Birth anniversary
-
'భవతారిణి చివరి కోరిక ఇదే'.. జయంతి రోజున ఇళయ రాజా ఎమోషనల్
వెండితెరపై సంగీత విద్వాంసుడిగా ఇళయరాజా (Ilayaraja) గొప్ప పేరు సాధించారు. 1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో 1500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అంతే కాదు దాదాపు 7 వేలకు పైగా పాటలు రాసిన ఘనత ఆయనదే. ఇప్పటికీ ఆయన సంగీతానికి ఫిదా అవ్వాల్సిందే. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమార్తె భవతారిణి సింగర్గా రాణించారు. తమిళంతో పాటు తెలుగు చిత్రాలకు సైతం తన గాత్రం అందించారు. అయితే గతేడాదిలో ఆమె క్యాన్సర్తో కన్నుమూశారు.అయితే ఈ ఏడాది భవతారిణి (Bhavatharini) జయంతి సందర్భంగా ఆమె తండ్రి ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు. ఆల్-గర్ల్స్ ఆర్కెస్ట్రా పేరుతో ఈవెంట్ను నిర్వహించాలన్నది తన కుమార్తె చివరి కోరిక అని ఇళయ రాజా వెల్లడించారు. తాను మరణించే ముందు తనను చివరి కోరిక కోరిందని ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి ఇళయరాజాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కుమారుడు కార్తీక్ రాజా, సోదరుడు గంగై అమరెన్, దర్శకుడు వెంకట్ ప్రభు కూడా హాజరయ్యారు. తన జయంతి రోజు ఫిబ్రవరి 12న స్మరించుకోవడానికి ఒక ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తానని కూడా ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడుతూ.. "బాలికలతో ఒక పెద్ద ఆర్కెస్ట్రాను ప్రారంభించాలనుకుంటున్నానని భవతారిణి నాకు చెప్పింది. అదే ఆమె చివరి కోరిక కూడా. రెండు రోజుల క్రితమే నేను మలేషియాలో ఉన్నప్పుడు నా ముందు ప్రదర్శన ఇచ్చిన యువతులతో కూడిన అనేక బృందాలను కలిశాను. వారిని చూసినప్పుడు నాకు భవతారిణి చివరి కోరిక గుర్తుకు వచ్చింది. అందుకే తన పేరుతో ఒక ఆర్కెస్ట్రాను ప్రారంభించబోతున్నా. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు ఆర్కెస్ట్రాలో భాగమవుతారు" వెల్లడించారు.అనంతరం మాట్లాడుతూ.." ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సరైన సమయంలోనే ఈ విషయంపై ప్రకటన చేస్తాను. యువతులు ఆర్కెస్ట్రాలో భాగం కావడానికి నమోదు చేసుకుని ఆడిషన్ ఇవ్వవచ్చు. ఆర్కెస్ట్రా భవతారి వారసత్వాన్ని నిలబెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహాన్ని వ్యాపింపజేయాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకట్ ప్రభు, భవతారిణి అన్నయ్య కార్తీక్ రాజా తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రభు భవతారిణిని గుర్తు చేసుకున్నారు. అప్పడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నా.. పుట్టినరోజు శుభాకాంక్షలు తంగచి అంటూ ఎమోషనల్ నోట్ రాశారు. కాగా.. జాతీయ అవార్డు గెలుచుకున్న నేపథ్య గాయని, స్వరకర్త భవతారిణి . ఆమె తమిళ చిత్రం భారతిలోని మయిల్ పోలా పొన్ను ఒన్ను పాట ద్వారా ఫేమ్ పొందింది. క్యాన్సర్తో పోరాడిన తర్వాత భవతారిణి జనవరి 25, 2024న 47 ఏళ్ల వయసులోనే మరణించింది. భవతారిణికి ఇద్దరు సోదరులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా ఉన్నారు. Can’t believe it’s one year already 💔 💔 💔 happy bday thangachi #bhavatharini https://t.co/YSBPUWPQlE— venkat prabhu (@vp_offl) February 12, 2025 -
Punjab Kesari Lala Lajpat Rai స్వతంత్ర సంగ్రామ సింహం
లాలా లజపతిరాయ్ స్వతంత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వదిలిన అమర జీవి. మొదట్లో దయానంద సరస్వతి ఏర్పాటుచేసిన ఆర్య సమాజ్ భావాల పట్ల ఆకర్షితులై అందులో చేరి సమాజ సేవ చేశారు. ఆయన మీద ఇటాలియన్ విప్లవకారుడైన జోసెఫ్ మ్యాజినీ ప్రభావం కూడా ఉంది. న్యాయవాద వృత్తిని విడిచి స్వాతంత్య్ర పోరాటంపై దృష్టి సారించారు. ఒకపక్క స్వాతంత్య్రోద్యమంలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా గాంధీ ‘హరిజన సేవక్ సంఘ్’ బ్యానర్ కింద పని ప్రారంభించారు. ప్రపంచంలోని ఇతర ముఖ్యమైన ఉద్యమాల మాదిరిగానే ఈ సామాజిక సంస్కరణ కూడా జాతీయ ఆమోదం కోసం గొప్ప పోరాటం చేయాల్సి ఉందని ఆయన ప్రకటించారు. లాలాజీ సేకరించిన కరువు నిధిలో కొంత భాగాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించారు. కొన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా ఈ ఫండ్ నుండి నిధులు అందు కున్నాయి. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించారు.భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి 1928లో బ్రిటన్ నుంచి వచ్చిన సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పంజాబ్లోని లాహోర్లో జరిగిన ఆందోళనకు లజపతిరాయ్ నాయకత్వం వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఈ ‘పంజాబ్ కేసరి’కి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఆ సందర్భంగా ‘ఈ రోజు నా మీద పడిన దెబ్బలు, బ్రిటిష్ సామ్రాజ్య వాదం శవపేటికకు వేసిన చివరి మేకులు’ అని బ్రిటిష్ పోలీసులను హెచ్చరించారు. ఆ దెబ్బలతోనే చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి స్వాతంత్య్రోద్యమం తీవ్రమవ్వడానికి దారితీసింది.– డా. ఎ. శంకర్, రాజనీతిశాస్త్ర ఉపన్యాసకులు, హైదరాబాద్(నేడు లాలా లజపతిరాయ్ జయంతి) -
దేశాన్ని అణుశక్తిగా మార్చిన మేధ
దేశభక్తి, సంస్కృతీ సంప్ర దాయాల పట్ల గౌరవం, సంగీత సాహిత్యాల పట్ల ప్రేమ, సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచా లన్న తపన కలిగిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న. ఆయన 1925 జనవరి 28న సంప్రదాయ మైసూర్ అయ్యంగార్ కుటుంబంలో కర్ణాటకలో పుట్టారు. సంగీతంపై ఉన్న అభిమానంతో సంగీత కళాశాలలో చేరాలనుకున్న రాజా రామన్న, సర్సి.వి. రామన్ పరిచయ ప్రభావం వల్ల వైజ్ఞానిక రంగంలోకి ప్రవేశించారు. ఆరేళ్ళ వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించారు.పన్నెండో ఏట మైసూర్ మహారాజు ఎదుట పియానో వాయించి ప్రశంసలందుకున్నారు. 1949లో టాటా గ్రూపు– స్కాలర్షిప్పై లండన్ వెళ్ళి, అక్కడి ‘కింగ్స్ కాలేజి’ నుండి ‘న్యూక్లియర్ ఫిజిక్స్’లో డాక్టరేట్ తీసుకుని స్వదేశం తిరిగి వచ్చారు. డా‘‘ హోమీ భాభా ఆధ్వర్యంలో పని చేయడానికి 1952లో– టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో చేరారు. బొంబాయి, ట్రాంబేలోని ఆ సంస్థ పేరు తరువాత కాలంలో భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ: బార్క్)గా మారింది. 1960లలో అణ్వాయుధా లను తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయ డంలో సాంకేతిక పరిశోధన చేపట్టారు. అప్పుడే మన దేశంలో అణుబాంబుకు రూపకల్పన జరిగింది. 1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు–అణుపరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ కొనసాగింది. ఆ ప్రాజెక్ట్లో పనిచేసే 75 మంది శాస్త్రవేత్తల బృందానికి రాజా రామన్న నాయకత్వం వహించారు. బార్క్లో ‘పూర్ణిమ’ అనే పేరుతో ప్లుటోనియం ఇంధనంతో నడిచే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్థాపించడానికి కార కులయ్యారు. 1974 మే నెలలో అతి రహస్యంగా అణు పరీక్షను నిర్వహించారు. 1978లో అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, డా‘‘ రామ న్నను బార్క్ నుండి తీసు కొచ్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించారు. రక్షణ పరిశోధన కార్యదర్శిగా, డీఆర్డీఓ డైరెక్టర్ జన రల్గా కూడా నియమించారు. అప్పుడే ఒక విచి త్రమైన సంఘటన జరి గింది. ఈయన నేపథ్యం తెలుసుకుని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అణుబాంబుల తయారీలో రామన్న సహాయం అర్థించాడు. పరిస్థితి విషమించేట్టుగా ఉందను కుని, దేశభక్తుడయిన రాజా రామన్న చెప్పా పెట్ట కుండా ఇండియా విమానం పట్టుకుని హుటా హుటిన తిరిగొచ్చారు. నిబద్ధత గల దేశభక్తుల చర్యలు అలా ఉంటాయి. వారు వేటికీ లొంగరు.చదవండి: ఈశ్వరాజ్ఞ హోమీ జె. భాభా అకాల మరణం తర్వాత, ఆయన నిర్దేశించిన మార్గంలోనే రాజా రామన్న పరిశోధనలు కొనసాగించి, ఆణుశక్తి పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. ఆయన న్యూక్లి యర్ ఫిషన్ రంగంలో కూడా కృషి చేశారు. బరువైన కేంద్రకాలను విభజించి, శక్తిమంతమైన న్యూక్లియన్ రేడియేషన్ను ఉత్పత్తి చేయవచ్చని– ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం అణుపరిశోధనా రంగానికి, తద్వారా దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది. 1980లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా తిరిగి రావడంతో అణు కార్యక్రమం ఊపందుకుంది. ఆమె రామన్నను మళ్ళీ బార్క్కు డైరెక్టర్గా నియమించారు. పైగా అణుపరీక్షల కోసం అయనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వంలో రామన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్లతో పాటు అనేక పురస్కారాలు, పతకాలు, డాక్ట రేట్లు పొందారు.రాజా రామన్న శత జయంతి (28 జనవరి 1925 – 28 జనవరి 2025) సందర్భంలో మనం ఉన్నాం. మంచి మనిషిగా, అత్యున్నత స్థాయికి ఎదిగిన వైజ్ఞానికుడిగా, పియానో వాద్యకారుడిగా – ఎవరికి తోచిన విధంగా వారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు డా. రాజా రామన్న శతజయంతి)-డా. దేవరాజు మహారాజు -
బోస్ పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నివాళులర్పించారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయన నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2025 -
Jaya B: దర్శకురాలిగా టాలీవుడ్లో తనదైన ముద్ర
టాలీవుడ్లో దర్శకత్వ శాఖలో పని చేసే మహిళలు చాలా తక్కువ మందే ఉన్నారు. తమదైన టాలెంట్తో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన మహిళలను వెళ్లపై లెక్కించొచ్చు. అలాంటి వారిలో బి.జయ ఒకరు. జర్నలిస్ట్గా కెరీర్ని ప్రారంభించి.. దర్శకురాలిగా మారి చంటిగాడు,గుండమ్మగారి మనవడు, లవ్లీ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బి. జయ జయంతి నేడు(జనవరి 11). ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు బి.జయ(1964). చెన్నయ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.(ఇంగ్లీష్ లిటరేచర్), జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. అంతేకాదు, అన్నామలై విశ్వవిదాలయంలో ఎం.ఎ.(సైకాలజీ) అభ్యసించారు. చదువు పూర్తి కాగానే సినిమా జర్నలిస్ట్గా తన కెరీర్ని ప్రారంభించారు. పత్రికా రంగంలో కొన్నేళ్లపాటు కొనసాగిన తర్వాత సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ శాఖలో చేరి కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు.అదే సమయంలో ఫిల్మ్ జర్నలిస్ట్గా, పి.ఆర్.ఓ.గా సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్న బి.ఎ.రాజును వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ పూర్తి అంకితభావంతో తమ బాధ్యతలను నిర్వర్తించేవారు.సినిమా రంగంతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అనుబంధం, దర్శకత్వంపై తనకు ఉన్న ప్యాషన్ కారణంగా దర్శకత్వం వైపు జయ దృష్టి సారించారు. దానికి భర్త బి.ఎ.రాజు కూడా పూర్తి సహకారం అందించడంతో సూపర్హిట్ ఫ్రెండ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా ‘ప్రేమలో పావని కళ్యాణ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆ తర్వాత ‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు జయ. ఈ సినిమా 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలను రూపొందించి భానుమతి, విజయనిర్మల తర్వాత అంతటి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు బి.జయ.బి.ఎ.రాజు, బి.జయ దంపతులకు సినిమా రంగంతో విశేష అనుబంధం ఉండేది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరికీ వీరంటే ప్రత్యేక అభిమానం. ఇక తోటి జర్నలిస్టులతో ఈ దంపతులకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవించేవారు. ఆ కారణంగానే సినిమా జర్నలిస్టులందరూ వారిని ఆత్మీయులుగా భావించేవారు. 2018లో బి.జయ మరణం అందర్నీ కలచివేసింది. తమ కుటుంబ సభ్యురాలు దూరమైందని సినీ పాత్రికేయులంతా భావించారు. బి.జయతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్టులంతా ఘన నివాళులు అర్పిస్తున్నారు. -
అంధుల అక్షర శిల్పి
అంధులు సైతం సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందేనన్న ఆశయంతో వారి విద్యార్జన కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన అక్షర శిల్పి లూయీ బ్రెయిలీ. ఫ్రాన్స్లో ఒక మారుమూల గ్రామమైన కూప్వ్రేలో సైమన్, మోనిక్ దంపతులకు 1809 జనవరి 4న ఆయన జన్మించాడు. నలుగురు సంతానంలో చివరివాడు బ్రెయిలీ. ఆయన తల్లిదండ్రులు వృత్తి రీత్యా చర్మకారులు. లూయీ తన తండ్రితో కలిసి ఒక రోజు గుర్రపు జీన్లు తయారు చేసే దుకాణానికి వెళ్లాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుకరిస్తూ ఉండగా చువ్వ ఎగిరి వచ్చి లూయీ కంటిలో గుచ్చుకుంది. పేదరికం కారణంగా మంచి వైద్యం అందించలేక పోవటంతో కంటిచూపు మొత్తం పోయింది. తర్వాత కొంతకాలానికే ఇన్ఫెక్షన్ ఎక్కువై రెండవ కంటిచూపు కూడా పోయింది. అప్పుడు పిల్లాడి వయసు ఐదేళ్లు. అయితే అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు తమ పెద్ద పిల్లలతో పాటుగా లూయీని గ్రామంలో ఉన్న పాఠశాలకు పంపించారు. అక్కడ కొడుకు కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తండ్రి... చెక్కపై మేకులను అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా అక్షర జ్ఞానం కలిగించాడు. అతడిలోని చదువుకోవాలనే పట్టుదలను, తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు.1821లో చార్లెస్ బార్బియర్ అనే సైన్యాధికారి తన సైనికులకు 12 చుక్కలతో నిగూఢ లిపిలో శిక్షణ ఇచ్చేవాడు. దాన్ని లూయీ అభ్యసించాడు. దానితో సంతృప్తి చెందకుండా ఆ లిపిపై పరిశోధనలు ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల కృషి అనంతరం 1832లో సరళమైన విధానంలో చుక్కల లిపిని కనుగొన్నాడు. దానికి ఆయన పేరుమీదనే తర్వాత బ్రెయిలీ లిపి అని పేరొచ్చింది. ఇది ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా ఆనాడే రూపొందిందంటే ఆయన ముందుచూపు ఎంతో అర్థమవుతుంది. బ్రెయిలీని క్షయ మహమ్మారి పట్టి పీడించటంతో నాలుగు పదుల వయసులోనే 1852 జనవరి 6న కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎంతోమంది అంధ వికలాంగులను విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, పత్రికాధిపతులుగా, సంగీత కళాకారులుగా, చిత్ర కారులుగా అనేక రంగాల్లో బ్రెయిలీ లిపితో అగ్రభాగాన నిలిచేట్లు చేసిన లూయీ బ్రెయిలీ అంధుల అక్షర ప్రదాతగా ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటారు.– పి. రాజశేఖర్ ‘ ఆలిండియా జనరల్ సెక్రెటరీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (నేడు లూయీ బ్రెయిలీ జయంతి; జనవరి 6న వర్ధంతి) -
Savitribai Phule Birth Anniversary : మహిళా చైతన్య దీప్తి
మన దేశంలో ఆడపిల్లల చదువు, వారి అభ్యున్నతి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగాగుర్తుకు వచ్చేది సావిత్రిబాయి ఫూలే కృషేనని చెప్పవచ్చు. మహిళల అభివృద్ధికి పాటు పడిన మొట్ట మొదటి బహుజన మహిళ ఆమె. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు. మహారాష్ట్ర, సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న ఒక సామాన్య రైతు కుటుంబంలో సావిత్రిబాయి (Savitribai Phules) మహిళా చైతన్య దీప్తి జన్మించారు. నిరక్షరాస్య అమాయక బాల్యంలో జీవిస్తున్న ఆమెకు 9వ యేటనే 12 సంవత్సరాల జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. సావిత్రిబాయి, భర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలై, అహ్మద్నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. అనంతరం బాలికా విద్య ఉద్య మానికి పునాది వేశారు.విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన సావిత్రిబాయి 1848లో భర్తతో కలిసి బాలికల కోసం పుణెలో మొట్ట మొదటి పాఠశాలను నెలకొల్పి, చదువు చెప్పటం ప్రారంభించారు. మహిళా హక్కులే మానవ హక్కులని నినదించి అనేక సామాజిక సమస్యలపై కూడా అలుపెరుగని పోరాటం చేశారు. స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో ‘మహిళా సేవా మండల్‘ అనే మహిళా సంఘాన్ని స్థాపించారు. లింగ వివక్ష, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. సామాజిక అణిచివేతలను, మూఢత్వాన్ని పారద్రోలి సత్యాన్ని శోధించడానికి 1873లో భర్తతో కలిసి సత్య శోధక సమాజాన్ని ప్రారంభించారు. భర్త మరణంతో అంతులేని దుఃఖసాగరంలో ఉండి కూడా ఆయన చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. పుణె నగరాన్ని అతలాకుతలం చేసిన తీవ్ర కరువులో ప్లేగు వ్యాధి గ్రస్తులకు సావిత్రిబాయి అసమాన సేవలు అందించారు. చివరకు ఆమె కూడా అదే వ్యాధి బారినపడి 1897 మార్చి10న తుది శ్వాస విడిచారు. 1997లో భారత ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పుణె విశ్వవిద్యాలయానికి ఆమె పేరే పెట్టారు. సావిత్రిబాయి ఫూలే అక్షర ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఆమె జయంతి రోజున గతేడాదే ‘ధర్మ టీచర్ యూనియన్’ ఏర్పాటైంది. సావిత్రి బాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి. ఇదే ఆమెకు ఇవ్వగలిగిన ఘన నివాళి.– సంపతి రమేశ్ మహారాజ్ ‘ ధర్మ టీచర్ యూనియన్ తెలం -
YS Jagan: సావిత్రీబాయి ఫూలేకి వైఎస్ జగన్ ఘన నివాళి
-
విలన్ని కూడా ఇష్టపడేలా చేశాడు.. ఈయన గొంతుకే సెపరేట్ ఫ్యాన్స్ (ఫొటోలు)
-
తెలుగు తెరపై చెరిగిపోని జ్ఞాపకం మహానటి 'సావిత్రి' (ఫోటోలు)
-
కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!
ఆవంత్స సోమసుందర్ స్వీయ చరిత్ర ‘కలలు–కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో విశిష్టమైన రచన. ఎనిమిది దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంతో మమేకమైన ఒక మహాకవి మనసుతో వ్యక్తీకరిం చిన అరుదైన ఆత్మకథ. స్వాతంత్య్రోద్యమ పూర్వం నాటి పరిస్థి తులు మొదలుకొని ఆధునిక కాలంలో వెల్లువెత్తిన అనేక అభ్యుదయ ఉద్యమాలకు సోమసుందర్ ప్రత్యక్ష సాక్షి. అందుకేనేమో వజ్రాయుధ కవిగానే కాక విలక్షణమైన విమర్శకుడిగా, ‘కళాకేళి’ పత్రికా స్థాపకునిగా, కమ్యూనిస్టు ఉద్యమశీలిగా, అన్నింటినీ మించి నిరంతర స్వాప్నికుడిగా కలకాలం జీవించారు.కవులు జీవిత చరిత్రలు రాసి మెప్పించడం అరుదు. తెలుగులో ఆ సంఖ్య మరీ తక్కువ. అలాంటిది రెండు భాగాలుగా ఆత్మకథను రాసి... ముఖ్యంగా మొదటి భాగంలో అసాధారణ రచనా కౌశలాన్ని చూపిన ఘనత సోమసుందర్కే చెల్లుతుంది. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 2005లో ‘కళాకేళి’ తరపున ప్రచురించిన ‘కలలు – కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో నిస్సందేహంగా ఒక అద్భుతమైన అక్షర కళా శిల్పం.‘నాకంటూ ఒక జీవితం ఏర్పడ్డాక... మొదటి జ్ఞాపకం మా అమ్మ... మలి జ్ఞాపకమూ మా అమ్మే. అందుకే మాతృవందనంతోనే దీన్ని ప్రారంభిస్తున్నాను. మా అమ్మే నిరంతర స్మృతి వీచిక... మా అమ్మ నన్ను విడిచి వెళ్ళకముందే నేను మా అమ్మను విడిచి వెళ్ళిపోయాను; దూరంగా... అనంతంగా... సుదీర్ఘమైన ఎడబాటుగా. బాట మారింది. ఉనికి మారింది. ఆశ్రయం మారింది. అమ్మా మారింది...’1924 నవంబరు 18న శంఖవరంలో పుట్టినప్పటికీ, బాల్యంలోనే దత్తునిగా పిఠాపురానికి వలస వచ్చిన పసి జ్ఞాపకాల్ని స్పృశిస్తూ ఆత్మకథలో సోమసుందర్ రాసిన ఆరంభ వాక్యాలు ఇవి. నాలుగేళ్ళ ప్రాయంలోనే తల్లి ఎడబాటుకు లోనైన పసి హృదయం బహుశా ఆనాడే కార్చిన కన్నీటి ధారల్ని కవితా పంక్తులుగా మార్చే ప్రక్రియను అభ్యసించి ఉంటుంది. భవిష్యత్తులో శ్రామిక వర్గం తరఫున ప్రాతి నిధ్యం వహించే బలమైన వజ్రా యుధ కలం ఆవిర్భావానికి అంకురార్పణ ఆనాడే జరిగిందేమో!మూడొందల పుటల ‘కలలు–కన్నీళ్ళు’ ఆత్మకథ అంతా ఒకెత్తయితే, దీనికి సో.సు. రాసిన ఐదు పుటల ముందుమాట ఒకటీ ఒకెత్తు. రూసో మహాశయుడి మాట, ‘రెక్కల చేప కథ విప్పింది’అంటూ ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ కవులు, రచయి తలు, మేధావుల ఆత్మ కథలను స్థూలంగా పాఠకుడికి పరిచయం చేశారు. అలా చేస్తూనే స్వీయచరిత్ర రాయటం ఎంత కష్టమో వివరించారు. గాంధీ, నెహ్రూ వంటి నేతలు మొదలు వర్జీనియా ఉల్ఫ్, జీన్పాల్ సార్త్రే వంటి పాశ్చాత్య మేధావుల స్వీయ చరిత్రల్ని గురించి చెబుతారు. అవి కాక, ఏనుగుల వీరాస్వామి, కందుకూరి వీరేశలింగం, చలం వంటి వారి ఆత్మకథల గురించి కూడా తడుముతారు. ఇన్నింటిలోకీ సో.సు.ను ప్రభావితం చేసింది మాత్రం డామ్ మోరీస్ రాసిన ‘మై సన్స్ ఫాదర్’ అనే ఆత్మకథ. సోమసుందర్ అనితర సాధ్యమైన అధ్యయనశీలతకి ఈ మున్నుడే ఒక ప్రతీక. ముందు మాటకి ముగింపుగా సో.సు, ‘నా చేతిలోని లేఖినిని మృత్యువు తప్ప వేరెవ్వరూ అపహరించలేరని’ అంటారు. అలా అన్న మాటల్ని నిలుపుకొని 2016 ఆగష్టు 16న చివరి శ్వాస వరకూ విస్తృతమైన సారస్వత సేవ కావించిన అరుదైన ప్రజాకవి సోమసుందర్.అల్లూరి సీతారామరాజుకి ఆశ్రయం ఇచ్చిన కుటుంబ నేపథ్యం నుండీ అల్లారు ముద్దుగా సంస్కృత శ్లోకాలు, సంగీత కచేరీలు, నాటకాలు, సినిమాలు, కౌమార ప్రేమ కలాపాలు... ఇలా ఒకటేమిటి ఎన్నో వర్ణాలు మనకి సో.సు. జీవితంలో కనబడతాయి. హైస్కూల్ విద్యార్థిగా స్టూడెంట్ యూనియన్ సభలకని కోల్ కతా వెళ్ళినప్పుడు హౌరా బ్రిడ్జి మీద చూసిన జీవచ్ఛవానికి కలత చెంది నవ యువకుడు పట్టిన కలం, కట్టిన కవిత తెలుగు నేలమీద దశాబ్దాల పాటు వెల్లువలా సాగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నినాదమై రగిలింది. ‘హే నిజాం పాదుషా, ఖబడ్దార్ !’ అని హెచ్చరించింది. నిషేధానికి గురై చరిత్ర సృష్టించింది.చదవండి: గల్ఫ్ వలస జీవిత సారం‘కవిత్వమూ, కమ్యూనిజమూ తప్ప మరే ధ్యాసా నాకు లేదు’ అని తన ఆత్మకథలో ప్రకటించుకున్న సో.సు. జీవితాన్ని ఆ రెంటికే అంకితం చేశారు. సుమారు ముప్పై మూడు భాగాల్లో ఎన్నెన్నో అపురూప విషయాల్ని నమోదు చేశారు. పిఠాపురం సంస్థానంలో సాహిత్య వాతావరణం మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన అభ్యుదయ కవిత్వోద్యమం వరకూ ఎంతో హృద్యంగా చెప్పారు. హైదరాబాదు కవి మిత్రుల నుండీ మద్రాసు మేధాసాంస్కృతిక స్రవంతి దాక, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ వంటి వారితో అనుభవాలు, మిత్రులతో చేసిన ఉత్తర భారత యాత్రా విశేషాలు... ఒక్కటేమిటి తన జీవన చిత్రంలోని గాఢమైన రంగులన్నిటినీ ఆత్మకథ రూపంలో పాఠక లోకానికి అందించారు సో.సు. అయితే, ఎందుకనో తెలీదు కానీ సోమసుందర్ స్వీయచరిత్రకి రావాల్సిన గుర్తింపు సాహితీ లోకంలో సైతం రాలేదు.చదవండి: వెనక్కి నడవమంటున్నారా?విశాలమైన పచ్చిక బయళ్ళ పైన పిండార బోసినట్లు ‘నా జీవితంలో మంచిపనులు ఎన్ని చేశానో అంతకు మించిన చెడ్డ పనులు చేశాను. అందుకే మంచి పనులు సవిస్తరంగా ఏకరువు పెట్టలేదు. చెడ్డపనులు మచ్చుకు కొన్నే చెప్పకుండా విడిచిపెట్టనూలేదు. అసలు జీవితం అంటే ఏమిటి? చెడ్డ పనులు రహస్యంగా చేసు కుంటూ పోవడం. మంచి పనులు తక్కువే అయినా బహి రంగంగా చేయడం...’ అని చెప్పుకున్న సోమసుందర్ ధైర్యాన్ని, పారదర్శకతను చదివి అంగీకరించి, స్వీకరించేందుకు కూడా కొంత సాహసం కావాలేమో అనిపిస్తుంది. బహుశా అందుకనే వృద్ధాప్యంలో డిక్టేట్ చేసి రాయించిన సో.సు. స్వీయచరిత్ర రెండో భాగం ‘పూలు, ముళ్ళు’ అంతగా కదిలించదు. ఏదో భారంగా రాసినట్టు సాగుతుంది. ఇదంతా ఒకెత్తయితే ఏకకాలంలో కవిగా, కార్య కర్తగా కూడా మసిలిన ఆయన కార్యదీక్ష ఒక్కటీ ఒకెత్తు. స్వాతంత్య్రం వచ్చే నాటికి జైల్లో శిక్ష అనుభవిస్తూ కూడా ఈ దేశంలో సోషలిజం కోసం నిబద్ధతతో కృషి చేసిన సో.సు. తర్వాత కాలంలో పూర్తిస్థాయి సాహితీవేత్తగా మారారు.ప్రజా చైతన్యమే లక్ష్యంగా సకల సాహితీ ప్రక్రియలను ప్రయోగించారు. లిటరరీ ట్రస్ట్ స్థాపించి ఎందరో యువకవుల్నీ, రచయితల్నీ పురస్కారాలతో ప్రోత్సహించారు. శతాధిక గ్రంథాల్ని రచించి తెలుగులో ఎన్నదగిన అభ్యుదయ దిక్సూచిగా భాసించారు. ఆయన స్పూర్తిని అందుకుని కొనసాగించగలగడమే మహాకవి ఆవంత్స సోమసుందర్కు మనం ఇచ్చే అర్థవంతమైన ఆత్మీయ నివాళి.- గౌరవ్ సామాజిక కార్యకర్త (నేడు ఆవంత్స సోమసుందర్ శతజయంతి) -
జన్ జాతీయ గౌరవ్ దివస్.. విస్మృత పోరాట యోధుడి జయంతి
గత రెండేళ్ల క్రితం నుంచి నవంబర్ 15 నాడు బిర్సా ముండా జయంతిని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’గా పాటిస్తున్నాం. ఇన్నేళ్లకైనా విస్మృత పోరాట యోధుణ్ణి స్మరించుకోవడం ఆనందదాయకం. ఆదివాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా. నాటి బెంగాల్ ప్రావిన్స్లోని బిహార్ (నేటి జార్ఖండ్)లో ఆదివాసీల రాజ్యాన్ని తేవటానికి సమరశంఖం పూరించాడు. ఆయన తన ఆదివాసీ ప్రజలకు ‘రాణి రాజ్యానికి అంతం పలుకుదాం–మన రాజ్యాన్ని స్థాపిద్దాం’ అనే నినాదం ఇచ్చాడు. ఈ నినాదం ప్రజలను తిరుగుబాటు వైపుకు నడిపించింది.ముండా తెగకు చెందిన సుగుణ, కార్మిహాలు దంపతులకు 1875 నవంబర్ 15న ఛోటానాగపూర్ సమీప చెల్కడ ప్రాంతంలోని బాబా గ్రామంలో ఆయన జన్మించాడు. ప్రాథమిక విద్యను కొద్దికాలం అభ్యసించిన తర్వాత ఒక జర్మన్ మిషనరీ స్కూల్లో చేరాడు. ఆ పాఠశాలలో చేరాలంటే క్రైస్తవుడై ఉండాలన్న నిబంధన ఉండడం వల్ల ఆయన మత మార్పిడి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లలోనే స్కూల్ నుంచి బయటికి వచ్చి క్రైస్తవాన్ని త్యజించి తన సొంత ఆదివాసీ ఆచారాలనే ఆచరించడం ప్రారంభించాడు. ఆదివాసీలందరినీ స్థానిక విశ్వాసాలనే అనుసరించమని బోధించాడు. తాను తన జాతీయులను ఉద్ధరించడానికి అవతరించినట్లు ప్రకటించాడు. ఆయన బోధనలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ముండా ప్రజలు ఆయన్ని దేవునిగా భావించి ‘భగవాన్’ అని పిలవడం ప్రారంభించారు. అయితే బిర్సా ముండాను అనుసరించనివారు ఊచకోతకు గురవుతారనే గాలివార్త ప్రచారంలోకి రావడంతో ఆయన్ని బ్రిటిష్వాళ్లు ఛోటానాగపూర్ ప్రాంతంలో 1895 ఆగస్టులో అరెస్ట్ చేసి రెండేళ్లకు పైగా జైల్లో ఉంచారు. దీంతో ఆయన విడుదల కోరుతూ జాతీయోద్యమకారులు పెద్దఎత్తున బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం ఎట్టకేలకు 1897 నవంబర్లో బిర్సాని విడుదల చేసింది.ఆ రోజుల్లో బ్రిటిష్వాళ్లు, వాళ్ల తాబేదార్లు ఆదివాసీల సాగు భూములపై పన్నులు విధిస్తూ... వాటిని కట్టకపోతే ఆ భూములను జమీందారీ భూములుగా మార్చేవారు. దీంతో చాలా మంది ప్రజలు అస్సాంలోని తేయాకు తోటల్లో కూలి పనుల కోసం వలస వెళ్లేవారు. దీన్ని గమనించిన బిర్సా... వన జీవులందరినీ సమావేశపరిచి, బ్రిటిష్వాళ్లకు కప్పాలు కట్టవద్దనీ, వాళ్లను తరిమి కొట్టాలనీ పిలుపునిచ్చాడు. అనుచరులతో కలిసి బాణాలు ధరించి 1899 డిసెంబర్లో భారీ ‘ఉల్’ గులాన్’ (తిరుగుబాటు ర్యాలీ) నిర్వహించాడు.చదవండి: ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?ఈ చర్యలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్ని 1900 ఫిబ్రవరి 3న బంధించి రాంచీ జైలుకు తరలించింది. కేసు విచారణలో ఉన్న కాలంలో జూన్ 9న జైల్లోనే ఆయన తుది శ్వాస విడిచాడు. చివరికి 1908లో బిటిష్ ప్రభుత్వం ఆదివాసీల భూములను ఆదివాసీలు కానివారికి బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ ‘ది ఛోటానాగపూర్ టెనెన్సీ యాక్ట్’ను తీసుకువచ్చింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితో ముండా, ఒరియాన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ (2024, నవంబర్ 15న బిర్సాముండా 150వ జయంతి ప్రారంభం) -
మౌలానా అబుల్ కలాం ఆజాద్కు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: భారతరత్న, డాక్టర్ మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా తన నివాళి ప్రకటించారు.స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు..స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/2OoYBxEPB4— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2024 తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అజాద్ జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రేగ మత్స్యలింగం, విశ్వేసరరాజు, విరూపాక్షి హాజరయ్యారు. -
వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అహ్మాదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. జాతీయ ఐక్యతా దినోత్సవంతోపాటు దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.‘‘దీపావళి పండగ.. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం వైట్హౌస్లో 600 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో దీపావళిని జరుపుకున్నారు. అనేక దేశాల్లో దీపావళి జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’ త్వరలో సాకారమవుతుంది. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్వహించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు త్వరలో లైన్ క్లియర్ అవుతుంది. ఈ ప్రతిపాదనకు ఈ ఏడాది ప్రారంభంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన సమర్పించనున్నాం.#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv— ANI (@ANI) October 31, 2024 మేం ప్రస్తుతం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశ వనరుల సరైన ఫలితాన్ని ఇస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించడంలో సాయపడుతుంది. భారతదేశం.. నేషన్ వన్ సివిల్ కోడ్, సెక్యులర్ సివిల్ కోడ్ కలిగి దేవంగా అవతరించనుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. దానిని శాశ్వతంగా పాతిపెట్టాం. రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేవారే ఎక్కువగా అవమానిస్తున్నారు’’ అని అన్నారు. -
మానవతకు ప్రతిరూపం
మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకా నందుడి బోధనలకు ప్రభావితమై హిందూ (ధర్మం) మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐర్లాండులో ఆమె 1867 అక్టోబర్ 28న జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్లో చేసిన ప్రసంగాలు మార్గ రెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె... వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ వచ్చింది. ఆమెకు వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేశారు. నివే దిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. ఇతరుల పట్ల దయతో మెలిగే ఆమె మంచి అభిరుచి గల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్ బజారులో పాఠశాలను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. 1899 మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగువ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించీ, ఆచార వ్యవహారాల గురించీ న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1906లో బెంగాల్కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్లో మరణించిన సిస్టర్ నివేదిత తలపెట్టిన పనులను విస్తరించడమే మనం ఆమెకు ఇవ్వగల నివాళి.– సాకి ‘ 99511 72002(నేడు సిస్టర్ నివేదిత జయంతి) -
#NimratKaur 30 ఏళ్ల కల నెరవేరింది : నటి నిమ్రత్ కౌర్ (ఫొటోలు)
-
చిరంజీవిని గుర్తు చేసుకున్న భార్య.. ఎమోషనల్ పోస్ట్!
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిరంజీవి సర్జా. నాలుగేళ్ల క్రితం ఆయన ఆకస్మిక మరణంతో శాండల్వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో ఆయన భార్య ఐదు నెలల గర్భవతి కావడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.అయితే ఇవాళ చిరంజీవి సర్జా జయంతి కావడంతో ఆయన భార్య మేఘన భర్తను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వే మార్గదర్శకమని భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. కాగా.. ఇటీవల ఆయన సోదరుడు ధృవ సర్జా నటించిన మార్టిన్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. విడుదల సమయంలో అన్నకు ప్రత్యేకంగా నివాళి అర్పించాడు.కాగా.. 2009లో సినిమారంగంలోకి ప్రవేశించిన స్టార్ హీరో చిరంజీవి సర్జా దాదాపు 22 చిత్రాల్లో నటించారు. అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా నటించిన చివరి చిత్రం 'రాజమార్తాండ'. అయితే ఊహించని విధంగా ఈ కన్నడ స్టార్ జూన్ 7, 2020న 39 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు కూడా సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆయన మరణం తర్వాత తమ్ముడు ధృవ సర్జా అన్న పాత్రకు డబ్బింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
కలాం జయంతి: నివాళులర్పించిన వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం శాస్త్రవేత్త, రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారని ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘అబ్దుల్ కలాం వినయం, ముందుచూపు, విజ్ఞానం, విద్య మీద ఉన్న అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. కలాం జీ వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని అన్నారు.Remembering Dr. A.P.J. Abdul Kalam Ji on his birthday! A scientist and a revered President his humility, vision, wisdom and unwavering dedication to education have left an indelible mark in the hearts of millions . Kalam Ji’s legacy continues to be a beacon of hope for humanity…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2024 చదవండి: మీరే కదా బాబూ.. లిక్కర్ మాఫియా సూత్రధారి, పాత్రధారి: వైఎస్ జగన్ -
ఆ మహాకవికి నా నివాళి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నవయుగ కవిచక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు ఆయన్ని స్మరించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. తన కవితల ద్వారా గుర్రం జాషువా మూఢాచారాలను ప్రశ్నించారని, దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా కావ్యాలు రాశారని అన్నారు . తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుంటాయన్న వైఎస్ జగన్.. ఆ మహాకవి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు అని ఎక్స్లో ఓ సందేశం ఉంచారు.అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారు. దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా ఆయన రాసిన ఎన్నో కావ్యాల్లో ``గబ్బిలం ``ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆ మహాకవి జయంతి సందర్భంగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2024 YSRCP కేంద్ర కార్యాలయంలో.. మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కొమ్మూరి కనకారావు, అడపా శేషు, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాలపై సాహిత్య ఉద్యమం ఆరంభించిన నవయుగ కవి చక్రవర్తిగా, అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవిగా తనదైన ముద్ర వేసుకున్న గుర్రం జాషువాను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. -
భారత విప్లవ ప్రతీక!
భారతదేశం గర్వించే వీర కిశోరం భగత్ సింగ్. నేటి పాకిస్తాన్లో ఉన్నపంజాబ్ రాష్ట్రంలో 1907 సెప్టెంబర్ 27న జన్మించాడు. చిన్నతనంలో తన బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ... పట్టుబడకుండా ఉండేందుకు విదేశాలలో ఉండేవాడు. ఆ సమయంలో కంటనీరు పెట్టుకొనే చిన్నమ్మను చూసి ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లే యులపై ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ఉండేవాడు.గాంధీ, నెహ్రుల సారథ్యంలో నడుస్తున్న స్వాతంత్రోద్యమంలో చిన్ననాటి నుండే చురుకుగా పాల్గొంటూ వస్తున్న భగత్ సింగ్కు స్వాతంత్య్రం యాచిస్తే రాదనీ, శాసిస్తేనే వస్తుందని గ్రహించాడు. రష్యా విప్లవ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, గాంధీ కోరిన స్వాతంత్య్రం అంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు రావడమేనని అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు సోషలిస్టు సమాజం నిర్మించాలని తలంచి తను పనిచేస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను, హిందు స్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోషియేషన్గా మార్చాడు.బ్రిటిష్ వాళ్లు సాగిస్తున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా నినదించే గొంతులు ఈ దేశంలో ఉన్నాయని తెలియచేసేందుకు కేంద్ర శాసనసభలో బాంబువేసి పారిపోకుండా ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లా ల’నే నినాదాలను చేశాడు భగత్ సింగ్. జలియన్ వాలాబాగ్, చౌరీచౌరా ఘటనలు భగత్ సింగ్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలిస్తే; సైమన్ కమిషన్ పర్యటన సమయంలో దెబ్బలు తిన్న కారణంగా లాలా లజపతిరాయ్ మరణించడం ప్రతీకారేచ్ఛను కలిగించింది.భగత్ సింగ్ను బ్రిటిష్వాళ్లు ఉరితీసే కొద్ది రోజుల ముందు ఆయన తండ్రి క్షమాభిక్ష కోసం బ్రిటిష్ వారికి ఉత్తరం రాశారు. తన మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదనే విశ్వాసం తనదనీ, అందువల్ల బ్రిటిష్ వాళ్లకు చేసిన అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలనీ కోరాడు భగత్. అదీ ఆ వీరుని దేశభక్తి! – జి. పవన్ కుమార్, బిజ్వార్ఇవి చదవండి: సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం -
అక్కినేని తర్వాతే ఎవరైనా.. ఏ తెలుగు హీరోకి సాధ్యం కాని ఘనత
ఆ హీరో సినిమాకు వచ్చిన వసూళ్లని ఈ హీరో అధిగమించాడు. అతడి కంటే ఇతడు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇప్పుడంతా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ ఒకప్పుడు రికార్డులు అంటే వేరే ఉండేవి. అంతెందుకు అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించాడు. ఆయన 100వ జయంతి సందర్భంగా అలాంటి ఓ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.ట్రాజెడీ కింగ్ ఏఎన్నార్ఫైట్స్ ఎవరైనా చేస్తారు గానీ ప్రేక్షకుడు గుండెలు కరిగాలే యాక్టింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏఎన్నార్ సిద్ధహస్తుడనే చెప్పాలి. ఎందుకంటే విషాదాంత ప్రేమకథలంటే తెలుగులో ఎప్పటికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు అక్కినేని నాగేశ్వరరావు. ట్రాజెడీ ప్రేమకథలంటే లైలా-మజ్ను, సలీమ్-అనార్కలీ, దేవదాసు-పార్వతి కథలు గుర్తొస్తాయి. ఈ మూడింటిలోనూ ఏఎన్నార్ నటనతో అదరగొట్టేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)ఎప్పటికీ గుర్తుండిపోయే..లైలా-మజ్ను సినిమాలో అక్కినేని భగ్న ప్రేమికుడిగా బాధపడుతుంటే ప్రేక్షకులు కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. ఇది రిలీజైన నాలుగేళ్లకు 'దేవదాసు' చేశారు. ఇది ఏఎన్నార్ కెరీర్లోనే సాహసోపోతమైన మైల్ స్టోన్ మూవీ. ఎందుకంటే అప్పటికే 'దేవదాసు' నవల చదివినోళ్లు.. అదే కథతో తీసిన హిందీ, బెంగాలీ సినిమాలు చూసిన వాళ్లు.. 'దేవదాసు'గా ఏఎన్నార్ ఆకట్టుకోవడం అసాధ్యం అన్నారు. కానీ ఈ మూవీ తన నటజీవితానికి సవాలుగా భావించారు. 'జగమే మాయ..', 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..' అని పాడుతూ మహానటుడు అనిపించుకున్నారు. తనని విమర్శించిన ప్రతి ఒక్కరి నోరు మూయించేశారు.ఆ రెండింటిలోనూపై రెండే కాదు 'అనార్కలి' సినిమాలోని సలీమ్గానూ అక్కినేని యాక్టింగ్ అద్భుతం. దీనితో పాటు పెళ్లి కానుక, సుమంగళి చిత్రాల్లోనూ భగ్న ప్రేమికుడు, త్యాగమూర్తిగా ఆహా అనేలా నటించారు. బాటసారి, మూగమనసులు, రావణుడే రావణుడైతే తదితర సినిమాల్లోనూ ఏఎన్నార్ అదరగొట్టేశారు. 'ప్రేమాభిషేకం' లాంటి విషాదంత ప్రేమకథ అయితే ఎప్పటికీ రాదేమో? అలా టాలీవుడ్ చరిత్రలో ట్రాజెడీ కింగ్గా నిలిచిపోయారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నవలా నాయకుడుఇప్పుడంటే రీమేక్ కథలని మన హీరోలు వెంటపడుతున్నారు. వాటిలోనూ మెప్పించలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం చాలామంది చదివేసిన నవలల్ని సినిమాలుగా తీస్తే ఏఎన్నార్ తనదైన మార్క్ యాక్టింగ్తో మైమరిపించారు. దేవదాసు, అర్ధాంగి, చరణదాసి, డాక్టర్ చక్రవర్తి, బంగారు కలలు, చదువుకున్న అమ్మాయిలు, విచిత్రబంధం, తోడికోడళ్లు, మాంగల్య బలం, విచిత్ర బంధం, భార్య భర్తలు, పునర్జన్మ, బాటసారి, వాగ్దానం, ఆరాధన, పూజాఫలం, ప్రేమలు-పెళ్లిళ్లు, ప్రేమనగర్, సెక్రటరీ.. ఇలా ఏఎన్నార్ కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సినిమాలన్నీ నవలలే కావడం విశేషం.అటు విషాదాంత ప్రేమకథలైనా.. ఇటు నవలా చిత్రాలైనా సరే అక్కినేని నాగేశ్వరరావు తన మార్క్ చూపించారు. ఈ రెండు విషయాల్లోనూ ఏఎన్నార్ని దాటే హీరో తెలుగులో ఎప్పటికీ రాడు, రాలేడు!(ఇదీ చదవండి: అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!) -
అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!
అక్కినేని డ్యూయెట్స్ 50విజిల్ వేయండి.. పజిల్ విప్పండిఅక్కినేని నాగేశ్వరరావు మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య నటుడు. ముఖ్యంగా గృహిణులు ఏఎన్ఆర్ సినిమా కోసం ఎదురు చూసేవారు. దానికి తగ్గట్టే ఏఎన్ఆర్ సినిమాల కథాంశాలుండేవి. సావిత్రి, జమున ఆ తర్వాతి కాలంలో వాణిశ్రీ అక్కినేనికి సరిజోడుగా నటించి మెప్పు పొందారు. ఆయన సినిమాల్లో అందమైన యుగళ గీతాలుండేవి. అలాంటి 100 యుగళగీతాలను తలుచుకుందాం. అక్కినేని వల్ల మన జీవితంలో వచ్చిన ఆనందగీతాలను ఆస్వాదిద్దాం. ఈ తొలి పది పాటల్లో సైకిల్ మీద వెళుతూ బి.సరోజాదేవితో పాడే పాట ఏదో గుర్తుపట్టండి. అలాగే తర్వాతి రోజుల్లో కమెడియన్గా మారిన గిరిజతో ఎంతో మంచి డ్యూయెట్టు ఉంది. అది ఏది?1. ఓ దేవదా చదువు ఇదేనా (దేవదాసు)2. రాజశేఖరా నీపై మోజు తీర లేదురా (అనార్కలి)3. చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు)4. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము (మాయాబజార్)5. చెట్టులెక్కగలవా ఓ నరహరి (చెంచులక్ష్మి)6. ఆకాశ వీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం)7. నేడు శ్రీవారికి మేమంటే పరాకా (ఇల్లరికం)8. వాడుక మరచెదవేల (పెళ్లికానుక)9. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి (వెలుగు నీడలు)10. మధురం మధురం ఈ సమయం (భార్యాభర్తలు)అక్కినేనికి కవి దాశరథి తన గ్రంథాన్ని అంకితమిచ్చారు. అందుకు కృతజ్ఞతగా అక్కినేని ఆయనకు పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. దిగువ ఉన్న పది పాటల్లో దాశరథి రాసినవి ఉన్నాయి.. గుర్తు పట్టండి. అలాగే తెలుగు సినిమాల్లో తొలి వాన పాట కూడా ఉంది. బెంగళూరులో పాట ఏం రాయాలో తోచక కారులో తిరుగుతున్న ఆత్రేయకు అప్పుడే మొదలైన వాన ఆ పాటను రాయించి నేటికీ మనం తడిసేలా చేస్తోంది.11. పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక (ఇద్దరు మిత్రులు)12. నన్ను వదిలి నీవు పోలేవులే (మంచి మనసులు)13. ప్రేమయాత్రలకు బృందావనము (గుండమ్మ కథ)14. వినిపించని రాగాలే కనిపించని అందాలే (చదువుకున్న అమ్మాయిలు)15. చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం)16. నా పాట నీ నోట పలకాల సిలక (మూగమనసులు)17. నిలువుమా నిలువుమా నీలవేణి (అమరశిల్పి జక్కన)18. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా (డాక్టర్ చక్రవర్తి)19. కనులు కనులతో కలబడితే (సుమంగళి)20. పగడాల జాబిలి చూడు (మూగనోము)21. కన్నులు నీవే కావాలి (సుమంగళి)22. నువ్వంటే నాకెందుకో అంత ఇది (అంతస్తులు)23. అది ఒక ఇదిలే అతనికి తగులే (ప్రేమించి చూడు)24. సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా (మనుషులు మమతలు)25. ఒక పూలబాణం తగిలింది మదిలో (ఆత్మగౌరవం)26. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి (పూలరంగడు)27. విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు)28. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియ (బందిపోటు దొంగలు)29. ఓ చామంతి ఏమిటే ఈ వింత (ఆత్మీయులు)30. కళ్లలో పెళ్లిపందిరి కనపడసాగే (ఆత్మీయులు)‘దసరా బుల్లోడు’తో అక్కినేని కలర్ పాటలు. స్టెప్పులు చూసే వీలు ప్రేక్షకులకు కలిగింది. ఘంటసాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఆయన స్థానంలో వి.రామకృష్ణను వినేందుకు కూడా సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పాటల్లో లక్ష్మితో మంచి డ్యూయెట్ ఉంది. చూడండి.31. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా (దసరా బుల్లోడు)32. నీ కోసం వెలసింది ప్రేమమందిరం (ప్రేమ్ నగర్)33. ఆకులు పోకలు ఇవ్వొద్దు (భార్యాబిడ్డలు)34. మనసులు మురిసే సమయమిది (ప్రేమలు పెళ్లిళ్లు)35. వయసే ఒక పూలతోట (విచిత్ర బంధం)36. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు)37. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా (బంగారు కలలు)38. జాబిల్లి చూసేను నిన్ను నన్ను (మహాకవి క్షేత్రయ్య)39. ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని భావాలో (మహాత్ముడు)40. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు (సెక్రటరీ)1980ల తర్వాత పూర్తిగా అక్కినేని కొత్తతరం హీరోయిన్లతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గళంలో హుషారు పాటలతో కొనసాగారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుజాత వీరంతా ఎక్కువగా ఆయన పక్కన నటించారు. అక్కినేని హీరోగా రిటైర్ అయ్యే వరకు ఎన్నో హిట్లు ఉన్నా ఒక పది పాటలు చెప్పుకుందాం. ఈ లిస్ట్లోని చివరిపాటను మోహన్లాల్తో డ్యూయెట్గా అభినయించారు అక్కినేని. ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు?41. నేల మీది జాబిలి నింగిలోన సిరిమల్లి (రాజా రమేష్)42. నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని (ప్రేమాభిషేకం)43. ఒక లైలా కోసం తిరిగాను దేశం (రాముడు కాదు కృష్ణుడు)44. మల్లెపూలు గొల్లుమన్నవి (అనుబంధం)45. మధురం జీవన సంగీతం (వసంత గీతం)46. చందమామ దిగి వచ్చే లోన (జస్టిస్ చక్రవర్తి)47. ఇది మేఘ సందేశమో (ఏడంతస్తుల మేడ)48. ఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచింది (అండమాన్ అమ్మాయి)49. తామరపువ్వంటి తమ్ముడు కావాలా (బంగారు కానుక)50. గోరువంక వాలగానే గోకులానికి (గాండీవం) – కూర్పు : కె -
ఎంఎస్ సుబ్బులక్ష్మి దిగి వచ్చినట్టున్న విద్యాబాలన్ ఫోటో ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
మదర్ థెరీసా జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు శాంతిదూత మదర్ థెరీసా జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసా అని కొనియాడారు.ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని ప్రశంసించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ భవనం కాంప్లెక్స్ను ఆరోజు తాను ప్రారంభించండం సంతోషంగా ఉందని తెలిపారు. నేడు భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసాగారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసాగారు. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు… pic.twitter.com/KFVYHYaXOQ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2024 -
'నువ్వు నేర్పించిన విలువలతోనే బతుకుతున్నా'.. సోనూ సూద్ ఎమోషనల్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎమోషనలయ్యారు. తన తల్లి సరోజ్ సూద్ జయంతి కావడంతో ఆమెను తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె ఫోటోను షేర్ చేస్తూ నోట్ రాసుకొచ్చారు.సోనూ సూద్ ట్వీట్లో రాస్తూ..'హ్యాపీ బర్త్డే అమ్మా. నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు. నువ్వు నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలుతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. నిన్ను చాలా ప్రేమిస్తున్నా అమ్మా. ఒక్కసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలనుంది. నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా. లవ్ యూ సో మచ్' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. అరుంధతి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్ పలు చిత్రాల్లో నటించారు. నటన మాత్రమే కాదు.. తనవంతుగా సమాజసేవలో దూసుకెళ్తున్నారు. సోనూ సూద్ అనే ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన తల్లి సరోజ్ సూద్ పేరుతో స్కాలర్షిప్లు అందింస్తున్నారు. పేదరికంలో ఉన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు ఓ విద్యార్థికి సాయం అందించారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. Happy Birthday Maa. World without you is not that beautiful but somehow surviving with the principles and morals you taught me. I love u so much mom💔 wish I could hug you tight and tell you how much I miss you. Will always follow the path you showed me. Keep smiling till I see… pic.twitter.com/Bl1g5XNG3S— sonu sood (@SonuSood) July 21, 2024 -
న్యూజెర్సీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు
-
సంక్షేమానికి మారుపేరు వైఎస్
సాక్షి,హైదరాబాద్: దేశంలో సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే పేరు వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి కొనియాడారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వై.ఎస్. చేసిన సంక్షేమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని గాంధీ భవన్లో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రేవంత్రెడ్డి మాట్లాడుతూ సంక్షేమంపై వై.ఎస్. చెరగని ముద్ర వేశారన్నారు.ఆయన హయాంలో జరిగిన అభివద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఉపయోగపడుతోందని చెప్పారు. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల హామీలకు స్ఫూర్తి రాజశేఖరరెడ్డేనని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్, గోదావరి, కష్ణా జలాల వినియోగం, హైదరాబాద్లో పెట్టుబడులకు కూడా ఆయనే స్ఫూర్తి అని రేవంత్ కొనియాడారు. వై.ఎస్. స్ఫూర్తి ని తమ ప్రభుత్వం, పార్టీ కొనసాగిస్తుందన్నారు. ఆయన చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తినిచి్చందన్నారు. 2009లో రెండోసారి సీఎం అయ్యాక రాహుల్ గాం«దీని ప్రధానిని చేయాలని వై.ఎస్. చెప్పారని.. కానీ రాహుల్ ప్రధాని కాకుండానే ఆయన దూరమయ్యారని విచారం వ్యక్తం చేశారు. వై.ఎస్. స్ఫూర్తి తో దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కొట్లాడి రాహుల్ను ప్రధాని చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఆయన అభిమానులంతా కాంగ్రెస్లోకి రావాలని కోరారు.వైఎస్ స్థానం సుస్థిరం: డిప్యూటీ సీఎం భట్టిఅభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజల హదయాల్లో వై.ఎస్. స్థానం సుస్థిరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం ఫలితంగానే నేడు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రజానీకానికి మేలు జరుగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్టాత్మక పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలను వై.ఎస్. ఆదుకున్నారని చెప్పారు. తెలంగాణ వడివడిగా అభివద్ధివైపు అడుగులు వేయడానికి వై.ఎస్. వేసిన పునాదులే కారణమన్నారు. ఔటర్ రింగ్రోడ్డు, ఎయిర్పోర్టు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నేడుహైదరాబాద్ను ప్రపంచపటంలో నిలిపారని కొనియాడారు. గాం«దీభవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ప్రజాభవన్లో వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఎం లక్డీకాపూల్/పంజగుట్ట/బంజారాహిల్స్: మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. వై.ఎస్. భౌతికంగా ప్రజల మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి బతికే ఉంటుందన్నారు. వై.ఎస్. 75వ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన జీవిత విశేషాలను తెలియజేస్తూ సోమవారం ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను రేవంత్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వై.ఎస్. ఫొటోలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం పంజగుట్ట కూడలిలోని వై.ఎస్. విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులరి్పంచారు. మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1/10లోని సిటీ సెంటర్ వద్ద ఉన్న వై.ఎస్. విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, వై.ఎస్. ఆప్తమిత్రుడు కేవీపీ, మేయర్ విజయలక్షి్మ, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘన నివాళులు అర్పించారు. -
వైఎస్ఆర్ పై అంతులేని అభిమానం
-
నాన్నా.. మీ 75వ పుట్టిన రోజు మా అందరికీ పండుగ రోజు
-
"వైఎస్ఆర్ ఉంటే రాష్ట్రం మరోలా ఉండేది"
-
వ్యవసాయమంటే ప్రత్యేకమైన ప్రేమను చూపిన వైఎస్సార్
-
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
KSR Live Show: YSR సంక్షేమ ముద్ర.. రాజ ముద్ర..
-
ఆ జ్ఞాపకం.. నా జీవితంలో మర్చిపోలేను..
-
ప్రజా సంక్షేమానికి డైరెక్షన్ వైఎస్ఆర్..
-
శత్రువులు కూడా అభినందించే గొప్ప నాయకుడు వైఎస్సార్
-
Watch Live: జన నేతకు వైఎస్ జగన్ నివాళి
-
YSR Jayanthi: ఇడుపులపాయకు వైఎస్ జగన్
-
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఓటమి ఎరుగని ధీరుడు..
-
రైతన్నల గుండెల్లో రాజముద్ర
ప్రకృతి కన్నెర్ర చేసింది. పాలకుల కరుణ కరువైంది. వరుణుడు పత్తా లేకుండా పోయాడు.వర్షాలు లేక, పంటలు పండక 1993 నుంచి 2004 మధ్య కాలంలో కరువు రక్కసి కబంధ హస్తాల్లో ‘అనంత’ రైతన్న చిక్కుకున్నారు. అలాంటి తరుణంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశాకిరణంగా కనిపించారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి అన్నదాత దిక్కులు చూస్తున్న సమయంలో అపర భగీరథుడిగా నిలిచారు. చేతిలో చిల్లిగవ్వ లేక పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న కూలీలు, పేదల ఇంటికి పెద్ద కొడుకయ్యారు. పుట్టెడు అప్పులతో పిల్లల్ని చదివించలేక, ఆత్మాభిమానం చంపుకోలేక అర్ధంతరంగా అసువులు బాసిన రైతుల కుటుంబాలతో పాటు, పేదలకు అండగా నిలిచారు. అన్ని వర్గాలకూ అందరి బంధువయ్యారు. అందుకే ఆయన తనువు చాలించి 15 యేళ్లు కావస్తున్నా నేటికీ అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.అనంతపురం అగ్రికల్చర్: 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదికపై ఉచిత కరెంటు, విద్యుత్ బిల్లుల మాఫీ చేస్తూ తొలి సంతకంతోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఊపిరిపోశారు. ఆ ఒక్క సంతకంతో ఉమ్మడి జిల్లా రైతులకు చెందిన రూ.70.65 కోట్ల విద్యుత్ బిల్లులు మాఫీ అయ్యాయి. ఐదేళ్లూ 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు రూ.వందల కోట్ల విలువ చేసే కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. ఖరీఫ్లో పంట రుణాల పంపిణీ రూ.6,594 కోట్లకు చేర్చారు. పావలా వడ్డీ కింద రూ.44 కోట్లు ఇచ్చారు.పంటల బీమాతో ధీమా..అప్పట్లో చంద్రబాబు హయాంలో అమలవుతున్న పంటల బీమా పథకాన్ని మార్పు చేసి రైతులకు ఎనలేని ధీమా కల్పించారు. 2004–2009 మధ్య వైఎస్ హయాంలో వేరుశనగ రైతులకు పంట కోత ఫలితాల ఆధారంగా బీమా కింద ఏకంగా రూ.1,138 కోట్ల పరిహారం దక్కింది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.100 కోట్లు అందింది.ఒకే విడతగా రుణమాఫీ..2008లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో వైఎస్సార్ 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్ల రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాల కింద 3,61,269 మందికి రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద రుణమాఫీ, ప్రోత్సాహకాల కింద ఒకే విడతగా 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్ల లబ్ధి చేకూర్చారు.రాయితీతో విత్తనాలు..ఖరీఫ్, రబీలో రైతులకు లక్షల క్వింటాళ్ల వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. 2004– 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్ల వేరుశనగ అందజేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు.అనుబంధ రంగాలకూ ప్రాధాన్యత..వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూత అందించారు. రూ.25 కోట్ల రాయితీ ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీర విప్లవానికి నాంది పలికారు. 40 వేల హెక్టార్ల పండ్లతోటల విస్తరణకు రూ.80 కోట్ల సబ్సిడీ అందజేశారు. దీంతో అప్పట్లోనే ‘ఫ్రూట్బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరొచ్చింది. బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో అందజేశారు. సూక్ష్మసేద్యం విస్తరణకు రూ.280 కోట్ల రాయితీ ఇవ్వడంతో 1.13 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇలా వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఏకంగా రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు.అంతకు మించి..తండ్రి వైఎస్సార్కు తగ్గ తనయుడిగా గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అంతకు మించి అన్నట్లుగా అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచింది. కరోనా కాలంలో ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలకు ప్రోత్సాహం లాంటివే కాకుండా కేవలం రైతు సంక్షేమానికి ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వెచ్చించారు. దేశంలో తొలిసారిగా ఊరూరా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థతో వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా ఇన్పుట్స్ కోసం గ్రామం దాటి వెళ్లకుండా 867 ఆర్బీకేలను నిర్మించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరిశీలనకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్లతో పాటు పశుసంపద, జీవాల రక్షణకు వెటర్నరీ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. 108 మాదిరిగా 1962 కింద మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు తెచ్చారు. రైతు గ్రూపులకు ప్రతి ఆర్బీకే పరిధిలో రూ.15 లక్షలు వెచ్చించి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్సీ) కింద ట్రాక్టర్లు, ఇతర అధునాతన యంత్ర పరికరాలు అందించారు. ఇన్పుట్ సబ్సిడీ, ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఏటా మూడు విడతల్లో రైతు భరోసా–పీఎం కిసాన్ కింద రూ.13,500 పెట్టుబడి సాయం ఇచ్చారు. ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా ‘ఈ–క్రాప్’, ఈ–కేవైసీ పారదర్శకంగా చేపట్టారు. రాయితీతో డ్రిప్, స్ప్రింక్లర్లు అందించారు. ఇలా వ్యవసాయ, అనుబంధ రంగాల పురోభివృద్ధికి అడుగడుగునా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం అందజేశారు. -
రాజువయ్యా.. మహరాజువయ్యా..
ప్రతి అడుగులో ఆలోచన..ముఖంలో చిరు మందహాసంతో కూడిన దర్పం..ఆహార్యంలో రాజసం..నమ్మిన ప్రజలకు దిక్సూచి.. అభాగ్యులకు ఆపన్నహస్తం..అన్నార్తులకు భరోసా..అభివృద్ధికి చిరునామా..అనారోగ్య బాధితులకు ఆరోగ్య శ్రీ, 108, 104 సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు జలయజ్ఞం, పేదవాడికి గూడు ఈ మాటలన్నీ ఎవరి నోట వినిపించినా ఠక్కున గుర్తొచ్చే పేరు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తన పరిపాలన కాలంలో ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన నాటికీ..నేటికీ ప్రజల గుండెల్లో మహారాజులా కొలువై ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆయన పాలన కాలంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు అందించిన సేవలు ఒకసారి మననం చేసుకుంటే..సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరువు, పేదరికం, కటిక సమస్యలు తాళలేక పొట్ట చేతబట్టుకుని ఉపాధి కోసం వలసపోయే జనం..ఇదీ సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం వరకూ ఉమ్మడి విజయనగరం జిల్లా ముఖచిత్రం! అలాంటి నేపథ్యంలో 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర కీలక మలుపు. ఇక్కడి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. 2004 మే నెలలో తాను అధికారం చేపట్టింది మొదలు 2009 సెప్టెంబరులో అకాల మరణం వరకూ ముఖ్యమంత్రిగా ప్రతి పథకంలోనూ, అభివృద్ధి పనుల్లోనూ ఈ ప్రాంతానికి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. నాటి ఆయన కృషి తాలూకా ఫలాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయి. తదుపరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా మళ్లీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అదే పంథాను కొనసాగించారు. ఇప్పుడు ఖరీఫ్ వచ్చేసరికి సాగునీరు అందుతోంది. ప్రగతిపథం వైపు ఉమ్మడి విజయనగరం జిల్లా వడివడిగా అడుగులు వేస్తోంది. వలసలు దాదాపుగా తగ్గిపోయాయి. బయటి ప్రాంతాలవారే ఇక్కడికొచ్చి స్థిరపడేలా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కలను సాకారం చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన తుది శ్వాస వరకూ ప్రజాసేవలోనే గడిపిన ఆ మహామనిషి జయంతి నేడు (సోమవారం, జూలై 8). ఆయనను స్మరించుకోవడానికి ఊరూవాడా ప్రజలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ రీజినల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ క్యాడర్ను కోరారు.జేఎన్టీయూ వైఎస్సార్ పుణ్యమే...ఉమ్మడి విజయనగరం జిల్లాలో నేడు సాంకేతిక విద్యకు దిక్సూచిగా ఉన్న జేఎన్టీయూ–జీవీ విశ్వవిద్యాలయానికి పునాదిరాయి వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. 2007లో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. దీన్ని ఎప్పటికై నా యూనివర్సిటీని చేయాలనే ముందుచూపుతోనే 80 ఎకరాల విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయ్యింది.మాతాశిశుసంరక్షణకు ప్రాధాన్యం..డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బొబ్బిలి సీహెచ్సీలో రూ.44.30 లక్షలతో సీమాంక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆయన ప్రారంభించిన భవనంలోనే నాటి నుంచి గర్భిణులు, బాలింతలకు వైద్యసేవలు అందుతున్నాయి.ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పునాది....విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, వంగర మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు లైనింగ్ పనులు, పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ ప్రాజెక్టు, నాగావళి ఉపనది జంఝావతి నుంచి రాష్ట్రానికి వచ్చే 4 టీఎంసీల వాటా నీరు వినియోగించుకునేందుకు వీలుగా 1976వ సంవత్సరంలో జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం వంటి ఎన్నో పనులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాలోపూర్తయినవే.వైఎస్సార్కు స్మృతివనం..పాలకొండ మండలం ఎం.సింగుపురం గ్రామ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం చూపించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒక దైవంలా ఆరాధిస్తున్నారు. 2006లో ముఖ్యమంత్రి హాదాలో ఇక్కడ ప్రజాపఽథం కార్యక్రమానికి వైఎస్సార్ వచ్చారు. ఆయన మరణానంతరం ఇక్కడ వైఎస్సార్ స్మృతివనాన్ని గ్రామస్తులు నిర్మించారు.చీపురుపల్లి అభివృద్ధికి ఆద్యుడుచీపురుపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాంది పలికారు. ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చొరవతో రూ.83 కోట్లతో ఇందిరమ్మ సుజలధార పథకం చేపట్టడం ద్వారా తాగునీటి ఇబ్బందులు తొలగించారు. చీపురుపల్లికి ఆ మహానేత వైఎస్సార్ హయాంలో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేడు ఆదర్శ డిగ్రీ కళాశాలగా కొనసాగుతోంది.‘గిరి’జన గ్రామాల్లో వెలుగువేపాడ మండలం కరకవలస పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామమైన మారిక గ్రామానికి తొలిసారిగా 2006లో విద్యుత్ సదుపాయం కల్పించిందీ నాటి రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆ గ్రామానికి బీటీ రోడ్డుకు నిధులు కేటాయించిందీ ఆయనే. జామి మండలంలో మూతపడి ఉన్న భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరుకు రైతుల జీవితాల్లో తీపి నింపారు. రాజన్న మరణానంతరం మళ్లీ ఆ ఫ్యాక్టరీ మూతపడింది.తోటపల్లితో మూడు జిల్లాల్లో ప్రగతి...విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రగతికి మూలకారకంగా తోటపల్లి ప్రాజెక్టు ఉంది. వాస్తవానికి ఇప్పుడు ప్రాజెక్టు ఉన్న తోటపల్లి ప్రాంతానికి దిగువన నాగావళి నదిపై బ్యారేజీ ఉండేది. 64 వేల ఎకరాలకు సాగునీరు అందించే దీన్ని బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాజెక్టును నిర్మిస్తానంటూ 2003 సంవత్సరంలో చంద్రబాబు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసేశారు. తర్వాత దాని ఊసే తేలేదు. 2004వ సంవత్సరంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. దాదాపు 2 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించే ఈప్రాజెక్టు నిర్మాణానికి రూ.450.23 కోట్లు నిధులు మంజూరు చేశారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా 2004 అక్టోబరు 17వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆయన హయాంలోనే భూసేకరణ, పునరావాసం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు పనులు కూడా 81 శాతం అయిపోయాయి. ఆయన అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులైన వారెవ్వరూ పెండింగ్ పనులపై దృష్టిపెట్టలేదు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండింగ్ పనుల్లో కదలిక వచ్చింది. ఆధునికీకరణకు, హెడ్ వర్క్లను పూర్తి చేయడానికి నిధులు కేటాయించారు. -
వైద్యరంగంలో రాజముద్ర
-
‘వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం’
తాడేపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘వైఎస్సార్ 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నాం, రక్తదానం, పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని క్యాడర్ కి పిలుపునిస్తున్నాం.పార్టీ క్యాడర్ అంతా జులై 8న వీటిని నిర్వహించాలని కోరుతున్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి. వైఎస్సార్ మీద భక్తి ఉన్న వారంతా జయంతి కార్యక్రమాలు చేయొచ్చు. ఆ మహనీయుడిని స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టాలని జగన్ ఆదేశించారు. ఆ మేరకు క్యాడర్ అంతా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. వైఎస్సార్ ఆశయాలు, విధానాలతోనే వైఎస్సార్సీపీ ఏర్పడింది. వైఎస్ఆర్ ఆలోచనా విధానంతోనే ముందుకు సాగుతున్నాం’ అని పేర్ని నాని పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం.. ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ, సాక్షి: తెలుగు చలన చిత్ర నట దిగ్గజం, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్మరించుకున్నారు. ‘‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన.. ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ధరించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను ప్రజలు ఇప్పటికీ తలచుకుంటారు. ఎన్టీఆర్ కలలుగన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు .…— Narendra Modi (@narendramodi) May 28, 2024 -
అంబేడ్కర్ అన్నివర్గాలకు ఆదర్శమూర్తి : మంత్రి పొన్నం
కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయనకు నివాళి అర్పించారు. అంబేడ్కర్ అన్నివర్గాలకు ఆదర్శమూర్తి అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులఉమ, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్కుమార్ వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో కే.మహేశ్వర్, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నతానియల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది? -
డా. బీఆర్ అంబేద్కర్కు సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికీ తలమానికం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల… pic.twitter.com/Da4B5jWmQo — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2024 -
సున్నితమైన గానానికి ఉన్నతి తలత్
గాయకుడు తలత్ మహ్మూద్ శత జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుందాం రండి - మృదువైన, మెత్తని గాత్రంతో, గానంతోమనదేశంలో తలత్ మహ్మూద్ తొలి crooner! మన దేశ లలిత, సినిమా, గజల్ పరంగా మేలైన, మెరుగైన గానం (fine singing) తలత్ Silky smooth and velvet voiceతో మొదలయింది. గాన లాలిత్యం మనదేశంలో తలత్వల్ల సాకారమైంది. భారతదేశ లలిత, సినిమా, గజల్ గానానికి మార్గదర్శకుడు తలత్. అత్యున్నతమైన గాయకుడు మొహమ్మద్ రఫీ కూడా తలత్ ప్రభావంతో తనను తాను తీర్చి దిద్దుకున్నారు. దులారీ సినిమాలోని "సుహానీ రాత్ డల్ చుకీ..." పాట మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది. గజల్ గాయకుడు మెహ్దీహసన్కు కూడా తొలిదశలో తలత్ స్ఫూర్తి. 1950ల ప్రథమార్ధంలో తలత్ ప్రభావంతో మెహ్దీహసన్ చేసిన ఒక గజల్ కచేరీలో ప్రేక్షకుల నుంచి కానుకలుగా 15,000 రూపాయల నోట్లు మెహ్దీహసన్పై పడ్డాయి. తలత్ పాడిన "అసర్, ఉస్కో జరా నహీన్ హో...", "వో జాతేన్ హేన్..." వంటి గజళ్లు వింటే మెహ్దీహసన్ గానంపై తలత్ గాన ప్రభావం తెలియవస్తుంది. 1941-44 మధ్య కాలంలో తపన్ కుమార్ పేరుతో తలత్ కలకత్తాలో కొన్ని బెంగాలీ పాటలు పాడారు. 1945లో కలకత్తాలో నిర్మితమైన రాజలక్ష్మీ హిందీ సినిమాలో నటుడు-గాయకుడుగా రాబిన్ చటర్జీ సంగీతంలో తలత్ తన మెదటి సినిమా పాట " ఇస్ జగ్ సే కుఛ్ ఆస్ నహీన్ ..." పాడారు. అనిల్ బిస్వాస్ సంగీతంలో 1951లో వచ్చిన తరానా సినిమాలో పాడిన "సీనేమే సులగ్తే హైన్ అర్మా ..." పాట తలత్ తొలి సినిమా హిట్ పాట. అంతకు ముందు 1950లో అనిల్ బిస్వాస్ సంగీతంలో వచ్చిన ఆర్జూ సినిమాలోని "ఏ దిల్ ముఝే ఏసీ జగ్హ లే ..." పాటా, 1950లోనే నౌషాద్ సంగీతంలో వచ్చిన బాబుల్ సినిమాలోని " మేరా జీవన్ సాథీ భిఛడ్ గయా..." పాటా చెప్పుకోతగ్గవి. సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో వచ్చిన సంగ్దిల్ సినిమాలో తలత్ పాడిన ఏ హవా, ఏ రాత్, ఏ చాందినీ..." పాట మన దేశంలొ వచ్చిన ఒక ప్రశస్తమైన పాటగా నిలిచిపోయింది. ఆ సంగ్దిల్ సినిమాలోనే తలత్ "కహాన్ హో కహాన్ మేరే జీవన్ సహారే..." అంటూ మరో గొప్ప పాట పాడారు. శంకర్-జైకిషన్ సంగీతంలో తలత్ పాడిన "ఏ మేరే దిల్ కహీన్ ఔర్ చల్..." (సినిమా: దాగ్) పాట దేశం మొత్తాన్నీ ఊపేసింది. అటు తరువాత తలత్ పాడిన "తస్వీర్ బనాతా హున్ ..." (సినిమా: బారాదరీ, సంగీతం: నాషాద్) "షామే గమ్ కీ కసమ్.." (సినిమా: ఫుట్ పాత్, సంగీతం: ఖయ్యామ్), "ఏ గమే దిల్ క్యా కరూన్ ..." (సినిమా: ఠోకర్, సంగీతం: సర్దార్ మాలిక్), "జిందగీ దేనే వాలే సున్..." (సినిమా: దిల్ - ఎ - నాదాన్, సంగీతం: గులామ్ మొహమ్మద్), "మై దిల్ హూన్ ఇక్ అర్మాన్ భరా..." ( సినిమా: అన్హోనీ, సంగీతం: రోషన్), "మొహబ్బత్ హీ న జో సమ్ఝొ వో జాలిమ్ ప్యార్ క్యా జానే..." (సినిమా: పర్ఛాయిన్, సంగీతం: సి. రామ్చంద్ర), "ముఝేదేఖో హస్రత్ కీ తస్వీర్ ..." (సినిమా: బాజ్, సంగీతం: ఒ.పి. నయ్యర్), "జాయేన్ తో జాయేన్ కహాన్..." (సినిమా: టాక్సీ డ్రైవర్, సంగీతం: ఎస్.డి. బర్మన్), "రాత్ నే క్యా క్యా ఖ్వాబ్ దిఖాయే..." ( సినిమా: ఏక్ గావ్ కీ కహానీ; సంగీతం: సలిల్ చౌధరీ) పాటలూ, ఈ స్థాయి ఇంకొన్ని పాటలూ భారతదేశ సినిమా గానంలో కాలాలు ప్రశంసించేవయ్యాయి. హిందీ సినిమా పాటల్లో పెద్ద పల్లవి పాట, మనదేశ సినిమాల్లో రెండో పెద్ద పల్లవి పాట (ఈ పాటకన్నా పెద్ద పల్లవితో ఒక తమిళ్ష్ పాట ఉంది) సలిల్ చౌధరీ సంగీతంలో ఉస్నే కహా థా సినిమాలోని "ఆహా రిమ్ జిమ్ కే యే ప్యారే ప్యారే గీత్ లియే..." తలత్ పాడారు. గాయకుడు సైగల్ గానాన్ని మరపిస్తూ తలత్ crooning (లాలిత్యమైన గానం) ఒక్కసారిగా దేశ గాన విధానాన్ని మార్చేసింది. తలత్ 15 ఏళ్లకే గాయకుడు! 1944లో తలత్ పాడిన "తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్లాన సకే గీ" (సంగీతం: కమల్దాస్ గుప్తా; రచన: ఫైయాజ్ హష్మి) గజల్ (78 ఆర్.పి.ఎమ్) రికార్డ్ విడుదలయింది. విడుదలయిన నెల రోజుల్లోనే లక్షన్నరకు పైగా ప్రతులు అమ్ముడయింది అది. ఆ గానం ఆదర్శమై దేశ సినిమా, లలిత, గజల్ గాన పరిణామానికి, పరిణతికి, ప్రగతికి మార్గదర్శకమైంది. తలత్ 1941లో "సబ్ దిన్ ఏక్ సమాన్ నహీన్ థా..." గజల్ను రికార్డ్పై విడుదల చేశారు. 1939లో తన 15యేళ్ల వయసులో తలత్ 2 గజళ్లను పాడి విడుదల చేశారు. "1943లో చాంద్ మేరే చాంద్ తేరే.." గజల్ రికార్డ్ విడుదలైంది. తస్వీర్ తేరే దిల్ మేరా బెహ్లాన సకే గీ గజల్ తరువాత తలత్ మహ్మూద్ గజళ్ల గానానికి ఊపు వచ్చింది. ఆ తరువాత "గమ్ -ఎ-జిందగీ కా యారబ్ న మిలా కోఈ కినారా..." (1947; సంగీతం: చిట్టారాయ్), "సోయే హువే హేన్ చాంద్ ఔర్ తారేన్ (1947), "ఇన్ భీగీ భీగీ రాతోన్ మేన్ ..."(1947), "దిల్ కీ దునియా బసా గయా ..."(1948) వంటి గజళ్లతో సాగుతూ 1950వ దశాబ్దిలో "రోరో బీతా జీవన్ సారా..." (రచన: ఖన్వర్ జమాన్; సంగీతం: ఖయ్యామ్), "ఆగయీ ఫిర్ సే బహారేన్ ..." (రచన: ఖన్వర్ జమాన్; సంగీతం: ఖయ్యామ్), "మేరా ప్యార్ ముఝే లోటా దో ..." (రచన: సజ్జన్; సంగీతం: వి. బల్సారా), "చన్ద్ లమ్హేన్ తేరీ మెహఫిల్ మేన్ ..." (రచన: షకీల్ బదాయూనీ; సంగీతం: తలత్ మహ్మూద్) వంటి గజళ్లతో రాణించి రాజిల్లింది. సి.హెచ్. ఆత్మ, ముఖేశ్ వంటి గాయకులతో జంటగా కూడా తలత్ గజళ్లు పాడారు. బేగం అఖ్తర్ గజల్ ఫణితికి అతీతంగా ప్రపంచ గజల్ గానం పరివర్తనానికి, పరిఢవిల్లడానికి ప్రేరణ తలత్. తలత్ మహ్మూద్ గజల్ (గాన)రాజు అయ్యారు. నౌషాద్ సైతం తలత్ను 'గజల్ రాజు' అన్నారు. గైర్-ఫిల్మీ (సినిమా పాటలు కాని) గానంగా తలత్ కృష్ణ భజన్లు, దుర్గా ఆర్తి, నాత్లు, గీత్లు, చెప్పకోతగ్గట్టుగా పాడారు. నిప్పులాంటి మనిషి సినిమాలోని "స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం..." పాట మనకు తెలిసిందే. ఈ పాట హిందీ జంజీర్ సినిమాలో మన్నాడే పాడిన "యారీ హైన్ ఇమాన్ మేరా యార్ మేరీ జందగీ..." పాటకు నకలు. ఆ హిందీ పాటకు కొంత మేరకు ఆధారం ముబారక్ బేగమ్తో కలిసి తలత్ పాడిన "హమ్ సునాతే హైన్ మొహమ్మద్ ముస్తఫా కీ దాస్తాన్..." అన్న నాత్. అమృత సినిమాలో ఎ.ఆర్. రహ్మాన్ చేసిన "ఏ దేవి వరము నీవు..." పాట పల్లవి తలత్ పాడిన గజల్ "రాతేన్ గుజర్ దీ హైన్ ..." కు దగ్గరగా ఉంటుంది. తలత్ మహ్మూద్ 1959లో విడుదలైన మనోరమ తెలుగు సినిమాలో రమేష్ నాయుడు సంగీతంలో"అందాల సీమ సుధా నిలయం ...", "గతి లేనివాణ్ణి గుడ్డివాణ్ణి బాబయా...", "మరిచిపోయేవేమో ..." మూడు పాటలు పాడారు. ఏ మాత్రమూ తెలుగు తెలియని తలత్కు గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఉచ్చారణ తర్ఫీదు నిచ్చారు. ఆ సందర్భంలో ఒక చోట చా, వు శబ్దాలు తలత్కు సరిగ్గా రాకపోతూండడాన్ని గమనించి మీకు 'చావు' రాకూడదు అన్నారు పి.బి. శ్రీనివాస్ (ఈ వ్యాస రచయితతో పి.బి. శ్రీనివాస్ చెప్పిన మాట). రమేష్ నాయుడు సంగీతంలో పాడడానికి ముందే తలత్ తెలుగువారైన ఈమని శంకరశాస్త్రి సంగీతంలో 1951లో సంసార్ హిందీ సినిమాలో "మిట్ నహీన్ సక్తా కభీ లిఖా...", "యే సంసార్ యే సంసార్ ప్రీత్ భరా సంసార్..." పాటలూ, 1952లో వచ్చిన మిస్టర్ సంపత్ సినిమాలో "ఓ మృగనయనీ...", "హే భగవాన్..." పాటలూ పాడారు. హిందీలోకి డబ్ ఐన తెలుగు సినిమాలు పాతాళభైరవి, చండీరాణి సినిమాలలో ఎన్.టి. రామారావుకు తలత్ పాడారు. 1964లో వచ్చిన జహాన్ ఆరా సినిమాలోని "ఫిర్ వోహీ షామ్..." పాట తరువాత తలత్ చెప్పుకోతగ్గ పాటలు పాడలేదు. ఆ తరువాత 20లోపు సినిమా పాటలు మాత్రమే పాడుంటారు. అంతకు ముందు 1963లో సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో రుస్తమ్ సొహరాబ్ సినిమాలో తలత్ "మాజన్దరాన్ మాజన్దరాన్..." అంటూ ఒక విశేషమైన పాట పాడారు. తలత్ పాడిన చివరి గొప్ప సినిమా పాట అది. 290 పైచిలుకు సినిమాల్లోని పాటలూ, గైర్ - ఫిల్మీ గీత్ (సినిమా కాని పాటలు) అన్నీ కలుపుకుని తలత్ మొత్తం 747 పాటలు పాడారు. 16 సినిమాల్లో నటించారు. పలు పురస్కారాలతో పాటు 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు తలత్. 24/2/1924న పుట్టిన తలత్ 9/5/1998న పరమపదించారు. 1944 నుంచి 50 వరకూ పాడిన కడుకొద్ది గజళ్లు, గీత్లతోనే మొత్తం భారతదేశ సినిమా, లలిత, గజల్ గానానికి దిశా నిర్దేశం చేశారు తలత్! భారతదేశ సినిమా, లలిత, గజల్ గానం తలత్కు ముందు తలత్కు తరువాత అని పరిగణించబడతాయి. మనదేశంలో సినిమా, లలిత, గజల్ గాన పరివర్తన కర్త తలత్ మహ్మూద్. Talat Mahmood, a transitional icon of Indian non-classical singing. తలత్ గాత్రంలో స్వాభావికంగా వణుకు ఉంటుంది. Tremulous voice ఆయంది. తలత్ గొంతులోని వణుకుపై బాపు ఒక కార్టూన్ వేశారు. ఆ కార్టూన్లో భార్య రేడియో పెట్టగానే రేడియో లోంచి 'గజగజ' అని వస్తుంది. అప్పుడు భర్త "ఆ గొంతు తలత్ మహమ్మద్ది కదే" అంటాడు. తలత్ గొంతుపై చలోక్తులుగా "అసలే తలత్ కచేరీ అదీ ఉటీలో" వంటివి (గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఈ వ్యాస రచయితకు ఈ మాట చెప్పారు) ప్రచారంలో ఉండేవి.తొలి రోజుల్లో తలత్ తన గొంతులోని tremoloను నియంత్రించుకోవడానికి ప్రయత్నించగా సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ ఆ tremoloతోనే పాడమని పట్టుబట్టారు. గొంతులోని వణుకు కూడా తలత్కు గుర్తింపు అయిపోయింది. తలత్ crooningను దక్షిణ భారతదేశంలో పి. బి. శ్రీనివాస్ అర్థం చేసుకుని అందుకుని అమలు చేశారు. పి.బి. శ్రీనివాస్ నుండి అది కె.జె. ఏసుదాస్కు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు, వారి తరువాత కొనసాగింపుగా ఇతరులకూ చేరింది. మనదేశంలో crooning ఉంది అంటే అది తలత్ మహ్మూద్వల్ల వచ్చింది అన్నది చారిత్రికం. 1968లో అమేరిక టైమ్స్ స్క్వేర్లో ఉన్న ఒక స్ట్యూడియోలో టాక్ షోకు ఆహ్వానించి ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు ఫ్రాంక్ సినాట్రాతో పోల్చి తలత్ను "Frank Sinatra of India" అని అన్నారు. తలత్కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులుండే వారు. మరే గాయకుడికీ లేనంతగా ఆయనకు ఆ రోజుల్లోనే పెద్ద సంఖ్యలో మాహిళాభిమానులుండే వారు. ఇవాళ్టికీ దేశ వ్యాప్తంగా తలత్ పాటలు పదేపదే వినిపిస్తూనే ఉన్నాయి; ఎప్పటికీ మన దేశంలో తలత్ గానం వినిపిస్తూనే ఉంటుంది. ఒక మెత్తని పాటలా తలత్ ఈ మట్టిపై వీస్తూనే ఉంటారు. సున్నితమైన గానానికి ఉన్నతి తలత్. -రోచిష్మాన్ 9444012279 -
నన్ను హీరోయిన్గా పరిచయం చేసింది ఆమెనే: విజయశాంతి
తెలుగు చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న నటి విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. 1946, 20 ఫిబ్రవరిలో తమిళనాడులో జన్మించిన విజయ నిర్మల సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్రవేశారు. అయితే ఇవాళ ఆమె జయంతి సందర్భంగా సినీయర్ హీరోయిన్ విజయశాంతి ట్వీట్ చేశారు. తనను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేసిన విజయ నిర్మలను గుర్తు చేసుకుంది. నన్ను కళాకారిణిగా విశ్వసించి.. సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి.. నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మలపై అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనని ట్విటర్ రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆ సినిమా సెట్లో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ చివరిసారిగా మహేశ్ బాబు నటింతిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కనిపించింది. నన్ను కళాకారిణిగా విశ్వసించి సూపర్ స్టార్ కృష్ణ గారితో హీరోయిన్ గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి, నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మల గారు... మీ పై ఆ అభిమానం ఆ గౌరవం, ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుగా ఉంచుకునే జ్ఞాపకం తో... జన్మదిన శుభాకాంక్షలతో...💐 మీ… pic.twitter.com/Cicx5jWKUI — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 20, 2024 -
National Women's Day ఎపుడు జరుపుకుంటారో తెలుసా?
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సమాజసేవకురాలు, దేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. "నైటింగేల్ ఆఫ్ ఇండియా" ‘‘భారత కోకిల’’గాపేరొందిన సరోజినీ నాయుడు పుట్టిన రోజు నేడు (ఫిబ్రవరి 13). మహిళా దినోత్సవంగా అనగానే సాధారణంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8 వతేదీ గుర్తొస్తోంది. కానీ మన దేశంలో మహిళల సాధికారత, సమస్యలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సరోజినీ నాయుడు పుట్టిన రోజును జాతీయ మహిళా దినోత్సవంగా పాటిస్తారు. ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలు మాత్రమే కాదు మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీక సరోజినీ నాయుడు. మహిళల అభివృద్ధిలో భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినంగా 2014లో ప్రకటించింది. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13 న బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ప్రతీక. కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే కావడంతో సరోజినీ నాయుడుకు కూడా 12 ఏళ్లకే మద్రాసు యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు. అంతేకాదు 13 ఏళ్ల వయసులోనే ఆమె "లేక్ గర్ల్" అనే కవితను రాసింది.13వ ఏటనే రచయితగా మారిన సరోజినీ రాసిన 'లేడీ ఆఫ్ ది లేక్' కవిత చదివిన నిజాం నవాబు ఆమెను ప్రోత్సహించారు. ఉపకారం వేతనం ఇచ్చి వివిధ రంగాల్లో పరిశోధనలు చేయాలంటూ ఇంగ్లాండు పంపారు. లండన్ కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1905లో అతని తొలి కవితా సంకలనం 'గోల్డెన్ థ్రెషోల్డ్' చూసి ముగ్ధుడైన మహాత్మా గాంధీ ఆమెకు 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' బిరుదును ఇచ్చారు. గోపాల కృష్ణ గోఖలే సూచనలతో 1905లో కాంగ్రెస్ సభ్యురాలిగా చేరిన సరోజినీ నాయుడు, యుకెలో 1915లో తొలిసారి గాంధీజీని కలుసుకున్నారు. అలా జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1925లో ఇండియన్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ రెండో మహిళా అధ్యక్షురాలయ్యారు. 1932లో కాంగ్రెస్ ప్రతినిధిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 1928లో ఇండియా వ్యాపించిన ప్లేగు వ్యాధి కట్టడిలో చేసిన సేవలకు ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం కైజర్-ఐ-హింద్ అవార్డుతో సత్కరించింది. జాతీయ పోరాటంలో, గాంధీజీతో కలిసి జైలుకు కూడా వెళ్లారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వం సరోజినీని 21 నెలలు జైలులో పెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఆమె చరిత్రకెక్కారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. అలాగే సాహిత్యరంగంలో ఆమె కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సరోజినీ నాయుడు. ‘బర్డ్ ఆఫ్ ది టైం’, ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’, ‘ది బ్రోకెన్ వింగ్స్’, ‘దిఫెదర్ ఆఫ్ డాన్’ ‘గిఫ్ట్ ఆఫ్ ఇండియా’, ‘పాల్కీ క్యారియర్స్’ లాంచి రచనలు ఎందరినో ఆకట్టుకున్నాయి. అలాగే ‘ఫీస్ట్ ఆఫ్ యూత్, ది మ్యాజిక్ ట్రీ, ది విజార్డ్ మాస్క్, ఎ ట్రెజరీ ఆఫ్ పొయెం’లు సరోజినీ నాయుడు ఆంగ్ల సాహిత్యానికి మచ్చుతునకలు. పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా వినసొంపుగా పాడేవారట అందుకే ఆమెను ‘భారత కోకిల’ అన్నారు. 1949 మార్చి 2న లక్నోలోని తన కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. -
నేతాజీ జయంతి.. స్వాతంత్ర్య సమరయోధుడికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ శుభాష్ చంద్రబోస్ 127వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఘన నివాళులు ఆర్పించారు. నేతాజీ దేశ సేవను, ధైర్య సాహసాలను సీఎం జగన్ ప్రశంసించారు. స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారని అన్నారు. .నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. చదవండి: CM Jagan: వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/Qoztfg3awD— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2024 -
Yogi Vemana: సీఎం జగన్ పుష్పాంజలి
సాక్షి, గుంటూరు: సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘసంస్కర్త, కవి మహాయోగి వేమన. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
వాజ్ పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని
-
ప్రేమ పేరుతో స్టార్ హీరో మోసం.. చివరి క్షణాల్లో నరకం.. ‘గ్లామర్ క్వీన్’ విషాద గాథ
సిల్క్ స్మిత.. దక్షిణాదిలో ఈ పేరు తెలియని సీనీ ప్రేమికులు ఉండరు. తన అందచందాలతో ఓ తరం కుర్రకారును ఉర్రూతలూగించిన నటి ఆమె. ఓ దశలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే.. సిల్క్తో పాట లేకుండా శుభం కార్డు పడేది కాదు. వెండితెర శృంగార తారగా నిలిచిపోయిన సిల్క్ స్మిత.. కాలే కడుపుతో రంగుల ప్రపంచంలోకి అడుపెట్టింది. ఊహించని పేరు, డబ్బు, హోదా సంపాదించి.. 36 ఏళ్ల వయసులోనే ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది. నేడు(డిసెంబర్ 2) సిల్క్ స్మిత జయంతి. ఈ సందర్భంగా ఆమె గురించి.. పదేళ్లకే చదువుకు స్వస్తి సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు చెందిన ఓ పేద కుటుంబంలో 1960 డిసెంబర్ 2న జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాల్లోనే గడిచింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగో తరగతిలోనే చదువు ఆపేసింది. చిన్నవయసులోనే పెళ్లి జరిగింది. అయితే అక్కడ కూడా తనకు సుఖం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అత్తమామల ఇంటిని వదిలి చెన్నైకి వచ్చింది. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మేకప్ చేస్తూనే ... ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సిల్క్ స్మిత నటీమణులకు మేకప్ వేయడం ప్రారంభించింది. తర్వాత ఆమెకు నటి కావాలనే కోరిక మొదలైంది. 1979లో వచ్చిన 'పండిచక్రమ్' తమిళ చిత్రం విజయలక్ష్మి పేరునే కాదు... ఆమె జీవనగమనాన్నే మార్చేసింది. ఆ సినిమాలో విజయలక్ష్మి పాత్ర పేరు సిల్క్. ఆ పేరు బాగా పాపులర్ కావడంతో ఆమె పేరు సిల్క్ స్మితగా మార్చుకుంది. తన 17 ఏళ్ల కెరీర్లో 450పైగా సినిమాల్లో నటించి, తన అందచందాలతో మెప్పించింది. చాలా సినిమాల్లో ఆమె ప్రత్యేక గీతాల్లో నటించింది. సిల్క్ కోసమే దర్శకనిర్మాతలు ఐటమ్ సాంగ్స్ పెట్టేవారు. ఆమె చూడడానికే ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చేశారు. హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం.. ఐటమ్ సాంగ్స్కి పెట్టింది పేరుగా సిల్క్ స్మిత వెలుగొందింది. తన అందచందాలతో యువతను ఉర్రూతలూగించింది. అభిమానుల చేత ‘ఇండియన్ మార్లిన్ మన్రో’గా జేజేలు కొట్టించుకుంది. ఒకానొక సమయంలో కథానాయికల కంటే కూడా ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఏ హీరో సినిమా అయినా సరే..అందులో సిల్క్ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. సిల్క్ ఉంటే చాలు సినిమా హిట్టే అనేంతలా పేరు సంపాదించుకుంది.అందుకే కొన్ని సినిమాలకు హీరోయిన్లకు మించిన పారితోషికం సిల్క్కు అందించారు. ఇలా గ్లామర్ వరల్డ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ జీవితం అర్థాంతరంగా ఆగిపోయింది. 36 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచింది.. హీరోయిన్ అవుదామని వచ్చిన సిల్క్..ఇండస్ట్రీలో ‘ఐటమ్గర్ల్’గా మిగిలిపోయింది. అద్భుతమైన నటనతో మెప్పించినా.. నటిగా ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. 90ల్లో స్మిత హవ కాస్త తగ్గింది. అవకాశాలు తగ్గడంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తీవ్రంగా నష్టపోయింది. అలాగే వ్యక్తిగతంగా లవ్ ఫెయిల్యూరూ ఆమెను కుంగదీసింది. ఒకవైపు అప్పులు, ఇంకోవైపు ప్రేమతాలూకు మానసిక క్షోభతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయి1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయింది. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఓ స్టార్ హీరో ప్రేమ పేరుతో మోసం చేయడం తట్టుకోలేకనే స్మిత చనిపోయిందని కొంతమంది అటే.. ఆర్థిక నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకుందని మరికొంతమంది అంటారు. నేటికి స్మిత ఆత్మహత్య వెనుకగల కారణాలపై స్పష్టత లేదు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్లో డర్జీ పిక్చర్ అనే సినిమా వచ్చింది. విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పిల్లల కోసం ఎంతో చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే ప్రపంచస్థాయి విద్యకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఎక్స్ ద్వారా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులూ అర్పించారు. ‘‘మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ.. ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం’’ అని సందేశంలో సీఎం జగన తెలియజేశారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపిన సీఎం జగన్.. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచస్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకువచ్చాం. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత పెంచాం. అంగన్వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో… — YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2023 -
మౌలానా ఆజాద్ జయంతి వేడుకలకు సీఎం జగన్
సాక్షి, ఎన్టీఆర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శనివారం) విజయవాడకు రానున్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి.. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. నగరంలోని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు జరగనుండగా.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం,రుహుల్లా,ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితిసింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏటా నవంబర్ 11వ తేదీని.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని దేశం మొత్తం జాతీయ విద్యా దినంగా, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తుంటారు. -
ఆ పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: భారత దేశ మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, మాజీ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా గుర్తు చేశారాయాయన. 'జై జవాన్, జై కిసాన్' అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన తీసుకున్న ఎన్నోవిప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయి. నేడు లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి సందర్భంగా నివాళులు అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, మాజీ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆయన తీసుకున్న ఎన్నోవిప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని శిఖరాగ్రాన నిలిపాయి. నేడు లాల్ బ… pic.twitter.com/VOOEccVdnM — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2023 -
ఇద్దరూ మహాత్ములే! ఆఖరికి ఆ ఇద్దరి..
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడుగా విశ్వ ప్రసిద్ధుడయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి కూడా మహాత్ముడే. ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టినతేదీ ఒకటే కావడం ఆశ్చర్యకరం, పరమానందకరం. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనాడు జన్మించారు. భారతనేతగా గాంధీ, భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహుదూర్ శాస్త్రి చరిత్రకు చెప్పలేనంత గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆధునిక నాయకులు. ఇద్దరి ముగింపు విషాదాంతమైంది. గాంధీ తుపాకీ కాల్పులకు గురియై మరణించారు.లాల్ బహుదూర్ మరణం అనుమానాస్పదం. హత్యకు గురిఅయ్యారనే భావనే ఎక్కువమందిలో ఉంది. లాల్ బహుదూర్ శాస్త్రి చాలా గొప్పవాడైనా, గాంధీ-నెహ్రూ ప్రాభవం మధ్య చరిత్రలో, లోకంలో రావాల్సినంత పేరు రాలేదని చరిత్రకారుల అభిప్రాయం. గాంధీ భారతీయ ఆత్మ. ఆత్మాభిమానం రూపం దాల్చుకుంటే అది లాల్ బహుదూర్. ఇంత ఆదర్శవంతమైన లాల్ బహుదూర్ శాస్త్రి.. జవహర్ లాల్ నెహ్రూకు, గాంధీకి ప్రియ శిష్యుడు. మహాత్మాగాంధీ జీవితం ఒక ప్రయోగశాల. కేవలం భారతదేశానికే కాదు, ఎల్ల ప్రపంచనాయకులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహానాయకుడు గాంధీ. సత్యాగ్రహం,అహింస అనేవి గాంధీ నిర్మించిన రెండు గొప్ప సిద్ధాంతాలు. ధర్మాగ్రహంతో,న్యాయాగ్రహంతో సత్యాగ్రహంతో అహింసా మార్గంలో నడిచి,భారతదేశానికి బ్రిటిష్ శృంఖలాల నుంచి విముక్తి కలిగించి, స్వేచ్ఛను ప్రసాదించాడు. భగవద్గీతను ఆశ్రయించాడు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించాడు, న్యాయపోరాటంలో గాంధీ జాతికి జయాన్ని కానుకగా ప్రసాదించాడు.భారతదేశ చరిత్రలో ఆధునిక కాలంలో,స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారత్ కు తొలి విజయాన్ని అందించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. 1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశాన్ని నడిపించి, గెలిపించిన ధీరుడు లాల్ బహుదూర్ శాస్త్రి. 20వ శతాబ్దంలో ప్రపంచమానవాళిని ప్రభావితం చేసినవారిలో మహాత్మాగాంధీదే అగ్రస్థానం.సత్యాగ్రహం, సహాయనిరాకరణ గాంధీ ఎంచుకున్న శక్తిమంతమైన ఆయుధాలు.వీటి విలువను ప్రపంచదేశాలు అర్ధం చేసుకోడానికి చాలా కాలం పట్టింది.ఇప్పటికీ చాలా దేశాలకు అసలు అర్ధమే అవ్వలేదు.హిందూ-ముస్లింల మత సామరస్యానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆ అంశమే అతన్ని బలితీసుకుంది. టాల్ స్టాయ్ ను గాంధీ గురువుగా భావించాడు.సామ్రాజ్యవాదం, హింసా విధానాలపై వ్యతిరేకత వీరిద్దరినీ మానసికంగా కలిపింది. గాంధీ జీవితం మొత్తం సత్యశోధనకు అంకితం చేశారు. తను చేసిన తప్పులను తెలుసుకోవడం,వాటి నుంచి నేర్చుకోవడం మార్గంగా సాగారు. అందుకే గాంధీ ఆత్మకథకు 'సత్యశోధన' అని పేరు పెట్టుకున్నారు. సత్యంతో చేసిన ప్రయోగాలే అతని జీవితం. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తిగా నిలిచినవాడు మహాత్మాగాంధీ.ఇటువంటి వ్యక్తి నిజంగా మన మధ్యనే జీవించాడంటే? తర్వాత తరాలవారు నమ్మలేరని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చేసిన వ్యాఖ్య అజరామరం. జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరించాడని మరో మహానేత మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు.నా జీవితమే సందేశం,అని గాంధీయే అన్నాడు. ఇంతటి గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగి దేశభక్తి,నిజాయితీ, ప్రయోగాలు,పవిత్రత,సత్యం, ఆత్మాభిమానం ఉఛ్వాసనిశ్వాసలుగా జీవించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నో నూత్న ప్రయోగాలు ఆవిష్కరించాడు. జవానులను, రైతులను సమానంగా భావించాడు. ఒకరు యుద్ధక్షేత్రంలో ఉంటారు. ఇంకొకరు వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు.జై జవాన్-జై కిసాన్ నినాదం తీసుకువచ్చినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. వ్యవసాయ విప్లవానికి (గ్రీన్ రెవల్యూషన్) కు బాటలు వేసింది కూడా ఈయనే. పంటకు ఎంత విలువ ఇచ్చాడో, పాడికి కూడా అంతే విలువ ఇచ్చాడు.శ్వేతవిప్లవం ఈయన తెచ్చిందే.సోవియట్ యూనియన్, శ్రీలంకతో ఒప్పందాలు కుదుర్చుకొని బంధాలను గట్టి పరచి, విదేశీ విధానంలోనూ తన ముద్ర వేసుకున్నాడు.నెహ్రు క్యాబినెట్ లో మొట్టమొదటి రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి. దేశంలో జరిగిన ఒక రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.అన్నేళ్లు కేంద్ర మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు చివరకు సొంత ఇల్లు కూడా లేదు.కుటుంబ సభ్యుల ఒత్తిడితో అప్పుచేసి కారు కొనుక్కున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే? మహాత్మాగాంధీ , జవహర్ లాల్ నెహ్రు విధానాలకు లాల్ బహుదూర్ శాస్త్రి ఆత్మీయమైన అసలు సిసలు వారసుడు.ఆర్ధిక విధానాలలో నెహ్రును కూడా దాటి ముందుకు వెళ్లారు.మరో గాంధీ పుట్టడు, మరో లాల్ బహుదూర్ శాస్త్రి పుట్టడు.వీరి సిద్ధాంతాలు, ఆచరించిన మార్గాలు ప్రస్తుత కాలంలో ఆచరించడానికి కష్టమైనా,ఏదో ఒక రోజు వీరిని తప్పక అనుసరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ మహానేతలు సర్వకాలీనులు. వీరి సిద్ధాంతులు ఎప్పటికీ అవసరంగానే నిలుస్తాయి. -మాశర్మ సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..) -
గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..
మహాత్ముడి అవసరం పెరిగిందిగాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనది. అహింస అనే ఆయుధంతో, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ‘డూ ఆర్ డై’ ఎందరినో ఉత్తేజితులను చేసింది. ‘విజయమో, వీర స్వర్గమో’ అనే నినాదంతో యావత్ దేశ ప్రజలు ముందుకురికి భారత గడ్డ మీద నుంచి బ్రిటిష్ వారిని తరిమేశారు. మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరం తిరగకుండానే 1948 జనవరి 30న ఆయన హత్యకు గురై దేశాన్ని శోకసంద్రంలో ముంచారు. ఆయన ఘనత ప్రపంచ మంతా గుర్తించింది. అయితే భారతదేశంలో ఆయన్ని మెల్లగా మరచిపోతున్న ధోరణి కనిపించడం బాధాకరం. గాంధీజీ జయంతి సందర్బంగా ఆయన ఆశ యాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవ లసిన అవసరం ఉంది. ‘అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్లు ఎప్పుడైతే క్షేమంగా వెళతారో ఆరోజే నా దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని ప్రకటించారు గాంధీ. గాంధీ సహించనివి– మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు, కక్షలు, వైషమ్యాలు. కానీ ఇవే ఎక్కువైన ఈ సమాజంలో ఆయన ఆదర్శం గాలికి కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మతసామరస్యాన్ని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. కానీ ఇవాళ మత అసహనం పెచ్చరిల్లుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి చంపేసే దృశ్యాలు అనేకం చూస్తున్నాం. నేడు అంతటా, అన్ని రంగాలలో అవినీతి పెచ్చరిల్లింది. గాంధీజీ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా గ్రామాలు స్వయం పోషకత్వం సాధించి ఏ గ్రామానికది ‘స్వరాజ్యం’గా అభివృద్ధి చెందాలనుకున్నారు. మరి ఆయన కలలను మన పాలకులు ఎంతవరకు నెరవేర్చారో సమీక్షించుకోవాలి. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి ‘ 93915 23027 (చదవండి: తెలంగాణ పోరాట స్ఫూర్తి!) -
తెలుగు సినీ దిగ్గజం.. అక్కినేనికిదే శతజయంతి నివాళి!
తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లాలో పుట్టి సినీ ప్రపంచంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యం ఏర్పరచుకున్న ఏకైక నటుడు మన అక్కినేని. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో కళామతల్లి ఒడిలో ఒదిగిపోయారు. ఆయన శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. (ఇది చదవండి: భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్) అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ తారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు, సుమంత్, నాగచైతన్య, అమల, అఖిల్ ఆయనకు నివాళులర్పించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, మంచు విష్ణు, నాని, దిల్ రాజు, మోహన్ బాబు, రామ్ చరణ్, మహేశ్ బాబు, సుమ కనకాల, టాలీవుడ్ సినీ పెద్దలు పాల్గొన్నారు. A moment of joy and pride for the fans of #AkkineniNageswaraRao Garu ✨💫 Former Vice President of India Shri. @MVenkaiahNaidu Garu unveils the statue of #ANR garu at @AnnapurnaStdios marking the centenary birthday ❤️ Watch ANR 100 Birthday Celebrations live now! -… pic.twitter.com/5ajMSNFiM1 — Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2023 -
భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్
టాలీవుడ్ దిగ్గజం, వెండితెరపై చెరదని ముద్ర వేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తన సినీ జీవితంలో దాదాపు 250కు పైగా చిత్రాలతో ఏడు దశాబ్దాల కాలం పాటు వెండితెరపై అలరించిన నటుడు బహుదూరపు బాటసారి ఆయన. 16 ఏళ్ల వయసులోనే పుల్లయ్య చిత్రం ధర్మపత్నిలో చిన్నవేషం వేసినా.. అక్కినేని సినీ యాత్ర మొదలైంది మాత్రం 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాతోనే. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన శతజయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!) మెగాస్టార్ ట్వీట్లో రాస్తూ.. 'శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి , నా సోదరుడు నాగార్జునకు, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు, సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !!' శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా పేరొందిన అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. 🙏🙏 ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని… pic.twitter.com/yrAxhk7pgb — Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2023 -
భాషోద్యమంలో పిడుగు గిడుగు!
"దేహబలమున కోడి రామమూర్తి- బుధ్ధిబలమున గిడుగు రామమూర్తి" అంటూ అభివర్ణించిన ఓ కవి మాటలు ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి. నేడే (ఆగష్టు 29) గిడుగు వెంకటరామమూర్తి జయంతి. ఆ మహనీయుని యశఃకాయానికి 160 ఏళ్ళు నిండుతున్న పండుగ వేళలో మనమున్నాం.ఇప్పటికే వారోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి.ప్రతి ఆగస్టు 29వ తేదీ గిడుగు స్మృతికి నివాళిగా 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. సరే! కొందరు మొక్కుబడిగా చేస్తారు. మరికొందరు భాషానురక్తితో మొక్కుగా భక్తితో చేస్తారు. ఈరోజు మనం రాసే భాష వెనకాల ఆయన స్వేదం ఉంది. నిత్యం తలచుకోవాల్సిన మాననీయుడు గిడుగు. తెలుగు వెలుగు గిడుగు ఆధునిక తెలుగు మానవుడు ఎలా చదవాలి, ఎలా రాయాలి,ఎలా అర్ధం చేసుకోవాలి,భాషామయమైన ప్రయాణం ఎలా చెయ్యాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు. ఈరోజు మనం రాసే భాష,చదివే భాష,పుస్తకాల్లో,పత్రికల్లో, ఉపన్యాసాల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న భాష,మనల్ని కదిలిస్తున్న భాష గిడుగు చేసిన త్యాగాలు,వేసిన మూలాల ఫలమేనని విశ్వసించాలి. గిడుగు వెంకటరామమూర్తి ఎప్పుడో 160ఏళ్ళ నాటి వాడు. ఎటు చూసినా పండితులు, కవులు, వారికి మాత్రమే అర్ధమయ్యే గ్రాంథిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగినవాడు. ఈ విధానం ఇదే రీతిలో సాగితే, సామాన్యుడికి ఆ జ్ఞాన ఫలాలు ఎప్పుడు అందాలి,భాష ఎప్పుడు వికాసం చెందాలి, జనబాహుళ్యం ఆ భాషకు ఎన్నడు దగ్గరవ్వాలని మదనపడి మనకోసం అలోచించిన మనమనీషి. Warm wishes on #TeluguLanguage Day! The KMC team pays homage to Gidugu Venkata Ramamurthy, whose ideas and literary work for social reform endure, leaving an indelible mark on generations. pic.twitter.com/bnErRj3wmV — Commissioner Kadapa (@KadapaComsr) August 29, 2023 ఆధునిక భాషా మహోద్యమంలో తొలి అడుగు వేసినవాడు గిడుగు. భాషాసాహిత్యాలు,చరిత్ర పుష్కలంగా,క్షుణ్ణంగా చదువుకొని,ముందుగా తను జ్ఞాన స్వరూపుడిగా తయారై, సామాన్యుడి చెంతకు భాషను చేర్చాలని రంగంలోకి దిగిన చిచ్చరపిడుగు గిడుగు. ఇటు వ్యావహారిక భాష - అటు సవర భాష కోసం జీవితమంతా అంకితమయ్యాడు. ఆరోగ్యం కోల్పోయాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. గిరిజనులను ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి పాఠాలు చెప్పాడు. కొండలు కోనలు తిరిగి భాషను సామాన్యుడికి చేర్చిన అసామాన్యుడు గిడుగు. అందరికీ అర్ధమవ్వాలానే తపన తప్ప,గ్రాంథిక భాషను ఎన్నడూ వ్యతిరేకించలేదు. పద్యాలను, కావ్యాలను, వ్యాకరణాలను,ఛందస్సును పండితులను,కవులను ఎప్పుడూ తూలనాడలేదు.సంప్రదాయమైన సర్వ వ్యవస్థలనూ గౌరవించి, అధ్యయనం చేసి, భవ్య మార్గాన్ని పట్టిన నవ్య ప్రయోగశీలి గిడుగు వెంకటరామమూర్తి. అడవుల్లో జీవించేవారు మాట్లాడుకునే 'సవర' భాషకు వ్యాకరణం రూపకల్పన చేసి, శాస్త్రీయత తీసుకువచ్చిన ఘనుడు. అధ్యాపకుడిగా, జ్ఞాన సముపార్జన కోసం విద్యార్థులు పడే కష్టాన్ని అర్ధం చేసుకున్నాడు. తమ భావాలకు అక్షరరూపం ఇవ్వడానికి సామాన్యులు పడే తపనను తెలుసుకున్నాడు. గ్రాంథిక భాషా బంధనాల నుంచి విద్యా విధానాన్ని తెంచి, ప్రజలభాషలోకి తెచ్చాడు.దాని వల్ల చదివేవారి సంఖ్య,చదువరుల సంఖ్య పెరిగింది.తద్వారా, తెలుగునేలపై అక్షరాస్యత పెరిగింది. ఆలోచన పెరిగింది. ఆలోచనను వ్యక్తీకరించే శక్తి పెరిగింది.వాడుకభాష అవసరాన్ని చెబుతూ వీధివీధులా తిరిగాడు. The Governor said the Telugu Language Day marks the birth anniversary of eminent Telugu linguist, poet and visionary Sri Gidugu Venkata Ramamurthy.#Telugulanguageday #giduguvenkataramamurthy — governorap (@governorap) August 29, 2023 పండితులతో గొడవలు పడ్డాడు. ఇంటినే బడిగా మార్చాడు. సొంతంగా 'తెలుగు' అనే పేరుతో ఒక పత్రికను నడిపాడు. గురజాడ,కందుకూరి వీరేశిలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి,తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి,పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైనవారు గిడుగుకు అండగా నిలిచారు.ఆయనతోకలిసి, వాడుకభాషా ఉద్యమంలో నడిచారు. బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని మొదలైన వాడుక భాషా పదాలతో తిరుపతి వేంకటకవులు 'పాండవ ఉద్యోగ విజయాలు' పేరుతో పద్యనాటకాలు రాయడానికి ప్రేరకుడు గిడుగు. దానికి కారకుడు,పోషకుడు పోలవరం జమీందారు రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు. వాడుకభాష కోసం ఉద్యమించే గిడుగు వ్యాకరణానికి,ఛందస్సుకు ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా, వ్యాకరణపరమైన తప్పులు జరిగినా ఊరుకునేవాడు కాడు. ఎంతటి పండితుడినైనా చీల్చి చెండాడేవాడు. మీసాలపై తిరుపతి వేంకటకవులు చెప్పిన పద్యం తెలుగులోకంలో సుప్రసిద్ధం. మీసం పెంచడం సంగతి తర్వాత... ముందు..ఆ పద్యంలో ఉన్న దోషం సంగతి చూడు...అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి గిడుగు మొట్టికాయలు వేశాడు. గెల్చితిరేని అని ఉండాలి.నువ్వు గెల్చిరేని అని రాశావు,ఇది తప్పు,సరిదిద్దుకో... అంటూ తిరుపతి వేంకటకవులను నిలదీశాడు. ఆమ్మో! గిడుగు పిడుగే అంటూ చెళ్ళపిళ్ళ సర్దుకున్నాడు. #TeluguLanguageDay Gidugu Venkata Ramamurthy, born on 29 August 1863, was a Telugu writer and one of the earliest modern #Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a #language comprehensible to the common man #philately pic.twitter.com/15sG2jw4Q1 — South India Philatelists' Association, Chennai (@SIPA_chennai) August 29, 2023 అంతటితో ఆగక 'గిడుగు పిడుగే' అని ప్రత్యేక వ్యాసం కూడా రాశాడు. 'పాండవ ఉద్యోగవిజయాలు' వంటి పద్యకృతులతో పాటు,చెళ్ళపిళ్ళ ఎన్నో వచన రచనలు చేశారు. ఇవన్నీ వ్యావహారిక భాషలోనే రాశారు. ఇలా,తిరుపతి వేంకటకవుల వంటి సంప్రదాయ పద్యకవులను కూడా వాడుక భాషవైపు మళ్లించిన ఘటికుడు గిడుగు. ముఖ్యంగా చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి ఆ బాటలో నడిచారు. స్వయంకృషితో శాసనాల భాషను అర్ధం చేసుకోవడం నేర్చుకున్న పట్టుదల గిడుగు సొంతం.ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పర్లాకిమిడి వంటి తెలుగుప్రాంతాలు కూడా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి. ఈ విధానాన్ని గిడుగు తీవ్రంగా వ్యతిరేకించడమేకాక, తెలుగునేలపైనే జీవించాలనే సంకల్పంతో,తన సొంతవూరు పర్లాకిమిడిని వదిలి రాజమండ్రికి తరలి వచ్చేశాడు. గిడుగుకు తెలుగుభాష,గాలి,నేలపై ఉండే భక్తికి,ప్రేమకు అది గొప్ప ఉదాహరణ.1937లో తాపీ ధర్మారావు సంపాదకుడిగా 'జనవాణి'అనే పత్రికను స్థాపించారు.కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టారు.అదంతా కూడా గిడుగు ప్రభావమే.గిడుగు,గురజాడ ఇద్దరూ విజయనగరంలో సహాధ్యాయులు. ఇద్దరూ వాడుకభాషకోసం ఉద్యమించినవారే కావడం విశేషం. సంస్కృతం, ఇంగ్లిష్,చరిత్ర ముఖ్య విషయాలుగా గిడుగు బి.ఏ పూర్తి చేశారు. సంస్కృతం,ఇంగ్లిష్,తెలుగు బాగా చదువుకున్నారు. సామాన్యులకు అర్ధం కావడం కోసం తన భాషాపాండిత్యాన్ని కుదించుకొని,వాడుకభాషలో రచనలు చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలను చైతన్య పరిచారు,జ్ఞానాన్ని సామాన్యుడి చెంతకు చేర్చారు. కావ్యాలను, ప్రబంధాలను,గ్రాంథికభాషను, అలంకారశాస్త్రాలను గౌరవిస్తూనే, ఆధునిక భాషాయానం చేసిన అత్యాధునికుడు,దార్శనికుడు, ఆదర్శప్రాయుడు గిడుగు. భాషను సామాన్యుడికి చేర్చమని చెప్పాడు కానీ,భాషాపాండిత్యాలు, అధ్యయనాల స్థాయిని దిగజార్చమని ఎప్పుడూ చెప్పలేదు. ఛందస్సు,వ్యాకరణం,పద్యాలు, ప్రబంధాలను వదిలివెయ్యమని గిడుగు ఏనాడూ అనలేదు. భాషకోసమే శ్రమించి,సామాన్యుడి కోసమే తపించి జీవించిన పుణ్యమూర్తి గిడుగు రామమూర్తి. విద్యార్థికి ప్రతి దశలో తెలుగు భాషను అందించాలి. కనీసం 10ఏళ్ళ వయస్సు వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.… pic.twitter.com/Ie0WoIsL0z — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2023 తెలుగుభాషా,సాహిత్యాలు చదువుకున్నవారికి ప్రోత్సాహంలో, ఉపాధిలో, ఉద్యోగాలలలో పెద్దపీట వెయ్యాలి. తెలుగు చదువుకున్నవారు ఆత్మన్యూనతకు గురయ్యే పరిస్థితులు కల్పించరాదు. 'పద్యం' మన ఆస్తి, 'అవధానం' మన సంతకం. ఆధునికత పేరుతో వ్యాకరణం, ఛందస్సులను దూరం చేస్తే? కొన్నాళ్ళకు మనవైన పద్యాలు, అవధానాలు కానరాకుండా పోతాయి. మన భాషా భవనాల పునాదులు కదిలిపోతాయి.మెల్లగా మనదైన సంస్కృతి మృగ్యమైపోతుంది. తెలుగును వెలిగించడం, ఆ వెలుగులో జీవించడమే గిడుగు వంటి తెలుగు వెలుగులకు మనమిచ్చే అచ్చమైన నివాళి. భాష,సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడమే నిజమైన వేడుక. మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి! నేడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి) -
Telugu Language Day: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి!
గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి వ్యవహారిక భాష అనగానే మన మదిలో మెదిలేది గిడుగు వేంకట రామమూర్తి పంతులు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషో ద్యమం కోసం గ్రాంథిక వాదులతో అలు పెరగని పోరాటం చేశారు. వారు సలిపిన భాషోద్యమం అచ్చంగా అభ్యుదయ సమాజం కోసమే అని చెప్పాలి. నోటి మాటకు, చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు. పండితులకే పరిమితమైన భాషను, కొద్దిమంది మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉన్న విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలని ఆయన పరితపించారు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన సంప్రదాయ భాషా వాదులపై సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే సంప్రదాయ భాషా వాదులు ఆయన వాదనను బలంగా తిరస్కరించారు, అయినా గిడుగు వారు ఉద్యమించారు. ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థ మయ్యే రీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు వారు వాదించారు. సంప్రదాయ సాహిత్య వాదులు, కవులు అయిన తిరుపతి వేంకట కవులు కూడా భాషలో మార్పుల్ని సమర్థించారు. ప్రారంభంలో కందు కూరి వారు సంప్రదాయ సాహిత్య పక్షాన నిలి చినా తదనంతరం గిడుగు వారి ఉద్యమ దీక్షలో సత్యాన్ని గ్రహించి ఆయన కూడా వ్యవహారిక భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఫలితంగా గిడుగు వారి ఉద్యమం మరింత బలపడింది. గురజాడ, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమే కాదు, అద్భుతమైన భావజాలాలను కలబోసుకున్న మిత్రులు. విజయనగరంలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఎంతో కష్టపడి సవరభాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంతడబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‘ బిరుదు ఇచ్చారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో ‘సవర–ఇంగ్లీషు కోశా’న్నీ తయారు చేశారు. ప్రభుత్వం ఆయనకు ‘కైజర్–ఇ–హింద్’ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రిక నడిపారు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ సభలో నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశారు గిడుగు. ‘సాహితీ సమితి’, ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వంటి సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామ మూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు. ఆ క్రమంలో విశ్వవిద్యాలయాలన్నీ వ్యవ హారిక భాషకు పట్టం కట్టడం ప్రారంభించాయి. కాగా మరోవైపు గిడుగు వారి అనుంగు శిష్యుడైన తాపీ ధర్మారావు సంపాదకీయాలతో ప్రారంభ మైన వ్యవహారిక భాష... పత్రికల్లోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వ తాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు అలు పెరుగని వ్యవహారిక భాషోద్యమం చేస్తూ జనవరి 1940 జనవరి 22న కన్ను మూశారు. భాషను పరిపుష్టం చేయడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. భాషాభి మానులందరూ కూడా ఇందులో మమేకం కావాలి. తెలుగువారు తెలుగుతో పాటుగా ఇంగ్లీషు వంటి అంతర్జాతీయ భాషలలో పట్టు సాధించగలిగితే మన సాహిత్య అనువాదాలు ప్రపంచవ్యాప్తమవుతాయి తెలుగు వారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో నిలబెట్ట గలుగుతారన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే మనకోసం, మన పాలనావసరాల కోసం, ‘మన సంస్కృతి–సంప్రదాయాల కోసం, తెలుగు భాష... భవిష్యత్తు అవసరాల కోసం ఇంగ్లీష్ భాష’ అనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భాషావాదులు కువిమర్శలు పట్టించు కోకుండా వాస్తవాలను గ్రహించగలిగితే, తెలుగు భాష అజంతం, అజరామరం అనేదానికి సార్థకత ఉంటుంది. ప్రపంచ పటంలో తెలుగు కీర్తి రెపరెప లాడుతుంది. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (చదవండి: ''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..'') -
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలలోనూ రాజకీయాలా ?
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చర్చలు జరపడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగేళ్లుగా కమలనాధుల కటాక్షం కోసం పరితపిస్తున్న చంద్రబాబు తాజాగా ఎన్టీఆర్ కార్యక్రమాన్ని తన రాజకీయాలకు వేదికగా చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం తన భార్య సోదరి పురందేశ్వరి ఉపయోగించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి చంద్రబాబు ముందుగానే చేరుకున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి వచ్చారు. అదే అదనుగా భావించి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట కలిపారు. ఓ వైపు కార్యక్రమం నడుస్తుండగానే చంద్రబాబు వంగిమరి జేపీ నడ్డా చెవిలో గుసగుసలు కొనసాగించారు. ఆ తర్వాత కార్యక్రమం ముగియగానే తేనేటి విందు జరిగింది. అక్కడ జేపీ నడ్డాతో పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చర్చిస్తుండగా చంద్రబాబు మరోసారి చేరుకున్నారు. టీ తాగి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం చంద్రబాబు రెండో విడత చర్చలు నడ్డాతో మొదలు పెట్టారు. ఈసారి పురంధేశ్వరి సైతం చర్చల మధ్యలో ఉన్నారు. వీరు ముగ్గురు దాదాపు పది నిమిషాలు రాజకీయ అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. ఓ వైపు పవన్, నాదెండ్ల మనోహర్ ద్వారా బీజేపీ పొత్తు కోసం లాబీ చేస్తున్న బాబు , ఈ సారి పురంధేశ్వరి ద్వారా బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారట. ఇందుకోసం తాజాగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు చేతిలో తన తండ్రికి, తన భర్తకి జరిగిన అన్యాయాన్ని పురంధేశ్వరి మరిచి బాబు స్వార్థ రాజకీయాలకు సహకరించడం పై ఇంటా, బయట విమర్శలు వస్తున్నాయి. అయితే, చంద్రబాబు స్వభావం తెలిసిన కమలనాథులు ఇప్పటికే బాబుకి ఇవ్వాల్సిన సందేశం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు ఆయన వల్ల రాజకీయాలలో ఎదిగిన బాబు, ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని తన రాజకీయాలకు వాడుకోవడం విషాదం. దానికి పురందేశ్వరి లాంటి వారు సైతం సహకరించడం సరైంది కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మనిషి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నా మామకే వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ నుంచి సీఎం కుర్చీని లాగేసుకున్న వ్యక్తి చంద్రబాబని సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. సోమవారం నగరిలో విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని మండిపడ్డారు. ‘ఎన్టీ రామారావును సీఎం కుర్చీని వీళ్లే లాగేసుకున్నారు. వెన్ను పోటు పొడిచారు. పార్టీని లాగేసుకున్నారు. ఎన్టీఆర్ చావుకు వీళ్లే కారణం అయ్యారు. ఇదే దుర్మార్గుడు ఇదే ఎన్టీఆర్ చనిపోగానే శవాన్ని లాక్కుకుంటారు. ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు. ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు ఇదే చంద్రబాబు. ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నా’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. చదవండి: నన్ను పిలవకపోవడం దుర్మార్గం.. అసలు విలన్ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి ‘పురంధేశ్వరి! ఒక్క క్షణం ఆలోచించమ్మా!’ -
ఈ ఆనంద సమయంలో మీరు లేరు.. తారకరత్నను గుర్తుచేసుకున్న ఆలేఖ్య
నందమూరి కుటుంబం నుంచి 'ఒకటో నంబర్ కుర్రాడు'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్గానూ ప్రేక్షకుల్ని ఆయన అలరించారు. ఆపై రాజకీయాల్లో రానించాలనే ఆలచనతో తొలి అడుగు కూడా వేశారు. కానీ చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. సుమారు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వెంటిలేటర్పైనే తారకరత్నకు చికిత్స అందించారు. కానీ ఫలితం దక్కలేదు. ఇదే ఏడాది ఫిబ్రవరి 18న ఆయన మరణించారు. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సంఘటన చూసిన వారందరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన భర్త మరణ వార్తను జీర్ణించుకోలేని అలేఖ్యను ఓదార్చడం ఆ సమయంలో ఎవరి వల్ల కాలేదు. తాజాగ వారి పిల్లల పుట్టినరోజు సందర్భంగా తారకరత్నను అలేఖ్యరెడ్డి గుర్తుచేసుకున్నారు. నేడు తారకరత్న కవలపిల్లులు అయిన తాన్యారామ్, రేయాల పుట్టినరోజు. దీంతో అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ చేశారు. అంతేకాకుండా తారకరత్నతో వారికున్న తీపిగుర్తులకు సంబంధించిన ఫోటోలను వీడియో రూపంలో షేర్ చేశారు. మొదట వారి పెద్ద కూతురు అయిన నిష్క తారకరత్న ఫోటోకు పువ్వులు పెడుతుండగా ఇద్దరు ట్విన్స్ ఆమెకు సాయిం చేస్తున్నారు. (ఇదీ చదవండి: పూజా హెగ్డేకు సర్జరీ.. అసలు కారణం ఇదే!) ఇలా ఆ ఫోటోలు చూస్తూ.. తారకరత్నను మరోసారి గుర్తుచేసుకున్న ఎవరైనా కూడా భావోద్వేగానికి గురికాక తప్పదు. ఆ వీడియోతో పాటు తారకరత్న గురించి అలేఖ్య రెడ్డి ఇలా రాసుకొచ్చారు. తాన్యారామ్, రేయాలకు ఎంత ప్రయత్నించినా, ఎంత ఆలోచించినా వారిద్దరికీ పుట్టునరోజు శుభాకాంక్షలను ఆనందంగా చెప్పలేకపోతున్నానని తారకరత్నను ఆలేఖ్య గుర్తుచేసుకున్నారు. 'ఇలాంటి ఆనంద సమయంలో మీరు లేరు. కానీ పిల్లల మొఖంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. అలా మాతోనే ఉంటావ్. వర్షం కురిసే రోజు ఇంద్రధనుస్సు కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, పొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నావు. ఓబు (తారకరత్న), మమ్ము, ఎన్ నిష్క.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీరు ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను రెట్టింపు చేయాలని, వేడుకలను రెట్టింపు చేయాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు.' అని ఆలేఖ్య తెలిపారు. పిల్లల పేర్లలో ఎన్టీఆర్ మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే ఎన్టీఆర్ పేరు వస్తుంది. ఇంగ్లీష్ అక్షరాలు నిష్క లో మొదటి అక్షరం N, తాన్యారామ్లో T, రేయాలో R.. ఇలా ఎన్టీఆర్ పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారు తారకరత్న. View this post on Instagram A post shared by Alekhya Tarak Ratna (@alekhyatarakratna) -
నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో తన భర్త రాజకీయ జీవితం అత్యంత క్రూరంగా ముగిసిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్బంగా వీర్ భూమిలో ఆయనకు నివాళులర్పించి ఢిల్లీలోని జవహర్ భవన్లో జరిగిన జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు సోనియా గాంధీ. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 25వ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ.. నా భర్త రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం చాలా తొందరగా అత్యంత కిరాతకంగా ముగిసినప్పటికీ ఆయన ఈ కొంత కాలంలోనే ఎవ్వరికి సాధ్యం కాయాన్ని ఎన్నో ఘనతలు సాధించారన్నారు. ఆయనకు దొరికిన కొద్దిపాటి సమయంలోనే దేశం కోసం, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఎంతో చేశారని జ్ఞాపకము చేశారు. రాజీవ్ గాంధీ ముందుచూపుతో వ్యవహరించడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా పంచాయతీల్లోనూ, మున్సిపల్ కార్యవర్గాల్లోనూ మహిళలు సుమారు 15 లక్షల మంది ఉన్నారన్నారు. ఇదంతా ఆనాడు రాజీవ్ గాంధీ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడో వంతు స్థానం కల్పించడానికి చేసిన కృషి ఫలితమేనన్నారు. అలాగే ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు కుదించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా సోనియా గాంధీ ప్రస్తుత పరిస్థితుల గురించి వివరిస్తూ మత సామరస్యాన్ని చెడగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడమే ప్రధాన ఎజెండాగా చేసుకుంటున్నారు. వీరికి మరికొంత మంది మద్దతు తెలపడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు. రాజీవ్ గాంధీ మత, జాతి, భాష, సంస్కృతులను సున్నితమైన అంశాలుగా చెబుతూ వీటిని అందరం కలిసి పండగలా నిర్వహించుకుంటేనే జాతి ఐక్యత సాధ్యమని నమ్మేవారన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం 40 ఏళ్ల వయసులో ప్రధాన మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1989 డిసెంబర్ 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1944, ఆగస్టు 24న జన్మించిన ఆయన ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో 1991, మే 21న మృతి చెందారు. ఈ జాతీయ సద్భావనా అవార్డు 2021-22 సంవత్సరానికి గాను రాజస్థాన్ లోని గురుకుల పాఠశాల బానస్థలి విద్యాపీఠ్ మహిళల గురుకుల సంస్థకు అందజేశారు. ఆ సంస్థ తరపున సిద్దార్ధ శాస్త్రి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఇది కూడా చదవండి: ‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’ -
'సౌందర్య చనిపోలేదు.. ఆ రూపంలో ఇంకా బతికే ఉంది'
సినిమాల్లో గొప్ప పేరు సంపాదించుకున్న నటీనటులు చాలా తక్కువ మందే ఉంటారు. కొందరికి ఫేమ్ వచ్చినా దాన్ని ఎక్కువకాలం కొనసాగించాలంటే అంతా ఈజీ కాదు. అప్పట్లోనే మంచి గుర్తింపు సాధించుకున్న నటీమణులు కొందరు ఊహించని పరిణామాలతో మనకు దూరమయ్యారు. అందంతో తెరపై ఆకట్టుకున్న కొందరు హీరోయిన్లు చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దురదృష్టవశాత్తు సినీ ఇండస్ట్రీ కోల్పోయిన ఆ స్టార్ హీరోయిన్ గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: చనిపోయే రోజు సౌందర్య ఏం కోరిందో తెలుసా?) సౌందర్య పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి తనదైన నటనతో మెప్పించింది. ప్రధానంగా వెంకటేశ్ జోడీగా సూపర్ హిట్ చిత్రాల్లో చేసింది. రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు లాంటి విజయవంతమైన జోడీగా నిలిచారు. అంతే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించారు. కాగా.. 1971 జూలై 18న కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగల్ గ్రామంలో జన్మించిన సౌందర్య విమాన ప్రమాదంలో మరణించారు. 2004లో ఏప్రిల్ 17న ఎన్నికల ప్రచారానికి వెళ్తండగా ఆమె ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనతో సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. జూలై 18న మంగళవారం ఆమె 19వ జయంతి సందర్భంగా సౌందర్యను ఓసారి స్మరించుకుందాం. పెళ్లై ఏడాది కాకముందే.. సౌందర్యం తన మేనమామ, బాల్య స్నేహితుడైన జీఎస్ రఘును 2003 ఏప్రిల్ 27న పెళ్లి చేసుకున్నారు. సామాజిక సేవలో ముందుండే సౌందర్య ప్రజల కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేపట్టింది. తన స్వగ్రామమైన ముళబాగల్ తాలూకాలోని గంగికుంటను అభివృద్ధి పరచారు. అయితే సౌందర్య, తన తమ్ముడు అమర్నాథ్ ప్రమాదంలో చనిపోయాక వారి కుటుంబ సభ్యులు నేరవేర్చారు. అమర సాత్విక సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' పేరుతో అమర సౌందర్య ఫౌండేషన్ స్కూల్ను బెంగళూరులో స్థాపించారు. ఈ పాఠశాల ద్వారా మానసికంగా ఎదుగుదల లేని(ఆటిజం) పిల్లలకు విద్యనందిస్తున్నారు. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఎంతో మంది విద్యార్థుల గుండెల్లో ఇంకా బతికే ఉంది. చివరి కోరిక తీరకుండానే! ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు తన వదినను కాటన్ చీర, కుంకుమ తీసుకురమ్మని అడిగిందట.! అప్పుడు తన దగ్గర కాటన్ చీర లేకపోవడంతో ఒకటి కొని తీసుకురమ్మని కోరిందట. అప్పటికే ఆమె బీజేపీలో చేరడంతో ఆ చీర కట్టుకుని ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకుంది సౌందర్య. తనకు కుంకుమ ధరించడం అలవాటు, కాబట్టి దాన్ని కూడా తెమ్మని చెప్పింది. కానీ ఇంతలోనే సమయం కావస్తోందని విమానం ఎక్కేయడం, అది కూలిపోవడంతో సౌందర్య అక్కడికక్కడే మరణించడం తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది సౌందర్య వదిన. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు ) -
కాంగ్రెస్ VS బీజేపీ: పీవీ జయంతి చుట్టూ రాజకీయాలు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102 వ జయంతి సందర్భంగా జాతీయ నేతలతోపాటు తెలుగు రాష్ట్రాల నేతలు ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం నెక్లెస్రోడ్డులోని పీవీ ఘాట్కు వెళ్లి పలువురు నేతలు ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. దేశానికి పీవీ చేసిన సేవలను సర్మించుకున్నారు. పీవీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్విటర్లో పంచుకున్నారు. భారతదేశ అభివృద్ధికి అతని దూరదృష్టి గల నాయకత్వం, నిబద్ధత ఎంతో గొప్పదని, మన దేశ ప్రగతికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను గౌరవిస్తున్నామంటూ పీవీని ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. Remembering Shri PV Narasimha Rao Ji on his birth anniversary. His far-sighted leadership and commitment to India’s development was noteworthy. We honor his invaluable contributions to our nation's progress. — Narendra Modi (@narendramodi) June 28, 2023 అదే విధంగా పీవీకి కాంగ్రెస్ నివాళులు అర్పించింది. పీవీ నరసింహారావు భారత ఆర్థిక వ్యవస్థకు అనేక ఉదారవాద సంస్కరణలను అందించారని పేర్కొంది. నేడు స్వదేశంలో, విదేశాలలో భారతదేశాన్ని పునర్నిర్మించిన విశిష్ట రాజనీతిజ్ఞుడు పీవీకి తాము వినయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నామని ట్విటర్ ద్వారా తెలిపింది. On his birth anniversary, we remember the former PM of India, P.V. Narasimha Rao, who introduced some noteworthy liberal reforms to the Indian economy. Today, we pay a humble tribute to Mr. Rao, a distinguished statesman who reinvented India, both at home & abroad. pic.twitter.com/Cb0YPKbGjw — Congress (@INCIndia) June 28, 2023 అయితే, కాంగ్రెస్పై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్కు పీవీ నరసింహారావు ఇప్పుడు గుర్తొచ్చారా? అని బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వీయా ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ట్వీట్లు చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్ అవమానించిందని గుర్తుచేశారు. పీవీ మరణించిన సమయంలోనూ సోనియా గాంధీ ఆ గొప్ప వ్యక్తిని గౌరవించలేదని మండిపడ్డారు. మాజీ ప్రధాని భౌతిక కాయాన్ని డీల్లీ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో ఉంచేందుకు కూడా అనుమంతిచలేదనే విషయం మర్చిపోకూడదన్నారు. చదవండి: గవర్నర్పై మంత్రి హరీష్రావు సంచలన వ్యాఖ్యలు After disparaging former Prime Minister and Congress President PV Narasimha Rao for decades, Congress suddenly remembers him on his birth anniversary because Telangana elections are round the corner. Lets not forget that Sonia Gandhi denied him dignity even death. His mortal… pic.twitter.com/nCY93YjSRt — Amit Malviya (@amitmalviya) June 28, 2023 ‘పీవీ అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఢిల్లీలో స్థలం, స్మారక చిహ్నాన్ని ఇవ్వాలని అతని కుటుంబం కోరింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కు చెందిన పీవీ దేశ సరళీకరణ, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అయినప్పటికీ కాంగ్రెస్ అతన్ని అవమానించింది. అతని వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలనూ విడిచిపెట్టలేదు. కానీ ఆయన మరణించిన 10 సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వంలో మాజీ ప్రధాని పీవీకి ఢిల్లీలోని ‘రాష్ట్రీయ స్మృతి’లో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ కూడా తన భారత్ జోడో యాత్రలో హైదరాబాద్లోని నరసింహారావు స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించడం సముచితమని భావించలేదు. ఎందుకంటే అతను ప్రయాణించిన మార్గంలో రాళ్లు విసిరారు.’ అని అమిత్ మాల్వీయా పేర్కొన్నారు. 'తెలంగాణ ఠీవి... మన పీవీ' ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో విధానపరమైన సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన, ఇనుమడింపజేసిన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి! pic.twitter.com/PSNXFdKZAM — Telangana CMO (@TelanganaCMO) June 28, 2023 కాగా, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా పీవీ నరసింహారావు నిలిచారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానమంత్రి పదవిలో ఐదేళ్లపాటు దిగ్విజయంగా కొనసాగారు. బహుభాషా కోవిదుడుగా ప్రసిద్ధిగాంచారు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటుబడ్డ భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనుడు. -
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!
దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్మైదానంలో శనివారం సాయంత్రం 5గంటలకు ఈ సభ జరగనుంది. (చదవండి: గ్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు! ) ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ని ఆహ్వానించారు. అయితే తన 40వ పుట్టినరోజు (మే 20) కూడా ఇదే రోజు కావడంతో.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగానే శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కావడం లేదని ఆయన టీమ్ మీడియాకు తెలియజేసింది. ఆహ్వాన సమయంలోనే ఆర్గనైజింగ్ కమిటీకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. -
సినీ దిగ్గజాల సమక్షంలో దాసరి ఫిల్మ్ అవార్డ్స్
దివంగత దర్శకరత్నం డాక్టర్ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో దాసరి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ పలువురు సినీ దిగ్గజాల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, ముత్యాల సుబ్బయ్య, వి.వి.వినాయక్, సి.కల్యాణ్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, అలి, టి ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెం రెడ్డి, డా: రఘునాధ్ బాబు.(దాసరి గారి అల్లుడు) రైటర్ రాజేంద్ర కుమార్, తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో... ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, హీరో శ్రీకాంత్, డాక్టర్ బ్రహ్మానందం, బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి, వంశీ రామరాజు, కళా జనార్దన్. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్, దివాకర్. పబ్లిసిటీ డిజైనర్ రాంబాబు, వి.ఎఫ్.ఎక్స్ చందు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ, కవిరత్న చింతల శ్రీనివాస్ తదితరులు దాసరి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ - వాసవి ఫిల్మ్ అవార్డ్స్ వ్యవస్థాపకులు కొత్త వెంకటేశ్వరరావు, మడిపడిగె రాజు, ముఖ్య సలహాదారులు బండారు సుబ్బారావు. పబ్బతి వెంకట రవి కుమార్ సారథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణలో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులకు కూడా ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. (చదవండి: జేడీ చక్రవర్తి కి అంతర్జాతీయ అవార్డు) అలీ మాట్లాడుతూ "ఉత్తమ హీరోకి తన వంతుగా 50,000 పారితోషకం ఇస్తాను" అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ "దాసరి గారి పేరు మీద జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఉంటాను" అన్నారు. వి వి వినాయక్ మాట్లాడుతూ "రామ సత్యనారాయణ దాసరి గారి మీద ఉండే అభిమానంతో ప్రతి ఏటా ఇలా చేయటం అభినందనీయం" అన్నారు. సి కళ్యాణ్ మాట్లాడుతూ "మా తమ్ముడు రామ సత్యనారాయణ దాసరి గారిని గుర్తుంచుకుని ప్రతిభావంతులకి అవార్డ్స్ ఇవ్వటం చాలా ఆనందకరం" అన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్
వెండితెరపై సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేసిన కృష్ణ నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ సినిమా కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. చదవండి: ట్యాక్సీ డ్రైవర్గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్ ఇప్పుడీ చిత్రం రీరిలీజ్కు సిద్ధమైంది. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా 4k టెక్నాలజీతో సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆది శేషగిరిరావు ప్రెస్మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ మోసగాళ్లకు మోసగాడు. మా బ్యానర్లో ఎన్ని సినిమాలు వవచ్చినా ఈ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి బర్త్డేకి నివాళిగా, అభిమానుల కోరిక మేరకు సినిమాను రీరిలీజ్ చేస్తున్నాం. బర్త్డే రోజున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు(సోమవారం)అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయ్యి 48 సంవత్సరాలు కావడంతో ఈరోజున ప్రెస్మీట్ పెట్టాము. కృష్ణ గారి మెమోరియల్గా మ్యూజియం కట్టడానికి ఇక్కడ ప్రభుత్వం స్థలం కేటాయిస్తామన్నారు. అయితే ఇక్కడే ఉన్న మా సొంత స్థలంలో పనులు చేయిస్తున్నాము'' అని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ ఖుష్ అయిన డైరెక్టర్ -
Vijayawada: ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ (ఫొటోలు)
-
Rajinikanth : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ.. విజయవాడలో రజనీ కాంత్ (ఫొటోలు)
-
జగ్జీవన్ రామ్ జయంతికి సీఎం జగన్ నివాళి
సాక్షి, గుంటూరు: నేడు స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. హాజరైన మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, అధికారులు pic.twitter.com/IEMfIuzX3e — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 5, 2023 -
పొట్టి శ్రీరాములు జయంతి.. నివాళులు అర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి పాల్గొన్నారు. -
పునీత్ జయంతి రోజునే ఉపేంద్ర సుదీప్ల కబ్జా రిలీజ్
తమిళసినిమా: కేజీఎఫ్ పార్టు–1, పార్టు–2, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోమా వంటి కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి భారతీయ సినిమానే తమ వైపు తిప్పుకున్నాయి. తాజాగా అదే బాణీలో రూపొందిన కన్నడ చిత్రం కబ్జా. బహు భాషా నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటించిన ఇందులో నటి శ్రియ కథానాయకిగా నటించారు. మురళి శర్మ, సుధ ముఖ్యపాత్రలు పోషించారు. శిద్దేశ్వరా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రశేఖర్ నిర్మించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 7 భాషల్లో కన్నడ చిత్ర పరిశ్రమ అప్పు అని అభిమానంతో పిలుచుకునే పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలకు సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం కబ్జా అని తెలిపారు. 1947 ప్రాంతంలో ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేధింపులకు గురవుతాడన్నారు. ఆయన కుమారుడు గ్యాంగ్స్టర్ ముఠాలో చిక్కుకుంటాడని ఆ తర్వాత జరిగే కథే ఈ కబ్జా చిత్రం అని చెప్పారు. -
Vemana: లోకకవి మన వేమన!
వానకు తడవని వారూ, ఒక్క వేమన పద్యం కూడా వినని తెలుగువారూ ఉండరని లోకోక్తి. అలతి పదాలతో సమాజంలోని రుగ్మతలను తూర్పార బట్టిన మనో వైజ్ఞానికుడు వేమన. సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంఘసంస్కర్త, విప్లవకారుడు వేమన. 1839లో తొలిసారిగా బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనేకమంది ఆయనపై పరిశోధన చేశారు. ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు కేంద్ర సాహిత్య అకాడమీ వారి సహకారంతో వేమన జీవిత చరిత్రను 14 భాషలలోకి అనువదించడానికి కారకులయ్యారు. ఆంగ్ల, ఐరోపా భాషల్లోకీ; అన్ని ద్రవిడ భాషల్లోకీ వేమన పద్యాలు అనువాదమయ్యాయి. సి.ఇ. గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమన సాహిత్యానికి ముగ్ధులై ఆయనను లోక కవిగా కీర్తించారు. వేమన 1602–1730 మధ్య కాలానికి చెందిన వాడనీ కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వాడనీ అంటారు. జనబాహుళ్యంలో ఉన్న వివరాల ప్రకారం, వేమన అసలు పేరు బెధమ కోమటి చినవేమారెడ్డి. ఈయన అన్న పేరు బెధమ కోమటి పెదవేమారెడ్డి. వేమన జన్మించిన ప్రాంతంపై అనేక రకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ చివ రిగా ఆయన అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న కటారు పల్లె ప్రాంతానికి చెందిన వారని నిర్ధారించారు. అందుకే ఆ ప్రాంతంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలను జరపడానికి నిర్ణయించుకుంది. వేమన భోగలాలసుడుగా తిరుగుతూ ఒకానొక దశకు వచ్చేటప్పటికి ఓ సాధువు ద్వారా ఆత్మ జ్ఞానం పొంది అన్నింటినీ త్యజించి యోగిలా మారిపోయాడని అంటారు. సంసార బాధలనుండి ఉపశమనం పొందడానికి తనను ఆశ్రయించే అభాగ్యులకు తన పద్యాల ద్వారా తత్వాన్ని బోధించడం మొదలు పెట్టాడు. తన మాటల ద్వారా తనలో జ్ఞానజ్యోతిని మొట్ట మొదటగా వెలిగించిన తన ప్రేయసి విశ్వద పేరును, తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన మిత్రుడు అభిరాముడి పేరును తన పద్యాలకు మకుటంలో చేర్చి వారికి శాశ్వత కీర్తిని ప్రసాదించాడు వేమన అనేది కొందరి అభిప్రాయం. అయితే అసలు ఇవన్నీ కూడా ప్రక్షిప్తాలనీ... వేమన చిన్న నాటి నుంచే జ్ఞానశీలి అనీ, తదనంతరం స్నేహితుల ప్రభావంవల్ల దారితప్పి, ఆపై పరివర్తన వచ్చి యోగిగా మారాడనీ అంటారు. ఆయన పద్యమకుటానికి ‘సృష్టి కర్తకు ప్రియమైన వేమా వినుము’ అని పండితులు మరో అర్థాన్ని చెప్పారు. బ్రౌన్ ఈ అర్థాన్నే తీసుకొని వేమన పద్యాలను ఇంగ్లిష్లోకి అనువదించారు. వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక రీతులు, సామాజిక చైతన్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కవిత్వంలో స్పృశించని అంశమే లేదు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు; మతం పేరిట జరుగుతున్న అరాచకాలు, దోపిడీలు, విగ్రహారాధనలోని మౌఢ్యం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు... ఒకటే మిటి? కనిపించిన ప్రతి సామాజిక రుగ్మత మీద వేమన తనకలం ఝుళిపించాడు. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకునేట్లు వారికి పరిచితమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా శక్తిమంతంగా వ్యక్తీకరించారు. వేమన పద్యా లన్నీ ఆటవెలది చందస్సులోనే చెప్పాడు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గుర జాడ అంటాడు శ్రీశ్రీ. ‘వేమన కవిత్వం గాయానికి మందు రాసినట్లు కాక, ఆ గాయం చేసిన కత్తికే ముందు మందు పూసినట్లుంటుంది’ అంటారు రాళ్ల పల్లి అనంత కృష్ణ శర్మ. తన పద్యాలలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎలిగెత్తి చాటిన సామ్యవాద ప్రజా కవి వేమన. (క్లిక్ చేయండి: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట) - పి. విజయబాబు అధికార భాషా సంఘం అధ్యక్షులు, ఏపీ (జనవరి 19 వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా) -
యోగి వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: యోగి వేమన జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కాగా, యోగి వేమన జయంతిని ప్రతి ఏటా జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల జీవో కూడా జారీ చేసింది. చదవండి: (ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న) -
Vemana: ఆటవెలది ఈటెగా విసిరిన దిట్ట.. ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట
‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంత ప్రఖ్యాతి గాంచిన మహాకవి యోగి వేమనకు సొంత రాష్ట్రంలో తగిన గౌరవం దక్కటం లేదనే భావన ఇక తొలగిపోనుంది. యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరి 19న అధికారికంగా జరపనుంది. ఈ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 164 జీవోను గత నెల 30న విడుదల చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల వేమన అభిమానులు ఆనందించే విషయమిది. – గుంటూరు డెస్క్ తెలుగువారికి ఎంతో సారస్వత సేవ చేసిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్తోనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయేలా పద్యాలు చెప్పి, మెప్పించిన కవి వేమన. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంత విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన. యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరకు కడప దగ్గరి పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు సమాధి చెందారు. కదిరి తాలూకాలోని కటారుపల్లెలోని వేమన సమాధి ప్రసిద్ధి చెందినది. వేమన జీవితకాలం 1652–1730గా పరిశోధకులు పేర్కొన్నారు. సామాజిక చైతన్య గీతాలు ఆ పద్యాలు... వేమన పద్యాలు లోక నీతులు. పద్యాలన్నిటినీ ఆటవెలది చంధస్సులోనే చెప్పాడు. సామాజిక చైతన్యం ఆ పద్యాల లక్షణం. సమాజంలో ఆయన సృజించని అంశం లేదు. అన్ని సమస్యలను భిన్న కోణాల్లోంచి దర్శించి, ఆ దర్శన వైశిష్ట్యాన్ని తన పద్యాలలో ప్రదర్శించారు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట దోపిడీలను ఎలుగెత్తటమే కాకుండా విగ్రహారాధనను నిరసించారు. కుహనా గురువులు, దొంగ సన్యాసుల దోపిడీలు...ఒకటేమిటి? ప్రతి సామాజిక అస్తవ్యస్తతపైన తన కలాన్ని ఝళిపించారాయన. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోనూ నీతిని ప్రతిపాదించి మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపాడు. ‘అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను/సజ్జనుండు పలుకు చల్లగాను/కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా/ విశ్వదాభిరామ వినుర వేమ’ అని చాటారు. మరో పద్యంలో ‘విద్యలేనివాడు విద్వాంసు చేరువ/నుండగానె పండింతుండు కాడు/కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు/ విశ్వదాభి రామ వినుర వేమ!’అన్నారు. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తర్వాత నీతిని చెప్పాడు. అందుకు ‘అనగననగరాగ మతిశయించునుండు/తినగ తినగ వేము తియ్యనుండు/ సాధనమున పనులు సమకూరు ధరలోన/విశ్వదాభిరామ వినుర వేమ’ ఉదాహరణ. పద్యంలో నాలుగో పాదం ‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మకుటం. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము–అని ఈ మకుటానికి అర్థం చెప్పారు పండితులు. బ్రౌను మహాశయుడు ఇదే అర్థంతో వేమన పద్యాలను ఇంగ్లిష్లోకి అనువదించారు. వేమన కీర్తిని అజరామరం చేశారు... తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయటానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాల ఏర్పాటును సాధించారు. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. ఆరుద్ర ‘మన వేమన’ పుస్తకాన్ని రచించారు. డాక్టర్ ఎన్.గోపి, బంగోరె వంటి కవులు, రచయితలు వేమన రచనలపై పరిశోధనలు చేశారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావుచే కేంద్ర సాహిత్య అకాడమీ వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేసింది. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషల్లోకి వేమన పద్యాలు అనువాదమయ్యాయి. వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికీ లభించలేదు. ఐక్యరాజ్యసమితి–యునెస్కో విభాగం, ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని, ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన జీవిచరిత్ర, యోగి వేమన (1947), యోగి వేమన (1988), శ్రీవేమన చరిత్ర (1986) పేర్లతో సినిమాలుగా ప్రజలను ఆలరించాయి. పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన ‘యోగి వేమన’ సీరియల్ టీవీ ఛానల్లో ప్రసారమైంది. ఇంతటి కీర్తిని పొందిన వేమన జయంతికి పొరుగునున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా తగిన నిధులను కేటాయిస్తూ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. మైసూర్ మహారాజ సంస్థాన్ ఏనాడో వేమన ప్రాశస్త్యాన్ని గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వేమనకు, ఆయన సాహిత్యానికి తగిన ప్రచారం, గౌరవాన్ని కల్పించటం లేదనేది నిష్ఠురసత్యం. దీనిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై 1929 నుంచి వేమన జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెనాలి సమీపంలోని మోదుకూరు గ్రామంలోని వేమన జయంతి ఉత్సవ కమిటీ హర్షం తెలియజేసింది. నాడే సాహసోపేత హేతువాది... ఆ కాలం పరిస్థితుల ప్రకారం వేమనను గొప్ప హేతువాదిగా ప్రశసించింది సాహితీలోకం. సమాజంలో ప్రబలంగా పాతుకుపోయిన ఆచారాలు, మూఢనమ్మకాలను ఆ రోజుల్లో అంత నిశితంగా ఎత్తిచూపటానికి ఎంతటి ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి. విగ్రహారాధనను విమర్శిస్తూ...‘పలుగు రాళ్లు దెచ్చి/ పరగ గుడులు కట్టి/ చెలగి శిలల సేవ జేయనేల?/ శిలల సేవ జేయ ఫలమేమి కలుగురా?’అని ప్రశ్నించారు. కుల విచక్షణలోని డొల్లతనం గురించి... ‘మాలవానినంటి/ మరి నీట మునిగితే/ కాటికేగునపుడు కాల్చు మాల/ అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?...’ అనడిగారు. వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాలేదు. కేవలం సామాన్యుల నాల్కలపైనే నడయాడుతూ వచ్చాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకుల భావన. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్లు వేమన పద్యాలెన్నింటినో సేకరించారు. తాను వేమనను కనుగొన్నాని బ్రౌన్ సాధికారికంగా ప్రకటించుకొన్నారు. వందలాది పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించారు. అలాగే హెన్నీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1920), జీయూ పోప్, సీఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు, వేమనను లోకకవిగా కీర్తించారు. మహాకవి పేరిట విశ్వవిద్యాలయం.. ఆ మహాకవి పేరిట దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని నిర్మించి అనేక కోర్సులతో విద్యను అందించడంతోపాటు వేమన జీవితం మరుగున పడకుండా భావితరాలకు అందించడం గమనార్హం. -
‘ఆయన రచనలు చదవడంతో.. వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది’
‘ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న వివేకానంద అనే ఆ మహ నీయుని చిత్తరువు ఎప్పటికీ చెరిగిపోదు’ అన్నారు ఓ రష్యన్ చింతనాశీలి. జీవితంలో సమస్యలనేవి ప్రతీ వ్యక్తికీ ఉండేవే. ఆ వ్యక్తి విద్యార్థి కావచ్చు, కార్మికుడు కావచ్చు, రైతు కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, గృహిణి కావచ్చు, మరెవరైనా కావచ్చు. సమస్యలనేవి సర్వసాధారణమైతే, సమ స్యను అవగాహన చేసుకొనే ప్రయత్నం చేయడానికి కావలసిన సామర్థ్యం పెంచుకుంటే సమస్యలు పరిష్కరించడం పెద్ద విశేషం కాదని వివేకానందుడు అన్న మాటలు సదా స్మరణీయం. ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి చెప్పిన వాక్యాలు విన్నా ఆలోచింపజేస్తాయి. కాని స్వామి వివేకానందుడు చెప్పిన అమృత వాక్యాలు మాత్రం యువతను ప్రేరేపించి, ఆచరింపజేస్తున్నాయి. ఇద్దరు వ్యక్తుల ఆదర్శాలు ఒకేలా ఉండకపోవచ్చు. కాని ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యక్తి ఆదర్శాన్ని స్వీకరించి గొప్ప నేతలుగా ఎదగవచ్చనేది మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్లు నిరూపించారు. ఆ ఒక్క వ్యక్తి వివేకానందుడే నని వేరే చెప్పనవసరం లేదు. గాంధీజీ, బోస్బాబులు విభిన్న వ్యక్తిత్వాలు, భిన్న ఆదర్శాలు కలిగి ఉన్నవారని చరిత్రకారుల వాదనల సారాంశం. ‘నేను స్వామి వివేకానందుడి రచనలు చదవడం ద్వారా నాలో వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది’ అని గాంధీజీ అంటే... సుభాష్ చంద్రబోస్ ‘స్వామి వివేకానందుని రచనలు చదువుతుంటే నా ఒంట్లో రక్తం ఉప్పొంగుతుంది కదా! ఆయనను విన్నవారు ఇంక ఎంత అనుభూతిని పొంది ఉంటారో? ఆయన బ్రతికి ఉన్నట్లయితే పాదాల చెంత కూర్చొని ఆయన ఏమి చెబితే అది చేసేవాణ్ణి’ అన్నారు. ఈ మహానేతలు వివేకానందుని మాటలకు ఎంతగా ప్రభావితులు అయ్యారో ఈ మాటలే తెలియజేస్తాయి. ఇవ్వాళ దేశానికి కావలసింది ఇలాంటి ప్రభావ వంతమైన స్ఫూర్తి ప్రదాతలే. విద్య పట్ల వివేకానందుని అభిప్రాయాలు అత్యున్నతమైనవి. విద్యా వ్యవస్థను ఆయన భావాలకు అనుగుణంగా రూపొందించగలిగితే కాబోయే భారత పౌరులందరూ జాతి రత్నాలుగానే భాసిస్తారు. అప్పుడు తాము పుట్టిన ఊరినే కాదు, దేశాన్నీ, ప్రపంచాన్నీ ఉద్దరించగల మహానుభావులు ప్రపంచానికి అందుతారు. (క్లిక్ చేయండి: ఆదివాసుల హృదయ దీపాలు) – డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనవరి 12 వివేకానందుని జయంతి, జాతీయ యువజన దినోత్సవం)