Alluri Sitarama Raju District
-
అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన.. ఏజెన్సీ బంద్
సాక్షి, అల్లూరి జిల్లా: పాడేరు ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. గిరిజన హక్కులకు భంగం కలిగేలా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. 1/70 యాక్ట్ను సవరించాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై నిరసనలకు దిగాయి. అయ్యన్న వ్యాఖ్యలపై రాజకీయ, గిరిజన, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు బంద్లో పాల్గొన్నారు. 1/70 యాక్ట్ను సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. టూరిజం ముసుగులో గిరిజన భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశాయి.1/70 చట్టాన్ని సవరించాలన్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల అఖిల పక్షం నేడు(మంగళ), రేపు( బుధవారం) మన్యం బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ బంద్కు వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. గిరిజన హక్కులు, చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరింలంటూ చెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు మన్యం బంద్ చేపట్టాయి. -
అరకు లోయలో 5.9 డిగ్రీలు
సాక్షి, పాడేరు/చింతపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో శనివారం అర్ధరాత్రి నుంచి చలిగాలులు విజృంభించాయి. ఆదివారం ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా అలముకుంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు పోయిన తరువాత కూడా చలి తీవ్రత తగ్గలేదు. అరకులోయలో 5.9 డిగ్రీలు, జీకే వీధి 6.1, పాడేరు 6.9, హుకుంపేట 6.9, డుంబ్రిగుడ 7, చింతపల్లి 7.3, పెదబయలు 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.చలితీవ్రతతో మన్యంలోని స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 10 గంటల వరకూ మంచు అధికంగా కురవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. సాయంత్రం 4 గంటల నుంచి చలి గాలులు వీస్తుండటంతో వృద్దులు, చిన్నారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. -
సీలేరు రేంజ్లో బెంగాల్ టైగర్ సంచారం
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతమైన సీలేరు అటవీ రేంజ్ పరిధిలో సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో రోడ్డుపై పెద్ద పులి (బెంగాల్టైగర్) ప్రయాణికుల కంటపడింది. రోడ్డు దాటుతుండగా అదే సమయంలో పాడేరు డిపోకు చెందిన బస్సు డొంకరాయి నుంచి సీలేరు మీదుగా పాడేరు వెళ్తుండగా సప్పర్ల రెయిన్గేజ్కు వెళ్లే సరికి పులి రోడ్డు దాటుతోంది. బస్సు రావడంతో పులి భయపడి రోడ్డుపై అటూ ఇటూ పరుగులు తీసింది. దీంతో బస్సు డ్రైవరు చాకచక్యంతో వ్యవహరించి హారన్ కొట్టడంతో అడవిలోకి పారిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇదివాస్తవమా? కాదా? అన్నదానిపై సీలేరు డెప్యూటీరేంజ్ అధికారి సీహెచ్ సింహాచలం పడాల్, తోకరాయి సెక్షన్ ఆఫీసర్ వివేకానందరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాకేశ్ కుమార్ కలిసి పులి సంచరించిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు దాటిన ప్రాంతంలో పులి కాలిముద్రలను సేకరించి పులి జాడపై ఆరా తీశారు. పది రోజుల క్రితమే ఈ ప్రాంతానికి పులి వచ్చిందని, పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు నాలుగు రోజుల కిందట అరుపులు కూడా వినబడినట్లు తెలిసిందన్నారు.ఈ మధ్య కాలంలో ఒడిశా ప్రాంతంలోనూ, అల్లూరి జిల్లా చింతూరు ఏరియాలోనూ సంచరించేదని, ఆ పులే ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపై రేంజ్ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీలేరు రేంజ్ పరిధిలో 50 ఏళ్లకాలంలో పెద్ద పులి లేదన్నారు. సరిహద్దులోని ఒడిశా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చినట్లు నిర్ధారించామని, చింతూరు ఏజెన్సీ పరిధిలోని కాలిముద్రలు, సీలేరు పరిధిలో కాలి ముద్రలు పరిశీలిస్తామన్నారు. -
తామర పంటకాదు.. పూల్ మఖానా!
నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటలను వినియోగంలోకి తెచ్చి గిరి రైతులకు ఆదాయ వనరుగా మార్చేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా (alluri sitarama raju district) చింతూరు ఐటీడీఏ అడుగులు వేస్తోంది. డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్పురం మండలాల్లో నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి అనుబంధంగా పూల్ మఖానా (phool makhana) సాగు చేపట్టేందుకు సంకల్పించింది. ఇప్పటికే చింతూరు డివిజన్లో మఖానా సాగు సాధ్యాసాధ్యాలను నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, డాక్టర్ పడాల వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సాగుకు కీలకమైన గాలి, ఉష్ణోగ్రత, వర్షపాతం అనుకూలంగా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. డివిజన్ పరిధిలోని చెరువులు, కుంటలను పరిశీలించారు. స్థానిక గిరిజన రైతులతో కూడా మాట్లాడారు. ఇక్కడి చెరువులు, కుంటల్లోని మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. పరీక్షల నివేదిక ఆధారంగా ఈ ప్రాంతంలో మఖానా సాగు చేపట్టేందుకు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో.. మఖానా అనేది జలపంట. దీనిని సాధారణంగా పూల్ మఖానా, గోర్గాన్ నట్ (gorgon nut) అని కూడా పిలుస్తుంటారు. ఇది సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, కుంటల వంటి స్థిరమైన శాశ్వత నీటి వనరుల్లో పెరుగుతుంది. తేలియాడే ఆకులతో మెత్తని ఆకృతి, ప్రకాశవంతమైన నీలిరంగు, స్టార్చ్వైట్ గింజలతో ఉత్పత్తి చేస్తుంది. చూసేందుకు తామర ఆకులను పోలిఉండటంతో దీనిని అందరూ తామర పంటగానే భావిస్తారు. తామర ఆకు మృదువుగా ఉంటే మఖానా ఆకు (Prickly Water Lily) మాత్రం పైకి ముళ్ల మాదిరిగా కనిపిస్తుంది. ప్రతిమొక్క 15 నుంచి 20 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గుండ్రంగా మెత్తగా ఉంటాయి. ప్రతి పండులో 20 నుంచి 200 గింజల వరకు ఉంటాయి. మార్కెట్లో వీటి ధర కిలో రూ.800 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. మఖానా పంట సగటు దిగుబడి హెక్టారుకు 1.4 నుంచి 1.6 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మఖానాలో ఉన్న ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్లు వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు, బరువు తగ్గడం, మెదడు పనితీరు మెరుగు పరచడం, గుండె సంబంధిత వ్యాధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. మఖానాను నేరుగా తినడంతో పాటు వంటకాల్లో ఉపయోగించడం వల్ల స్థానికంగా మార్కెటింగ్ అందుబాటులో ఉంటుంది.ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మఖానా సాగును ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగా ఇటీవల ఆంధ్రాలోని చింతూరు ఐటీడీఏ పరిధిలో పర్యటించాం. సాగులో కీలకమైన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండాలి. మట్టి, నీరు కూడా పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తాయి. చింతూరు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడాన్ని గుర్తించాం. సాగుకు అనుకూల పరిస్థితులపై కసరత్తు ప్రారంభించాం. దీనిలో భాగంగానే మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించాం.– డాక్టర్ ఇందుశేఖర్ సింగ్, శాస్త్రవేత్త, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ మఖానాచదవండి: అందాల దీవిలో కడలి కల్లోలంఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదంమఖానా సాగు గిరి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుకు దోహదపడుతుందని భావిస్తున్నాం. చేపల పెంపకం చేపట్టే చెరువుల్లోనే వాటికి అనుబంధంగా మఖానాను కూడా సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు సాగుకు అనుకూలిస్తాయని ఆశిస్తున్నాం. దీనిలో భాగంగానే శాస్త్రవేత్తలు ఇటీవల ఈప్రాంతంలో పర్యటించారు. ల్యాబ్ నివేదిక రాగానే వారు సాగుకు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. రైతులకు అవగాహన కల్పించి తరువాత శిక్షణ ఇస్తాం. – అపూర్వభరత్, ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ, చింతూరు -
పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్
-
అల్లూరి జిల్లా గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
AP: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
సాక్షి, అల్లూరి: పాడేరులోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా పాడేరులోని గోమంగి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉంచిన ఆహారం విద్యార్థినులకు పెట్టడంతో వారికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వారి పరిస్థితి సీరియస్గా మారడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్ధినులను చూసి వారి పేరెంట్స్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో మిగిలిపోయిన వంటకాలను గురుకుల సిబ్బంది మరుసటి రోజు వడ్డించినట్టు సమాచారం. దీని వల్లే వారు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. -
కాఫీ రైతు హ్యాపీ.. అల్లూరి జిల్లాలో విరగ్గాసిన పండ్లు
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది కాఫీ విరగ్గాసింది. ఎక్కడ చూసినా ఎర్రటి పండ్లతో తోటలు కళకళలాడుతున్నాయి. తోటలు మంచి కాపుకాయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా పండ్ల దశలోనే కొనుగోలు చేస్తుండడంతో వాటి సేకరణను రైతులు ప్రారంభించారు. తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలు అనుకూలంగా ఉండడంతో కాఫీ పంట విరగ్గాసిందని కాఫీ విభాగం అధికారులు అంటున్నారు.సాక్షి,పాడేరు: అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన అల్లూరి జిల్లాలో కాఫీకి ఈఏడాది కూడా మహర్దశ పట్టింది. కాయలు పక్వానికి వచ్చాయి. తోటల్లో విరగ్గాసిన ఎర్రని కాఫీ పండ్ల సేకరణను గిరిజన రైతులు ప్రారంభించారు. కాఫీ పంటను పండ్ల దశలోనే పాడేరు ఐటీడీఏతో పాటు గిరిజన రైతు ఉత్పత్తి సంఘాలు,పలు ఎన్జీవో సంస్థలు కొనుగోలు ప్రారంభించాయి. చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా పాడేరు ఐటీడీఏ రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. కాఫీ పండ్ల సేకరణలో కాఫీ రైతులు వారం రోజుల నుంచి బిజీగా ఉన్నారు. సేకరించిన పండ్లను ఐటీడీఏతో పాటు పలు సంస్థలు వెంటనే కొనుగోలు చేస్తూ పల్పింగ్ యూనిట్లకు తరలిస్తున్నాయి. జీసీసీ సిబ్బంది కూడా కాఫీ గింజలు కొనుగోలు చేస్తున్నారు.1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో 2.42 లక్షల ఎకరాల్లో కాఫీతోటలను గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటిలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం ఇచ్చే కాఫీతోటలు ఉన్నాయి. ఆయా తోటల్లో కాఫీ పండ్లు విరగ్గాయడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది 17వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను రైతులు విక్రయించారు. ఈ ఏడాది కూడా కాపు ఆశాజనకంగా ఉండడంతో 18వేల మెట్రిక్ టన్నుల వరకు కాఫీ గింజల ఉత్పత్తి ఉంటుందని కేంద్ర కాఫీబోర్డు,పాడేరు ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జీసీసీ,ఐటీడీఏలు గిట్టుబాటు ధరలు ప్రకటన ఈఏడాది కూడా గిరిజన రైతులు ఉత్పత్తి చేసే కాఫీ పంటకు ఎఫెక్స్ కమిటీ సిఫారసు మేరకు జీసీసీ,పాడేరు ఐటీడీఏలు గిట్టుబాటు ధరలను ప్రకటించాయి. చింతపల్లి మాక్స్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసే కాఫీ పండ్లకు కిలో రూ.44ధర చెల్లించేందుకు పాడేరు ఐటీడీఏ నిర్ణయించింది. పార్చ్మెంట్ కాఫీ గింజలను కిలో రూ.285 ధరతో, అరబికా చెర్రీ రకాన్ని కిలో రూ.150,రోబస్ట చెర్రీ రకాన్ని కిలో రూ.80కు కొనుగోలు చేయనున్నారు.డ్రైకాఫీ దిగుబడి ఎకరాకు 150 కిలోల వరకు ఉంటుంది. ఐటీడీఏ ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి 45 వేల వరకు రైతుకు ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ. 8 కోట్లతో పండ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఐటీడీఏ నిర్ణయించుకోగా, రూ. 57 కోట్ల లావాదేవీలు నిర్వహించాలని జీసీసీ భావిస్తోంది. జిల్లా మొత్తం ఈ ఏడాది రూ.400 కోట్ల వరకూ కాఫీ లావాదేవీలు జరగవచ్చని భావిస్తున్నారు. పండ్ల సేకరణ ప్రారంభించాం నాకు ఉన్న రెండు ఎకరాల్లో కాఫీ తోటలు విరగ్గాసాయి. కాపు ఆశాజనకంగా ఉంది. రెండు రోజుల నుంచి పండ్ల సేకరణ జరుపుతున్నాం. గత ఏడాది కాఫీ పంట విక్రయం ద్వారా రూ.70వేల ఆదాయం వచ్చింది. ఈ సారి కాపు అధికంగా ఉండడంతో దిగుబడి పెరుగుతుందని ఆశిస్తున్నాను. సొంతంగా పల్పింగ్ చేసి పార్చ్మెంట్ కాఫీని తయారు చేసి జీసీసీకే విక్రయిస్తాను. – సుర్ర చిట్టిబాబు, కాఫీ రైతు, కరకపుట్టు,పాడేరు మండలంకాఫీ పంటకు గిట్టుబాటు ధర గిరిజన రైతులు సాగు చేస్తున్న కాఫీ పంట నాణ్యతలో నంబర్–1గా నిలుస్తుంది. కాఫీ ఉత్ప త్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఐటీడీఏ,జీసీసీ యంత్రాంగం ద్వారా కాఫీ రైతులకు మేలు చేసేలా గిట్టుబాటు ధరలను ప్రకటించాం. గిరిజనులు ఎలాంటి అపోహలకు గురికాకుండా కాఫీ పండ్లను ఐటీడీఏకు, పార్చ్మెంట్, అరబికా, రొబస్ట కాఫీ గింజలను జీసీసీకి విక్రయించి లాభాలు పొందాలి. దళారీలను ఆశ్రయించి మోసపోవద్దు. –ఎ.ఎస్.దినేష్ కుమార్, కలెక్టర్. -
వైఎస్సార్, అల్లూరి జిల్లాల్లో పులుల సంచారం
లింగాల/రాజవొమ్మంగి/అడ్డతీగల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని పొలాల్లో పులి, పులి పిల్లలు సంచరిస్తున్న దృశ్యాలను రైతులు చంద్రశేఖర్, తన చెల్లెలు తమ సెల్ఫోన్ల్లో సోమవారం వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తాతిరెడ్డిపల్లె గ్రామానికి చేరుకుని పులులు సంచరిస్తోన్న ప్రదేశాలను తనిఖీలు చేశారు. అయితే సోమవారం రాత్రి వర్షం కురవడంవల్ల వాటి జాడలు కనిపించలేదు. గ్రామస్తులకు తహశీల్దార్ ఈశ్వరయ్య తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు పొలం పనులు పూర్తి చేసుకుని రావాలని రైతులకు, చీకటి పడేలోపు ఇళ్లకు చేరుకోవాలని గొర్రెల కాపరులకు సూచించారు. పులుల సంచారంపై నిఘా ఏర్పాటు చేస్తామని డీఆర్వో శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం, కడప జిల్లాల సరిహద్దుల్లో ఈ పులులు సంచరిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి సంచారాన్ని పసిగట్టి వాటిని అక్కడ నుంచి తరిమివేసేలా చర్యలు తీసుకుంటామని డీఎఫ్వో దివాకర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం డీఆర్వో శ్రీనివాసులు, ఎఫ్బీవోలు మహబూబ్ బాషా, గోపాల్ పులులు సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు.అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి నుంచి గొబ్బిలమడుగు వెళ్లే ఘాట్రోడ్/అటవీప్రాంతంలో పులి సంచారంపై మంగళవారం సాక్షిలో ‘అమ్మో పులి’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా రాజవొమ్మంగి అటవీక్షేత్రాధికారి జి.ఉషారాణి ఘటనాస్థలికి వెళ్లి పులి పాదముద్రలు పరిశీలించారు. పాద ముద్ర 14 సెం.మీ. పొడవు, వెడల్పు ఉన్నట్లు రికార్డు చేశారు. లోతట్టు అటవీ ప్రాంతంలోకి వెళ్లి సెలయేరు వద్ద పులి సంచరించిన చోట పరిశీలించగా అక్కడ పులి అడుగు జాడలు కనిపించడంతో ఫోటోలు తీశారు. ఇది పులా? చిరుత పులా? అనే సమాచారాన్ని అధికారులతో సంప్రదించి వెల్లడిస్తామన్నారు.పులి దాడిలో మేకలు చనిపోయిన ఘటనపై విచారణ కోసం మేకల కాపరి ఉండే అడ్డతీగల అటవీ సబ్ డివిజన్ పాపంపేట సెక్షన్ పరిధి కినపర్తికి అడ్డతీగల సబ్ డీఎఫ్వో సుబ్బారెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది వెళ్లారు. పులిని చూసిన మేకల కాపర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మేకలపై దాడి సమయంలో చెట్లెక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నట్లు వారు తెలిపారు. -
శ్వేత మయూరం మన కశ్మీరం
పచ్చటి పర్వత శ్రేణులను ముద్దాడుతున్న మేఘమాలలు..దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు మరోవైపు ఆకుపచ్చని హరిత అందాలు.. అడవులపై పరిచినట్టుగా పవళించే మేఘాలు.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే కశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. లంబసింగిని సందర్శిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తేవావ్ అనాల్సిందే. చింతపల్లి: మండలంలోని లంబసింగికి తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఇదే కావడం అందుకు కారణం. చలికాలం బాగా ఉధృతంగా ఉండే తరుణంలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు మించదు. అత్యల్ప ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్గా ఇక్కడ వివిధ సందర్భాల్లో నమోదైంది. 3,600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న లంబసింగి ఒకప్పుడు ఎలాంటి ప్రత్యేకతలూ లేని చిన్న గిరిజన పల్లె. అటవీశాఖ చెక్పోస్టు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆశ్రమ గురుకుల పాఠశాల మాత్రమే ఉండేవి. విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు నుంచి బస్సులు మాత్రం ఈ ప్రాంతం మీదుగా తరచూ తిరిగేవి. ⇒ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెక్పోస్టు సెంటర్లో చాలాకాలం క్రితం ఓ చెట్టుకింద ఒక వ్యక్తి చలికి కొయ్యబారి చనిపోయాడని చెబుతుంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కొర్రబయలు అని కూడా పిలిచేవారు. ⇒ మైదాన ప్రాంతంలో సాధారణంగా ఏడాదికి నాలుగు నెలలు మాత్రం చలి ఉంటుంది. కానీ లంబసింగి ప్రాంతంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుంది. సెపె్టంబర్ మొదటి వారం నుంచి చలి ప్రభావం కనిపిస్తుంది. డిసెంబర్లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైన సందర్బాలు ఉన్నాయి. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చింతపల్లిలో ఉష్ణోగ్రత ఇక్కడకన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. నిత్యం భోగి మంటలే.. ప్రతీ ఇంట్లో అందరికీ పెద్ద రగ్గులు ఉంటాయి. స్వెటర్లు, కంబళ్లు తప్పనిసరి. మంట కోసం కట్టెలు సిద్ధంగా ఉంచుకుంటారు. సాయంత్రమయ్యేసరికి ప్రతి ఇంట్లో అన్నం వండుకోవడానికన్నా ముందు కుంపట్లు సిద్ధం చేసుకుంటారు.తాజంగిలో బోటు షికార్, జిప్లైన్ తాజంగి జలాశయంలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన బోట్ షికార్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకులందరూ 20 నిమిషాలు బోటులో షికారు చేసి ఎంతో సంతోషం పొందుతుంటారు. జలాశయం మీదుగా ఏర్పాటుచేసిన జిప్వే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 250 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిప్ లైన్ ద్వారా కొండపై నుంచి చెరువు వరకు జారుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. మరో వ్యూపాయింట్ నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చే మార్గంలో బోడకొండమ్మ ఆలయం వద్ద మరో వ్యూపాయింట్ అందుబాటులోకి వచ్చింది. గత అరకు ఎంపీ మాధవి నిధులు వెచ్చించి దీనిని నిర్మించారు. ⇒ నర్సీపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించాక చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో మలుపులతో కూడిన రోడ్లు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో కాఫీ, మిరియం తోటలు ఆకట్టుకుంటాయి. ⇒ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. దీనిని బట్టి ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం, నర్సీపట్నం నుంచి ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.పర్యాటక సీజన్లో కళకళ పర్యాటక సీజన్ వచ్చిందంటే చాలు లంబసింగి పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో వసతులు లేనందున సమీప నర్సీపట్నంలో బస చేసి తెల్లవారుజామున ఇక్కడి పర్యాటకులు వచ్చేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిసార్ట్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ కాటేజీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.కొండల్లో ‘పాల సముద్రం’ చెరువులవేనం కొండల్లో ప్రకృతి అందాలు పాలసముద్రాన్ని తలపిస్తాయి. ఈ ప్రాంతం లంబసింగికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పొగమంచు దట్టంగా కమ్మి ఉంటుంది. మేఘాలు మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ అపురూప అందాలను తిలకించేందుకు ఎక్కడెక్కడినుంచో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా పాడేరు ఐటీడీఏ వ్యూపాయింట్ను నిర్మించింది. ⇒ శీతల వాతావరణం ప్రారంభమైన నాటి నుంచి వచ్చే పర్యాటకులతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లంబసింగి సెంటర్ జాతరను తలపిస్తుంది. వీకెండ్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. శని, ఆదివారాల్లో అయితే చెరువులవేనం జనసంద్రంగా మారుతుంది. కొంతమంది శనివారం రాత్రి లంబసింగి వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేస్తూ దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ గడుపుతారు. వేకువజామున చెరువులవేనం వెళ్లి ప్రకృతి అందాలను తిలకిస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. చెరువులవేనం, బోడకొండ గుడి వద్ద వ్యూపాయింట్లు నిర్మించింది.కృష్ణాపురం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్ను ఏర్పాటుచేసింది. తాజంగి జలాశయాన్ని అభివృద్ధి చేసింది. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యేకనీస వసతులు అవసరం పర్యాటక ప్రాంతంగా పాచు ర్యం పొందడంతో ఈ ప్రాంత అందాలను చూడడానికి ఎంతోమంది కుటుంబాలతో వ స్తున్నారు.ఈ ప్రాంతంలో కనీస వసతులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు అ««ధికారులు చర్యలు చేపట్టాలి.వాహనాల నిలుపుదలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. – ప్రశాంత్, పర్యాటకుడు విజయనగరం -
Vippa Puvvu: విప్ప పువ్వు.. కల్పతరువు
గిరిజనులకు అడవి ప్రసాదించిన ఫలాల్లో విప్ప పువ్వు ఒకటి. మన్యంలో విరివిగా లభించే ఇవి గిరిజనులకు మంచి ఆదాయ వనరు. ఇప్పటివరకు సీజన్లో మాత్రమే సేకరించి ఆదాయం పొందేవారు. ఇక నుంచి వీటితో ఏడాది పొడవునా అనుబంధ ఆహార ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పొందే దిశగా గిరి మహిళలు అడుగులు వేస్తున్నారు. చింతూరు: లాటిన్ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది. చెట్లు కలిగిన గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ విప్పపూలు (Vippa puvvu) రాలుతున్న సమయంలో సువాసన వెదజల్లుతుంది. ఇంటిల్లిపాదీ కలసి చెట్టు వద్దకు చేరుకుని బుట్టలు, చేటలతో పూలను సేకరిస్తారు. వీటిని నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన పూలను సంతలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. ఏడాది పొడవునా అమ్మకాలు అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో విరివిగా విప్పచెట్లు ఉన్నాయి. కొన్ని గిరిజన కుటుంబాలు వీటిపై వచ్చే ఆదాయంతో ఏడాది పొడవునా జీవనం సాగిస్తున్నాయి. సేకరించిన పూలను ఎండబెట్టి చింతూరు, ఏడుగురాళ్లపల్లి, కుంట మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. భద్రాచలం, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక చెట్టుకు సుమారు 150 కిలోల విప్ప పువ్వు లభ్యమవుతుంది. దీనిని ఎండబెట్టిన తరువాత వచ్చే పువ్వు కిలో రూ.50 నుంచి రూ.60 ధరకు విక్రయిస్తున్నారు. విప్పకాయలు కిలో రూ.30కు అమ్ముతున్నారు. ఈ చెట్లు విస్తారంగా ఉన్నందున గిరిజనులకు చేతినిండా ఆదాయం వస్తోంది. పోషకాలెన్నో.. : విప్పపూలలో ఎన్నో పోషక గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగాలను హరించే ఔషధ గుణాలు కూడా విప్పపూలలో ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలను నయంచేసే గుణంతోపాటు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఎనర్జీ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్–సి వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయని వారు చెబుతున్నారు. విప్పకాయలతో చేసిన నూనెతో మసాజ్ చేస్తే కీళ్లనొప్పులు దూరమవుతాయని వారు పేర్కొంటున్నారు. స్వీట్ల తయారీ దిశగా అడుగులువిప్ప పూలను సారా తయారీ, ప్రసాదాల్లో మాత్రమే వినియోగించేవారు. ప్రస్తుతం కొన్ని స్చచ్ఛంద సంస్థల సహకారంతో స్వీట్ల తయారీపై మహిళలు దృష్టి పెట్టారు. చింతూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విప్ప పూల సేకరణ, స్వీట్ల తయారీపై మహిళలకు అవగాహన కల్పిస్తోంది. లడ్డూ, హల్వా, జామ్, కేక్ వంటి తినుబండారాల తయారీపై శిక్షణ ఇచ్చి ఉపా ధిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి విప్పపువ్వుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటితో స్వీట్లు తయారీపై శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నాం. చింతూరు డివిజన్లోని గిరిజన గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టాం. తాము అందిస్తున్న సహకారం గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. – సుభాని,కార్యదర్శి, ఆశా స్వచ్ఛంద సంస్థ, చింతూరువిప్పపువ్వుతో ఆర్థికాదాయం ప్రతి వేసవిలో ఇంటిల్లిపాదీ కలసి విప్పపూలు సేకరిస్తాం. వాటిని ఆరబెట్టి చింతూరు, మోతుగూడెం సంతల్లో విక్రయించడం ద్వారా ఆదాయం లభిస్తుంది. దీంతోపాటు మా సంస్కృతిలో భాగంగా విప్పపువ్వుతో సారా కూడా తయారుచేసి సేవిస్తాం. – పూసం మహేష్,లక్కవరం, చింతూరు మండలంశిక్షణ ఎంతో ఉపయోగం విప్పపువ్వుల సేకరణతో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వీట్ల తయారీలో శిక్షణ పొందుతున్నాం. తయారు చేసే విధానంతోపాటు ఆన్లైన్ మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన విప్పపూల సేకరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. – వెట్టి కన్నమ్మ,తెరపాడు, చింతూరు మండలం -
సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం
అల్లూరి సీతారామరాజు, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంధ్యారాణి సోమవారం పర్యటించారు. అయితే.. మంత్రి సంధ్యారాణి పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన ఆ ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు ఫొటో కనిపించకపోవటం గమనార్హం. అయితే మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు పెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పెట్టని వైనం కనిపించింది. దీంతో పాడేరులో ఫ్లెక్సీల ఏర్పాటు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
గుడి వద్ద మద్యం షాపు.. అయ్యప్ప స్వాముల ఆగ్రహం
-
మారేడుమిల్లి జలపాతంలో ముగ్గురు గల్లంతు
మారేడుమిల్లి: విహారయాత్ర కోసం ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల నుంచి 14 మంది మెడికోలు అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని జల తరంగిణి జలపాతం వద్దకు రాగా.. విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో స్నానాలు చేస్తుండగా భారీవర్షం కురిసి ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థినుల్ని 6 కిలోమీటర్ల దూరంలో స్థానికులు రక్షించగా.. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న 14 మంది విద్యార్థులు వ్యాన్లో ఆదివారం విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చారు. అక్కడి నుంచి జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా జలపాతం పొంగింది. దీనిని గమనించిన 9 మంది విద్యార్థులు వెంటనే బయటకు వచ్చేశారు. జలపాతం మధ్యలో చిక్కుకుపోయి.. జలపాతం మధ్యలో ఉండిపోయిన సీహెచ్.హరిదీప్, కె.సౌమ్య, బి.అమృత, గాయత్రీ పుష్ప, హరిణిప్రియ కొట్టుకుపోయారు. వీరిలో గాయత్రీపుష్ప, హరిణిప్రియ 6 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ప్రధాన రహదారి కల్వర్టు వద్ద చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా స్థానికులు ఒడ్డుకు చేర్చారు. మిగతా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో మార్కాపురానికి చెందిన సీహెచ్ హరిదీప్, విజయనగరానికి చెందిన కె.సౌమ్య, బి.అమృత ఉన్నట్టు ఎస్ఐ రాము తెలిపారు. -
కోనసీమలో వరద టెన్షన్
-
కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
-
అల్లూరి జిల్లాలో అత్యధిక వర్షపాతం
-
మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!
కాఫీ ఘుమఘుమలకు వహ్..! అని కితాబిస్తు ఒక్క సిప్ చేసేందుకు తహతహలాడుతుంటాం. అలాంటి టేస్టీ కాఫీ మన ప్రధాని మోదీ మనసును కూడా దోచుకుంది. ఆయన ప్రత్యేకంగా ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ గురించి తరుచుగా చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్లోని అరకులోయలో ప్రసిద్ధి గాంచిని కాఫీ రుచికి మోదీ సైతం పిదా అయ్యారు. మన్కీ బాత్ 111వ ఎపిసోడ్లో ఆ కాఫీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. గతేడాది సెప్టెంబర్ 2023లో భారతదేశం నిర్వహించిన జీ20 సదస్సులో కూడా అరకు కాఫీ గురించి హైలెట్ చేస్తూ మాట్లాడారు. అంతేగాదు మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించడం విశేషం. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు. అసలేంటి అరకు కాఫీ ప్రత్యేకతలు అంటే..అరకు కాఫీ అంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో కాఫీ సాగు దాదాపు వంద ఏళ్ల నాటిది. అయితే అది 1947 తర్వాత నెమ్మదిగా క్షీణించింది. మళ్లీ 2000లలో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా లాభాప్రేక్షలేని నంది ఫౌండేషన్ సంస్థ ముందుకు కొచ్చి స్థానిక రైతులను ప్రోత్సహించింది. అందుకు అవసరమైన వనరులను కూడా అందించింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడింది. అలాగే అనేక మంది స్థానికులకు ఉపాధిని కూడా అందించింది. ఒకరకంగా ఈ ప్రాంతం ప్రత్యేక వాతావరణం ద్వారా పండించిన ప్రసిద్ధ కాఫీ గింజలకు పేరుగాంచేందుకు దారితీసింది. అరకులోయలో పగలు వేడిగా, రాత్రుళ్లు చల్లగా ఉండి, నేలలో అధికంగా ఐరన్ ఉండటం తదితర కారణాల వల్ల కాఫీ మొక్కలు నెమ్మదిగా పండటం మొదలయ్యింది. ఆ వాతావరణమే కాఫీ గింజలకు ప్రత్యేకమైన అరోమా రుచిని తెచ్చిపెట్టాయి కూడా. ఆ తర్వతా ఆ అరుకు వ్యాలీ కాఫీకి విశేష ప్రజాధరణ లభించి, అందరి మన్నలను అందుకుంది. అలా 2019లో, అరకు కాఫీకి భౌగోళిక సూచిక (GI) హోదా లభించింది. ప్రస్తుతం అరకు కాఫీకి దేశవ్యాప్తంగా విశేషమైన ఆధరణ ఉంది. దీనికి సంబంధించి ఫ్లాగ్షిప్ బ్రాండ్తో వచ్చిన బ్రూ కాఫీ మరితం ఫేమస్.(చదవండి: తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!) -
అల్లూరి జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాడేరు ఘాట్రోడ్డులో ఓ బొలేరో వాహనం లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ సమీప మలుపులో బుధవారం రాత్రి సమయంలో ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, వీరంతా ఒడిశాకి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో ఒక బాలిక కూడా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరో వాహనంలో 30 మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
మద్దిచెట్టు నుంచి నీటి ధార
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): దట్టమైన అటవీ ప్రాంతంలో మద్ది చెట్టు నుంచి ధారగా నీరు రావడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాపికొండలు నేషనల్ పార్క్లోని ఇందుకూరు రేంజ్ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం డీఎఫ్వో నరేందిరన్ సిబ్బందితో కలిసి శనివారం కింటుకూరు అటవీ ప్రాంతానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు. నల్లమద్ది చెట్టుకు బొడుపులు ఉన్నచోట కత్తితో గాటు పెట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు. దీంతో గాటు పెడుతుండగానే నీరు ధారలా బయటకు వచ్చింది. దీనిపై డీఎఫ్వో మాట్లాడుతూ నల్లమద్ది చెట్టులో నీరు నిల్వ చేసుకునే వ్యవస్ధ ఉందని, అందుకు తగ్గట్టుగా అవసరాలకు నీటిని చెట్టు తనలో దాచుకుందన్నారు. చెట్టు నుంచి సుమారు 20 లీటర్లు నీరు వచ్చినట్లు తెలిపారు. నీటిని రుచి చూసిన ఆయన తాగేందుకు ఉపయోగపడదని తెలిపారు. నల్లమద్ది చెట్టు బెరడు మొసలి చర్మంలా ఉండడంతో దీనిని క్రోకోడైల్ బర్క్ ట్రీ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. శాస్త్రీయ నామం టెర్మినేలియా టొమెంటోసా అని చెప్పారు. ఆయన వెంట రేంజ్ అధికారి దుర్గా కుమార్బాబు పాల్గొన్నారు. -
YSRCP: అల్లూరి జిల్లా అభ్యర్థులు వీళ్లే
అల్లూరి సీతారామ రాజు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
చలిగాలుల విజృంభణ
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): శీతాకాలం ముగుస్తున్న సమయంలో అల్లూరి సీతారాజు జిల్లాలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. చింతపల్లిలో నాలుగు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం 7.6 డిగ్రీలు నమోదవగా, పాడేరు మండలం మినుములూరులో 12 డిగ్రీలు, అరకులోయలో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేకువజామున పొగమంచు కురుస్తున్నప్పటికీ 7గంటలకే సూర్యోదయమవుతోంది. -
మన్యం మిరియాలు అ‘ధర’హో..!
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గిరిజన రైతుల నుంచి 100 మెట్రిక్ టన్నుల మిరియాలను పాడేరు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్లోని వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ విభాగం అధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలం నుంచి 10 టన్నులు కొనుగోలు చేయాలని తెలిపారు. మిరియాల పంటను సాగుచేస్తున్న గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కిలో రూ.500 మద్దతు ధరతో నాణ్యమైన మిరియాలను కొనుగోలు చేస్తామన్నారు. తక్కువ ధరతో దళారీలకు అమ్ముకుని మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిరియాల ఉత్పత్తిలో గిరిజన రైతులు తగిన నాణ్యత పాటించాలని, ఎండిన మిరియాలలో తేమశాతం తక్కువుగా ఉండాలన్నారు. వచ్చేనెల 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు కాఫీ లైజన్ వర్కర్లు గ్రామాల్లో పర్యటించి మిరియాల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మిరియాల నిల్వలకు గాను గిరిజన రైతులకు ఉచితంగా గోనెసంచులను పంపిణీ చేస్తామన్నారు.10వేల ఎకరాల్లో కాఫీ తోటల కన్సాలిడేషన్కు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మిరియాల నూర్పిడికి యంత్రాల వినియోగం స్పైసెస్ బోర్డు విస్తరణ అధికారి కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులు పాదుల నుంచి సేకరించిన మిరియాల నూర్పిడిలో యంత్రపరికరాలను వినియోగించాలన్నారు. కంకుల నుంచి మిరియాలను వేరుచేసేందుకు కాళ్లతో తొక్కడం వల్ల బ్యాక్టిరీయా చేరి నాణ్యత తగ్గే పరిస్థితి ఉందన్నారు. పచ్చిమిరియాలను ఒక నిమిషం వేడినీటిలో ముంచి తీసిన తరువాత ఎండబెడితే గింజ నల్లగా ఉండి మంచి ధర వస్తుందని చెప్పారు. తేమ 10 శాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అశోక్, కేంద్ర కాఫీబోర్డు డీడీ రమేష్,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు, రమేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్నినాదాలతో హోరెత్తిన అరకు లోయ
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): జగన్నినాదాలతో అరకు లోయ నియోజకవర్గం శుక్రవారం హోరెత్తిపోయింది. హుకుంపేట మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. గిరిజనం ప్రభంజనంలా తరలివచ్చారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. పాడేరు–హుకుంపేట రోడ్డులోని బర్మన్గుడ జంక్షన్ నుంచి సభావేదిక వరకు సుమారు వెయ్యి బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుని ఆయన రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన సంక్షేమ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగిందన్నారు. గడప గడపకు సంక్షేమ పథకాలు చంద్రబాబు ప్రభుత్వం అరకులోయ నియోజకవర్గ అభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ విమర్శించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఎంతో అభివృద్ధి సాధ్యమైందని కొనియాడారు. గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. నవరత్న ప«థకాల ద్వారా నియోజకవర్గంలోని 2.41 లక్షల మందికి రూ.2 వేల కోట్ల వరకు లబ్ధి చేకూరిందని తెలిపారు. అలాగే మారుమూల గ్రామాలతో పాటు అన్ని ప్రధాన గ్రామాలకు రోడ్లు, గెడ్డలపై వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలకు మరో రూ.2 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చుపెడుతోందన్నారు. సెల్ టవర్ల నిర్మాణాలు, తాగునీటి పథకాలు, నాడు–నేడుతో పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధికి రూ.వందలాది కోట్లు వ్యయం చేసిందన్నారు. జగన్ పాలనలోనే సామాజిక న్యాయం సీఎం జగన్ పాలనలోనే గిరిజనుల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలలక్ష్మి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కొనియాడారు. పాడేరు, పార్వతీపురంల్లో వైద్య కళాశాలలు, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణాల ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చంద్రబాబు గిరిజనులను చిన్నచూపు చూశారని, రాజ్యాంగ పదవులకు దూరం చేశారని మండిపడ్డారు. గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోయారన్నారు. సామాజిక న్యాయం జగన్ పాలనలోనే సాధ్యమైందన్నారు. గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి తనతో సమానంగా చూశారని కొనియాడారు. తన పాలనలో 3.46 లక్షల ఎకరాల అటవీ భూములను గిరిజనులకు పంపిణీ చేశారన్నారు. ఆదివాసీలకు సామాజిక న్యాయం ఆదివాసీలకు సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర కొనియాడారు. ఇదే గిరిజన జాతికి చెందిన తనకు జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. అరకు నియోజకవర్గాన్ని రూ.ఆరు వేల కోట్లతో ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి చేశారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అరకు నియోజకవర్గంలో గిరిజనుల సాగులో ఉన్న 49 వేల ఎకరాల అటవీ భూములకు పట్టాలిచ్చి ఎంతో మేలు చేశారని తెలిపారు. చంద్రబాబు గిరిజనులను వాడుకుని వదిలేశారని మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు మాదిరిగా గిరిజనులంతా టీడీపీపై బాణాలు ఎక్కుపెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, అరకు లోయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా రమేశ్, ఎస్టీ కమిషన్ సభ్యులు కొర్రా రామలలక్ష్మి, జంపరంగి లిల్లీ, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ పెద్ద మనసు.. ఆపన్నులకు అండగా..
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపన్నులకు మరోసారి అండగా నిలిచారు. ఆయన గురువారం చింతపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు సీఎంను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. వారి పరిస్థితులను తెలుసుకున్న సీఎం.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వెంటనే తగిన సాయం చేసి వారిని ఆదుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్ను ఆదేశించారు. దీంతో ఆయన వెంటనే ముగ్గురు బాధితులకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3 లక్షలను వారి ఖాతాల్లో శుక్రవారం జమ చేశారు. కండరాల వ్యాధితో బాధపడుతున్న చింతపల్లి మండలం గుమ్మడిగొండకు చెందిన అడిగర్ల రమ్యశ్రీ, బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న చింతపల్లి గ్రామానికి చెందిన పంపోతి కొండబాబు, పెరాలసిస్తో బాధపడుతున్న చింతపల్లి మండలం దిబ్బగరువుకు చెందిన మోరి కృష్ణవేణిలు ఈ సందర్భంగా సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశించిన 24 గంటల వ్యవధిలోనే ఆర్థిక సాయం వారి అకౌంట్లలో జమవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్! -
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి..
-
పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్
సాక్షి, అల్లూరి జిల్లా: విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘గిట్టని వాళ్లు జగన్ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే’’ అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్.. గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు. ‘‘పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నా. దిగజారుడు రాతలు రాయొద్దని చెబుతున్నా. పేద పిల్లల చేతిలో ట్యాబ్లు ఉంటే చెడిపోతారంట. పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దా?. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు అంతరించుకుపోతుందట. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట. పేదల పిల్లలకు మంచి చేస్తుంటే కొందరు ఏడుస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. నాకు కొండంత అండ అడవితల్లి బిడ్డలు దేవుడుదయ మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి చేస్తున్నాం. నా గిరిపుత్రుల స్వచ్చమైన మనసులు మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవితల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాల ఇక్కడ నుంచి జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టిన రోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ... మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడి నాకిచ్చిన అదృష్టం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టితల్లులు, పిల్లలు, నా అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, సోదరులు, స్నేహితులు మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ.. మీ అందరి ప్రేమానురాగాలకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. మన పిల్లలే మన భవిష్యత్– మన వెలుగు ఈ రోజు ఇక్కడ నా ఎదుట ఉన్న పిల్లలు, రాష్ట్రంలో ప్రతి ఇంట ఉన్న పిల్లలు.. వీరే మన భవిష్యత్. వీరంతా మన వెలుగులు. వీరంతా మన తర్వాత, మనం వెళ్లిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలిపే మన వారసులు. వీరి భవిష్యత్తు గురించి ఆలోచించి.. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రపంచంలో పోటీపడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని ఆశిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా పడింది. అందులో భాగంగానే వరుసగా రెండో ఏడాది ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులు ట్యాబుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతిమండలాన్ని సందర్శిస్తూ...ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా 10 రోజులపాటు 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమం జరుగుతుంది. ట్యాబుల పంపిణీ దశాబ్దంలోనే గొప్ప మార్పు ఇవాళ మనం ఇచ్చేవి కేవలం ట్యాబులు మాత్రమే కాదు. ప్రతి చెల్లెమ్మకూ ఒక మంచి అన్నగా, ప్రతి పిల్లాడికి,పాపకు ఒక మంచి మేనమామగా మన పిల్లలు మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో, తరతరాల పేదరికం సంకెళ్లు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకొస్తున్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు పంపిణీ కూడా గొప్ప మార్పుగా రాబోయే దశాబ్దకాలంలో నిల్చిపోతుంది. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బడులలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు 4,34,185 మందికి రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ మన పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతున్నాం. డిజిటల్విప్లవంలో భాగంగానే గతేడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.18లక్షల ట్యాబులను పిల్లలకు, చదువులు చెబుతున్న టీచర్లకు పంపిణీ చేసాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ప్రతి ట్యాబులోనూ ఆఫ్లైన్లో సైతం పనిచేసేటట్టుగా అప్లోడ్ చేసి మరి ట్యాబులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి పిల్లాడికి పాఠాలన్నీ పూర్తిగా, సులభంగా అర్ధం అయ్యేటట్టుగా, కష్టాన్ని తగ్గించేటట్టుగా బైజూస్ కంటెంట్ లోడ్ చేసి పిల్లలకు అండగా నిలబడుతున్నాం. ఈ ట్యాబుల విషయంలో నేను పిల్లలకు చెబుతున్నా.. ట్యాబులు రిపేరుకు వస్తే ఎవరూ కంగారుపడకండి. మీ హెడ్ మాష్టారు దగ్గరికి వెళ్లి చెడిపోయిందని రిపేరుకిచ్చినా, లేదా తల్లిదండ్రులతో పాటు గ్రామసచివాలయం దగ్గరకు వెళ్లి ఇచ్చినా రెండు చోట్ల రశీదు ఇస్తారు. వారం రోజుల్లోనే మీ ట్యాబ్ రిపేరు చేసి ఇస్తారు.ఒకవేళ రిపేరు చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతిలో పెడతారు. ఈ ట్యాబుల విషయానికొస్తే... ఇవి సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజిమెంట్ అనే సాప్ట్వేర్ పెడ్డడం జరిగింది. దీనివల్ల పిల్లలు పాఠాలు, లెర్నింగ్కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది టీచర్లకు, తల్లిదండ్రులకు ఈ సాప్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన, భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ పిల్లలకు వాళ్ల చదువుల్లో మంచిచేసే ఒక గొప్ప ఇంధనంగా ఉంటుందని చెబుతున్నాను. రూ.33వేల ఖరీదు చేసే ట్యాబ్, కంటెంట్ ఉచితంగానే ఒక్కో పిల్లాడు చేతిలో పెడుతున్న ఈ ట్యాబ్ మార్కెట్ విలువ రూ.17,500. దీనికి తోడూ బైజూస్ కంటెంట్ను ఇస్తున్నాం. ఎవరైనా శ్రీమంతులు పిల్లలు వెళ్లి బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి, డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.15వేలు కడితే తప్ప డౌన్లోడ్ చేసుకోలేని పరిస్ధితి. అలాంటి ఈ కంటెంటెన్ ఉచితంగా డౌన్లోడ్ చేసి, ఈ ట్యాబులుతో సహా ఇస్తున్నాం. ఇవాళ 8వతరగతి విద్యార్ధి తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబ్, కంటెంట్ విలువతో కలుపుకుంటే రూ.33వేలు విలువ చేస్తుంది. మన పిల్లలు ప్రపంచంలోనే నంబర్వన్ కావాలని.. ఈ పిల్లలందరినీ ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఎందుకు పెడుతున్నామంటే.. నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలవాలన్న తలంపుతో వాళ్ల మేనమామగా ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఒకవైపు ట్యాబుల పంపిణీ చేస్తూనే.. మరోవైపున ప్రతి స్కూళ్లో 6వతరగతి నుంచి పైబడిన ప్రతి తరగతి గదినీ డిజిటలైజ్ చేసే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. నాడు నేడు పూర్తి చేసుకున్న 6వతరగతి నుంచి 12వతరగతి వరకు ఉన్న ప్రతి తరగది గదిలోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్(ఐఎఫ్పి)లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతిగదినీ డిజిటలైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. నాడు– నేడుతో సమూల మార్పులు ఇందులో భాగంగా నాడు నేడు మొదటిదశ పూర్తి చేసుకున్న స్కూళ్లలో 15,715 స్కూళ్లలో 6వతరగతి ఆపై ఉన్న 32,213 క్లాస్రూంలలో ఇప్పటికే ఐఎఫ్పిలు పెట్టి డిజిటలైజ్ చేశాం. అదే విధంగా 1 నుంచి 5వతరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లిషు ల్యాబ్లు తీసుకువచ్చాం. వాటన్నింటిలోనూ స్మార్ట్ టీవీలు ఏర్పాటులో భాగంగా .. దాదాపు 10,038 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ ఐఎఫ్పీలు, క్లాస్రూంల డిజిటౖలñ జేషన్ కోసం మొదటిదఫాలో చేసిన ఖర్చు రూ.427 కోట్లు. నాడు–నేడు రెండో దఫా పనులు ఇవాళ వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడకి రాకముందు అధికారులను అడిగాను. రెండోదఫా నాడు–నేడు పనులు పూర్తి చేసి అక్కడ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించి 6వతరగతి నుంచి ఈ పైచిలుకు తరగతిగదులను డిజిటలైజ్ చేయడానికి ఎంత టైం పడుతుందని అడిగాను. దాదాపు మరో 31,884 తరగతి గదులు 6వతరగతి ఆ పై తరగతిగదులన్నీ డిజిటలైజ్ అయి, పూర్తిగా 62,097 తరగతిగదులన్నీ డిజిటలైజ్ అయ్యే కార్యక్రమం జనవరి 30 నాటికి పూర్తవుతుందని చెప్పారు. సందేహాల నివృత్తికి యాప్లు సైతం ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేయడమే కాకుండా ఎస్.డి కార్డు, ఆండ్రాయిడ్ బాక్సులన్నింటితో పాటు ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నచోట బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉంటుంది. అంటే పిల్లలకు బైజూస్ కంటెంట్తో కూడిన పాఠాలను తరగతిగదిలో నేర్పుతారు. ఇవే పాఠాలను వాళ్లకున్న ట్యాబులలో కూడా ఉంతాయి. దీనివల్ల పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు. మెరుగ్గా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఈ ట్యాబులున్నప్పుడు, ఈ పాఠాలలో పిజిక్స్, మేథ్స్ బయాలజీ, ఇంగ్లిషు సబ్జెక్టులో పిల్లలకు సందేహాలు వస్తే.. వాటిని నివృత్తి చేసుకోవడం ఎలా ? ఎవరు చెప్తారు ? అన్న సందేహం ప్రతి పిల్లాడికి, తల్లిదండ్రులకూ ఉంటుంది. అందుకనే ఈ సారి పిల్లలకిచ్చే ఈ ట్యాబులలో ఒక యాప్ను కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. డౌట్ క్లియరెన్స్ బాట్ అనే యాప్ను డౌన్లోడ్ చేయడం జరిగింది. దీన్ని వాడుకుని పిల్లలు తమ సందేహాలను చెప్పినా, టైప్ చేసినా వాటిని నివృత్తి చేసుకునే సౌలభ్యం ఉండేలా యాప్ను డౌన్లోడ్ చేశాం. ఇంత ధ్యాసపెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? ట్యాబులలో ఏం ఉంది? ఇంకా ఎలా దాన్ని పిల్లలకు ఉపయోగపడేలా మెరుగుపర్చాలి. పిల్లలకు సులభంగా అర్ధమయ్యేలా చేయాలి అని ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ... మీ పిల్లల గురించి ఆలోచనచేసే మీ బిడ్డ ప్రభుత్వం, ఆ పిల్లలకైతే మేనమామ ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఈ సందేహాల నివృత్తి కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకునేలా తీసుకొచ్చే కార్యక్రమమూ జరుగుతుంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో ఇతర విదేశీ భాషలను నేర్చుకునేదానికి వీలుగా డ్యుయోలింగో యాప్ అనే కొత్త యాప్ను చేర్చాం. దానివల్ల పిల్లలు విదేశీభాషను నేర్చుకునే అవకాశం ఉంది. ఈ ట్యాబు పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్గా అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రపంచంలో మన పిల్లలే బెస్ట్ కావాలన్న తపనతో మరో ముఖ్యవిషయం కూడా చెప్పాలి. పిల్లలందరూ ఆంధ్రరాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను పోటీపడుతున్నది.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నా పిల్లలు బెస్ట్గా ఉండాలని, చూస్తున్నాను. దానికోసం ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రాథమిక స్ధాయి.. అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చి టోఫెల్ పరీక్షకకు వాళ్లను సిద్ధం చేసేలా.. అమెరికాకు చెందిన టోఫెల్ నిర్వాహణా సంస్ధ ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్)తో ఒప్పందం కూడా చేసుకున్నాం. ఈ రోజు టోఫెల్ను ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్ కేటాయిస్తూ 3వతరగతి నుంచి ప్రతి క్లాసులోనూ టీచ్ చేస్తూ.... కరిక్యులమ్లో తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా మరో 15–20 సంవత్సరాల తర్వాత పరిస్థితుల వేగంగా మారుతున్నాయి. మారుతున్న పరిస్థితిలకు అనుగుణంగా మనం కూడా వేగంగా అడుగులు వేయాలి. టెక్నాలజీ మారుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా మన బ్రతుల్లోకి వస్తుంది. రానున్న 20 సంవత్సరాలలో మనం చేస్తున్న ఈ ఉద్యోగాలన్నీ పూర్తిగా కనుమరుగైపోతాయని చెప్తున్నారు. ఆ రకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. టెక్నాలజీ కూడా పెరుగుతుంది. మనంకూడా దీనికి అగుణంగా అడుగులు వేయాలి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన పిల్లలనే ప్రిపేర్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి 8వ తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును ప్రవేశపెడుతున్నాం. అందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వర్టువల్ రియాలటీ, అగ్మెంటెడ్ రియాలటీ, ఫైనాన్షియల్ లిటరసీ వంటి అంశాలన్నీ పిల్లలకు పరిచయం చేసేలా... వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్టును తీసుకువస్తున్నాం. సంబంధిత ట్యూటర్ల నియామకానికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటువంటి సబ్జెక్టులను ఎలా బోధించాలి ? ఎటువంటి ట్యూటర్లు కావాలన్న దిశగా ఆడుగులు పడుతున్నాయి. ఐబీ సిలబస్ దిశగా విద్యారంగంలో భవిష్యత్తు ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా ఉంచేందుకు ఐబీ సిలబస్ను రాబోయే రోజుల్లో తీసుకువస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఈ సిలబస్ను తీసుకువస్తున్నాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సులభంగా ఉద్యోగావకాశాలు పొందుతారు. దీనికోసం ఐబీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ.. కరిక్యులమ్లో మార్పులు తీసుకువస్తూ ఐబీ సర్టిఫికేట్ తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వస్తూ సంయుక్త సర్టిఫికెషన్ తీసుకువచ్చేలా మార్పులు. ఇవాళ మన బడులన్నీ ఎలా ఉన్నాయి ? గతంలో మన స్కూళ్లు ఎలా ఉండేవి ? మీ బిడ్డ అధికారంలోకి వచ్చి తర్వాత ఈ 55 నెలల కాలంలో మన స్కూళ్లు ఎలా ఉన్నాయో చూడాలని కోరుతున్నాను. ఇవాళ మన ప్రభుత్వ బడులు, పిల్లలకిచ్చే ట్యాబులు, నాడు నేడుతో బడుల బాగుమీద పెట్టే మనసు, పిల్లలకిచ్చే జగనన్న విద్యాకానుక మీద ఆరాటం కానీ, జగనన్న గోరుముద్ద మీద చూపిస్తున్న ధ్యాస కానీ, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లుల పిల్లలకు తోడుగా ఉండాలని, ఆ పిల్లల కోసం, తల్లుల కోసం ఆలోచన చేస్తూ తీసుకొచ్చిన వైఎస్సార్ అమ్మఒడి పథకం కానివ్వండి.. పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగుమీడియం బడులను మార్చుతూ ఇంగ్లిషు మీడియం తీసుకునిరావడంతో పాటు పిల్లలకు పూర్తిగా అర్ధమయ్యేందుకు ఒక పేజీ ఇంగ్లిషు, మరో పేజీ తెలుగు ఉండేలా బైలింగువల్ టెక్ట్స్బుక్స్ తీసుకువచ్చాం. ప్రయివేటుబడులలో పెద్దవాల్లు, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా రూ.15వేలు ఏడాదికి ఖర్చుచేస్తే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ను ఇవాళ మన పిల్లలకు ఇవ్వడం కానీ.. 6వతరగతి ఆపై తరగతులకు సంబంధించి ప్రభుత్వ బడులలో ప్రతి తరగతిగదిని డిజిటలైజ్ చేస్తూ.. పిల్లలకు సులభంగా పాఠాలు అర్ధమయ్యేలా చేస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంకు మారడంతో పాటు అదొక్కటే సరిపోదని సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతున్న ప్రయాణం వరకు.. మంచి ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో ప్రతి స్కూల్లోనూ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడులతో ప్రైవేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి ప్రైవేటు స్కూళ్లు గవర్నమెంట్ స్కూళ్లు కన్నా మెరుగ్గా ఉంటాయనే నానుడి పోయి.. ఇవాళ ప్రైవేటు స్కూళ్లన్నీకూడా ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి వచ్చిందా ? లేదా ? ప్రభుత్వ బడుల్లో బైలింగువల్ టెక్ట్స్బుక్స్, ప్రతి తరగతి గదికి ఐఎఫ్పిలు ఏర్పాటు, 8వతరగతిలో ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబు అందించడం, నాడు నేడుతో మారుతున్న స్కూళ్లు వంటి కార్యక్రమాలు చేయడంతో ప్రైవేటు బడులు వాటికోసం గవర్నమెంటు బడులతో పోటీపడే పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో జరుగుతుంది. జగన్ దుబారాగా డబ్బులు ఖర్చుచేస్తున్నారని గిట్టని వారు అంటున్నారు. మేం చేసే ప్రతి పైసాకూడా మానవవనరుల అభివృద్ధి కోసం పెడుతున్నాం. రేపటి భవిష్యత్తుమీద ప్రతి పైసాకూడా పెడుతున్నాం. పిల్లలు అందరికీ కూడా ఇవ్వగలిగే ఆస్తి చదువులు మాత్రమే. అది కూడా నాణ్యతతో కూడిన విద్య ఇవ్వగలిగితే.. వాళ్ల జీవితం, భవిష్యత్తు మారుతుంది. అప్పుడే పేదరికం ఆటోమేటిక్గా పక్కకు పోయే పరిస్ధితి వస్తుందని గట్టిగా నమ్మాం కాబట్టే ఇంత వేగంగా అడుగులు పడుతున్నాయి. మన మీద దుర్బిద్ధితో బురద జల్లుతున్నారు ఇలా పేదల పిల్లల చదువులు మీద దేశచరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం పెట్టనంత దృష్టి పెట్టి.. పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల కోసం మార్పులు తీసుకువస్తున్న మన ప్రభుత్వంమీద దుర్భిద్ధితో, దురుద్దేశంతో బురదజల్లుతున్నారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని మీ జగన్ ఆరాటపడుతుంటే... మంచేస్తున్న ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు వీరు ఎంతగా దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు. పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా చెప్తున్నారు. ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు. మన ప్రభుత్వ బడులలో చదువుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ పేద వర్గాలకు చెందిన పిల్లలుమీద తప్పుడు రాతలు రాస్తున్నారు. ఏవేవో వీడియోలు చూస్తున్నారని, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారని, చెడిపోతున్నారని పిల్లలకు ట్యాబులు ఇవ్వొద్దని ప్రతిరోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు. అది పేపరా.. పేపరుకు పట్టిన పీడా జగన్ బర్త్డే బహుమతి.. చెడగొడుతోంది మతి, గాడితప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఈనాడులో రాశారు. ఇది పేపరా.. పేపరుకు పట్టిన పీడా. దీన్ని ఈనాడు అంటారు. ఇలాంటి పేపర్ను చదవొచ్చా. నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్లకు చెప్తున్నాను. ఇంతగా దిగజారి మాటలు మాట్లాడకండి అని చెప్తున్నాను. పేదవర్గాల పిల్లలమీద ఇంతగా విషం కక్కకండి అని చెప్తున్నాను. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపుమంట వద్దండీ అని చెప్తున్నాను. మీ పిల్లలు, మీ మనవళ్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, ల్యాప్ట్యాపులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు. కాని పేదల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, ల్యాప్ట్యాపులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని ప్రశ్నిస్తున్నాను. మీ పిల్లల చేతులలో ఇవన్నీ ఉంటే చెడిపోరు, కాని పేదల పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు, ల్యాప్టాపులు, స్మార్ట్ ఫోన్లు ఉంటే మాత్రం ఉంటే చెడిపోతారు.మీ పిల్లలు, మనవళ్లేమో ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి, కాని పేద పిల్లలు ఇంగ్లిషు మీడియం బడులకు వెళ్లకూడదు, ఇంగ్లిషు చదవకూడదు. పేదపిల్లలు ఇంగ్లిష్ మీడియం మాత్రం చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే తెలుగుభాష అంతరించిపోతుంది అంట?. కాని వాళ్ల పిల్లలు, వాళ్ల మనవళ్లు మాత్రం ఇంగ్లిషులోనే చదవాలి. ఇది ధర్మమేనా? ఆలోచన చేయండి. ఇలాంటి ఆలోచనలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయాలతో మీ బిడ్డ యుద్ధంచేస్తున్నాడు. ఎంత మోసానికైనా వెనకడుగు వేయని దుష్టచతుష్టయం ఈ రోజు మీరంతా ఇవన్నీ చూస్తున్నారు. ఒకవైపు జగన్ ఫొటోకు పది తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా అప్పులు పాలై పోయిందని రాస్తారు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పులు పాలయిపోతుందంటారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి.. ఆరు గ్యారంటీలు అని చెపుతాడు. వాటిని వీళ్లు పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా రాస్తారు. వాళ్లు ఇస్తానన్నవి, ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ అన్నీ కలిపితే.. జగన్ ఇచ్చేవాటికన్నా, వాళ్లు చెప్తున్నవి మూడింతలు ఎక్కువ. ఎంత మోసానికైనా వాళ్లు వెనకడుగు వేయరు. గతంలో 2014–19 వరకూ వాళ్లే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇదే దత్తపుత్రుడు ఉన్నారు. ఆ రోజుల్లో రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నారు, వాళ్లనూ మోసంచేశారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీచేస్తానన్నారు, వాళ్లనీ మోసం చేశారు. ఇంటింటికీ జాబు ఇస్తాను. జాబు రావాలంటే బాబు రావాలన్నారు, జాబు ఇవ్వకపోతే రూ.2వేల నిరుద్యోగభృతి, అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ రూ.1లక్ష. ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 వరకు ఎవ్వరినీ వదలకుండా మోసం చేశారు. అవ్వాతాలనూ, రైతులను, పిల్లలను, అక్క చెల్లెమ్మలను మోసంచేశారు. చివరకు వారి మేనిఫెస్టోను ఎవ్వరికీ కనిపించకుండా.. ఇంటర్ నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమోనని దాన్ని నెట్లో నుంచి కూడా తీసేశారు. ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఎన్నికల ప్రణాళికను భగవద్గీతగానూ, ఖురాన్గానూ, బైబిల్గానూ భావించి మేనిఫెస్టోలో చెప్పిన 99.5శాతం వాగ్దానాలను అమలు చేశాం. ప్రజలంతా ఆలోచన చేయాలి. ఈ రోజు మీ బిడ్డ 55 నెలల పాలనలో మీ బిడ్డ బటన్ నొక్కాతున్నాడు. రూ.2.40లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఆలోచన చేయండి. మీ బిడ్డ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు. గతంలో పరిపాలన చేసిన వాళఅలు ఎందుక్లు మీ బిడ్డలా ఎందుకు చేయలేకపోయారు. అప్పులు గురించి విమర్శిస్తున్నారు... అప్పులు గురించి విమర్శలు చేస్తున్నారు. అప్పుల్లో పెరుగుదల అప్పటికన్నా.. ఈ ప్రభుత్వంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అప్పులు పెరుగుదుల అప్పటి కన్నా ఇప్పుడు తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయాడు. అప్పట్లో గజదొంగల ముఠా రాజ్యం... కారణం అప్పట్లో ఒక గజదొంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, జన్మభూమి కమిటీల నుంచి మొదలుపెడితే రాష్ట్రంలో ఇసుక నుంచి మొదలుకుని మద్యం, స్కిల్ స్కామ్ నుంచి పైబర్ గ్రిడ్ వరకు ఏది ముట్టుకున్నా దోచుకోవడం, దాన్ని పంచుకోవడం, తినుకోవడమే. ఆ రోజు ఎందుకు జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలంతా ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో 31లక్షల ఇళ్లపట్టాలు అందులో 22 ఇళ్ల లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో ఎందుకు జరిగించగలుగుతున్నాడు, చంద్రబాబు హయాంలో జరగలేదో ఆలోచన చేయండి. మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతుంది, గ్రామాలన్నీ మారి ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్తో వాలంటీర్ వ్యవస్ధ ప్రతి ఇంటికి వచ్చి ఒకటో తేదీన సెలవైనా.. ఉదయాన్నే వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ అవ్వా,తాతల చేతుల్లో పెన్షన్ ఎలా పెట్టగలుగుతున్నారో ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా బురద జల్లుతారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు. ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. ఇంకా ఎక్కువ అబద్దాలు చెబుతారు. గుర్తుపెట్టుకొండి. ఎవరైతే మీకు మంచిచేశారో.. వారిని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ల ముందు నిలబడి మీ కళ్లలోకి చూసి చెప్పగలుగుతున్నాను.. మీకు మంచి జరిగితే మాత్రం.. మీ బిడ్డకు మీరు తోడుగా నిలబడాలని కోరుతున్నాను. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. ఒక దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన ఉన్న దేవుడ్ని, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా, అండగా నిలబడండి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే... మళ్లీ మోసం చేసేందుకు వీళ్లంతా బయల్దేరారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటారు. జగన్ ట్యాబ్ మాత్రమే ఇచ్చాడు. మేం ఒక బెంజికారు ఇస్తామంటారు. దయచేసి మోసపోవద్దని ప్రజలను కోరుతున్నాను నా చెల్లెమ్మ కొన్ని పనులు మంజూరు చేయమని అడిగింది నా చెల్లెమ్మ భాగ్యలక్ష్మి ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనుల మంజూరు కోసం అడిగింది. బీటీ రోడ్లు, బ్రిడ్జిలు కోసం అడిగింది. అన్నింటినీ యుద్ధప్రాతిపదినక మంజూరు చేసి, అడుగులు వేగంగా వేయిస్తాను. ట్రైబల్ ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం కలిగించే మార్పులు కనిపిస్తున్నాయి. సాలూరులో మొట్టమొదటసారిగా ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. పార్వతీపురం, నర్సీపట్నం, పాడేరులో మూడు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతుంది. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ గతంలో లేనివి కేవలం ఈ 55 నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతున్నాయని మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్..ఘనత మన సీఎం జగన్ దే
-
ట్యాబ్ లను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
-
విద్యార్థులతో సీఎం జగన్ ముచ్చట్లు
-
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి: సీఎం జగన్
Updates: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం: సీఎం జగన్ ►అడవి తల్లి బిడ్డల మధ్య గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం ►మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి ►మన రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది ►8వ తరగతి పిల్లలకు ట్యాబ్ల పంపిణీ 10 రోజుల పాటు చేస్తాం ►ప్రతీ ఎమ్మెల్యే ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ►మీ మేనమామగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చా ►రూ.620 కోట్లతో 4 లక్షల 34 వేల 185 మంది విద్యార్థులకు ట్యాబ్లు ►55 నెలలుగా ప్రతీ అడుగు విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా పడింది ►పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ►విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం జగన్ ►ట్యాబ్లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి ►తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదు ►ట్యాబ్లలో సమస్య తలెత్తితే ప్రభుత్వమే రిపేర్ చేయిస్తుంది ►రిపేర్ కాకుంటే కొత్త ట్యాబ్ అందజేస్తాం ►ప్రతీ క్లాస్ రూమ్ను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దాం ►మేం అందిస్తున్న ట్యాబ్ మార్కెట్ విలువ రూ.17,500 ►రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ను ఉచితంగా ఇస్తున్నాం ►ట్యాబ్ల పంపిణీతో ప్రతీ విద్యార్థికీ రూ.33వేల లబ్ధి ►నాడు-నేడు రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నాయి: సీఎం జగన్ ►త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తాం ►మన పిల్లలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఎదగాలి ►ప్రతీ తరగతి గదిని డిజిటలైజ్ చేస్తున్నాం ►ట్యాబ్తో పిల్లలకు చదువు సులభతరమవుతుంది ►మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్గా ఉండాలనేదే నా ఆకాంక్ష ►వైఎస్సార్ అమ్మ ఒడి విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ వరం ►పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం ►పిల్లలకు ఇచ్చే ఈ ట్యాబ్ వారికి ట్యూటర్గా ఉంటుంది ►టోఫెల్ పరీక్షకు కూడా మన పిల్లలను తీర్చిదిద్దాలి అమ్మ ఒడితో మాకు ఎంతో మేలు జరిగింది: విద్యార్థిని ►పేద విద్యార్థులకు సీఎం జగన్ అండగా నిలిచారు ►పేదరికం చదువుకు ఆటంకం కాకూడదన్న జగన్ ఆలోచన అద్భుతం ►గిరిజన ప్రజల పక్షపాతి సీఎం జగన్కు రుణపడి ఉంటాం ►స్కూల్స్ రూపురేఖలు మారాయంటే జగనన్నే కారణం విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు: ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ►నాడు-నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారిపోయాయి ►సీఎం జగన్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు ►పేద విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ల పంపిణీ ఓ విప్లవాత్మక నిర్ణయం ►సీఎం జగన్ పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. ►విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన సీఎం జగన్ ►డిజిటల్ లెర్నింగ్ స్టాల్స్ పరిశీలించిన సీఎం ►కాసేపట్లో ప్రభుత్వ విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్న సీఎం ►చింతపల్లి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్న సీఎం ►విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో హెలికాప్టర్లో చింతపల్లి బయలుదేరనున్న సీఎం ►చింతపల్లి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్న సీఎం పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు. దాదాపు రూ.17,500కు పైగా మార్కెట్ విలువ గల ఒక్కో ట్యాబ్.. రూ.15,500 విలువ గల బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి విద్యార్థికీ రూ.33వేల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పుడిచ్చే ట్యాబ్స్తో కలిపి రెండేళ్లలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి రూ.1,305.74 కోట్ల విలువైన 9,52,925 ట్యాబ్లను ప్రభుత్వం అందించింది. వీటిల్లో ఎనిమిదో తరగతితో పాటు, 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేయడంతో పాటు ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసేందుకు వీలుగా ట్యాబ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచి అందిస్తున్నారు. ఇక గత ఏడాది విద్యార్థులు, ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్స్ను పంపిణీ చేశారు. ఉచిత ట్యాబ్లో ఉన్నత కంటెంట్.. ►ప్రతి ట్యాబ్లోను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్’ అప్లికేషన్ ఉంది. ►విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ‘డ్యులింగో’ యాప్ను సైతం ఇన్స్టాల్ చేసి, ఆన్లైన్, ఆఫ్లైన్లో సైతం పనిచేసేలా ఏర్పాటుచేశారు. ►ప్రస్తుతం 4 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్న రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ను ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం అందించనున్నారు. ►తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. ►ఈ ట్యాబ్ల మెమరీ సామర్థ్యం పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణకు రగ్డ్ కేస్, టెంపర్డ్ గ్లాస్ వంటి హంగులు సైతం సమకూర్చారు. ► అవాంఛనీయ సైట్లు, యాప్స్ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్వేర్ రక్షణతో పాటు మూడేళ్ల వారంటీతో వీటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. -
రేపు ‘అల్లూరి’ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: సీఎం జగన్ ఈ నెల 21న (గురువారం) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందజేసి, అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి ట్యాబ్లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
అరకును వణికిస్తున్న చలిగాలులు
అల్లూరి సీతారామరాజు జిల్లాను చలిగాలులు వణికిస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. శుక్రవారం అరకు లోయలోని కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయం వద్ద 10.9 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 11.8, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. – సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా) -
సామాజిక సాధికార యాత్ర: నాలుగో రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, తాడేపల్లి: సామాజిక విప్లవ సారథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రను హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. జగనే రావాలి.. జగనే కావాలి’ అంటూ అన్ని వర్గాలూ ఒక్క గళమై నినదిస్తున్నారు. గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు చేస్తున్న మంచిని వివరించడానికి సీఎం జగన్ నాయకత్వంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు భారీ స్పందన లభిస్తోంది. ఇక, నాలుగో రోజు సామాజిక సాధికార యాత్ర అల్లూరి జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా దెందులూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగనుంది. పాడేరు సమీపంలోని వంతాడపల్లి చెక్ పోస్టు నుంచి సోమవారం ఉదయం 10:30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ►ఉదయం 11 గంటలకు పాడేరు మెడికల్ కాలేజీ పనులను పరిశీలించనున్న పార్టీ నేతలు. ►11:15 గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►11:30 గంటలకు మోదకొండమ్మ తల్లి స్టేడియం నుంచి బైక్ ర్యాలీ. ►మధ్యాహ్నం 12 గంటలకు కిందిబజార్ వద్ద బహిరంగ సభ. నెల్లూరులో ఇలా... ►నెల్లూరు జిల్లా వింజమూరులో చిన్నకేశవ స్వామి టెంపుల్ నుండి బయలుదేరనున్న బస్సుయాత్ర ►జగీరవనంలో 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న పార్టీ నేతలు ►దుత్తలూరు మీదుగా ఉదయగిరి చేరుకోనున్న బస్సుయాత్ర ►హైస్కూల్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3:30 గంటలకి బహిరంగ సభ ఏలూరు జిల్లాలో ఇలా.. ►ఏలూరు జిల్లాలో దెందులూరు మండలం సోమవరప్పాడు నుండి బస్సు యాత్ర మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం ►వీరభద్రాపురం గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళుల్పించనున్న నేతలు ►గోపన్నపాలెం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ -
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొదలైన చలి తీవ్రత
-
గర్భిణీలూ.. నెలలు నిండకుండానే బర్త్ వెయిటింగ్ హాల్కు రండి: మంత్రి రజిని
సాక్షి, అల్లూరి జిల్లా: మన్యానికి జ్వరం వచ్చింది అన్న శీర్షికలతో గతంలో వార్తలు చదివాం.. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది మన్యానికి మంచి ఆరోగ్యం వచ్చింది. సీఎం జగన్ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఇది ఓ చరిత్ర.. అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కిల్లోగూడ గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సందర్శించారు. అక్కడ వచ్చినా రోగులతో మాట్లాడారు. వివిధ దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష అమలు తీరును ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల మంచి మనసు తనకు ఎంతో మనసుకు నచ్చిందన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలని సీఎం జగన్ ఆలోచన మేరకు కృషి చేస్తున్నట్టు వివరించారు. గర్భిణీలు నెలలు నిండే వరకు గిరిజన గ్రామాల్లో ఉండకుండా బర్త్ వెయిటింగ్ హాళ్లకి చేరాలని కోరారు గర్భిణీ తో వచ్చే సహాయకులకు ఉచితంగా వసతి ఆహారం అందిస్తామని చెప్పారు. దీనిద్వారా ప్రసాద్ సమయంలో ఇబ్బందులు పడకుండా దోళీమోతలు లేకుండా ఉంటాయని వివరించారు. ఈ విషయంలో గర్భిణీలకు ఆశా వర్కర్లు సహకరించాలని సూచించారు. ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రెండు రోజుల్లోనే గరిష్టంగా 11 వేల 550 మందికి మెరుగైన వైద్యం కోసం రిఫరల్ ఆసుపత్రులకు సిఫార్సు చేశామన్నారు. సాధారణ జ్వరం లాంటి రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య సదుపాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష నగరాలు గ్రామీణ ప్రాంతాల కంటే మారుమూల గిరిజన గ్రామాలకు చెరువు చేయాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. గతం మాదిరిగా పాడేరు అరకు మన్యం ప్రాంతాల నుంచి వైద్యం కోసం విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే అధునాతన వైద్యం అందే రీతిన చర్యలు చేపట్టారని, వచ్చే ఏడాదికి పాడేరు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. వచ్చే ఏడాది నుంచి 300 పడకల ఆసుపత్రి కూడా అందుబాటులోకి వస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వెల్లడించారు. గతంలో చూస్తే మన్యంలో ఖనిజ సంపదను దోచుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని.. ఇప్పుడు అందుకు భిన్నంగా గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్యం కోసం సీఎం జగన్ ఆలోచనలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతానికి దగ్గరగా ఉన్న గర్భిణీలు కోసం ఆసుపత్రులకు దగ్గరలో బర్త్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గిరిజన ప్రజల కోసం పాడేరు పార్వతిపురం మన్యం జిల్లాల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి వచ్చే గిరిజనులకు మధ్యాహ్నం ఆహారం కూడా ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపించాలని ఆమె కోరారు. తొలిసారిగా గర్భిణీ స్త్రీల వెయిటింగ్ హాల్ కోసం తన క్వార్టర్స్ ను కేటాయించిన అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ను ఆమె అభినందించారు. మరింత మెరుగైన వైద్యం గిరిజన ప్రజలకు అందించడానికి అవసరమైన కొత్త ప్రణాళికలను అమలు చేస్తామని మంత్రి విడుదల రజిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ..పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మీ.. జగన్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర.. పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
చిట్టి బుర్రలు..గట్టి ఆలోచనలు
రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు): చిట్టి బుర్రల్లో ఆధునిక ఆలోచనలు మొలకెత్తాయి. స్పీడ్గా వెళ్తున్న ట్రైన్కు ట్రాక్పై ఏదైనా అడ్డంకి ఏర్పడితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సడన్గా ఆగిపోయే ఇంటెలిజెంట్ ట్రైన్ ఇంజిన్.. చిన్న బటన్ సహాయంతో నడిచేలా దివ్యాంగుల కోసం రూపొందించిన స్మార్ట్ వీల్ చైర్.. మనిషికి అవసరమైన వివిధ పనులు చేసి పెట్టే ఎనిమిది రకాల రోబోలు ఆవిష్కృతమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభకు అద్దంపడుతున్నాయి. పలువురి అభినందనలు అందుకున్నాయి. కాగా, ఇటీవల ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్లో నిర్వహించిన రోబోటిక్ వర్క్షాప్లో మూడు రోజుల పాటు 7, 8, 9, పది తరగతుల విద్యార్థులు శిక్షణ పొందారు. అనంతరం వారు రూపొందించిన వివిధ రకాల రోబోలను శనివారం ప్రదర్శించారు. వీటిలో స్మార్ట్ వీల్ చైర్, స్మార్ట్ షాపింగ్ ట్రాలీ, కెమెరాతో పనిచేసే స్పై రోబో, సెర్వింగ్ (ఆహార పదార్థాలు వడ్డించే) రోబో, అగ్రికల్చర్కు సంబంధించి హార్వెస్టింగ్ రోబో, ఇంటిలిజెంట్ ట్రైన్ ఇంజన్ తదితర ఎనిమిది రకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. -
పాపికొండల విహార యాత్రకు గ్రీన్ సిగ్నల్
దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరిలో పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారి పేరంటపల్లికి వెళ్లనున్నారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే -
బాధితులకు బాసటగా
-
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
Live: వరద బాధిత కుటుంబాలతో సీఎం వైఎస్ జగన్
-
అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం: సీఎం జగన్
LIVE UPDATES: ► రాజమండ్రి చేరుకున్న సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకున్నారు సీఎం జగన్. ఇవాళ రాత్రి ఇక్కడి ఆర్&బి అతిధి గృహంలో బస చేస్తారు. మంగళవారం(రేపు) డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ► ఏలూరు జిల్లా: ముగిసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కుక్కునూరు పర్యటన. రాజమండ్రి బయలుదేరారు. గొమ్ముగూడెంకు వరద ముంపు బాధితులతో సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ ►ఆర్ అండ్ ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు ►ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం ►జనవరి కల్లా ప్యాకేజీ అందే విధంగా చూస్తాం ►అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం ►2013 -14 రేట్ల తో కడతామని గత ప్రభుత్వం చెప్పింది ►ఆ రేట్ల ప్రకారమే డబ్బులు ఇస్తామని కేంద్రం చెప్పింది ►మనసుపెట్టి ఆలోచించాలని కేంద్రానికి సూచించాము.. ►కేంద్రంలో కొంత కదలిక వచ్చి సానుకూల వాతావరణం వచ్చింది ►సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ కోసం పంపారు ►ఈ నెలాఖరుకు కేంద్ర క్యాబినెట్ లోకి వచ్చే అవకాశం ఉంది అది వేస్తే17వేల కోట్లు కేంద్రం ఇచ్చే అవకాశం ఉంది.. ►హామీ ఇచ్చిన రీతిలో 47వేల ఏకరాలకు ఐదు లక్షలు ఇస్తాము ►2025 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసి నీరందిస్తాం ►గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యం ►స్పిల్ వే కట్టకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టారు ►కాఫర్ డ్యాం కట్టకపోవడం వల్లే గ్రామాలు ముంపునకు గురయ్యాయి ►కొత్త డయాఫ్రం వాల్ కట్టడంతో పాటు స్పిల్ వే పనులు పూర్తి చేస్తున్నాం ►గత ప్రభుత్వాల కంటే భిన్నంగా వరద బాధితులను ఆదుకుంటున్నాం ►వరదలతో ఇళ్లు దెబ్బతింటే సాయం అందిస్తున్నాం ►ఏ ఒక్కరూ సాయం అందలేదనకూడదు ►సహాయక చర్యల్లో కలెక్టర్లకు అన్ని రకాల అధికారాలు ఇచ్చాం ►వరద బాధితులకు సాయం అందకుంటే ఫిర్యాదు చేయొచ్చు ►పోలవరం డ్యాంలో మూడు దశల్లో నీళ్లు నింపుతాం ►వచ్చే 6,7 నెలల్లో మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచి జరుగుతుంది ►లిడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది ►లిడార్ సర్వే సైంటిఫిక్గా జరిగింది.. ఎవరికీ అన్యాయం జరగదు ►భూములు కొనుగోలుకు సంబంధించి మరింత న్యాయం చేస్తాం ►వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించిన సీఎం జగన్ ►గొమ్ముగూడెంలో వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ ►వరద బాధితులతో మాట్లాడిన సీఎం జగన్ ►వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ ►ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన ►కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకున్న సీఎం జగన్ ►వరద బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్ .. ►పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు ►ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం ►ఆర్&ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు ►పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధిలేకుండా వ్యవహరించారు ►పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు. ►పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం. ►పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదు. ►బాధితులకు రావాల్సిన ప్యాకేజ్పై మంచి జరుగుతుంది. ►ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుంది. ►ముంపు ప్రాతాల్లో లీడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతోంది. ►మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతాం ►ఒక్కసారిగా నింపితే డ్యామ్ కూలిపోవచ్చు ►సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు ►సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నాం ►వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదు. ►ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారు ►అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు ► బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు. ►సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చాం. ►నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నాం. ►అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉన్నారు. ►వరద బాధితులకు నిత్యవసరాలు అందించాం, ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ10 వేలు ఇవ్వాలని ఆదేశించాం ► ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం చేశాం. ►వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి నాకు చెప్పండి ►ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయం ►డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదు. ►అల్లూరి సీతారామరాజు, ఏలూరులో జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు. ►తాడేపల్లి నుంచి వరద ప్రాంతాల పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. తొలుత ఏఎస్ఆర్ జిల్లా కూనవరం, వీఆర్ పురం మండలాల బాధితులను సీఎం కలవనున్నారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో సోమవారం పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కూనవరం, వీఆర్పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శించనున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌజ్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో సీఎం జగన్ నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. చదవండి: హానీట్రాప్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్ చేతిలోకి? సీఎం జగన్ షెడ్యూల్ సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. కూనవరం బస్టాండ్ సెంటర్లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
సంతోషం వ్యక్తం చేస్తున్న వరద బాధితులు
-
గిరి సీమల్లో విదేశీ విరులు
సాక్షి, అమరావతి: ఆంధ్రా కాశ్మీర్గా పేరొందిన లంబసింగి పరిసర ప్రాంతాల్లో విదేశీ పూల సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిశోధనలు ఫలించడంతో సంప్రదాయ పంటలు సాగు చేసే గిరిజనులకు పూల సాగుపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా గిరి సీమల్లో పూలసాగు విస్తరణకు బాటలు పడ్డాయి. పూల వనాలను అగ్రి టూరిజం స్పాట్స్గా తీర్చిదిద్దడంతో గిరిజనులకు రెట్టింపు ఆదాయం వస్తోంది. పర్యాటకుల ద్వారా అదనపు ఆదాయం పూల వనాలను చూసేందుకు పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న టోకెన్ చార్జీల ద్వారా సీజన్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఈ ప్రాంత రైతులు అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. నాణ్యమైన పూలు ఉత్పత్తి అవుతుండడంతో నర్సీపట్నం, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నుంచి హోల్సేల్ పూల వ్యాపారులు నేరుగా రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. రకాన్ని బట్టి ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తుండగా.. పెట్టుబడులు పోను రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం వస్తోంది. పూల సాగుపై ఆసక్తి విదేశీ పూల రకాలు లంబసింగి పరిసర ప్రాంతాలు ఎంతో అనువైనవి. గిరిజన రైతులు ఇప్పుడిప్పుడే ఈ దిశగా ఆసక్తి చూపిస్తున్నారు. పూల సాగుతో పాటు పర్యాటకం ద్వారా కూడా మంచి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. చట్టవిరుద్ధమైన పంటలను సాగు చేసే వారిని పూల సాగువైపు మళ్లించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. – ఎం.సురేష్కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, చింతపల్లి పరిశోధనా కేంద్రం విదేశీ పూల సాగుపై ఫలించిన పరిశోధనలు సాధారణంగా కొండ ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, వలిశెలు, రాజ్మా చిక్కుళ్లుతో పాటు పసుపు, అల్లం, కాఫీ వంటి పంటలు సాగు చేస్తుంటారు. అకాల, అధిక వర్షాల వల్ల ఆశించిన దిగుబడులు రాక గిరిజనులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో చట్టవిరుద్ధమైన గంజాయి తదితర పంటల్ని సాగు చేస్తూ కొందరు తరచూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మళ్లించే లక్ష్యంతో గిరిసీమల్లో వాణిజ్య పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించింది. చింతపల్లి పరిశోధనా కేంద్రం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే విదేశీ పూల సాగుపై విస్తృత పరిశోధనలు చేసింది. రెండేళ్లుగా గ్లాడియోలన్, లిబియం, చైనా ఆస్టర్, జెర్బరా, తులిప్ వంటి విదేశీ పూల మొక్కల సాగుపై జరిపిన పరిశోధనలు ఫలించాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్ నుంచి తెచ్చిన సీడ్స్తో లంబసింగి ప్రాంతంలో ప్రయోగాత్మక సాగు సత్ఫలితాలనివ్వడంతో ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇక్కడ సాధారణ వర్షపాతం 1,240 మి.మీ. కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 4–12 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 23–38 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. చల్లని వాతావరణం, అధిక తేమ శాతం పూల సాగుకు కూడా అనుకూలం కావడంతో చింతపల్లి ఆర్ఎఆర్ఎస్ ద్వారా హెచ్ఏటీ జోన్లో విదేశీ పూల సాగుపై ఇప్పటివరకు సుమారు 400 మందికి శిక్షణనిచ్చారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వారు సైతం పూలసాగుపై దృష్టి సారించేలా చేస్తున్నారు. 45 రోజుల్లోనే దిగుబడులు విదేశాలతోపాటు హిమాచల్ప్రదేశ్, శ్రీనగర్, బెంగళూరు, పూణే, మదనపల్లి ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి వివిధ రకాల పూల రకాలను రైతులకు అందిస్తున్నారు. రైతు క్షేత్రాల్లో డ్రిప్ ఏర్పాటు చేసి ఎత్తయిన బెడ్లు, మల్చింగ్ విధానంలో సాగు చేయడంతో 45 రోజుల్లోనే దిగుబడులు మొదలవుతున్నాయి. -
గిరి పల్లెలో విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా..
సాక్షి, అల్లూరి: చింతూరు మండలంలోని కలిగుండం అనే గిరిజన పల్లెలో విషాదం చోటు చేసుకుంది. భార్య, భర్తల మధ్య చెలరేగిన మనస్పర్థలు వారి బలన్మరణానికి కారణమయ్యాయి. భర్త కొట్టాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఆమె మృతిని తట్టుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలాఉన్నాయి. భార్యాభర్తలైన కుంజా భద్రయ్య(70), కుంజా సమ్మక్క(65)బంధువుల ఇంట్లో జరిగిన దినకార్యానికి వెళ్లి ఇంటికి తిరిగివచ్చారు. తనకు భోజనం పెట్టమని భార్య సమ్మక్కను భర్త భద్రయ్య కోరగా నువ్వే పెట్టుకుని తినమని భార్య చెప్పింది. దీంతో ఆగ్రహించిన భద్రయ్య భార్యను కర్రతో కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇంట్లోని పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిని తట్టుకోలేని భర్త భద్రయ్య కూడా పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరాడు. దీంతో అతనిని సమీపంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. -
‘పట్టు’కుంటే బంగారమే!.. ఏడాదికి రూ.లక్షల ఆదాయం
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రంపచోడవరం డివిజన్లో 200 ఎకరాల్లో సాగవుతుండగా 150 ఎకరాలు మండలంలోనే సాగవుతోంది. ఎకరా విస్తీర్ణంలో మల్బరీ సాగు ద్వారా ఏడాదికి రూ.4.8 లక్షల విలువైన 600 కిలోల పట్టుగూళ్ల దిగుబడి సాధిస్తున్నారు. జిల్లాలో పట్టుపరిశ్రమపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా చూపింది. పట్టుగూళ్లు కొనేవారు లేక పట్టుగుడ్లు (లేయింగ్స్) లభించక రెండేళ్లలో రంపచోడవరం డివిజన్లో 300 నుంచి 200 ఎకరాలకు సాగు తగ్గిపోయింది. అప్పటిలో పట్టుగూళ్ల ధర రూ.300కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్లో మెరుగైన పరిస్థితులు కోవిడ్ ప్రభావం తగ్గిన తరువాత మార్కెట్లో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. పట్టుగూళ్ల ధర కిలో రూ.600 నుంచి రూ.700 వరకు పెరిగింది. దీంతో మళ్లీ రైతులు సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆదాయం ఆశాజనకంగా ఉన్నందున మండలంలో 20 ఎకరాలు అదనంగా సాగు పెరిగింది వై.రామవరం మండలంలో 4, రంపచోడవరం మండలంలో 7 ఎకరాలు, అడ్డతీగలలో 4 ఎకరాల్లో కొత్తగా పంట వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని పట్టుపరిశ్రమశాఖ అధికారవర్గాలు తెలిపాయి. రంపచోడవరం డివిజన్లో ఉన్న గరప నేలలు మల్బరీ తోటల పెంపకానికి అనువైనవని పట్టుపరిశ్రమ శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యవంతమైన మల్బరీ ఆకులు దిగుబడి వస్తున్నందున నాణ్యమైన పట్టు లభిస్తుందని వారు చెబుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే పట్టుగూళ్లకు మార్కెట్లో మంచి ధర పలుకుతోందని చెప్పారు. ఇక్కడి పట్టు గూళ్లను హనుమాన్ జంక్షన్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఉత్తమ రైతుకు పురస్కారం మండలంలోని కిండ్రకాలనీకి చెందిన పామి చినసత్యవతి పట్టుపరిశ్రమలో మంచి ఫలితాలు సాధిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ విస్తీర్ణం సాగు చేపట్టిన ఈమె రికార్డు స్థాయిలో ఆదాయం పొందారు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేపట్టి రూజ4.25 లక్షల ఆదాయం పొందారు. ఈమెను ఇటీవల ఏలూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సిల్క్ బోర్డు అధికారులు సత్కరించారు. చదవండి: అల్లుడు బియ్యం అదుర్స్! వాణిజ్య పంటల కన్నా లాభం రైతులు వాణిజ్య పంటల కన్నా మల్బరీ సాగు చేపట్టడం మంచిది. కోవిడ్లాంటి విపత్కర పరిస్థితుల వల్ల అప్పటిలో పట్టుగూళ్ల ధర పతనమైంది. అలాంటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎదురుకాదు. అప్పటిలో కిలో రరూ.600 నుంచి రూ.300కు పోయింది. ఇప్పుడు ధర చాలా బాగుంది. పట్టుపరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, వ్యవసాయ సూచనలు అందించి ప్రోత్సహిస్తున్నాం. వచ్చే జూన్ నాటికి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. –రంగారావు, అసిస్టెంట్ సెరికల్చర్ అధికారి, రంపచోడవరం వివరాలకు: రంగారావు, అసిస్టెంట్ సెరికల్చర్ అధికారి, రంపచోడవరం 9652714914 -
చత్తీస్గఢ్లో మావోయిస్టు దళ సభ్యుడు అరెస్ట్
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యుడిని ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్చేశారు. ఈ వివరాలను ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా కుంట అడిషనల్ ఎస్పీ గౌరవ్మండల్ శుక్రవారం కుంటలో మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్గఢ్కు సరిహద్దులో ఉన్న మన రాష్ట్రంలోని చింతూరు మండలం బుర్కనకోటలో బుధవారం రాత్రి సోయం సుబ్బయ్య(35) అనే వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు. ఈ విషయం తెలిసి ఛత్తీస్గఢ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం కుంట పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. సున్నంపాడు గ్రామం వద్ద అనుమానాస్పదంగా తారసపడిన గోంపాడు గ్రామానికి చెందిన సోయం సంతోష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారణ చేయగా, తాను మావోయిస్టు దళ సభ్యుడినని, కుంట ఎల్వోఎస్ కమాండర్ హితేష్ హుంగా ఆధ్వర్యంలో 10 మందిమి బుర్కనకోటకు చెందిన సోయం సుబ్బయ్యను హతమార్చినట్లు అంగీకరించాడని అడిషనల్ ఎస్పీ తెలిపారు. సంతోష్ను శుక్రవారం చింతూరు పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. -
Araku MP: మొదట రైతు బిడ్డ.. తరువాతే ఎంపీ!
సాక్షి, కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.. రైతు కుటుంబానికి చెందిన ఆమె జీవనశైలి చాలా సాధారణంగా ఉంటుంది. ఎంపీ కాకముందు కూడా ఆమె తనకు ఇష్టమైన వ్యవసాయ పనుల్లో పాల్గొనేవారు. ఇప్పుడు కూడా ఆమె తీరిక దొరికినప్పుడల్లా వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఆమె తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే దేముడుకి వ్యవసాయ పనుల్లో సాయపడేవారు. వరి పంట చేతికందొచ్చిన వేళ ఆమె భర్త శివప్రసాద్తో కలిసి శుక్రవారం పొలం పనుల్లో పాల్గొన్నారు. నూర్చిన ధాన్యాన్ని వారే నేరుగా బస్తాల్లోకి వేశారు. ఎంపీ మాట్లాడుతూ చిన్నతనం నుంచి వ్యవసాయం అంటే ఇష్టమన్నారు. ఆమెతోపాటు వ్యవసాయ పనుల్లో ఎంపీ తల్లి చెల్లయమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చదవండి: (విధుల్లో ఉన్నప్పుడు రూ.1000 చేతిలో ఉంచుకోవచ్చు) -
క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు.. పేదరికం అడ్డొచ్చింది.. అయితేనేం..
ఎంతో ఇష్టమైన క్రికెట్లో రాణించాలని కలలు కన్నాడు. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాలని, దేశానికి పేరు తేవాలని పదేపదే పరితపించాడు. అయితే టాలెంట్ ఉన్నా పేదరికం అడ్డొచ్చింది. ఆటపై ఉన్న మక్కువ పేదరికాన్ని జయించేలా చేసింది. తాను ఆడలేని క్రికెట్ను పదిమందితో ఆడించాలని భావించాడు. అభినవ ద్రోణాచార్యలా మారాడు. ఎందరికో అంతర్జాతీయస్థాయిలో తర్ఫీదునిస్తూ తన కలలను సాకారం చేసుకుంటున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. సాక్షి, అల్లూరి సీతారామరాజు(చింతూరు): క్రికెట్లో ఎంతోమందికి తర్ఫీదునిస్తూ వారి ఉన్నతికి బాటలు వేస్తున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. పేదరికం కారణంగా మధ్యలోనే ఆటకు స్వస్తి పలికిన సుబ్బు తన కలల సాకారానికి అడ్డొచ్చిన పేదరికాన్ని అసహ్యించుకోలేదు. తాను సాధించలేనిది తన శిక్షణతో పలువురిని ఆటలో తీర్చిదిద్దేందుకు నడుం బిగించాడు. ఖర్చుతో కూడుకున్నదైనా క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసి పలువురు చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాడు. వారు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా చేస్తున్నాడు. స్థానికంగానే చదువు.. సుబ్బు తండ్రి సత్యనారాయణ వడ్రంగి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సబ్బు చింతూరులో ఇంటర్ వరకు చదివాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్పై మక్కువ పెంచుకున్న అతను స్థానికంగా జరిగే టోర్నమెంట్లలో ఆడుతూ మంచి నైపుణ్యం సాధించాడు. అదే సమయంలో అకాడమీలో చేరి క్రికెట్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశించాడు. అతనికి పేదరికం అడ్డురావడంతో ఆశయానికి బ్రేక్పడింది. అనంతరం భద్రాచలంలో డిగ్రీలో చేరిన సుబ్బు 2010 నుంచి 2014 వరకు ఐదేళ్లపాటు చిన్నారులకు క్రికెట్లో కోచింగ్ ఇచ్చాడు. 2015 నుంచి 2016 వరకు హైదరాబాద్లోని సెయింట్జోన్స్ క్రికెట్ అకాడమీలో కోచ్గా పనిచేశాడు. 2016లో హైదరాబాద్లో ఎరీనా ఎలైట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి 2020 వరకు ఎందరో చిన్నారులకు క్రికెట్ ఓనమాలు నేర్పాడు. అనంతరం 2020లో తిరిగివచ్చిన ఆయన శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమి పేరుతో సంస్థను నెలకొల్పాడు. ప్రస్తుతం అదే పేరుతో 30 మంది చిన్నారులకు కోచింగ్ ఇస్తున్నాడు. రాణించిన త్రిష భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష 2010 నుంచి 2014 వరకు భద్రాచలంలో సుబ్బు కోచింగ్లో క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంది. దీంతో త్రిష హైదరాబాద్ జట్టుతో పాటు ఇండియా అండర్–16, అండర్–19 జట్లకు ఎంపికైంది. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు ఎంపికై మరిన్ని మెళకువలు నేర్చుకుంది. ఇటీవల అండర్–19 మహిళా జట్టు తరఫున శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ సిరీస్లో రాణించడం ద్వారా అండర్–19 వరల్డ్కప్లో పాల్గొనే భారత్ మహిళా జట్టుకు ఎంపికైంది. ఇదే బాటలో మరెందరో చిన్నారులు సుబ్బు కోచింగ్లో రాటుదేలుతున్నారు. ఉన్నత అవకాశాల కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. భారత్ జట్టులో ఆడాలనుకున్నా చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా ఇండియా జట్టు తరఫున ఆడాలనుకున్నా. అనివార్య కారణాలతో ఆటను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎంతో ఇష్టమైన ఆటను వదల్లేక కోచ్గా బాధ్యతలు చేపట్టి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాను. నా కోచింగ్లో రాటుదేలిన త్రిష ఇండియా జట్టుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. నా కళ ఇలా సాకారం చేసుకుంటున్నా. –పాసర్లపూడి సుబ్రహ్మణ్యం, క్రికెట్ కోచ్, చింతూరు -
కొత్త పెళ్లి కొడుకు షాకింగ్ ట్విస్ట్.. బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి..
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): వివాహ సందడి ఇంకా ముగియలేదు. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఇంకా వారి ఇళ్లకు చేరుకోలేదు. అంతలోనే ఆ ఇంట పెనువిషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో గాని వివాహం జరిగి మూడు రోజులు గడవకుండానే పెళ్లి కొడుకు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన రాజవొమ్మంగి మండలం బోర్నగూడెంలో సోమవారం జరిగింది. జడ్డంగి ఎస్ఐ షరీఫ్ అందజేసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలెం నాగభూషణం (30) అదే గ్రామంలో ఇంటికి కొంత దూరంలో ఏటిగట్టుపై ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. గ్రామస్తులు కొంత మంది చూసి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. ఈనెల 17న మండలంలోని సింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పెద్దల నిశ్చయం ప్రకారం ఓ ఆలయంలో నాగభూషణం వివాహం చేసుకున్నాడు. సోమవారం బహిర్భూమికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి ఎదురుగా ఉన్న కాలువవైపు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు పెళ్లి కుమారుడు పెద్ద తండ్రి దాసరి ఏసుబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమారా్టనికి అడ్డతీగల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని స్థానిక సీఐ రవికుమార్ సందర్శించి, ఆరా తీశారు. వీఆర్వో నాగేశ్వరరావు తదితరుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. -
కాశీపట్నం వంగకు..భలే డిమాండ్
కాశీపట్నం వంకాయ అంటేనే ఇష్టపడని వారుండరు. భోజన ప్రియులు చెవికోసుకుంటారు. రుచికరంగా ఉండడంతో మన్యంతో పాటుగా మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్. కాశీపట్నం పరిసర గ్రామాల్లో పండిస్తున్న వంగను ఉత్తరాంధ్ర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో కాశీపట్నంలో బుధవారం జరిగే వారపు సంత కళకళలాడుతోంది. కాశీపట్నం పంచాయతీ మండపరి గ్రామానికి చెందిన ఈమె పేరు బుచ్చమ్మ. ఎకరా భూమిలో సాగు చేపట్టి మంచి దిగుబడి సాధించింది. ప్రస్తుతం బుట్ట వంకాయలు రూ.500 నుంచి రూ.600 ధరకు విక్రయిస్తోంది. ఎకరాకు రూ.10 వేల వరకు ఆదాయం పొందుతోంది. ఈమె మాదిరిగానే కాశీపట్నం పరిసర ప్రాంతాలైన చిలకలగెడ్డ, గుమ్మకోం, ఎన్ఆర్పురం, భీంపోల్, గురుగుబిల్లి గ్రామాలకు చెందిన రైతులు కాశీపట్నం వంగను సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. అనంతగిరి: కాశీపట్నం వంగకు అంతాఇంతా డిమాండ్కాదు. ఈ సాగు చేపట్టిన రైతులు నష్టపోయిన సందర్భాలు లేవంటే అతిశయోక్తికాదు. ప్రతీ బుధవారం కాశీపట్నంలో జరిగే వారపు సంతకు కాశీపట్నంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు వంగను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం సీజన్ కావడంతో కాశీపట్నం వంగతో వారపు సంత కళకళలాడుతోంది. ఎకరాకు రూ.15 వేల వరకు ఆదాయం అరకు–విశాఖ ప్రధాన రహదారిని అనుకుని చిరువ్యాపారులు రోడ్డుకు ఇరువైపులా కాశీపట్నం వంకాయలను విక్రయిస్తుంటారు. రోడ్డును ఆనుకొని వారపు సంత ఉన్నందున వినియోగదారులు, పర్యాటకులకు అనువు ఉంటుంది. అందువల్ల పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు కాపు ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో నెలలో టన్ను మేర సంతలో విక్రయాలు జరుగుతాయి. పెట్టుబడి పోను ఎకరాకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. సేంద్రియ విధానంలో సాగు ఖరీఫ్ సీజన్లో సేంద్రియ విధానంలో వంగను పండిస్తున్నారు. ఇసుకతో కూడిన ఎర్ర నేలలో బాగా దిగుబడి వస్తుంది. సాధారణ మొక్క కన్నా ఇక్కడ సాగు చేసే వంగ మొక్కలు గుబురుగా పెరుగుతాయి. ఒక్కో వంకాయ సైజు సుమారు 200 గ్రాముల పైబడే ఉంటుంది. సాధారణ వంగ సాగుకు నీరు అధికంగా ఉండాలి. ఇక్కడ సాగుచేసే వంగకు అధిక నీరు అవసరం లేదు. పంట కాలం మూడు నెలల ఉంటుంది.. గిరిజనులు సొంతగానే నార తీసి పొలంలోని వేస్తారు. 45 రోజులు గడిచిన తరువాత కాపు ప్రారంభమవుతుంది. ఇదీ ప్రత్యేకత కాశీపట్నం పరిసర ప్రాంతాల్లో పండించే వంగ రకానికి ముళ్ల ఉంటాయి. అంతేకాకుండా ముక్క గట్టిగా ఉంటుంది. కూర తయారు చేసిన తరువాత కూడా జావకాకుండా ముక్క మాదిరిగానే ఉండటం దీని ప్రత్యేకత అని రైతులు తెలిపారు. దేశవాళీ రకంగా వారు చెబుతున్నారు. పూర్వీకుల నుంచి ఇదే రకాన్ని సాగు చేస్తున్నామని వారు వివరించారు. సేంద్రియ విధానంలో సాగు వల్ల పోటపడి కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. వంగను పండించే గ్రామాలు : కాశీపట్నం, ఎన్ఆర్ పురం, భీంపోల్, గుమ్మకోట, చిలకలగెడ్డ, గరుగుబిల్లి పంచాయతీల్లో సారవానిపాలెం, సీతంపేట, నందకోట, మండపర్తి, పల్లంవలస, దాసరితోట, జీలుగులపాడు, బిల్లకోట, గుజ్జెలి, గొట్లెపాడు, తదితర గ్రామాల్లో గిరిజనులు వంగ సాగు చేస్తారు. ఆయా ప్రాంతాల్లో భూములు ఈ పంటకు అనుకూలంగా ఉంటూ, దిగుబడి బాగ వస్తుందని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. డిమాండ్ పెరిగింది గతంతో పోలిస్తే కాశీపట్నం వంకాయకు డిమాండ్ పెరిగింది. మా గ్రామంలో పెద్ద ఎత్తున వంగ సాగు చేస్తున్నాం. గత నాలుగు వారాల నుంచి సంతలో మంచి ధర లభించింది.ఈ వారం ధర బాగానే ఉంది. పండించినందుకు ప్రతిఫలం దక్కింది. – రాము, గిరిజన రైతు, కాశీపట్నం వంగ సాగు వివరాలు గ్రామం ఎకరాలు కాశీపట్నం 60 చిలకలగెడ్డ 20 గుమ్మకోట 30 ఎన్ఆర్పురం 10 భీంపోల్ 30 గరుగుబిల్లి 10 -
అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతి..
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు కొత్త టూరిస్టు స్పాట్లు వెలుగు చూస్తున్నాయి. అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతిని పంచుతున్నాయి. పాల సంద్రాన్ని తలిపించే మంచు మేఘాలతో పాటు ఇప్పుడు హొయలొలికే కొత్త జలపాతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అంతెత్తునుంచి ఎగసిపడే జలసవ్వడులు సుమధుర సంగీత ఝరిలో జలకాలాడిస్తున్నాయి. వాటిని సందర్శించేందుకు పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు భారీగా తరలిస్తున్న సందర్శకులు అయిష్టంగానే తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. గూడెంకొత్తవీధి/అరకులోయ రూరల్: జిల్లాలో కొత్తగా వెలుగులోకి వస్తున్న టూరిస్టు స్పాట్లు సైతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి అన్నట్టు ఉన్న కొత్త ప్రాంతాలను టూరిస్టులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. అనంతగిరి, లంబసింగి, తాజంగి, చెరువులవెనం, పాడేరులోని వంజంగి మేఘాల కొండలే కాదు. అంతకు మించిన ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు అరకులోయ, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో చాలా ఉన్నాయి. సప్పర్ల రెయిన్ గేజ్ గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్పర్ల రెయిన్గేజ్ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ 24 గంటలూ అత్యంత శీతల వాతావరణంతోపాటు మంచు మేఘాలు చాలా కిందనుంచి సందర్శకులను తాకుతూ వెళుతుంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దారకొండ దారాలమ్మ ఆలయంతోపాటు సీలేరు వెళ్లే పర్యాటకులంతా తప్పనిసరిగా ఇక్కడ రెయిన్గేజ్ వద్దకు వెళ్లి కాసేపు ఉండి ఇక్కడ అందాలను ఆస్వాదిస్తారు. గతంలో అప్పటి ఉమ్మడి విశాఖ కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత సీజనులో దూరప్రాంతాలనుంచి ఇక్కడకు వస్తున్న పర్యాటకులసంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. రణజిల్లేడలో.. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో మరో అద్భుతమైన టూరిజం స్పాట్ చూపరులకు కనువిందు చేస్తోంది. పద్మాపురం పంచాయతీ రణజిల్లేడ జలపాతం ఇప్పటికే ప్రాచుర్యం పొందగా, దాని సమీపంలో అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను పరవశింప చేస్తున్నాయి. ఇక్కడి మంచు సోయగాలు, సూర్యోదయ అందాలు ఆకర్షిస్తున్నాయి. మాడగడలో వ్యూ పాయింట్ కొద్ది రోజుల నుంచి పర్యాటకులతో సందడిగా మారిన మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ సోమవారం పర్యాటకులతో కిటకిటలడింది. వివిధ ప్రాంతల నుంచి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు, తెల్లవారుజామునలో చల్లని వాతవరణంలో మంచు అందాలను వీక్షించి ఫొటోలు తీసుకుంటూ గడిపారు. మూడు కొత్త జలపాతాలు గూడెంకొత్తవీధికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లికి సమీపంలో దోనుగుమ్మల జలపాతం కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడికి వెళ్లేందుకు కొద్దిదూరం సీసీ రోడ్డు నిర్మిస్తే చాలు ఈప్రాంతానికి పర్యాటకంగా ఆదరణ లభించే అవకాశం ఉంది. దోనుగుమ్మల జలపాతానికి రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు తెలిపారు. జలపాతాలకు వెళ్లేందుకు రహదారి నిర్మాణానికి రూ.19లక్షలు మంజూరు చేసినట్టు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యరూపం దాల్చితే త్వరలోనే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సంపంగిగొంది జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అనంతగిరి మండలం చిట్టంపాడు జలపాతం ఇటీవల వెలుగుచూసింది. అక్కడికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. -
Gudisa Grassland: ఆ 3 జాతులు.. అత్యంత అరుదు!..
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యంత అరుదైన సీతాకోక చిలుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా గుడిస గ్రాస్ ల్యాండ్లో కనువిందు చేస్తున్నాయి. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్, పర్యావరణవేత్త పొలిమాటి జిమ్మీకార్టర్ గుడిస ఘాట్ రోడ్, గ్రాస్ ల్యాండ్లో 70 జాతుల సీతాకోక చిలుకల్ని రికార్డు చేశారు. వాటిలో అత్యంత అరుదైన మూడు సీతాకోక చిలుక జాతులు ఉండటం విశేషం. బ్రాండెడ్ ఆరెంజ్ ఆలెట్(బురారా ఒడిపొడియా)ను ఇటీవలే ఆయన రికార్డు చేశారు. హెస్పెరిడే కుటుంబానికి చెందిన ఈ సీతాకోక చిలుకలు ఇప్పటివరకు హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మినహా ఎక్కడా కనిపించలేదు. తొలిసారి దక్షిణాదిలోని గుడిసలో దర్శనమిచ్చాయి. శ్రీలంక, బర్మా, మలేషియా, థాయ్లాండ్, వియత్నాం దేశాల్లో ఆ జాతి సీతాకోక చిలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఉదయించే సమయంలోనూ, చీకటిపడే సమయంలోనూ చురుగ్గా ఉంటాయి. పగలు చాలా అరుదుగా కనిపిస్తాయి. హిస్టేజ్ కాంబ్రిటమ్ జాతుల మొక్కలపై జీవించే ఈ సీతాకోక చిలుక గుడిసలో లాంటనా మొక్కపై కనిపించింది. పశి్చమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే పియరిడే కుటుంబం, ఏపియాన్ ఇంద్రా జాతికి చెందిన ప్లెయిన్ పఫిన్ను గుడిసలో మొదటిసారి గుర్తించారు. హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే నింఫాలిడ్ కుటుంబానికి చెందిన ఎల్లో పాషా(హెరోనా మరాధస్) ఇటీవల గుడిసలో రికార్డయింది. గతేడాది దీన్ని పాడేరు అడవుల్లో తిరుపతి ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్ రాజశేఖర్ బండి, ఈస్ట్కోస్ట్ కన్సర్వేషన్ టీమ్ వ్యవస్థాపకుడు శ్రీచక్ర ప్రణవ్ గుర్తించారు. పర్యావరణ సమతుల్యం.. అత్యంత అరుదైన సీతాకోక చిలుకలు అక్కడ కనిపిస్తుండడాన్ని బట్టి గుడిస గ్రాస్ల్యాండ్ అత్యంత ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక పర్వత ప్రాంత(షోలా) గ్రాస్ల్యాండ్ గుడిస. తూర్పు కనుముల్లో అత్యంత విశిష్టత కలిగిన మూగజీవాలు, అరుదైన మొక్కలు, పక్షులు, సీతాకోక చిలుకలకు ఇది ఆవాసంగా ఉంది. పర్యావరణ సమతుల్యంతో గొప్ప జీవవైవిధ్యం ఇక్కడ నెలకొందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. దట్టమైన అడవి నుంచి ఈ కొండలపైకి వెళ్లే ఘాట్ రోడ్పై ప్రయాణం సరికొత్త అనుభూతినిస్తుంది. కొండలపైకి వెళ్లగానే సరికొత్త లోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. చుట్టూ ఎత్తయిన కొండలు, ఆ కొండల్లోంచి ఉదయించే సూర్యుడిని చూడటం గుడిస గ్రాస్ ల్యాండ్లో మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు శీతాకాలం గుడిస అందాలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. కానీ పర్యాటకులు పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలతో కాలుష్యం పెరిగిపోతోందని, గుడిస వైవిధ్యాన్ని పరిరక్షించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. చదవండి: ఇక రైతులే డ్రోన్ పైలట్లు -
Natural Farming: ఏపీ స్ఫూర్తితో మేఘాలయలో ప్రకృతి సాగు
సాక్షి, అమరావతి: ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ప్రకృతిసాగు వైపు అడుగులేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇటీవలే మేఘాలయ రాష్ట్ర అధికారులు, గ్రామీణ జీవనోపాధి సంస్థ ప్రతినిధుల బృందం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి గిరిజనులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసింది. మేఘాలయలో ప్రకృతి వ్యవసాయ పరివర్తన కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించే క్రమంలో మేఘాలయ స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ సొసైటీతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుసాధికార సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులకు చెందిన నిట్టపుట్టు పరస్పర సహాయ సహకార సంఘం మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు మేఘాలయలో ప్రకృతిసాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక సహాయం అందించనుంది. మేఘాలయలో ఘరో, ఖాశీ హిల్స్లో ఎంపిక చేసిన ఐదు బ్లాకుల్లో 20గ్రామాల రైతులను ప్రకృతి వ్యవసాయ రైతులుగా తీర్చిదిద్దడంతోపాటు బలమైన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ) వ్యవస్థ రూపకల్పనకు చేయూతనిస్తుంది. ఇందుకోసం 10 మంది సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల బృందం మేఘాలయాకు వెళ్లింది. ఈ బృందం అక్కడి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, ప్రాజెక్టు బృందంతో కలిసి పనిచేస్తుంది. ఎంపికచేసిన బ్లాకుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రకృతిసాగు చేపట్టడం ద్వారా వాటిని రిసోర్స్ బ్లాకులుగా తీర్చిదిద్దనున్నారు. ఇంగ్లిష్ స్థానిక భాషల్లో ప్రకృతిసాగు విధానాలు, పాటించాల్సిన పద్ధతులపై మెటీరియల్ తయారుచేసి ఇస్తారు. సిబ్బందికి శిక్షణతోపాటు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రస్థాయిలో కో ఆర్డినేట్ చేసేందుకు స్టేట్ యాంకర్ను నియమిస్తారు. సీజన్ల వారీగా రెండు రాష్ట్రాల కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రకృతి వ్యవసాయ అనుభవాలు, ఉత్తమ అభ్యాసాలను పరస్పరం పంచుకోవడానికి కృషిచేస్తారు. (క్లిక్ చేయండి: సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం) -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద లారీ- బొలెరో వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి. ఈ ఘటనలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతులను ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగే సమయంలో లారీ అతివేగంతో బొలెరోపైకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. -
ఫజుల్లాబాద్కు విదేశీ పక్షులు.. ప్రాణంగా చూసుకుంటాం..
రంపచోడవరం: విదేశీ పక్షుల రాకతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామం సందడిగా మారింది. సుమారు వెయ్యికి పైగా సైబీరియా పక్షులు గ్రామానికి తరలివచ్చాయి. గ్రామంలోని చెట్లను ఆవాసంగా మార్చుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగమనంతో ఇవి ఏటా ఇక్కడికి చేరుకుంటాయి. మధ్య ఆసియాలోని సైబీరియా కన్నా ఈ ప్రాంతంలో వేడి వాతావరణం ఉండటం వీటి సంతానోత్పత్తికి అనుకూలం. అందువల్ల ఏటా జూలై, ఆగస్టులో వచ్చి కార్తీక మాసం చివరి వరకు ఇక్కడే ఉంటాయి. సంతానోత్పత్తి అనంతరం పిల్లలతో ఇక్కడి నుంచి వెళ్లిపోతాయని గ్రామస్తులు తెలిపారు. ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చే విదేశీ పక్షులు ఇక్కడ సుమారు ఐదు నెలలపాటు ఉంటాయి. వీటిని అతిథులు మాదిరిగా గ్రామస్తులు చూసుకుంటారు. తమ తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో గ్రామంలోని పక్షులకు ఎవరైనా హాని తలపెడితే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏటా గ్రామానికి వస్తుండటంతో వాటికి ఎటువంటి హాని జరగకుండా ప్రాణంగా చూసుకుంటున్నారు. ఐదు నెలలపాటు గ్రామంలో చింతచెట్లపైనే ఉంటున్నాయి. గతంలో ఏటా రెండు వేలకు పైగా పక్షులు వచ్చేవి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు వెయ్యికి తగ్గిపోయిందని గ్రామస్తులు తెలిపారు. జూలై నెలలో వచ్చి చెట్లపై గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలను చేసి నవంబరు నెలాఖరులోపు వెళ్లిపోతాయి. ఫజుల్లాబాద్ గ్రామానికి చుట్టుపక్కల పంటపొలాలు, చెరువులు ఉన్నందున ఆహారం లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కోతుల బెడద ఎక్కువైంది. పక్షలు గూళ్లను పాడు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రాణంగా చూసుకుంటున్నాం గ్రామంలో ఉండే కొంగలకు ఎవరు హాని తలపెట్టారు. మొదట్లో వాటిని పట్టుకునేందుకు వేటగాళ్లు ప్రయత్నించారు. గ్రామస్తులంతా అడ్డుకున్నారు. అప్పటినుంచి ఎవరూ హాని తలపెట్టరు. వాటిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాం. ఈ పక్షులను తిలకించేందుకు పర్యాటకులు వస్తుంటారు. – ధర్మరాజు, ఫజుల్లాబాద్, దేవీపట్నం మండలం -
అల్లూరి జిల్లా ఆడపిల్లల ఖిల్లా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆడ పిల్లలే డామినేట్ చేస్తున్నారు. ఈ జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు జననాలను పరిశీలిస్తే మగ పిల్లలకన్నా ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 1001 మంది ఆడపిల్లలున్నారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) పని తీరు సూచికల పురోగతి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా తరువాత పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య మెరుగ్గా ఉంది. పల్నాడు జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 993 మంది ఆడపిల్లలున్నారు. పశ్చిమగోదావరిలో వెయ్యి మంది మగ పిల్లలకు 991 మంది ఆడ పిల్లలున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు రాష్ట్రం లో 2,55,582 జననాలు సంభవిస్తే అందులో 1,31,954 మగ పిల్లలు కాగా 1,23,628 ఆడ పిల్లలుగా నివేదిక తెలిపింది. రాష్ట్రం మొత్తం సగటు చూస్తే ఆగస్టు వరకు వెయ్యి మంది మగ పిల్లలకు 937 మంది ఆడ పిల్లలున్నారని పేర్కొంది. ప్రత్యేకతల జిల్లా.. అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లాకు మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో నూటికి నూరు శాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా నూరు శాతం కాన్పులు కోతల్లేకుండా సాధారణ కాన్పులే. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు 6,181 కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణంగా జరిగి నట్లు నివేదిక పేర్కొంది. వీటిలో ఒక్కటి కూడా కోత (సిజేరియన్) కాన్పు లేదని వెల్లడించింది. -
కాలు జారితే అంతే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..
అడ్డతీగల(అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రత్యామ్నాయం లేకపోవడంతో గత్యంతరం లేక అడ్డతీగల మండలంలోని పింజరికొండ గ్రామస్తులు అంత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఏలేరు వాగులో గల గోడపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 400 మంది జనాభా ఉన్న ఈ గ్రామం వాగుకు అవతలి వైపు ఉంది. 2010 వరకూ వాగులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే వారు. వాగుకు సమీపంలో చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రం నిర్మించారు. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం నీటిని మళ్లించడానికి వాగుకు అడ్డంగా వియర్(అడ్డుగోడ) నిర్మించారు. ఇప్పుడా గోడమీద నుంచి పింజరికొండ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం నీటి ప్రవాహం ఉండడంతో గోడ నాచుపట్టి ఉంటుంది. ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోడపై నుంచి రాకపోకలు సాగించవలసి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. పలువురు మృత్యువాత పడ్డారు. వాగు దాటితే గాని బాహ్యప్రపంచానికి రాలేని పరిస్థితి వారిది. వాగు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గల పాపంపేట చేరుకుంటేగాని వారికి వాహన సదుపాయం అందుబాటులోకి రాదు. ఏలేరు వాగుపై రోప్ బ్రిడ్జి అయినా నిర్మించాలని పింజిరికొండ వాసులు సంవత్సరాల తరబడి కోరుతూనే ఉన్నారు. (క్లిక్ చేయండి: పాపికొండలు.. షికారుకు సిద్ధం) -
ఆకాంక్ష జిల్లాల జాబితాలో మన్యం, అల్లూరి జిల్లాలు
కొయ్యూరు: మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఆకాంక్ష జిల్లాల జాబితాలో చేరాయని అరకు ఎంపీ మాధవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసి అందించిన లేఖ మేరకు నీతి అయోగ్ నిర్వహించిన సమావేశంలో ఆకాంక్ష జిల్లాల జాబితాలో వాటిని చేర్చారన్నారు. రెండు జిల్లాలు వెనుకబడి ఉన్నందున అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక చేరిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర సౌకర్యాలు అందుతాయన్నారు. విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో.. అరకు ఎంపీ మాధవి బుధవారం ఢిల్లీ నిర్వహించిన విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. (క్లిక్ చేయండి: మెట్ట భూములకు పాతాళగంగ) -
పాడేరు కాఫీ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం
-
అందాలకు నెలవైన అల్లూరి జిల్లా ఏజెన్సీ
-
పదవి నుంచి చింతపల్లి ఎంపీపీ తొలగింపు
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : చింతపల్లి ఎంపీపీ వంతాల బాబూరావును పదవి నుంచి తొలగించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిషత్ ఎన్నికల సమయంలో ఎంపీపీ ఎన్నికల్లో 20 మంది ఎంపీటీసీల్లో 9 మంది ఇండిపెండెంట్లు బాబూరావును బలపర్చగా, మరో 9 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థి అనూషదేవిని బలపర్చారు. ఇద్దరికీ సమానంగా సభ్యుల మద్దతు రావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్రనాథ్ లాటరీ తీశారు. డ్రాలో బాబూరావుకు ఎంపీపీ పదవి వరించింది. ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో బాబూరావు ఆయనపై ఉన్న కేసుల వివరాలను నమోదు చేయలేదని అనూషదేవి కోర్టును ఆశ్రయించడంతో పాడేరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు. బాబూరావుపై కేసులు ఉన్నట్టు తేలడంతో పదవికి అనర్హుడిగా పేర్కొంటూ ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కోరాబు అనూషదేవిని ఎంపీపీ పదవి వరించనుంది. (క్లిక్ చేయండి: విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..) -
విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మళ్లీ రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జీకే వీధి మండలం సిగినాపల్లి క్వారీని నెలరోజుల కిందట పోలీసులు మూసివేయించారు. దీంతో అంతర రాష్ట్ర రంగురాళ్ల వ్యాపారుల ముఠాలు వేరే క్వారీలపై దృష్టి సారించాయి. జి.మాడుగుల మండలంలోని మారుమూల గడుతూరు పంచాయతీ కూటికొండలు, ఇదే క్వారీకి సమీపంలోని చింతపల్లి సరిహద్దు నిట్టాపుట్టు అటవీ ప్రాంతంలోను, అడ్డతీగల మండలం తపస్వీకొండ అటవీ ప్రాంతంలోను రంగురాళ్ల క్వారీలు వెలుగు చూశాయి. ఆయా క్వారీల వద్ద వ్యాపారులు మకాం వేసి, గిరిజనులను ప్రోత్సహిస్తుండడంతో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. విశాఖ, రాజమహేంద్రవరాల్లో విక్రయాలు కొంతమంది వ్యాపారులు పాడేరు, వి.మాడుగుల, నర్సీపట్నం మండలాల్లో మకాం వేసి, రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. స్థానికంగా రంగురాళ్లను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని నేరుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు తరలించి అక్కడ ఉన్న పెద్ద వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాటిని జాతీయ,అంతర్జాతీయ మార్కెట్లకు పెద్ద వ్యాపారులు తరలిస్తున్నారు. జి.మాడుగుల మండలం కూటికొండలు, అడ్డతీగల మండలం తపస్వికొండపై గల క్వారీల్లో విలువైన క్యాట్ ఐ రకం(పిల్లికన్ను రంగు) రంగురాళ్లు లభ్యమవుతున్నాయని తెలిసింది. కూటికొండలు రంగురాళ్ల క్వారీ వద్దకు మైదాన ప్రాంతాల్లోని వి.మాడుగుల, రావికమతం, జి.మాడుగుల మండలాలకు చెందిన వ్యాపారులు రోజూ వెళుతూ పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో వ్యాపారులు యథేచ్ఛగా తవ్వకాలు జరిపిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ డబ్బు ఆశతో గిరిజనులు లోతుగా తవ్వుతున్నారు. తపస్వికొండపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అడ్డతీగల ప్రాంతానికి చెందిన కొంతమంది స్థానిక వ్యాపారులే అక్కడ రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తూ అక్కడ సేకరించిన వాటిని రాజమహేంద్రవరం, విశాఖపట్నానికి తరలిస్తు పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నారు. రంగురాళ్ల తవ్వకాలను నిరోధిస్తాం జి.కె.వీధి మండలంలో సిగినాపల్లి వద్ద రంగురాళ్ల క్వారీని పూర్తిగా మూసివేశాం. డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశాం. కూటికొండలు, తపస్వికొండల వద్ద తనిఖీలు నిర్వహించి వెంటనే ఆయా క్వారీలను కూడా మూసివేస్తాం. రంగురాళ్ల తవ్వకాలు, వ్యాపారాన్ని పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రంగురాళ్ల వ్యాపారుల ముఠాల సంచారంపై దృష్టి పెడతాం. కొండలపై తవ్వకాలు జరిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం. తవ్వకాలను ఎవరైనా ప్రోత్సహిస్తే తమకు సమాచారం ఇవ్వాలి. – సతీష్కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా -
బంగారు 'మేషువా'.. ‘అల్లూరి’ జిల్లాలో అరుదైన వృక్షాలు
హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో తూర్పు కనుమల్లో పలు చోట్ల ఔషధ గుణాలున్న అరుదైన మేషువా ఫెరే చెట్లు విస్తరించి ఉన్నాయి. ఈ చెట్లను గిరిజనులు ఉప్ప, బంగారం చెట్లుగా పిలుస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బంగారం గరువు అనే చిన్న గ్రామంలో సుమారు 25 ఎకరాల్లో 1,500 చెట్లున్నాయి. ఈ చెట్ల వల్లే అక్కడ ఉన్న గ్రామానికి బంగారం గరువు అని పేరొచ్చింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1,050 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ వృక్ష జాతి వైద్య, వాణిజ్య పరంగా చాలా విలువైంది. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య ఇవి చిగురిస్తాయి. ఆసక్తికర విషయమేంటంటే ఈ చెట్లు చిగురించేప్పుడు వాటి ఆకులు వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ ఆకులు మొదట లేత ఎరుపు రంగు, తర్వాత గోధుమ రంగు, ఆ తర్వాత లేత ఆకుపచ్చ రంగు, చివరిగా పూర్తి ఆకుపచ్చ రంగులోకి మారతాయి. వీటి పువ్వులు తెలుపు రంగులో పెద్దవిగా ఉంటాయి. వీటిని గిరిజన స్త్రీలు అలంకరణ కోసం వినియోగిస్తారు. మంచి సువాసన ఉండటంతో వాణిజ్య పరంగా సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ చెట్లను గిరిజనులు నరకరు ఈ పువ్వులు ఫలదీకరణం చెంది పూర్తి ఫలాలుగా మారేందుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. ఒక్కో ఫలంలో ఒకటి నుంచి నాలుగు గింజలుంటాయి. ఇవి నూనె స్వభావం కలిగి ఉండటం వల్ల కాల్చినప్పుడు కొద్ది సమయం పాటు వెలుగుతాయి. గతంలో ఈ గింజలను అక్కడి గిరిజనులు వెలుగు కోసం వినియోగించేవారు. వీటి నుంచి తీసిన నూనెను తలకు రాసుకోవడానికి, దీపాలు వెలిగించేందుకు, చర్మ వ్యాధుల నివారణకు వినియోగిస్తారు. ఈ చెట్లు ఉన్న స్థలంలో పూర్వం నుంచి ఓ ఆలయం ఉంది. ఆలయంలో ఉన్న దేవతను గంగమ్మగా కొలుస్తారు. ఆ ప్రాంతంలో జాతర నిర్వహిస్తారు. ఈ స్థలాన్ని అటవీశాఖ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. ఈ వృక్షాలను నరికేందుకు గిరిజనులు ఇష్టపడరు. అయితే ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ చెట్లను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.. అత్యంత ఔషధ గుణాలున్న ఉప్ప చెట్లను పరిరక్షించాల్సిన అవసరముంది. ఏటా గిరిజనులు ఆ చెట్ల పువ్వులను, గింజలను వివిధ అవసరాలకు సేకరించడం వల్ల కొత్త మొక్కలు పుట్టడం లేదు. ఇది ఆ వృక్ష జాతి మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాటి సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి – డాక్టర్ సమరెడ్డి శ్రావణ్కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్,ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కృషి దేశంలోనే అరుదైన ఉప్ప చెట్లు ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఈ ప్రాంతం అభివృద్ధికి ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతో చర్చించాం. సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి పర్యాటక ప్రాంతంబబగా అభివృద్ధి చేస్తాం. – చెట్టి పాల్గుణ, అరకు ఎమ్మెల్యే -
అల్లూరి జిల్లా: అక్కా.. తమ్ముడు.. ఓ స్కూటర్
అక్క కోసం ఓ తమ్ముడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఏకంగా బండిని బ్యాటరీతో నడిచేలా తయారు చేశాడు. ఇంకేంముంది.! అక్క తక్కువ ఖర్చుతో బ్యాటరీ స్కూటర్పై రయ్రయ్మంటూ దూసుకుపోతోంది. తమ్ముడు కృషిని అక్కతో పాటు ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నారు. సాక్షి, అల్లూరి జిల్లా: జిల్లాలోని రాజవొమ్మంగికి చెందిన సామన సురేష్ స్థానికంగా ఎలక్ట్రీషియన్. ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మోటారు ఏ విధంగా పని పని చేస్తుంది? బ్యాటరీ పనితనం తదితర అంశాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. కాగా.. రాజవొమ్మంగికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సురేష్ అక్క వెంకటలక్ష్మి బ్రాంచ్ పోస్ట్ మాస్టారుగా పనిచేస్తున్నారు. ఆమె రోజూ స్కూటర్పై విధులకు వెళ్తుంటుంది. ఈ క్రమంలో.. పెట్రోల్ ధరలు పెరగడం, ఒకటి రెండు సార్లు ఆమె తన భర్తను పెట్రోల్ కోసం డబ్బులు అడగటం సురేష్ చెవిన పడింది. పెట్రోల్తో నడిచే ఆ స్కూటర్ మైలేజ్ లీటరుకు 30 కిలోమీటర్లే వస్తోంది. కిలోమీటరుకు సుమారు రూ.4 ఖర్చవుతోంది. రోజూ 12 కిలోమీటర్ల దూరం వెళ్లి వచ్చేందుకు సుమారు రూ.96 అవసరం. ఇలా నెలకు రూ.2,880 ఖర్చవుతోంది. ఆమె చేసేది చిన్న ఉద్యోగం. అందులో సగం జీతం పెట్రోలు ఖర్చులకే పోతుండటంతో సురేష్ ఆలోచనలో పడ్డాడు. అప్పటికే.. సురేష్ బ్యాటరీతో నడిచే ఓ సైకిల్ తయారు చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. కానీ అక్కను సైకిల్పై పోస్టాఫీసుకు వెళ్లమనడం ఇష్టం లేక.. ఆమె ఉపయోగించే స్కూటర్కే బ్యాటరీలు అమర్చే పనిలో పడ్డాడు. మెదడుకు పదును పెట్టి దాదాపు రెండు వారాలు కష్టపడ్డాడు. అతని కృషి ఫలించింది. స్కూటర్ను ఇటు పెట్రోల్తో.. అలాగే బ్యాటరీతోనూ నడిచేలా తయారు చేశాడు. సురేష్ తెలివితేటలకు ఆమె మురిసిపోయారు. రయ్ రయ్మంటూ రోడ్లపై పరుగులు తీస్తున్న స్కూటర్తో మరింత అనుబంధం పెంచుకున్నారు. సెల్ఫోన్కు మాదిరిగానే బ్యాటరీ చార్జ్ చేస్తే సరిపోతుండటంతో వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడిక బండిలో పెట్రోలు ఉందా లేదా చూడనవసరం లేకుండా ఝామ్మని ఆఫీసుకు దూసుకెళ్లిపోతున్నారు. 3 గంటలు చార్జ్ చేస్తే 60 కి.మీ. వెళ్లొచ్చు పెట్రోల్తో నడిచే స్కూటర్ను బ్యాటరీతో కూడా నడిచేదిగా తయారు చేసేందుకు తనకు రూ. 28,000 ఖర్చయిందని సురేష్ తెలిపారు. మూడు 12 ఓల్ట్స్ బ్యాటరీలతో తయారు చేసిన ఈ స్కూటర్కు మూడు గంటల పాటు చార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పైకి పెట్రోల్ స్కూటర్ మాదిరిగా ఉన్న బ్యాటరీ స్కూటర్ను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇదీ చదవండి: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి.. -
జాతీయ సదస్సులో మరోసారి ‘అరకు కాఫీ’ అదుర్స్
సాక్షి, అమరావతి/పాడేరు : అరకు కాఫీ జాతీయ స్థాయి వేదికపై మరోసారి అదుర్స్ అనిపించింది. ప్రతిష్టాత్మక సదస్సులో ప్రథమ బహుమతిని సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చాటింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ గుర్తింపు పొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో–సోషల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కోల్కతాలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ‘పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జీవనోపాధి పెంపొందించడం–స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మహిళా సాధికారతకు ఊత మివ్వడం’ అనే అంశంపై నిర్వహించిన ఈ సద స్సులో 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ ప్రాంతాల్లో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఏపీ ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, డైరెక్టర్లు పి.చిన్నప్పదొర, ఎం.రామకృష్ణ, ఎస్.ఈశ్వరమ్మ, జనరల్ మేనేజర్ సీఏ మణికుమార్ ఆంధ్రాలో గిరిజనుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న కాఫీ ప్రాజెక్టుపై సమగ్రంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏజెన్సీ ఏరియాలోని 2,27,021 ఎకరాల్లో కాఫీ పంట సాగు చేస్తున్నారని, ఏటా గిరిజన రైతులకు కచ్చితమైన ఆదాయం లభిస్తోందని, బెంగళూరు మార్కెట్లో నాణ్యమైన కాఫీ గింజలుగా ప్రసిద్ధి చెందడం వంటి అంశాలను వివరించారు. దీంతో మన కాఫీ ప్రాజెక్ట్కు ప్రథమ స్థానం లభించింది. ఉన్నతాధికారుల అభినందనలు జాతీయ స్థాయి అవార్డును సాధించిన ఏపీ ట్రైకార్ బృందానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, సంచాలకులు ఎం.జాహ్నవి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ అవార్డు పొందడం ద్వారా జాతీయ స్థాయిలో అరకు కాఫీ మరోసారి గొప్ప గుర్తింపు పొందిందని ట్రైకార్ జీఎం మణికుమార్ తెలిపారు. అనుకూల వాతావరణం... ప్రభుత్వ సహకారమే కారణం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం, వృక్ష సంపదతో ఏర్పడే సహజసిద్ధమైన నీడ, నేల స్వభావం కాఫీ సాగుకు అత్యంత అనుకూలం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ–పాడేరు) పరిధిలో 2024–25 నాటికి దశల వారీగా కాఫీ సాగు విస్తరణను పెంచుతూ రూ.526.160 కోట్లతో ప్రత్యేక కాఫీ ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టింది. కాఫీ సాగుకు అవసరమైన విత్తనాలు, యంత్రాలు, బోర్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం, మొయిన్ రోడ్డు నుంచి అంతర్గత అప్రోచ్ రోడ్ల నిర్మాణం, పల్పింగ్ యూనిట్ల ఏర్పాటు, కాఫీ గింజల సేకరణ, మార్కెటింగ్æ వంటి చర్యలను చేపట్టింది. ప్రభుత్వ తోడ్పా టు వల్ల అరకు కాఫీకి దేశ విదేశాల్లో గుర్తింపు లభిస్తోంది. యూరప్, పారిస్ సహా అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. -
పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం
కరోనా దెబ్బకు కుదేలైన పర్యాటక రంగం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు పూర్తిస్థాయిలో పుంజుకుంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, డముకు వ్యూ పాయింట్, కటికి, తాటిగుడ జలపాతాలు, అరకులోయలో పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్, డుంబ్రిగుడలోని చాపరాయి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అనంతగిరి/అరకులోయ: కరోనా కారణంగా మన్యంలో మూతపడిన పర్యాటక ప్రాంతాలు పునఃప్రారంభమైన తరువాత మండలంలోని బొర్రా గుహలతో పాటు మిగతా వాటికి సందర్శకులు తాకిడి పెరిగింది. గత రెండేళ్ల కన్నా ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. 2020 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 1,80,260 మంది సందర్శించగా రూ.131.35 లక్షల ఆదాయం లభించింది. 2021 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 2,61,000 మంది సందర్శించగా రూ.187 లక్షల ఆదాయం సమకూరింది. 2021 సంవత్సరం కంటే ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య సుమారు 80 వేలు అధికంగా ఉంది. గత ఏడాది జనవరి నుంచి జూలై వరకు 2,22,653 మంది సందర్శించగా రూ.161.21 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు సుమారు మూడు లక్షల మంది సందర్శించగా సుమారు రూ.200 లక్షలు ఆదాయం లభించింది. అరకులోయలో... గత ఏడాది అక్టోబర్ నెల నుంచి అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియంతో పాటు చాపరాయి జలపాతం ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా తరలివస్తున్నారు. గత 12నెలల్లో అరకులోయ గిరిజన మ్యూజియాన్ని 3 లక్షల మంది, పద్మాపురం గార్డెన్ను సుమారు 2.50 లక్షల మంది సందర్శించారు. సుమారు రూ.2 కోట్ల ఆదాయం లభించింది. చాపరాయి జలపాతం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్ను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరగడంతో టూరిజంశాఖకు చెందిన రిసార్టులు, రెస్టారెంట్ల ఆదాయం భారీగా సమకూరుతోంది. (క్లిక్: వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా అక్కడే..) పెరిగిన పర్యాటకులు బొర్రా గుహలను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. బొర్రాలోని సదుపాయలు కల్పనకు చర్యలు చేపడుతున్నాం. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – బాబుజీ డీవీఎం పర్యాటకశాఖ -
వావ్ అనిపించే వాటర్ఫాల్స్.. చూపు తిప్పుకోలేరు!
సాక్షి, ముంచంగిపుట్టు: పరవళ్లు తొక్కుతున్న నదీ జలాలు.. వాగులు, సెలయేర్లు.. కొండలు, కోనలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ మన్యంలో అద్భుత దృశ్యంగా పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో జలపాతాలు హొయలొలుకుతున్నాయి. తొలకరి వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జలపాతాల నీటి ఉధృతికి తోడై మరింత కనువిందు చేస్తున్నాయి. చిన్న జలపాతాలు సైతం ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో డుడుమ జలపాతం 2,700 అడుగుల పైనుంచి మంచు తెరల మధ్య జాలు వారుతూ ఆహ్లాద పరుస్తోంది. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ జడిగూడ జలపాతం సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులో తారాబు జలపాతం నింగికి ఎగసి పడుతున్నట్లు కనిపిస్తోంది. బరడ పంచాయతీ హంశబంద, జర్జుల పంచాయతీ బురదగుంట జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వీటిని చూసేందుకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి విశేష అనుభూతిని పొందుతున్నారు. అక్కడ చుట్టు పక్కల వంటలు చేస్తూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ, సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. పాల కడలి స్నోయగాలు మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన పాడేరు మండలం వంజంగి హిల్స్ పొగమంచు, మేఘాలతో గురువారం ఉదయం పాలసముద్రంలా దర్శనమిచ్చింది. వేకువజాము నుంచి ఉదయం 10గంటల వరకు కొండల నిండా మంచు పరుచుకుంది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను అబ్బురపరిచాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించి పరవశించారు. – సాక్షి, పాడేరు -
రెండు నెలల్లోనే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తాం: సీఎం వైఎస్ జగన్
తక్షణ సాయం బాధితులందరికీ అందాలని చెప్పా. మాకు అందలేదని ఎక్కడా, ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. అందరికీ సాయం అందింది. మన ప్రభుత్వ పనితీరును చేతల్లో చూపించాం. ఇందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. వరదల్లో నష్టపోయిన మొత్తాన్ని బాధితులకు అందించడంపై ఇక దృష్టి సారిస్తాం. ఇది మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి. ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ ఉన్నారు. నష్టపోయిన వారందరి పేర్లతో రెండు వారాల్లో జాబితా తయారు చేసి, సచివాలయంలో ప్రకటిస్తారు. ఆ జాబితాలో పొరపాటున ఎవరి పేరు లేకపోయినా, రెండు వారాల్లోగా సరిచూసుకుని మళ్లీ మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మరో రెండు వారాల్లో ఈ జాబితాను రీ వెరిఫై చేస్తాం. ఆ తర్వాత మరో రెండు వారాల్లో మీరు నష్టపోయింది మీకు వచ్చేలా చేస్తాను. అంటే 2 నెలల్లో మీకు పూర్తి నష్టపరిహారం చెల్లిస్తాం. ఇదంతా నా చేతుల్లో ఉన్న పని. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీకు అన్నగా.. మీ అందరికీ మంచి చేస్తాను. – సీఎం వైఎస్ జగన్ బాధపడకు తల్లీ.. నేనున్నా ప్రధాన మంత్రి మోదీ అపాయింట్మెంట్ అడిగా. నేను చూసిన పరిస్థితులన్నింటినీ ఆయనకు వివరిస్తా. 1986లో ఇంత స్థాయి నీరు వచ్చిందని, మళ్లీ 36 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో నీళ్లు వచ్చాయని చెబుతా. ఇది జాతీయ ప్రాజెక్టు. అందువల్ల ఏరోజైనా పరిహారం ఇవ్వక తప్పదు కదా సర్.. ఇచ్చేదేదో ఇప్పుడే ఇస్తే.. వారంతా సంతోషిస్తారు. నిర్వాసితులు మిమ్మల్నే తలుచుకుంటారు.. లేదంటే తిట్టుకుంటారు.. బటన్ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి మీరే డబ్బు పంపండి అని ప్రధాన మంత్రిని కోరుతా. – సీఎం వైఎస్ జగన్ నిమ్మలగూడెంలో ఓ మహిళను ఓదార్చుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ఏలూరు: వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని, నష్టపోయిన మొత్తాన్ని బాధితులకు రెండు నెలల్లో అందజేసే బాధ్యత మీ వాడిగా తనదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. తాటాకు గుడిసెలో ఉన్న వారికి నష్ట పరిహారాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నామని చెప్పారు. బుధవారం ఆయన రెండవ రోజు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద ముంపు వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఇప్పటికే రేషన్ అందించడంతో పాటు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు సాయం చేశామని చెప్పారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ (నష్టం అంచనా) మరో రెండు వారాల్లో పూర్తి చేసి, వరద నష్ట పరిహారాన్ని రెండు నెలల్లో చెల్లిస్తామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకే మీ అన్న, తమ్ముడు, మనవడు ఉన్నాడని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. తేడా గమనించండి.. ► చింతూరులో 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దాదాపు 20 రోజులపాటు మొదటి ప్రమాద ఘంటికపైనే నీళ్లు నిలిచి ఉండడం గతంలో ఎన్నడూ చూడలేదు. గతంలో ఇటువంటి పరిస్థితి వస్తే పట్టించుకునే వారు కాదు. ఈ నాలుగు మండలాలకు సంబంధించి ఇక్కడే కాపురం పెట్టిన కలెక్టర్ను ఎప్పుడైనా చూశారా? ఎన్నడూ చూడలేదు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా.. అందరికీ సహాయం అందించేందుకు అధికారులందరూ ఇప్పుడు ఇక్కడకు వచ్చారు. గతంతో పోలిస్తే ఎంత మార్పు వచ్చిందో గమనించాలని కోరుతున్నా. ► మామూలుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జేసీలు ఉండేవారు. ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు, ఆరు మంది జేసీలు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, ఆశా వర్కర్లు ఇంత మంది కలిసి అందరికీ సహాయం అందేలా చూడాలని తపన, తాపత్రయం పడే పరిస్థితి. గతం కంటే ఇప్పుడు భిన్నంగా పరిస్థితి ఉందన్న విషయం గమనించాలి. ► అందరికీ 25 కేజీల బియ్యం, పామాయిల్, వీటన్నింటితో పాటు ఇంటింటికీ రూ.2 వేలు అందించాం. ప్రతి ఒక్కరికీ ముట్టిందా.. అందిన వాళ్లు చేతులు పైకి ఎత్తండి. (అందరూ చేతులు పైకి ఎత్తారు.. ఏ ముఖ్యమంత్రీ చేయలేదండి అని నినదించారు) ఇంత పారదర్శకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సహాయం అందిస్తున్నాం. అందరికీ మేలు జరగాలని చెప్పా.. ► ఎన్ని రోజులు అయ్యింది ఇంటికి వెళ్లి అని కలెక్టరును అడిగాను. 20 రోజులు అయ్యింది అని చెప్పారు. ఒక్క అల్లూరి జిల్లాలో నాలుగు మండలాలకు ఇబ్బంది వస్తే.. కలెక్టరు ఇక్కడే ఉండి ఏ ఒక్కరికీ ఇబ్బంది రాకుండా స్వయంగా చూసుకునే మంచి ఆలోచనతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ విధంగా ప్రజలకు సేవ చేసిన కలెక్టరుతో మొదలుకుని అధికారులందరికీ ప్రజల తరఫున, నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా. ► మాములుగా నాయకులు.. అది బాగోలేదు.. ఇది బాగోలేదు అని నాలుగు మాటలు మాట్లాడి.. ఆ అధికారిని, ఈ అధికారిని సస్పెండు చేసి వెళ్లిపోయే పరిస్థితి. అలా కాకుండా అధికారులకు ఏ వనరులు కావాలో.. ఆ వనరులు వారి చేతుల్లో పెట్టి... వారం తర్వాత నేను వస్తాను. ఏ ఇంట్లో కూడా నాకు ఫలానా సహాయం అందలేదన్న మాట వినిపించకూడదని ఆదేశించా. ఒక్క ఇంట్లో కూడా నాకు మంచి జరగలేదన్న మాట వినిపించలేదు. 14 రోజుల్లో ఎన్యూమరేషన్ బుధవారం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట, తిరుమలాపురం గ్రామాల్లో ముంపు వల్ల నష్టపోయిన కుటుంబాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ సహాయం అందిందా.. పింఛను తీసుకుంటున్నారా.. అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. బాధితులతో మాట్లాడుతూ.. ‘పారదర్శకంగా ఎన్యూమరేషన్ను 14 రోజుల్లో పూర్తి చేయండని చెప్పాం. కలెక్టర్లే ఇక్కడ తిష్ట వేశారు. అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమాల్లో మమేకం అయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు కాబట్టి, ఎన్యూమరేషన్ను ఇవాళే మొదలు పెట్టండని చెప్పాం’ అన్నారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా.. అల్లూరి జిల్లాలో సీఎం పర్యటించిన ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. వేదికకు దూరంగా బాధితులను కూర్చోబెట్టారు. రాజమండ్రి నుంచి నేరుగా కుయిగూరుకు వచ్చిన సీఎం.. ఈ బారికేడ్లు, ఏర్పాట్లను చూసి మీతో మాట్లాడేందుకు నాకు ఈ అడ్డు ఎందుకు.. అని బారికేడ్ల నుంచి పక్కకు వచ్చి నేరుగా బాధితుల వద్దకు చేరుకుని వారితో ముచ్చటించారు. చింతూరు, నిమ్మలగూడెంలలో బస్సు దిగి మరీ వారి బాధలను తెలుసుకుని ఓదార్చారు. కొద్ది మంది తమ ఆరోగ్యం, పింఛను సమస్యలను విన్నవించిన వెంటనే.. పరిష్కరించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భం గా జై జగన్ అంటూ ప్రజలు నినదించారు. సీఎంతో మాట్లాడాలని, ఫొటో దిగాలని పోటీ పడ్డారు. ‘సీఎం మామూలు మనిషిలా ఇంత ఆప్యాయంగా మాట్లాడతా రని మేము ఊహించలేదు’ అని ఆయా గ్రామాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘గత 60–70 ఏళ్ల నుంచి మాకు 20 ఎకరాల భూమి ఉంది. అయితే, ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఉన్నప్పటికీ మాకు నష్టపరిహారం రాదని అంటున్నారు’ అని కుయిగూరుకు చెందిన బండి శ్రీలత సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘షెడ్యూల్ ప్రాంతంలో కాబట్టి నాన్ షెడ్యూల్ కుటుంబాలకు భూమి ఉండకూడదు. అయితే, వేరే విధంగా చేయవచ్చో ఆలోచిస్తాం. ఏ ఆడకూతురు కంట నీరు పెట్టుకోకూడదనే నా తాపత్రయం. ఏదో ఒక విధంగా మంచి చేస్తాం’ అని భరోసానిచ్చారు. లైడర్ను విశ్లేషిస్తున్నాం సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ప్రాజెక్టుపై లైడర్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సర్వే 4రోజుల క్రితమే పూర్తయింది. ప్రతి కాంటూరు లెవల్పై జరిగిన ఈ సర్వేను నెల పాటు క్షుణ్ణంగా విశ్లేషిస్తాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలుంటే సరిదిద్ది అందరికీ న్యాయం చేస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ పోలవరం నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట, తిరుమలాపురం గ్రామాల్లో బుధవారం సీఎం ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరెవరు ఏ కాంటూరు పరిధిలోకి వస్తారో మళ్లీ పరిశీలన చేస్తామని సీఎం చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో స్థానిక రిజర్వేషన్ను అమలు చేసేలా ఏలూరు, రాజమండ్రి జిల్లా కలెక్టర్లు మాట్లాడుకుని ఉద్యోగ కల్పన చేయాలని, అక్కడే కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ‘టీడీపీ వారు పగ తీర్చుకోవడంలో భాగంగా 41 కాంటూరులో ఉన్న వాళ్లని 45లోకి చేర్చారు. పూర్తిగా ముంపులో ఉన్నప్పటికీ ఫస్ట్ ఫేజ్లోకి తీసుకెళ్లలేదు. దీని వల్ల గిరిజనులకు నష్టం. గత ప్రభుత్వ పొరపాటు ఇది. వరదల్లో మునిగినందున కుక్కునూరు ఎ బ్లాక్కు పరిహారం ఇవ్వాలి. ఆర్ అండ్ ఆర్ అందిస్తే, తాడువాయిలో పునరావాస కాలనీకి వెళ్లిపోతాం’ అని మాదిరాజు వెంకన్నబాబు, కేసగాని శ్రీనివాస గౌడ్, కుక్కునూరు సర్పంచ్ రాయి మీనా, స్థానికులు విన్నవించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కన్నయ్యగుట్టకు చేరుకున్న సీఎం జగన్
-
చట్టి గ్రామంలో సీఎం జగన్ పర్యటన
-
ప్రధాని మోదీని మూడు సార్లు కలిసా.. మూడుసార్లు ఇదే టాపిక్ మాట్లాడా
-
ధైర్యంగా మాట్లాడిన అక్క మాటలకి సీఎం జగన్ ఫిదా
-
కేంద్రం నుంచి రావాల్సిన సాయం కోసం పోరాడాల్సి వస్తోంది..
-
వరద బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఎం జగన్
సాక్షి, అల్లూరి: వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకున్నామని, పోలవరం నిర్వాసితులకే న్యాయం చేశాకే పోలవరంలో నీళ్లు నింపుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులతో సీఎం జగన్ పరామర్శ కొనసాగింది. చింతూరులో దాదాపుగా 20 రోజుల నుంచి మొదటి ప్రమాదపు ఘంటికపైనే దాదాపుగా ఇన్నిరోజులు నీళ్లు ఉన్న పరిస్థితులు చూడలేదు. నాలుగు మండలాల్లో కలెక్టర్ 20 రోజుల పాటు ఉన్నారు. కలెక్టర్, అధికారులు, వలంటీర్లు.. ఇక్కడే ఉండి పరిస్థితి సమీక్షించడం అభినందనీయం. సహాయం అందరికీ అందాలనే తాపత్రయం.. గతంలో కన్నా పరిస్థితిలో ఎంతో మారిందని సీఎం జగన్ చెప్పారు. పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించాం. అందరికీ రేషన్, ఇంటింటికీ రూ. 2 వేలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ సహయం, అన్ని సౌకర్యాలు అందాయని నిర్వాసితులు తెలిపారు. ఎగ్గొట్టే ప్రభుత్వం కాదు.. ఆదుకునే ప్రభుత్వం ఎవరికి, ఎలాంటి వరద నష్టం జరిగినా సరే.. గ్రామ సచివాలయంలో లిస్ట్లో ఉంటుందని, నష్టం వివరాలు ఏమైనా ఉంటే పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని సీఎం జగన్ స్పష్టం తెలియజేశారు. అర్హత ఉన్న అందరికీ రెండు నెలల్లోగా పరిహారం అందుతుందని, ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండబోదని పేర్కొన్నారు సీఎం జగన్. తాటాకు గుడిసెల నిర్వాసితులకు పరిహారం రూ. ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. పోలవరం ముంపు బాధితుల విషయంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు గనుక రాకపోతే.. భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, సెప్టెంబర్ లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని, నిర్వాసితులకు పరిహారం అందాకే.. పోలవరంలో నీళ్లు నింపుతామని సీఎం జగన్ తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.. నిర్వాసితులను ఆదుకుంటాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటాం: సీఎం జగన్
అప్డేట్స్ ముగిసిన సీఎం జగన్ పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం.. నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. వరద బాధితులతో ఆయన నేరుగా మాట్లాడారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకున్నారు. ► 04:22 PM ముంపు బాధితులకు అండగా ఉంటాం: సీఎం జగన్ తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకతతో గతంలో ఎప్పుడూ జరగలేదు. ముంపు బాధితులకు అండగా ఉంటామన్నారు. వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొంది. ఎన్యుమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించామని సీఎం తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ► 04:14 PM ఫొటో గ్యాలరీని పరిశీలించిన సీఎం జగన్ పోలవరం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. తిరుమలాపురం చేరుకున్న సీఎం.. వరద బాధిత గ్రామాలకు సంబంధించి ఫొటో గ్యాలరీని పరిశీలించారు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించనున్నారు. ► 03:18 PM కన్నయ్యగుట్టకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులతో సమావేశం కానున్నారు. ► 03:03PM వేలేరుపాడు హెలీప్యాడ్ చేరుకున్న సీఎం జగన్ వేలేరుపాడు హెలీప్యాడ్కు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి కన్నయ్యగుట్టకు బయలుదేరనున్నారు. వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులతో సమావేశం కానున్నారు. ► 01:45PM పరిహారం ఇచ్చాకే పోలవరం నింపుతాం: సీఎం జగన్ ఇది మీ ప్రభుత్వం. గత ప్రభుత్వం మాదిరి వరద బాధితులను నిర్లక్ష్యంగా వదిలేయదు. మీ కోసం ఎంతైనా చేస్తాం. దగ్గరుండి కలెక్టర్ స్థాయి అధికారులే సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. రేషన్ సకాలంలో అందించాం. నష్టపోయిన చట్టి గ్రామస్తులకు పదివేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇస్తున్నా. కేంద్రం నుంచి రావాల్సిన సాయం కోసం పోరాడాల్సి వస్తోంది. స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి మాట్లాడా. పోలవరం కోసం మొదట్లో త్యాగాలు చేసిన నిర్వాసితులకు పరిహారం పెంచి ఇస్తామని, సెప్టెంబర్లోగా చెల్లించి తీరతామని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ► 01:40PM చట్టి గ్రామంలో సీఎం జగన్ పరామర్శ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ► ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చే క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం. ఆ ప్యాకేజీ కోసం కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం. అంత కాబట్టే కేంద్రం సాయం చేయాల్సిందే. పోలవరం పునరావాసం అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఆ సాయం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం. సెప్టెంబర్లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తాం. పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు నింపుతాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం అని సీఎం జగన్ పేర్కొన్నారు. ►11:40AM పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో కేంద్రంతో కుస్తీ పడుతూనే ఉన్నామని, కేంద్రం చెల్లించకుంటే రాష్ట్రం తరపున సెప్టెంబర్లోగా పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం చెల్లిస్తామని, ఆతర్వాతే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్.. నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. ►11:35AM పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించాం. అందరికీ రేషన్, ఇంటింటికీ రూ. 2 వేలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ సహయం, అన్ని సౌకర్యాలు అందాయని కోయుగూరు వరద బాధితులు తెలిపారు. ►11:25AM వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, ప్రతీ ఒక్కరికీ పరిహారం అంది తీరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. కోయుగూరు గ్రామంలో నిర్వాసితులతో సీఎం జగన్ మాట్లాడారు. ►11:21AM అల్లూరి జిల్లా చింతూరు మండలం కొయుగురు గ్రామంలో వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి. ►10:50AM చింతూరు మండలంలో సీఎం జగన్ పర్యటన.. కుయుగూరు గ్రామంలో బాధితులతో ముఖాముఖికి సర్వం సిద్ధం. పరామర్శించి.. వరద సాయం గురించి నేరుగా అడిగి తెలుసుకోనున్న సీఎం. ►10:15AM అల్లూరి జిల్లా చింతూరుకు చేరుకున్న సీఎం జగన్. ► కాసేపట్లో చింతూరుకు చేరుకోనున్న సీఎం జగన్ ► వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోరోజు పర్యటన మొదలైంది. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ నుంచి ఆయన బయలుదేరారు. ► బాధితులకు అందుతున్న సహాయక చర్యల గురించి నేరుగా వాళ్ల ద్వారానే అడిగి తెలుసుకుంటున్నారు ఆయన. ఈ పర్యటనలో బాగంగా.. ఇవాళ (బుధవారం) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. షెడ్యూల్ ప్రకారం.. ► ముందుగా.. ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు చేరుకుంటారు. ► అల్లూరి జిల్లా చింతూరు మండలం కుయుగూరు గ్రామంలో తొలుత పర్యటిస్తారు. ► ఆపై చట్టి గ్రామంలో వరద బాధితులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం కల్లా ఏలూరు జిల్లాకు చేరుకుంటారు సీఎం జగన్. ► వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫొటోగ్యాలరీని పరిశీలిస్తారు. ► ఆపై తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. ► ఆపై వరద ప్రాంతాల పర్యటన ముగించుకుని.. తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనకాపల్లి, అల్లూరి జిల్లాల మీదుగా 10 కి.మీ. రహదారి నిర్మాణం
మాడుగుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవాపురం వరకు.. దట్టమైన అడవిలో నుంచి సాగే 10 కిలోమీటర్ల రహదారి.. 15 ఏళ్ల క్రితమే నిర్మాణం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. అటవీ శాఖ అనుమతులు లభించక మధ్యలోనే నిలిచిపోయింది. ఇన్నాళ్లకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. కాకులు దూరని కారడవిలో పొక్లెయిన్లతో జంగిల్ క్లియరెన్స్ చేస్తూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: అడవి బిడ్డలకు త్వరలో డోలి కష్టాలు తీరనున్నాయి. చదువు కోవాలని ఆశపడే విద్యార్థుల కలలు నెరవేరబోతున్నాయి. అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తంగా ప్రగతి పరవళ్లు తొక్కబోతోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో మాడుగుల నుంచి దేవాపురం వరకు కీలకమైన రహదారి నిర్మాణం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీడీఏ సహకారంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రహదారి కొండలు, గుట్టల మీదుగా సాగుతుంది. పక్కా రోడ్డు వేయడం కష్టసాధ్యమే అయినా ఈ సత్సంకల్పాన్ని సుసాధ్యం చేయాలని అందరూ శ్రమిస్తున్నారు. వాణిజ్యంలో ప్రత్యేక గుర్తింపు మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు మధ్యనున్న మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయంటే దానికి కారణం సరైన రహదారి లేకపోవడమే. వందేళ్ల క్రితమే మాడుగుల వాణిజ్య రంగంలో గుర్తింపు పొందింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో పండించిన పిప్పలి, పసుపు, బత్తాయి, నారింజ, అరటి, చింతపండు, సపోట, మొక్కజొన్న, అనాస, సీతాఫలం, అలచందలు, తదితర పంటలు మాడుగుల చేరుకుంటాయి. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఏడాదికి వందల టన్నుల్లో రవాణా జరుగుతుంది. సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మాడుగుల మండలంలో కొన్ని గ్రామాలతోపాటు నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 30 గ్రామాలు ఈనాటికీ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయాయి. దేవాపురం, అయినాడ, సలుగు పంచాయతీల పరిధిలో ఉన్న ఈ గ్రామాలవారు నిత్యావసర సరుకులతోపాటు ఇతర వస్తువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దిగి మాడుగుల రావల్సి వచ్చేది. గిరిజనులు పండించిన పంటలను కావిళ్లతో, గంపలతో నడుచుకుంటూ తీసుకువస్తారు. రహదారి సౌకర్యం లేక ఈ ప్రాంత విద్యార్ధులను చదివించడానికి కూడా ఇష్టం చూపించరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం ఆ గ్రామాలు అల్లూరి జిల్లాలో ఉన్నాయి. గతంలో సగంలోనే నిలిచిన రోడ్డు పనులు 15 ఏళ్ల క్రితం మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖ అనుమతి లేకపోవడంతో అక్కడితో పనులు నిలిపోయాయి. చాలామంది రాజకీయ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి పూనుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాడుగుల–దేవాపురం రోడ్డుకు మోక్షం కలిగింది. గత ఎన్నికలకు ముందే ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దానిని నెరవేరుస్తూ అటవీ శాఖ అడ్డంకులున్నా అధిగమించి ప్రస్తుతం రోడ్డు నిర్మాణం శరవేగంతో చేస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన 13 మండలాల్లో గల 30 గ్రామాల రైతులు, చిరు వ్యాపారస్తులు, ప్రజలు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గిరిపుత్రులకు అండగా ప్రభుత్వం గిరిజనమంటే సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అమితమైన ప్రేమ. వారి అభివృద్ధికి, వారి గ్రామాలకు రోడ్డు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మాడుగుల నుంచి దేవాపురం వరకు రహదారి సౌకర్యం లేపోవడంతో గిరిజన గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో అటవీశాఖ అనుమతులు లభించాయి. మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు ఇప్పటికే రహదారుల నిర్మాణం జరుగుతోంది. –బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం రుణపడి ఉంటాం.. గత 30 ఏళ్లుగా దేవాపురం రోడ్డు కోసం పోరాడుతున్నాము. గతంలో మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖాధికారుల అనుమతులు లేకపోవడంతో అప్పట్లో రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇన్నళ్లకు మా కల నెరవేరుతోంది. రెండు జిల్లాల ప్రజలు సీఎంకు, డిప్యూటీ సీఎంకు రుణపడి ఉంటారు. – వేమవరపు వెంకటరమణ, మాడుగుల మాజీ సర్పంచ్ త్వరితగతిన నిర్మాణ పనులు ఇటీవల అటవీశాఖ అనుమతులు లభించాయి. గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాం. దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను రూ.2 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టాం. వర్షాలు లేకుండా ఉంటే నెల రోజుల్లో ఫార్మేషన్ పూర్తి చేస్తాం. మరో ఆరునెలలలోపు ఈ రోడ్డు అప్గ్రెడేషన్ కూడా పూర్తిచేస్తాం. ఇది పూర్తయితే రెండు జిల్లాల్లో గల 13 మండలాల్లో గల 30 గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. – రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ పీఓ -
Photo Feature: మన్యం అందం.. ద్విగుణీకృతం
కవుల వర్ణనలో కనిపించే అందాలెన్నో మన్యంలో కనువిందు చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలు సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలకు తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రకృతి పచ్చని తివాచీ పరిచిందా అన్నట్లు అబ్బురపరిచే పొలాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సీలేరు జలాశయం వ్యూ పాయింట్, గుంటవాడ డ్యాం, సీలేరు సమీపంలోని తురాయి జలపాతం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, గుర్రాయి, ఎగ కంఠవరంలోని అక్కాచెల్లెల జలపాతాలు, కుంబిడిసింగి మార్గంలో జలపాతం అందాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. అరమ, సొవ్వ, సాగర, కొర్రా తదితర ప్రాంతాలు పచ్చదనంతో ముచ్చటగొల్పుతున్నాయి. కొండ ప్రాంత అందాలకు ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. – సీలేరు, జి.మాడుగుల, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గోదావరి వరదలపై మంత్రులు, అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణు గోపాలకృష్ణ ఏరియల్ సర్వే చేపట్టారు. చదవండి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మందులు, ఆహార సరఫరా తాగునీరు,పాలు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్పురం, దేవీపట్నం మండలాల్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులను మంత్రులు సమీక్షించారు. -
ఇలా విని... అలా నియామకం
సాక్షి, పాడేరు: గిరిజనుల సమస్యల పరిష్కారంలో ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తన పరిధిలో వాటికి ఆగమేఘాల మీద పరిష్కారం చూపుతూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం వేర్లమామిడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం పాడేరు కలెక్టరేట్కు తరలివచ్చారు. వీరంతా అక్కడ ఉండటాన్ని పీవో గమనించి పిలిచి ఎందుకు వచ్చారని అడిగారు. ఇటీవల తమ ఉపాధ్యాయుడిని చింతపల్లి మండలం ఉమరాసగొంది పాఠశాలకు బదిలీ చేశారని వాపోయారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగం అధికారులకు ఫోన్ చేసి ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. అయితే అదే రోజు సాయంత్రం పాఠశాలకు తాత్కాలిక ఉపాధ్యాయినిగా ఎం.రాజేశ్వరిని నియమిస్తూ పీవో ఆదేశాలు జారీ చేశారు. కొక్కిరాపల్లి ఆశ్రమ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆమెను బుధవారం విధుల్లోకి చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించిన ఐటీడీఏ పీవోకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలి ఏజెన్సీలో చేపట్టిన నిర్మాణపు పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీ, డిజిటల్ లైబ్రరీ భవనాలు, మిషన్ కనెక్ట్ పాడేరు, రెండో దశ నాడు–నేడు నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించి బిల్లులు సమర్పిస్తే త్వరితగతిన చెల్లిస్తామన్నారు. 58 గ్రావిటీ తాగునీటి పథకాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడూ పనులను పర్యవేక్షించాలన్నారు. కొత్త జిల్లాలో ప్రభుత్వ అంచనాల మేరకు పని చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఈఈలు డీవీఆర్ఎం రాజు, కె.వేణుగోపాల్, పంచాయతీరాజ్ ఈఈ కె.లావణ్యకుమార్, గృహ నిర్మాణ శాఖ ఈఈ రఘుభూషణరావు పాల్గొన్నారు. హెచ్ఎన్టీసీల అభివృద్ధికి ప్రణాళికలపై ఆదేశం ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవన విభాగాల(హెచ్ఎన్టీసీ) అభివృద్ధికి సమగ్రమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశించారు. తన కార్యాలయంలో చింతపల్లి, కొత్తవలస హెచ్ఎన్టీసీల అభివృద్ధిపై ఉద్యానవన, డ్వామా అధికారులతో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలోని అగ్రి టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. హెచ్ఎన్టీసీల్లో పండ్ల, పూలమొక్కలు, మెడిసిన్ ప్లాంట్ల నర్సరీలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీటి ని పర్యాటకులు, స్థానిక గిరిజన రైతులకు సరఫరా చేస్తా మన్నారు. ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ ఎన్.రమేష్రామన్, పీహెచ్వో అశోక్, డ్వామా ఏపీడీ రామారావు, ఉద్యానవన శాస్త్రవేత్త బిందు పాల్గొన్నారు.