాలు.. హౌతీ రెబల్స్పై ఎదురుదాడి చేశాయని అన్నారు. అనంతరం ఇరాన్, పాకిస్తాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయని తెలిపారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగటంపై తాము ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ ఉద్రిక్తతలపై తాము దృష్టి సారించామని పేర్కొన్నారు. అక్టోబర్ 7నుంచి ఉధృతం అవువతున్న దాడుల పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఇరాన్-పాక్తిస్తాన్ ఉద్రిత్తలపై మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో తీవ్రవాదానికి నిధలు సమకూర్చటం వంటి సుదీర్ఘ చరిత్ర ఇరాన్కు కలిగి ఉన్నట్లు తెలిపారు. చదవండి: మైనారిటీ నేతకు మద్దతు.. రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు -
Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!
దెయిర్ అల్బలాహ్ (గాజా): గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. కరెంటు సరఫరా లేక ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో తశనివారం వైద్య పరికరాలన్నీ మూగవోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచి్చందని తెలుస్తోంది! దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. వైద్య సేవలతో పాటు కరెంటు, ఆక్సిజన్ సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో పలు ఆస్పత్రుల్లో ఐసీయూల్లోని రోగులు, ఇంక్యుబేటర్లలోని చిన్నారులు నిస్సహాయంగా మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా మరణించారని, మరికొన్ని వందల మంది మృత్యువుతో పోరాడుతున్నారని హమాస్ ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది! ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులాపేందుకు ససేమిరా అంటోంది. కనీసం వాటికి విరామమిచ్చేందుకు కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరోసారి నిరాకరించారు. షిఫా.. శిథిల చిత్రం అల్ షిఫా ఆస్పత్రిలో తాగునీటితో పాటు ఆహార పదార్థాలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. దాంతో వైద్యంతో సహా ఏ సేవలూ అందక రోగులు నిస్సహాయంగా మృత్యువాత పడుతున్నారు. శనివారమే 100 మందికి దుర్మరణం పాలైనట్టు హమాస్ పేర్కొంది. వీటికి తోడు ఐసీయూ విభాగంపై బాంబు దాడి జరిగింది. ఆస్పత్రిని ఇజ్రాయెల్ సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. అక్కడ హమాస్ ఉగ్రవాదులతో భీకరంగా పోరాడుతున్నట్టు ప్రకటించింది. ఆస్పత్రి ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ బాంబు మోతలతో దద్దరిల్లుతున్నాయి. బాంబు దాడుల్లో రెండు అంబులెన్సులు తునాతునకలయ్యాయి. కనీసం రోగులు, క్షతగాత్రులను ఆస్పత్రి నుంచి మరో చోటికి తరలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అడుగు కదిపినా స్నైపర్ల తూటాలు దూసుకొస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. ఈ ఆస్పత్రి కిందే ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రధాన కార్యాలయముందని ఇజ్రాయెల్ మొదటినుంచీ ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఖండనల నేపథ్యంలో శనివారం సాయంత్రానికల్లా ఇజ్రాయెల్ మాట మార్చింది. అల్ షిఫా ఆస్పత్రిపై దాడులు జరపడం లేదని, అక్కణ్నుంచి వెళ్లిపోవాలనుకున్న వారికోసం కారిడార్ తెరిచే ఉంచామని చెప్పుకొచ్చింది. దాడుల్లో గాయపడుతున్న రెండు రోజులుగా ప్రధానంగా అల్ అహిల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ అక్కడ కూడా మౌలిక సదుపాయాలేవీ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కారిడార్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ రోగులను నిస్సహాయంగా వదిలేసిన దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పడకేసిన వైద్యం గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘‘గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. -
సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి
వాషింగ్టన్: సిరియాలో ఇరాన్ మద్దతునిస్తున్న దళాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఆయుధ నిల్వ కేంద్రంపై యుఎస్ యుద్ధ విమానాలు దాడి చేశాయని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ చీఫ్ రమీ అబ్దెల్ రెహమాన్ తెలిపారు. ఇరాన్ మద్దతిస్తున్న కొన్ని సాయుధ దళాలు ఇరాక్, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ సంక్షోభం పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధంగా మారకుండా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గాజా యుద్ధానికి ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో అమెరికా దళాలపై దాడులు మాత్రం సహించబోమని తెలిపేందుకే ఈ చర్యకు దిగినట్లు చెప్పారు. అమెరికా దళాలపై జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ ఉందని, వాటిని ఏమాత్రం సహించబోమన్నారు. ఇస్లామిక్ రాజ్యాల వర్గాలను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాక్లో దాదాపు 2,500 మంది, సిరియాలో 900 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇక్కడి సైనికులపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా గత వారంలోనే రెండోసారి దాడికి పాల్పడింది. ఈ పరస్పర దాడులు ఇరాన్-అమెరికా మధ్య పశ్చిమాసియాలో మరో అలజడి చెలరేగేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో గాజా-ఇజ్రాయెల్ యుద్ధం సంక్షోభాన్ని సృష్టిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగుతోంది. ఇప్పటికే గాజాలో 10,500 మంది మరణించారు. ఇదీ చదవండి: Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది -
Israeli-Palestinian Conflict: శరణార్థి శిబిరాలపై భీకర దాడులు
గాజాసిటీ/ఖాన్ యూనిస్/జెరూసలేం: గాజాలోని శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లపై ప్రారంభించిన యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. అల్–మఘాజీ రెఫ్యూజీ క్యాంపుపై జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు. 34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం బురీజ్ క్యాంప్లోని నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మూడు ఘటనల్లో 60 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవలే జబాలియా, బురీజ్ క్యాంపులపై జరిగిన దాడుల్లో 200 మందికిపైగా జనం మరణించారు. హమాస్తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అల్–ఖుద్స్ ఆసుపత్రి సమీపంలో పేలుడు గాజాలో ఆదివారం ఉదయం అల్–ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. ఆసుపత్రికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసిందని పేర్కొంది. భవనం చాలావరకు ధ్వంసమైందని, చాలామంది మృతి చెందారని తెలియజేసింది. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజల ముసుగులో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలోని మకాం వేస్తున్నారని వివరించింది. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాపై అణుబాంబు ప్రయోగిస్తామన్న మంత్రిపై సస్పెన్షన్ వేటు హమాస్ మిలిటెంట్లను అంతం చేయడానికి గాజాపై అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిపై సస్పెన్షన్ వేటు పడింది. జెరూసలేం వ్యవహారాల మంత్రి అమిచాయ్ ఎలియాహూ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో గాజాలో సాధారణ ప్రజలెవరూ లేరని, అందరూ మిలిటెంట్లే ఉన్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు. గాజాపై అణుబాంబు ప్రయోగించే ఐచి్ఛకం కూడా ఉందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. మంత్రి వ్యవహారంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. మంత్రిని ప్రభుత్వ సమావేశాల నుంచి నిరవధికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం అంతర్జాతీయ చట్టాల ప్రమాణాల ప్రకారమే నడుచుకుంటున్నాయని నెతన్యాహూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై మంత్రి అమిచాయ్ ఎలియాహూ వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అబ్బాస్తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం వెస్ట్బ్యాంక్లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. అక్టోబర్ 7 తర్వాత వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయెల్ దాడుల్లో 150 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. జర్నలిస్టుకు తీరని దుఃఖం అల్–మఘాజీ క్యాంపుపై జరిగిన దాడి జర్నలిస్టు మొహమ్మద్ అలలౌల్కు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆయన నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులను కోల్పోయారు. టర్కీష్ వార్తా సంస్థ అనడోలులో ఆయన ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి అల్–మఘాజీ క్యాంపులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో మొహమ్మద్ కుటుంబం ఉంటున్న ఇళ్లు ధ్వంసమయ్యింది. నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఆయన భార్య, తల్లి, తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. -
Israel-Hamas war: గాజాలో నరకయాతన
రఫా/టెల్ అవీవ్: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. ప్రధానంగా గాజా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్ల స్థావరాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. పూర్తిస్థాయి భూతల యుద్ధం త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, అది సుదీర్ఘకాలం, సంక్లిష్టంగా ఉండబోతోందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు. గాజాలో హమాస్ మిలిటెంట్లు నిర్మించుకున్న సొరంగాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. గల్లాంట్ శుక్రవారం విదేశీ జర్నలిస్టులతో మాట్లాడారు. భారీ స్థాయిలో సైనిక బలగాలతో భూతల యుద్ధం ప్రారంభిస్తామని అన్నారు. వారికి వెన్నుదన్నుగా వైమానిక దళం కూడా ఉంటుందని చెప్పారు. తమ జవాన్లు గురువారం ఉత్తర గాజాపై భూతల దాడి చేసి, క్షేమంగా తిరిగి వచ్చారని వెల్లడించారు. శుక్రవారం కూడా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందన్నారు. 9 వేలు దాటిన మృతుల సంఖ్య మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,300 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 3,000 మంది మైనర్లు, 1,500 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో దాదాపు 4,000 మంది మృతిచెందారు. ఈ నెల 7న మొదలైన యుద్ధంలో మృతుల సంఖ్య ఇప్పటికే 7,300 దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో వెస్ట్బ్యాంక్లో మృతిచెందినవారి సంఖ్య 110కు చేరుకుంది. హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇజ్రాయెల్ భూభాగంలో 1,400 మందికిపైగా మృత్యువాతపడ్డారు. హమాస్ వద్ద 229 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నలుగురు బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటిదకా 200కిపైగా పాఠశాలలు ధ్వంసమయ్యాయని ‘యునెస్కో’ ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం స్కూళ్లలో 40 శాతం స్కూళ్లు ధ్వంసమైనట్లు తెలియజేసింది. ఇంధనాన్ని అనుమతించేది లేదు సరిపడా ఆహారం, నీరు, నిత్యావసరాలు, ఔషధాలు లేక గాజాలో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులు, క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంక్యుబేటర్లు పనిచేయక శిశువులు కన్నుమూస్తున్నారు. ఈజిప్టు ప్రభుత్వం పరిమితంగా ఆహారం, నిత్యావసరాలను ఈజిప్టు నుంచి గాజాలోకి అనుమతిస్తోంది. మరోవైపు గాజాకు పెట్రోల్, డీజిల్ సరఫరాను అనుమతించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ మరోసారి తేలి్చచెప్పారు. ఇంధనం మిలిటెంట్ల చేతుల్లోకి చేరితే దురి్వనియోగమయ్యే అవకాశం ఉందన్నారు. మిలిటెంట్లు జనరేటర్లతో సొరంగాల్లోకి గాలిని పంపిస్తుంటారని, ఇందుకోసం ఇంధనం వాడాల్సి ఉంటుందన్నారు. ‘‘హమాస్ మిలిటెంట్లకు గాలి కావాలంటే ఇంధనం కావాలి, ఇంధనం కావాలంటే మేము కావాలి’’ అని గల్లాంట్ వ్యాఖ్యానించారు. బందీల్లో 30 మంది పిల్లలు! ఈ నెల 7న ఇజ్రాయెల్పై హఠాత్తుగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికినవారిని దొరికినట్లు ఊచకోత కోశారు. చాలామందిని నిలబెట్టి కాల్చేశారు. వెనక్కి వెళ్లిపోతూ 229 మందిని బందీలుగా బలవంతంగా లాక్కెళ్లారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. బందీలను గాజాలోని గుర్తుతెలియని ప్రాంతంలో దాచినట్లు తెలుస్తోంది. బందీల్లో 30 మంది చిన్నపిల్లలు ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ధారణకు వచి్చంది. తమ పిల్లలను విడిపించాలంటూ వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మూడేళ్లు, నాలుగేళ్ల వయసున్న చిన్నారులను కూడా మిలిటెంట్లు అపహరించడం గమనార్హం. వారి క్షేమ సమాచారాలు తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. జెనీవా తీర్మానం ప్రకారం.. సాధారణ పౌరులను బందీలుగా మార్చడం ముమ్మాటికీ యుద్ధ నేరమే అవుతుంది. సిరియాలో అమెరికా దాడులు వాషింగ్టన్: తూర్పు సిరియాలో ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్ సేనల స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఫైటర్ జెట్లు శుక్రవారం ఉదయం నిప్పుల వర్షం కురిపించాయి. రెండు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. గతవారం సిరియాలోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ అనుకూల మిలిటెంట్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారని, వాటికి ప్రతిస్పందనగానే తాము వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. ఒకవైపు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సిరియాలో ఇరాన్ అనుకూల శక్తులపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, సిరియాలో దాడికి ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణతో ఏమాత్రం సంబంధం లేదని అమెరికా తేలి్చచెప్పింది. తమ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతోనే తూర్పు సిరియాలో ఇరాన్ సాయుధ దళాలపై దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ పేర్కొన్నారు. అమెరికా దళాలపై దాడులను సహించబోమని పేర్కొన్నారు. అక్టోబర్ 17 నుంచి ఇరాక్, సిరియాలోని తమ సైనిక స్థావరాలపై, జవాన్లపై కనీసం 19 దాడులు జరిగాయని పెంటగాన్ ఆరోపించింది. ఈ దాడులకు బాధ్యులైనవారిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ పశ్చిమాసియాలో భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరిస్తోంది. -
సిరియాలో ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు!
సిరియాలో ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. దీనిని అమెరికా రక్షణ విభాగం ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ బలగాలపై దాడులకు ప్రతిగానే ఈ దాడులు చేపట్టామని, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాని అనుబంధ విభాగాలు ఈ స్థావరాల్ని ఉపయోగించుకుంటున్నాయని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఇరాక్, సిరియాలో ఉన్న అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 17 నుంచి ఇరాన్ ప్రోత్సాహక ఉగ్ర సంస్థలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడులు హమాస్, ఇస్లామిక్ జిహాద్, హిజ్బుల్లా పనేనని అమెరికా అనుమానిస్తోంది. ప్రతిదాడుల్లో భాగంగానే తాజా దాడులు జరిపినట్లు ప్రకటించింది అమెరికా. అయితే ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభానికి, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఆస్టిన్ స్పష్టం చేశారు. అమెరికా ట్రూప్లపై దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధ్యక్షుడు జో బైడెన్.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీకి గురువారం నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రకటన వెలువడి రోజు గడవక ముందే సిరియాలోని ఇరాన్ స్థావరాల్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవడం విశేషం. -
ఇజ్రాయెల్ దాడుల్లో బందీల మృతి
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తమ ఆధీనంలో ఉన్న బందీలు మరణించినట్లు హమాస్ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్ ఉత్తర భాగంలో ఈ దాడులు జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లోని మొత్తం 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. హమాస్ గత శనివారం ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేసి సుమారు 150 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బందీల్లో సాధారణ పౌరులు, విదేశాలకు చెందిన వారూ ఉన్నారు. బందీలను హమాస్ చెర నుంచి తప్పించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైనికులు కృషి చేస్తూనే హమాస్ బలగాలను మట్టుబెట్టేందుకూ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గాజా మొత్తంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజా స్ట్రిప్ జనాభా దాదాపు 24 లక్షలు. ఇజ్రాయెల్ బాంబు, క్షిపణి దాడులు విపరీతమైన ఆస్తినష్టాన్ని మిగులుస్తున్నాయి. భవనాలు నేలమట్టం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకూ గాజాపై జరిపిన దాడుల్లో 1500 మంది మృతి చెందారు. అందులో 500 మంది చిన్నారులే ఉన్నట్లు హమాస్ మీడియా కార్యాలయం ప్రకటించింది. మరోవైపు గాజా పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులకు.. ప్రతిగా బందీలను హతమారుస్తామంటూ హమాస్ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో.. నీటి, కరెంట్ సరఫరాను నిలిపివేసింది. తాజాగా గాజాను ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ఇజ్రాయెల్ రక్షణ దళం ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని.. అది కల్లోలానికి దారి తీస్తుందని చెబుతోంది. -
గాజాలో ఇస్లామిక్ జిహాద్ అగ్రనేత హతం
గాజా సిటీ: ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ మధ్య ఘర్షణ నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ఇస్లామిక్ జిహాద్ ఉద్యమానికి అడ్డాగా మారిన గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆదివారం మూడో రోజుకు చేరాయి. శుక్రవారం దాడులు మొదలైన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో తాజాగా ఇస్లామిక్ జిహాద్ ఉద్యమ అగ్రనేత ఖలీద్ మన్సూర్ హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు, ఐదుగురు సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత మూడు రోజుల్లో ఇజ్రాయెల్ ప్రకోపానికి బలైన వారి సంఖ్య 31కు చేరింది. ఖలీద్ మన్సూర్ దక్షిణ గాజాలో రఫా శరణార్థుల శిబిరంలోని ఓ అపార్టుమెంట్పై నివసిస్తున్నాడు. అదే అపార్టుమెంట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగింది. మరోవైపు ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న ఇస్లామిక్ జిహాద్ సంస్థ కూడా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి వందలాది రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్–ఇస్లామిక్ జిహాద్ నడుమ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, గాజాలో అధికారం చెలాయిస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్ మాత్రం ప్రస్తుతానికి మౌనం పాటిస్తోంది. -
Russia-Ukraine war: ముట్టడిలో నగరాలు
పోక్రోవ్స్క్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్లో రష్యా పెను విధ్వంసం సృష్టిస్తోంది. తూర్పున డోన్బాస్లో పలు నగరాలపై బాంబు దాడులతో విరుచుకుపడింది. తయరీ పరిశ్రమకు కేంద్రమైన సెవెరోడోనెట్స్క్ నగరం బాంబులు, క్షిపణుల మోతతో దద్దరిల్లింది. సమీపంలోని లిసిచాన్స్క్ తదితర నగరాలపైనా దాడులు తీవ్రతరమయ్యాయి. డోన్బాస్లో కీలక కేంద్రాలైన ఈ రెండు నగరాలను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు కదులుతున్నాయి. అయితే ఉక్రెయిన్ దళాలు పలుచోట్ల వాటితో హోరాహోరీ తలపడుతున్నాయి. డోన్బాస్ చాలావరకు రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉండగా ఈ రెండు నగరాలూ ఉక్రెయిన్ అధీనంలో ఉన్నాయి. అక్కడి సైనిక లక్ష్యాలపై జరిగిన దాడుల్లో పలువురు పౌరులు కూడా బలయ్యారు. పౌర సేవలన్నీ స్తంభించిపోయాయి. సెవెరోలో ఇప్పటికే కనీసం 1500 మందికి పైగా మరణించినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని బాబ్రోవ్ గ్రామం వద్ద జరిగిన పోరులో రష్యా దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. చాలామంది సైనికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు అవుతున్నట్టు చెబుతున్నారు. లుహాన్స్క్ ప్రాంతంలోని బక్ముట్ నగరంపైనా శనివారం రాత్రి నుంచి దాడులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి. మరోవైపు ఉత్తరాన రెండో అతి పెద్ద నగరమైన ఖర్కీవ్తో పాటు , సమీ తదితర ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అక్కడి సరిహద్దు ప్రాంతాలపై క్షిపణి దాడుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. ఈయూ ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యాతో సెర్బియా మూడేళ్ల గ్యాస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశం ఇంధన అవసరాల కోసం దాదాపుగా రష్యా మీదే ఆధారపడింది. -
యెమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడి
దుబాయ్: యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహించే ఒక జైలుపై సౌదీ ఆధ్వర్యంలో శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో వందమందికి పైగా గాయపడడం, చనిపోవడం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు యెమెన్లోని హోడైడా నగరంలో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్పై వైమానిక దాడి జరగడంతో దేశమంతా ఇంటర్నెట్ సౌకర్యం నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో సౌదీ, యూఏఈపై హౌతీ రెబల్స్ డ్రౌన్ దాడులు పెరిగాయి. వీటికి ప్రతీకారంగా అరబ్ దేశాల కూటమి ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సదా నగరంలోని జైలుపై జరిగిన దాడిలో గాయపడిన వారిని రక్షించే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు రెడ్క్రాస్ సంస్థ ప్రకటించింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయమై హౌతీ వర్గాలు ఇంకా స్పందించలేదు. సిరియా, ఇరాక్లో ఐసిస్ దాడులు బాగ్దాద్: ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు. సిరియాలోని అతిపెద్ద జైలుపై దాదాపు 100మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు గురువారం రాత్రి దాడి జరిపగా, ఇరాక్లో ఆర్మీ బ్యారక్పై శుక్రవారం విరుచుకుపడ్డారు. ఇరాక్లో జరిగిన దాడిలో 11మంది ఇరాకీ సైనికులు చనిపోగా, సిరియా జైలు దాడిలో ఏడుగురు కుర్దిష్ సైనికులు, 23 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఇటీవల కాలంలో రెండు దేశాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేయడం ఆరంభించి పలువురు ఇరాకీ, సిరియన్ల మృతికి కారణమవుతున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ దగ్గరలోని సైనిక శిబిరంపై ఐసిస్లు తుపాకులతో విరుచుకుపడ్డారు. దీంతో శిబిరంలో నిద్రిస్తున్న ఒక లెఫ్టినెంట్ సహా 10మంది సైనికులు చనిపోయారు. మరోవైపు సిరియాలో ఇటీవల ఐసిస్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందుకు ప్రతీకారంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా గ్వేరియన్ జైలుపై దాడికి దిగారు. ఆ సమయంలో జైల్లో 3వేలమంది ఐసిస్ మిలిటెంట్లున్నారని కుర్దిష్ డెమొక్రాటిక్ బలగాల ప్రతినిధి ఫర్హాద్ షామి చెప్పారు. దాడికి ముందు జైల్లో ఉగ్రవాదులు తిరుగుబాటు చేసి పారిపోయేందుకు యత్నించారని, ఇదే సమయంలో జైలు బయట ఒక కారుబాంబు పేలిందని జైలు వర్గాలు తెలిపాయి. దాడికి దిగిన ఉగ్రవాదుల్లో సిరియన్లు లేరని, వీరంతా విదేశీయులని తెలిపారు. దాడి అనంతరం తప్పించుకున్న 89 మంది ఉగ్రవాదులను తిరిగి పట్టుకున్నారు. 2017లో ఇరాక్, 2019లో సిరియాల్లో ఐసిస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇలా మెరుపుదాడులకు దిగడం ఆరంభించింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాక్ మిలటరీ ప్రతిజ్ఞ చేసింది. -
Gaza: నువ్వొక్కడివే బతికావు నాన్నా.. మనం కూడా
గాజా సిటీ: అమ్మ ఒడిలో ఉండాల్సిన ఐదు నెలల చిన్నారి ఒమర్ ఆస్పత్రి బెడ్పై పడుకుని ఉన్నాడు. మంచం అంచునే కూర్చున్న అతడి తండ్రి మహ్మద్ అల్- హదీద్ చెమర్చిన కళ్లతో పదే పదే కొడుకును చూసుకుంటూ ఉన్నాడు. బోసి నవ్వులతో వెలగాల్సిన ఆ పసివాడి ముఖం కుట్లతో నిండి ఉండటం, ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న కాలికి కట్లు కట్టి ఉండటం చూస్తుంటే ఆ తండ్రి మనస్సు తరుక్కుపోతోంది. ‘‘కనీసం నువ్వైనా మిగిలావు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న తోడు నువ్వొక్కడివే నాన్నా’’ అంటూ మౌనంగానే రోదిస్తున్నాడు మహ్మద్. కొడుకు ఎక్కడ ఉలిక్కిపడి నిద్రలేస్తాడోనన్న భయంతో. బాంబు దాడులకు బలైపోయి.. నిర్జీవంగా పడి ఉన్న భార్య చేతుల్లో నుంచి రక్షణ బృందాలు బిడ్డను వేరు చేసి.. ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలు ఇంకా తన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. తాను కూడా చనిపోతే బాగుండు అనే ఆలోచన వస్తోంది మహ్మద్కు. కానీ నలుగురు కొడుకుల్లో చిన్నవాడు, పసివాడు అయిన ఒమర్ కోసమైనా బతకాల్సిన పరిస్థితి. ఇజ్రాయెల్- హమాస్ మిలటరీ గ్రూపు మధ్య జరుగుతున్న పరస్పర క్షిపణి దాడుల కారణంగా అల్లకల్లోలమవుతున్న గాజాలోని అనేకానేక బాధిత కుటుంబాల్లో మహ్మద్ ఫ్యామిలీ ఒకటి. నలుగురు పిల్లలు.. ముచ్చటైన సంసారం మహ్మద్ అల్- హదీది(37)- మహా అబు హతాబ్(36) దంపతులు. వీరికి సుహబ్(13), అబర్రహమాన్(8), ఒసామా(6), ఒమర్(5 నెలలు) సంతానం. రంజాన్ పండుగ సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు వేయించి, వారిని తీసుకుని బంధువుల ఇంటికి బయల్దేరింది మహా. గాజా సిటీకి కాస్త దూరంలో ఉన్న షతీ శరణార్థి శిబిరంలో తన వాళ్లను కలుసుకుని సంతోషించింది. చాలా కాలం తర్వాత వచ్చాను కదా.. ఈరోజు ఇక్కడే ఉంటాం అని భర్తను ఒప్పించింది. అందుకు సరేనన్నాడు మహ్మద్. భార్యాపిల్లలు ఇక్కడ.. అతడొక్కడే అక్కడ తమ ఇంట్లో. ఎందుకో మహ్మద్కు ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. తెల్లవారుజామునే బాంబుల మోతతో ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. మరో ఆలోచన లేకుండా బయటకు పరుగులు తీశాడు. భార్యా, పిల్లలు ఉన్న చోటుకు వెళ్లి చూడగా.. అంతా శిథిలమై ఉంది. నిశ్చేష్టుడైపోయాడు మహ్మద్. భవన శిథిలాల కింద నుంచి ఒక్కొక్క శవాన్ని బయటకు తీస్తున్నాయి రక్షణ బృందాలు. తొలుత భార్య మహా, ఆ తర్వాత ముగ్గురు కొడుకుల మృతదేహాలు. ప్రపంచమంతా చీకటైపోయినట్లు అనిపించింది అతడికి. అంతలోనే ఒమర్ ఏడుపు సన్నగా వినబడింది. అతడికి ప్రాణం లేచివచ్చినట్లయింది. సహాయక బృందాల చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని ఒక్కసారిగా గుండెకు హత్తుకున్నాడు మహ్మద్. మృదువుగా కొడుకు తలనిమిరి మరింత దగ్గరికి చేర్చుకున్నాడు. వెంటనే తనని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. కనీసం తనకంటూ ఈ ప్రపంచంలో ఒక్కడైనా సజీవంగా మిగిలి ఉన్నాడన్న ఆశతో. ఇలాంటి మహ్మద్లు ఎందరెందరో గాజాలో. కానీ హమాస్ దాడులు, అందుకు ప్రతిగా అన్నట్లు ఇజ్రాయెల్ వేసే బాంబుల మోత అక్కడ నిత్యకృత్యమే. ఈ ఆధిపత్య పోరుకు ఎప్పుడు తెరపడుతుందో ఊహించడం కష్టం. హమాస్ మిలటరీనే టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ చెబుతున్నా.. ఆ దాడుల కారణంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ఈ విషయం గురించి మానవ హక్కుల సంఘాలు ఎంతగా మొత్తుకున్నా ఎవరికీ పట్టడం లేదు. ఏదేమైనా.. ఓవైపు వ్యవసాయం, మరోవైపు చేపల వేటపై ఆంక్షలు విధించడం సహా బాంబు దాడుల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోలేక గాజా ప్రజలు ఆకలికి అలమటిస్తూ బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఆ దేవుడికి ముందే తెలుసునేమో.. ‘‘ఆరోజు నా పిల్లలు ఈద్ సంబరంలో కొత్త బట్టలు వేసుకున్నారు. బొమ్మలు తీసుకుని వాళ్ల అంకుల్ వాళ్లింటికి బయల్దేరారు. నా భార్య ఆరోజు అక్కడే ఉంటామని పట్టుబట్టింది. అందుకు నేను అనుమతించకపోయి ఉండే బాగుండేది. ఆరోజు నా జీవితంలో ఇంతటి విషాదాన్ని నింపుతుందని అస్సలు ఊహించలేకపోయాను. ఒమర్ ఒక్కడే ఇప్పుడు నాకంటూ ఉన్న తోడు. మీకు తెలుసా.. నా ముగ్గురు కొడుకులు తల్లిపాలు తాగి పెరిగారు. కానీ చిన్నవాడికి మొదటి నుంచీ ఆ అలవాటు లేదు. పుట్టిన నాటి నుంచే వాడు అమ్మ దగ్గర పాలు తాగలేదు. బహుశా.. ఆ దేవుడికి ముందే తెలుసునేమో. తల్లి వాడికి శాశ్వతంగా దూరమవుతుందని. అందుకే మమ్మల్ని ఇలా సన్నద్ధం చేశాడేమో. నేను వాడిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అయినా మేం కూడా తొందర్లోనే మా వాళ్లను కలుస్తామేమో. ఇక్కడ ఎక్కువ రోజులు బతుకుతామనే నమ్మకం నాకు లేదు’’ అంటూ మహ్మద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మేమేం పాపం చేశాం ఇజ్రాయెల్ దాడుల గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘వాళ్లు కావాలనే చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారని అనిపిస్తోంది. ఒక్కసారి హెచ్చరిక జారీ చేయకుండా.. ఇంటిని ఖాళీ చేయమని చెప్పకుండా ఇలా బాంబులు కురిపించడం న్యాయమా. మేమేం పాపం చేశాం. నా బిడ్డ తల్లిలేని వాడయ్యాడు. నేను నా కుటుంబాన్నే కోల్పోయాను’’ అంటూ అంతర్జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. కాగా గత సోమవారం నుంచి జరుగుతున్న పరస్పర దాడుల్లో గాజా స్ట్రిప్లోని 200 మంది చనిపోగా, అందులో 59 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇక పాలస్తీనియన్ వైపు నుంచి కురుస్తున్న బాంబు ధాటికి ఇజ్రాయెల్లో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. చదవండి: ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?! -
తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. శాంతికి కట్టుబడి ఉంటే అఫ్గాన్కు సాయం అందించడంలో అమెరికా ముందుంటుందని ట్రంప్ చెప్పారు. ‘తాలిబన్ అగ్రనేతతో ఈ రోజు మాట్లాడాను. హింసకు తావులేదన్న అంశాన్ని ఇరువురూ అంగీకరించాం. ఏమవుతుందో చూద్దాం’ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముల్లాతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా బుధవారం తాలిబన్పై వైమానిక దాడులకు దిగడంతో మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్లో వైమానిక దాడులు జరగడం గమనార్హం. అమెరికా, తాలిబన్ల మధ్య గత శనివారం శాంతి ఒప్పందం కుదరగా, రానున్న 14 నెలల కాలంలో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. హెల్మాండ్లో మంగళవారం తాలిబన్లు 43 సార్లు దాడులకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకే తాము వైమానిక దాడులకు దిగామని అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ తెలిపారు. తాలిబన్లు ఇలాంటి దాడులను కట్టిపెట్టి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. బుధవారం తాలిబన్ జరిపిన దాడుల్లో సుమారు 20 మంది అఫ్గాన్ సైనికులు మరణించారని మిలటరీ వర్గాలు తెలిపాయి. -
లిబియాలో ఘోరం; 28 మంది సైనికుల మృతి
ట్రిపోలి : లిబియాలో శనివారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. లిబియా రాజధాని ట్రిపోలీలోని సైనిక పాఠశాలపై జరిగిన వైమానిక దాడుల్లో 28 మంది సైనికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే విషయాన్ని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అమిన్ అల్-హషేమి మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై శనివారం వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడిలో 28 మంది మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. అయితే వైమానిక దాడులకు ముందు సైనికులంతా పెరేడ్ గ్రౌండ్లో సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత వీరంతా తమ గూడారాల్లోకి వెళుతుండగా ఒక్కసారిగా దాడులు జరిగాయని అమిన్ పేర్కొన్నారు. ఈ మిలటరీ స్కూల్ ట్రిపోలి కేంద్రంగా అల్-హద్బా అల్-ఖాద్రాలో ఉంది. కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికులకు రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిఎన్ఎ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 2011లో నాటో సహాయంతో అప్పటి దీర్ఘకాల నియంత మోమెర్ ఖడాఫీని జిఎన్ఏ దళాలు మట్టుబెట్టడంతో లిబియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి జీఎన్ఎ, దాని ప్రత్యర్థుల మధ్య వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.దీంతో పాటు గత ఎప్రిల్లో లిబియా దక్షిణభాగానికి నేతృత్వం వహిస్తున్న మిలటరీ కమాండర్ ఖలీఫా హప్తర్ జిఎన్ఎకు వ్యతిరేకంగా మారడంతో లిబియా దేశం నిత్యం వైమానిక దాడులతో అట్టుడుకుతుందని సమాచారం.(ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక) -
ఇరాక్లో అమెరికా దాడులు
బాగ్దాద్: ఇరాక్లోని ఇరాన్ అనుకూల వర్గంపై అమెరికా ఆదివారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. సిరియా సరిహద్దుల్లోని అల్ ఖయిమ్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా బ్రిగేడ్స్కు చెందిన పలు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 25 మంది చనిపోయారు. 51 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల్లో పలువురు కమాండర్లు కూడా ఉన్నారు. ఇరాన్ అనుకూల హషెద్ అల్ షాబి సంస్థ విభాగమే హెజ్బొల్లా బ్రిగేడ్స్. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదాన్ని అమెరికా ప్రోత్సహిస్తోందని, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని మండిపడింది. ఇందుకు అమెరికా మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్బాస్ మౌసవి హెచ్చరించారు. ఇరాక్లోని 3, సిరియాలోని 2 స్థావరాలపై అమెరికా జరిపిన దాడులు విజయవంతమయ్యాయని అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్ చెప్పారు. -
పాకిస్తాన్కు మరో చావుదెబ్బ
భారత బలగాలు భారీగా కాల్పులతో విరుచుకుపడటంతో ధ్వంసమైన పాక్ ఆర్మీ పోస్టులు, ఉగ్ర శిబిరాల నుంచి వెలువడుతున్న పొగ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ ప్రతీకార కాల్పులు న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ను మరోసారి భారత్ చావుదెబ్బ తీసింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడుల అనంతరం.. ఆ స్థాయిలో ఆదివారం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పీఓకేలోని నీలం లోయలో ఉన్న నాలుగు ఉగ్ర స్థావరాల్లో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. పక్కా ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని భారత జవాన్లు కాల్పులు జరిపారు. మూడు స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి, మరో స్థావరాన్ని భారీగా నష్టపరిచిన భారత జవాన్లు.. ఆ స్థావరాల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు వీలుగా భారత పోస్ట్లపై కాల్పులు జరపడం కోసం అదే ప్రాంతంలో ఉన్న పాక్ జవాన్ల స్థావరాలను సైతం నేలకూల్చారు. ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు వీలుగా శనివారం తంగధర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు పదమ్ బహదూర్ శ్రేష్ఠ, గమిల్ కుమార్ శ్రేష్ఠ, ఒక పౌరుడు మృతి చెందారు. ప్రతిగా ఆదివారం పీఓకే లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ తీవ్రస్థాయిలో దాడులు ప్రారంభించింది. భారత్ కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 35 వరకు ఉండొచ్చని, వారు జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలకు చెందినవారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాక్ జవాన్లు కూడా భారీగానే హతమయ్యారని పేర్కొన్నాయి. ఆదివారం సాయంత్రం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు భారత్ కాల్పుల్లో 6 నుంచి 10 మంది పాక్ జవాన్లు, అంతే సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు’ అని అన్నారు. వీరమరణం పొందిన భారత జవాన్లు పదమ్ బహదూర్, గమిల్ కుమార్ పీఓకేలోని ఉగ్రస్థావరాల నెట్వర్క్ చాలావరకు ధ్వంసమైందన్నారు. ‘మూడు ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయి. నాలుగోది దాదాపు ధ్వంసమైంది. పక్కా సమాచారంతోనే దాడులు చేశాం’ అన్నారు. ‘దీపావళి పండుగ సమీపిస్తోంది. భారత్లో దాడులు చేసేందుకు కొందరు ఉగ్రవాదులు పీఓకేలోని నీలం లోయలో ఉన్న కొన్ని ఉగ్రస్థావరాల్లో సిద్ధంగా ఉన్నట్లు మాకు సమాచారమందింది. వారు చొరబాటుకు ప్రయత్నించే వరకు ఎదురుచూడకుండా.. ముందే పక్కా ప్రణాళికతో దాడులు చేశాం’ అని వివరించారు. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన ఆగస్ట్ 5వ తేదీ నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మాకు వస్తూనే ఉందని ఆర్మీ చీఫ్ రావత్ వ్యాఖ్యానించారు. నెల రోజులుగా గురెజ్, మచిల్, కేరన్ సెక్టార్ల ద్వారా పలు చొరబాటు ప్రయత్నాలు జరిగాయన్నారు. ‘భారత్లోకి ఉగ్రవాదులను పంపించే ప్రయత్నాలను పాక్ నిలిపేయకపోతే.. మా స్పందన మరింత తీవ్రంగా ఉంటుంది’ అని రావత్ స్పష్టం చేశారు. ‘కశ్మీర్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు. ఒక్కో స్థావరంలో 10 నుంచి 15 మంది జమ్మూకశ్మీర్లోని తంగధర్ సెక్టార్కు ఆవలివైపు పీఓకేలో ఉన్న నీలం లోయలోని ఒక్కో ఉగ్రస్థావరంలో భారత్ దాడులు చేసిన సమయంలో 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు భారత్లోని కశ్మీర్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు, తదనంతర పరిస్థితులను వివరించారు. మరోవైపు, దాడుల్లో ఉగ్రవాదులు, పాక్ జవాన్లు చనిపోయారన్న భారత్ వాదనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులను ఉగ్రస్థావరాలున్నాయని భారత్ చెబుతున్న నీలం లోయ ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారే నిజానిజాలను నిర్ధారిస్తారని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ సవాలు చేశారు. పాకిస్తాన్లో భారత రాయబారి గౌరవ్ అహ్లూవాలియాను పాక్ ప్రభుత్వం పిలిపించి భారత్ కాల్పులకు నిరసన తెలిపింది. భారత్ కాల్పుల్లో ఐదుగురు పౌరులు చనిపోయారని పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు. పాక్ ఆర్మీ కాల్పుల్లో 9 మంది భారత జవాన్లు చనిపోగా, రెండు భారత బంకర్లు ధ్వంసమయ్యాయన్నారు. పాక్ వాదనను భారత ఆర్మీ తోసిపుచ్చింది. ‘ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు వీలుగా శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అందుకు ప్రతిగా భారత్ జరిపిన కాల్పుల్లో పీఓకేలోని పలు ఉగ్రస్థావరాలు, ఆ స్థావరాలకు రక్షణ కల్పిస్తున్న పాక్ ఆర్మీ పోస్ట్లు ధ్వంసమయ్యాయి’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ పేరును వాడుకోవడం బీజేపీ నేతలు ఇకనైనా ఆపేయాలి’ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కోరింది. పఠాన్కోట్.. ఉడి. పుల్వామా! 2016 జనవరి 2: పంజాబ్లోని పఠాన్కోట్లో ఉన్న వైమానిక స్థావరంపై 2016 జనవరి 2వ తేదీ వేకువజామున ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది నేలకొరగగా నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. రాత్రి సమయంలో వైమానిక స్థావరంలోకి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ప్రవేశించిన ఉగ్రవాదులు పేలుళ్లు, కాల్పులతో విధ్వంసం సృష్టించారు. ఉగ్ర మూకలను ఏరిపారేసేందుకు సైన్యానికి 17 గంటలకుపైగా సమయం పట్టింది. 2016 సెప్టెంబర్ 28 ఉడి సైనిక స్థావరంపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రగిలిపోయిన భారత్.. సరిగ్గా పది రోజుల తర్వాత పగ తీర్చుకుంది. 2016 సెప్టెంబర్ 28వ తేదీన అర్థరాత్రి 12 గంటలకు కమాండోలతో కూడిన వైమానిక దళం విమానాలు ఎల్వోసీలోకి ప్రవేశించాయి. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం లోపలికి చొచ్చుకుని వెళ్లి భింబేర్, కేల్, హాట్ స్ప్రింగ్, లిపా సెక్టార్లలోని 7 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా 38 మంది ఉగ్రవాదులతోపాటు ఇద్దరు పాక్ సైనికులను హతం చేశాయి. నాలుగు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ లక్ష్యాలను సాధించి, పూర్తిగా విజయవంతమైందని సైన్యం ప్రకటించింది. 2019 ఫిబ్రవరి 14 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వస్తున్న భద్రతా బలగాల కాన్వాయ్ని ఆత్మాహుతి దళ సభ్యుడు వాహనంతో ఢీకొట్టాడు. భారీ విస్ఫోటం సంభవించి 40 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ ఘటన అనంతరం భారత్ మరోసారి ఎల్వోసీలోకి వైమానికదళాన్ని పంపింది. బాలాకోట్లో నడుస్తున్న ఉగ్ర శిక్షణ శిబిరంపై భీకర దాడులు జరిపి, తీవ్ర నష్టం కలిగించింది. అనంతరం సరిహద్దుల్లో పాక్ ఎఫ్–16 కూల్చివేత, తదనంతర పరిణామాల్లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పట్టుబడటం, పాక్ అతడిని సురక్షితంగా విడిచి పెట్టడం తెలిసిందే. -
బాలాకోట్ మళ్లీ యాక్టివేట్ అయింది: ఆర్మీ చీఫ్
చెన్నై: పాకిస్థాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలు మళ్లీ ఇటీవల యాక్టివేట్ అయ్యాయని, దాయాది దేశం వీటిని యాక్టివేట్ చేసిందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా గత ఫిబ్రవరిలో బాలాకోట్లోని జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ‘పాకిస్థాన్ ఇటీవలే బాలాకోట్ను యాక్టివేట్ చేసింది. బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలు దెబ్బతిని, ధ్వంసమైన విషయాన్ని ఇది చాటుతోంది. భారత వైమానిక దళాలు జరిపిన దాడిలో బాలాకోట్ ధ్వంసమైన సంగతిని ఇది చాటుతోంది. ఇప్పుడు మళ్లీ ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు’ అని రావత్ పేర్కొన్నారు. చెన్నైలో యంగ్ లీడర్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. సరిహద్దుల్లో దాదాపు 500 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వారు భారత్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంపై రావత్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు చొరబాటుకు వీలుగా పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, దీనిని ఎలా ఎదుర్కోవాలో భారత్ సైన్యానికి తెలుసునని అన్నారు. -
బాలాకోట్ దాడులను కళ్లకు కట్టేలా దుర్గా మండపం
కోల్కతా : దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలను వైవిథ్యభరితంగా తీర్చిదిద్దే భక్తులు ఈసారి బాలాకోట్ వైమానిక దాడులను థీమ్గా ఎంచుకుని మండపం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమయ్యారు. కోల్కతాలోని ఓ దుర్గాపూజా కమిటీ భారత వైమానిక దళం బాలాకోట్లో ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసిన ఘటనను థీమ్గా ఎంచుకుంది. 50 ఏళ్లుగా దుర్గా మండపాలను ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కోల్కతాలోని యంగ్ బాయ్స్ క్లబ్ సర్బోజనిన్ దుర్గా పూజ కమిటీ క్లే మోడల్స్, డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా వైమానిక దాడులను ప్రజల కళ్లకు కట్టేలా ఈ మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. మండపం ఎంట్రన్స్లో వైమానిక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకోవడం, ఉగ్రవాదులు మరణించిన, పారిపోతున్న దృశ్యాలు, వాటిపై ఐఏఎఫ్ ఎయిర్క్రాఫ్ట్ తిరుగుతుంటేలా 65 మోడల్స్తో డిస్ప్లే ఏర్పాటు చేశామని కమిటీ ప్రతినిధి విక్రాంత్సింగ్ వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ లైఫ్సైజ్ మోడల్ సందర్శకులను పలుకరించలేలా అమర్చుతున్నామని చెప్పుకొచ్చారు. -
పీఓకేలో పాక్ శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలతో పాటు భారత్లో ఉగ్రదాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కుయుక్తులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్లను, పాక్ శిబిరాలను సోమవారం భారత సైన్యం ధ్వంసం చేసింది. పాక్ సైనిక శిబిరాలకు చేరువగా ఉన్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ను నిర్వీర్యం చేసింది. లీపావ్యాలీలోని ఉగ్ర శిబిరాలను భారత సేనలు ధ్వంసం చేశాయి.పాకిస్తాన్ సేనలు భారత్లోకి ఉగ్రవాదులను చొప్పించేందుకు ఈ శిబిరాలను వాడుతున్నాయి. పాక్ సేనల సహకారంతో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజహిదిన్, లష్కరీ తోయిబా వంటి పలు ఉగ్రవాద సంస్ధలు ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేశాయి. ఈ శిబిరాల్లో ఉగ్రవాదులకు భారత్లో ఉగ్ర దాడులతో పాటు భారత సైన్యం కన్నుగప్పి చొరబాట్లకు ఎలా పాల్పడవచ్చనే అంశాలపై తర్ఫీదు ఇస్తారు. -
భారతీయుడిగా అది నా బాధ్యత
ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ ఎయిర్పోర్స్ బృందం అరెస్టు చేయడం, తర్వాత పాకిస్తాన్ అతన్ని విడిచిపెట్టేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం.. ఫైనల్గా అభినందన్ తిరిగి భారత్కు రావడం.. ఇలా అన్ని విషయాలను దేశ ప్రజలు చాలా ఆసక్తితో గమనించారు. ఇప్పుడు ఈ విషయాలనే వెండితెరపై చూపించబోతున్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ‘‘బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సంఘటనల ఆధారంగా సినిమా తీయడానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ విభాగం నాకు అనుమతులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారతీయుడిగా, దేశ భక్తుడిగా, మన ఆర్మీ బలగాల సమర్థతను ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. పుల్వామా ఎటాక్స్, బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ ఘటనలకు చెందిన వార్తలను నేను ఫాలో అవుతూనే ఉన్నాను. తమ ఆర్మీ, ఇంటెలిజెన్సీ ఇండస్ట్రీస్, పొలిటికల్ లీడర్స్ గురించి హాలీవుడ్ ఫిల్మ్మేకర్స్ గొప్పగా చెప్పుకుంటారు. మనం ఎందుకు అలా చేయకూడదు? అందుకే ఈ ప్రయత్నం’’ అన్నారు వివేక్. ఈ చిత్రానికి ‘బాలాకోట్: ది ట్రూ స్టోరీ’ అనే టైటిల్ను అనుకుంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. హిందీ, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. జమ్ము కశ్మీర్, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేశారు. మరి.. ఈ సినిమాలో వివేక్ నటిస్తారా? లేక కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు చెందిన శత్రు విమానాన్ని కూల్చేసిన అనంతరం మూడు రోజులపాటు పాక్లో బందీగా ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర శౌర్య పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనిక పురస్కారాలను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్కు ఆయన మరణానంతరం రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను కేంద్రం ఇచ్చింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్తో భారత్ ఆకాశంలో తలపడినప్పుడు స్క్వాడ్రన్ లీడర్గా ఉండి విమానాలను నియంత్రించిన మింటీ అగర్వాల్కు యుద్ధ సేవా పతకం దక్కనుంది. వాయుసేనకు 5 యుద్ధ సేవ, 7 వాయుసేన పతకాలు సహా మొత్తం 13 పురస్కారాలు దక్కనున్నాయి. ఫిబ్రవరి 26న పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన ఐదుగురు యుద్ధ పైలట్లకు పురస్కారాలు లభించాయి. ఆర్మీకి 8 శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేనా పతకాలు దక్కాయి. నౌకాదళానికి ఒక శౌర్య చక్ర పురస్కారం లభించింది. పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ శిక్షణా శిబిరంపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేయడంతో మరుసటి రోజే పాక్ ప్రతిదాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో పాక్కు చెందిన ఎఫ్–16 విమానాన్ని వర్ధమాన్ కూల్చేశారు. తాను నడుపుతున్న మిగ్–21 విమానం దాడికి గురవ్వడంతో ఆయన కిందకు దూకేసి ప్రాణాలతో బయటపడినప్పటికీ పాకిస్తాన్లో దిగారు. దీంతో ఆయనను పాకిస్తాన్ మూడురోజులపాటు బందీగా ఉంచుకున్న అనంతరం భారత్కు అప్పగించింది. ముంబైలో జాతీయ జెండాతో సినీ నటి నిత్యా మీనన్ -
అభినందన్కు వీర్చక్ర.. లేడీ స్క్వాడ్రన్కు మెడల్
న్యూఢిల్లీ: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వర్ధమాన్కు కేంద్ర ప్రభుత్వం వీర్చక్ర పురస్కారం ప్రదానం చేయనుంది. బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ తర్వాత భారత గగనతలంలోకి చొరబడిన పాక్ F16 యుద్ధవిమానాన్ని మిగ్-21 ఫైటర్జెట్తో అభినందన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన పాక్ విమానాలను తరిమికొట్టే క్రమంలో అతని మిగ్ 21 ఫైటర్ జెట్ కూలిపోయింది. దీంతో తమ భూభాగంలో ల్యాండ్ అయిన వర్థమాన్ని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే, భారత్ తీసుకొచ్చిన దౌత్య ఒత్తిడితో మార్చి 1వ ఆయనను తేదీన విడుదలచేసింది. శత్రుచెరలో 60 గంటలు గడిపి.. దాయాది సైన్యం ఎంత ఒత్తిడిచేసినా సైనిక రహస్యాల గుట్టువిప్పకుండా... సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చిన వర్థమాన్పై ప్రశంసల జల్లుకురిసింది. అతడి వీరత్వానికి గుర్తింపుగా కేంద్రప్రభుత్వం వీరచక్రతో సత్కరించింది. జవాన్లకిచ్చే పరమవీరచక్ర, మహావీరచక్ర తర్వాత మూడో అత్యున్నత పురస్కారం ఇది. ఇక, భారత ఆర్మీకి చెందిన సప్పర్ ప్రకాశ్ జాధవ్కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారం దక్కింది. ఇక భారత సైన్యానికి ఎనిమిది శౌర్య చక్ర పురస్కారాలు, 98 సేన మెడళ్లు (గాలంట్రీ), నాలుగు మెన్షన్ ఇన్ డిస్పాచెస్ దక్కాయి. ఇక, భారత వాయుసేనకు ఐదు యోధ సేవ మెడళ్లు, ఏడు వాయుసేన మెడళ్లు వచ్చాయి. ఈ మెడళ్లు సాధించిన వారిలో బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన మిరాజ్ ఫైటర్ పైలట్లు కూడా ఉన్నారు. మొత్తం 13మందికి ఈ మెడళ్లు దక్కగా.. అందులో 12మంది ఫైటర్ ఫైలట్లు కాగా, ఒకరు లేడీ స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్. భూతలంలో ఫ్లయిట్ కంట్రోలర్గా ఉన్న ఆమె.. బాలాకోట్ దాడుల అనంతరం గగనతలంలో పాక్ ఫైటర్ జెట్ దాడులను భారత పైలట్లు తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇందుకుగాను ఆమెను యోధ సేవ మెడల్ వరించింది. -
పైలట్ అభినందన్కు అత్యున్నత పురస్కారం?
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను భారత ప్రభుత్వం ఉన్నత మిలిటరీ పురస్కారంతో సత్కరించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం గగనతలంలో జరిగిన పోరులో దాయాది పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 విమానాన్ని తాను నడుపుతున్న మిగ్-21 బిసన్ యుద్ధవిమానం నుంచి అభినందన్ కూల్చేశారు. ఇందుకుగాను ఆయనకు ‘వీరచక్ర’ పురస్కారం దక్కే అవకాశముందని తెలుస్తోంది. పరమవీర చక్ర, మహావీర చక్ర పురస్కారాల తర్వాత అత్యున్నత మిలిటరీ పురస్కారం ‘వీరచక్ర’. బాలాకోట్లోని జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడిచిన ఐదుగురు మిరాజ్ 2000 ఫైటర్ పైలట్లను కూడా కేంద్రం సత్కరించనుంది. వారి సాహసానికి గుర్తింపుగా వాయుసేన మెడల్స్ను బహూకరించనుంది. పాక్ యుద్ధవిమానాలతో పోరాడుతూ.. తన మిగ్-21 బిసన్ యుద్ధవిమానం కూలిపోవడంతో అభినందన్ పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. రెండురోజుల పాక్ చెరలో ఉన్న అభినందన్ను.. భారత ప్రభుత్వం తెచ్చిన దౌత్య ఒత్తిడిని తలొగ్గి దాయాది రెండు రోజుల అనంతరం మన దేశానికి అప్పగించింది. గత ఫిబ్రవరి 26న పూల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా బాలాకోట్లో భారత సైన్యం వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. -
బిన్ లాడెన్ కుమారుడు హతం!
వాషింగ్టన్: ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్కాయిదా కీలక నేత హమ్జా వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. హమ్జా మరణించినట్లు ముగ్గురు అమెరికా అధికారులు స్పష్టం చేశారని, అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాలను వారు వెల్లడించలేదని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. దీని వెనుక అమెరికా హస్తం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్లో భాగంగా హమ్జా హతమైనట్లు న్యూయార్క్ టైమ్స్ కూడా చెప్పింది. ఎన్బీసీ కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అంగీకరించలేదు.. కనీసం ఖండిం చనూ లేదు. అల్కాయిదాలో కీలక నేతగా ఎదుగుతున్న హమ్జాను పట్టించిన వారికి దాదాపు రూ.7 కోట్లు బహుమతిగా ఇస్తామని 2019 ఫిబ్రవరిలో అమెరికా ప్రకటించడానికి ముందే అతడు మరణించినట్లు ఎన్బీసీ, న్యూయార్క్ టైమ్స్ కథనాలను బట్టి తెలుస్తోంది. లాడెన్ 20 మంది సంతానంలో 15వ కుమారుడైన హమ్జా.. లాడెన్ మూడో భార్య కొడుకు. కాగా, హమ్జాకు 30 ఏళ్ల వయసున్నట్లు భావిస్తున్నారు. జిహాద్కు పట్టపు యువరాజుగా పేర్కొంటున్న హమ్జా.. అమెరికాపై దాడులు చేయాల్సిందిగా తరచూ వీడియోలు, ఆడియోల రూపంలో పిలుపునిస్తూ ఉండేవాడు. తన తండ్రి లాడెన్ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేవాడు. హమ్జా ఎక్కడున్నాడనే విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఇరాన్లో గృహనిర్బంధంలో ఉన్నాడని, అఫ్గానిస్తాన్లో ఉన్నాడని, పాకిస్తాన్, సిరియాలో తలదాచుకునే వాడని భావిస్తూ ఉండేవారు. లాడెన్ను 2011లో మట్టుబెట్టిన అనంతరం అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల ఆధారంగా అల్కాయిదాను ముందుండి నడిపేందుకు హమ్జాను జాగ్రత్తగా పెంచుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. -
ఆ షాక్ నుంచి తేరుకోని పాకిస్తాన్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా దాడికి ప్రతిగా భారత వైమానిక దళం చేపట్టిన బాలాకోట్ మెరుపు దాడుల ప్రభావం నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత మెరుపు దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన పాకిస్తాన్ అధికారులు సరిహద్దు ప్రాంతంలో వారి గగనతలాన్ని మూసివేయగా, భారత సరిహద్దుల వెంబడి పాక్ తన సేనలను మోహరించింది. నూతన రక్షణ వ్యూహాల్లో భాగంగా పాక్ సేనలు వ్యూహాత్మక స్ధావరాల్లో సాయుధ వాహనాలను మోహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఫిబ్రవరి 26న వైమానిక దళం బాలాకోట్లో మెరుపు దాడులు చేసినప్పటి నుంచి పాకిస్తాన్ సైన్యం అప్రమత్తమైందని సమాచారం. భారత్ యుద్ధ విమనాలను సరిహద్దు పోస్టుల నుంచి మళ్లిస్తేనే తమ గగనతలాన్ని ఓపెన్ చేస్తామని పాకిస్తాన్ అధికారులు ఇటీవల తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. -
‘బాలాకోట్ దాడితో దారికొచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లో జరిపిన మెరుపు దాడులు అనంతరం దేశంలోకి చొరబాట్లు 43 శాతం తగ్గాయని ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్లో వెల్లడించింది. గత ఏడాది తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ప్రధమార్ధంలో జమ్ము కశ్మీర్లో భద్రతా పరిస్థితి మెరుగైందని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. సీమాంతర చొరబాట్లను ప్రభుత్వం ఉపేక్షించకుండా భద్రతా చర్యలను ముమ్మరం చేసిందని తెలిపింది. జమ్ము కశ్మీర్ ప్రభుత్వంతో కలిసి భద్రతా దళాలు దేశ సరిహద్దుల్లో నిరంతర నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో చొరబాట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వైమానికదళం పీఓకేలోని బాలాకోట్లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. -
‘పాక్పై మెరుపు దాడులు అందుకే’
బెంగళూర్ : పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశమని ఇస్లామాబాద్ చేసిన వ్యాఖ్యలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. తమ భూభాగంలో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడంలో పాకిస్తాన్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. కర్నాటకలోని శివమొగ్గలో సోమవారం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్లో వైమానిక దాడులకు దారితీసిన పరిస్థితులను వివరించారు. తమది ఉగ్రవాద బాధిత దేశమని చెబుతున్న పాకిస్తాన్ పుల్వామా దాడికి బాధ్యత తమదేనని చెప్పిన జైషే మహ్మద్పై పాక్ ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆమె ప్రశ్నించారు. జైషే శిబిరాలపై పాకిస్తాన్ చర్యలు చేపట్టకపోవడంతోనే తాము బాలాకోట్లో వైమానిక దాడులు తలపెట్టామని చెప్పారు. కాగా, బాలాకోట్లో ఐఏఎఫ్ చేపట్టిన వైమానిక దాడులపై పలు రాజకీయా పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, సాయుధ దళాలను బీజేపీ రాజకీయాల్లోకి లాగుతోందన్న ఆరోపణలను ఇటీవల ఆమె తోసిపుచ్చారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఎన్డీఏ నేతలెవరూ రాజకీయం చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. -
మేం కూల్చింది ఎఫ్16నే
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్)కు చెందిన ఎఫ్–16 కూల్చివేతపై వస్తున్న అనుమానాలను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరోసారి కొట్టిపారేసింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన ఘటనలో తాము కూల్చింది ఎఫ్–16 యుద్ధ విమానమే అనేందుకు బలమైన ఆధారాలున్నాయని పేర్కొంది. సోమవారం రక్షణ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ ఆర్.జి.కపూర్ మాట్లాడారు. ‘ఫిబవరి 27వ తేదీన జరిగిన ఘటనలో పీఏఎఫ్ ఎఫ్–16ను వినియోగిం చడం మాత్రమే కాదు, దానిని ఐఏఎఫ్ మిగ్–21 బైసన్ విమానం కూల్చి వేసిందడానికి కూడా తిరుగులేని ఆధారాలున్నాయి’ అని తెలిపారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన రెండు విమానాలు పరస్పరం తలపడిన విషయం సుస్పష్టం. అందులో ఒకటి పీఏఎఫ్కు చెందిన ఎఫ్–16 కాగా మరొకటి ఐఏఎఫ్కు చెందిన మిగ్–21 బైసన్ రకం విమానం. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, రాడార్ వ్యవస్థలు కూడా పసిగట్టాయి’ అని వివరించారు. అయితే, భద్రతా కారణాల రీత్యా మిగతా వివరాలను తాము బహిరంగ పర్చలేక పోతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్(అవాక్స్)కు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. ఫిబ్రవరి 27న ఎఫ్–16ను కూల్చివేసిన అనంతరం వింగ్ కమాండర్ అభినందన్ నడుపుతున్న మిగ్ విమానాన్ని పీఏఎఫ్ కూల్చివేయడంతో ఆయన పాక్ భూభాగంలో దిగటం, తర్వాత విడుదల తెల్సిందే. -
విమానాల కూల్చివేతపై తొలిసారి ఒప్పుకున్న పాక్
ఇస్లామాబాద్: బాలాకోట్పై ఐఏఎఫ్ దాడి అనంతరం ఎఫ్–16 విమానాలను వినియోగించలేదని ఇప్పటిదాకా బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా మాట మార్చింది. తమ ఎఫ్–16 యుద్ధ విమానాలే భారత్ విమానాలను కూల్చేశాయని మొదటిసారిగా అంగీకరించింది. పాక్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫిబ్రవరి 27వ తేదీన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైమానిక దళం(పీఏఎఫ్) పాక్ గగనతలం నుంచే దాడులకు దిగింది. ఆ సమయంలో మా భూభాగంలోకి ప్రవేశించిన రెండు ఐఏఎఫ్ విమానాలను పీఏఎఫ్ కూల్చివేసింది. మేం మోహరించిన విమానాల్లో ఎఫ్–16లు కూడా ఉన్నాయి. ఆత్మరక్షణ కోసం ఏ విధంగానైనా స్పందించే హక్కు మాకుంది’ అని ఆయన ప్రకటించారు. ‘ఆ ఘటన గత చరిత్ర. మా వద్ద ఉన్న ఎఫ్–16 విమానాలను మాత్రం ఐఏఎఫ్ కూల్చలేదు’ అని కూడా ఆయన తెలిపారు. కానీ, గత నెలలో జేఎఫ్–17 రకం విమానాన్ని మాత్రమే వాడినట్లు గఫూరే ప్రకటించారు. బాలాకోట్లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ దాడికి ప్రతీకారంగా పాక్ వైమానిక దళం కూడా దాడికి యత్నించిన విషయం తెలిసిందే. కానీ, ఈ సందర్భంగా అమెరికా తయారీ ఎఫ్–16ను ఐఏఎఫ్ కూల్చివేయడం కలకలం రేపింది. ఈ విమానాలను మూడో దేశంపై ఉపయోగించరాదని విక్రయ ఒప్పందంలో అమెరికా పేర్కొంది. కానీ, ఈ షరతులను పాక్ ఉల్లంఘించిందంటూ భారత్ అమెరికాకు సాక్ష్యాధారాలు అందజేయడం తెల్సిందే. -
‘బాలాకోట్’ రిపీట్కు పాక్ యత్నం!
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన మరుసటి రోజు అదే తరహాలో భారత భూభాగంలో దాడులకు పాకిస్తాన్ విఫలయత్నం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా అదే నెల 26న పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్లో భారత వైమానిక దళం దాడులు నిర్వహించి ముష్కరులకు భారీగా నష్టం కలిగించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి రోజు అంటే ఫిబ్రవరి 27న పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ సైన్యానికి చిక్కారు. వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం..ఆ రోజు పాకిస్తాన్ సుమారు 20 యుద్ధ విమానాలతో భారత్పై బాలాకోట్ తరహా దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్–16తో పాటు ఫ్రెంచ్ మిరాజ్–3, చైనీస్ జేఎఫ్–17 విమానాల సాయంతో సుమారు 1000 కిలోల బాంబులను పూంచ్, దాని సమీపంలోని మూడు చోట్ల భారత ఆర్మీ శిబిరాల వైపు విసిరింది. సరిహద్దుకు 50 కిలో మీటర్ల పరిధిలోని తన భూభాగం నుంచే పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. అయితే భారత యుద్ధ విమానాలు సకాలంలో స్పందించడంతో పాకిస్తాన్ లక్ష్యం నెరవేరలేదు. దీంతో ఆ బాంబులను అక్కడికక్కడే వదిలి వెళ్లిపోయారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్లోని ఓ సైనిక స్థావరంపై బాంబులు జారవిడిచినప్పుడు అక్కడ ఉన్న పెద్ద చెట్టు అడ్డుకుందని తెలిపారు. ఆ సమయంలో అదే భవనంలో సీనియర్ అధికారులు ఉన్నట్లు చెప్పారు. -
పాక్పై ఐఏఎఫ్ దాడి తప్పు
న్యూఢిల్లీ: పుల్వామా ఘటనకు ప్రతీకారంగా పాక్పై ఐఏఎఫ్ జరిపిన దాడులను కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం అధ్యక్షుడు శామ్ పిట్రోడా తప్పుపట్టారు. బాలాకోట్లోని ఉగ్ర శిక్షణ శిబిరాలపై దాడికి సంబంధించి మరిన్ని వివరాలను ముఖ్యంగా మృతుల సంఖ్యను వెల్లడించాలని పిట్రోడా శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘వాళ్లు(ఐఏఎఫ్) 300 మంది ఉగ్రవాదులను చంపడం సరే. దీనిని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపగలరా?. సరిహద్దు అవతలి నుంచి కొందరు ఇక్కడికి వచ్చి దాడులు చేశారు. ఇంతకు ముందు ఇలాంటివి ఎన్ని జరగలేదు? ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ముంబైలోనూ దాడి జరిగింది. దీనిపై స్పందించిన అప్పటి యూపీఏ వెంటనే సరిహద్దుల్లోకి విమానాలను పంపించలేదు. కానీ, ఒక సంఘటన ఆధారంగా ఇలా చేయడం దాడి చేయడం సరైన విధానం కాదు’ అన్నారు. ‘కొందరు ఉగ్రవాదులు జరిపిన దాడికి పాక్ను శిక్షించడం సరికాదు. 8మంది ఉగ్రవాదులు వచ్చి ముంబైలో దాడి చేశారు. అంతమాత్రాన పాక్పై విరుచుకుపడతారా? కొందరు వ్యక్తులు చేసిన పనికి దేశ ప్రజలందరినీ తప్పుపడతారా? ప్రధాని తీరు నిరాశ కలిగించింది ‘నేను కొన్ని వివరాలు మాత్రమే అడిగా. అదీ వ్యక్తిగతంగానే, ఇందులో కాంగ్రెస్ ప్రమేయమేమీ లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది. దానిపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదు. అదీకూడా ప్రధానిస్థాయి వ్యక్తి. ఆయన సమాధానంతో నిరాశ చెందా’ అన్నారు. ‘మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పుల్వామా ఘటన చేసుకుంది. బాలాకోట్పై ఐఏఎఫ్ జరిపిన దాడి మన బలగాల సాహసానికి ప్రతీక. ప్రధాని మోదీ, బీజేపీ తమ వ్యక్తిగత అభిప్రాయాలను విద్వేషాన్ని ప్రచారం చేసుకోవడానికి వాడుకోవడం ఆపాలి. సైనిక బలగాల త్యాగాలను స్వార్థానికి వాడుకోవడం మానాలి’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రజలు క్షమించబోరు: మోదీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని విరుచుకుపడ్డారు. ఆయన తన మాటలతో పాక్ జాతీయ దినోత్సవాలకు అంకురార్పణ చేశారంటూ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను క్షమించే సహజ స్థావరాలుగా మారాయంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. శుక్రవారం ఆయన ట్విట్టర్లో ప్రజలు క్షమించరు(జన్తా మాఫ్ నహీ కరేగీ)అనే హ్యాష్ట్యాగ్తో స్పందించారు. ‘కాంగ్రెస్ రాచ కుటుంబానికి విశ్వాసపాత్రుడొకరు ప్రజలకు ఇప్పటికే తెలిసిన విషయాన్ని మరోసారి అంగీకరించారు. ఉగ్ర మూకల చర్యలకు దీటుగా బదులివ్వడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. ఉగ్రవాద చర్యలకు వారికి అర్థమయ్యే భాషలో బదులిచ్చాం. మన బలగాల త్యాగాలను అవమానిస్తూ ప్రకటనలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలని భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్షాల చేష్టలను 130 కోట్ల మంది భారతీయులు క్షమించబోరు, మర్చిపోరు’ అని అన్నారు. -
‘అభినందన్ విమానాన్ని కూల్చింది వీరే’
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. భారత్ చర్యలతో రెచ్చిపోయిన పాక్ మన సైనిక స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు యత్నించింది. ఈ దాడిలో మిగ్ 21 యుద్ధం విమానం కూలిపోగా.. అభినందన్ వర్థమాన్ పాక్ భూభాగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కానీ పాక్ మాత్రం రెండు భారత యుద్ధ విమానాలకు కూల్చినట్లు చెప్పుకుంటుంది. తాజాగా భారత యుద్ధ విమానాలను కూల్చిన ఫైటర్ పైలెట్లను గుర్తించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పాక్ పార్లమెంట్లో వెల్లడించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ వైమానిక దళం రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేసింది. దానిలో ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చిన వ్యక్తి స్వ్కాడ్రన్ లీడర్ హసన్ సిద్దిఖీ కాగా మరొకరు.. నమౌన అలీ ఖాన్గా గుర్తించమ’న్నారు. అయితే ఈ దాడిలో పాక్ పైలెట్ హసన్ సిద్దిఖీ మరణించాడని ఖురేషి తెలిపాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన సిద్దిఖీకి పాక్ పార్లమెంట్ నివాళులర్పించింది. అంతేకాక తాము కూల్చిన రెండు భారత యుద్ధ విమానల్లో ఒకటి జమ్మూకశ్మీర్లో కూలగా మరోటి పాక్ ఆక్రమిత్ కశ్మీర్ భూభాగంలో కూలిట్లు గతంలో పాక్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్) -
పాఠ్యాంశంగా ‘అభినందన్’
జైపూర్: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధీరత్వం రాజస్తాన్ స్కూలు విద్యార్థులకు పాఠ్యాంశం కానుంది. ఆ రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా అభినందన్ ధైర్యసాహసాలను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించినట్టు ట్విట్టర్లో వెల్లడించారు. ‘పాకిస్తాన్ సైనికులకు చిక్కి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయం. అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి. వింగ్ కమాండర్ అభినందన్ను గౌరవిస్తూ ఆయన సాహసాన్ని స్కూలు సిలబస్లో చేర్చబోతున్నాం’ అని వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇటీవలే రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. -
అస్త్రాలన్నీ ప్రయోగిస్తాం
న్యూఢిల్లీ: మరో ఉగ్రదాడి జరిగితే తిప్పికొట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధంగా ఉంచుకుంటామని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ భూభాగంలో ఆవాసం పొందుతున్న ఉగ్రమూకలపై విరుచుకుపడే సామర్థ్యం ఉందని చాటుకోవడానికే బాలకోట్లో వైమానిక దాడులకు దిగామని స్పష్టతనిచ్చింది. జైషే మహ్మద్ శిక్షణా శిబిరంపై యుద్ధం ముగిసిందని, పాకిస్తాన్ భూభాగం నుంచి ఇంకా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకునేలా ఆ దేశంపై ఒత్తిడి పెంచడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొంది. ‘ఉగ్రవాదుల మౌలిక వసతులపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఆ దేశ కొత్త నాయకత్వం మాటలకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ఖాన్ను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఫిబ్రవరి 27న భారత్పై వైమానిక దాడికి దిగినప్పుడు పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని వినియోగించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా అధికారులకు అందజేశారని భారత్ తెలిపింది. మంగళవారం దోవల్తో ఫోన్లో మాట్లాడిన అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్..జైషే చీఫ్ మసూద్ అజహర్ను నిషేధిత జాబితాలో చేర్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతిస్తామని తెలిపారు. అలాగే, యుద్ధ విమానాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేయడంపై అమెరికా దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నామని భారత్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ అన్ని దేశాలను అభ్యర్థించిందని, కానీ సమస్య ఇండో–పాక్ది కాదని, ఉగ్రవాదానిది అని అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలా చెప్పామని తెలిపింది. మసూద్ అజహర్ పాకిస్తాన్లో నివసిస్తున్నందున అతనిపై నిషేధం విధిస్తే ఆ దేశానికి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను పాకిస్తాన్ నిర్బంధంలోకి తీసుకున్న తరువాత అన్ని దేశాలు తమకే మద్దతుగా నిలిచాయని, అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పాకిస్తాన్ అభినందన్ను వెంటనే విడుదల చేసిందని తెలిపింది. మరోవైపు, బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ తన బలగాలను పెంచుకుంటోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంట రాడార్లను క్రియాశీలకం చేసి, ఆయుధాగారాలు ఎల్లవేళలా పనిచేయాలని ఆదేశాలిచ్చింది. భారత జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్ నేవీ భారత జలాంతర్గామి తమ జలాల్లోకి రాకుండా నిరోధించామని పాకిస్తాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి మార్చి 4న తీసినట్లుగా భావిస్తున్న ఓ వీడియోను విడుదల చేసింది. పాకిస్తాన్ నేవీ దళం ప్రత్యేక నైపుణ్యాలు ప్రదర్శించి విజయవంతంగా భారత జలాంతర్గామి రాకను నిలువరించిందని పేర్కొంది. శాంతియుత విధానంలో భాగంగా భారత జలాంతర్గామిని తాము లక్ష్యంగా చేసుకోకుండా విడిచిపెట్టామని పాక్ నేవీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ ఘటన నుంచి భారత్ పాఠాలు నేర్చుకుని శాంతి దిశగా నడవాలని సూచించారు. అయితే పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ ఖండించింది. పాక్ నేవీ తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోమని స్పష్టం చేసింది. జాతీయ తీర ప్రాంత భద్రతకే బలగాల్ని మోహరించామని భారత నేవీ తెలిపింది. సుఖోయ్కి ‘స్పైస్’ సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలకు ఇజ్రాయెల్లో తయారైన స్సైస్–2000 రకం బాంబులను అమర్చేందుకు విమానాలకు అవసరమైన మార్పులు చేస్తున్నామని భారత వైమానిక దళ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మిరేజ్–2000 విమానాలకు స్పైస్–2000 బాంబులను అమర్చే వెసులుబాటు ఉంది. బాలాకోట్ దాడిలో ఈ విమానాలనే వినియోగించారు. స్పైస్–2000 బాంబులకు లేజర్ ద్వారా మార్గనిర్దేశనం చేయవచ్చు. ‘సముద్ర’ దాడుల ముప్పు ఉంది: నేవీ చీఫ్ సముద్ర మార్గం గుండా దేశంలోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని నేవీ చీఫ్ సునీల్ లాంబా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం తమకు అందిందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఇండో–పసిఫిక్ రీజినల్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..భారత్ను అస్థిరపరచాలనుకుంటున్న ఓ దేశ మద్దతుతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగిందని పరోక్షంగా పాకిస్తాన్ను దుయ్యబట్టారు. ఉగ్రవాదం అంతర్జాతీయ స్థాయికి చేరడంతో ముప్పు మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఆసియాలో వేర్వేరు రూపాల్లో ఉగ్రదాడులు జరిగాయని, కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ ముప్పు నుంచి తప్పించుకున్నాయని పేర్కొన్నారు. శత్రు దేశ ప్రభుత్వ మద్దతుతో కూడిన ఉగ్రవాద ముప్పు భారత్కు అధికంగా ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పాక్ వెళ్లి లెక్కించుకోవచ్చు: రాజ్నాథ్ ధుబ్రి(అస్సాం): పాక్లోని బాలాకోట్లో చేపట్టిన వైమానిక దాడిలో ఎందరు ముష్కరులు హతమయ్యారో రేపోమాపో తెలుస్తుందని హోం మంత్రి రాజ్నాథ్ అన్నారు. ఈ దాడిపై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, అవసరమైతే కాంగ్రెస్ అక్కడికి వెళ్లి మృతదేహాల సంఖ్యను లెక్కించుకోవచ్చని చురకలంటించారు. వైమానిక దళం బాంబులు జారవిడవడానికి ముందు ఆ ప్రాంతంలో 300 సెల్ఫోన్లు పనిచేస్తున్నట్లు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్వో) గుర్తించిందని తెలిపారు. ఆ సెల్ఫోన్లను చెట్లు వాడుతున్నాయా? అని ఎద్దేవా చేసిన రాజ్నాథ్ ఎన్టీఆర్వోను కూడా నమ్మరా? అని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు రాజకీయాలు చేయొచ్చు కానీ, దేశ నిర్మాణానికి కాదని హితవు పలికారు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో అధునాత ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను రాజ్నాథ్ మంగళవారం ప్రారంభించారు. అది సైనిక చర్య కాదు చెన్నై: బాలాకోట్లోని ఉగ్రస్థావరాలపై జరిపిన వైమానిక దాడులపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా స్పందించారు. వైమానిక దాడులు సైనిక చర్య కాదని.. ఈ దాడిలో బాలాకోట్ సహా పరిసర ప్రాంతాల్లోని సాధారణ ప్రజలెవరికీ నష్టం కలగలేదని స్పష్టం చేశారు. దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు మరణించారని మాత్రమే విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారని, ఫలానా సంఖ్య అని వెల్లడించలేదని ఆమె గుర్తు చేశారు. దీనినే ప్రభుత్వ ప్రకటనగా భావించాలని సూచించారు. కశ్మీర్లోని పుల్వామా జిల్లా త్రాల్ గ్రామంలో మంగళవారం మిలిటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ధ్వంసమైన తమ ఇంటి వద్ద రోదిస్తున్న స్థానికులు. సుమారు 12 గంటలు కొనసాగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక పౌరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ వెంట మూడు చోట్ల పాకిస్తాన్ మోర్టార్లతో దాడికి పాల్పడటంతో ఒక సైనికుడు గాయపడ్డాడు. -
250 అని అమిత్ షా ఎలా చెబుతున్నారు?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై అధికారిక ప్రకటన లేకపోవడం పట్ల అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారన్న విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దేని ఆధారంగా చెబుతున్నారని కాంగ్రెస్ సోమవారం ప్రశ్నించింది. వైమానిక దాడులను మోదీ, బీజేపీ రాజకీయం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకుంటున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ ఆరోపించారు. రఫేల్ లేకుండా వాయుసేన బలహీనంగా ఉందన్న వ్యాఖ్యలను చేయడం ద్వారా మోదీ వాయుసేనను అవమానించారనీ, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యను ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఆయన ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదనీ, అమిత్ షా మాత్రం ఆ సంఖ్య 250 అని ఎలా చెబుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. దాడిలో 250 మంది చనిపోయారని ఏ ఆధారాలూ చూపకుండానే అమిత్ షా చెబుతుండటాన్ని బట్టే విషయాన్ని ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతోందని సిబల్ అన్నారు. సైన్యాన్ని అవమానించకండి: బీజేపీ వైమానిక దాడులపై బూటకపు, కట్టుకథలతో దేశాన్ని తప్పుదారి పట్టించవద్దనీ, సైన్యాన్ని అవమానించవద్దని కాంగ్రెస్కు సోమవారం బీజేపీ విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై దాడులు జరుగుతోంటే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ఇబ్బందిగా ఉన్నట్లుంది. ఇది యాధృచ్చికమా, భాగస్వామ్యమా? సైన్యం పరాక్రమానికి సెల్యూట్ చేస్తూ దేశం మొత్తం ఒకే మాట మాట్లాడుతున్న సమయంలో, విపక్షాలు ఇలాంటి ప్రశ్నలను వేయడం దురదృష్టకరం’ అని అన్నారు. విపక్షాలది బాధ్యతారాహిత్యమనీ, ఉగ్రవాదులపై భద్రతా దళాలు తీసుకునే చర్యలను ఆ పార్టీలు స్వాగతిస్తాయన్న నమ్మకం పోయిందని నఖ్వీ పేర్కొన్నారు. రఫేల్ను ఎందుకు తీసుకోలేదు? దాదాపు ఐదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఒక్క రఫేల్ విమానాన్ని కూడా వాయుసేనలో ఎందుకు ప్రవేశపెట్టలేదనీ, ఇన్నాళ్లూ ఏం చేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి మోదీని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షాలు భద్రతా దళాలను రాజకీయ విన్యాసాల కోసం వినియోగించుకుంటున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. దాడిలో చనిపోయిన ముష్కరుల సంఖ్యపై సైన్యం అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, ఆ దాడుల్లో 250 మంది చనిపోయారని అమిత్ షా అంటున్నారనీ, తద్వారా సైన్యం అబద్ధం చెబుతోందని అమిత్ షా ఉద్దేశమా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేలా బీజేపీ, ఆరెస్సెస్లు ప్రయత్నిస్తున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. -
మేము ఆ లెక్కలు వేయం
కోయంబత్తూర్: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్లో జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై జరిపిన దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు అంతమయ్యారన్న విషయంలో ఎడతెగని చర్చ నడుస్తున్న వేళ వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవా సోమవారం స్పందించారు. వైమానిక దాడుల్లో చోటుచేసుకున్న నష్టం వివరాల్ని ప్రభుత్వమే వెల్లడించాలని, మృతుల సంఖ్యను తాము లెక్కించమని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించామా? లేదా? అన్నదే తమకు ముఖ్యమన్నారు. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా ఫిబ్రవరి 26న పాక్లోని ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్సులో జైషే శిక్షణశిబిరాలపై భారత వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలపగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 250 మంది మరణించారని చెప్పారు. ఉగ్రవాదులకు వాటిల్లిన నష్టం తక్కువేనని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఇప్పటి దాకా ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం బయటకురాలేదు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ధనోవా మాట్లాడారు. ‘ వైమానిక దాడిలో ఎందరు చనిపోయారో మేము లెక్కించం. ఆ సమయంలో అక్కడ ఎందరున్నారన్న దానిపై ఆ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వమే ఆ వివరాలు ప్రకటించాలి’ అని అన్నారు. బాంబులు లక్ష్యానికి దూరంగా జారవిడిచారని వచ్చిన వార్తల్ని ఖండించారు. అది నిజమైతే పాక్ అంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తుందని ఆయన అన్నారు. అభినందన్ ఫిట్గా ఉంటేనే.. పాకిస్తాన్ నిర్బంధం నుంచి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ పూర్తి ఫిట్నెస్ సాధించాకే యుద్ధ విమానం నడుపుతారని ధనోవా చెప్పారు. కూలిపోయిన మిగ్ విమానం నుంచి ప్రాణాలతో బయటపడిన అభినందన్కు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నామని, ఆయన మళ్లీ విమానం నడుపుతాడా? లేదా? అన్నది మెడికల్ ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందన్నారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు సెప్టెంబర్ నాటికి వైమానిక దళానికి అందుతాయని చెప్పారు. బాలాకోట్ దాడి సమయంలో రఫేల్ విమానాలు అందుబాటులో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాల వాడకంపై అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుందో తనకు తెలియదని, ఒకవేళ ఆ విమానాన్ని దాడులకు వాడొద్దని అందులో ఉంటే, ఒప్పందం ఉల్లంఘనకు గురైనట్లేనని పేర్కొన్నారు. పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టేందుకు వినియోగించిన మిగ్–21 విమానం అత్యంత అధునాతనమైనదని తెలిపారు. పోఖ్రాన్లో ‘బాలాకోట్’కు రిహార్సల్! పుల్వామాలో ఉగ్ర దాడి తరువాత ప్రతీకార చర్య తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రెండింటి మధ్య నిర్వహించిన సైనిక కసరత్తు కార్యక్రమంలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అసువులుబాసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తరువాత రాజస్తాన్లోని పోఖ్రాన్లో ‘వాయుశక్తి’ పేరిట వైమానిక దళం విన్యాసాలు నిర్వహించింది. ఉగ్రమూకలపై ప్రతీకారం తీసుకునేందుకు సన్నద్ధమయ్యేలా ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాయుశక్తి కార్యక్రమం షెడ్యూల్ అంతకుముందే ఖరారైనా, పుల్వామా ఘటనకు వైమానిక దళం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఐఏఎఫ్ అధికారులకు సమాచారం అందినట్లు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక రిహార్సల్లా ఉపయోగించుకుని పుల్వామా ఘటనకు కారణమైన జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థపై దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు రాగానే భారత్–పాక్ నియంత్రణ రేఖ అవతలి వైపున గగనతలంలో దాడులు నిర్వహించేలా వాయుశక్తి కార్యక్రమంలో మార్పులు జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తగిన సమయంలో ప్రతీకార చర్యకు దిగుతామని వైమానిక దళ చీఫ్ బీఎస్ ధనోవా ఈ సందర్భంగా ప్రకటించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. నాడు బాలాకోట్ శిబిరంలో 300 మొబైల్స్ యాక్టివ్ బాలాకోట్లో మృతి చెందిన ముష్కరులకు సంబంధించిన సాక్ష్యాధారాలు చూపించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ది నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాలాకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగడానికి ముందు ఆ ప్రదేశంలో నిఘా ఉంచగా 300 మొబైల్ ఫోన్లు పనిచేస్తున్నట్టుగా తమకు సిగ్నల్స్ అందాయని, అంటే ఆ సమయంలో స్థావరంలో అందరు ఉగ్రవాదులు ఉన్నట్టుగా తమకు అర్థమైందని ఆ సంస్థ అధికారి తెలిపారు. ‘ఫిబ్రవరి 26న భారత వాయుసేన నుంచి దాడులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి జల్లెడ పట్టాం. దాదాపుగా 300 మొబైల్స్ అక్కడ వాడుతున్నట్టుగా మాకు సిగ్నల్స్ అందాయి. ఇదే విషయాన్ని వైమానిక దళం దృష్టికి తీసుకువెళ్లాం. దీంతో ఐఏఎఫ్ జవాన్లు మొదట ఆ ఫోన్ సిగ్నల్స్ని నాశనం చేశారు. ఆ తర్వాత వెయ్యి కేజీల బరువైన బాంబుల్ని ప్రయోగించారు’ అని ఆ అధికారి చెప్పారు. ‘దాడులకు ముందు ఎన్టీఆర్వో, భారత నిఘా కూడా ఉగ్రవాద స్థావరాల్లో ఉన్న సదుపాయాలపై ఒక అంచనాకు వచ్చింది. ఆ తర్వాతే దాడులకు దిగింది’ అని అధికారి వివరించారు. -
300 మంది చనిపోయారా? లేక చెట్లు కూలాయా?
న్యూఢిల్లీ: పాకిస్థాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన దాడుల్లో నిజంగానే 300 మంది ఉగ్రవాదులు చనిపోయారా అంటూ ప్రతిపక్షాలు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. భద్రతా దళాల ధైర్యసాహసాలను రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నాయని, ఆర్మీ దాడులను రాజకీయం చేస్తున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలకు తాజాగా పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ గొంతు కలిపారు. విదేశీ శత్రు దేశంతో పోరాడుతున్నామంటూ దేశంలోని ప్రజలను మోసం చేస్తున్నారని, నిజానికి మీరు ఉగ్రవాదులను చంపారా? లేక చెట్లను కూల్చారా? ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనా అని సిద్ధూ ప్రశ్నించారు. ‘300 మంది ఉగ్రవాదులు నిజంగా చనిపోయారా? లేదా? మీ ఉద్దేశం ఏమిటి? ఉగ్రవాదులను నేలమట్టం చేయడమా? చెట్లను కూల్చడమా? ఇది ఎన్నికల గిమ్మిక్కా? శత్రుదేశంతో పోరాడుతున్నామంటూ.. దేశాన్ని మోసం చేస్తున్నారు. ఆర్మీతో రాజకీయం చేయడం మానండి. ఆర్మీ దేశమంతా పవిత్రమైనది’ అని సిద్ధూ ట్వీట్ చేశారు. -
సర్జికల్ స్ట్రైక్స్-2: మేం 22 సీట్లు గెలుస్తాం!
బెంగళూరు: పాకిస్థాన్ బాలకోట్లోని జైషే మహహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక మెరుపు దాడులతో దేశంలో పరిస్థితి ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా మారిపోయిందట. ఈ మెరుపు దాడుల దెబ్బతో కర్ణాటకలోని 28 స్థానాల్లో 22 స్థానాల్లో బీజేపీ గెలువబోతోందని ఆ పార్టీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప చెప్పుకొచ్చారు. ‘రోజురోజుకు వాతావరణం.. గాలి బీజేపీకి పెద్ద ఎత్తున అనుకూలంగా మారిపోతోంది. నిన్న పాకిస్థాన్లోకి ప్రవేశించి.. అక్కడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో దేశంలో మోదీ అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ ప్రభావం రానున్న లోక్సభ ఎన్నికల్లో చూడవచ్చు’ అని ఆయన బుధవారం పేర్కొన్నారు. మెరుపు దాడులు యువతలో ఉత్సాహాన్ని నింపాయని, దీని కారణంగా కర్ణాటకలో 22 స్థానాలు గెలువబోతున్నామని ఆయన చెప్పారు. కర్ణాటకలో బీజేపీకి ప్రస్తుతం 16 లోక్సభ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పది సీట్లు, జేడీఎస్ రెండు సీట్లు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ ఈసారి కలిసి ఎన్నికలకు వెళుతామని ప్రకటించాయి. సీట్ల పంపకాల్లో భాగంగా జేడీఎస్ 10 నుంచి 12 సీట్లు కోరుతుండగా... కాంగ్రెస్ మాత్రం అన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదని తెలుస్తోంది. -
పాక్ పార్లమెంట్ అత్యవసర సమావేశం
ఇస్లామాబాద్: భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడులపై చర్చించేందుకు పాకిస్తాన్ పార్లమెంట్ రేపు (బుధవారం) అత్యవసర సమావేశం కానుంది. పార్లమెంట్లోని ఉభయ సభల సభ్యులు సమావేశానికి తప్పక హాజరుకావాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలను జారీచేసినట్లు తెలుస్తోంది. భారత దాడికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలన్న దానిపై పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉంది. ఇదిలావుండగా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. వైమానిక దాడులకు సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష ఎంపీలు ఇమ్రాన్ను డిమాండ్ చేస్తున్నారు. (భారత్కు సరైన సమాధానమిస్తాం : పాక్) మరోవైపు వాస్తవాదీన రేఖను దాటి భారత విమానాలు నియంత్రరేఖను ఉల్లంఘించాయని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి ఆశ్రయించే అవకాశం ఉంది. కాగా భారత మెరుపు దాడులను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ధ్రువీకరించిన అనంతరం.. ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
భారత్కు సరైన సమాధానమిస్తాం : పాక్
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్ శిబిరాలే లక్ష్యంగా భారత్ జరిపిన మెరుపు దాడులపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్పందించారు. భారత వైమానిక దళాలు దాడి చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. ‘ భారత్ ఇలాంటి పని చేస్తుందని ప్రపంచానికి మేము చెబుతూనే ఉన్నాం. మా మాటలను ఈరోజు భారత్ నిజం చేసి చూపించింది. ఇప్పుడు వాళ్లకు సరైన సమాధానం చెప్పే హక్కు పొందాము. నియంత్రణ రేఖను దాటి భారత్ నిబంధనలు ఉల్లంఘించింది. ఆత్మరక్షణ హక్కు మాకు కూడా ఉంది కదా’ అని ఖురేషీ వ్యాఖ్యానించారు.(పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్) కాగా పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్ మాట నిలబెట్టుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా పూర్తి చేసి... దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ చర్యపై అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మంత్రులు, ఆర్మీ అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.(ఐఏఎఫ్ అంటే ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్) -
సిరియాపై క్షిపణుల వర్షం
వాషింగ్టన్: అంతర్యుద్ధంతో నెత్తురోడుతున్న సిరియాలో బాంబులమోత మోగింది. మొన్నటి వరకూ రసాయనిక ఆయుధాలతో రష్యా, సిరియా అధ్యక్షుడు అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాలు వందలాది అమాయకులు, చిన్నారుల్ని పొట్టనపెట్టుకుంటే ఈ సారి అమెరికా సంకీర్ణ బలగాలు వైమానిక దాడులకు దిగాయి. సిరియా రాజధాని డమాస్కస్పై సంకీర్ణ దళాలు క్షిపణుల మోత మోగించాయి. రసాయనిక దాడులకు ప్రతీకారంగా సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. గట్టి జవాబిచ్చేందుకే: ట్రంప్ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు సంయుక్తంగా జరిపిన ఈ వైమానిక దాడుల్ని సిరియా బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. అమెరికా, దాని మిత్రదేశాలు 100కి పైగా క్షిపణుల్ని ప్రయోగించాయని, వాటిలో కొన్నింటిని సిరియా వైమానిక బలగాలు తిప్పికొట్టాయని రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిరియా సైనిక కేంద్రాలు, సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు చేశారని వెల్లడించింది. ‘గురితప్పకుండా దాడులు చేశాం. మిషన్ పరిపూర్ణమైంది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. రసాయనిక ఆయుధాల తయారీ, వాడకంపై గట్టి సమాధానమిచ్చేందుకే ఈ దాడులు జరిపామన్నారు. ఫ్రాన్స్, బ్రిటన్తో కలిసి దాడులు చేస్తామని శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డమాస్కస్పై తొమహక్ క్షిపణుల వర్షం మధ్యధరా సముద్రం మీదుగా యుద్ధనౌకల నుంచి తొమహక్ క్రూయిజ్ క్షిపణులు, బీ–1 బాంబర్ విమానాలతో జేఏఎస్ఎస్ఎం–ఈఆర్ క్షిపణుల్ని ప్రయోగించినట్లు పెంటగాన్(అమెరికా) వర్గాలు పేర్కొన్నాయి. పెంటగాన్ ప్రతినిధి స్పందిస్తూ.. ‘క్షిపణులు లక్ష్యాల్ని ఛేదించాయి. రసాయనిక ఆయుధాల తయారీ ప్రాంతాలపై దాడులు చేశాం’ అని చెప్పారు. తూర్పు డమాస్కస్లోని రసాయన ఆయుధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాలపై ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ దాడులు సిరియా అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవడం లేదా అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నవేనని బ్రిటన్ ప్రధాని థెరెసా మే చెప్పారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. మరోసారి రసాయనిక ఆయుధాలు వాడితే మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు. భద్రతా మండలి అత్యవసర భేటీ సంకీర్ణ బలగాల దాడిని సిరియా మిత్ర దేశాలైన రష్యా, ఇరాన్లు సైనిక నేరంగా, దుందుడుకు చర్యగా అభివర్ణించాయి. ‘దాడులకు ప్రతీకారంగా పర్యవసనాలు తప్పకుండా ఉంటాయి.’ అని రష్యా హెచ్చరించింది. కాగా రష్యా విజ్ఞప్తి మేరకు ఐరాస భద్రతా మండలి శనివారం అత్యవసరంగా సమావేశమైంది. 13 క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం తమ శాస్త్ర పరిశోధన కేంద్రంపై దాడి చేశారని, సిరియా వైమానిక బలగాలు 13 క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాయని, ముగ్గురే గాయపడ్డారని సిరియా ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. దాడులు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించడమేనంది. క్షిపణుల మోత ఆగగానే డమాస్కస్ వీధుల్లో విజయ సంకేతాల్ని చూపుతూ జెండాలతో వందలాది మంది సందడి చేశారు. ఈ దాడులు పోరాటం కొనసాగించాలన్న సిరియా ప్రజల సంకల్పాన్ని దృఢం చేశాయని, దేశంలోని ఉగ్రవాదుల్ని అణచివేస్తామని సిరియా అధ్యక్షుడు అసద్ పేర్కొన్నారు. -
సిరియాపై విరుచుకుపడుతున్న అమెరికా దళాలు
డమస్కస్ : ఏడేళ్లుగా అంత్యర్యుద్ధం కోరల్లో చిక్కుకుని అపారనష్టానికి గురైన సిరియా నెత్తిన ఇప్పుడు మరో పిడుగు పడింది. అమెరికా దళాలు సిరియాలో వైమానిక దాడులు చేపట్టాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇవి కొనసాగుతున్నాయి. గత వారం సిరియా రాజధాని డమస్కస్లో రసాయనిక దాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు తాము ఈ దాడులకు తెగబడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘అమెరికా దళాలతోపాటు ఫ్రాన్స్, యూకే దళాలు సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. సిరియా నియంతాధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ రసాయనిక దాడులకు పురిగొల్పుతుండటమే మేం ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమైంది. యూఎస్ భద్రతాధికారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశా’ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్లో ప్రసంగించారు. మరోవైపు ఆయన ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే డమస్కస్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. రసాయనిక క్షిపణులను నిల్వ చేసిన ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని అమెరికన్ భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఇంకోపక్క సిరియాలో మోహరించిన రష్యా-ఇరాన్ దళాలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ‘శాంతి కోరుకుంటున్న దేశాల పక్షాన నిలుస్తారా? లేక.. బషర్కి అండగా నిలుస్తూ జరగబోయే పరిణామాలకు భాద్యత వహిస్తారా? ఫలితం మీరే నిర్ణయించుకోండి’ అంటూ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. రష్యా హెచ్చరికలు.. సిరియాపై అమెరికా మరియు దాని మిత్రపక్ష సైన్యాలు చేపట్టిన ఆకస్మిక దాడులపై రష్యా స్పందించింది. పుతిన్ను అవమానించేలా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపేక్షించబోమని రష్యా విదేశాంగ ప్రతినిధి అనాటోలీ ఆంటోనోవ్ వెల్లడించారు. ఈ చర్యలకు ప్రతిగా అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించాడు. pic.twitter.com/N5IOHlv4E7 — AFP news agency (@AFP) 14 April 2018 -
సిరియా సంక్షోభం.. మళ్లీ వైమానిక దాడులు..!
డమస్కస్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తాజాగా సోమవారం ఉదయం వైమానిక దాడులు జరిగాయి. ప్రభుత్వ ఆధ్యర్యంలోని తాయ్ఫుర్ వైమానిక స్థావరం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. హామ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వైమానిక స్థావరంపై జరిగిన వైమానిక క్షిపణి దాడుల్లో పలువురు చనిపోయారని, పెద్దసంఖ్యలో గాయాలపాలయ్యారని ప్రభుత్వ మీడియా సంస్థ సనా తెలిపింది. సిరియా ప్రభుత్వ వైమానిక స్థావరంపై అమెరికా సైన్యమే వైమానిక దాడులు జరిపినట్టు భావిస్తున్నారు. అయితే, అమెరికా ఈ వార్తలను ఖండించింది. తాము వైమానిక దాడులు నిర్వహించలేదని స్పష్టం చేసింది. తాజాగా తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై విషరసాయనిక దాడులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. 42మందిని పొట్టనబెట్టుకొని, వందలమంది గాయపడటానికి కారణమైన గ్యాస్ దాడిపై అంతర్జాతీయ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వం తన సొంత ప్రజల్నే చంపుకుంటుందని మండిపడ్డాయి. సిరియా అధ్యక్షుడు అసద్ జంతువులాంటి వాడని, అతనితోపాటు అతనికి అండగా నిలుస్తున్న రష్యా, ఇరాన్ ఈ గ్యాస్ భారీ మూల్యం చెల్లించకతప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
బాంబు దాడులు.. నెత్తుటి గాయాలు
సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని గౌటా భూభాగంలో ప్రభుత్వ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో గాయపడి రోదిస్తున్న చిన్నారి. కొద్ది రోజులుగా ఉధృతంగా సాగుతున్న ఈ దాడుల్లో ఇప్పటికే 200 మందికి పైగా మృతిచెందినట్లు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థ ఒకటి ప్రకటించింది. -
సొరంగం ధ్వంసం.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ షాక్
జెరూసలెం : పాలస్తీనాకు చెందిన ఓ సొరంగాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. వైమానిక దాడులతో తాము దానిని నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ సైనిక వ్యవహారాల అధికారిక ప్రతినిధి జోనాథన్ కాంక్రియస్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ హమాస్లో పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ ఉద్యమ సమయంలో ఆ సొరంగాన్ని ఏర్పాటు చేశారని, దాని సాయంతోనే స్మగ్లింగ్ను వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు కుట్రలు చేసేవారని అన్నారు. గతంలో ఇలాంటి సొరంగ మార్గాలన్నింటినీ కూడా దాడులు చేసేందుకే ఉపయోగించేవారని చెప్పారు. ఈ సొరంగం గాజా స్ట్రిప్ నుంచి తమ దేశం మీదుగా ఈజిప్టు వరకు ఉందని తెలిపారు. తాము నిర్వహించిన ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే, ఈ సొరంగం ఇప్పటికీ కొనసాగతున్నట్లు వెల్లడించారు. గ్యాస్పైప్ లైన్ మాదిరిగా ఈ సొరంగ నిర్మాణం భారీ గోడలతో జరిగినట్లు వివరించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందే వారు వైమానిక దాడులు జరపడం గమనార్హం. -
సిరియాపై బాంబుల వర్షం
మాస్కో: సిరియాలో 24 గంటల వ్యవధిలో జరిపిన వరుస వైమానిక దాడుల్లో 120 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పాటు విదేశాల నుంచి వచ్చిన 60 మంది ఉగ్రవాదులు హతమైనట్టు రష్యా రక్షణ శాఖ శనివారం వెల్లడించింది. సిరియాలోని మాయాదీన్లో ఐఎస్లో కీలకమైన వ్యక్తులతో పాటు 80 మంది ఉగ్రవాదులను, అల్బు కమాల్లో మరో 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. డెయిర్ ఎజ్జర్లో జరిపిన మరో వైమానిక దాడిలో సోవియట్ యూనియన్, ట్యూనీషియా, ఈజిప్టుకు చెందిన 60 మంది విదేశీ ఉగ్రవాదులు మరణించినట్టు పేర్కొంది. ఐఎస్ సీనియర్ కమాండర్, కరడుగట్టిన ఉగ్రవాది ఒమర్ అల్ షిషానీతో పాటు మరో ఇద్దరు కమాండర్లు సలాహ్ అల్ దిన్ అల్ షిషానీ, అలా అల్ దిన్ అల్ షిషానీ గతంలో జరిపిన దాడుల్లో మరణించినట్టు ధ్రువీకరించింది. ఒమర్ అల్ షిషానీని అమెరికా సేనలు హతమార్చినట్టు 2016లో పెంటగాన్ వెల్లడించడం గమనార్హం. అయితే సలాహ్ హతమైనట్టు రష్యా ప్రకటించడాన్ని బ్రిటన్కు చెందిన మానవ హక్కుల అబ్జర్వేటరీ రమీ అబ్దుల్ రహమాన్ తోసిపుచ్చారు. సలాహ్ బతికే ఉన్నాడని, అలెప్పో ప్రావిన్స్లో జిహాదీ గ్రూపులకు పట్టున్న ప్రాంతాల్లో అతను ఉండొచ్చని వెల్లడించారు. సలా‹ß జిహాదీ గ్రూపు అల్ నుస్రాతో కలసి పనిచేసేవాడు. -
25 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతం
సిరియా: వైమానిక దాడుల్లో 25 మంది తీవ్రవాదులు మృతి చెందారు. సిరియా-రష్యా ఆర్మీ కలిసి సెంట్రల్ సిరియాలో ఈ దాడులు జరిపారు. ఐసిస్ మూకలు దాగి ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు నిన్న రాత్రి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25 మంది జిహాదీలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. -
యుద్ధ భూమి
-
సిరియాలో అమెరికా మళ్లీ దాడులు?
15 మంది మృతి బీరుట్: సిరియాలో ఐసిస్ అధీనంలో ఉన్న రఖా సమీపంలో శనివారం జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 15 మంది చనిపోయారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలే ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు సిరియా మానవ హక్కుల సంస్థ మానిటర్ శనివారం ప్రకటించింది. హెనేడాలో జరిగిన ఈ దాడుల్లో కనీసం 17 మంది గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించింది. రఖాకు 25 కి.మీ దూరంలో ఉన్న హెనేడాను అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతున్న కుర్దిష్–అరబ్ కూటమి లక్ష్యంగా చేసుకుని గత కొద్ది రోజులుగా దాడులు ముమ్మరం చేస్తోంది. -
ఐసిస్ సభ్యుడు నీల్ ప్రకాశ్ అరెస్టు ?
న్యూయార్క్/మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ జిహాదిస్టు నీల్ ప్రకాశ్ టర్కీలో పట్టుబడినట్లు మీడియాలో శుక్రవారం వార్తలొచ్చాయి. ఇరాక్లో జరిగిన వైమానిక దాడుల్లోనే అతడు చనిపోయాడని కొన్ని నెలల క్రితమే అమెరికా, ఆస్ట్రేలియా గతంలో తెలిపింది. ప్రకాశ్ టర్కీలో అడుగుపెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తన నిఘా సంస్థ వద్ద సమాచారం ఉందని ఆస్ట్రేలియా ఆ దేశాన్ని సంప్రదించిన తరువాత అతన్ని అరెస్టు చేసినట్లు టర్కీ అధికారులను ఉటంకిస్తూ ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఫిజీ, భారత్ మూలాలున్న ప్రకాశ్ ఐసిస్ ముఖ్యుల్లో ఒకడు. -
వైమానికదాడుల్లో ముగ్గురు పౌరులు మృతి
సిరియా: సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో ముగ్గురు సాధారణ పౌరులు మృతి చెందారు. ఇడ్లిబ్ ప్రావిన్స్లోని ఖాన్ షేకున్ ప్రాంతంలో తిరుగుబాటు దారులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సైతం మృతి చెందారని, మరో 13 మంది పౌరులు గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్రైట్స్(ఎస్ఓహెచ్) వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆధీనంలో లేని ప్రాంతంలో జరిగిన వైమానికదాడుల్లో సాధారణ పౌరులు మృతి చెందడం ఇదే తొలిసారి అని ఎస్ఓహెచ్ ప్రతినిధి అబ్దుల్ రెహ్మాన్ వెల్లడించారు. దాడులకు పాల్పడిన వైమానిక విమానాలు ఏ దేశానికి చెందినవి అన్నది మాత్రం ఎస్ఓహెచ్ గుర్తించలేకపోయింది. అయితే, ఇడ్లిబ్ ప్రాంతంలో సిరియా ప్రభుత్వానికి అనుకూలంగా రష్యా యుద్ధవిమానాలు దాడులు నిర్వహించడం సర్వసాధారణం అని తెలుస్తోంది. -
సిరియాలో వైమానిక దాడులు..
19 మంది మృతి బీరుట్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న అలెప్పో నగరంపై మంగళవారం రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పౌరులు మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడులు రష్యా గానీ, ప్రభుత్వం గానీ జరిపి ఉండవచ్చని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవహక్కుల పరిశీలన బృందం ప్రతినిధి రమి అబ్దెల్ రెహమాన్ తెలిపారు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వైమానిక దాడులు జరిగాయి. ప్రభుత్వ వ్యతిరేక దళాలపై రష్యా విమానాలు చేసిన దాడిలో 12 మంది తిరుగుబాటుదారులు కూడా మృతిచెందారు. సిరియాలో తిరుగుబాటుదారులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 2.9 లక్షల మంది పౌరులు బలయ్యారు. -
కాసేపట్లో వైమానిక దాడులు.. కానీ
* ‘కార్గిల్’ సమయంలో పాక్పై దాడులకు వాయుసేన ప్రణాళిక * ఎక్స్క్లూజివ్గా సంపాదించిన ఎన్డీటీవీ న్యూఢిల్లీ: 1999 జూన్ 13.. తెల్లవారుజాము 4.30 గంటలు.. భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం భీకరంగా సాగుతోంది. పాక్పై దాడులకు భారత వాయుసేన ప్రణాళిక రూపొందించింది. విమానాలను సిద్ధం చేసింది.. లక్ష్యాలను గురిపెట్టింది.. తుపాకులు, మందుగుండు సామగ్రితో పైలట్లు సిద్ధంగా ఉన్నారు. కొద్ది నిమిషాల్లో దాడులు మొదలవుతాయనగా.. ‘నో గో’(వద్దు.. వెళ్లొద్దు) అంటూ ఆదేశాలు అందాయి.. దీంతో దాయాదుల మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభం కాకుండానే ముగిసింది. పాక్పై దాడి చేసేందుకు వాయుసేన రూపొందించిన సమగ్ర ప్రణాళిక ఇది.. దీన్ని ఎన్డీటీవీ సంపాదించింది. అందులో ఏముందంటే.. ఆ యుద్ధ సమయంలో అప్పటి భారత, పాక్ విదేశాంగ మంత్రులు జశ్వంత్ సింగ్, సర్తాజ్ అజీజ్ల మధ్య ఢిల్లీ చర్చలు విఫలమవడంతో వాయుసేన ‘దాడి’ ప్రణాళిక రూపొందించింది. ‘జూన్ 12న చర్చలు విఫలమై అజీజ్ వెళ్లిపోవడంతో సాయంత్రం 4 గంటలకు పైలట్లను సమావేశపరిచింది. 13న వేకువజామున దాడులు చేయాలని కమాండ్ ఎయిర్ టాస్కింగ్ ఆర్డర్ జారీ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో 4 ఎయిర్క్రాఫ్ట్ల బాంబింగ్ మిషన్.. రావల్పిండిలోని చక్లాలా ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్లో బీడీఏ (బాంబ్ డ్యామేజ్ అసెస్మెంట్) చేయాలని ఆదేశాలు అందాయి’ అని ఎయిర్ఫోర్స్ 17 స్క్వాడ్రాన్ డైరీలో పేర్కొన్నారు. -
'25 వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు హతం'
లండన్: గత 20 నెలలుగా బ్రిటన్, దాని మిత్ర దేశాల వైమానిక దాడుల్లో 25 వేల మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు బ్రిటన్ రాయల్ ఎయిర్ఫోర్స్(ఆర్ఎఎఫ్) కల్నల్ వారెన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వరుస దాడులతో ఐసిస్ కు కోలుకోని ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సిరియా, ఇరాక్లోని ఐఎస్ ఆధీన ప్రాంతాల్లో జిహాదీ ఉగ్రవాదుల సంఖ్య సగానికి తగ్గిందన్నారు. గత మూడు వారాల్లోనే 600 మంది ఉగ్రవాదులు మరణించారన్నారు. ఉత్తర ఇరాక్లోని దాదాపు ప్రస్తుతం 30 వేల మంది కంటే తక్కువే ఉన్నారు. తాము చేసిన దాడుల్లో ఐసిస్ చమురు క్షేత్రాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా అమెరికా, సంకీర్ణ సేనలు జరుపుతున్న దాడులతో ఐసిస్ బలహీన పడిందన్నారు. ఒమర్ ఆల్-షిషానీ, జిహాది జాన్ సహా 100 మందిపైగా ఐసిస్ నేతలను మట్టుబెట్టినట్టు వారెన్ వెల్లడించారు. -
సిరియాలో బాంబుల మోత.. 39మంది మృతి
డెమాస్కస్: సిరియాలో మరోసారి బాంబుల మోత మోగింది. అల్ రఖ్కాలో రష్యా, అమెరికా వాయుసేనలు జరిపిన వైమానిక బాంబుదాడుల్లో 39 మంది ప్రాణాలుకోల్పోయారు. చాలామంది గాయాలపాలయ్యారు. వీరిలో అమాయకులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురు చిన్నారులు, ఏడుగురు మహిళలు మృతుల్లో ఉన్నారు. అయితే, మృతుల సంఖ్య 60కి పెరిగే అవకాశం ఉందని సిరియా హక్కుల సంస్థ తెలిపింది. ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
బాంబుల వర్షం.. 40 మంది ఉగ్రవాదులు హతం
ట్రిపోలి: లిబియాలో వైమానిక దాడులు తీవ్ర రూపం దాల్చాయి. శుక్రవారం గుర్తుతెలియని ఓ యుద్ధ విమానం గగనతలం నుంచి జరిపిన బాంబు దాడుల్లో సుమారు 40 మంది ఇస్లామిక్ మిలిటెంట్లు హతమై ఉంటారని లిబియా అధికారులు భావిస్తున్నారు. లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు సబ్రతా అనే ప్రాంతంలో ఓ ఇంట్లో సమావేశమయ్యారు. ట్యూనీషియా సరిహద్దులో ఉన్న ఐఎస్ఐఎస్ సభ్యలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానం బాంబులతో దాడిచేయగా 40 మందికి పైగా తిరుగుబాటుదారులు మృతిచెందారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులు సమావేశమైన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ట్రిపోలికి సరిహద్దుగా ఉన్న ట్యూనీషియా సమీపంలో ఈ దాడులు జరిగాయని హుస్సేన్ అల్ దవాదీ అనే అధికారి వెల్లడించారు. ట్యూనీషియాలో గతేడాది జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా తామే ఈ దాడులు చేశామని అమెరికా మీడియాకు అక్కడి అధికారులు వెల్లడించినట్లు సమాచారం. -
'అమెరికా దాడులతో జీతాలు సగానికి కోసేశారు'
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల వరుస దాడులతో అతలాకుతలమవుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సిరియాలో తన ఫైటర్ల జీతాలను అమాంతం కోత పెట్టింది. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ముజాహిద్దీన్ల జీతాలను 50శాతం వరకు తగ్గించింది. ఆపరేషన్ 'టైడల్ వేవ్ 2' పేరిట అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఐఎస్ఐఎస్ చమురు బావులు, చమురు సరఫరా లైన్లు, నగదు దుకాణాలు లక్ష్యంగా దాని ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నాయి. వ్యూహాత్మకంగా కొనసాగుతున్న ఈ దాడుల ప్రభావం ఐఎస్ఐఎస్ మీద గణనీయంగా ఉన్నట్టు ఆ గ్రూపు తాజాగా విడుదల చేసిన ఓ పత్రం చాటుతోంది. 'ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ముజాహిద్దీన్లందరికీ చెల్లిస్తున్న జీతాల్ని సగానికి తగ్గిస్తున్నాం. ఎలాంటి హోదాలో ఉన్నవారికైనా ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఉండదు' అని సిరియా రఖ్కాలోని ఐఎస్ కోశాగార విభాగం 'బేత్ మాల్ అల్ ముస్లిమీన్' ఈ పత్రంలో పేర్కొంది. -
భద్రత కోసం బాంబుల వర్షం..
- ఐఎస్పై సైనిక చర్యతోనే బ్రిటన్ సురక్షితంగా ఉంటుందన్న కామెరూన్ - పార్లమెంట్లో మద్దతుకు యత్నం.. ప్రతిపక్షపార్టీలో చీలిక లండన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై సైనిక చర్య అంశం బ్రిటన్ పార్లమెంట్ ను కుదిపేస్తున్నది. యుద్ధానికి ఇదే సరైన సమయమని అధికార పక్షం, అసలు యుద్ధమే వద్దంటూ ప్రతిపక్షం వాదులాడుకున్నాయి. ఈ మేరకు గురువారం బ్రిటన్ పార్లమెంట్ లోని దిగువ సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ప్రధాని డేవిడ్ కామెరూన్ విపక్షాలను ఒప్పించే ప్రయత్నం చేశారు. సిరియాలో తలదాచుకున్న ఐఎస్ ఉగ్రవాదులపై సైనిక చర్యకు ఇదే తగిన సమయమని, కేవలం అలాంటి చర్యలతోనే బ్రిటన్ సురక్షితంగా మనగలుగుతుందని కామెరూన్ అన్నారు. ఐఎస్ పై సైనికచర్యతో.. ఇప్పట్లోగానీ, భవిష్యత్లోగానీ దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్లబోదని ఉద్ఘాటించారు.ఈ మేరకు రూపొందించిన నివేదికను పార్లమెంట్ సభ్యులకు అందజేస్తూ.. మద్దతు పలకాల్సిందిగా ప్రతిపక్ష పార్టీని కోరారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెర్మీ కోర్బెయిన్.. ప్రభుత్వ ప్రతిపాదనను నిర్దంద్వంగా తిరస్కరించారు. సైనిక చర్యతోనే బ్రిటన్ సురక్షితంగా ఉండగలదన్న ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. కామెరూన్ తన ప్రతిపాదనను విరమించుకోవాలని హితవుపలికారు. అయితే సైనిక చర్య వ్యవహారం లేబర్ పార్టీ రెండుగా చీలిపోయింది. నాయకుడు కోర్బెయిన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు ఎంపీలు ప్రకటనలు చేశారు. సైనిక చర్య తప్పదన్న ప్రభుత్వ వాదనను సమర్థించారు. దీంతో కొర్బెయిన్ ఇరుకునపడ్డట్లయింది. మరోవైపు మాజీ ప్రధాని, లేబర్ పార్టీకే చెందిన టోనీ బ్లేయర్ కూడా డేవిడ్ కామెరూన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. -
యెమెన్లో 20మంది భారతీయుల మృతి!
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్లో జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది భారతీయులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. యెమెన్లోని హొదీదా ఓడరేవులో చమురు స్మగ్లర్లను లక్ష్యంగా చేసుకుని సౌదీ దళాలు దాడులు జరిపాయని, స్థానిక జాలర్లు ఈ దాడుల్లో చనిపోయారని కొన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. మృతుల్లో దాదాపు 20 మంది భారతీయులు ఉన్నట్లు ఈ వార్తలు పేర్కొన్నాయి. హోదీదా తీరానికి దగ్గరలో ఉన్న అల్ ఖోఖా ప్రాంతంలో రెండు జాలర్ల బోట్లు ధ్వంసం అయినట్లు కూడా తెలిపాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా ధ్రువీకరణ కాలేదని, ఇందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దగ్గర లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. యెమెన్లో భారత్కు దౌత్యకార్యాలయం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడి భారతీయులందరినీ స్వదేశానికి తరలించిన తరువాత, దౌత్య కార్యాలయాన్ని కూడా మూసివేశారు. -
వైమానికి దాడులు... తిరుగుబాటుదారుల హతం
డెమాస్కస్: సిరియా దక్షిణ ప్రావెన్స్ ప్రాంతమైన దార్రాలోని జస్సెమ్ పట్టణాన్ని అక్రమించిన తిరుబాటుదారులపై ఆ దేశం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ సైనికాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.... అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సిరియాలో తిరుగుబాటు దారులు పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో సైన్యం గతేడాది నుంచి వైమానిక దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలరోజులుగా నిర్వహించిన వైమానిక దాడుల్లో 271 మంది పౌరులు మరణించగా, 190 మంది తిరుగుబాటుదారులు హతమయ్యారని సైనికాధికారులు వివరించారు. -
వైమానిక దాడుల్లో 31 మంది తీవ్రవాదులు హతం
ఇస్లామాబాద్: పెషావర్ ఘటనతో పాక్ సైన్యం దేశంలోని తీవ్రవాదులపై దాడిని మరింత ముమ్మరం చేసింది. ఆ క్రమంలో ఆదివారం తిహర్ వ్యాలీలోని కోకి ఖేల్ ప్రాంతంలో ఆత్మాహుతి దళానికి శిక్షణ ఇచ్చే కేంద్రంపై వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో 31 మంది తీవ్రవాదులు హతమయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో ఆత్మాహుతి దళ సభ్యులతోపాటు తీవ్రవాదులు కూడా ఉన్నారని పేర్కొంది. గతేడాది డిసెంబర్ 16న పెషావర్లో ఆర్మీ పాఠశాలలో తీవ్రవాదులు నరమేధం సృష్టించారు. ఈ ఘటనలో 150 మంది మరణించగా... వారిలో 140 మంది విద్యార్థులు ఉన్న విషయం తెలిసింది. దీంతో తీవ్రవాదులపై పాక్ తన దాడులను ముమ్మరం చేసింది. -
గాజాపై ఆగని దాడులు
12 వుంది పాలస్తీనియన్ల మతి గాజా: గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైవూనిక దాడుల్లో ఆదివారం 12 వుంది పాలస్తీనావాసులు మతిచెందారు. 48 రోజులనుంచి కొనసాగుతున్న పరస్పర దాడులను నివారించేందుకు బళ్లీ శాంతి చర్చలు జరపాలని ఈజిప్టు పిలుపునిచ్చిన మరుసటిరోజే ఇజ్రాయెల్ కాల్పులకు పాల్పడింది. అరుుతే ఇటు పాలస్తీనా నుంచి కాని, అటు ఇజ్రాయెల్ వైపునుంచి కాని ఈజిప్టు పిలుపునకుస్పందన కనిపించలేదు. ఆదివారం ఇజ్రాయెల్ విమానాలు గాజాలో 20 చోట్ల బాంబులు వేశారుు. రఫా పట్టణంలో 13 అంతస్తుల ఓ అపార్ట్మెంట్ను కూడా ఇజ్రాయెల్ నేలవుట్టం చేసింది. శనివారం గాజాలో కూడా ఇజ్రాయెల్ ఇదే తరహాలో 12 అంతస్తుల భవనాన్ని బాంబులతో కూల్చివేసింది. ఉగ్రవాదులు తలదాచుకుంటున్న భవనాలను కూల్చివేస్తావుంటూ ఇజ్రాయెల్ వారం రోజులనుంచి హెచ్చరికలు చేస్తోంది. ఇటు పాలస్తీనా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ భూభాగంపై 20 రాకెట్లను ప్రయోగించారు. -
అమాయకులపై నరమేధాన్ని సహించం
ఇరాక్లో అమెరికా వైమానిక దాడులకు ఒబామా సమర్థన తమ దౌత్యవేత్తలను, మైనారిటీలను రక్షిస్తామని స్పష్టీకరణ వాషింగ్టన్: ఇరాక్లో ఇస్లామిక్ మిలిటెంట్లపై తమ వైమానిక దాడులు సమంజసమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ సమర్థించుకున్నారు. అమాయకులపై నరమేధం జరిగినప్పుడల్లా, అడ్డుకునేందుకు అమెరికా జోక్యం తప్పదన్నారు. దేశ ప్రజలనుద్దేశించి వారాంతపు ప్రసంగంలో ఒబామా మాట్లాడుతూ, ప్రపంచంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ అమెరికా జోక్యం చేసుకోజాలదని, అయితే, అమాయకులు నరమేధానికి గురయ్యే ఇరాక్లాంటి పరిస్థితిని మాత్రం అమెరికా చూస్తూ వదిలేయబోదని స్పష్టంచేశారు. మిలిటెంట్లను తుదముట్టించేందుకు దీర్ఘకాలంపాటు దాడులను కొనసాగిస్తామని ఒబామా ప్రకటించారు. ‘‘కేవలం కొద్ది వారాల్లో ఈ సమస్యను మనం పరిష్కరించలేం. కుర్దిస్థాన్లోని స్థావరాలపై ఈ వారంలో మొదలైన మా దాడులు నెలలపాటు కొనసాగుతాయి’’ అని ఒబామా అన్నారు. అమెరికా సైన్యంతోకాకుండా ఇరాక్లో సమైక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మిలిటెంట్ల ఆగడాలను సమర్ధంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు. సంజాన్ పర్వతంపై తలదాచుకున్న మైనారిటీలను మిలిటెంట్ల దాడుల నుంచి తప్పక రక్షిస్తామన్నారు. వీరి రక్షణ కోసం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్లు తమ వంతు సాయం చేస్తామని అంగీకరించారని ఒబామా తెలిపారు. ఇరాక్లోని తమ దౌత్యవేత్తలు, సైనిక సలహాదారులు, మతపరమైన మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్టు ఒబామా తెలిపారు. మైనారిటీలకు తాము మానవతాపరమైన సాయం కొనసాగిస్తామన్నారు. ఇరాక్లో పలు ప్రాంతాలను ఆక్రమించిన మిలిటెంట్లు మైనారిటీలపట్ల కిరాతకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. మైనారిటీ వర్గాల్లోని పురుషులను హతమారుస్తూ, వారి కుటుంబసభ్యులను నిర్బంధిస్తూ,, మహిళలను బానిసలుగా చేస్తూ మిలిటెంట్లు అకృత్యాలకు పాల్పడుతున్నారని ఒబామా ఆరోపించారు. మిలిటెంట్లు లక్ష్యంగా ఎంపికచేసిన ప్రాంతాల్లో సైనిక దాడులు జరుపుతామన్నారు. మిలిటెంట్ల ఆగడాలకు భీతిల్లిన వేలాదిమంది యాజిదీ మైనారిటీలు ఉత్తర ఇరాక్లోని సింజాన్ పర్వతంపై తలదాచుకుంటూ తిండినీరులేక ఇబ్బం దులు పడుతున్నదశలో మిలిటెంట్లపై వైమానిక దాడులకు ఒబామా గురువారం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. కాగా, అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో మిలిటెంట్ల స్థావరాలపై దాడులకు ఇరాక్ ఫెడరల్ బలగాలు, కుర్దు సైనికులు కూడా సిద్ధమయ్యారు. -
మతిమాలిన చర్య!
సంపాదకీయం అలవాటైన ప్రాణం ఊరకే ఉండలేదు. అందుకే చేసిన బాసల్ని, ఇచ్చిన హామీల్ని గాలికొదిలి అగ్ర రాజ్యం అమెరికా మరోసారి ఇరాక్పై వైమానిక దాడులను ప్రారంభించింది. ఈసారి దానికి దొరికిన సాకు... ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్ల దుస్సాహసం. ఈ మిలిటెంట్లు గత రెండు నెలలుగా అడ్డూ ఆపూ లేకుండా దూసుకెళ్తూ అనేక పట్టణా లనూ, నగరాలనూ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఇలా ఉత్తర ఇరాక్ లోని చాలా భూభాగాన్ని గుప్పిట బంధించి... కుర్దుల స్వయంపాలిత ప్రాంతంవైపుగా అడుగులేస్తుండగా అమెరికాలో కదలిక వచ్చింది. కుర్దుల రాజధాని నగరం ఇర్బిల్కు కేవలం అరగంట ప్రయాణ దూరంలో వారుండగా ‘జనహననాన్ని’ ఆపడానికి వైమానిక దాడులు ప్రారంభించినట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. సరిగ్గా పుష్కరకాలం క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ ఇలాంటి కబుర్లే చెప్పారు. రసాయన ఆయుధాల గుట్టలున్న ఇరాక్ను నిరా యుధం చేయడం, అక్కడ ప్రజాతంత్రాన్ని ప్రతిష్టించడం తమ కర్తవ్య మంటూ ఇరాక్ దురాక్రమణకు తెగబడ్డారు. ఈ ముసుగులో అక్కడ సాగింది అక్షరాలా జనహననమే. మూడేళ్లనాడు తమ దళాలు అధికారి కంగా ఇరాక్ను వదిలిపోయిననాడు ఒబామా ఏమన్నారు? మళ్లీ ఈ గడ్డపై యుద్ధం కోసం అడుగుపెట్టబోమన్నారు. ఇన్నాళ్లకు ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల సాకుతో మళ్లీ పాత కథ మొదలుబెట్టారు. ఇది ఒబామా చెబుతున్నట్టు ‘అమాయక పౌరుల’ రక్షణకు కాదు. కుర్దిష్ ప్రాంతంలో తమకున్న విలువైన చమురు బావులను, ఇతర ఆస్తులను రక్షించుకోవ డానికి మాత్రమే. ఇరాక్లో గత రెండునెలలుగా ఏం జరుగుతున్నదో మీడియా అంతా కోడై కూస్తున్నది. ఐఎస్ మిలిటెంట్లు ఇరాక్లో పెద్ద రాష్ట్రమైన అల్ అంబర్ రాజధాని రమాదీతో మొదలుపెట్టి ఫలూజా, మొసుల్, తిక్రిత్ వంటి అనేక పట్టణాలనూ, నగరాలనూ స్వాధీనం చేసుకు న్నారు. ఇరాక్-సిరియా సరిహద్దుల పొడవునా ఉన్న అనేక ప్రాంతాలు వారి వశమయ్యాయి. మౌలికంగా ఐఎస్ సంస్థ సున్నీలదన్న పేరేగానీ దాని తీరుని ప్రశ్నించిన వారెవరినైనా ఆ మిలిటెంట్లు ఊచకోత కోశారు. అందులో షియాలు సరేసరి... సున్నీలున్నారు, క్రైస్త వులున్నారు. ఇతర మైనారిటీవర్గాలవారున్నారు. మిలిటెంట్ల ధాటికి జడిసి మైనారిటీ యాజిదీ క్రైస్తవులు ప్రాణాలరచేతబట్టుకుని సింజార్ కొండల్లో తలదాచుకున్నారు. ఈమధ్యకాలంలో మాట వినని ఇరాక్ అధ్యక్షుడు అల్-మాలికీని దారికి తెచ్చుకునేందుకు ఈ ఐఎస్ మిలి టెంట్ల బెడద తనకు ఉపయోగపడుతుందని అమెరికా తలపోసింది. కానీ, ఇది మరింత ముదిరి కుర్దిష్ ప్రాంతానికి విస్తరించడంతో దానికి ముచ్చెమటలు పట్టాయి. అక్కడ అమెరికా సంస్థల చమురు బావులుం డటమే కాక వందలాదిమంది అమెరికా దౌత్య నిపుణులు, మిలిటరీ సిబ్బంది, వారి కార్యాలయాలు ఉన్నాయి. అందువల్లే అమెరికా తాజా దాడులకు తెరతీసింది. జనహననం సాగుతున్నప్పుడు తాము కళ్లు మూసుకుని ఉండలేమని చెబుతున్న ఒబామాకు గాజాలో సాగిన ఇజ్రాయెల్ ఊచకోత సమయంలో ఈ జ్ఞానోదయం ఎందుకు కలగలేదో అర్ధంకాదు. వైమానిక దాడులతో మొదలైన తాజా అంకం అక్కడితో ఆగుతుం దన్న గ్యారెంటీ లేదు. ఐఎస్ మిలిటెంట్లను అదుపుచేయడానికి మా త్రమే ఈ దాడులు పరిమితమవుతాయని, భూతల దాడులకు దిగేది లేదని ఒబామా చెప్పే మాటలు నమ్మశక్యంకానివి. ఈ దాడుల వెనక ఒబామాకు స్వీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నవంబర్లో రా నున్న మధ్యంతర ఎన్నికలు, రిపబ్లికన్లనుంచి నిత్యం వస్తున్న రాజకీయ ఒత్తిళ్లు, ముఖ్యంగా ఐఎస్ మిలిటెంట్లపై చర్యకు వెనకాడుతున్నారన్న విమర్శలనుంచి బయటపడటానికి ఈ వైమానిక దాడులు ఉపయోగప డతాయని ఒబామా అంచనావేస్తున్నారు. ఆయనకొచ్చే ప్రయోజనాల సంగతలా ఉంచితే, అమెరికా ఇలా మతిమాలిన చర్యలకు పాల్పడిన ప్పుడల్లా ఉగ్రవాదం మరింతగా విస్తరిస్తున్నది. అంతక్రితం అఫ్ఘాన్ లోనూ, అటు తర్వాత ఇరాక్లోనూ, ఆపై లిబియా, సిరియాల్లోనూ రుజువైంది ఇదే. లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి వివిధ తెగలకు అందజేసిన ఆయుధాలు, డాలర్లు ఇప్పటికీ ఆ దేశాన్ని భగ్గున మండిస్తున్నాయి. ఇక సిరియాలో అల్ కాయిదాతో సంబంధ మున్న భిన్న వర్గాలకు సైతం అమెరికా నుంచి ఆయుధాలు, డబ్బు ప్రవాహంలా వచ్చాయి. ఐఎస్ మిలిటెంట్లు ఆ సంతతివారే. ఇలా అమె రికా వ్యూహం వికటించి మొత్తం పశ్చిమాసియాకే పెనుముప్పుగా మా రింది. ఇప్పుడు దీన్నుంచి కాపాడటానికంటూ ప్రారంభించిన తాజా వైమానిక దాడులు కూడా అందుకు భిన్నమైన ఫలితాలను తీసుకొచ్చే అవకాశం లేదు. ఈ దాడులు పూర్తిస్థాయి దురాక్రమణ యుద్ధంగా మా రడానికి ఎంతో కాలం పట్టదు. ఐఎస్ మిలిటెంట్లు అమెరికా దాడులకు ప్రధాన లక్ష్యంగా మారిన మరుక్షణంనుంచీ వారికి ఇస్లామిక్ ప్రపంచం నుంచి మద్దతు మరింత పెరుగుతుంది. అమెరికా జారవిడిచే బాం బులు ఎందరు మిలిటెంట్లను మట్టుబెడతాయో, ఆ పేరిట ఎందరు అమాయకులను పొట్టనబెట్టుకుంటాయో తెలియదుగానీ... మిలిటెంట్ల బలాన్ని మాత్రం రోజురోజుకూ పెంచుతాయి. పాదం మోపిన చోటల్లా మిలిటెన్సీకి ప్రాణం పోస్తూ, దాన్ని ఇంతకింతా పెంచుతున్న అమెరికా ఇప్పటికైనా తన తప్పిదాన్ని గ్రహించాలి. ఐఎస్ మిలిటెంట్ల వల్లో, మరొకరి వల్లో సమస్య తలెత్తితే దాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యస మితి వంటి అంతర్జాతీయ సంస్థలున్నాయని గ్రహించాలి. ఏ సమస్య నైనా ఆయా దేశాల్లోని ప్రజాస్వామిక శక్తుల చొరవకు, పరిష్కారానికి వదిలిపెట్టాలి. లేని పెద్దరికాన్ని నెత్తినెత్తుకుని ప్రపంచాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే చర్యలకు ఇకనైనా స్వస్తి పలకాలి. -
ఇరాక్లో అమెరికా దాడులు
మిలిటెంట్లపై విరుచుకుపడిన అగ్రరాజ్యం వాషింగ్టన్: ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్లపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు అమెరికా బలగాలు శుక్రవారం వైమానిక దాడులు ప్రారంభించాయి. ఉత్తర ఇరాక్లో ఐఎస్ మిలిటెంట్లకు చెందిన ఓ శతఘ్నిదళంపై అమెరికా ఫైటర్ జెట్లు రెండు లేజర్ గెడైడ్ బాంబులు జారవిడిచాయి. అవసరమైతే ఐఎస్ మిలిటెంట్లపై గగనతల దాడులు మొదలుపెడతామని ఒబామా గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాయవ్య ఇరాక్లోని సింజర్ కొండప్రాంతంలో చిక్కుకున్న మైనారిటీ ప్రజలను కూడా రక్షించాల్సిందిగా ఒబామా తమ సైన్యాన్ని ఆదేశించారు. ఇరాక్లోని యాజిదీ మైనారిటీ ప్రజలను ఇస్లామిక్ మిలిటెంట్లు ఊచకోత కోస్తుంటే అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ఆహారం, నీరు లేకుండా కొండపై చిక్కుకున్న వేలాది మంది మైనారిటీ పౌరులను ఆదుకోవాలని ఆయన తమ దళాలను ఆదేశించారు. ఇరాక్లోని కుర్దుప్రాంతంలో ఉన్న ఎర్బిల్వైపు మిలిటెంట్లు ఒక్క అడుగు ముందుకు వేసినా వారిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ పట్టణంలోని కాన్సులేట్లో పలువురు అమెరికా దౌత్య అధికారులు, పౌరులు పనిచేస్తున్నారు. ఇక్కడేకాదు, ఇరాక్లో ఎక్కడైనా ఇస్లామిక్ మిలిటెంట్లు అమెరికన్లవైపు కన్నెత్తి చూసినా ఊరుకోబోమన్నారు. ఒబామా ఆదేశాల నేపథ్యంలో సున్నీ మిలిటెంట్లపై వైమానిక దాడులను ప్రారంభించామని అమెరికా సైనిక ప్రధాన కార్యాలయం పెంటగన్ శుక్రవారం ప్రకటించింది. కాగా, ఇరాక్లోని వాయవ్య ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని పోరు సాగిస్తున్న మిలిటెంట్లు శుక్రవారం అన్బర్ ప్రావిన్స్లో ఓ విద్యుత్ కేంద్రంపై దాడిచేయగా పోలీసులు, ఆర్మీ, స్థానిక గిరిజనులు కలిసి తిప్పికొట్టారు. ఈ సంఘటనలో 25 మంది జిహాదిస్టులు హతమయ్యారు. ఇరాక్ ప్రభుత్వానికి అండగా నిలవండి.. ఇరాక్ సంక్షోభ నివారణకు అక్కడి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలను కోరింది. మిలిటెంట్లపై వైమానిక దాడులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్న వార్తలను ఇరాక్ ఖండించింది. అమెరికా దాడులను ఇరాకీలు, కుర్దిష్లు ఆహ్వానించారు. ఇరాక్లో జిహాదిస్టుల దాడులు ఎదుర్కొంటున్న క్రైస్తవులు, ఇతరులకు సంఘీభావం కోసం తాను ప్రత్యేక దూతను పంపనున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. -
గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు
337కు చేరిన మృతుల సంఖ్య ఆశ్రయం కోల్పోయిన 40 వేలమంది పాలస్తీనియన్లు గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజా ప్రాంతంలో పాలస్తీనియన్లకు చెందిన హమాస్ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటుగా భూతల దాడులనూ ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాలు అంతకంతకూ గాజా ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. గాజాలోని ఒక ఇంటిపై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకరిని సైనికులు హతమార్చారని, మిగతావారు వెనుదిరిగి గాజా ప్రాంతంలోకి పరారయ్యారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ 12 రోజులుగా జరుపుతున్న దాడులతో మృతుల సంఖ్య 337కు చేరింది. దాడులతో 40 వేలమందికి పైగా పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. ఇరుపక్షాలను కాల్పుల విరమణకు ఒప్పించేందుకు, సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, దౌత్యవేత్తలు సన్నద్ధమయ్యారు. పశ్చిమాసియాకు మూన్ పయనమవుతున్నారు. మరోవైపు ఘర్షణ తీవ్రతరమై గాజా ప్రాంతంలో పరిస్థితి మరింత విషమించింది. ఉభయపక్షాలు అంతర్జాతీయ మానవతా చట్టం నిబంధనలను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సహాయ, కార్యకలాపాల సంస్థ సూచించింది.